text
stringlengths
101
143k
timestamp
stringlengths
0
20
url
stringlengths
0
1.48k
source
stringclasses
5 values
భేషజాల కప్ప | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com Sat 29 Feb 22:53:11.439725 2020 ఒకరోజు ఆ చేప ఈదుతూ మడుగు ఒడ్డుకు వస్తుంటే ఒక కప్ప చూసింది. కప్ప మడుగుకి కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు. చేపను చూసి కప్ప, ''ఏరు చేపా! నువ్వెందుకు మడుగు ఒడ్డుకు వస్తున్నావు? ఒడ్డుకు రావాలంటే నా అనుమతి తీసుకోవాలి'' అంటూ అరవడం మొదలెట్టింది. కప్ప మాటలకు చేప ఖంగుతింది. అప్పటివరకు దానితో ఎవరూ అలా మాట్లాడలేదు. అది కప్పను ఏమీ అనకుండా మడుగులోపలికి వెళ్లిపోయింది. అయినా కూడా ఆ కప్ప చేపను వదల్లేదు. మడుగులోకి దూకి చేప వెనకాలే వచ్చింది. ''నువ్వొక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా? నీటిలో నుండి బయటకు వచ్చినట్టు కనీసం కల కూడా కనలేవు. కానీ నేను, నీటిలో ఈదగలను, నేలమీద బతకగలను'' అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప. చేపమాత్రం ఏమీ మట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కనీసం కప్ప వైపు తిరిగి చూడను కూడా చూడ లేదు. దాంతో కప్పకు కోపమొచ్చింది. కప్ప తన గొప్పలను ఏకరువు పెడుతూ ఉండిపోయింది. ''నువ్వు కనీసం మాట్లాడగలవా? నేను శ్రావ్యంగా పాడగలను కూడా'' అంటూ మడుగులో నుంచి ఒడ్డుకు ఎగిరి ''బెక బెక'' మని అరవడం మొదలెట్టింది. అలాగే చాలాసేపు అరవసాగింది. కప్ప బెకబెకలు పక్కనే పుట్టలో నిద్రపోతున్న పామును నిద్రలేపాయి. తనను నిద్రలేపిందెవరో చూద్దామని కోపంగా పుట్ట బయటకొచ్చిన పాముకు మడుగు ఒడ్డున కప్ప కనబడింది. అంతే ఒక్క ఉదుటున కప్పపై దూకి కప్పను మింగేసింది. చేప చల్లగా నీటిలోకి జారుకుంది.
2020/05/29 01:38:57
http://api.navatelangana.com/Sopathi/964097
mC4
నగరి: టీడీపీ ఆరిపోయే దీపమని, అక్రమ కేసులకు భ యపడేది లేదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. పట్టణ పరిధిలోని సీవీఆ ర్ కళ్యాణ మండపంలో ఆదివారం ఆర్కే రోజా అధ్యక్షతన నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ముఖ్యఅతిథులుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణకరరెడ్డి, జిల్లా కన్వీనర్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, పూతలపట్టు ఎమ్మెల్యే సు నీల్‌కుమార్, సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జీ ఆది మూలం, రాష్ట్ర సంయుక్త కమిటీ సభ్యుడు పోకల ఆశోక్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడిని నియోజకవర్గ ప్రజలు ఛీ కొట్టినా బుద్ధి రాలేదన్నారు. ఈ అక్కసుతోనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రోటోకాల్ పేరుతో పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రశ్నించిన వారిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కే సులు పెట్టి జైలుకు పంపిన ఘనత ఎమ్మెల్సీకే దక్కుతుందని తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కేజే కుమార్ కుటుంబం, నాయకులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శాసనసభ్యురాలైన తనపై నగరి జాతరలో దాడి జరిగి రెండేళ్లు గడిచినా ఇంత వరకు ఏం చర్యలు తీసుకున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఈటీపీ ప్లాం ట్ ప్రారంభానికి అడ్డుపడుతూ, అధికారులను బెదిరి స్తూ, అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. 2019లో జగనే సీఎం చంద్రబాబు మోసపూరిత హామీలు ప్రజలకు తెలిసిపోయాయని, 2019లో ఎన్నికలలో జగనన్న సీఎం కావడం ఖాయమని రోజా పేర్కొన్నారు. అంత వరకు నాయకులు, కార్యకర్తలు ఓర్పుతో పని చేయాలని పిలుపునిచ్చారు. గడప గడపకూ వైఎస్సార్ ద్వారా టీడీపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాక్షస పాలన కేజే కుమార్‌పై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, దీనికి భయపడేది లేదని మున్సిపల్ వైస్ చైర్మన్ పీజీ నీలమేఘం అన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీ తుడుచిపెట్టుకొని పోతుందని, రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న పాలన రావాలని మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి అన్నారు. ఓడిపోయిన ముద్దుకృష్ణమనాయుడు నామినేట్ పదవి తీసుకుని ప్రజల్లో తిరుగుతూ చిచ్చుపెటుతున్నారని రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి శ్యామ్‌లాల్ అన్నారు. అంతకుముందు అతిథులను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. సభావేదికపై జ్యోతి వెలిగించి, వైఎస్ చిత్రపటానికి పూ లమాల వేసి నివాళ్లు అర్పించారు. సమావేశంలో విజయపురం, పుత్తూరు, నిండ్ర, వడమాలపేట మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
2022-12-06T07:10:12Z
http://www.ysrcongress.net/2016/07/blog-post_80.html
OSCAR-2301
..హోమియో చికిత్స చికిత్స డయాబెటిస్ కి చెక్ ద్వారా డా. శ్రీకాంత్ మోర్లావర్ (CMD) మధుమేహం, ఈ వ్యాధితో బాధపడే వారి జీవితంలో తీపి అనే మాట కరువే, జీవితాంతం మందులు వాడడం, తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించడం క్రమం తప్పకుండా మందులు వాడినా రక్తం లోని చక్కర స్థాయిలు నియంత్రణలోకి రాకపోవడం ఇవన్ని వారు ఎదుర్కునే బాధలే ఇలాంటి వారికి కాన్స్టిట్యూషనల్ హోమియో మందుల ద్వారా ఉపశమనం లభించే అవకాశం ఉంది. దయాబెటిస్ మన శరీరంలో ఉపయోగించకుండ మిగిలిపోయిన చక్కర సాధారణ స్థాయికంటే ఎక్కువ మోతాదులో ఉండడాన్ని దయాబెటిస్ అంటాము దయాబెటిస్ 3 రకాలు: టైప్ 1 డయాబెటిస్ : 20 సంవత్సరాల వయస్సు లోపు కనిపించే ఈ సమస్య శరీర రోగనిరోధక వ్యవస్థ క్లోమ గ్రంథిలోని ఇన్సులిన్ ని ఉత్పత్తికి చేసే కణాలను నాశనం చేయడం వలన కలుగుతుంది టైప్ 2 దయాబెటిస్: 30 సంవత్సరాల వయసు్సు దాటిన వారిలో అవసరం అయిన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోయిన, ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ శరీర కణాలు సరిగా ఉపయోగించుకోలేక పోయినా ఈ సమస్య ఏర్పడుతుంది జిసటషనల్ డయాబెటిస్ : ఇది గర్భణీలలో కనిపిస్తుంది ల లక్షణాలు: దాహం, ఆకలి, మూత్రవిసర్జన అధికంగా అవడం, అసంకల్పితంగా బరువు తగ్గడం, త్వరగా నీరసించిపోవడం, ఒళ్లునొప్పులు గాయాలు నయం కాకపోవడం, చర్మ వ్యాధులు ఎక్కువగా రావడం, సెక్స్ కోరికలు తగ్గిపోవడం, కాళ్ళు మరియు చేతుల్లో తిమ్మిర్లు మంటలు 1000 అనిపించడం దుష్ట్రభావాలు: వ్యాధిని నిర్లక్ష్యం చేసి ఎక్కువ కాలం చెక్కర స్థాయిలు నియంత్రణలో లేకపోయినట్లయితే ఇది కళ్ళు, గుండె, కిడ్నీలు మరియు నరాలను దెబ్బతీస్తుంది చికిత్స: హొమియోకేర్లో మేము కాన్స్టిట్యూషనల్ హోమియో వైద్య విధానాన్ని అనుసరించి దయాబెటిస్ వ్యాధికి కాకుండా దయాబెటిస్తో బాధపడే వ్యక్తికి వైద్యం అందించడం ద్వారా వారిలోని మెటబాలిజం మెరుగుపడి రక్తంలోని చక్కర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. తద్వారా మనం దీని వలన కలిగే దుష్ప్రభావాలను దూరం చేయవచ్చు ..హోమియోకేర్ ద్వారా రోగనిరోధక వ్యవస్థకు బలం ప్రస్తుత చల్లటి వాతావరణానికి తగ్గట్టుగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాలా మంది తరచూ జబ్బు పడుతుంటారు. దీనికి కారణం మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలహీనపదదమే ప్రధాన కారణం సాధారణంగా రోగనిరోధక వ్యవస్థ అనేది మన శరీరంలోని వివిధ అవయవాలు వాటి ప్రక్రియల సమ్మేళనంగా వ్యాధులను కలిగించే బాక్టీరియా వైరస్లు మొదలైన వాటినుండి శరీరానికి రక్షణ కలిపించే ఒక కీలకమైన వ్యవస్థ., ఇది కొంత వరకు వారసత్వంగా ఏర్పడితే మరికొంత వరకు మనం అవలంభించే జీవనవిధానాల ద్వారా ఏర్పడుతుంది రోగనిరోధక వ్యవస్థ సమతుల్యంగా ఉన్నంత వరకు ఆరోగ్యవంతంగా ఉంటాం. రోగనిరోధక వ్యవస్థ మామూలు స్థాయికంటే ఎక్కువ ఉత్తేజంగా ఉంటే రుమటాయిడ్ ఆర్డరైటిస్, సోరియాసిస్ వంటి వ్యాధులు మరియు తక్కువగా ఉన్నట్లయితే జలుబు వంటి వ్యాధులు కలుగుతుంటాయి ఇతర వైద్య విధానాలలో కేవలం వ్యాధి లక్షణాలను మాత్రమే తగ్గించడం వలన వ్యాధి పూర్తిగా అణిచివేయబడి వ్యాధి మూలాలు శరీరంలో అలాగే ఉండిపోతాయి. తద్వారా వ్యాధి మళ్ళీ తిరగబెట్టేదిగా ఉంటుంది, అది శరీరంలో నుండి పూర్తిగా తొలగించబడాలంటే మనం ప్రకృతి సిద్ధమైన వైద్యాన్ని పాటించడం అవసరం. అలాంటివాటిలో హోమియోపతి ఒకటి. 00 ఒక్కో మనిషికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వారి యొక్క ప్రత్యేక మానసిక మరియు శరీర లక్షణాలను గుర్తించి తగిన చికిత్స ఇవ్వడం ద్వారా అసమతుల్యతలకు గురి అయిన రోగనిరోధక వ్యవస్థ సరికాబడడమే కాకుండా బలాన్ని పొందడం చేత వ్యాధి మూలాలనుండి నశింపబడి మరల తిరగబెట్టకుండా నియంత్రణలో ఉంటుంది. ఈ చికిత్సనే మనం కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ చికిత్స అంటాము హోమియోకేర్ ఇంటర్ నేషనల్లో ఈ విధమైన చికిత్సను అందిస్తున్నందున ఎన్నో మొండి దీర్ఘకాలిక వ్యాధులైన సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్, డయాబెటిస్, SLE. సైనసైటిస్, ఆస్తమా వంటి ఎన్నో వ్యాధులు నియంత్రించడంలో సత్ఫలితాలను పొందడం జరుగుతుంది www.homeocarn ది హోమియోకేర్ మీకు తెలుసా డయాబెటిస్ (D ఇంటర్ నేషనల్ వరల్డ్-క్లాస్ హోమియోపతి ప్రాణాంతకరం అని స్పెషాలిటీ చికిత్సలు డయాబెటిస్ | కిడ్నీ సమస్యలు | లైంగిక బలహీనత పెలఫెరల్ న్యూరోపతి | కొలెస్టాల్ సమస్యలు | డయాబెడిక్ సమస్యలు టోల్ ఫ్రీ 92480 90246 హోమియోకేర్ "ఆప్" డౌన్లోడ్ చేసుకోండి 0డిస్కాంట పొందండి Use Code: SFM10 కి పైగా క్లీనిక్స్ తెలంగాణ | ఆంధ్రప్రదేశ్| కర్ణాటక | తమిళనాడు, పుదుచ్చేరి
2021-03-02T01:30:57Z
https://visual.ly/community/Infographics/health/homeopathy-treatment-diabetes-2
OSCAR-2109
స్టే హోం కాదు.. ఇక స్టే అలర్ట్ నినాదం.. కన్ఫ్యూజ్ కావొద్దు | Sugerly Home Health స్టే హోం కాదు.. ఇక స్టే అలర్ట్ నినాదం.. కన్ఫ్యూజ్ కావొద్దు స్టే హోం కాదు.. ఇక స్టే అలర్ట్ నినాదం.. కన్ఫ్యూజ్ కావొద్దు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సడలింపులు మరిన్ని వచ్చాయి. కేవలం కంటైన్ మెంట్ జోన్లలో ఆంక్షలు. మిగతా ప్రాంతాల్లో ఫ్రీ. ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డెక్కాయి. మందు షాపులు ఎప్పుడో ఓపెన్ చేశారు. జన జీవనం యథావిధిగా జరుగుతుంది. స్టే హోం కాదు.. స్టే అలర్ట్ ప్రజలు అంతా ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దేశంలో లక్ష కేసులు నమోదు అయ్యాయి. 5వేలు ఉన్నప్పుడు లాక్ డౌన్ పెట్టి.. లక్ష కేసులు ఉన్నప్పుడు వదిలేయటం ఏంటీ అని అందరూ ఆందోళన చెందుతున్నారు. ప్రతి రోజు దేశవ్యాప్తంగా 5వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే స్టే హోం నినాదం పాత అయిపోయింది. ఎందుకంటే ఎవరికి వారు బయటకు వచ్చేస్తున్నారు. సో.. ఇక నుంచి స్టే హోం కాదు.. స్టే అలర్ట్ నినాదం మంచిది అంటున్నారు నిపుణులు. ఈ విషయంలో కన్ఫ్యూజ్ వద్దని.. జస్ట్ స్టే అలర్ట్ అంటూ ముందుకు సాగాలని అంటున్నారు. కన్ఫ్యూజ్ అవుతున్న ప్రజలు ఇప్పటి వరకు జరిగింది ఒకటి.. ఇక జరగబోతున్నది ఒకటి అంటున్నారు వైద్య, ఆరోగ్య శాఖ నిపుణులు. లాక్ డౌన్ కు కాదు.. కరోనాకు గేట్లు ఎత్తింది ప్రభుత్వం అని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఎలాంటి ఆందోళన, కన్ఫ్యూజ్ కాకుండా ముందుకు సాగాలి అంటున్నారు. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవటమే ముఖ్యం అంటున్నారు. అప్పుడే కరోనా నుంచి దూరంగా ఉంటామని చెబుతున్నారు. కరోనాతో సహజీవంతోపాటు కాపురం కూడా చేయాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయని.. స్టే అలర్ట్ నినాదంతోనే దీన్ని దూరం చేయొచ్చు అంటున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు స్టే అలర్ట్ వాక్సిన్ వచ్చే వరకు స్టే అలర్ట్ సో బెటర్ అంటున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. ఇతరులకు దూరంగా ఉంటూ.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. విధిగా మాస్క్ లు ధరించటం, బయట తిరిగే సమయంలో శానిటైజర్ దగ్గర పెట్టుకోవటం, ఇతరుల ఆఫీసులకు వెళ్లినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవటం, వారితో మాట్లాడటం వంటి చేయకూడదు అని చెబుతున్నారు. బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయటం లేదా చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవటం ఎంతో మంచిది అంటున్నారు. అదే విధంగా దుస్తులు కూడా దూరంగా ఉంచాలని చెబుతున్నారు. స్టే హోం అనేది పాత నినాదం.. ఇక నుంచి స్టే అలర్ట్ అనేది కొత్త నినాదం. కరోనాతో సహజీవనం చేస్తూనే.. అప్రమత్తంగా ఉండటం అనేది ఇప్పుడు చేయాల్సిన పని..
