title
stringlengths
1
90
url
stringlengths
31
120
text
stringlengths
0
504k
మొదటి పేజీ
https://te.wikipedia.org/wiki/మొదటి_పేజీ
వికీపీడియాకు స్వాగతం! వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు. ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.ఖాతా వలన లాభాలు లాగిన్ పేజీ ఎలా తోడ్పడవచ్చు?ప్రయోగశాల సహాయ కేంద్రం రోజుకొక చిట్కా పరిచయం • అన్వేషణ • కూర్చడం • ప్రశ్నలు • సహాయము • తెలుగు టైపుచేయుట|style="font-size:95%; padding:10px 0; margin:0px; text-align: right; white-space:nowrap; color:#000;"| విహరణ • విశేష వ్యాసాలు •''' అ–ఱ సూచీ మార్గదర్శి __NOTOC__ __NOEDITSECTION__ వర్గం:వికీపీడియా
HomePage
https://te.wikipedia.org/wiki/HomePage
దారిమార్పు మొదటి పేజీ
గుంటూరు జిల్లా
https://te.wikipedia.org/wiki/గుంటూరు_జిల్లా
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం గుంటూరు. రాష్ట్ర రాజధాని అమరావతి. విద్యా కేంద్రంగా అనాది నుండి పేరు పొందింది. పొగాకు, మిరప జిల్లా ప్రధాన వ్యవసాయ ఎగుమతులు. 2022 లో జిల్లాల మార్పులలో భాగంగా, ఈ జిల్లాలోని భూభాగాలను కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లాలలో కలిపారు. 2022 లో విభజన పూర్వపు జిల్లా చరిత్ర thumb|అమరావతి స్థూపం|alt= thumb|అమరావతి ధ్యాన బుద్ధ విగ్రహం గుంటూరు ప్రాంతంలో పాతరాతి యుగం నాటినుండి మానవుడు నివసించాడనుటకు ఆధారాలు ఉన్నాయి. రాతియుగపు (పేలియోలిథిక్) పనిముట్లు గుంటూరు జిల్లాలో దొరికాయి. వేంగీ చాళుక్య రాజు అమ్మరాజ (922-929) శాసనాలలో గుంటూరును గురించిన ప్రథమ ప్రస్తావన ఉంది. 1147, 1158 రెండు శాసనాలలో గుంటూరు ప్రసక్తి ఉంది. బౌద్ధం ప్రారంభం నుండి విద్యా సంబంధ విషయాలలో గుంటూరు అగ్రశ్రేణిలో ఉంటూ వచ్చింది. బౌద్ధులు ప్రాచీన కాలంలోనే ధాన్యకటకం (ధరణికోట) వద్ద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. తారనాథుని ప్రకారం గౌతమ బుద్ధుడు మొదటి కాలచక్ర మండలాన్ని ధాన్యకటకంలో ఆవిష్కరించాడు. ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్త ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతం వాడు. సా.శ..పూ 200 నాటికే ఈ ప్రాంతంలో అభ్రకం (మైకా) ను కనుగొనబడింది. ప్రతీపాలపుర రాజ్యం (సా.శ. పూ 5వ శతాబ్ది) – ఇప్పటి భట్టిప్రోలు – దక్షిణ భారతదేశంలో ప్రథమ రాజ్యంగా గుర్తింపు పొందింది. శాసన ఆధారాలను బట్టి కుబేర రాజు సా.శ.పూ. 230 ప్రాంతంలో భట్టిప్రోలును పరిపాలించాడని, ఆ తరువాత సాల రాజులు పాలించారని తెలుస్తుంది. వివిధ కాలాల్లో గుంటూరును పరిపాలించిన వంశాలలో ప్రముఖమైనవి: శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్రీకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, కుతుబ్ షాహీలు. గుంటూరు ప్రాచీనాంధ్రకాలంనాటి కమ్మనాడు, వెలనాడు, పలనాడులో ఒక ముఖ్యభాగం. కొందరు సామంత రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ సామంతుల మధ్య కుటుంబ కలహాలు, వారసత్వ పోరులు సర్వసాధారణంగా ఉండేవి. అటువంటి వారసత్వపోరే ప్రసిద్ధి గాంచిన పలనాటి యుద్ధం. జిల్లాలోని పలనాడు ప్రాంతంలో 1180 లలో జరిగిన ఈ యుద్ధం "ఆంధ్ర కురుక్షేత్రం"గా చరిత్ర లోను, సాహిత్యంలోను చిరస్థాయిగా నిలిచిపోయింది. 1687లో ఔరంగజేబు కుతుబ్‌ షాహి రాజ్యాన్ని ఆక్రమించినపుడు గుంటూరు కూడా మొగలు సామ్రాజ్యంలో భాగమైంది. సామ్రాజ్యపు రాజప్రతినిధి ఆసఫ్‌ ఝా 1724లో హైదరాబాదుకు నిజాంగా ప్రకటించుకొన్నాడు. ఉత్తర సర్కారులు అని పేరొందిన కోస్తా జిల్లాలను ఫ్రెంచి వారు 1750 లో ఆక్రమించుకొన్నారు. 1788లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏలుబడి లోనికి వచ్చి, గుంటూరు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైంది. 1794లో 14 తాలూకాలతో జిల్లా ఆవిర్భవించింది. ఆవి: దాచేపల్లి, ప్రత్తిపాడు, మార్టూరు, ఠుంఠురుకొర, మంగళగిరి, బాపట్ల, పొన్నూరు, రేపల్లె, తెనాలి, గుంటూరు, కూరపాడు, కొండవీడు, నరసరావుపేట, వినుకొండ. 1859లో జిల్లాను రాజమండ్రి, మచిలీపట్నం జిల్లాలతో విలీనం చేసి కృష్ణా గోదావరి జిల్లాగా నామకరణం చేసారు. 1904లో తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పలనాడు, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ తాలూకాలను వేరు చేసి మళ్ళీ జిల్లాను ఏర్పాటు చేసారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం లోను, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటు లోను జిల్లా ప్రముఖ పాత్ర వహించింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంలో భాగమైంది. మద్రాసు రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని వాదించాయి. ఫలితంగా 1953లో 11 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసినపుడు జిల్లా రూపురేఖలలో మళ్ళీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఒంగోలు తాలూకా మొత్తం, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ తాలూకాలలోని కొన్ని ప్రాంతాలను విడదీసి ప్రకాశం జిల్లాలో కలిపి ఏర్పాటు చేసారు. దీనితో జిల్లా వైశాల్యం 15032 చ. కి. మీ నుండి 11,347 చ. కి. మీకి తగ్గిపోయింది. 2002 లో కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాల కొరకు, జిల్లాను చీల్చడంతో జిల్లా విస్తీర్ణం 2,443 చ.కి.మీకు తగ్గింది. భౌగోళిక స్వరూపం తూర్పున ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, దక్షిణాన బాపట్ల జిల్లా, పశ్చిమాన బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, ఉత్తరాన పల్నాడు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. చాలవరకు సమతల ప్రదేశం. కొన్ని కొండలు కూడా ఉన్నాయి. కృష్ణా డెల్టా కొంతభాగం దీనిలో ఉంది. నేల నేలతీరులో రకాలు. నల్లరేగడి నేల: కృష్ణానది వడ్డునగల ప్రదేశాలు, సత్తెనపల్లి, మాచర్లకు ఉత్తరంగా ఉన్నాయి. సున్నపురాయి మెత్తగా మారి ఇవి ఏర్పడుతాయి. ఇసుక నేల: సముద్రపు వడ్డున గోండ్వానా రాళ్లుగల ప్రదేశాల్లో ఇవి ఉన్నాయి. కొన్ని చోట్ల కంకర (కాల్కేరియస్ నేలలు) ఉన్నాయి. ఉప్పు నేల: సముద్రపు అలలు తీరంలోకి వచ్చే చోట ఉన్నాయి. రేపల్లె, కొత్తపాలెం, సర్లగొండి, నిజామ్ పట్నంలో ఇవి చూడవచ్చు. నీటివసతి thumb|ఉమ్మడి గుంటూరు జిల్లా నదులు, కాలువలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణా నది, చంద్రవంక, తుంగభద్ర, నాగులేరు ప్రధాన నదులు. గుంటూరు ఛానల్, గుంటూరు శాఖా కాలువ, రొంపేరు, భట్టిప్రోలు, రేపల్లె కాలువలు, దుర్గి దగ్గర గుండ్లకమ్మ నది, రెంటచింతల దగ్గర గోలివాగు, గురజాల దగ్గర దండివాగు ఉన్నాయి. కృష్ణానది మాచర్ల పర్వతశ్రేణిలో గనికొండ దగ్గర, సముద్రమట్టం నుండి 182 మీటర్ల ఎత్తున గుంటూరు జిల్లా లోకి ప్రవేశిస్తుంది. పెద్ద లోయలోకి పారుతూ మాచర్లను తెలంగాణ లోని అచ్చంపేటను వేరుచేస్తుంది. కుడవైపు జర్రివాగు, ఎడమవైపున దిండి వాగుని కలుపుకొని పారుతుంది. చంద్రవంక కృష్ణాకి ఉపనది. తూర్పు నల్లమల కొండలలో పుట్టి ముతుకూరు గ్రామ ప్రక్కగా పారి, దాని ఉపనదియైన ఏడిబోగుల వాగుతో కలసి (ఆత్మకూరు ప్రాజెక్టు దగ్గర) ఈశాన్య దిశగా పయనించి మాచర్లను తాకి ఉత్తరంగా పారుతుంది. తుమృకోట రక్షిత అడవిలోకి పారేముందు, 21మీటర్ల ఎత్తునుండి క్రిందకు పారుతుంది. దీనినే ఎత్తిపోతల జలపాతం అంటారు. ఉత్తరదిశగా కొంత ప్రవహించి కృష్ణాలో కలుస్తుంది. నాగులేరు నది, వినుకొండ శ్రేణిలో నాయకురాలి పాస్ దగ్గర నల్లమల కొండలలో పుట్టి, కారెంపూడి ప్రక్కగా ప్రవహించి ఉత్తరదిశగా మాచర్ల పర్వతశ్రేణులలో 32 కి.మీ. పారి రామపురం దగ్గర కృష్ణాలో కలుస్తుంది. తూర్పు తీరంలో సాధారణంగా వుండే తీరులో కృష్ణా నది చాలా వరకు సమతలప్రాంతంలో ప్రవహించటంతో, వర్షాకాలంలో చాలా మట్టి మేట వేస్తుంది . దిగువ కృష్ణా, కృష్ణా, గుండ్లకమ్మ ఓగేరు, రొంపేరు, కాలువలు నేరుగా సముద్రంలోకలిసే ప్రాంతం జిల్లాలోని నీటిపారుదల విభాగాలు. ఖనిజసంపద వజ్రాలు: కొల్లూరు గ్రామం దగ్గర,కృష్ణానది ఒడ్డున వజ్రాలు కోసం తవ్వేవారు. ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రం ఇక్కడే వెలికితీసినట్లు చెపుతారు. వజ్రాల గనులు మాడుగుల, మల్లవరం, సారంగపాణి కొండలలో ఉన్నాయి. కంకర:సున్నపుతయారీలో వాడే కంకర చేబ్రోలు, మంగళగిరి, పెదకాకాని, వెంకటపాలెం,లో లభ్యమవుతుంది. వాతావరణం బంగాళ ఖాతంలో ఏర్పడే తుఫాన్లు, అల్పపీడనాలు, తూర్పుతీరం దాటితే అధిక వర్షం, బలమైన గాలులకు కారణమవుతాయి. డిసెంబరు నుండి ఫిబ్రవరి దాక: పొడి, చల్లని చలి కాలం. మార్చి నుండి మే: ఎండాకాలం జూన్ నుండి సెప్టెంబరు: నైరుతీ రుతుపవనాల వలన వానా కాలం. అక్టోబరు నుండి నవంబరు: తుపాన్ల వలన వానలు. వర్షపాతం ఉమ్మడి జిల్లా సగటు వర్షపాతం 830 మిమి. తూర్పు నుండి పడమరకు ఇది తగ్గుతుంది. నైరుతీ రుతుపవనాల వలన అవి తగ్గిపోయేటప్పుడు వర్షపాతం కలుగుతుంది. అక్టోబరులో వర్షాలు ఎక్కువ. సగటున 47 వర్షపు రోజులు. అత్యధికంగా 1879 నవంబరు 9 లో సత్తెనపల్లిలో 386 మిమి వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లా వార్షిక అత్యల్ప, అత్యధిక ఉప్ణోగ్రతలు 15 °C, 47 °C గా నమోదయ్యాయి. రెంటచింతల అత్యంత ఉప్ణోగ్రతకలప్రదేశం. 1948 మే 18 లో 49 °C నమోదయ్యింది. ఆర్ధిక స్థితి గతులు వ్యవసాయం ఉమ్మడి జిల్లాలో ప్రధాన పంటలు: ఆహార ధాన్యాలు:వరి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు: మినుములు, కందులు, వ్యాపార పంటలు: పత్తి, మిరప పసుపుమరియు పొగాకు తోటపంటలు: సపోటా, కొబ్బరి, అరటి, జీడిమామిడి, జామ, నిమ్మ, నారింజ, బొప్పాయి. ఉమ్మడి జిల్లాలో భారీ నీటి పారుదల ప్రాజెక్టులలో ప్రకాశం బేరేజి ( పాత కృష్ణా ఆయకట్టు) క్రింద 2,02,032 హెక్టేర్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రింద 2,54,583 హెక్టేర్లు, గుంటూరు బ్రాంచి కాలువ క్రింద 10,823 హెక్టేర్లు సాగవుతుంది. వ్యవసాయ మార్కెట్ యార్డులు గుంటూరు, తెనాలి, దుగ్గిరాల, పొన్నూరు, మంగళగిరి, తాడికొండ లలో ఉన్నాయి. పరిశ్రమలు పారిశ్రామిక వాడలు గుంటూరు, తెనాలి, పేరేచెర్ల, నౌలూరులలో, 4 ఆటోనగర్లు గుంటూరు,తెనాలి లలో, 2 దుకాణ సంకీర్ణాలు గుంటూరు, డోకిపర్రులలో కలవు . ప్రత్తి మిల్లులు,పాల పరిశ్రమలు, నార మిల్లులు, ఇతర చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. పరిపాలన విభాగాలు 2022లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత 7 అసెంబ్లీ నియోజక వర్గాలు, 2 రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు, 2 నగరపాలక సంస్థలు, 2 పురపాలక సంస్థలు,, 278 గ్రామపంచాయితీలు ఉన్నాయి; రెవెన్యూ విభాగాలు తెనాలి, గుంటూరు. మండలాలు గుంటూరు రెవెన్యూ డివిజను గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ తాడికొండ తుళ్ళూరు పెదకాకాని పెదనందిపాడు ప్రత్తిపాడు ఫిరంగిపురం మేడికొండూరు వట్టిచెరుకూరు తెనాలి రెవెన్యూ డివిజను కాకుమాను కొల్లిపర చేబ్రోలు తాడేపల్లి తెనాలి దుగ్గిరాల పొన్నూరు మంగళగిరి నగరాలు, పట్టణాలు నగరం: గుంటూరు, అమరావతి పట్టణాలు: పొన్నూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి నియోజకవర్గాలు లోక్‌సభ నియోజకవర్గాలు గుంటూరు శాసనసభ నియోజక వర్గాలు (7) గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం లోని విభాగం ఇమడ్చబడింది. రవాణా వ్వవస్థ గుంటూరు నుండి హైదరాబాదు, చెన్నైకు రహదారి, రైలు మార్గాలు ఉన్నాయి. 72 కిమీ జాతీయ రహదారి, 511 కి.మీ. రాష్ట్ర రహదారులు ఉన్నాయి. జనాభా లెక్కలు 2011 జనగణన ప్రకారం 21.90 లక్షల జనాభా కలిగివుంది విద్యాసంస్థలు గుంటూరు జిల్లాలో సాధారణ విద్యతో బాటు, వృత్తివిద్యకు సంబంధించి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పలు విద్యాసంస్థలున్నాయి. వైద్యకళాశాలలు: గుంటూరు వైద్య కళాశాల, కాటూరి వైద్య కళాశాల, ఎన్ఆర్ఐ వైద్యకళాశాల విశ్వవిద్యాలయాలు:ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, విజ్ఞాన్ విశ్వవిద్యాలయం, కెఎల్ విశ్వవిద్యాలయం. ఆకర్షణలు ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను 2019లో 1,05,68,262 పర్యాటకులు దర్శించారు. అనంతపద్మనాభస్వామికి అంకితమివ్వబడిన గుహలు గల ఉండవల్లి గుహలు, పానకాలస్వామి అని పేరుగాంచిన లక్ష్మీనరసింహస్వామి దేవాలయంగల మంగళగిరి మూలాలు వెలుపలి లంకెలు వర్గం:గుంటూరు జిల్లా వర్గం:కోస్తా వర్గం:ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:భారతదేశం లోని జిల్లాలు
