text
stringlengths
335
364k
దళిత మహిళలకు సంబంధించి ఆధిపత్య వ్యవస్థలన్నీ ప్రతికూలంగా చుట్టుముట్టి ఉంటయి. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో దళిత మహిళలు చదువుకోవడమే ఒక యుద్ధం. చదువుకొని రచయిత్రులుగా సాహిత్యాల్లోకి రావడం పెద్ద యుద్ధమే. వీరి రచనలు వెలుగు చూడడం చిన్న విషయం కాదు. వీరి రచనలు బూతుగా ఉన్నాయనీ, అర్థం కావడం లేదని, వీరి సాహిత్యాల్ని సాహిత్య చరిత్రలు పక్కనబెట్టి అవాచ్యమ్‌ చేసినయి. సాహిత్య సమాజాల మీద విమర్శగా వచ్చిన ఒక జడివాన జల్లు- ‘బహుళ’ విమర్శ వ్యాసాల సంకలనం. సాహిత్య సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు రాళ్లవానగా సాహిత్యాన్ని కొంతవరకైనా పొక్కిలించిన పర్‌స్పెక్టివ్‌ ‘బహుళ’ కృషి అభినందనీయం. బహుళ సంపాదకత్వ ముందు మాటలో ‘‘ఇది సర్వ సమగ్రమని అనుకోవడం లేదు’’ అని వారి పరిమితులు చెప్పుకున్నంక కూడా సాహితీ మిత్రుడు బివిఎన్‌ స్వామి వివిధ 27-7-2020లో ప్రతిపాదించినట్లు సమగ్రము అనలేము. అసమగ్రము అనడానికి ప్రధాన కారణం- ఎస్సీ, బీసీ, ఆదివాసీ, మైనారిటీలుగా ఈ సమాజాభివృద్ధిలో చెమటను, రక్తాన్ని ధారబోస్తూన్న బహుజన జెండర్‌ సాహిత్య చరిత్రలు, సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు ‘బహుళ’లో లుప్తమైనందువల్ల. ఆధిపత్యాల్ని నిరసిస్తూ అస్తిత్వాల్ని స్వాగతించడము ఆహ్వానించదగిందే కానీ ఆ స్వాగతాలు జనాభాలో దాదాపు 50ుగా ఉన్న బహుజన జెండర్‌ సాహిత్యాల దాకా వెళ్లలేకపోయాయి. ఇక పర్‌స్పెక్టివ్‌ ప్రచురణ సంస్థ తమ మానిఫెస్టోలో బాలగోపాల్‌ మాటగా ‘‘అణచివేతను వ్యతిరేకించేది ఏదయినా ప్రజాస్వామిక దృక్పథమే. ఎన్ని తేడాలున్నా వినదగినదే, చర్చించదగినదే, అధ్యయనం చేయదగినదే’’ అనే అవగాహనా దృక్పథాలతో ప్రచురణలు చేస్తుందని ప్రకటించుకుంది. కానీ ఈ సంస్థ ప్రచురణలు మొదలైన 1988 నుంచి ఇప్పటిదాకా చూస్తే… అణచివేతను వ్యతిరేకించే ఆధిపత్య గొంతులకే (ఒకటి అరా బీసీ, ముస్లిమ్‌లు తప్ప) పెద్దపీటగా ప్రచురణలున్నాయి. ఎస్సీ, బీసీ, ఆదివాసీ మహిళలపై జరిగే చుట్టుముట్టు అణచివేతలు, వారు ఆక్రోశిస్తున్న ప్రజాస్వామిక విలువలు, వారి తిరుగుబాటులు, వారి దృక్పథాలను ప్రచురణకు స్వీకరించలేకపోయింది. తమ మానిఫెస్టోలో చెప్పుకున్న ఆదర్శాలు– మెజారిటీగా ఉన్న సామాజిక ఉత్పత్తి శక్తుల జెండర్‌ అణచివేతల్ని వారి ప్రశ్నల్ని, వారి జీవితానుభవాల్ని, చరిత్రల్ని, వారి భాషా నుడికార వ్యక్తీకరణ ప్రత్యేకతల్ని సౌందర్యాల్ని వినడం, చర్చించడం, అధ్యయనం చేయడమనే ప్రజాస్వామిక దృక్పథాల్ని ఆచరణలో ఉల్లంఘించిందని ప్రచురణలు సాక్ష్యమిస్తాయి. ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించగ’ వంటి అభివృద్ధికరమైన ఆలోచనలు అంతప్పుర స్త్రీల పట్ల ప్రాచీన సాహిత్యాల్లో కూడా కనిపిస్తుంటయి. ఇక ఆధునిక కాలంలో తెలుగులో కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, చలం, కొడవటిగంటి వంటి బ్రాహ్మణ మగ రచయితలు తమ కుటుంబా ల్లోని మహిళలపై ఉన్న దురాచారాల్ని నిర్మూలించడానికి వాటిని తమ రచనల ద్వారా సమాజం ముందు పెట్టి విస్తృత అధ్యయనాలు, చర్చలు ప్రేరేపించి ప్రభుత్వాలను ప్రభావితం చేసి చట్టాలు తీసుకుని రాగలిగారు. ఆ ఫలితాల వల్ల జనాభాలో కనీసం 5ు కూడా లేని సవర్ణ మహిళలు తమకున్న సామాజిక దురాచారాలను దాటుకొని బైటకొచ్చారు. తమ మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో వాటా అడిగే దశకు చేరుకున్నది సవర్ణ స్త్రీ సాహిత్యం. ఒకపక్క కులాధిపత్యం పేరుతో సమాజంలో అతిచిన్న జనాభాగా వున్న, ఉత్పత్తికి ఆవలవున్న సవర్ణ మగస్వామ్యాలు చరిత్ర, రాజకీయాలు, ఉద్యమాలు, సాహిత్య నిర్మాణాలపై తమకున్న అవగాహననే సార్వజనీనం చేసి భిన్న అస్తిత్వాల బహుజన సమాజమ్మీద రుద్దారు. మరోపక్క జెండర్‌ పేరుతో తమ మగ స్వామ్యాలు వేసిన దారినే నడిచిన సవర్ణ హిందూ స్త్రీ స్వామ్యాలు తమ చెమట చిందని అభిప్రాయాలనే, జెండర్‌పై తమకున్న అవగాహననే సార్వజనీనంగా ప్రచారం చేసి, చరిత్రల్లో, సాహిత్యాల్లో, ఉద్యమాల్లో, రాజకీయాల్లో బహుజన కులాల జెండర్‌ అస్తిత్వాల్ని మాయం చేసినయి. సాహిత్య చరిత్రలు, సాహిత్య విమర్శలు ఆధిపత్య పురుషులు కేంద్రకంగా, తర్వాత ఆధిపత్య స్త్రీలు కేంద్రకంగా వచ్చినయి. సాహిత్య చరిత్ర రచనల్లో, విమర్శల్లో బహుజన కులాల జెండర్‌లకు సూదిమొన గుర్తింపులేని అన్యాయాలు జరిగినవి. ప్రాచీనకాలంలో డక్కలి మహిళలు రాయకుంటే… ‘దయ్యం పియ్యండుకుంటేంది? డక్కలిది పాశమొండు కుంటేంది? ఆ సాహిత్యాలు కుక్కముట్టిన కుండలు’ అనే సూత్రీకరణలు ఎట్లా వస్తాయి? డక్కలి మహి ళలు