2021/07/27 10:45:13
https://sugerly.com/life-style/not-stay-home-its-stay-alert-from-now-1438.html
mC4
దారులు వేరాయే Tue Nov 30 2021 15:18:04 GMT+0000 (Coordinated Universal Time) BY TV5 Telugu12 Nov 2019 10:34 AM GMT TV5 Telugu12 Nov 2019 10:34 AM GMT తెలంగాణలో రెవెన్యూ సంఘాలు రెండుగా చీలాయి. విజయారెడ్డి హత్య తరువాత ఆందోళనలు ఉధృతం చేసిన రెవెన్యూ సంఘాలు ఇప్పుడు ఎవరికి వారు వేర్వేరుగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. ట్రెసా ఆధ్వర్యంలో కీలక అధికారులంతా తమ కార్యాచరణను నిర్ణయించారు. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చారు. ఇటు ప్రభుత్వంతో ట్రెసా అధికారుల చర్చలు సఫలం కావడంతో.. నిరసన కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నామని ప్రకటించారు. మరోవైపు తెలంగాణ రెవెన్యూ జేఏసీ మాత్రం ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటోంది. బుధ, గురు, శుక్ర వారాల్లో రెవెన్యూ కార్యాలయాల్లో పెన్‌డౌన్‌కు పిలుపు ఇవ్వడంతో పాటు.. ప్రజా ప్రతినిధులకు మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 15న ఎమ్మార్వో కార్యాలయాల్లో వంటా వార్పు కార్యక్రమం చేపట్టి ప్రజలకు వడ్డించాలని నిర్ణయించారు. కేవలం ప్రజలకు అత్యవసరమైన సేవలు మినహా అన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
2021/11/30 15:18:05
http://www.tv5news.in/2019/11/12/revenu-emplyees-strike/
mC4
పునర్నవి భూపాలం.. ఒక్కసారిగా బిగ్ బాస్ రియాల్టీ షో ద్వరా అనూహ్యమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ - పునర్నవి మధ్య బిగ్ హౌస్ రొమాన్స్ ఇందుకు కారణం కావొచ్చు. రొమాన్స్ అంటే ఇంకేదో అనుకునేరు.. అదో కెమిస్ట్రీ అంతే. కాస్త ఘాటైన స్నేహమది. బిగ్ బాస్ రియాల్టీ షోలో అదొక భాగం అంతే. అంతకు మించి రాహుల్ కీ తనకీ మధ్య ఎలాంటి వేరే సంబంధాలు లేవని పునర్నవి ఇప్పటికే స్పష్టం చేసింది. రాహుల్ కూడా పునర్నవి తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని చెప్పాడు పలు సందర్భాల్లో. అవన్నీ పక్కన పెడితే, బిగ్ బాస్ తనకు చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందంటున్న పునర్నవి, ప్రస్తుతం కొన్ని సినిమాలతోపాటు వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నట్ల చెప్పింది. రియల్ లైఫ్ విషయానికొస్తే, వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని సీక్రెట్స్ అలాగే వుంటాయనీ, వాటిని బయటకు చెప్పలేననీ పునర్నవి ఓ ప్రశ్నకు బదులిచ్చింది. పెళ్ళి ఆలోచనలేవీ ఇప్పట్లో ఈ భామ పెట్టుకోవడంలేదట. 6-7 సంవత్సరాల తర్వాత పెళ్ళి గురించిన ఆలోచనలు చేస్తుందట. కెరీర్ జాగ్రత్తగా చూసుకోవడంతోపాటుగా, చదువుకుంటానని పునర్నవి చెప్పింది. బిగ్ బాస్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుతూ, అదొక అందమైన అనుభూతి అనీ, అక్కడి పరిస్థితులు వేరే వుంటాయనీ, తాను ఆ షో ద్వారా చాలా నేర్చుకున్నాననీ మంచి స్నేహితులు తనకు దొరికారనీ చెప్పుకొచ్చింది.
2022-12-02T20:44:38Z
https://telugu.iqlikmovies.com/viewnews/punarnavi-latest-news/14957
OSCAR-2301
సీఎం వైఎస్‌ జగన్‌: కళ్లజోడు బాగుంది.. | YS Jagan Visits Guntur Police Parade Ground Over YSR Kanti Velugu - Sakshi Nov 08, 2019, 06:44 IST గురువారం గుంటూరు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ స్టాల్స్‌లో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఇచ్చిన కళ్ల జోడు పెట్టుకుని స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తోన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌
2020/11/30 00:04:48
https://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-visit-guntur-police-parade-ground-1238422
mC4
నిత్య చైతన్యధీరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనుడు - 24x7telugu ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా వైఎస్ జగన్ పాలన నడుస్తోంది. వైఎస్ జగన్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచీ ఎన్నో ఎళ్లుగా పరిష్కారం కానీ విషయాలను లైన్ క్లియర్ చేశారు. ముందుగా పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ.. వీకాఫ్ ను తేవడంలో గొప్ప నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యంగా పోలీసు అధికారలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి వారి అధికారాలను పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. ఆ తర్వాత అనేక శాఖలను ఎంతో వేగంగా ప్రక్షాళన చేస్తూ అద్భుత రీతిలో పరిపాలన సాగిస్తున్నారు. ముఖ్యంగా ఇసుక విధానంలో కొత్త విధానాన్ని అమలు చేయడం, వివిధ ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్ జరపడం, అమరావతిలోనే అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందించడంలో చాలా చాకచక్యంలో వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏపీలో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి సాగించాలంటే.. మూడు చోట్లా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని వైఎస్ జగన్ భీష్మించుకొని కూర్చున్నారు. అది అమరావతిలోని కొంతమంది రైతులకు నచ్చడం లేదు. ఉద్యమాలు చేస్తున్నాయి. అయినా కానీ..వైఎస్ జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అందుకోసం అడ్డువస్తోన్న శాసనమండలినే లేపద్దామని.. అసెంబ్లీలో మండలి బిల్లు తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపారు. అయితే ఇప్పుడది కేంద్రం కోర్ట్ లో ఉంది. కేంద్రానికి చిక్కు వచ్చి పడింది. బీజేపీ వైఎస్ జగన్ తో లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. దీంతో వైసీపీకి అనుకూలంగా మండలిరద్దు తీర్మానాన్ని సునాయాసంగా ఓకే చేసి పంపుతుందనేది వైఎస్ జగన్ ధీమా. అదే టెంపోతో జగన్ నిర్ణయాలు తీసుకుంటూ ఏపీలో నిత్యం సంచలనంగా రాజకీయాలు చేస్తూ.. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్నారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా తాను అనుకున్నది.. అది ప్రజలకు ఉపయోగం కలిగేది ఎంతటిదైనా ఏమాత్రం ఆలోచించకుండా చేసుకుంటూ పోతున్నారు. అందులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తగ్గడం లేదు. చివరకు తమతో పెట్టుకున్న వారే దిగివచ్చి ఏదోలా ఆ నిర్ణాయలన్నింటినీ విజయవంతం చేసేందుకు సహకరిస్తున్నారు. నిజానికి మూడు రాజధానులు అనేది పేరుకు మాత్రమే.. రాజధాని ఒక్కటే ఉంటుంది. అన్ని ప్రాంతాలూ డవలప్ కావడంలో భాగంగా అలా పేరు పెట్టారనేది రాజకీయ విశ్లేషకుల భావన. కానీ.. ఇక్కడ వైస్ జగన్ ఇదే ట్యాగ్ లైన్ గా తీసుకొని జనామోదాన్ని పొందారు. హ్యాట్సాప్ జగన్ సార్.. మీ గడ్స్… మీ తెగువ.. మీ.. టెంపో.. మీ దూరపు చూపు.. ఎల్లప్పుడు ఏపీ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలవాలని కోరుకుంటోంది.
2021/09/23 02:35:07
https://www.24x7telugu.com/2020/03/03/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%9A%E0%B1%88%E0%B0%A4%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A7%E0%B1%80%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%8F%E0%B0%AA%E0%B1%80-%E0%B0%B8/
mC4
తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) అధ్యక్షుడిగా సందీప్‌కుమార్ మ‌క్తాల‌ ఎన్నిక – 24×7 Online News September 16, 2018 September 17, 2018 admin 492 Views 0 Comments టీటా అధ్యక్షుడిగా సందీప్‌కుమార్ మ‌క్తాల‌ ఎన్నిక – 11 సెట్ల ఏకైక అభ్య‌ర్థిగా సందీప్‌కుమార్ మ‌క్తాల‌ – ఐటీ వర్గాల్లో సంద‌డిగా గ్లోబ‌ల్ క‌మిటీ అద్య‌క్షుడి ఎన్నిక‌ – ఐటీ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను అన్ని పార్టీల మేనిఫెస్టోల క‌మిటీకి అందించ‌నున్న టీటా సెప్టెంబ‌ర్ 16, 2018, హైద‌రాబాద్ః తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) త‌న నూత‌న గ్లోబ‌ల్ కమిటీ అధ్య‌క్ష ఎన్నిక‌ను పూర్తి ప్ర‌జాస్వామ్య‌‌బ‌ద్దంగా, పార‌ద‌ర్శకంగా పూర్తి చేసుకుంది. టీటా గ్లోబ‌ల్ క‌మిటీ అధ్యక్షుడిగా సందీప్‌కుమార్ మ‌క్తాల వ‌రుస‌గా మూడోసారి ఎన్నికైన‌ట్లు రిట‌ర్నింగ్ అధికారి అశ్విన్‌చంద్ర వ‌ల్ల‌బోజు వెల్ల‌డించారు. వివిధ దేశాల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌గా 12 ద‌ర‌ఖాస్తులు రాగా వీటిలో 1 ద‌ర‌ఖాస్తు చెల్ల‌లేదు. వివిధ విభాగాల నుంచి టీటా స‌భ్యులు ద‌ర‌ఖాస్తులు దాఖ‌లు చేశారు. ఐటీ కంపెనీల య‌జ‌మాన్యాల‌ నుంచి నాగ‌రాజు మ‌ర్యాల మ‌రియు స‌భ్యులు, గ్లోబ‌ల్ వ‌ర్కింగ్ టీం నుంచి రాణాప్ర‌తాప్ బొజ్జం మ‌రియు స‌భ్యులు, మ‌హిళల నుంచి శ్రీ‌ల‌త చింతల మ‌రియు స‌భ్యులు, మెక్సికో నుంచి రాజ‌శేఖ‌ర్ రైడ మ‌రియు స‌భ్యులు, విద్యార్థుల నుంచి సౌమ్య మ‌రియు స‌భ్యులు, ఉరుగ్వే నుంచి నిరంజ‌న్ మ‌రియు స‌భ్యులు, కెన‌డా నుంచి రంజీత్ గ‌వ్వ‌ల‌, అమెరికా నుంచి మ‌నోజ్ తాటికొండ మ‌రియు స‌భ్యులు, న్యూజిలాండ్ నుంచి క‌ట్ల వినిత్ రెడ్డి మ‌రియు స‌భ్యులు, ద‌క్షిణాఫ్రికా నుంచి కిషోర్ పుల్లూరి మ‌రియు స‌భ్యులు, సింగ‌పూర్ నుంచి క‌లా సంతోష్ మ‌రియు స‌భ్యులు, నేహా బండారి మ‌రియు బృందం నామినేష‌న్లు దాఖ‌లు చేశార‌ని ఆయ‌న వివ‌రించారు. ద‌ర‌ఖాస్తుదారులంద‌రూ త‌మ అధ్య‌క్ష అభ్య‌ర్థి సందీప్ మ‌క్తాల అని పేర్కొంటూ నామినేష‌న్లు దాఖలు చేశారు. కాగా, సోష‌ల్ ఒపీనియ‌న్ పోల్‌లో కూడా సందీప్‌కుమార్ మ‌క్తాల‌కు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ద‌క్క‌డం విశేషం. #ISupportMakthala హ్యాష్‌ట్యాగ్‌తో పెద్ద ఎత్తున టెకీలు, యాజ‌మాన్యాలు, ఎన్నారైలు సందీప్‌కుమార్ మ‌క్తాల అధ్య‌క్ష అభ్య‌ర్థిత్వానికి మ‌ద్ద‌తు తెలిపారు. టీటా ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు స‌మ‌ర్థంగా ముందుకు తీసుకుపోవ‌డంతో పాటుగా ఎంతో అభివృద్ధి చెందించిన ఆయ‌న నాయ‌క‌త్వాన్ని తాము బ‌ల‌ప‌రుస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. నూతనంగా ఎన్నికయిన ఈ కమిటీ 2019-2022 కాల‌ప‌రిమితి కోసం ప‌నిచేయ‌నుంది. రిట‌ర్నింగ్ అధికారిగా అశ్విన్ చంద్ర వ‌ల్ల‌బోజు, అసిస్టెంట్ రిట‌ర్నింగ్ అధికారి వెంక‌ట్‌ వ‌నం వ్య‌వ‌హ‌రించారు. సందీప్ మక్తాల సార‌థ్యంలోని బృందం గ్లోబ‌ల్ వ‌ర్కింగ్ క‌మిటీ బృందాన్ని త్వరలో ప్ర‌క‌టిస్తామ‌ని వివ‌రించారు. 