ఆంధ్రప్రదేశ్
https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది. రాష్ట్రానికి వాయవ్యంగా తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఈశాన్యంలో ఒడిషా, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. కేంద్రపాలితప్రాంత భూభాగం పుదుచ్చేరికి చెందిన యానాం రాష్ట్రం హద్దులలో ఉంది. విస్తీర్ణంతో ఇది ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రం. భారతదేశంలో గుజరాత్ తరువాత తో రెండవ పొడవైన తీరప్రాంతం కలిగివుంది. కోహినూర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలు రాష్ట్రంలోని కోళ్లూరు గనిలో లభించాయి. భారతదేశ ప్రాచీన భాషలలో ఒకటైన తెలుగు దీని అధికార భాష. తిరుమల వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి. పంచారామ క్షేత్రాలు, శ్రీశైల క్షేత్రం, కోదండ రామాలయం వంటి అనేక పుణ్యక్షేత్రాలు, అమరావతి స్తూపంతో పాటు ఇంకా పలు ప్రదేశాలలో బౌద్ధ చైత్యాలు, స్తూపాలు, విశాఖపట్నం సముద్ర తీరం, అరకు లోయ, హార్స్‌లీ కొండలు, కోనసీమ డెల్టా లాంటి సహజ ఆకర్షణలు ఉన్నాయి. పేరు వ్యుత్పత్తి సామాన్య శక పూర్వం (సా.శ.పూ.) 8 వ శతాబ్దపు ఋగ్వేద కృతి ఐతరేయ బ్రాహ్మణ లో ఆంధ్రస్ అనే వ్యక్తుల సమూహం ప్రస్తావించబడింది. ఆంధ్రులు ఉత్తర భారతదేశంలో యమునా నది ఒడ్డున నుండి దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలోని ప్రజలు విశ్వామిత్ర సంతతి వారని, అస్సాక జనపదం (సా.శ.పూ. 700-300) ఆగ్నేయ భారతదేశంలోని గోదావరి, కృష్ణ నదుల మధ్య ఉన్న ఆంధ్రుల పురాతన రాజ్యమని రామాయణ, మహాభారత పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆంధ్రదేశానికి, భారతదేశానికి తొలి రాజులైన ఆంధ్రులు అని పిలవబడిన శాతవాహనులను ఆంధ్ర, ఆంధ్ర జాతీయ, ఆంధ్రభృత్య పురాణాలలో అనటం వలన కూడా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని తెలుస్తుంది. వారు వారి నాణేలు లేదా శాసనాలలో ఆంధ్రులమని చెప్పుకోలేదు. వారి జాతి కారణంగా లేదా వారి భూభాగం ఆంధ్ర ప్రాంతాన్ని కలిగి ఉన్నందున వారిని ఆంధ్రులు అని పిలిచిన అవకాశం ఉంది. చరిత్ర భారత స్వాతంత్ర్య పూర్వకాలపు చరిత్ర alt=|thumb| తెలుగు తల్లి thumb| చంద్రగిరి కోట రాజ్‌మహల్ అస్సాకా మహాజనపదం పదహారు వేల మహాజనపదాలలో ఒకటి. దీనిలో ప్రస్తుత ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణలు ఉన్నాయి. సా.శ.పూ. 5వ శతాబ్దంలో ప్రతీపాలపురం రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని భట్టిప్రోలు స్తూపం త్రవ్వకాలలో ఆధారాలు లభించాయి. అమరావతి, ధాన్యకటకం, వడ్డమాను వంటి ప్రదేశాల పురావస్తు ఆధారాలు ఆంధ్ర ప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో భాగమని సూచిస్తున్నాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకాన్ని సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. అశోక చక్రవర్తి మరణం (సా.శ.పూ. 232) తరువాత, మౌర్య పాలన సా.శ.పూ. 200 ప్రాంతంలో బలహీనపడింది. ఆంధ్ర ప్రాంతంలో అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. శాతవాహనులు సా.శ.పూ. 3 వ శతాబ్దం నుండి సామాన్య శకం (సా.శ.) 2 వ శతాబ్దం వరకు దక్కన్ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించారు. శాతవాహనులు ధరణికోటని తమ రాజధానిగా చేసుకున్నారు. వారు సామ్రాజ్యాన్ని మరాఠా దేశం హద్దులు దాటి విస్తరించారు. బౌద్ధ గ్రంథాల ప్రకారం మహాయాన తత్వవేత్త నాగార్జున సా.శ. 2-3 వ శతాబ్దాలలో నివసించాడు. తరువాత ఆంధ్ర ఇక్ష్వాకులు, విజయపురి రాజధానిగా, సా.శ. 2 వ శతాబ్దం చివరి అర్ధ భాగంలో కృష్ణా నది లోయలో పాలించారు. మొదట శాతవాహన రాజుల క్రింద కార్యనిర్వాహక అధికారులుగా ఉన్న పల్లవులు, సా.శ. 2 వ శతాబ్దానికి ముందు గుర్తించబడిన రాజకీయ శక్తి కాదు. సా.శ. 7 వ శతాబ్దం మొదటి త్రైమాసికంలో రెండవ పులకేశి నేతృత్వంలోని పశ్చిమ చాళుక్యుల దండయాత్రలో ఓడిపోయారు. సాలంకాయనులు ఆంధ్ర ప్రాంతాన్ని సా.శ. 300 నుండి సా.శ. 440 వరకు వేంగి రాజధానిగా పరిపాలించారు. ఇక్ష్వాకుల పతనం తరువాత, విష్ణుకుండినులు సా.శ. 5, 6 వ శతాబ్దాలలో మొట్టమొదటి గొప్ప రాజవంశంగా కళింగ, తెలంగాణలోని కొన్ని భాగాలతో సహా మొత్తం ఆంధ్రదేశంపై పట్టు సాధించారు. వారు ఏలూరు, అమరావతి, పురానిసంగం కేంద్రాలుగా ముఖ్యమైన పాత్ర పోషించారు. సా.శ 5వ శతాబ్దంలో రేనాటి చోళులు పాలించారు. తెలుగు భాష మూలాలు గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు, ఇతరచోట్ల దొరికిన నాటి శాసనాలలో కనబడతాయి. వెంగీ (తూర్పు చాళుక్యులు) రాజవంశం సా.శ. 7 వ శతాబ్దం నుండి సా.శ. 1130 వరకు ఐదువందల సంవత్సరాలు కొనసాగింది. చివరికి చోళ రాజవంశంలో విలీనం అయ్యింది. వారు 1189 వరకు చోళ రాజవంశం రక్షణలో పాలన కొనసాగించారు. చివరిగా వారి రాజ్యం హొయసలు, యాదవులకు లొంగిపోయింది. కాకతీయులు సా.శ 12- 14 శతాబ్దాలలో ఈ ప్రాంతాలను పరిపాలించారు. వీరు అనేక కోటలను నిర్మించారు. వీరి తరువాత ముసునూరి నాయకులు పాలించారు. తెలుగు ప్రాంతాలలో ఢిల్లీ సుల్తాను పాలనను పడగొట్టడానికి ముసునూరి నాయకులు, ప్రాంతంలోని నాయకుల సమాఖ్యకు నాయకత్వం వహించారు. 14 వ శతాబ్దం ప్రారంభంలో ప్రోలయ వేమారెడ్డి చేత రెడ్డి రాజ్యం (సా.శ.1325–సా.శ.1448) స్థాపించబడింది. వీరు నేటి కొండవీడు నుండి పాలించారు. ఢిల్లీ సుల్తానుల ముస్లిం సైన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించిన రాష్ట్రాల సమాఖ్యలో భాగంగా ప్రోలయ వేమారెడ్డి కొండవీడు కోటను నిర్మించాడు. ఈ ప్రాంతం ఒరిస్సా గజపతుల స్వాధీనం లోకి పోయి, 1458 లో బహమనీ రాజ్యపు ముస్లిం పాలకులచే ధ్వంసం చేయబడింది. విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలు సా.శ.1516 లో దీనిని స్వాధీనం చేసుకున్నాడు. గోల్కొండ సుల్తాన్లు 1531, 1536, 1579 లలో కోట పై దాడి చేశారు. సుల్తాన్ కులీ కుతుబ్ షా 1579 లో దీనిని స్వాధీనం చేసుకుని, ముర్తుజానగర్ అని పేరు పెట్టాడు. తరువాత విజయనగర రాజులు మరల స్వాధీనం చేసుకున్నారు. విజయనగర సామ్రాజ్యం కన్నడ, తెలుగు, తమిళం, సంస్కృతాలలో లలిత కళలు, సాహిత్యాన్ని ప్రోత్సహించింది. ఈ కాలంలోనే కర్ణాటక సంగీతం ఆధునిక రూపంలోకి అభివృద్ధి చెందింది.Historians such as P. B. Desai (History of Vijayanagar Empire, 1936), Henry Heras (The Aravidu Dynasty of Vijayanagara, 1927), B. A. Saletore (Social and Political Life in the Vijayanagara Empire, 1930), G.S. Gai (Archaeological Survey of India), William Coelho (The Hoysala Vamsa, 1955) and Kamath (Kamath 2001, pp. 157–160) విజయనగర సామ్రాజ్య కాలంలో, పెమ్మసాని నాయకులు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను పాలించారు. వారు పెద్ద కిరాయి సైన్యాలను కలిగి ఉన్నారు, ఇవి పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి రక్షణగా ఉన్నాయి. లేపాక్షిలో శివ, విష్ణు, వీరభద్ర ఆలయాల సమూహం సాంస్కృతికంగా, పురావస్తుపరంగా ముఖ్యమైనవి. వీటిలో విజయనగర రాజుల కుడ్య చిత్రాలు, ద్రావిడ కళ, శాసనాలు ఉన్నాయి. ఆలయ సముదాయం దగ్గర పెద్ద గ్రానైట్ నంది శిల్పం ఉంది. సా.శ. 1347లో, దక్షిణ భారతదేశంలో ఢిల్లీ సుల్తానుకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు ఫలితంగా అల్లావుద్దీన్ బహమన్ షా చేత బహమనీ సుల్తానేట్ స్వతంత్ర ముస్లిం రాజ్యంగా స్థాపించబడింది. సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ బహమనీ సుల్తాన్ కొలువులో పనిచేశాడు. గోల్కొండను జయించి అధిపతి అయ్యాడు. 1518లో బహమనీ సామ్రాజ్యము పతనమై ఐదు దక్కన్ సుల్తనేట్ ఆవిర్భవించుచున్న సమయములో బహమనీ సుల్తానుల నుండి స్వతంత్రము ప్రకటించుకొని, "కుతుబ్ షా" అనే పట్టము స్వీకరించి గోల్కొండ కుతుబ్ షాహీ వంశమును స్థాపించాడు. కుతుబ్ షాహీ వంశం పదహారవ శతాబ్దం ప్రారంభం నుండి పదిహేడవ శతాబ్దం చివరి వరకు సుమారు రెండు వందల సంవత్సరాలు పట్టు సాధించింది. సా.శ.1687లో మొగల్ రాజు ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించడంతో మొగలుల ప్రత్యక్షపాలన ప్రారంభమైంది. సా.శ.1724 లో మొగల్ రాజప్రతినిధి గావున్న నిజామ్ ఉల్ ముల్క్ అనే బిరుదు గల చిన్ కిలిచ్ ఖాన్ ను అసఫ జా బిరుదుతో దక్కన్ పాలకుడుగా వుండుటకు అప్పటి మొగల చక్రవర్తి మహమ్మద్ షా అనుమతించడంతో అసఫజాహీ వంశ పాలనప్రారంభమైంది. సా.శ. 1766 లో నిజాం ఆలీఖాన్ పాలనలో ఉత్తర సర్కార్లను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించగా, అవి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమయ్యాయి. తరువాత ఇతర తీరప్రాంతాలు కూడా కంపెనీ పాలనలో చేరాయి. సా.శ.1800 లో బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ సైన్యసహకారపద్ధతికి అంగీకరించి నిజాం ఆలీఖాన్ ఐదు భూభాగాలను (అప్పటి కర్నూలు, కడప, అనంతపూరు,చిత్తూరు, బళ్లారి భూభాగాలు) కంపెనీ వారికి అప్పగించాడు. స్థానిక స్వయంప్రతిపత్తికి బదులుగా బ్రిటిష్ పాలనను అంగీకరించి, నిజాం హైదరాబాద్ రాచరిక రాష్ట్రంగా అంతర్గత ప్రాంతాలపై నియంత్రణను సాధించాడు. 1947 లో భారతదేశం బ్రిటీషు పాలన నుండి స్వతంత్రమైంది. నిజాం హైదరాబాద్ రాచరిక రాష్ట్ర స్వాతంత్ర్యాన్ని నిలుపుకోవాలనుకున్నాడు, కాని ఆ ప్రాంత ప్రజలు భారతదేశంలో చేరడానికి ఉద్యమాన్ని ప్రారంభించారు. 