2010లో ప్రారంభ‌మైన తెలంగాణ ఐటీ అసోసియేష‌న్ 2013లో అధికారిక గుర్తింపును ఏపీ స‌ర్కారు హ‌యాంలోనే పొందింది. తెలంగాణ అనే ప‌దం వినిపించడం స‌మ‌స్య‌గా మారిన ఉద్య‌మం స‌మ‌యంలో ప్రారంభ‌మైన టీటా ఐటీ ఉద్యోగుల ప‌క్షాన గ‌ళం వినిపించి ఉద్య‌మం వైపు మ‌ర‌లించింది. తెలంగాణ ఉద్యమం స‌మ‌యంలో ఐటీ ప‌రిశ్ర‌మ‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వ‌గా, ప‌లు వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌మైన అభిప్రాయాల నేప‌థ్యంలో ఐటీ ఉద్యోగుల త‌ర‌ఫున వాద‌న‌ను వినిపించారు. రాష్ట్ర ఏర్పాటు వ‌ల్ల అంత‌ర్గ‌తంగా కొంద‌రు తెలంగాణ వ‌స్తే స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని పేర్కొన‌గా…దాన్ని టీటా స‌మ‌ర్థంగా తిప్పికొట్టింది. అనిశ్చితి దూరం అవుతుందని, భ‌విష్య‌త్ అభివృద్ధి పథంలో సాగుతుంద‌ని వివ‌రించింది. టీటా లోగోను సందీప్‌మ‌క్తాల స్వ‌యంగా రూపొందించారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ మూడు అవార్డులను టీటా సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో రెండు స్కోచ్ అవార్డులను సాధించుకుంది. టీటా బ‌లోపేతానికి సందీప్‌కుమార్ మ‌క్తాల విశేష కృషి చేశార‌ని ఈ సంద‌ర్భంగా అశ్విన్ చంద్ర వ‌ల్లబోజు తెలిపారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేసి టీటా బ‌లోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున కృషి చేశార‌ని వివ‌రించారు. ల‌క్ష‌లాది మందిని సాంకేతిక అక్ష‌రాస్య‌త వైపు మ‌ర‌లించ‌డం, డిజిట‌ల్ విలేజ్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అవార్డు తీసుకున్నార‌ని గుర్తుచేశారు. 12 ఏళ్ల సుదీర్ఘ ఐటీ పరిశ్రమ అనుభవం కలిగిన సందీప్ కుమార్ మక్తాల నాయ‌క‌త్వంలో టీటా ఐటీ పరిశ్రమలోని ఉద్యోగులు, యాజమాన్యాలు,విద్యార్థులు, ఎన్నారైల తరఫున గళం వినిపిస్తున్నార‌ని వెల్ల‌డించారు. ఈ ఎన్నిక సందర్భంగా సందీప్ కుమార్‌ మ‌క్తాల మాట్లాడుతూ వ‌రుస‌గా మూడో సారి గ్లోబ‌ల్ టీం అధ్య‌క్షుడిగా త‌న‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. తెలంగాణ‌లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఐటీ, అంకుర సంస్థల ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ఆయా పార్టీల మేనిఫెస్టోల క‌మిటీల‌ దృష్టికి తీసుకువెళ‌తామ‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే టీటా టీంలో అంత‌ర్గ‌తంగా ఇందుకోసం క‌మిటీ ఏర్పాటుచేశామ‌ని పేర్కొంటూ త్వ‌ర‌లోనే ప్ర‌ధాన పార్టీల మేనిఫెస్టోల బాధ్యుల‌కు ఈ ప్ర‌తిపాద‌నలు అంద‌జేస్తామ‌ని వెల్ల‌డించారు. తెలంగాణ ఇన్నోవేష‌న్ మ‌రియు ఇంక్యుబేష‌న్ సెంటర్ ద్వారా రాష్ట్రంలో ఎన్నారైలు పెట్టుబ‌డులు పెట్టేందుకు స‌హ‌క‌రిస్తామ‌న్నారు. తమ‌తో క‌లిసి ప‌నిచేసేందుకు వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలు, ఐటీ ఉద్యోగులు ఆసక్తిగా ముందుకు వస్తే ఆత్మీయంగా స్వాగ‌తిస్తామ‌ని సందీప్ కుమార్ మ‌క్తాల వెల్ల‌డించారు. సాంకేతిక అక్షరాస్యతను మరింత క్రియాశీలంగా ముందుకు తీసుకుపోతామన్నారు. కాగా, టీటా గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ బృందాన్ని ఈ సంద‌ర్భంగా ఎన్నుకున్నారు. ఉపాధ్య‌క్షుడిగా రాణ‌ప్ర‌తాప్ బొజ్జం, గ్లోబ‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీలుగా అశ్విన్‌చంద్ర వ‌ల‌బోజు, న‌వీన్ చింత‌ల‌, ర‌వి లెల్ల ట్రెజ‌ర‌ర్‌గా ఎన్నిక‌య్యారు. కాగా, టీటా గ్లోబ‌ల్ క‌మిటీ ఎన్నిక సంద‌ర్భంగా ఐటీ వర్గాల్లో సంద‌డి నెల‌కొంది. ← Previous 25th Conference of DsGP/IsGP and Heads of Central Police Organisations (CPOs) of NE region begins in Itanagar Dr. Anand Bethapudi Received SEVA BHUSHAN AWARD from Former Governor Sri Konijeti Rosaiah in the Program held at Thyagaraya Ganasabha Hyderabad today on 26.09.2018 Next → WWW.24x7ONLINENEWS.COM Wishing all a happy 3rd anniversary of Telangana Formation Day 19.06.2020: Chief Minister K Chandrashekhar Rao announced that the state government would extend all help to family of Col Santosh Kumar
2020/07/03 22:28:58
http://www.24x7onlinenews.com/sundeep-kumar-makthala-elected-as-a-president-of-telangana-information-technology-association-tita-16-09-18/
mC4
ఈ దీపావళి సందర్భంగా మీ ప్రియమైన వారికి ఈ స్పెషల్ ఐటమ్స్ ను బహుమతిగా ఇవ్వండి. | NewsTrack Telugu 1 ఈ దీపావళి సందర్భంగా మీ ప్రియమైన వారికి ఈ స్పెషల్ ఐటమ్స్ ను బహుమతిగా ఇవ్వండి. Nov 06 2020 05:29 PM దీపావళి పండుగ చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు . ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ నాడు, బంధువులకు మరియు పొరుగువారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు మరియు బహుమతులను పంపడం కూడా ఒక భిన్నమైన ఆచారం. కాలం మారుతున్న కొద్దీ ఈ బహుమతులు కాలక్రమంలో మారిపోయాయి. ఈ రోజు మేము మీకు కొన్ని చిట్కాలను ఇవ్వబోతున్నాము, ఈ సారి మీరు బహుమతిగా ఏదైనా ప్రత్యేకమైన దానిని ఇవ్వవచ్చు. * మీ ప్రియమైన వారికి స్వీట్లు పంపే సంప్రదాయం ఉంది, మరిముఖ్యంగా దీపావళి లేదా ఏదైనా పండుగనాడు, అయితే ఎక్కువ స్వీట్లు తినడం వల్ల పళ్లు మరింత క్షీణిస్తోం ఇంట్లో ఉంచిన స్వీట్లు చెడిపోయాయి. కాబట్టి ఈసారి, డ్రై ఫ్రూట్స్ వంటి త్వరగా చెడిపోకుండా ఉండే గిఫ్ట్ లో ఏదైనా ఇవ్వడానికి బదులుగా. ఇది త్వరగా చెడిపోకుండా, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈసారి తీపి కి బదులు ఎండు పండ్లను ఎంపిక చేసుకోవాలి. * మీ బంధువులు, స్నేహితులకు మార్కెట్లో చాలా రకాల స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని ప్యాక్ చేసి, బహుమతిగా ఇవ్వవచ్చు. తీపి నోటితో అలసిన వారికి చాలా ఇష్టం. * మీ ప్రియమైన వారికి ఇల్లు అలంకరించడానికి లేదా మీ భావాలను శుభకాంక్షలతో వ్యక్తీకరించడానికి ఒక కార్డు ను మీరు ఇవ్వవచ్చు. ఇది సంబంధాలలో మాధుర్యం కోసం సరిపోతుంది. * దీపావళి రోజున ఇంట్లో రంగురంగుల, డిజైనర్ దీపాలను తయారు చేసి, వాటిని మీ ప్రియమైన వారికి ఇవ్వవచ్చు. మీరు అందమైన వాసన గల వస్తువుల సెట్ ను బహుమతిగా ఇవ్వవచ్చు. దీపావళికి ముందు ఇంట్లో దీపాలను ఎలా అలంకరించాలో తెలుసుకోండి దీపావళి హాక్స్: అందంగా తయారు చేయడానికి ఈ సులభమైన చిట్కాలతో మీ ఇంటిని అలంకరించండి దీపావళి: మీ ఇంటిని టీ లైట్ల నుంచి క్యాండిల్ డెకరేషన్ ల వరకు కొత్త ఆలోచనలతో అలంకరించండి. DIWALI GIFT IDEAS DIWALI DIWALI PAR KYA GIFT DEN DIWALI GIFT IDEAS DIWALI GIFTS DIWALI NEWS DIWALI GIFT NEWS
2022/05/16 15:33:43
https://telugu.newstracklive.com/news/diwali-gift-ideas-diwali-2020-diwali-par-kya-gift-den-sc116-nu612-ta7-1043035-1.html
mC4
తమిళ యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన సైలెంట్ థ్రిల్లర్ ‘మెర్క్యూరీ’. అసలు సంభాషణలే లేకుండా తీసిన ఈ సినిమా మొదటి నుండి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని రేకెత్తించింది. మరి ఇంత ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం… కథ : స్నేహితులైన ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి కలిసి ఊరికి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్లో ఒక రాత్రి పెద్ద పార్టీని చేసుకుంటారు. పార్టీ తర్వాత కారులో బయటికెళ్లిన ఆ నలుగురు ప్రమాదవశాత్తు ఒక వ్యక్తిని(ప్రభుదేవ) కారుతో గుద్దేసి దాన్నుండి తప్పించుకోవడానికి అతన్ని తీసుకెళ్లి ఒక ఫ్యాక్టరీలో పడేస్తారు. అలా వారి వలన బాధకు గురైన ఆ వ్యక్తి ప్రమాదం తర్వాత ఏమయ్యాడు, వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకున్నాడు, ప్రభుదేవ కథేమిటి, ఈ నలుగురు స్నేహితులు ఎవరు, సినిమాను సంభాషణలే లేకుండా దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఎలా చిత్రీకరించారు అనేదే ఈ సినిమా. ప్లస్ పాయింట్స్ : సినిమాలో అన్నిటికంటే ఎక్కువగా ఆసక్తిని కలిగించే అంశం పాత్రలు. కార్తిక్ సుబ్బరాజ్ ఈ సైలెంట్ థ్రిల్లర్ ను ఎలా రూపొందించారు అనే ప్రశ్నకు ఆ పాత్రల వద్దే సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం కూడ పేక్షకులు పూర్తిగా కన్విన్స్ అయి పాత్రల మధ్యన మాటలు లేవే అనే అసంతృప్తికి గురికాకుండా చేస్తుంది. ప్రతి పాత్రను పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్న ఆయన సినిమా చివర్లో కార్పొరేట్ విధానం భూమిని, వాతావరణాన్ని ఎలా కలుషితం చేస్తుంది, దాని వలన మనుషుల జీవితాలు ఎలా నాశనమవుతున్నాయి అనే సందేశాన్నివ్వడం బాగుంది. కథలో ప్రధాన పాత్రధారి ప్రభుదేవ గతం కొంత ఆసక్తికరంగానే ఉంటుంది. అలాగే ఆయన నటన, ఇతర కీలక పాత్రధారుల నటన ఆకట్టుకున్నాయి. సినిమా మొత్తాన్ని రాత్రి సమయంలో, ఒక ఫ్యాక్టరీలో బ్యాక్ డ్రాప్లో సెట్ చేసిన విధానం, లొకేషన్లు మెప్పించాయి. ముఖ్యంగా కెమెరా వర్క్ ఇంప్రెస్ చేసింది. అలాగే ఫస్టాఫ్, సెకండాఫ్లలోని రెండు మూడు సీన్స్ థ్రిల్ ఫీలయ్యేలా చేశాయి. మైనస్ పాయింట్స్ : సినిమాను సైలెంట్ గా తీయడమనే కాన్సెప్ట్ బాగున్నా అందులో బలమైన కథ, కథనాలు లేకపోవడమే నిరుత్సాహానికి గురిచేసింది. కార్తిక్ సుబ్బరాజ్ చేసిన ఈ భిన్నమైన ప్రయత్నానికి తోడు మంచి థ్రిల్ ఇచ్చే స్టోరీ, స్క్రీన్ ప్లే ఉండి ఉంటే బాగుండేది. సినిమా అసలు కథ రివీల్ అయ్యాక ఈ కథలో కొత్తదనం ఏముంది అనే ఫిలింగ్ కలుగుతుంది. పైగా సినిమా మొత్తం మీద పైన చెప్పినట్టు రెండు మూడు సన్నివేశాలు తప్ప మిగతా ఏ సన్నివేశం కూడ థ్రిల్ చేయలేకపోయింది. ప్రభుదేవ మనుషుల్ని చంపే విధానం, అతన్నుండి భాదితులు తప్పించుకునే ప్రయత్నాలు ఏవీ కూడ థ్రిల్ చేయలేకపోయాయి. మాటలు లేవు కదా అయితే సౌండ్ ఎఫెక్ట్స్ అద్దిరిపోతాయి అనుకునే వారికి నిరుత్సాహం తప్పదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని తీవ్రతను, ఎమోషన్ ను పెద్దగా క్యారీ చేయలేకపోయింది. ఇక క్లైమాక్స్ అయినా గొప్పగా ఉందా అంటే అదీ లేదు. ప్రీ క్లైమాక్స్ బాగున్నా ముగింపులో కథ ఉన్నట్టుండి వేరే ట్రాక్ తీసుకొని కొన్ని ప్రశ్నలను, కొంత అసంతృప్తిని మిగిల్చింది. సాంకేతిక విభాగం : దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ చేసిన సినిమాను మాటలు లేకుండా రూపొందించడమనే ప్రయత్నం నిజంగా అభినందనీయం. అలాగే పాత్రలు మాట్లాడుకోకపోవడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న కారణం చాలా ఖచ్చితంగా ఉంది. కానీ ఆయన బలమైన కథ, థ్రిల్ చేసే కథనం, సన్నివేశాలను రాసుకోకపోవడమే కొంత నిరుత్సాహానికి గురిచేస్తుంది. ఎస్.తిరునవుక్కరసు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా చాలా వరకు నైట్ ఎఫెక్ట్స్ లో తీసినా ఎక్కడా ఇబ్బంది కలగలేదు. సతీశ్ కుమార్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంది. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. తీర్పు : దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ చేసిన అటెంప్ట్ మంచిదే అయినా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. సినిమాను సైలెంట్ మోడ్లో తీయడం, సినిమాటోగ్రఫీ, థ్రిల్ చేసే రెండు మూడు చిన్న సన్నివేశాలు, నటీనటుల నటన, సోషల్ మెసేజ్ వంటి అంశాలు కొంతవరకు మెప్పించినా కథ, కథనాల్లో కొత్తదనం, తీవ్రత, చెప్పుకోదగిన థ్రిల్స్ లేకపోవడం వంటి బలహీనతలు కొత్తదనాన్ని ఆశించేవారికి నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. మొత్తం మీద ఈ ‘మెర్క్యూరీ’ కొంతమంది చేత మంచి ప్రయత్నం అనిపించుకుంటుంది తప్ప మెజారిటీ ప్రేక్షకుల్ని మెప్పించదు.
2021-11-29T23:46:04Z
https://www.123telugu.com/telugu/reviews/mercury-movie-review-in-telugu.html
OSCAR-2201
భారతీయ చలనచిత్ర పితామహుడుగా పిలుచుకునే ఆర్దేషిర్ ఇరాని తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ ను ఇంపీరియల్ మూవీటోన్ పతాకం మీద 1931లో నిర్మించిన విషయం తెలిసిందే. అప్పట్లో బెంగుళూరు లోని సూర్యా ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన మూకీ చిత్రపరిశ్రమతో అనుబంధం పెంచుకున్న హనుమప్ప మునియప్ప రెడ్డి అనే హెచ్.ఎం. రెడ్డి బొంబాయికి వెళ్లి ఇంపీరియల్ మూవిటోన్ నిర్మాత,…
2022-12-06T08:23:02Z
https://64kalalu.com/tag/hm-reddy/
OSCAR-2301
శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం విలేకరుల సమావేశం Home » Telugu News » శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం విలేకరుల సమావేశం నిజ జీవిత పాత్రల ఆధారమే "శ్రీదేవి సోడా సెంటర్" ..చిత్ర నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి భలే మంచి రోజు,ఆనందో బ్రహ్మ, యాత్ర, మొదలగు వైవిధ్య ఫిలిమ్స్ నిర్మించి ప్రేక్షకాదరణ పొందారు. ఇంతవరకు రానటువంటి కొత్త కాన్సెప్ట్ "శ్రీదేవి సోడా సెంటర్" తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి. 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుధీర్ బాబు, ఆనంది జంటగా పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వ‌ర మాంత్రికుడు మణిశర్మ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సందర్భంగా విలేకర్లతో నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు మాట్లాడుతూ …… మేము ఈ సినిమా షూట్ మొదలు పెట్టిన రోజే మెయిన్ కెమెరా కింద పడిపోయింది. మరుసటి రోజు షూటింగ్ అయిపోయి వెళ్లేటప్పుడు క్యార్వాన్ అసిస్టెంట్ కి కరెంట్ షాక్ కొట్టింది. ఆ తర్వాత రోజు మళ్ళీ షూట్ చేస్తుంటే కార్వాన్ గొయ్యి లో ఇరుక్కుపోయింది. ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. అందరూ కూడా బ్యాడ్ టైం లో స్టార్ట్ చేసావు అన్నారు. నేను సెంటిమెంట్స్ ను ఎక్కువగా నమ్మను అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా సినిమా షూట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాం. ఆ తర్వాత మా దురదృష్టం ఏంటంటే మా బ్రదర్ చనిపోయాడు ఇది మాకు చాలా బాధాకరమైన విషయం.నా జీవితంలో ఇంతకంటే నష్టం మరొకటి ఉండదు .ఆ తర్వాత మేము వన్ మంత్ షూట్ బ్రేక్ తీసుకొని మళ్లీ స్టార్ట్ చేశాం. మేము ఫస్ట్ గ్లిమ్స్ మోషన్ పోస్టర్ వదిలిన రోజునుంచే సినిమా ఎలా రిలీజ్ చేస్తారని మాకు కాల్స్ రావడం మొదలైంది. ఆ తర్వాత సుధీర్ బాబు బర్త్ డే రోజు సాంగ్ రిలీజ్ చేశాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పటి నుంచి మా సినిమా బిజినెస్ స్టార్ట్ అవ్వడం మొదలైంది. సినిమా షూటింగ్ అయిపోయే లోపు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ బిజినెస్ పూర్తయ్యింది. మేము మొదట ఈ సినిమాకు "నల్ల వంతెన" అని టైటిల్ అనుకున్నాము.. కానీ మేము చేసే లవ్ స్టోరీ కి ఈ టైటిల్ క్యాచీగా లేదని సెకండ్ ఆప్షన్ గా " శ్రీదేవి సోడా సెంటర్" టైటిల్ ను ఫిక్స్ చేశాము.మేజర్ ఈవెంట్ అన్ని కూడా ఈషాప్ దగ్గరే జరుగు తుంటాయి. ఆ షాప్ చుట్టూ జరిగే స్టోరీ కాబట్టి "శ్రీదేవి సోడా సెంటర్ అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఆనందోబ్రహ్మ సినిమా తీసిన తర్వాత చాలా మంది రైటర్లు డైరెక్టర్స్ హర్రర్ కామెడీ కథలు చేస్తామని వచ్చి చాలా మంది చాలా కథలు చెప్పారు కానీ ఆనందోబ్రహ్మ స్క్రిప్ట్ కంటే బెటర్ అనిపించలేదు.అలాగే యాత్ర మూవీ చూసిన తర్వాత చాలా మంది బయోపిక్స్ తీస్తామని చాలా కథలు వినిపించారు. అవేవి కూడా మాకు యాత్ర కంటే బెస్ట్ అనిపించలేదు. భలే మంచి రోజు,ఆనందో బ్రహ్మ, యాత్ర ఇలా అన్నీ కూడా మేము డిఫరెంట్ జోనర్ సెలెక్ట్ చేసుకున్నాం. మంచి కథ ఎప్పుడు వస్తే ఆప్పుడు సినిమా చేస్తాం. కథలు లేటుగా వస్తున్నందున మాకు కొంత గ్యాప్ వస్తుంది అంతే తప్ప మేము గ్యాప్ తీసుకోవడం లేదు శ్యాం ప్రసాద్ గారు ఇప్పటివరకు ఏడు సినిమాలు తీశారు వాటి గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. అలా మేము మంచి కథలు వచ్చినప్పుడే సినిమాలు చేస్తాం. మా చిత్ర దర్శకుడు కరుణ గారు తీసిన పలాస చాలా రా..గా ఉన్నా ఈ సినిమా రియల్ గా ఉంటుంది. అమలాపురం లో చూస్తే ఈ సినిమాలోని క్యారెక్టర్స్ అబ్బాయి, అమ్మాయి, వారి తల్లిదండ్రులు లాంటి వారు చాలా మంది కనిపిస్తారు. ఈ సినిమాలో రియల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇలాంటి రూరల్ ఫిలిం కి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలను కున్నప్పుడు నాకు మణిశర్మ గారి గుర్తొచ్చారు . వెంటనే ఆయనను కలసి కథ చెప్పడం జరిగింది తను చేస్తానని చెప్పి మాకు అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. మణి శర్మ గారు అతడు లాంటి రూరల్ స్టైలిష్ ఫిలిం చేశారు కానీ కంప్లీట్ రూరల్ ఫిలిం చేయలేదు. ఇది పూర్తి రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఫిల్మ్ ఇది. సుధీర్ గారు కృష్ణ గారు మహేష్ బాబు గార్లు నా పక్కన ఉంటే నాకు ఎంత ధైర్యం ఉంటుందో ఈ చిత్ర నిర్మాతలు నా పక్కనుంటే నాకు అంత ధైర్యం ఉంటుంది అన్నందుకు ఆయనకు మా ధన్యవాదాలు. అయితే సుధీర్ బాబుతో మేము సెట్ లో ఉన్నపుడు హీరో అండ్ ప్రొడ్యూసర్ లా ఉంటాము షూట్ అయిన తరువాత ఫ్రెండ్స్ లా ఉంటాము. అలా ఉండకపోతే సినిమా చేయలేము.ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఈజ్ వన్ సైడ్, మూవీస్ ఈజ్ వన్ సైడ్. బయట సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుంటాం. మేం చేసే సినిమాల గురించి మాట్లాడితే మాత్రం చాలా ప్రొఫెషనల్ గా ఉంటాము. ఈ సినిమాకు మహేష్ బాబు , ప్రభాస్ , చిరంజీవి గారూ సపోర్ట్ చేసినందుకు వారికి మా ధన్యవాదాలు.. చిరంజీవి గారు మా ప్రతి సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు ఆయన సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుంది. మేము మంచి కథలు కోసం చూస్తున్నాం.ఇప్పుడు ఒక స్క్రిప్టు రెడీ అవుతుంది అది ఇంకా ఫైనల్ కాలేదు. వైయస్ జగన్ గారి బయోపిక్ కథ మాకు ఎవరూ చెప్పలేదు . ఏం డైరెక్టర్ కూడా చేస్తామని ఆఫీసియల్ గా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అలాగే పెద్ద హీరోలతో మేము సినిమా చేయడానికి మేము సింద్దంగా ఉన్నాము.కానీ మా కథ ఆ హీరోలకు నచ్చాలి.వారికి మా కథ నచ్చితే మేము సినిమా చేస్తాము. సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న బిగ్గెస్ట్ థియేటర్ రిలీజ్ మూవీ మా "శ్రీదేవి సోడా సెంటర్". సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ లక్ష్మణ్ గారి సపోర్ట్ తో ఆంధ్ర, తెలంగాణ లలో సుమారు 500 థియేటర్స్ లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాము.ఇవి కాక ఇంకా అమెరికా లో 120 థియేటర్స్ లో, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము. ఫ్యామిలీస్ కావచ్చు ఇంకెవరైనా కూడా 20 మెంబర్స్ కలసి టికెట్స్ బుక్ చేసుకుంటే షో వేస్తాము.యూఎస్ లో మేము ఇలాంటి కొత్త కల్చర్ ను అలవాటు చేస్తున్నాం. మాకు సెన్సార్ వాళ్ళు ఒక కట్ లేకుండా U/A ఇచ్చారు. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 27 న వస్తున్న "శ్రీదేవి సోడా సెంటర్" అందరినీ తప్పక నచ్చుతుంది. ప్రేక్షకులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థియేటర్స్ వచ్చి మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అని ముగించారు.
2021/09/18 23:21:05
https://businessoftollywood.com/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%8B%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-2/
mC4
నా పుస్తకంలో వారి భాగోతం.. (మెగా ఫ్యామిలీపై దాసరి!) | Dasari Narayana Rao comments on Mega Family | అందరి చరిత్రలు బయట పెడతా... (మెగా ఫ్యామిలీపై దాసరి!) - Telugu Filmibeat 30 min ago ఆ డైలాగ్‌తో గొడవ.. అరుపులతో అరియానా.. ఫన్నీగా కానిచ్చేసిన హారిక!! నా పుస్తకంలో వారి భాగోతం.. (మెగా ఫ్యామిలీపై దాసరి!) | Updated: Thursday, December 20, 2012, 15:49 [IST] హైదరాబాద్: దర్శకరత్నదాసరి నారాయణరావు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. దర్శకుడు సురేష్ కృష్ణ రజనీకాంత్‌పై రాసిన 'భాషాతో నేను' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దాసరి చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి పరోక్షంగా చేసినవే అనే ప్రచారం మీడియాలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో దాసరి మాట్లాడుతూ...'సౌతిండియాలో ఎన్టీఆర్, ఎంజీఆర్, రాజ్ కుమార్, రజనీకాంత్‌లే సూపర్ స్టార్లు, సూపర్ స్టార్లను మించిన స్టార్లు లేరు. నా చేతుల మీదుగా ఎంతో మంది స్టార్స్ అయ్యారు. నేను ఎంతో మందిని స్టార్స్ చేసాను. నా సినిమాల్లో ఒక్క చాన్స్ కోసం ఎదురు చూసిన వారు...నేడు నేనొస్తే దాసరి నారాయణరావు లేచి నిలబడడా? అని ప్రశ్నించే స్థాయికి వచ్చారు. నన్నే ఛాలెంజ్ చేస్తున్నారు. అది వాళ్ల నైజం....కానీ రజనీలో అలాంటి వ్యక్తిత్వం లేదు. వ్యక్తిత్వంలో ఇప్పుడున్న స్టార్స్ ఎవరూ ఆయనకు సాటిరారు. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న వారి అందరి చరిత్రలు నాకు తెలుసు. త్వరలో పుస్తకం రాస్తా, నిజాలు రాస్తా, అందరి చరిత్రలు బయట పెడతా' అంటూ వ్యాఖ్యానించారు. పరిశ్రమలో ఎప్పటి నుంచో దాసరి నారాయణరావు వర్గానికి, మెగాస్టార్ చిరంజీవి వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు చాలా ఏళ్లుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దాసరి చేసిన వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవి అండ్ కో ను ఉద్దేశించి చేసినవే అనే వాదన బలంగా వినిపిస్తోంది. దాసరి వ్యాఖ్యలను బట్టి చూస్తే.....మూతి మీద మీసం కూడా మొలవని రామ్ చరణ్ లాంటి వాళ్లది నాతో ఛాలెంజ్ చేసే స్థాయా? నాకంటే జూనియర్ చిరంజీవి వస్తే నేను లేచి నిలబడాలా? అని ప్రశ్నించినట్లు ఉందని చర్చించుకుంటున్నారు. ఆ మధ్య దాసరి నారయాణరావు, రామ్ చరణ్ మధ్య పరోక్ష వాగ్వివాదం చోటు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం అనే వాదన కూడా వినిపిస్తోంది. దాసరి తాజాగా ఇంతలా ఫైర్ కావడానికి కారణం ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటనే. సినీపరిశ్రమపై వ్యాట్(విలువ ఆధారిత పన్ను) ఎత్తివేత కోసం దాసరి నారాయణరావు అండ్ కో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సంప్రదింపులు జరిపింది. అయితే ఈ క్రెడిట్ దాసరికి దక్కుకండా తానే ఎత్తివేయించాననే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి సీన్ క్రియేట్ చేసారని దాసరి వర్గం ఆరోపిస్తోంది. మరి దాసరి పుస్తకం ఎప్పుడు రాస్తారో? ఎలాంటి రహస్యాలు బయట పెడతారో చూడలి. Read more about: ram charan teja pawan kalyan allu arjun chiranjeevi dasari narayana rao దాసరి నారాయణరావు చిరంజీవి రామ్ చరణ్ తేజ్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ Darshaka Ratna Dasari Narayana Rao Made indirect comments on Mega Star Chiranjeevi at Suresh Krishna's Baasha book launch event.
2020/10/21 02:47:53
https://telugu.filmibeat.com/news/dasari-narayana-rao-comments-on-mega-family-110018.html
mC4
విజయ్‌పథ్‌ సింఘానియాపై రేమండ్‌ బోర్డు నిర్ణయం ముంబయి: భారత కార్పొరేట్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ.. రేమండ్‌ గ్రూప్‌ తమ వ్యవస్థాపకుడు విజయ్‌పథ్‌ సింఘానియాను గౌరవ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించింది. గత నెలలో కంపెనీ బోర్డు ఆ మేరకు ఆయనకు లేఖ పంపినట్లు తెలుస్తోంది. సింఘానియా పలు లేఖల్లో ఉపయోగించిన అసభ్య, అవమానకర రీతిలో ఉన్న భాషపై తీవ్ర 'అసమ్మతి'ని వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెప్టెంబరు 7 తేదీతో ఉన్న లేఖలో రేమండ్‌ డైరెక్టర్‌ (సెక్రటేరియల్‌) పేర్కొన్నట్లు సమాచారం. కుటుంబంలో జరుగుతున్న పరిణామాలకు కంపెనీకి సంబంధం లేదని.. సింఘానియా ప్రవర్తన వల్లే 'గౌరవ ఛైర్మన్‌' హోదాను తీసేశామని ఆ లేఖలో వివరించినట్లు సమాచారం. బోర్డు సమావేశాల నుంచి తనను దూరంగా పెట్టడంపై అంతక్రితం కంపెనీ సెక్రటరీకి.. ఆ తర్వాత బోర్డుకు సింఘానియా పలు లేఖలు రాసినట్లు సమాచారం. ఆగస్టు 30న బోర్డుకు రాసిన లేఖలో తన కుమారుడు గౌతమ్‌ తనను కంపెనీకి దూరం చేశారని ఆరోపణలు చేశారు.