1948 లో హైదరాబాద్ రాచరిక రాష్ట్రం, ఆపరేషన్ పోలోతో భారతదేశంలో విలీనం చేయబడింది. మతం బౌద్ధమతం చరిత్ర ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ కు వ్యాపించింది. దాదాపు వెయ్యి సంవత్సరాలు కృష్ణా నది లోయ అసాధారణమైన బౌద్ధ కార్యకలాపాల ప్రదేశంగా విరాజిల్లింది.Davidson, Ronald. Tibetan Renaissance. Columbia 2005, pp. 29. అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేటతో సహా దిగువ కృష్ణ లోయలోని పురాతన బౌద్ధ ప్రదేశాలు కనీసంగా సా.శ.పూ. మూడవ శతాబ్దానివని గుర్తించారు.Padma, Sree. Barber, Anthony W. Buddhism in the Krishna River Valley of Andhra. SUNY Press 2008, pg. 2. ఈశాన్య భారతదేశంలో మగధతో పాటు మహాయాన బౌద్ధమతం అభివృద్ధిలో ఈ ప్రాంతం ప్రధాన పాత్ర పోషించింది.Padma, Sree. Barber, Anthony W. Buddhism in the Krishna River Valley of Andhra. SUNY Press 2008, p.1Peter Harvey (2013), An Introduction to Buddhism: Teachings, History and Practices, Cambridge University Press, p.108 ఎ.కె.వార్డర్ "మహాయాన భారతదేశానికి దక్షిణాన చాలవరకు కచ్చితంగా ఆంధ్రదేశంలో ఉద్భవించింది" అని పేర్కొన్నాడు.Warder, A. K. Indian Buddhism. 2000. p. 313 జింగ్ "దక్షిణ భారతదేశంలోని మహాసంఘికలలో ప్రజ్ఞాపారమిత బహుశా ఆంధ్రదేశంలో, కృష్ణా నదిపై అభివృద్ధి చెందుండొచ్చని పలువురు పండితులు సూచించారు" అని పేర్కొన్నాడు.Guang Xing. The Concept of the Buddha: Its Evolution from Early Buddhism to the Trikaya Theory. 2004. pp. 65–66 ప్రజ్ఞాపారమిత సూత్రాలు తొలి మహాయాన సూత్రాలకు చెందినవి.Williams, Paul. Buddhist Thought. Routledge, 2000, pages 131.Williams, Paul. Mahayana Buddhism: The Doctrinal Foundations 2nd edition. Routledge, 2009, pg. 47. తరువాత బౌద్ధమతం ఆదరణ తగ్గి, హిందూమతం ఆదరణ పెరిగింది. ఈ ప్రాంతంలో హిందూమత ఆధ్యాత్మిక వేత్తలలో ఆది శంకరాచార్యులు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మొదలైనవారున్నారు. మతాన్ని నిరసించిన వారిలో వేమన ప్రముఖుడు. స్వాతంత్య్రానంతర చరిత్ర మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నంలో, పొట్టి శ్రీరాములు 1952 లో నిరాహార దీక్షచేసి మరణించాడు. ఫలితంగా మద్రాస్ రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు 1953 అక్టోబరు 1 న విడగొట్టబడి, కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఆంధ్రను, అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా 1956 నవంబరు 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. హైదరాబాద్‌ను కొత్త రాష్ట్రానికి రాజధానిగా చేశారు. హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలు బొంబాయి రాష్ట్రంతో, కన్నడ మాట్లాడే ప్రాంతాలు మైసూర్ రాష్ట్రంలో విలీనం అయ్యాయి. నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. 1960 వ సంవత్సరంలో పటాస్కర్ కమిషన్ తీర్పు మూలంగా చిత్తూరు జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువ భాగాన్ని తమిళనాడుకు ఇచ్చి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి.తరువాత, 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా, 1978 ఆగస్టు 12న రంగారెడ్డి జిల్లా, 1979 జూన్ 1న విజయనగరం జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాలయ్యాయి. 1982 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలే అవిభక్త ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించాయి. 1982 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నందమూరి తారక రామారావు 1982 లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, తొమ్మిది నెలలలోనే కాంగ్రెసును ఓడించి, రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టాడు. 1989 ఎన్నికలలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టటంతో, మరల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 1990 లో నేదురుమల్లి జనార్థనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, 1992 లో మళ్ళీ విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. 1994 లో ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ మరోసారి గెలిచింది. ఎన్‌.టి రామారావు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. అతని అల్లుడు నారా చంద్రబాబునాయుడు 1995 లో తన మామకు వ్యతిరేకంగా తెలుగుదేశంపార్టీలో అధికశాతం శాసనసభ సభ్యుల మద్దతు కూడగట్టటంతో అధికారంలోకి వచ్చాడు. 1999 లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించింది. ఆ విధంగా నాయుడు ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి (1995 - 2004)గా రికార్డును కలిగి ఉన్నాడు. రాష్ట్ర భౌగోళిక సమగ్రతపై ఉద్యమాలు, విభజన రాష్ట్రం ఏర్పడిన తరువాత అడపా దడపా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, దానికి పోటీగా సమైక్య ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. 2004 శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పోటీ చేసింది. కాంగ్రెసు, తెరాస కూటమి పదవిలోకి రావడంతో, కాంగ్రెసుకు చెందిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఐదేళ్ళ అనంతరం 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ, తెరాస, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి మహాకూటమి తరపున పోటీచేశాయి. చలన చిత్ర నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, భారతీయ జనతా పార్టీలు కూడా పోటీచేయడంతో బహుముఖ పోటీలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ గెలవటంతో వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరల ముఖ్యమంత్రి అయ్యాడు. 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖరరెడ్డి మరణించడంతో కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 నెలలు ఆయన పాలించిన తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. 2009 లో కె.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింపచేయడానికి కేంద్రప్రభుత్వం తెలంగాణా ఏర్పాటు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఉద్యమాలు మరింత బలం పుంజుకున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆమోదమైన లక్ష్యం కొరకు ప్రయత్నించినప్పటికి సత్ఫలితాలివ్వలేదు. 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. ప్రభుత్వ ఉద్యోగసంఘాల నాయకత్వంలో రెండు నెలలపైబడి సమైక్యాంధ్ర ఉద్యమం నడిచింది. 2013 అక్టోబరు 3న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటును ఆమోదించారు. తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కార వివరాలతో కేబినెట్ నోట్, బిల్లు తయారీ జరిగింది. ఆ తరువాత రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును శాసనసభ, శాసనమండలిలో సుదీర్ఘ చర్చలు పూర్తికాకముందే, ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానం పై మూజువాణీ వోటుతో సభలు అమోదముద్ర వేశాయి. 2014, ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంత వరకు తృప్తిపరచే విధంగా, ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, బిల్లుకు యథాతథంగా మూజువాణీ వోటుతో అమోదముద్ర పడింది. ఫలితంగా నల్లారి కిరణకుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేయటంతో ఎన్నికలు దగ్గరబడుతున్నందున, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి ఆసక్తి చూపనందున రాష్ట్రపతిపాలన విధించబడింది. హైదరాబాద్ పదేళ్లవరకు ఉమ్మడి రాజధానిగా ఉండే విధంగా 2014 జూన్ 2 న తెలంగాణ కొత్త రాష్ట్రంగా, సీమాంధ్ర ప్రాంతం అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినవి. హైదరాబాదు రాజధానిగా దాదాపు మూడు సంవత్సరాల వరకు కొనసాగింది. అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకుస్థాపన జరిగింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభించబడి పరిపాలన మొదలైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 చెల్లుబాటును ప్రశ్నించిన పిటిషన్లు అత్యున్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం ముందు 2014 ఏప్రిల్ నుండి తీర్పు కోసం వేచి ఉన్నాయి. భౌగోళిక స్థితి రాష్ట్రంలో తూర్పు కనుమలు నుండి బంగాళాఖాతం తీరం వరకు వైవిధ్యభరిత పర్యావరణ వ్యవస్థలు, వృక్షజాలం, జంతుజాలం ఉన్నాయి. కృష్ణ, గోదావరి అనే రెండు ప్రధాన నదులు రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర తీరం శ్రీకాకుళం జిల్లా నుండి నెల్లూరు జిల్లా వరకు విస్తరించి ఉంది. తూర్పు కనుమలకు తీరం మధ్య గల మైదానాలు చాలావరకు గోదావరి, కృష్ణ, పెన్నా నదులచే ఏర్పడిన డెల్టా ప్రాంతాలు. తూర్పు కనుమలు విడిపడి వుండడంతో ఈ విభాగాలకు స్థానిక పేర్లు ఉన్నాయి. ఇవి రాష్ట్ర భౌగోళికంలో ఒక ప్రధాన విభజన రేఖగా ఉన్నాయి. దీని రెండు వంపు శాఖలచే ఏర్పడిన కడప బేసిన్ ఖనిజ సంపన్న ప్రాంతం. కోస్తాంధ్రలో ఎర్రటి నేలలు ఉండే మెట్ట భూములు, నల్లరేగడి నేలలు ఉండే డెల్టా భూములలో లక్షల హెక్టార్ల భూమి సాగు చేయబడుతుంది. రాయలసీమలో ఎర్రటి నేలలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పాక్షిక శుష్క పరిస్థితులు ఉన్నాయి. సహజ వృక్షసంపద, వాటి పరిరక్షణ alt=|thumb| కాకినాడ సమీపంలో మడ అడవి రాష్ట్రంలోని మొత్తం అడవుల విస్తీర్ణం . రాష్ట్రంలోని అటవీప్రాంతాన్ని విస్తృతంగా నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు. దక్కన్ పీఠభూమి మధ్య పీఠభూమి తూర్పు ఎత్తైనభూములు తూర్పు తీర మైదానాలు తూర్పు కనుమల ప్రాంతం దట్టమైన ఉష్ణమండల అడవులకు నిలయంగా ఉంది. అయితే కొండప్రాంతాల నుండి దక్కన్ పీఠభూమివైపు వృక్షసంపద తక్కువగా, పొద వృక్షాలు ఎక్కువగా కనిపిస్తాయి. రాష్ట్రంలో లభించే వృక్షసంపద చాలావరకు పొడి ఆకురాల్చే రకాలైన టేకు, టెర్మినాలియా, డాల్బెర్జియా, స్టెరోకార్పస్, అనోజిస్సస్ మొదలైన వాటిని కలిగివుంది. ప్రపంచంలో అరుదైన మొక్కలైన ఎర్రచందనం, సైకస్ బెడ్డోమి, టెర్మినాలియా పల్లిడా, సిజీజియం ఆల్టర్నీఫోలియం షోరియా తలూరా మొదలైనవి రాష్ట్రంలో విస్తారంగా దొరకుతాయి. కొరింగ, కృష్ణ వన్యప్రాణుల అభయారణ్యం, నాగార్జున్‌సాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యం, కంబలకొండ వన్యప్రాణుల అభయారణ్యం, శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శన శాల, ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల వంటి అనేక అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జంతుప్రదర్శనశాలలు ఉన్నాయి . ఏటపాక, లేలపట్టు, తెలినీలపురం, తేలుకుంచి, పులికాట్ సరస్సు పక్షుల అభయారణ్యాలు అనేక వలస