2018/10/18 13:13:25
http://www.eenadu.net/telangana-news-inner.aspx?category=general&item=break38
mC4
కరోనా ప్రభావం.. రూ.కోట్లలో నష్టం! సినిమా వ్యాపారానికి అతి పెద్ద సీజన్‌ వేసవి. మార్చి మొదలు మే ఆఖరు వరకు అగ్ర హీరోల సినిమాలు వరుస కడుతుంటాయి. సెలవుల సమయం కావడంతో పిల్లలు, పెద్దలు వినోదం కోసం సినిమాను ఆశ్రయిస్తుంటారు. దీంతో బాక్సాఫీసు సందడిగా మారేది. సుమారు 40 సినిమాల వరకు వేసవిలో వస్తుంటాయి. ఇంతటి కీలకసీజన్‌కి కరోనా గండికొట్టింది. లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పట్లో తెరిచే పరిస్థితులు కనిపించడం లేదు. ఓ 20 సినిమాలు ఈ వేసవి విడుదలకు సిద్ధమైనా.. కరోనా ప్రభావంతో ప్రేక్షకులు వేసవి వినోదానికి దూరమయ్యారు. వేసవి వినోదాల బరిలో నిలవడానికి పెద్ద చిత్రాలతో పాటు కొన్ని చిన్న సినిమాలూ సిద్ధమైనా కరోనా ప్రభావంతో ఆగిపోయాయి. నాని - సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'వి', అనుష్క 'నిశ్శబ్దం', రానా.. 'అరణ్య', రామ్‌ చిత్రం 'రెడ్‌'తో పాటు రాజ్‌ తరుణ్‌ 'ఒరేయ్‌ బుజ్జిగా', ప్రదీప్‌ - అమృత అయ్యర్‌ జంటగా నటించిన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?', వైష్ణవ్‌ తేజ్‌ 'ఉప్పెన', కీర్తిసురేష్‌ 'మిస్‌ ఇండియా'... ఇలా ఆసక్తికరమైన చిత్రాలన్నీ మార్చిలోనే విడుదలకు ముస్తాబయ్యాయి. వీటిలో కొన్ని మినహా మిగతావన్నీ దాదాపు రూ.30 కోట్ల పైచిలుకు వ్యయంతో తెరకెక్కినవే. అవన్నీ కరోనా ప్రభావంతో విడుదలకి నోచుకోకుండా ఆగిపోయాయి. లాక్‌డౌన్‌తో థియేటర్లు మూసివేయడంతో మొదట సినిమాల విడుదల ఆగిపోయింది. ఆ తర్వాత వేసవే లక్ష్యంగా షూటింగ్‌ జరుపుకుంటున్న సినిమాలన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. పవన్‌ కల్యాణ్‌ 'వకీల్‌సాబ్‌', వెంకటేష్‌ 'నారప్ప', నాగచైతన్య 'లవ్‌స్టోరీ', రవితేజ 'క్రాక్‌', సాయితేజ్‌ 'సోలో బ్రతుకే సో బెటరు', అఖిల్‌ 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌'తో పాటు 'ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య', 'శ్రీకారం'...ఇవన్నీ ఈ వేసవికి వస్తాయనుకున్న చిత్రాలే. వీటిలో రూ.50కోట్ల పై చిలుకు బడ్జెట్లతో ముస్తాబవుతున్నవీ ఉన్నాయి. ఈ వేసవిలో సుమారు రూ.600 కోట్ల వ్యాపారం జరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. కానీ కరోనాతో ఈ వేసవి సీజన్‌ తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ థియేటర్లు ప్రారంభమయ్యాకా వేసవి సినిమాలన్నీ వరుస కట్టబోతున్నాయి. అది ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కొన్ని చిన్న చిత్రాలు ఓటీటీల వైపు చూస్తున్నాయి. ''చిత్ర పరిశ్రమలో సంక్రాంతి తర్వాత వేసవికే ప్రాధాన్యత. ఈ సీజన్‌లో ఏ చిత్ర పరిశ్రమకైనా అత్యధిక రాబడి వస్తుంది. ఈసారి చిన్నాపెద్దా కలిపి దాదాపు 40 చిత్రాల విడుదల ఆగినట్టే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1800 థియేటర్లు ఉన్నాయి. వారానికి ఒక్కో థియేటర్‌కు సగటున రూ.3లక్షలు నష్టం వాటిల్లుతోంది. వేసవిలో ఆ నష్టం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒకరకంగా మిగిలిన అన్ని పరిశ్రమలతో పోల్చితే ఎక్కువ నష్టం చిత్రసీమకే''. - టి.ప్రసన్న కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి. ''ఈ కరోనా ప్రభావం నుంచి గట్టెక్కి చిత్రసీమ సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ సమయమే పట్టొచ్చు. వేసవి సీజనే కాదు.. ఈ సంవత్సరం పూర్తిగా కోల్పోయినట్లే. జనవరి వరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చు. ప్రేక్షకులు వందల మంది వచ్చినా ఎటువంటి భయాలు ఉండని పరిస్థితి వచ్చే వరకూ థియేటర్స్‌ పరిస్థితి మారదు. చిత్ర పరిశ్రమ, థియేటర్లు కోలుకోవడానికి ఎక్కువ సమయమే పడుతుంది. పెద్ద చిత్రాలు ప్రేక్షకులు నిర్భయంగా థియేటర్లకు వచ్చేవరకు వేచిచూడాల్సిందే''.
2020/05/26 10:48:20
https://www.sitara.net/sithara-special/summermoviestory-prasannakumar-rammohanarao-tsfdc-/19916
mC4
మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. అయితే పోషకాహార లోపం వల్ల కూడా పలు సమస్యలు వస్తాయి. అందుకనే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మానసిక సమస్యలు పోషకాహార లోపం వలన కలుగుతుంటాయి. అందుకని పోషకాహారం లోపం లేకుండా చూసుకోవాలి. ఈ పోషకాహార లోపాల వల్ల పలు సమస్యలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అయితే మరి శరీరంలో ఎటువంటి పోషకాహార లోపం వలన ఎలాంటి సమస్యలు కలుగుతాయి..?, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. యాంటీ ఆక్సిడెంట్లు: యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండకపోవడం వల్ల పలు సమస్యలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వంటివి కలుగుతాయని.. ఒత్తిడి ఎక్కువై పోతుందని అంటున్నారు. కనుక యాంటీఆక్సిడెంట్ లోపం కలగకుండా చూసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జింక్: జింక్ లోపం వలన కూడా పలు సమస్యలు వస్తాయి. జింక్ లోపం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి జింక్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. అలానే ఇది మూడ్ ని కూడా మార్చేస్తుంది. విటమిన్ బి6 : విటమిన్ బి6 లోపం ఉండడం వల్ల నీరసం, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి కలుగుతాయి కాబట్టి విటమిన్ బి6 కూడా ఉండేటట్టు చూసుకోవాలి. కాపర్ ఎక్కువ ఉండడం: కాపర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మూడ్ లో మార్పులు వస్తాయి కాబట్టి ఇటువంటి సమస్యలు కలగకుండా సరైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి లేదంటే ఇబ్బందులు వస్తాయి.
2022-12-05T02:22:55Z
https://manalokam.com/health/did-you-know-that-this-nutritional-deficiency-affects-the-mood.html
OSCAR-2301
ఫటాఫట్ జయలక్ష్మిగా పిలువబడే జయలక్ష్మీరెడ్డి (1958-1980) దక్షిణ భారతీయ సినిమా నటిగా ప్రసిద్ధురాలు. ఈమె మలయాళ సినిమాలలో "సుప్రియ" అనే పేరుతో పిలువబడుతున్నది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో 66 చిత్రాలలో నటించింది. ఈమె నటిగా తన వృత్తిని 1972లో మలయాళం సినిమా తీర్థయాత్రతో సుప్రియ అనే పేరుతో ప్రారంభించింది. 1974లో కె.బాలచందర్ దర్శకత్వంలో "అవల్ ఒరు తొదర్ కథై" సినిమాలో జయలక్ష్మి అనే పేరుతో నటించింది. ఆ చిత్రంలో ఆమె హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ధరించింది. ఆ పాత్ర ఊతపదం "ఫటాఫట్" ప్రేక్షకులలో బాగా పేలడంతో ఫటాఫట్ ఆమె ఇంటిపేరుగా మారిపోయి ఫటాఫట్ జయలక్ష్మిగా స్థిరపడిపోయింది. ఈ సినిమా తెలుగులో అంతులేని కథ పేరుతో 1976లో రీమేక్ చేయబడింది. ఈమె కమల్ హాసన్, రజనీకాంత్, ఎన్.టి.రామారావు, చిరంజీవి మొదలైన అగ్రనటుల సరసన నటించింది. ఈమె ఎం.జి.రామచంద్రన్ తమ్ముడు చక్రపాణి కొడుకు సుకుమార్‌ను ప్రేమించింది. అయితే అది పెళ్ళిగా మారలేదు. దానితో తన 22 యేళ్ల పిన్న వయసులోనే 1980లో, నటిగా ఉన్నత స్థాయిలో ఉన్నదశలోనే ఈమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది[1],[2],[3].
2021-03-02T18:06:39Z
https://te.wikipedia.org/wiki/%E0%B0%AB%E0%B0%9F%E0%B0%BE%E0%B0%AB%E0%B0%9F%E0%B1%8D_%E0%B0%9C%E0%B0%AF%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF
OSCAR-2109
thesakshi.com : తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్.విజయ్ కుమార్ గుండ్లకమ్మ ప్రాజెక్టు ను సందర్శించారు. ప్రాజెక్టులో కొట్టుకు పోయిన 3వ గేటుతో పాటు లీక్ అవుతున్న మరో మూడు గేట్లను పరిశీలించారు. గత ఐదు రోజులుగా ప్రాజెక్టులోని నీరంతా వృధాగా సముద్రం పాలు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందు చూపు పర్యవేక్షణ లోపంవల్లే ఈ పరిస్థితికి కారణం అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులకు మరమ్మత్తులు లేవు, సరైన నిర్వహణ లేదు..అచ్చెన్నాయుడు,ఏపీ టీడీపీ అధ్యక్షులు మొరాయిస్తున్న గేట్లు.. మొన్న పులిచింతల గేటు, నిన్న గుండ్లకమ్మ గేటు.. నేడు తాండవ జలాశయం కాలువ రెగ్యులేటింగ్ గేటు.. నీరంతా వృధా.. శ్రీశైలం ప్రాజెక్ట్ స్పిల్ వే వద్ద ఏర్పడ్డ అతిపెద్ద గొయ్యిని గురించి సేఫ్టీ కమిటీ హెచ్చరించినా నేటి వరకూ పూడ్చలేదు. గత ప్రభుత్వంలో పరుగులెత్తిన పోలవరం ప్రాజెక్ట్, నేడు పూర్తిగా పడకేసింది. గుండ్లకమ్మ నీరంతా సముద్రం పాలు చేశారు. రైతులకు సాగు నీరు లేదు, మత్స్య సంపద నాశనం, అక్కడి మత్స్యకారుల పొట్టపై కొట్టారు. పాడి సంపదపై ఆధార పడ్డ రైతులకూ ఇది పెద్ద దెబ్బే. మోటర్లకు మీటర్ల పేరుతో రైతుకు ఉరి తాళ్ళు.. విత్తు వేసే దగ్గర నుండి, ధాన్యం అమ్మి సొమ్ము చేతికి వచ్చే వరకూ ప్రతి అడుగులో అవరోధాలు, ప్రతికూల పరిస్థితులతో అన్ని వైపుల నుండీ ఒత్తిడి పెరిగి దిక్కు తోచక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. Tags: #Andhrapradesh news#AP TDP leaders#Atchannaidu#Gundlakamma project#PRAKASAM DISTRICT#TELUGU DESAM PARTY#visit
2022-12-05T20:56:20Z
https://www.thesakshi.com/no-repairs-to-water-projects-in-the-state-55155-2/
OSCAR-2301
..... చికెన్ చీకులు, మటన్ కబాబులు, చేప ఫ్రై, ఉలువలు, ఇత్తులు, శెనిగెలు కూడా ఉన్నాయ్ బావా.... నువ్వు దంచు... అసలే పొద్దాడి కల్లు... నా కళ్ళలోకి చూసింది చాలు, కల్లు బింకి ఖాళీ చేయి... రాకే చేత్తో పడితే చాలు... బింకీ ఖల్లాస్... కమాన్... .జై బాలయ్యా... అని ప్రముఖ పాత్రికేయులు ఎం.ఎస్.ఆర్ ఈ చిత్రం గూర్చి ఒక సందర్భంలో ముచ్చటించారు. అది కామెంటా.. కాంప్లిమెంటా... ఈ వాక్యాలు ఇమిటేషనా లేక కొటేషనా అన్న చర్చను కాస్త పక్కన పెడదాం. నందమూరి అందగాడు బాలకృష్ణ నటించిన సినిమా అఖండ తెలుగు సినీ ప్రేక్షకులకు ఓ రంగుల పండుగనిచ్చింది. రౌద్రం పెల్లుబికే సినిమాలు చేయడంలో బాలకృష్ణది అందవేసిన చెయ్యి. ఒక్క మాటలో చెప్పాలంటే నందమూరి తారక రామారావు తరువాత అంత రౌద్రాన్ని పలికించడం ఎన్టీయార్ తరువాత బాలకృష్ణకే సొంతమైంది. ఆయన సినిమాలలో పలికించిన రౌద్రం మరే ఇతర సమకాలీన నటుడు పలికించ లేడంటే అతిశయోక్తి లేదు. బాలకృష్ట నటించిన మహా నాయకుడు, కథానాయకుడు, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి....ఒకటా రెండా... ఈ మంగమ్మ గారి మనవడు నటించిన చిత్రాలలో రౌద్రమే ప్రధానాకర్షణ. దీనిని వెటకారంగా తీసుకుంటారా?, లేక మమకారంగా తీసుకుంటారా? అన్నది మీ ఇష్టం. కాస్త వైవిధ్యం... కొంత కొత్తదనం కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు బోయపాటి. ఈ సినిమా కూడా రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని వెండి తెరపై పరిచయం చేసిన సినిమా. అనంతపురానికి చెందన ఓ రైతు పాత్రలో బాలకృష్ణ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. కత్తులు దూసుకునే కసాయి తనానికి చిరునామా ఉన్న రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని నిలువరించి, అందరి చేతసేద్యం చేయిస్తుంటాడు. హీరోయిజం ఉన్న వ్యక్తిగా తమ పరిసర ప్రాంతాలలో పేదలకు వైద్య సదుపాయాలు కల్పించేదుకు ఆసుపత్రులు కట్టిస్తాడు ఈ సినిమా కథానాయకుడు. తన చర్యలతో ఏకంగా జిల్లా కలెక్టరమ్మనే ప్రేమలో పడేస్తాడు హీరో... కట్ చేస్తే.. సినిమా ఆరంభంలో బాలకృష్ణ ఎంట్రీ కూడా మాస్ మసాలాను తలపిస్తుంది. ఉరుకులు తీస్తూ, రంకెలేస్తున్న ఎద్దుల మధ్య నుంచి హీరో పాత్రధారి బాలకృష్ణ ఎంటరవడం నందమూరి అభిమానుల్లో అంతులేని ఉత్సాహాన్ని నింపుతుంది. పంచ్ డైలాగ్ లతో వార్నింగ్ లు ఇవ్వడం, జనాల్ని ఎత్తి కుదెయ్యడం ఇత్యాది దృశ్యాలు అభిమానుల్లో జోష్ ను నింపాయి. ఈ సినిమాలో నటుడు శ్రీ కాంత్ ది ప్రతినాయకుడి పాత్ర. ఆయన ఈ సినిమాలో విలన్ గా ఇమడ లేక పోయాడని చెప్పవచ్చు. హవ భావ ప్రదర్శన లోనూ, ఉద్వేగాలను వెలిబుచ్చడంలోనూ శ్రీకాంత్ వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఇక హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ చాలా సాదాసీదాగా కనిపించినా డైలాగ్ డెలివరి ప్రేక్షకులను ఆకట్టుకో లేక పోయారన్నది సుస్పష్టం. తమన్ సంగీతం గూర్చి వేరే చెప్పాలా ?
2022/01/26 22:55:07
https://www.indiaherald.com/Movies/Read/994448748/nandamuri-balakrishna-movie-akanda-has-mixec-responce
mC4
ఊరేగింపు గొంగళి పురుగు: లక్షణాలు, దశలు మరియు వాటిని ఎలా చికిత్స చేయాలి | గ్రీన్ రెన్యూవబుల్స్ Procession రేగింపు గొంగళి పురుగు జర్మన్ పోర్టిల్లో | 17/11/2021 10:22 | పర్యావరణ La procession రేగింపు గొంగళి పురుగు ఇది ఒక లెపిడోప్టెరాన్ కీటకం, అంటే, ఇది యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు సీతాకోకచిలుకగా మారే వరకు దాని గొంగళి పురుగు దశతో సహా అనేక రూపాంతర దశలను కలిగి ఉంటుంది. వారు ఐరోపాలోని మధ్యధరా ప్రాంతంలోని పైన్ అడవులలో నివసిస్తున్నారు మరియు వారి పేరు ఉన్నప్పటికీ, వారు దేవదారు మరియు ఫిర్లలో కూడా చూడవచ్చు. కొన్ని ప్రాంతాలలో, ఇది పైన్ తోటలకు గణనీయమైన నష్టాన్ని కలిగించే తెగులుగా పరిగణించబడుతుంది. ఇది సంతానోత్పత్తి కాలంలో అత్యంత భయపడే వాటిలో ఒకటి. అందువల్ల, ఈ ఆర్టికల్లో మీరు ఊరేగింపు గొంగళి పురుగు, దాని లక్షణాలు మరియు జీవశాస్త్రం గురించి తెలుసుకోవలసిన ప్రతిదాన్ని మీకు చెప్పబోతున్నాము. 2 ఊరేగింపు గొంగళి పురుగు యొక్క భయంకరమైన దశ 3 ఊరేగింపు గొంగళి పురుగును ఎలా ఎదుర్కోవాలి 4 స్టింగ్ చికిత్స ఎలా ఈ కీటకం శాస్త్రీయ నామం థౌమెటోపియా పిటియోకాంప, మరియు వివిధ దశల గుండా వెళుతుంది: గుడ్లు, లార్వా లేదా గొంగళి పురుగులు, ప్యూప మరియు సీతాకోకచిలుకలు. లెపిడోప్టెరాలో ఈ అభివృద్ధిని హోలోమెటబోలిక్ అంటారు. వేసవిలో, లేదా మరింత ఖచ్చితంగా జూలైలో ఉత్తర అర్ధగోళంలో, ఊరేగింపు గొంగళి పురుగు దాని వయోజన రూపాన్ని పొందుతుంది ఎందుకంటే సీతాకోకచిలుక జతకట్టే క్షణం. ఈ దశలో, కీటకం గోధుమ రంగులో ఉంటుంది మరియు అది నివసించే వాతావరణంతో కలిసిపోతుంది. రాత్రిపూట చురుగ్గా ఉండడం వీరి అలవాటు కాబట్టి పగలు, రాత్రి పక్షుల దాడుల నుంచి తప్పించుకోవచ్చు. సంభోగం సంభవించిన తర్వాత, పైన్ మార్చ్ గుడ్లు పెడుతుంది మరియు చాలా ప్రత్యేకమైన పద్ధతిలో గుడ్లు పెడుతుంది, మురి ఆకారపు సూదులు, పైన్ సూదులు పేరు పెట్టారు. మొలకెత్తిన 30 నుండి 40 రోజుల తర్వాత, గొంగళి పురుగు దాని లార్వా లేదా గొంగళి పురుగు దశలోకి ప్రవేశిస్తుంది, ఇది 8 నెలల వరకు ఉంటుంది. వారి గొంగళి పురుగు దశ ముగియబోతున్నప్పుడు, ఊరేగింపు గొంగళి పురుగు చెట్ల నుండి దిగడం ప్రారంభమవుతుంది, మరియు అవి చాలా ప్రత్యేకమైన మార్గంలో కొనసాగుతాయి, ఎందుకంటే అవి ఒకదాని తర్వాత ఒకటి వరుసలో ఉంటాయి. అందుకే ఈ కీటకానికి అద్భుతమైన పేరు ఉంది మరియు చెట్టు నుండి దిగినప్పుడు, అది కవాతును అనుసరిస్తున్నట్లు అనిపిస్తుంది. గొంగళి పురుగుల ఆధ్వర్యంలో ఆ తరువాత అవి ఆడ సీతాకోకచిలుకలుగా మారుతాయి, పైన్స్ యొక్క సుదీర్ఘ కవాతు భూమికి చేరుకుంటుంది, అక్కడ వారు ఖననం చేయబడతారు మరియు వారి క్రిసాలిస్ లేదా ప్యూపల్ దశలోకి ప్రవేశిస్తారు. ఈ దశ సుమారు 2 నెలల పాటు కొనసాగుతుంది, ఆపై ఒక వయోజన సీతాకోకచిలుకను ఉత్పత్తి చేస్తుంది, అది ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే జీవించగలదు. ఊరేగింపు గొంగళి పురుగు యొక్క భయంకరమైన దశ దాని గొంగళి పురుగు దశలో, ఊరేగింపు గొంగళి పురుగు 5 దశల గుండా వెళుతుంది, దీనిలో ఇది చాలా భయానక కీటకంగా మారుతుంది. దీని ప్రధాన లక్షణం ఏమిటంటే, దాని శరీరం మొత్తం అత్యంత విషపూరితమైన వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది, టామాటోపిన్ అనే టాక్సిన్ ఉండటమే దీనికి కారణం. గొంగళి పురుగు జంతువులు మరియు మానవులలో తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది, ఎందుకంటే పైన్స్ యొక్క కవాతు బెదిరింపుగా భావించినప్పుడు, అది గాలిలోకి ఉబ్బిన జుట్టును విడుదల చేస్తుంది. మూడవ లార్వా దశలో, గొంగళి పురుగు శీతాకాలపు చలిని తట్టుకోగలిగే పాకెట్‌ను నిర్మిస్తుంది, అయినప్పటికీ, లార్వా యొక్క కార్యకలాపాలు ఆగదు ఎందుకంటే అది రాత్రిపూట ఆహారం కోసం వెతుకుతూనే ఉంటుంది. ఐదవ లార్వా దశలో, గొంగళి పురుగులు చాలా అత్యాశకు గురవుతాయి మరియు పైన్ సూదులు తినడం ప్రారంభిస్తాయి. చాలా సందర్భాలలో, గొంగళి పురుగులు సూదులను పూర్తిగా తినవు, కానీ సూదుల మధ్యలో కొరుకుట ఆపివేస్తాయి, దీని వలన గోధుమ ఆకులు నెమ్మదిగా చనిపోతాయి మరియు పైన్ చెట్టు వికారమైనట్లు కనిపిస్తుంది. లార్వాలు సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో కనిపిస్తాయి. జనవరి మరియు ఏప్రిల్ మధ్య అవి కనిపించడం ప్రారంభిస్తాయి, వాతావరణ పరిస్థితుల వల్ల కలిగే ఉష్ణోగ్రతపై ఆధారపడి, వాటిని త్వరగా లేదా తరువాత చూడవచ్చు. మొదటి కొన్ని నెలల్లో, దూరం నుండి చూడగలిగే పైన్‌ల పైన ఉన్న "తెల్ల సంచులు" అత్యంత చల్లగా ఉండేవి. వాటిలో ఒక్కొక్కటి 100 నుండి 200 లార్వాలను కలిగి ఉంటాయి. వేడి ప్రతి గూడును కూడా ప్రభావితం చేస్తుంది మరియు అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ మంది వ్యక్తులు పుడతారు. సూర్యుడు అదృశ్యమైనప్పుడు గొంగళి పురుగులు ఆహారం కోసం ఒక్కొక్కటిగా బయటకు వెళ్తాయి, కానీ అప్పుడు వారు "తెల్ల సంచులు" అని పిలిచే వారి గూళ్ళకు తిరిగి వచ్చారు. ఏప్రిల్ మరియు మే మధ్య మార్పులు ప్రారంభమయ్యాయి. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ చెట్లు కూలడం ప్రారంభిస్తాయి. అవి నేలపైకి వచ్చిన తర్వాత, సీతాకోకచిలుకగా రూపాంతరం చెందడాన్ని కొనసాగించడానికి అవి భూమిలోకి బురో చేయడం ప్రారంభిస్తాయి. ఊరేగింపు గొంగళి పురుగును ఎలా ఎదుర్కోవాలి ఈ కీటకాల వల్ల కలిగే నష్టాన్ని తీవ్రంగా వర్గీకరించలేమని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నప్పటికీ, కలప ఉత్పత్తికి ఉపయోగించే పైన్ తోటలలో అవి సమస్యను కలిగిస్తాయి. ఈ కారణంగా, ఊరేగింపు గొంగళి పురుగుల దాడుల ప్రభావాన్ని తగ్గించడానికి అనేక పద్ధతులు అభివృద్ధి చేయబడ్డాయి. అత్యంత ప్రభావవంతమైనది, అదే సమయంలో ప్రాథమికంగా ఉన్నప్పటికీ, పైన్ సూదులలో ఉన్న పాకెట్స్ తొలగించడంలో ఉంటుంది. టెర్మినల్ సూదులలో ఉన్న పాకెట్స్‌కు ఈ పద్ధతి తగినది కాదు, ఎందుకంటే ఇది చెట్ల పెరుగుదలను దెబ్బతీస్తుంది. గొంగళి పురుగుల వెంట్రుకల విష ప్రభావాలను నివారించడానికి పాకెట్స్ ఉన్న కొమ్మలకు ముందుగానే నీరు పెట్టడం ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడింది. మరొక పద్ధతి ఏమిటంటే, చెట్టు అడుగున గరాటు వంటి గట్టి ప్లాస్టిక్‌ను ఉంచి నీటితో నింపడం. గొంగళి పురుగు కవాతు ముందు ఇది చేయాలి. ఇది జరిగినప్పుడు, గొంగళి పురుగు అనివార్యంగా నీటిలో పడి చనిపోతుంది. చివరగా, కొన్ని తోటలలో పైన్ కవాతును ఎదుర్కోవడానికి మరింత అధునాతన జీవ పద్ధతులు అభివృద్ధి చేయబడ్డాయి, ఇందులో మగవారిని ఆకర్షించడానికి ఫెరోమోన్ "ట్రాప్స్" ఉంచడంతోపాటు, ఈ కీటకం యొక్క పునరుత్పత్తి ప్రభావం తగ్గుతుంది. స్టింగ్ చికిత్స ఎలా సీతాకోకచిలుకలు ప్రమాదకరమైనవి కావు, కానీ గొంగళి పురుగులు. సమస్య ఏమిటంటే, గొంగళి పురుగు యొక్క జుట్టు చర్మంతో తాకినప్పుడు దద్దుర్లు వంటి ప్రతిచర్యను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రాంతంలో ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి మరియు తరచుగా చికాకుపడటం వలన ఇది సాధారణంగా కనిపిస్తుంది. మరింత సంక్లిష్ట పరిస్థితుల్లో, అవి శ్వాస సమస్యలను కలిగిస్తాయి. ఇది జరిగితే, మనం ఈ క్రింది వాటిని చేయాలి కీటకాల వెంట్రుకలను తొలగించడానికి ఆ ప్రాంతాన్ని సబ్బు మరియు నీటితో కడగాలి. తేలికపాటి కేసులను కార్టికోస్టెరాయిడ్ క్రీమ్‌తో చికిత్స చేయండి యాంటిహిస్టామైన్లు సాధారణంగా ప్రతి గంటకు తీసుకుంటారు. మరింత తీవ్రమైన సందర్భాల్లో, క్లినికల్ సెంటర్ కార్టికోస్టెరాయిడ్స్‌ను ఇంట్రామస్కులర్‌గా ఇంజెక్ట్ చేస్తుంది. పెంపుడు జంతువులు తరచుగా ఈ రకమైన జంతువులచే ప్రభావితమవుతాయి. చాలా సందర్భాలలో దానిని ఉపయోగించడానికి ప్రయత్నించిన తర్వాత, ఆ ప్రాంతం సాధారణంగా చికాకుగా ఉంటుంది. మంట కూడా ఉంది మరియు సాధారణంగా అధిక వాపు ఉంటుంది. పరిస్థితి మరింత దిగజారినప్పుడు, అది చివరికి నెక్రోటిక్‌గా మారుతుంది. అందువల్ల, కార్టికోస్టెరాయిడ్స్‌ను ఉపయోగించడం మరియు యాంటీబయాటిక్‌లను ఉపయోగించడం ద్వారా ప్రత్యేక నివారణలతో చికిత్స చేయాలి.
2022/01/21 07:25:09
https://www.renovablesverdes.com/te/procession-%E0%B0%B0%E0%B1%87%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81-%E0%B0%97%E0%B1%8A%E0%B0%82%E0%B0%97%E0%B0%B3%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81/
mC4
శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –11 | సరసభారతి ఉయ్యూరు ← ఊసుల్లో ఉయ్యూరు — 35 ఆ నాటి లఘు యంత్రాలు ఊసుల్లో ఉయ్యూరు –36 నాన్నా సినిమా! – మామయ్యా సినిమా !! → 26—" విరించి పంచత్వం ప్రజతి హరి రాప్నోతి విరతిం –వినాశం ,కీనా శోభజ తి ధనదో యాతి నిధనం వితంద్రీ ,మాహేంద్ర వితతి రపి ,సమ్మిలిత దృశా –మహా సంహారే స్మిన్ ,విహరతి ,సతి ,త్వత్పతి రసౌ " తాత్పర్యం –స్వాధి స్టా నదేవతా !మహా ప్రళయం తర్వాతా బ్రహ్మాది దేవత లంతా ,సంహారం పొందుతున్నారు .నీ పతి సదా శివుడు మాత్రం ,విశ్రుమ్ఖలం గా విహరిస్తున్నాడు .ఆది నీ పాతి వ్రత్య మహాత్మ్యమే .దాని వల్లనే నీ పతి లయం కావటం లేదు . విశేషం –సతీ అంటే సత్ శబ్దం యొక్క స్త్రీ లింగ రూపమే .సత్ రూప పర బ్రహ్మ మైన శివ బ్రహ్మానికి నాశనం లేదని భావం . 27–"జపో జల్పశిల్పం ,సకల మపి ,ముద్రా విరచనా –గథిహ్ ప్రాదక్షిన్య క్రమణ ,మశనా ద్యాహుతి విధిహ్ ప్రణామస్సంవేశ స్సుఖ ,మఖిల మాత్మార్పణ దృశా –సపర్యా పర్యాస్తవ భవతు ,యన్మే విలసితుం " తాత్పర్యం –శర్వాణీ !ఆత్మ సమర్పణ బుద్ధి తో నేను నోటి తో పలికిన మాటలన్నీ నీ వు నిర్మించినవే .నువ్వు నిర్మించినవే కనుక అవి నీ మంత్ర జపమే .ఈ శరీరం నీవే ఇచ్చావు కనుక ,నేను చేసే హస్త విన్యాసాలన్నీ నీకు చేసే ముద్రా విధానాలుగా నే భావించు .ఎంతటి వివేకమూ వినయమూ శ్రీ భాగవత్పాడులలో ఉన్నాయో దీనితో మనకు అర్ధ మవుతోంది .అంతా ఆమె ఇచ్చింది కనుక తాను కొత్తగా చెప్పేదేమీ లేదని ,తాను చేసే చేష్టలన్నీ ఆమె కైన్కర్యాలే నని గడుసు గా చెప్పారు .నీవు సర్వ వ్యాపివి కనుక నేను చేసే సంచారం అంతా నీకు చేసే ప్రదక్షినమే అనుకో .నా అంగ భంగిమ లన్నీ ,నీకు ప్రనామాలే .నీవే జతరాగ్ని వి కనుక నేను గ్రహించే అన్న ,పానాదు లన్నీ ,నీ ప్రీతీ కోసం చేసే హోమం గా స్వీకరించు .శబ్ద స్పర్శాడులతో నేను చేసే చేష్ట లన్నీ నీ సపర్యలె అని భావించు .అని అమ్మ ఇచ్చినవన్నీ అమ్మకే సమర్పిస్తున్నానని భావన . విశేషం –అన్ని అక్ష రాలు ,మాతృకా వర్ణ రూపాలే కనుక పలుకులన్నీ జపంతో సమానాలే అని భావం .హస్త విన్యాసాలన్నీ జపం లో చేసే ముద్రలే .అన్నీ ఆమెకే చెందు తాయి .మాత జథరాజ్ఞి స్వ రూపం .కనుక మనం తిన్నదంతా ఆమెదే .సందేశం అంటే శయనం నీ ముద్రాదులన్నీ ఆత్మ సమర్పణ ద్రుశాలు .ఇదంతా "సపర్యా పర్యాయం '.'భగవద్ గీత లో కూడా "మన్మనా భవ ,మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు –మమే వేశ్యసి కౌంతేయ ,ప్రతి జానే ప్రయోజనే "అన్నాడు శ్రీ కృష్ణ భాగ వాన్ .ఏమి చేసినా ,ఎలా చేసినా ,సర్వం భగ వతికి అర్పణమే .ఇంకేదైనా పూజ చేస్తే ఆది పూజా క్రమం కాదు అని తెలియ జేయటమే . 28–"సుధా మప్యాస్వాద్య ప్రతి భయ జరా మృత్యు హరిణీం –విపద్యన్తే విశ్వే ,విధి ,శత మఖ ,ముఖాద్యాది విషదః కరాళం ,యత్ప్రేళం ,కబలిత వతః కాల కలనా –న శంభో స్తన్మూలం ,తవ ,జనని ,తాటంక మహిమా " తాత్పర్యం –మహేశ్వరీ ! దేవత లంతా అమృతం త్రాగి నా ,జరా మృత్యువు లను పొందుతున్నారు .అంతా ప్రళయం లో లయమవుతున్నారు .అయితే కాల కూటవిషాన్ని త్రాగిన నీ భర్త శివుడు ,ప్రళయ కాలం లో కూడా చని పోకుండా ,కాలానికి అతీతు డై ,మ్రుత్యుమ్జయుడై ఉన్నాడు .దీనికి కారణం నీ చెవి కమ్మల ప్రభావమే . విశేషం –తాటంకాలు అంటే చెవి కమ్మలు. సౌభాగ్య చిహ్నాలు .ఆమె కమ్మలకు చేటు తెచ్చే శక్తి కాలానికి లేదని అర్ధం .కారణం –కాలానికి ఉత్పత్తి ,స్తితి ,లయాలు శ్రీ దేవి తాటంక నియ తాలు .కనుక ఆమె పాతి వ్రత్య మహిమ సర్వాతీ శయ మైనది అని భావం .శ్రీ దేవి కాల సంకర్శిణి .అమే ను సేవిస్తే, కాల భయం ఉండదు .సతుల పాతివ్రత్యమే పతులకు శ్రీ రామ రక్ష. .అందుకే సువాసినులు మంగళ ప్రద మైన చెవి కమ్మలను, కమ్మర ,ముంగర ,కుంకుమ ,మంగళ సూత్రం సర్వదా కాపాడు కోవాలి అని తెలియ దగిన విషయం. ఇతర దేవతల సౌభాగ్యం నశించేది .భగ వతి సౌభాగ్యం అనశ్వరం .అమృతం తాగిన వారికి కూడా చావు తప్పలేదు .మృత్యు రూపమైన కాల కూటాన్ని భక్షించిన వాడు శివుడు మ్రుత్యున్జయుడైనాడు .దీనికి కారణం కూడా భగ వతి పాతి వ్రత్యమే .