పక్షులను ఆకర్షిస్తున్నాయి. పులులు, నల్ల చిరుత పులి, దుమ్ములగొండి, కృష్ణ జింక, చిరుతపులి, సాంబార్ (లేడి), సముద్ర తాబేలు, అనేక పక్షులు, సరీసృపాలు రాష్ట్ర జంతుజాల వైవిధ్యతను సూచిస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాలలో గొప్ప మడ అడవులతో పాటు బావురు పిల్లులు, నీటి కుక్కలు, కీస్టోన్ జాతి జంతువులున్నాయి రాష్ట్ర పక్షి రామచిలుక, రాష్ట్ర చెట్టుగా వేపచెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పువ్వుగా మల్లెపువ్వు 2018, జూన్ 6 న అమల్లోకి వచ్చాయి. వాతావరణం భౌగోళిక ప్రాంతాన్ని బట్టి రాష్ట్ర వాతావరణం గణనీయంగా మారుతుంది. మార్చి నుండి జూన్ వరకు వేసవికాలం ఉంటుంది. తీర మైదానంలో, వేసవి ఉష్ణోగ్రతలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంటాయి. ఉష్ణోగ్రత మధ్య ఉంటుంది. జూలై నుండి సెప్టెంబరు వరకు ఉష్ణమండల వర్షాలు పడే కాలం. మొత్తం వర్షపాతంలో మూడింట ఒకవంతు ఈశాన్య రుతుపవనాల ద్వారా వస్తుంది. అక్టోబరు, నవంబరులో బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థలు, ఉష్ణమండల తుఫానులు ఏర్పడతాయి. ఇవి ఈశాన్య ఋతుపవనాలతో పాటు రాష్ట్రంలోని దక్షిణ తీర ప్రాంతాలకు వర్షాలు కలగజేస్తాయి. నవంబరు నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం సాగుతుంది. రాష్ట్రానికి పొడవైన తీరప్రాంతం ఉన్నందున శీతాకాలం మరీ చల్లగా ఉండదు. శీతాకాలపు ఉష్ణోగ్రత సాధారణంగా . చల్లని వాతావరణం గల విశాఖపట్నం జిల్లాలోని లంబసింగిని "ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్" అని పిలుస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత మధ్య వుంటుంది. జనాభా విషయాలు 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్ర జనాభా , జనాభా సాంద్రత . పోలవరం ఆర్డినెన్స్ బిల్లు 2014 ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసినందున జనాభా 2,47,515 పెరిగింది. ఈ విధంగా 2014 సంవత్సరంలో 2011 జనాభా లెక్కలు ఆధారంగా జనాభా 4,96,34,314, జనసాంద్రత . కాకేసియన్ (Caucasian), మంగోలాయిడ్ (mongoloid), ఆస్ట్రాలో మెలనేసియన్ (వెడ్డాయిడ్) జాతుల ప్రజలు ఆంధ్రప్రదేశ్ అంతటా కనిపిస్తారు. మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా 70.4% అనగా 3,47,76,389, పట్టణ జనాభా 29.6% అనగా 1,46,10,410 గా నమోదైంది. 0–6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 52,22,384 మొత్తం జనాభాలో 10.6%గా ఉన్నారు. వారిలో 26,86,453 మంది బాలురు, 25,35,931 మంది బాలికలు ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధిక పట్టణ జనాభా 47.5%, శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక గ్రామీణ జనాభా 83.8% ఉంది. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులం జనాభా 17.1%, షెడ్యూల్డ్ తెగ జనాభా 5.3%. 2,47,38,068 పురుషులు, 2,46,48,731 మహిళలుండగా, లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు 996 స్త్రీలుగా ఉంది. ఇది జాతీయ సగటు 1,000 కి 926 కంటే ఎక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్షరాస్యత 67.41%. 2021 నాటికి నవ్యాంధ్ర రాష్ట్ర అక్షరాస్యత 91.1%కి చేరుకోవచ్చు. జిల్లాలను విశ్లేషిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక అక్షరాస్యత 74.6%, విజయనగరంలో అత్యల్ప అక్షరాస్యత 58.9% నమోదైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ అభివృద్ధి సూచిక విలువ 0.416 తో భారతీయ రాష్ట్రాలలో పదవ స్థానంలో ఉంది. భాషలు తెలుగు ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష. ఇది దాదాపు 90% జనాభాకు మాతృభాష. 2008 లో తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించారు. ఉర్దూ అతిపెద్ద అల్ప సంఖ్యాకుల భాష. సరిహద్దు ప్రాంతాల్లో తమిళం, కన్నడ, ఒడియా మాట్లాడుతారు. లంబాడి, కోయా, సవారా, కొండా, గడాబా లాంటి అనేక ఇతర భాషలను రాష్ట్రంలోని ఆదివాసులు వాడతారు. మతాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మంది ప్రజలు హిందువులు కాగా, ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలోని ప్రధాన మత సమూహాలు హిందువులు (90.87%), ముస్లింలు (7.32%), క్రైస్తవులు (1.38%). కొద్ది సంఖ్యలో బౌద్ధులు, సిక్కులు, జైనులు, తమ మతాన్ని చెప్పడానికి నిరాకరించిన ప్రజలు ఉన్నారు. పరిపాలనా విభాగాలు ఆంధ్రప్రదేశ్ నైరుతిలో రాయలసీమ, తూర్పు, ఈశాన్యంలో బంగాళాఖాతానికి సరిహద్దులో ఉన్న కోస్తాంధ్ర ,ఉత్తరాంధ్ర అనే మూడు ప్రధాన ప్రాంతాలను కలిగి ఉంది. జిల్లాలు ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటము|300px|right|thumb రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా 2022 ఏప్రిల్ 4న పునర్వ్యవస్థీకరించారు. గణాంకాలతో జిల్లాలు వ.సంఖ్యజిల్లాప్రధాన కార్యాలయంరెవిన్యూ డివిజన్లుమండలాలు సంఖ్య ( 2022 లో )వైశాల్యం (కి.మీ2)జనాభా (2011 ) లక్షలలో జనసాంద్రత (/కి.మీ2)అనకాపల్లిఅనకాపల్లి2244,29217.270402అనంతపురంఅనంతపురం33110,20522.411220అన్నమయ్యరాయచోటి3307,95416.973213అల్లూరి సీతారామరాజుపాడేరు22212,2519.5478ఎన్టీఆర్విజయవాడ3203,31622.19669ఏలూరుఏలూరు3286,67920.717310కర్నూలుకర్నూలు3267,98022.717285కాకినాడకాకినాడ2213,01920.923693కృష్ణామచిలీపట్నం4253,77517.35460గుంటూరుగుంటూరు2182,44320.91856చిత్తూరుచిత్తూరు4316,85518.730273కోనసీమఅమలాపురం3222,08317.191825తిరుపతితిరుపతి4348,23121.970267తూర్పు గోదావరిరాజమహేంద్రవరం2192,56118.323715నంద్యాలనంద్యాల3299,68217.818184పల్నాడునరసరావుపేట3287,29820.42280పశ్చిమ గోదావరిభీమవరం2192,17817.80817పార్వతీపురం మన్యంపార్వతీపురం2153,6599.253253ప్రకాశంఒంగోలు33814,32222.88160బాపట్లబాపట్ల3253,82915.87414విజయనగరంవిజయనగరం3274,12219.308468విశాఖపట్నంవిశాఖపట్నం2111,04819.5951870వైఎస్ఆర్కడప43611,22820.607184శ్రీకాకుళంశ్రీకాకుళం3304,59121.914477శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరునెల్లూరు43810,44124.697237శ్రీ సత్యసాయిపుట్టపర్తి3328,92518.400206 రెవెన్యూ విభాగాలు జిల్లాల సవరణలతో 50 రెవెన్యూ విభాగాలను 75 కు పెంచారు. కొత్తగా 25 డివిజన్లు ఏర్పడ్డాయి. వీటిలో కోనసీమ జిల్లాలో కొత్తపేట రెవిన్యూ డివిజన్ పునరుద్ధరణ, వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల రెవిన్యూ డివిజన్ ఏర్పాటు, 2022 జూన్ లో జరిగాయి. బాపట్ల జిల్లాలో రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారిక గెజెట్ 5 ఆగష్టు 2022 న ప్రకటించారు. సగటున 8 నుంచి 12 మండలాలు ఒక రెవెన్యూ విభాగంలో వున్నాయి. అయితే కుప్పం రెవిన్యూ డివిజన్ లో తక్కువగా నాలుగు మండలాలే వున్నాయి. విజయవాడ, విశాఖపట్నం నగర ప్రాంతాలలో ఐదారు మండలాలకే ఒక రెవిన్యూ డివిజన్ వుంది. మండలాలు రాష్ట్రాన్ని 679 మండలాలుగా విభజించారు. పట్టణ స్థానిక సంస్థలు center|thumb|800x800px|<center> విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక జనాభాగల, భారతదేశంలో 14 వ అతిపెద్దదైన నగరం.</center> రాష్ట్రంలో మొత్తం 125 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇందులో 16 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 32 నగర పంచాయతీలు ఉన్నాయి.విశాఖపట్నం, విజయవాడ నగరాలు పది లక్షల కంటే ఎక్కువ జనాభా గలవి. ప్రభుత్వం, రాజకీయాలు thumbnail|right|250px|అమరావతిలో సచివాలయ భవన సముదాయం 2014 జూన్‌ 2 న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతం విడిపోగా మిగిలిన భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 మంది సభ్యులతో శాసనసభ, 58 మంది సభ్యులతో శాసనమండలి ఏర్పాటయింది. భారత పార్లమెంటులో రాష్ట్రానికి లోక్‌సభలో 25, రాజ్యసభలో 11 స్థానాలు ఉన్నాయి. శాసనసభ నియోజకవర్గాలలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 19, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 9 స్థానాలు ఉన్నాయి. 2014 లో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని మండలాలు సీమాంధ్రలో కలవడంతో నవ్యాంధ్ర లేక నవ్యాంధ్ర ప్రదేశ్ అనే పేరు తెరపైకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2014 లో జరిగిన చివరి ఎన్నికలలో, తెదేపాకు అవశేష (కొత్త) రాష్ట్రంలో ఆధిక్యం లభించింది. నారా చంద్రబాబునాయుడు 2014 జూన్ 8న, కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. 2011 లో వైయస్ఆర్ కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికలలో భారీ ఆధిక్యత సాధించగా, వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. తెలంగాణాతో కొన్ని 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన, షీలా భిడే కమిటీ సిఫారసుల మేరకు 9వ షెడ్యూల్‌లోని 40 సంస్థల విభజన మరి ఇతర సమస్యలు ఇంకా పరిష్కరించబడవలసి ఉంది. జగన్ ప్రభుత్వం సమీకృత అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ కొరకు, అమరావతిని కేవలం శాసనరాజధానిగా పరిమితం చేసి, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా మార్పులు చేసిన చట్టానికి 2020 జూలై 31 న గవర్నరు ఆమోదముద్ర పడింది. ఈ చట్టాన్ని ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసినందున, న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం అమరావతి రాజధానిగా కొనసాగుచున్నది. హైకోర్టు విచారణ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఈ శాసనం రద్దుచేసి, మరల కొత్త శాసనాన్ని ప్రవేశపెడతామని తెలిపింది. ఇది ఇలా వుండగా 2022 మార్చి ౩ న ఉన్నత న్యాయస్థానపు త్రిసభ్య ధర్మాసనం రాజధాని వికేంద్రీకరణ శాసనం చెల్లదని, అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 4 నుండి అమలయ్యేటట్లు 13 జిల్లాలను, ప్రధానంగా పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాతిపదికగా 26 జిల్లాలుగా మార్చింది. సుస్థిరాభివృద్ధి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజి) సూచీలో 2020-21గానూ కేరళ 75 పాయింట్లను సాధించి తన తొలి స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకుంది. బీహార్ ఈ సూచిలో చివరిస్థాయిలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు ఒక్కొక్కటి 74 పాయింట్లతో రెండో స్థానంలో, 72 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానానికి చేరుకోగా, 69 పాయింట్లతో తెలంగాణ ఆరో స్థానానికి దిగజారింది. ఆర్థిక వ్యవస్థ కుడి|thumb| ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రం విశాఖపట్నం alt=seaport distance view|thumb| విశాఖపట్నం వీక్షణ, ఓడరేవువైపు నుండి 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విలువ ఆధారంగా, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ₹12,01,736 కోట్లు (ముందస్తు అంచనా). గత సంవత్సరపు విలువ ₹10,14,374 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిగా ఏడాదిలో ₹ 1,87,362 కోట్ల పెరుగుదల నమోదైంది. వార్షిక వృద్ధి రేటు 18.47% దేశపు వృద్ధి రేటు 17 శాతం కంటే ఎక్కువ. వ్యవసాయరంగం : ₹3.9 లక్షల కోట్లు (+14.5%) పారిశ్రామిక రంగం : ₹2.5 లక్షల కోట్లు (+25.5% ) సేవా రంగం : ₹4.67 లక్షల కోట్లు (+18.9% ) 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విలువ ప్రాతిపదికన, తలసరి ఆదాయం ₹2,00,771. అంతకు ముందు సంవత్సరంలో తలసరి ఆదాయం ₹176,000. ఏడాదిలో రాష్ట్రంలో ₹31 వేలు తలసరి ఆదాయం పెరగగా, దేశంలో తలసరి ఆదాయం ₹23 వేలు పెరిగింది. మానవ అభివృద్ధి సూచిక (హెచ్‌డిఐ) లో భారత రాష్ట్రాల్లో 27వ స్థానంలో ఉంది; వ్యాపార నిర్వహణ అనుకూలత ప్రపంచ బ్యాంకు జరిపే వ్యాపార నిర్వహణ అనుకూలత (Ease of doing business) లో రాష్ట్రం, దేశం మొత్తం మీద 2015 లో రెండవ స్థానంలోను, 2018 లో మొదటి స్థానంలోనూ నిలిచింది. 2010 నాటి ఫోర్బ్స్ పత్రిక అత్యధిక ధనవంతులైన 100 మంది జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు వ్యక్తులు ఉన్నారు. వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం, పశు పోషణ మీద ఆధారపడి ఉంది. భారతదేశంలోని నాలుగు ముఖ్యమైన నదులు, గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర రాష్ట్రం గుండా ప్రవహిస్తూ వ్యవసాయానికి నీటిని అందిస్తున్నాయి. జనాభాలో 60 శాతం మంది వ్యవసాయం, దాని సంబంధిత కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు. వరి రాష్ట్రంలోని ప్రధాన ఆహార పంట. చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు, కూరగాయలకు, కృష్ణ జిల్లాలో మామిడికి, గుంటూరు జిల్లాలో మిరపకాయలకు మూడు వ్యవసాయ ఆర్థిక మండలాలు ఉన్నాయి. రైతులు వరితో పాటు జొన్న, సజ్జలు, మొక్కజొన్న, సిరిధాన్యాలు, అనేక రకాల పప్పులు, నూనె గింజలు, చెరకు, పత్తి, మిరపకాయ, మామిడి, పొగాకును పండిస్తారు. ఆయిల్ పామ్, ప్రొద్దు తిరుగుడు, వేరుశనగ వంటి పంటల నుండి వంట నూనె ఉత్పత్తి చేస్తారు. అనేక నీటిపారుదల ప్రాజెక్టులు అభివృద్ధిలో ఉన్నాయి. ఉద్యానవన పంటల్లో బత్తాయి, నిమ్మ, దానిమ్మ, జామ, సపోటా ముఖ్యమైనవి. పశుపోషణ, కోళ్ల పెంపకం మరొక లాభదాయక వ్యాపారం. ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతం చేపలు, రొయ్యలు సాగులో దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. దేశం మొత్తంలో మత్యసంపదలో 10% చేపలు, 70% రొయ్యల ఉత్పత్తి రాష్ట్రంలో జరుగుతున్నది. వన్నమీ రొయ్యలు అత్యధికంగా ఎగుమతి చేయబడుతున్న సముద్ర ఎగుమతులు. వీటిద్వారా 2013–2014లో ఆదాయం ఒక బిలియన్ ను దాటవచ్చని భావిస్తున్నారు. పరిశ్రమలు alt=Front of large round building, with street and trees in front|thumb| టెక్ మహీంద్రా డెవలప్‌మెంట్ సెంటర్, విశాఖపట్నం రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఔషధ, ఆటోమొబైల్, వస్త్రాలు వంటి కీలక రంగాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీసిటీ ఒక సమగ్ర వ్యాపార నగరం, ఇది పెప్సికో, ఇసుజు మోటార్స్, క్యాడ్‌బరీ ఇండియా, కెల్లాగ్స్, కోల్‌గేట్-పామోలివ్, కోబెల్కో మొదలైన సంస్థలకు నిలయం. పెప్సికో సంస్థ శ్రీ సిటీలో భారతదేశంలో అతిపెద్ద ప్లాంటును కలిగి ఉంది. కృష్ణా జిల్లాలోని అశోక్ లేలాండ్, చిత్తూరు జిల్లాలో హీరో మోటార్స్, అనంతపురం జిల్లాలోని కియా ఇండియా వంటి సంస్థలతో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీలో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. 2012–2013లో విశాఖపట్నం కేంద్రంగా ఐటి / ఐటి ఆధారిత సేవలు రెవెన్యూ ₹ 14.45 బిలియన్లు. 2012-2013 లో, ఐటి / ఐటి ఆధారిత సేవలు ఆదాయాలు విజయవాడలో ₹ 1,153 మిలియన్, తిరుపతిలో ₹ 693 మిలియన్, కాకినాడలో ₹ 615 మిలియన్ గా నమోదైంది. వనరులు ఖనిజాలు విభిన్న భౌగోళిక నిర్మాణాలతో గొప్ప, వివిధ రకాల పారిశ్రామిక ఖనిజాలు, నిర్మాణాల్లో ఉపయోగించే రాళ్ళ నిల్వలున్నాయి. సున్నపురాయి, మేంగనీస్, రాతినార, ఇనుము, బంతి బంకమట్టి, అగ్ని మట్టి, వజ్రం, గ్రాఫైట్, డోలమైట్, స్పటికం, టంగ్‌స్టన్, స్టీటిటిక్, ఫెల్డ్‌స్పార్, సిలికా, బారియెట్స్, గెలాక్సీ గ్రానైట్, ఇసుక, యురేనియం, బాక్సైట్ మొదలైనవి ఉన్నాయి. భారతదేశంలో అభ్రకం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో, సున్నపురాయి నిల్వలలో మూడింట ఒక వంతు కలిగి ఉంది. తుమ్మలపల్లె యురేనియం గనిలో 49000 టన్నుల ముడి ధాతువు వున్నట్లు ధ్రువీకరించబడింది. దీనికంటె మూడు రెట్లు ఎక్కువ నిల్వలను కలిగి ఉండవచ్చని సూచనలు ఉన్నాయి. మెటల్ గ్రేడ్ బాక్సైట్ నిక్షేపాలు విశాఖపట్నం నౌకాశ్రయానికి సమీపంలో 700 మిలియన్ టన్నులు ఉన్నాయి. చమురు, సహజ వాయువు రిలయన్స్ ఇండస్ట్రీస్ కాకినాడ సమీపంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో దూరంలోగల కెజి బేసిన్ లో, తొమ్మిది ట్రిలియన్ క్యూబిక్ అడుగుల సహజ వాయువు నిల్వలను కనుగొనింది. 2016 లో, కెజి బేసిన్లో దాదాపు మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలు వున్నట్లు కనుగొనబడింది. అవస్థాపనా వసతులు వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల అభివృద్ధికి రవాణా, విద్యుత్తు, డిజిటల్ నెట్వర్క్ లాంటి అవస్థాపన వసతులు కీలకం. రవాణా రహదారి, రైలు మార్గాలద్వారా ఇతర రాష్ట్రాలకు కలపబడివుంది. విమానయాన, సముద్రయాన మార్గాలు కూడా ఉన్నాయి. బంగాళాఖాతం తీరంలో, సముద్ర వ్యాపారానికి అనువుగా ఓడరేవులున్నాయి. విజయవాడలో అతి పెద్దదైన రైలు కూడలి, విశాఖపట్నంలో అతి పెద్ద ఓడరేవు ఉంది. రహదారులు thumb|విజయవాడ-గుంటూరు రహదారి (జాతీయ రహదారి NH-16లో భాగం)|alt=విజయవాడ-గుంటూరు రహదారి|250x250px రాష్ట్రంలోని మొత్తం రహదారుల పొడవు కాగా, దానిలో పొడవు జాతీయ రహదారులు, పొడవు రాష్ట్ర రహదారులు, పొడవు జిల్లా రహదారులు ఉన్నాయి. రాష్ట్రంలో జాతీయ రహదారి 16 పొడవు . ఇది బంగారు చతుర్భుజి ప్రాజెక్టులో భాగం. ఆసియా రహదారి 45 లో కూడా భాగమే. 2014 జూన్ 2 న నవ్యాంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారులు 4,193 కి.మీ. కాగా 2021 డిసెంబరుకు 8,183 కి.మీకు అనగా సుమారుగా రెట్టింపు చేరుకున్నాయి. దీనికొరకు ₹35,000 కోట్లు ఖర్చు చేశారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఆసియా ఖండములోనే ఒక పెద్ద బస్ ప్రాంగణం. 2019 జనవరి 30 నుండి రాష్ట్రంలోని వాహనాల నమోదు AP-39 కోడ్ తో ప్రారంభమయి ఒక అక్షరము, నాలుగు అంకెల సంఖ్యతో నమోదు చేయటం ప్రారంభమైంది. కొన్ని రాష్ట్ర రహదారులను, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నారు. వీటికి ఒక ఉదాహరణ నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి. జాతీయ రహదారులు +క్ర. సం. నెంబరుపొడవు కిమీ1 16చెన్నై - గూడూరు - నెల్లూరు - కావలి - ఒంగోలు - చిలకలూరి పెట - గుంటూరు - మంగళగిరి - విజయవాడ - ఏలూరు - రాజమహేంద్రవరం - తుని - విశాఖపట్నం - శ్రీకాకుళం - కోల్కతా1024 2 544 డిఅనంతపురం - తాడిపత్రి - వినుకొండ - నరసరావు పేట - గుంటూరు 417 3565హైదరాబాద్ - మాచెర్ల - వేంకటగిరి - తిరుపతి410 4 516 ఇ రాజమహేంద్రవరం - పాడేరు - విజయనగరం 406567పనాజి - గుంతకల్ - గుత్తి - తాడిపత్రి - ప్రొద్దటూరు - నెల్లూరు - కృష్ణపట్నం405 6216తుని - పిఠాపురం - కాకినాడ - నరసాపురం - మచిలీపట్టణం - రేపల్లె - బాపట్ల - చీరాల - ఒంగోలు391 740కర్నూలు - నంద్యాల - కడప - రాయచోటి - చిత్తూరు - చెన్నై381842బళ్ళారి - అనంతపురం - కదిరి - మదనపల్లి - పుంగనూరు - క్రిష్ణగిరి378 944శ్రీనగర్ - కర్నూలు - డొన్ - గుత్తి - అనంతపురం - కన్యా కుమారి 26110 716చెన్నై - నగరి - పుత్తూరు - తిరుపతి - రాజంపేట - కడప - ముద్దనూరు 23811167 బి కడప - కందుకూరు - సింగరాయకొండ1951271మదనపల్లి - తిరుపతి - శ్రీకాళహస్తి - నాయుడు పేట 1911365ముంబై - జగ్గయ్యపేట - కొండపల్లి - విజయవాడ - తాడిగడప - మచిలీపట్టణం 1501430నైనిటాల్ - చింతూరు - తిరువూరు - కొండపల్లి - విజయవాడ13515340 సికర్నూలు - దోర్నాల131 16216 ఎరాజమహేంద్రవరం - తణుకు - తాడేపల్లిగూడెం - ఏలూరు 12117167కోదాడ - ఆదోని - బళ్లారి11018165నరసాపురం - పాలకొల్లు - భీమవరం - గుడివాడ - పామర్రు107 రైల్వే ఆంధ్రప్రదేశ్ లో బ్రాడ్ గేజి రైలు మార్గం 3703.25 కిమీ. మీటర్ గేజి రైలు మార్గాలు లేవు. రైలు సాంద్రత 16.59. ఇది భారతదేశానికి సగటు 20 గా ఉంది. రాష్ట్రం గుండా పోయే హౌరా-చెన్నై ప్రధాన మార్గం డైమండ్ చతుర్భుజిలో భాగంగా అతివేగమైన రైలు మార్గంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలున్నాయి. రైలు నెట్వర్క్ రెండు జోనుల పరిధిలో ఉంది. దీనిని డివిజన్లగా విభాగించారు. దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ రైల్వే డివిజన్, గుంటూరు రైల్వే డివిజన్, గుంతకల్ రైల్వే డివిజన్., తూర్పు కోస్తా రైల్వే జోన్ లోని వాల్తేర్ రైల్వే డివిజన్. రాష్ట్రానికి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ ప్రకటించారు. విమానాశ్రయాలు విశాఖపట్నం, విజయవాడ రాష్ట్రంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు. రాష్ట్రంలో దేశీయ విమానాశ్రయాలు కర్నూలు, కడప, రాజమండ్రి, తిరుపతి లలో ఉన్నాయి. ఇంకా 16 చిన్న తరహా విమానాలు దిగడానికి సౌకర్యమున్న కేంద్రాలున్నాయి. ఓడ రేవులు దేశంలోనే రెండవ అతిపెద్ద కోస్తాతీరం రాష్ట్రంలో ఉంది. విశాఖపట్నం ఓడరేవు దేశంలోకెల్లా సరకురవాణాకి అత్యంత పెద్దదైన ఓడరేవు. మిగతా ప్రముఖ ఓడరేవులు కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ. గంగవరం అతిలోతైన పోర్టు కావడంతో అతి పెద్ద సముద్రపడవలు (200,000 – 250,000 టన్నులు సరకులు బరువు) కు అనుకూలమైంది. పెద్దవి కాని పోర్టులు భీమునిపట్నం, దక్షిణ యానాం, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు లలో ఉన్నాయి. విద్యుత్తు thumb|రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం ముందుంది. అధిక విద్యుత్ ఉత్పత్తిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో రాష్ట్రం విద్యుత్ మిగులుగా మారింది. 24 గంటల విద్యుత్ సరఫరాకు రాష్ట్రానికి సౌర శక్తి, జలవిద్యుత్ కేంద్రాలున్నాయి. వర్షాకాలంలో లభించే నీటిని నిల్వ చేయడం, ఏడాది పొడవునా ఎత్తిపోతల ద్వారా నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్వహించే వీలుంది. 