2022/06/26 01:37:06
https://sarasabharati-vuyyuru.com/2012/09/29/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%B6%E0%B0%82%E0%B0%95%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B2%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%B8%E0%B1%8C%E0%B0%82-5/
mC4
కండ్లలో కారంచల్లి.. కత్తులతో దాడి - Feb 24, 2021 , 04:48:24 చావుబతుకుల మధ్య బాధితుడు నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన అంబర్‌పేట, ఫిబ్రవరి 23 : కండ్లల్లో కారం చల్లి ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ మొగిలిచెర్ల రవి వివరాల ప్రకారం... నల్లకుంట, శంకరమఠం టెంపుల్‌కు ఎదురు లేన్‌లో ధీరజ్‌ అహ్మద్‌ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతడు వేరే దేశంలో ఎంబీబీఎస్‌ చదివి హైదరాబాద్‌కు వచ్చాడు. ఇతడికి ఇద్దరు భార్యలు. సోమవారం రాత్రి 11.15 గంటల సమయంలో నల్లకుంటలోని ఇంటి ముందు ఉండగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కండ్లల్లో కారం చల్లి కత్తులతోదాడి చేశారు. కడుపు, వీపు, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. అరుపులు విన్న ఇంటి మొదటి అంతస్తులో ఉన్న సోదరుడు ఫయాజ్‌ అహ్మద్‌ వచ్చి చూడగా ధీరజ్‌ అహ్మద్‌ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే దగ్గరలో ఉన్న ఆంధ్ర మహిళా సభ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు.. మెరురైన చికిత్స కోసం హైదర్‌గూడ అపోలోకు పంపించారు.. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో దవాఖానకు తరలించి చికిత్స చేస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు ఫయాజ్‌ అహ్మద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
2021/02/28 13:11:22
https://www.ntnews.com/hyderabad/murder-attempt-in-nallakunta-ps-limits-139108
mC4
కరుణానిధి ఆరోగ్యం విషమం: అర్ధరాత్రి ఆస్పత్రికి తరలింపు, స్టాలిన్‌కు మోడీ ఫోన్ | Family, crowds leave hospital after hospital says Karunanidhi is stable - Telugu Oneindia కరుణానిధి ఆరోగ్యం విషమం: అర్ధరాత్రి ఆస్పత్రికి తరలింపు, స్టాలిన్‌కు మోడీ ఫోన్ | Published: Saturday, July 28, 2018, 8:38 [IST] చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఆయన్ను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత హుటాహుటిన చెన్నై నగరంలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులతోపాటు భారీ సంఖ్యలో డీఎంకే నేతలు కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. కాగా, కరుణానిధి ఆరోగ్యం మెరుగుపడుతోందని, జ్వరం తగ్గిందని డీఎంకే నేతలు స్టాలిన్‌, దురైమురుగన్‌, అళగిరి తదితరులు రాత్రి పదింటి వరకు ప్రకటించారు. వదంతులు నమ్మవద్దని పార్టీశ్రేణులకు భరోసానిస్తూ వచ్చారు. స్టాలిన్‌ సహా ఇతర నేతలంతా కరుణ నివాసం నుంచి వెళ్లిపోయారు. అయితే, శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.15గంటల ప్రాంతంలో స్టాలిన్‌, అళగిరి, ఎ.రాజా, కనిమొళి, దురైమురుగన్‌ మరోసారి గోపాలపురంలోని కరుణ నివాసానికి చేరుకున్నారు. వారితో పాటు కావేరి ఆసుపత్రి వైద్యుల బృందం అంబులెన్స్‌తో సహా వచ్చారు. కరుణానిధిని అంబులెన్స్‌లో ఆస్పత్రిలో చేర్చారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించామని తమిళనాడు ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యులు డాక్టర్‌ గోపాల్‌ తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉందని, రక్తపోటు పడిపోయిందని ఆయన వెల్లడించారు. ఆయన్ను ఐసీయూలో చేర్చుతున్నామన్నారు. కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని శనివారం ఉదయం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఆయన కుటుంబసభ్యులు, డీఎంకే కార్యకర్తలు ఆస్పత్రి వద్ద నుంచి వెళ్లిపోయారు. కాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ ద్వారా కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌, కుమార్తె కనిమొళిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు 'కరుణానిధి ఆరోగ్యంపై స్టాలిన్‌, కనిమొళితో మాట్లాడాను. ఏదైనా అవసరమైతే చేస్తానని చెప్పాను... ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నాను' అని మోడీ ట్విట్టర్‌లో వెల్లడించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, వామపక్ష పార్టీల నేతలు సీతారాం ఏచూరి, డి. రాజా కూడా కరుణానిధి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కరుణ ఆరోగ్య పరిస్థితిపై స్టాలిన్‌తో మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. Read in English: Family, crowds leave hospital karunanidhi health chennai tamil nadu mk stalin కరుణానిధి ఆరోగ్యం తమిళనాడు ఎంకే స్టాలిన్ DMK chief M Karunanidhi was shifted to a Chennai hospital past midnight, hours after his son MK Stalin issued a statement that there is an improvement in his health. The DMK chief is being treated at his residence for fever due to Urinary Tract Infection (UTI).
2019/07/20 01:03:39
https://telugu.oneindia.com/news/india/family-crowds-leave-hospital-after-hospital-says-karunanidhi-is-stable-230830.html
mC4
'ఆర్‌ఎక్స్‌ 100' డైరెక్టర్‌కి హీరో దొరికాడా.? Home Telugu 'ఆర్‌ఎక్స్‌ 100' డైరెక్టర్‌కి హీరో దొరికాడా.? By Inkmantra - February 21, 2020 - 07:30 AM IST 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ అందాల్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఘనత డైరెక్టర్‌ అజయ్‌ భూపతిది. తొలి సినిమాకే సూపర్‌ సక్సెస్‌ అందుకున్నా ఈ డైరెక్టర్‌ రెండో సినిమా అనౌన్స్‌ చేయడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఎప్పటి నుండో 'మహా సముద్రం' స్క్రిప్టుపై వర్క్‌ చేస్తున్నాడు అజయ్‌ భూపతి. ఇంతవరకూ ఆ సినిమా సెట్స్‌ పైకి వెళ్లలేదు. రవితేజతో ఈ సినిమా చేయాలనుకున్నాడు కుదరలేదు. స్క్రిప్టులో చిన్నా చితకా మార్పులు చేసి, సమంతను సంప్రదించాడట. సమంత కూడా ఈ స్క్రిప్టుకు ఓకే చెప్పకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఇంతవరకూ కార్య రూపం దాల్చలేదు. తాజాగా మరోసారి ఈ సినిమా ముచ్చట తెరపైకి వచ్చింది. యంగ్‌ హీరో శర్వానంద్‌కి డైరెక్టర్‌ ఈ కథను వినిపించాడనీ సమాచారం. శర్వా దాదాపు ఓకే చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా 'సమ్మోహనం' భామ అదితీ రావ్‌ హైదరి పేరు వినిపిస్తోంది. ఆల్రెడీ స్టోరీ లైన్‌ విన్న అదితి, ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. అయితే ఇది మల్టీ స్టారర్‌ మూవీ కావడంతో, మరో హీరో కోసం డైరెక్టర్‌ వేట కొనసాగుతోందట. ఆల్రెడీ శర్వా సెట్‌ అయ్యాడని తెలుస్తోంది కాబట్టి, శర్వాని మ్యాచ్‌ చేయగల మరో యంగ్‌ హీరోని వెతికి పట్టుకునే పనిలో ప్రస్తుతం అజయ్‌ భూపతి ఉన్నట్లు తెలుస్తోంది.
2021/09/17 16:41:11
https://telugu.iqlikmovies.com/viewnews/ajay-bhupathi-next-movie-maha-samudhram-cast-update/14056
mC4
కుందుజ్‌పై ఆగని బాంబుల వర్షం | Afgan war - Telugu Oneindia 8 min ago పాకిస్తాన్ తెంపరితనం: ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే.. డిప్యూటీ హైకమిషనర్ కు సమన్లు 12 min ago అయోధ్య తీర్పు వస్తుంది... కత్తులు కొని సిద్దంగా ఉండండి.. బీజేపీ నేత 17 min ago భారీ అవినీతికి తెరలేపారు! జైలుకు పంపుతా: కేసీఆర్‌పై నాగం జనార్ధన్ రెడ్డి నిప్పులు 22 min ago అభిజిత్‌కు రాహుల్ ప్రశంసలు: మిమ్మల్ని చూసి కోట్లాదిమంది గర్వపడుతున్నారు.. కుందుజ్‌పై ఆగని బాంబుల వర్షం కుందుజ్‌ః తాలిబన్ల చివరి స్థావరం కుందుజ్‌పై అమెరికా యుద్ధమానాల బాంబుల వర్షం కొనసాగుతునే వున్నది. అయితే నార్తర్న్‌ అలయన్స్‌ మాత్రం నిగ్రహం పాటిస్తున్నది. కుందుజ్‌లో వేల సంఖ్యలో వున్న తాలిబన్లు లొంగిపోవడానికి సిద్ధంగా వున్నట్టుగా ప్రకటించడంతో నార్తర్న్‌ అలయన్స్‌ బలగాల ప్రధానాధిపతి రషీద్‌ దోస్తుంతన సేనలను నగర శివార్లలోనే నిలిపివేశారు. అయితే దోస్తుం నిర్ణయాన్ని అలయన్స్‌ అగ్రనేత మాజీ అధ్యక్షుడు రబ్బానీ తీవ్రంగా ఆక్షేపించినట్టు తెలిసింది. నార్తర్న్‌ అలయన్స్‌ సేనలు కుందుజ్‌లోకి దూసుకుపోతే పరిస్థితి షుంచే అవకాశం వున్నదన dధుల్లో నెత్తురు మడుగులు కట్టడం ఖాయమని ఐక్యరాజ్య సుతి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అలయన్స్‌ బలగాలు కుందుజ్‌లోకి ప్రవేశిస్తే మజారేషరీఫ్‌ సంఘటనలే మళ్లీ పునరావృత్తం అయ్యే అవకాశం వున్నదన్న భయాన్ని రెడ్‌క్రాస్‌ వ్యక్తం చేసింది. లొంగుబాటు ునహా తాలిబన్లకు మరోమార్గం లేదని అందువల్ల ఆదివారం వరకు వారికి గడువు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా దోస్తుం ధేయులైన అలయన్స్‌ కమాండర్లు చెబుతున్నారు. కాగా రబ్బానీ అనుకూల సైనికులు మాత్రం దూకుడుగా కుందుజ్‌లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం అందింది. అలయన్స్‌ నేతల్లో పొడసూపిన భేదాలతో ఇక్కడ పరిస్థితిలో గందరగోళం నెలకొన్నది. మరోవైపు ఇప్పటికే పెద్ద సంఖ్యలో తాలిబన్‌ యోధులు ఆయుధాలు అప్పగించి లొంగిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. లొంగిపోయినా తమ ప్రాణాలు దక్కడం కష్టమన్న భయంతో వున్న అరబ్‌, ఉజ్బెక్‌, చెచన్యా, పాకిస్తాన్‌కు చెందిన తాలిబన్‌ అనుకూల సైనికులు కడదాకా పోరాడేందుకు సిద్ధపడటంతో లొంగుబాటు పర్వం సవ్యంగా సాగడం లేదని అంటున్నారు. dరందరి ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలని అలయన్స్‌ సేనానుల్ని ఐక్యరాజ్యసుతి కోరుతున్నది. అమెరికా మాత్రం తన మానాన తాను బాంబుదాడులను కొనసాగిస్తూనే వుంది.
2019/10/20 12:09:55
https://telugu.oneindia.com/news/2001/11/24/afgan.html
mC4
హైదరాబాద్ లో కిలోమీటరు దూరంలో 12 సినిమా హాల్స్... సిద్ధం చ.. హైదరాబాద్ లో కిలోమీటరు దూరంలో 12 సినిమా హాల్స్... సిద్ధం చేసిన ఎల్ అండ్ టీ! Tue, Nov 28, 2017, 08:55 AM పంజాగుట్ట, ఎర్రమంజిల్ మాల్స్ డిసెంబర్ లో ప్రారంభం కిలోమీటరు దూరంలోనే రెండు భారీ మాల్స్ 45 శాతం ఆదాయం పొందడమే ఎల్ అండ్ టీ లక్ష్యం కేవలం మెట్రో రైలుతో వచ్చే ఆదాయంతో రైలు మార్గం నిర్మాణం కోసం తాము వెచ్చించిన నిధులు వెనక్కు రావంటూ, ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్ అండ్ టీ భారీ మాల్స్ నిర్మాణంను చేపట్టిన సంగతి తెలిసిందే. మెట్రో రైలు ప్రారంభోత్సవం తరువాత మాత్రమే ఈ మాల్స్ ప్రారంభించుకోవచ్చన్న నిబంధన ఉండగా, నేడు ఆ ముహూర్తం నిశ్చయమైంది. రేపటి నుంచి మెట్రో సేవలు హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి రానుండగా, సాధ్యమైనంత త్వరలోనే మాల్స్ ను ప్రారంభించే యోచనలో ఎల్ అండ్ టీ ఉంది. ఇప్పటికే పంజాగుట్ట, ఎర్రమంజిల్ మధ్య కేవలం కిలోమీటరు దూరంలో రెండు మాల్స్ ను సంస్థ పూర్తి చేసింది. ఈ రెండు చోట్ల 12 వరకూ సినిమా హాల్స్ ఉంటాయి. పలు ప్రముఖ బ్రాండ్లు దుకాణాలు ఏర్పాటు చేసేందుకు డీల్స్ కుదుర్చుకున్నాయి. పంజాగుట్టలో గతంలో 'పడవ స్కూల్' ఉన్న ప్రాంతంలో ఎల్ అండ్ టీ నిర్మించిన మాల్ అత్యున్నత సాంకేతిక వసతులతో నిర్మితం కాగా, ఎర్రమంజిల్ మాల్ సైతం అదే స్థాయిలో తయారైంది. వీటితో పాటు హైటెక్ సిటీ మాల్, మూసారంబాగ్ లో నిర్మాణం కొలిక్కి వచ్చింది. తొలుత ఎర్రమంజిల్, పంజాగుట్ట మాల్స్ ను రాబోయే నెల రోజుల్లోనే ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. డిసెంబర్ చివరిలోగా ఇవి సేవలు ప్రారంభిస్తాయని సమాచారం. ఇక ఈ మాల్స్ నుంచి ఎల్అండ్ టీ కి వచ్చే ఆదాయం 45 శాతం వరకూ కవర్ అవుతుందని అంచనా. పైగా వీటికి సమీపంలోని మెట్రో స్టేషన్లు అనుసంధానం అయి ఉండటంతో, వీటికి ప్రజాదరణ కూడా బాగానే ఉంటుందని సంస్థ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రూ.2243 కోట్ల వ్యయంతో నిర్మాణం అవుతున్న మొత్తం నాలుగు మాల్స్ కలిపి 60 లక్షల చదరపు అడుగుల్లో ఉండగా, ఒక్క రాయదుర్గం వద్ద ఉండే హైటెక్ సిటీ మాల్ 15 ఎకరాల్లో 30 లక్షల చదరపు అడుగుల్లో నిర్మితమవడం గమనార్హం. ఈ మాల్ మాత్రం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకూ మెట్రో రైల్ నిర్మాణం పూర్తి కాకపోవడమే ఇందుకు కారణం.