2015 నాటికి రాష్ట్రంలో థర్మల్ ( సహజ వాయువు, బొగ్గు ఆధారిత), పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్ధ్యం 21,000 MW . స్థానిక విద్యుత్ ప్లాంట్లు 9,600 MW  సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇందులో సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ 2000MW, వైజాగ్ థర్మల్ పవర్ స్టేషన్ 1040 MW, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ 1650 MW, శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ 1600 MW, డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం 1760 MW. జలవిద్యుత్ కేంద్రాల సామర్థ్యం 1671 MW గా ఉంది. డిజిటల్ నెట్వర్క్, సేవలు ఎపిఎస్‌ఎఫ్‌ఎల్ (APSFL) రాష్ట్ర వ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఈ నెట్‌వర్క్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, టెలిఫోనీ, ఐపిటివి మొదలైన వాటిని ఫైబర్‌తో వివిధ వినియోగదారులకు అందిస్తుంది. చాలావరకు ప్రభుత్వ సేవలు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. సంస్కృతి నృత్యం thumb| కూచిపూడి నృత్యం కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక నృత్య రూపంగా గుర్తించబడింది. ఇది కృష్ణ జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఉద్భవించింది. విజయవాడలో మొత్తం 6,117 మంది నృత్యకారులతో ప్రదర్శించిన కూచిపూడి మహాబృంద నాట్యం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. కూచిపూడి గ్రామంలో ప్రారంభమైన ఈ నృత్యరీతి ఆంధ్రప్రదేశ్ మొత్తానికే కాక దేశవిదేశాల్లో ఎందరెందరో నేర్చుకుని ప్రదర్శించే స్థాయికి ఎదిగింది. కూచిపూడి వారు ప్రదర్శించే నృత్యనాటికలు భామా కలాపం, గొల్ల కలాపం వంటివి తెలుగు వారి సంస్కృతిలో భాగంగా నిలుస్తున్నాయి. దేవదాసీలు మాత్రమే ప్రదర్శిస్తూ ఆచారవంతులైనవారు నృత్యకారులను పంక్తిబాహ్యులని భావించే స్థితిలో కేవలం బ్రాహ్మణ పురుషులే అన్ని వేషాలు వేస్తూ, విద్యావంతులైన వారితో కూచిపూడి నృత్యరీతిని సిద్దేంద్ర యోగి వ్యవస్థాపించాడు. కాలక్రమేణా ఈ నృత్యరీతి తెలుగువారి సంస్కృతిలో ముఖ్యభాగమైంది. 1950 నాటికి స్థానికంగా ఉండిపోయిన దీనికి జాతీయ స్థాయిలో మెప్పును, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపునూ తీసుకురావడానికి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి కృషి చేశాడు. ఈయన ఈ కళలోకి స్త్రీలను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేసి యావజ్జీవితాన్ని కళకు అంకితం చేశాడు. దేవదాసీల ప్రదర్శనల్లో విలసిల్లి క్రమంగా దేవదాసీ వ్యవస్థతో పాటుగా అంతరించిపోతున్న నృత్యరీతులను, లక్షణ గ్రంథాల్లో సైద్ధాంతికంగా ఉండి తరతరాల నుంచి ప్రదర్శనకు నోచుకోను నృత్యరీతులను, దేవాలయాల్లోని ప్రతిమల నాట్యభంగిమలను, లక్షణ గ్రంథాలతో కలిపి నటరాజ రామకృష్ణ అధ్యయనం చేసి ఆంధ్ర నాట్యం పేరిట సృజించాడు. భౌగోళిక గుర్తింపులు వస్తువుల భౌగోళిక సూచికలు(GI) (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) చట్టం, 1999 ప్రకారం వ్యవసాయ హస్తకళలు, ఆహార పదార్థాలు, వస్త్రాల విభాగాలలో ఆంధ్రప్రదేశ్‌లో భౌగోళిక గుర్తింపు సాధించినవి పదిహేను ఉన్నాయి. వీటిలో కొన్ని బనగానపల్లె మామిడి, బందర్ లడ్డూలు, బొబ్బిలి వీణ, బుడితి బెల్, ఇత్తడి హస్తకళలు, ధర్మవరం చేనేత పట్టుచీరలు, పావడాలు, గుంటూరు సన్నం, కొండపల్లి బొమ్మలు, మచిలీపట్నం కలంకారి, మంగళగిరి చీరలు, శ్రీకాళహస్తి కలంకారీ, తిరుపతి లడ్డు, ఉప్పాడ జమ్‌దానీ చీరలు, వెంకటగిరి చీర. కళలు, చేతిపనులు, కళాఖండాలు మచిలీపట్నం, శ్రీకాళహస్తికి చెందిన కలంకారి భారతదేశంలో రెండు ప్రత్యేకమైన వస్త్ర కళారూపాలు. దుర్గిలో దొరికే మృదువైన సున్నపురాయి, విగ్రహ శిల్పాలు వంటి ఇతర ముఖ్యమైన హస్తకళలు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలోని ఏటి కొప్పాక లక్క పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. కృష్ణాజిల్లాలో కొండపల్లి గ్రామం కొండపల్లి కొయ్య బొమ్మలకు పేరుపొందింది. రాష్ట్రంలోని ప్రదర్శనశాలలలో పురాతన శిల్పాలు, చిత్రాలు, విగ్రహాలు, ఆయుధాలు, వంటకు వాడే ఉపకరణాలు, శాసనాలు, మతపరమైన కళాఖండాలు ఉన్నాయి. అమరావతి పురావస్తు మ్యూజియం, విశాఖపట్నంలోని విశాఖ మ్యూజియంలో ఇవి చూడవచ్చు. విశాఖపట్నంలోని తెలుగు సాంస్కృతిక మ్యూజియం లో స్వాతంత్ర్యానికి పూర్వ కాలపు చరిత్ర చూడవచ్చు. విజయవాడలోని విక్టోరియా జూబ్లీ మ్యూజియం లో చాలా కళాఖండాలున్నాయి. సాహిత్యం రాష్ట్రానికి తెలుగు అధికార భాష. కవిత్రయమని పేరుగన్న నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ మహా భారత కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు. నన్నయ్య తెలుగు వ్యాకరణంపై ఆంధ్ర శబ్ద చింతామణి అనే మొదటి గ్రంథాన్ని సంస్కృతంలో రాశారు. శ్రీ భాగవతంను తెలుగులో శ్రీమద్భాగవతం అనే పేరుతో పోతన అనువాదం చేశాడు. వేమన తన తాత్విక కవిత్వానికి పేరుపొందాడు. విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలు అముక్తమాల్యద రాశాడు. కందుకూరి వీరేశలింగం తరువాత తెలుగు సాహిత్యాన్ని ఆధునిక తెలుగు సాహిత్యం అని పిలుస్తారు. అతనిని గద్య తిక్కన అని పిలుస్తారు. తెలుగు సామాజిక నవల సత్యవతి చరితం వ్రాసిన రచయిత ఇతనే. జ్ఞానపీఠ పురస్కారం గ్రహీతలలోవిశ్వనాథ సత్యనారాయణ ఒకడు. విప్లవాత్మక కవి శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో కొత్త వ్యక్తీకరణ రూపాన్ని తీసుకువచ్చాడు. మాధ్యమాలు రాష్ట్రంలో ముద్రణ మాధ్యమాలలో ప్రధానంగా తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు ఉన్నాయి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, వార్త, ప్రజాశక్తి కొన్ని తెలుగు వార్తాపత్రికలు కాగా, ఆంగ్ల వార్తాపత్రికలలో ది హిందూ, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, దక్కన్ క్రానికల్, ది హన్స్ ఇండియా ఉన్నాయి.http://www.davp.nic.in/Upload/(S(pyatp4ydvoojmwmj340xys55))/davp_empanel_status.aspx ఎలెక్ట్రానిక్ మాధ్యమాలలో ప్రభుత్వరంగంలోని దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలతో పాటు, ప్రైవేటు రంగంలో పలు రేడియో కేంద్రాలు, టెలివిజన్ ఛానళ్లు పనిచేస్తున్నాయి. కళ, సినిమా కర్ణాటక సంగీతం వాగ్గేయకారులు అన్నమాచార్య, త్యాగరాజు, క్షేత్రయ్య, భద్రాచల రామదాసు తెలుగు భాషలో కృతులు రచించి, భాషను సుసంపన్నం చేశారు. ఆధునిక కర్ణాటక సంగీత కారులు, గాయకులు ఘంటసాల, సుజాతా పులిగెల్ల, బాలమురళీకృష్ణ తెలుగు వారే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్. జానకి, పిబి శ్రీనివాస్ పేరొందిన సంగీతకారులు, నేపథ్య గాయకులు. రాష్ట్రంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో జానపద పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. బుర్రకథ, పోలి వంటి రూపాలు నేటికీ ప్రదర్శించబడతున్నాయి. ఆంధ్రలో ఉద్భవించిన హరికథా కాలక్షేపం (లేదా హరికథ ) కథనంతో పాటు సంబంధిత పాటలను కలిగివుంటుంది. బుర్రకథ అనేది మౌఖిక కథ చెప్పే విధానం. దీనిలో హిందూ పౌరాణిక కథ లేదా సమకాలీన సామాజిక సమస్యను ఇతివృత్తంగా ప్రదర్శిస్తారు. రంగస్థల నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రదర్శిస్తారు. గురజాడ అప్పారావు 1892 లో వ్రాసిన కన్యాశుల్కం అనే నాటకాన్ని తెలుగు భాషలో గొప్ప నాటకంగా భావిస్తారు.20th Century Telugu Luminaries, Potti Sriramulu Telugu University, Hyderabad, 2005 సి. పుల్లయ్యను తెలుగు నాటక ఉద్యమ పితామహుడిగా పేర్కొంటారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రధానంగా తెలంగాణాలోని హైదరాబాదుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ఉంది. తెలుగు చిత్ర సంస్కృతి (టాలీవుడ్) బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద చిత్ర పరిశ్రమ. చిత్ర నిర్మాత డి. రామానాయిడు అత్యధిక చిత్రాలను నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ సాధించాడు. 2005, 2006, 2008 సంవత్సరాల్లో, తెలుగు చిత్ర పరిశ్రమ భారతదేశంలో అత్యధిక సంఖ్యలో చిత్రాలను నిర్మించింది. ఈ పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నిస్ రికార్డును కలిగి ఉంది. వంటకాలు thumb|ముఖ్యమైన సందర్భాలలో వడ్డించే శాకాహార ఆంధ్ర భోజనం తెలుగు ప్రజల సంప్రదాయ తీపి పూతరేకుల నుండి తూర్పు గోదావరి జిల్లా గ్రామమైన ఆత్రేయపురంలో పుట్టింది. పర్యాటకం alt=|thumb| ఉండవల్లి గుహలు, కొండను తొలిచి నిర్మించిన పురాతన వాస్తుశిల్పానికి ప్రతీక. thumb|కర్నూలులోని కొండారెడ్డి బురుజు thumb|పురావస్తు సంగ్రహాలయాలు ఆంధ్రప్రదేశ్ పటం ఆంధ్రప్రదేశ్ ను 2015 లో 121.8 మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే పర్యాటకుల రాకలో 30% వృద్ధితో ఇది భారతదేశంలో అత్యధికంగా సందర్శించిన మూడవ రాష్ట్రంగా నిలిచింది. తిరుపతిలోని తిరుమల వెంకటేశ్వర ఆలయం సంవత్సరానికి 18.25 మిలియన్ సందర్శకులతో ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి. రాష్ట్రం తీరప్రాంత జిల్లాలలో రుషికొండ, మైపాడు, సూర్యలంక, విశాఖపట్నం, పేరిపాలెం, గొల్లపాలెం, మచిలీపట్నం మొదలైన అనేక సముద్ర తీరాలు (బీచ్‌లు) ఉన్నాయి; బొర్రా గుహలు, ఉండవల్లి గుహలు, కొండను తొలిచి నిర్మించిన పురాతన వాస్తుశిల్పానికి ప్రతీకలు. దేశంలోని రెండవ పొడవైన గుహలు బెలూం గుహలు. లోయలు, కొండలలో ప్రముఖమైనవి అరకు లోయ, హార్స్‌లీ కొండలు, పాపి కొండలు. విశాఖపట్నం జిల్లాలో ఉన్న అర్మ కొండ శిఖరం తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం. రాష్ట్రం వివిధ భక్తుల పుణ్యస్థలాలకు నిలయం. వీటిలో తిరుమల ఆలయం, తిరుపతి, ద్వారక తిరుమల (చిన్న తిరుపతి), సింహాచలం ఆలయం, అన్నవరం ఆలయం, శ్రీశైలం ఆలయం, కనక దుర్గ ఆలయం, అమరావతి, శ్రీకాళహస్తి, అహోబిలం, మహానంది, కాణిపాకం, పంచారామాలు, ఆదోనిలో షాహి జామియా మసీదు, విజయవాడలో గుణదల చర్చి, అమరావతి, నాగార్జున కొండ వద్ద బౌద్ధ కేంద్రాలు కొన్ని ముఖ్యమైనవి. విద్య, పరిశోధన కుడి|thumb| వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం అక్షరాస్యత 67.41%గా నమోదైంది. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యను ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే, ఇంకా ప్రైవేట్ పాఠశాలలు అందిస్తాయి. వీటిని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నియంత్రిస్తుంది, ప్రభుత్వ పాఠశాలలను నిర్వహిస్తుంది. రాష్టంలో గురుకుల (రెసిడెన్షియల్) పాఠశాలలు కూడా ఉన్నాయి. పిల్లలు, పాఠశాల సమాచార నివేదిక 2018–19 ప్రకారం, మొత్తం 62,063 పాఠశాలల్లో 70,41,568 విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (ఎస్ఎస్సి) పరీక్షలు నిర్వహిస్తుంది. 2019 ఎస్ఎస్సి పరీక్షకు మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. 5,464 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణతతో పాటు మొత్తంగా 94.88% ఉత్తీర్ణత నమోదైంది. బోధనా మాధ్యమాలు ప్రధానంగా తెలుగు, ఇంగ్లీష్ అయినప్పటికి, ఉర్దూ, హిందీ, కన్నడ, ఒడియా, తమిళ భాషలు కూడా ఉన్నాయి. 2020-21 విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలలో 1-6 తరగతుల బోధనా మాధ్యమంగా తెలుగును తొలగించి దాని స్థానంలో ఆంగ్లం ప్రవేశపెట్టాలని, ఆ తరువాత సంవత్సరం నుండి పై తరగతులకు ఈ పద్ధతిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేస్తూ విద్యాహక్కు చట్టం ప్రకారం మాధ్యమ ఐచ్ఛికం పిల్లల తల్లిదండ్రులకుండాలని తీర్పు ఇవ్వగా, ప్రభుత్వం దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేసి హైకోర్టు తీర్పును మధ్యంతరంగా నిలుపు చేయాలని కోరగా, ఆ కోరికను తిరస్కరించింది. ఇంటర్మీడియట్ విద్యను ఇంటర్మీడియట్ విద్యామండలి (ఆంధ్రప్రదేశ్) నిర్వహణ, నియంత్రణ చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను ఉన్నత విద్యా శాఖ నిర్వహిస్తుంది. సాంకేతిక విద్యను సాంకేతిక విద్యా శాఖ నియంత్రిస్తుంది. ఉన్నత విద్యా పరిషత్ అనే సంస్థ ఉన్నత విద్యను సమన్వయం చేస్తుంది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), ఐఐఎం (IIM) విశాఖపట్నం, ఐఐటి (IIT) తిరుపతి, ఎన్ఐటి (NIT) తాడేపల్లిగూడెం, ఐఐఐటిడిఎమ్ (IITDM) కర్నూలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIOPAE), ఎన్ఐడివి (NIDV), సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐఐఐటి (IIIT) శ్రీ సిటీ, ఐఐఎస్ఇఆర్ (IISER) తిరుపతి, వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు, ఐఐఎఫ్టి (IIFT) కాకినాడ ముఖ్యమైన కేంద్ర విశ్వవిద్యాలయాలు. గ్రామీణ యువకుల విద్యా అవసరాలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008 లో రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జియుకెటి) ను స్థాపించింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకారం, గీతం, కెఎల్ విశ్వవిద్యాలయం, విజ్ఞాన్ విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలుగా పరిగణించబడతాయి. ఉద్యానవన, న్యాయశాస్త్రం, వైద్యశాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, వేదాలు, జంతు వైద్య శాస్త్రాలలో ఉన్నత విద్యను అందించేందుకు 18 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో 1926 లో స్థాపించబడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పురాతనమైనది. పరిశోధన నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, (NIO), విశాఖపట్నం విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, జాతీయ వాతావరణ పరిశోధన ప్రయోగశాల (NARL), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER), తిరుపతి, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ (SAMEER), విశాఖపట్నం, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CTRI), రాజమండ్రి, వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోపెదవేగి వద్ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ (IIOPR) CCRH ప్రాంతీయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CRI CCRH) గుడివాడ, క్లినికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CRI) తిరుపతి రాష్ట్రంలో గల కొన్ని ముఖ్యమైన పరిశోధనా సంస్థలు; అంతరిక్ష పరిశోధన: నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అనే ద్వీపంలో శ్రీహరికోట రేంజ్ (షార్) అని పిలువబడే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహిస్తున్న ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇది భారతదేశం ప్రాథమిక కక్ష్య ప్రయోగ ప్రదేశం. ఈ కేంద్రం నుండి 2008 అక్టోబరు 22 న చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. క్రీడలు thumb| విశాఖపట్నంలోని డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎసిఎ - విడిసిఎ క్రికెట్ స్టేడియం. ఆంధ్రప్రదేశ్ క్రీడా మండలి (స్పోర్ట్స్ అథారిటీ) క్రికెట్, ఫీల్డ్ హాకీ, అసోసియేషన్ ఫుట్‌బాల్, స్కేటింగ్, ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్, చెస్, జల క్రీడలు, టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, సైక్లింగ్ మొదలైన వాటిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. రాష్ట్రంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడలలో క్రికెట్ ఒకటి. విశాఖపట్నంలోని ఎసిఎ-విడిసిఎ స్టేడియం (ACA-VDCA Stadium) ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు నిలయం. ఈ వేదికలో క్రమం తప్పకుండా అంతర్జాతీయ, దేశీయ మ్యాచ్‌లు జరుగుతాయి. భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్,, విజయనగరానికి చెందిన మహారాజ్కుమార్, MV నరసింహ రావు, ఎం. ఎస్. కె. ప్రసాద్‌, వివిఎస్ లక్ష్మణ్, తిరుమలశెట్టి సుమన్, అర్షద్ అయూబ్, అంబటి రాయుడు, వెంకటపతి రాజు, శ్రావంతి నాయుడు, ఎలకా వేణుగోపాలరావు, హనుమ విహారి ఆంధ్రప్రదేశ్ నుండి భారతదేశానికి ప్రాతినిథ్యం వహించినవారిలో ముఖ్యులు. కృష్ణ జిల్లాలోని గుడివాడకు చెందిన హంపి కోనేరు భారతీయ చెస్ గ్రాండ్‌మాస్టర్. ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లేశ్వరి శ్రీకాకుళం జిల్లాకు చెందినది. ఆమె 2000 సెప్టెంబరు 19న విభాగంలో ఎత్తి, కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భీమవరానికి చెందిన కృష్ణంరాజు గడిరాజు రూబిక్స్ క్యూబ్ ను పరిష్కరించడంలో నాలుగు-సార్లు ప్రపంచ రికార్డ్ గెలుచుకున్నాడు. పుల్లెల గోపీచంద్ మాజీ భారత బాడ్మింటన్ క్రీడాకారుడు. అతను 2001 లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని ప్రకాష్ పడుకోనె తర్వాత ఈ పురస్కారాన్ని గెలుచుకున్న రెండవ భారతీయుడు అయ్యాడు. చెరుకూరి లెనిన్ మలేషియాలోని ఆసియా గ్రాండ్ ప్రిక్స్‌లో రజత పతకం సాధించిన భారతీయ విలువిద్యాకారుడు, శిక్షకుడు. ఇవికూడా చూడండి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డివిజన్లు ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గమనికలు మూలాలు బయటి లింకులు వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:దక్షిణ భారతదేశం
భూగోళ శాస్త్రం
https://te.wikipedia.org/wiki/భూగోళ_శాస్త్రం
thumb|భూమి భౌతిక పటం భూగోళ శాస్త్రము అంటే భూమికి సంబంధించిన విజ్ఞానాన్ని తెలిపే శాస్త్రం. దీనిలో భాగంగా దేశాలు భూగోళంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకొనడం. భూమి పై నదులు, పర్వతాలు, సముద్రాల స్థానాలను తెలుసుకొనడం, భూమి ఎలా ఏర్పడింది, ఏ మార్పులు పొందింది తెలుసుకోవడం. భూ గోళ శాస్త్ర చరిత్ర పూర్వకాంబ్రియన్ బలమైన ఆధారాలు లేక పోవటం వలన భూమిని గురించి 65 కోట్ల సంవత్సరాల ముందటి విషయాలను చిత్రాలను ఊహించలేకున్నాము. కావున 65 కోట్ల సంవత్సరాల నుంచి ఏం జరిగినదొ శాస్త్రవేత్తలు ఊహించి, నిర్ధారించారు. 110 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఒకే ఒక మహా ఖంఢము ఉండినది. దానిని రొదీనియా (rodinia) అని పిలుస్తాము. సుమారు 75 కోట్ల సంవత్సరాల క్రితం రొదీనియా రెండు ముక్కలై మధ్యలో పాంథలాస్సిక్ మహాసముద్రము (Panthalassic Ocean) ఆవిర్భవించింది. ఉత్తర అమెరికా హిమ పూరితమైన దక్షిణ ధృవము వైపు పయనించింది. అంటార్కటికా, ఆస్ట్రేలియా, భారతదేశం, అరేబియా, భావ్య కాలమున చైనాగా మారు ఖంఢ భాగాలతోనున్న రోదినియా యొక్క ఉత్తర సగ భాఘము ప్రతి గడియారపు దిక్కులో తిరిగి ఉత్తర దృవమునకేగినది. రొదినియా యొక్క రెండు భాగాల మధ్య ఉత్తర-మాద్యమ ఆఫ్రికచే నిర్మితమైన కాంగో క్రేటను (Congo Craton) మహాఖంఢము ఉండినది.55 కోట్ల సంవత్సరాల క్రితం రొదినియా రెండు సగ భాగములు కాంగో క్రేటనుతో సహా కలసి పనోషియా (Panotia) అను క్రొత్త మహాఖంఢముగా ఆవిర్భవించెను. పూర్వ కేంబ్రియన్ కాలపు జీవ లక్షణముల కల్పిత అంచనాల చార్టు. పూర్వ-కేంబ్రియన్ ఘటనలు. కాంబ్రియన్ పూర్వ కేంబ్రియన్ శకాంతమునకు పనోషియా మహాఖంఢము ఛీలడం మొదలై పాలియోజోయిక్ (paleozoic) శకము ఆరంభమైనది. ప్రాచీన ఖంఢాలైన లోరెన్షియా (Laurentia), బాల్టికా (Baltica), సైబేరియా మధ్య ఐయాపెటస్ (Iapetus) మహాసంద్రము ఉద్భవించింది. పాన్ ఆఫ్రికా (Pan-African) పర్వతాకార ఆవిరభం జరిగినప్పడు సమూహమైన గొండ్వానా (gondwana) మహాఖండము నాడీమండలము నుండి దక్షిణ ధృవము వరకు విస్తరించుకొని ఆ కాలపు అతి పెద్ద మహాఖండమైనది. అర్డోవిషియన్ (ordovician) శకములో గొండ్వానా యొక్క నాడీమండల ప్రాంతాలైన ఆస్ట్రేలియా, భారతదేశము, చైనా, అన్టార్కటికా ప్రదేశాలలో వెచ్చని నీటి బంధకములు అనగా సున్నపురాయి, ఉప్పు దొరికినవి. అదలా ఉండగా గొండ్వానా (gondwana) దక్షిణ ధృవ ప్రాతాలైన ఆఫ్రిక, దక్షిణ అమెరికాలలో మంచు, ఐసుకు సంభందంచిన పదార్థాలు దొరికినవి. సిలురీన్ 40 కోట్ల సంవత్సరాల క్రితం, పాలియోజోయిక్ శకం మధ్యలో లోరెన్షియా, బాల్టికా ఖండములు కలుస్తూ ఐయాపిటస్ మహాసముద్రమును మూసివేసినవి. ఈ మహాఖండముల సంఘట్టనము వలన అక్కడ అంచున ఉన్న ద్వీప వాలువంపులు ఒక దాని మీద ఒకటిగా ఏర్పడినవి, తద్వారా కాలెడొనైడ్ (Caledonide) పర్వతాలు స్కాండినేవియా (Scandinavia) లో, ఉత్తర మహా బ్రిటన్, గ్రీన్లాండ్,, ఉత్తర అమెరికా యొక్క తూర్పు సముద్రపు ప్రాంతాలలో ఉత్తర అప్లాచియన్ (Appalachian) పర్వతాలు ఏర్పడినవి. బహుశా పాలియోజోయిక్ శకం మధ్యలో, ఉత్తర దక్షిణ ఛైనా గొండ్వానా యొక్క ఇండో-ఆస్ట్రేలియన్ అంచును విదిలి, పాలియో-తెథిస్ (paleo-tethys) మహాసముద్రము మీదగా ఉత్తర దిశకు ఏగినది. పాలియోజోయిక్ శకము ఆరంభము మొదలుగొని మధ్య వరకు, ఉత్తర అర్ధగోళములో ఎక్కువ శాతం పాంథలాస్సిక్ మహాసముద్రము విస్తరించి ఉండినది. ఈ మహాసముద్రమును చుడుతూ, రెండు భూతల పొరలు ఒక మధ్య పొరపై ఆధారడుతూ ఇప్పటి పసిఫిక్ మహాసముద్రమును చుట్టిన "రింగ్-ఆఫ్-ఫైర్" పద్ధతిని అనుకరించు రీతిలో ఉండినది. కార్బోనిఫెరస్ 39 కోట్ల సంవత్సరాల క్రితం డెవోనియన్ (Devonian) శకారంభమైనది. ఈ శక ప్రారంభంలో పాలియోజోయిక్ నాటి మహాసముద్రాలు మూసుకు పోతూ పూర్వ పాంజియా తయారవటం మొదలైనది. ఈ శకం ప్రముఖముగా చేపలు జీవించిన కాలం. డెవోనియన్ ప్రారంభ దశలో చేపల దవడలు క్రమేణ వృద్ధి చెంది, శకాంతము వచ్చు సమయానికి చేపలు వేటాడు జీవులలో ఉత్తమ శ్రేణి లోకి చేరెను. మొక్కలు భూమిని విస్తరించుకొని మొట్ఠమొదటి బొగ్గు బంధకములు ఎండ మెండుగా మండే పర్రలతో (swamps) కనడియన్ ఆర్కటిక్ ద్వీపాలు, ఉత్తర గ్రీన్ లాండ్,, స్కాన్డినావియాలను కప్పి వేసినవి.