2020/01/22 01:24:49
https://www.ap7am.com/flash-news-596727-telugu.html
mC4
రైతుల కష్టాలు తెలుసుకోడానికే వచ్చా | YSR Congress Party హోం » Others » రైతుల కష్టాలు తెలుసుకోడానికే వచ్చా రైతుల కష్టాలు తెలుసుకోడానికే వచ్చా 31 Oct 2013 3:38 PM నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా), 31 అక్టోబర్ 2013: రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ‌అమలు చేశారని, వరద ముంపుతో ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలు తెలుసుకోవడానికే తాను పర్యటిస్తున్నానని... ఆటంకం కలిగించవద్దని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. 90 శాతం పత్తి, మొక్కజొన్న పంటలు తెలంగాణ ప్రాంతాలోనే దెబ్బతిన్నాయని ఆమె తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఒక్క తెలంగాణలోనే ఐదుగురు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె చెప్పారు. ఖమ్మం జిల్లా ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం శ్రీమతి విజయమ్మ నేలకొండపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయే ప్రసక్తే రాదన్నారు. మధిర, వైరా, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో గురువారం తాను వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించానని శ్రీమతి విజయమ్మ తెలిపారు. బాధలో ఉన్న రైతులను పలుకరించడానికే తాను వచ్చానన్నారు. విభజన వ్యవహారంలో తమ వైఖరి ఎప్పుడూ మారలేదని ఒక్కటిగానే ఉందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమైక్యాంధ్రను కోరుతోందన్నారు. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే తమ పార్టీ విధానం అన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయగలిగారు కానీ కోట్లాది మంది ప్రజల హృదయాల్లో నిండి ఉన్న ఆయనను తొలగించలేరని శ్రీమతి విజయమ్మ అన్నారు. ఇలాంటి చర్యను విధ్వంసకుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఐదు రోజులుగా తాను పర్యటించిన ముంపు ప్రాంతాల్లో ప్రధానంగా వరి, ప్రత్తి, మిర్చి, మొక్కజొన్నపంటలు బాగా దెబ్బతిన్నాయని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3,37,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆమె తెలిపారు. పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం జిల్లాలో 431 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. పంటలు పాడైపోయిన దుఃఖంలో ఖమ్మం జిల్లాలో ఇద్దరు రైతులు గుండె పగిలి మరణించారన్నారు. వర్షాలు, వరదల వల్ల ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే మూడు వంతుల పత్తి, సుమారు 90 శాతం మొక్కజొన్న పంటలు నష్టపోయాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం మొత్తం మీద 29 లక్షల ఎకరాల్లో పంట నాశనమైందన్నారు. 45 వేల పైచిలుకు ఇళ్ళు కూలిపోయాయన్నారు. మొత్తం 53 మంది మరణించారన్నారు. 28 వేల మగ్గాలు పనికి రాకుండా పోయాయని తెలిపారు. ఇంతకు ముందు వచ్చిన నీలం తుపానుకు సంబంధించిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇంత వరకూ అందించలేదని ప్రతి చోటా రైతులు, బాధితులు తనకు చెప్పారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. ఫై లీన్‌ తుపాను వచ్చి కూడా తొమ్మిది రోజులు అవుతోందని, అయినా ఇంతవరకూ బాధితులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత నాలుగేళ్లుగా రైతులకు ఎక్కడా నష్టపరిహారం చెల్లించలేదన్నారు. బతకడానికే కష్టంగా ఉందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. 2010 - 13 మధ్య ఏడు వందల కోట్ల రూపాయలు పంట నష్టమని చెప్తున్న పాలకులు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. వరదల్లో ఆప్తులను, కన్నబిడ్డల్లాగా పెంచుకున్న ప్రత్తి చేలను పోగొట్టుకున్న వారిని చూస్తే తనకు చాలా కష్టం అనిపించిందన్నారు. వర్షాలకు మగ్గాలు పాడైపోయి నేత పని చేసుకునే పరిస్థితి లేక చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తంచేశారు. తుపానులు వచ్చినప్పుడు మత్స్యకారులకు 20 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్‌ ఇచ్చే ఆనవాయితీని కూడా అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని శ్రీమతి విజయమ్మ దుయ్యబట్టారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతులను ఈ ప్రభుత్వం అన్ని విధాలా దెబ్బతీస్తున్నదని విమర్శించారు. వ్యవసాయానికి రెండు గంటలు కూడా ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడంలేదని అన్నారు. పంటలు దెబ్బతిన్న ప్రతి ఎకరాకు రూ. 10 వేలు తక్షణమే ఇవ్వాలని, రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడ‌తామన్నారు. చంద్రబాబులా తాము అబద్ధాలు చెప్పం అన్నారు. త్వరలోనే‌ జగన్‌బాబు నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, అందరి కష్టాలు తీరుస్తారని శ్రీమతి విజయమ్మ ముంపు బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. మహానేత వైయస్ఆర్‌ నాటి సువర్ణయుగం తప్పకుండా వస్తుందని ధైర్యం చెప్పారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, శ్రీ జగన్మోహన్‌రెడ్డికి అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందడం కావాలన్నారు.
2019/10/20 22:35:03
https://www.ysrcongress.com/others/smt-vijayamma-pressmeet-8782
mC4
మెగా హీరో కోసం భారీగా ఖర్చు చేయనున్న పవన్ కళ్యాణ్.. అతను మళ్ళీ తిరిగిస్తాడా? | Pawan kalyan another movie as a producer hero confirmed - Telugu Filmibeat టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఆర్థిక సహాయలు ఏ రేంజ్ అందిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఎలాంటి ఘటనలు జరిగినా అందరికంటే ముందుగా స్పందించి సహాయం అంధించే వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పవన్ ఆర్థికంగా కాస్త వెనుకబడినట్లు తెలుస్తోంది. అందుకే వరుసగా సినిమాలను చేస్తూ భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్నాడు. అయితే ఆయన మరోసారి ప్రొడక్షన్ లోకి కూడా అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా.. రెండు సినిమాలు ప్లాప్.. పవన్ కళ్యాణ్ నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. సర్దార్ గబ్బర్ సింగ్, అలాగే యువ హీరో నితిన్ ఛల్ మోహన్ రంగా సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరించారు. కానీ ఆ రెండు సినిమాలు కూడా పవర్ స్టార్ కు అంతగా లాభాలను అందించలేకపోయాయి. ఇక నెక్స్ట్ ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు. త్రివిక్రమ్ సలహా మేరకు.. పవన్ కళ్యాణ్ సినిమాలను నిర్మించాలని ఎప్పటి నుంచో కథలను వింటున్నాడు గాని ఏది నమ్మకంగా అనిపించడం లేదు. అలాగే త్రివిక్రమ్ కూడా కొన్ని కథలను సజెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయాన సలహా మేరకు రెండు కథలను పెండింగ్ లిస్ట్ లో పెట్టినట్లు ఒక టాక్ అయితే వస్తోంది. ఫోటోలు: అల వైకుంఠపురము రీయూనియన్..పాల్గొన్న చిత్ర బృందం ఆ దర్శకుడితో కొత్త సినిమా ఇక ముందుదా డైరెక్టర్ కిషోర్ పార్థసాని(డాలీ) చెప్పిన కథకు పవన్ టెంప్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే వీరి కాంబినేషన్ లో గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాల అనంతరం మరో సినిమా చేయాలని అనుకుంటున్నారు కానీ కథ సెట్టవ్వలేదు. అయితే పవన్ ఈ సారి నిర్మాతగా మారి ఆ దర్శకుడికి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ నిర్మించబోయే సినిమాలో హీరో మరెవరో కాదు. ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టడానికి రెడీగా ఉన్న వైష్ణవ్ తేజ్ క్రిష్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమాను పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, కిషోర్ పార్థసాని కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ కు ఈ హీరో ఎంతవరకు లాభాలను అందిస్తాడో చూడాలి.
2021/01/26 19:35:36
https://telugu.filmibeat.com/gossips/pawan-kalyan-another-movie-as-a-producer-hero-confirmed-094469.html
mC4
తారు - Mimir నిఘంటువు english tar తారు(కెమికల్స్ పరిశ్రమ) తారు(సంగీత సామగ్రి & సాంకేతికత) తారు(సైన్స్) నావికుడిగా పనిచేసే వ్యక్తి అవశేషంగా పొందిన వివిధ ముదురు భారీ స్నిగ్ధ పదార్ధాలు ఒక చాజుయా లేదా టెమిజుయా ( 手水舎 ) అనేది టెమిజు అని పిలువబడే ఒక ఉత్సవ శుద్దీకరణ కర్మ కోసం షింటో వాటర్ అబ్లూషన్ పెవిలియన్. నీటితో నిండిన బేసిన్‌లను చాజుబాచి అని పిలుస్తారు , ఆరాధకులు వారి ఎడమ చేతులు, కుడి చేతులు, నోరు మరియు చివరికి నీటి లాడిల్ యొక్క హ్యాండిల్‌ను ప్రధాన షింటో మందిరం లేదా నీడకు చేరుకునే ముందు తమను తాము శుద్ధి చేసుకోవడానికి ఉపయోగిస్తారు. 社殿 ). ఆరాధనకు ముందు ఈ సింబాలిక్ శుద్దీకరణ సాధారణం మరియు అన్ని మనుష్యుల పుణ్యక్షేత్రాలకు ఈ సౌకర్యం ఉంది, అలాగే అనేక బౌద్ధ దేవాలయాలు మరియు కొన్ని కొత్త మత ప్రార్థనా గృహాలు ఉన్నాయి. టెమిజుయా సాధారణంగా బహిరంగ ప్రదేశం, ఇక్కడ స్పష్టమైన నీరు ఒకటి లేదా వివిధ రాతి బేసిన్లను నింపుతుంది. చెక్క డిప్పర్లు సాధారణంగా ఆరాధకులకు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి, ఈ శుద్దీకరణ వసంత, ప్రవాహం లేదా సముద్ర తీరంలో జరిగింది మరియు ఇది ఇప్పటికీ ఆదర్శంగా పరిగణించబడుతుంది. ఇసేలోని ఇన్నర్ పుణ్యక్షేత్రంలో ఆరాధకులు ఇప్పటికీ ఈ సాంప్రదాయిక పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఇది మిజుహికో, కామికో మొదలైనవి అని కూడా గమనించండి. మిజుహో / మిజుహో <సుషీ> అని కూడా చదువుతుంది. నిజానికి అది నావికులకు సాధారణ పదం ఉండేది, కానీ తరువాత అది ఒక boatman మరియు Kajiri (Kajiri) వంటి, నావికుడు కింద ఒక సీనియర్ crewman హోదా మారింది. పాలక నిబంధనల ప్రకారం, మేము నౌకాదళాలను మరియు మత్స్యకారులను భర్తలుగా (గొణుగుడు) సేకరిస్తాము లేదా ఉపయోగిస్తాము, లేదా వారిని నీటి చేతులుగా తీసుకుంటాము. సెంగోకు కాలంలో, సైనిక పాలనలో ఉన్న మత్స్యకారులు సైనిక ఆవశ్యకత కారణంగా సైనిక నియంత్రణలో ఉన్న మత్స్యకారులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు, మరియు మత్స్యకారులకు ఈ భర్త (నీటి చేతి) కోసం ఫిషింగ్ మైదానాలను ఉపయోగించుకునే హక్కు లభించింది. భారం. ఎదో కాలం ప్రాంతాన్ని బట్టి వివిధ రూపం అయినప్పటికీ, వివిధ వంశం ఇది వంటి, నిమగ్నం Kaimai రవాణా నీటి చేతి ఆడిటర్ భారం వ్యక్తి భరోసా, అలాంటివి Mizute Ulla Mitachi నీరు (మీరు Tateura) వంటి ప్రధాన మత్స్యకార గ్రామాలు తెలుపుటకు ఉంది, ఉరాకాటాకు ఆక్రమించిన ఫిషింగ్ హక్కును ఇస్తుంది. ఏదేమైనా, ప్రైవేట్ బోర్డింగ్ పరిశ్రమ అభివృద్ధి చెందడంతో, నీటి చేతి భర్త బియ్యం మరియు భర్త స్థానంలో ఉంది. Topics సంబంధిత విషయాలు రివర్ సైడ్ | Kuwasabasho మిల్లెర్ (కాకో) బొగ్గు మరియు కలప వంటి ఘన సేంద్రియ సమ్మేళనాలను ఘనీభవించినప్పుడు వాయువుతో ఆవిరైపోయే ఒక మెత్తటి నల్ల నూనె మరియు చల్లబడినప్పుడు ఘనీభవిస్తుంది. ముడి పదార్థాలు, ఉష్ణ కుళ్ళిపోయే పద్ధతి మరియు వంటి వాటిపై ఆధారపడి లక్షణాలు భిన్నంగా ఉన్నప్పటికీ, హైడ్రోకార్బన్ సాధారణంగా ప్రధాన భాగం. బొగ్గు తారు / కలప తారు
2022/01/16 10:54:35
https://mimirbook.com/te/680254bad1d
mC4
రెచ్చిపోయిన మద్యం మాఫియా: పోలీసులపై కాల్పులు, కానిస్టేబుల్ మృతి, ఎస్ఐకి తీవ్రగాయాలు | Prakshalana Published: Wednesday, February 10, 2021, 2:19 [IST] లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాస్‌గంజ్ ప్రాంతంలో లిక్కర్ మాఫియా బీభత్సం సృషించింది. అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తున్న పరిశ్రమపై సోదాలకు వెళ్లిన సమయంలో పోలీసులపై కాల్పులు జరిపింది లిక్కర్ మాఫియా దుండగులు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు కానిస్టేబుల్ మృతి చెందాడు. ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన కానిస్టేబుల్‌ను దేవేంద్రగా గుర్తించారు. గాయాలపాలైన ఎస్ఐ అశోక్ కుమార్‌ను చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులను చుట్టుముట్టిన లిక్కర్ మాఫియా ముఠా.. వారిపై కాల్పులు జరిపింది. అంతేగాక, కర్రలు, ఇనుప రాడ్లతో దాడులకు పాల్పడింది. ఈ సమాచారం అందిన వెంటనే అదనపు పోలీసులు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని దుండగుల కోసం గాలింపు చేపట్టాయి. సిధ్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా ధిమర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన ఎస్ఐ అశోక్ కుమార్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మద్యం మాఫియా దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్ దేవేంద్ర కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అంతేగాక, అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. పోలీసులపై దాడికి పాల్పడిన మద్యం మాఫియాపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారని జిల్లా కలెక్టర్ చంద్ర ప్రకాశ్ సింగ్ తెలిపారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఏడీజీ అజయ్ ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
2021/09/21 05:17:35
https://prakshalana.in/%E0%B0%B0%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AB%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE/
mC4
README.md exists but content is empty. Use the Edit dataset card button to edit it.
Downloads last month
0
Edit dataset card