ఆర్కటిక్ కెనడాలోని నాడీమండల ప్రదేశాలలో మొదటిసారిగా అడవులు పెరిగినవి. పాలియోజోయిక్ శకాంతములో, పన్నోషియా విభజన జరిగినప్పుడు తెరుచుకున్న అనేక మహాసముద్రములు మూసుకుపోయినవి. నాడీమండలము మధ్యగా ఉండి పాంజియా (Pangea) దక్షిణ ధృవం నుండి ఉత్తర ధృవం వరకు విస్తరించుకుని ఉండినది. దీనికి తూర్పు ప్రక్క పాలియో-తెథిస్ మహాసముద్రము పశ్చిమము వైపు పాంథలాస్సిక్ మహాసముద్రము ఆనుకొని ఉండినవి. right|thumb|250px|పేంజియా మహాఖండము right|thumb|250px|ట్రైయాస్సిక్ శకములో భూగోళము కార్బోనిఫెరస్ (Carboni-ferous) శకాంతము అగు సమయము పర్మియన్ (Permian) శకారంభంలో పేంజియా యొక్క దక్షిణ భాగములు (దక్షిణ 'దక్షిణ అమెరికా', దక్షిణ ఆఫ్రికా, అంటార్కటికా, భరత ఖండము, దక్షిణ భరత ఖండము, ఆస్ట్రేలియా) హిమపూరిత ప్రదేశాలుగా మారినవి. కార్బోనిఫెరస్ (Carboniferous) శకాంతములో నడీమండలము నడికట్టున మధ్య పేంజియా పర్వతములు బొగ్గు గనులకు కేంద్రమై ఉండెను. పర్మియన్ పర్మియన్ శకమధ్య దశలో మధ్యమ పేంజియా పర్వతములు ఉత్తర దిశగా కదిలి పొడి ప్రదేశముల వైపు జరుగుతూ తేమభరితమైన నాడీమండల గాలికి అడ్డు నిలిచి ఉత్తర అమెరికా ఉత్తర యూరోప్ ఆంతర్య ప్రదేశములు ఎడారి మాదిరిగా తయారగుటకు హేతువైనది. పేంజియా అనగా "సర్వమైన ప్రదేశము", పేంజియాను మనము మహామహాఖండముగా గుర్తించినను, అది ఆ కాలపు అన్ని ఖండములతో నిండినది కాదు.పూర్వార్ధ గోళములో పాలియో-తెథిస్ మహాసముద్రపు ఇరువైపుల కొన్ని ఖండములు దీని నుండి వేరుగా ఉండినవి. ఈ ఖండములలో ఉత్తర దక్షిణ చైనా, కారు యొక్క 'windshield wiper' అనగా అద్దము శుభ్రపరుచు చువ్వ ఆకారములో సిమ్మీరియా (cimmeria) మహాఖండము ఉండినవి. టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, ఇండో-చైనా, మలయ భాగాలతో నిండిన సిమ్మీరియా కార్బోనిఫెరస్ శకాంతములో గోండ్వానా యొక్క ఇండో-ఆస్త్రేలియన్ అంచునుండి కదిలి పోయింది . ట్రైయాస్సిక్ (Triassic) శకాంతములో సిమ్మీరియా చైనా ఖండంతో కలసి ఉత్తర దిశగా యూరేశియా వైపు జరిగి సైబీరియా దక్షిణ అంచుతో సంఘటించెను. ఈ సంఘటణ తరువాతనే ప్రపంచములోని అన్ని ఖండములు కలసి పేంజియా అను మహామహాఖంఢముగా పిలువబడినవి. కార్బోనిఫెరస్ శకారంభం 35 కోట్ల సం.క్రితం. ట్రైయాస్సిక్ , జురాస్సిక్ పేంజియా మహాఖండము ఆవిర్భవించటానికి హేతువైన ఖండముల సంఘట్టనములు డెవోనియన్ శకమునుండి ట్రైయాస్సిక్ శకాంతము వరకు కొనసాగినవి. పేంజియా ఒక్కసారిగా ముక్కలుగా చీలలేదు, దాని చీలిక మూడు ముఖ్య ఉపాఖ్యానములుగా నడిచింది. మొదటి చీలిక ఉపాఖ్యానము 18 కోట్ల సం.క్రి. మధ్య జురాస్సిక్ (Jurassic) లో మొదలైనది. ఉత్తర అమెరికా తూర్పు కోస్తా ప్రాంతాలలో, ఆఫ్రికా ఉత్తర-పశ్చిమ ప్రాంతాలలో జరిగిన అగ్నిమయమైన చురుకు చర్యల తరువాత ఉత్తర అమేరిక ఉత్తర-పశ్చిమ దిశలో కదులుతూ మధ్యమ అట్లాంటిక్ మహాసముద్రమును తెరిచింది. అదే సమయములో ఆఫ్రికా అవతల ప్రక్కన తూర్పు ఆఫ్రికా అంచులలో, అంటార్కటికాలో, మడగాస్కర్లో భీకరముగా జ్వాలాముఖులు పేలి భారత మహాసముద్ర ఆవిర్భవించుటకు సూచకమైనవి. మెసోజోయిక్ (Mesozoic) కాలమునందు ఉత్తర అమెరికా, యూరేసియా కలసి లౌరేసియా అను భాగముగా పిలువబడినవి. క్రమేణా మధ్య అట్లాంటిక్ తెరుచుకోవటంవలన లౌరేసియా గడియార దిశలో తిరిగి ఉత్తర అమెరికాను ఉత్తరమునకు, యూరేసియా దక్షిణమునకు పంపివేసింది. జురాస్సిక్ శకాంతములో ఆసియా తేమ భరిత ప్రదేశములనుండి పొడి ప్రదేశాలకు కదలడంతో, బొగ్గు గనులతో సంపన్నమైన పూర్వ ఆసియా ఎడారులతో, ఉప్పు బంధకములతో నిండిపోయింది. లౌరేసియా కదలికలవల్ల గోండ్వానాకు లౌరేసియాకు మధ్యనున్న తెథిస్ మహాసముద్రము మూసుకుపోయింది. క్రెటేషియస్ రెండవ చీలిక 14 కొట్ల సంవత్సరాల క్రితం క్రెటాషియసు శకారంభములో మొదలయినది. గొంద్వానా ముక్కలవుతూ ఉండగా దక్షిణ అమెరికా ఆఫ్రికా నుండి వేరగుచు దక్షిణ అట్లాంటికును తెరిచింది.భారతదేశం మడగాస్కరుతో సహా అంటార్కటికా, పశ్చిమ ఆస్ట్రేలియా అంచు నుండి విడిపోయి పూర్వ హిందూ మహాసముద్రమును తెరిచింది.దక్షిణ అట్లాంటికా ఒక్కసారిగా తెరుచుకోలేదు, అంచలంచలుగా దక్షిణం నుండి ఉత్తరంవైపుకి తెరుచుకుంటూ పోయింది అందుకే అది దక్షిణం వైపుకి వెదల్పుగా ఉంటుంది. ఇతర రేకు నిర్మాణ (plate tectonic) ఘఠణలు కూడా క్రెటాషియస్ శఖారంభంలో జరిగినవి.వీటిలో భాగంగానే ఉత్తర అమెరికా, యూరోపు మధ్యన చీలిక ప్రారంభము, ఐబీరియా అడ్డ గడియారపు దిశలో ఫ్రాన్స్ నుండి తిరగడము జరిగినవి.అంతే గాక మడగాస్కరు, భరత ఖండము విడిపోవడము, క్యూబా, హిస్పానియోలాలు పెసిఫికు మహాసముద్రము నుండి ఉత్పత్తి చెందుట, రాకీ పర్వతాలు ఉద్భవించుట, ఉత్తర అమెరికా పశ్చిమ అంచున అపరిచిత భూభాగాల (Wrangellia, Stikinia) రాకడ వంటి ఘఠణలు కూడా సంభవించినవి. ప్రపంచ వ్యాప్తంగా క్రెటాషియసు శకంలో వాతావరణం జురాస్సిక్, ట్రయాస్సిక్ లాగా ఈ కాలంలో కన్నా వెచ్చగా ఉండినది.ఉత్తర ఆర్కిటిక్ వ్రుత్తం, అంటర్కిటికా, దక్షిణ ఆస్ట్రేలియా ప్రాంతాలలో రాక్షస బల్లులు, పామ్ చెట్లు ఉండినవి. క్రెటాషియసు శకారంభంలో ధ్రువాల దగ్గిర హిమ భరిత మై ఉన్నా మెసొజోయిక్ శకంలో మాత్రం ఏమీ కనిపించలేదు. ఈ సామ్యమైన వాతావరణ పరిస్థితుల కారణం, భూభాగాలని లోతులేని సముద్రత్రోవలు (cretaceuos seaways) మూసివేసినవి. నాడీమండల ప్రాంతాల నుండి వెచ్చని నీరు ఉత్తరం వైపుకి తరళి ఉత్తర ధ్రువ ప్రాంతాలను వెచ్చపరిచింది.ఈ సముద్రత్రోవలు స్థానికమైన వాతావరణములని మెడితెర్రెనియన్ సముద్రములాగా సామ్యముగా చేస్తాయి, ఇందువల్ల యూరోపు వాతావరణం గుణమైన మార్పు చెందుతుంది. భూభాగాలన్నీ లోతులేని సముద్రత్రోవలతో కప్పబడటానికి కారణం అప్పటి కాలంలో సముద్ర నీటిమట్టం ఇప్పటి కన్నా 100 - 200 మీటర్లు ఎక్కువగా ఉండినది.అధిక సముద్ర నీటి మట్టనికి కారణం సముద్ర తటాకాలలో ఏర్పడిన క్రొత్త చీలికలతో భూభాగాలు నీరుతో స్థలము తప్పించబడినవి. ఈ శఖంలో సముద్రపుటరుగు వేగంగా వ్యాపించింది.విశాల గుణములతో దీర్ఘమైన ఒత్తిడితో వ్యాపించు సముద్రపుటరుగులు ఎక్కువ నీరుతో స్థలము తప్పించును . ఈ కారణంగానే సముద్రపు నీటి మట్టం పెరగడం జరుగుతుంది. ఇకోసీన్ మూడవది ఆఖరిదైన చీలిక ఘట్టము సెనోజోయిక్ శకారంభంలో జరిగింది. ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్ యూరోపు నుండి విడిపోయినవి.అంటార్క్టికా ఆస్టేలియాను విడుదల చేస్తే అది 5 కోట్ల సం.క్రి. భరత ఖండం వలె ఉత్తరం వైపు ఆసియా దక్షిణ-పూర్వ భాగాన్ని గుద్దుకునే వేగంలో జరిగింది.గత రెండు కోట్ల సంవత్సరాలుగా జరిగిన చీలికలు : అరేబియా ఆఫ్రికా నుండి చీలి ఎర్ర సముద్రమును తెరవటం, జపాను పశిఫికులో పూర్వ దిశగా జరిగి జపాన్ సముద్రాన్ని తెరవటం, కాలిఫోర్నియా, ఉత్తర మెక్సికో ఉత్తరం వైపు జరిగి కాలిఫోర్నియా గల్ఫును తెరవటం. సెనోజోయికులో చాలా మహాసముద్రాలు తెరుచుకున్నప్పటికీ, గత 6 కోట్ల సంవత్సరాలను మహాఖంఢముల తీవ్ర సంఘట్టనములకు చిహ్నము.వీటిలో ప్రాముఖ్యతగలది 5 కోట్ల సం.క్రి. మొదలైన భారత ఖంఢమునకు యూరేసియాకు మధ్య జరిగిన సంఘట్టనము.క్రెటషియస్ శకాంతములో భారత ఖండము యూరేసియాను సంవత్సరానికి 15-20 సె.మీ.ల వేగంతో చేరుకున్నది, ఇది రేకు నిర్మాణ వేగాలలో ఇది పెద్ద రికార్డు.క్రెటేషియస్ శకాంతములో ద్వీపాల అంచులకు గుద్దుకొన్న తరువాత ఉత్తర భారత ఖండము యూరేసియా కింది నరముగా మారి టిబెటాన్ ప్లాటూను ఎత్తినది.ఆసక్తికరంగా, సంఘట్టణ వలన ఏర్పడిన విధ్వంసాన్ని భారత ఖండానికి బదులుగా ఆసియా ఖండమే భరించింది.దీనికి కారణం భారత ఖండము బలమైన సముద్రపు లిథోస్ఫియర్ పైన దృఢమైన రాతి వంటి లిథోస్ఫియర్ కాని ఆసియా ఇంకా సంఘట్టణల దెబ్బలతో వేడిగా ఉన్న వివిధ ఖండాల కుప్ప.భారత ఖండము వీటిని గుద్దుకోగానే ఇవన్నీ ఉత్తరంవైపునకు తూర్పువైపునకు నొక్కుకు పోయినవి.ఈ ప్రాంతాలలో భోకంపాలు ఇప్పటిదాకా కొనసాగుతోనే ఉన్నాయి. మైయోసీన్ ఆసియా-భారత ఖండాల సంఘట్టణ అనేక ఇతర సంఘట్టణాలతో కలసి టెథిస్ మహాసముద్రమును మూసివేసినవి.తూర్పు నుంచి పడమరకు ఈ సంఘట్టణలు : పైరినీస్ పర్వతములు స్పెయిన్-ఫ్రాన్స్ ద్వారా, ఆల్ప్స్ పర్వతములు ఇటలి, ఫ్రాన్స్, స్విట్జర్లాన్డ్ ద్వారా, హెల్లెనైడ్-డినరైడే పర్వతములు గ్రీస్, టర్కీ, బల్కన్ రాష్ట్రాల ద్వారా, జగ్రోస్ పర్వతాలు భారత, ఆసియాల ద్వారా ఉద్భవించినవి. మహాఖండాల సంఘట్టణాలతో లిథోస్ఫియర్ అడ్డంగా నలిగి ఎత్తైన పర్వతాలు ఆవిర్భవించాయి.ఖండాలు అదే విస్తారమును ఆక్రమించినా వాటి ప్రదేశము కొద్దిగా తగ్గినది.తద్వారా సెనోజోయిక్ శకంలో ప్రపంచ వ్యాప్తంగా సముద్ర ప్రదేశము కొద్దిగా పెరిగింది.సముద్రపు తట్టలు పెద్దవిగనుక అవి ఎక్కువ నీటిని నిలుపగలవు.తత్ఫలితంగా గత 6 కోట్ల సంవత్సరాలుగా సముద్రమట్టం తగ్గింది.ప్రధానంగా ఖండాల సంఘట్టణల (డెవోనియన్ శకారంభం, కార్బోనిఫెరస్ శకాంతం, పెర్మియన్, ట్రైయాస్సిక్) పర్యంతము సముద్ర మట్టము తక్కువగా ఉండినది. ఆఖరి మంచు శకం సముద్ర మట్టం తక్కువున్నప్పుడు భూఖండాలు అత్యావశ్యకమై, భూచరాలు క్రమముగా పెరిగి, ఖండాల మథ్య వలస దారులు తెరుచుకొని, వాతావరణం చాలా ఋతుపక్షంగా ఉంటుంది, ముఖ్యంగా ప్రపంచ వాతావరణం చల్లబడుతుంది.దీనికి కారణం భూమి సూర్యుని శక్తిని ఆకాశములోకి తిప్పి వెనుకకి పంపివేసేది, కాని సముద్రాలు ఆ శక్తిని పీల్చుకొనేవి. అంతేగాక భూభాగాల మీద తెల్లటి శాశ్వతమైన మంచు రేకులు పెరిగి మరింత శక్తిని ఆకాశంలోకి తిప్పి పంపివేస్తాయి.ఖండాల మీద మంచు తయారవటం వలన సముద్ర మట్టం ఇంకా తగ్గి భూభాగాలు పెరిగి, భూమిని చల్లగా చేసి, మరింత మంచు తయారవుతోంది, ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడి సారాశం ఏమిటంటే: ఒక్కసారి భూమి చల్లబడటం (లేదా వేడెక్కట్టం) మొదలైతే నిశ్చయమైన బిస భూమి వాతావరణ సిద్ధాంతమును మరింత చల్లగా (లేదా వేడిగా) మార్చేస్తాయి.సెనోజోయిక్ శకాంతంలో భూమి చల్లబడటం మొదలైనది.మంచు రేకులు మొదట అంటార్క్టికాలో తయారై ఉత్తర అర్ధగోళమునకు వ్యాపించ సాగింది.గత 50 లక్షల సంవత్సరాలగా భూమి ఒక పెద్ద మంచు శకంలో ఉంది.ఇంత చల్లగా ఉండటం భూమి చరిత్రలో చాలా కొద్ది సార్లు మాత్రమే జరిగింది. ప్రస్తుత భూమి గత 150 సంవత్సరాలుగా మానవజాతి భూమి చుట్టూ గ్రీన్హౌస్ వాయువులు తీవ్రత పెంచారు, ముఖ్యంగా బొగ్గుపులుసు వాయువు (carbondiaoxide).తత్ఫలితంగా, ప్రపంచ వాతావరణం వేడిగా మారుతున్నది.భూమి వాతావరణం వెచ్చబడితే, క్రమేనా ధృవాల మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుతుంది.ఇది భూభాగాన్ని తగ్గిస్తుంది, ఇంకా తక్కువ శక్తి ఆకాశంలోకి తిరిగి వెళ్తుంది.ఈ అధిక వెచ్చదనంతో మంచు కరిగి సముద్రాలు భూభాగాలను వరదలతో ముంచెత్తుతాయి, ఫలితంగా వెచ్చదనం పెరుగుతుంది.ఈ పరిణామాల వల్ల నిశ్చయమైన బిస భూ వాతావరణాన్ని మంచు ఇంటి నుంచి పచ్చ ఇంటి తత్వానికి మార్చేస్తుంది, సరిగ్గా రాక్షస బల్లుల కాలం మాదిరిగా. వనరులు, మూలాలు రొదీనియా బొమ్మలు బయటి లింకులు వర్గం:భూగోళశాస్త్రం
ఖమ్మం
https://te.wikipedia.org/wiki/ఖమ్మం
"ఖమ్మం, భారతదేశం లోని తెలంగాణ రాష్ట్ర(...TRUNCATED)
కంప్యూటరు
https://te.wikipedia.org/wiki/కంప్యూటరు
"ఆటలు - సాఫ్ట్‌వేర్‌ - హార్డ్‌వేర్‌- చర(...TRUNCATED)
ఊరగాయ
https://te.wikipedia.org/wiki/ఊరగాయ
"ఊరగాయ దక్షిణ భారతదేశ ఆహార పదార్థం. దీ(...TRUNCATED)
తెలుగుదనం
https://te.wikipedia.org/wiki/తెలుగుదనం
"thumb|తెలుగు తల్లి విగ్రహం\nసాధారణంగా తె(...TRUNCATED)
ఖగోళ శాస్త్రం
https://te.wikipedia.org/wiki/ఖగోళ_శాస్త్రం
"thumb|right|250px| హబుల్ టెలీస్కోపు నుండి వచ్చి(...TRUNCATED)
README.md exists but content is empty. Use the Edit dataset card button to edit it.
Downloads last month
0
Edit dataset card