రాసిండ్రనేగదా! ఇప్పటికి డక్కలి వాళ్లిండ్లకు పోతే… ‘కవిలె’ కట్టలు కనిపిస్తుంటయి. డక్కలి మహిళలు ఆ ‘కవిలె’ల్ని విప్పి అవలీలగా చదువు తుంటరు. వాటిని భద్రంగా గౌరవంగా ఒక తరాన్నించి ఇంకో తరానికి అందిస్తూ కొనసాగి స్తుంటరు. ఇప్పటికి తాటాకుల మీద ఘంటంతో డక్కలి రాజమొగిలి అవలీలగా రాస్తుంటడు. ఇవేవి సాహిత్యకారులకు, సాహిత్య విమర్శకులకు పట్టనిది. ఆధునిక కాలంలో ఆంధ్ర, క్రైస్తవ కీర్తనలు 1860 నుంచి దళిత మహిళలు రచన చేస్తున్నారని ‘నల్లపొద్దు’ (దళిత మహిళల ఆంథాలజి)లో గోగు శ్యామల చెప్పేదాకా- ఆంధ్ర కవుల చరిత్రలు, గోల్కొండ పత్రికలు, ఆంధ్ర కవయిత్రులు, నిశానీ నీలిమేఘాలు, చిక్కనవుతున్న పాట.. ఇవన్నీ దళిత మహిళలు రచయిత్రులుగా లేరనే అభిప్రాయాలతో భ్రమింపజేసినయి. హిందూ ఆధిపత్య కులాల సంస్కర్తలు, రచ యితలు పాశ్చాత్య ప్రభావా లతో తమ సమాజాల్లోని స్త్రీ జనాభ్యుదయం కోసం విశేష కృషి చేసినట్లు బహుజన కులాల సంస్కర్తలు, రచయి తలు తమ సమాజాల మహిళల అభివృద్ధి కోసం కృషి చేయలేకపోవడం జరిగింది. అందుకే బహుజన మహిళలు బాల్యవివాహాలు, నిరక్షరాస్యత, జోగినీ, వెట్టి కూలీ వంటి సమస్యల్నించి ఇంకా విముక్తికాని దశ ల్లోనే ఉన్నారు. జాతీయో ద్యమంలో జరిగిన స్త్రీ జనోద్ధరణ ఇంకా బహుజన కులాల జెండర్‌ల దాకా చేరలేదు. వారి నోటి రచనలు, రాత రచనల మీద ఎలాంటి పరామర్శ జరగడం లేదు. సమాజ ఉత్పత్తిలో చెమటచుక్కను చిందించని జనాభాలో భాగమైన సవర్ణ స్త్రీవాదం సమాజాభివృద్ధికి ఉత్పత్తి శక్తులుగా తమ జవజీవాలం దిస్తున్న బహుజన కులాల జెండర్‌ అస్తిత్వాల్ని, సాహిత్యాలను చీకటి చేస్తున్నది. దళిత మహిళల సాహిత్యాల్లోని అస్తిత్వాల్ని, వారి మట్టి పొరల భాషా వ్యక్తీకరణ విశిష్టతల్ని, జెండర్‌ని మించిన కుల అణచి వేతల్ని చర్చ చేయకుండా, వాటిపై అధ్యయనం జరపకుండా ఏక పక్షంగా స్త్రీవాదంలో చేర్చడం అన్యాయమే. ఇక ‘దళిత స్త్రీవాదం’ అనే పదాన్ని కూడా ఏకోన్ముఖంగా కాయిన్‌ చేసింది సవర్ణ స్త్రీవాదము. స్త్రీవాదం అంటేనే పాశ్చాత్య, తెల్లరంగుగల, కులంలేని ఆధిపత్య మహిళల నుంచి అరువు తెచ్చుకున్న సవర్ణ జెండర్‌ల వాదము. ఈ వాదం దళిత మహిళల జీవితాలకు సరిపోని వాదము. అయినా ‘దళిత స్త్రీవాదులు’ అని దళిత మహిళని చూపిస్తుంది. ‘బహుళ’ జెండర్‌ రాజకీయ విమర్శ వ్యాసంలో కూడా ఇదే జరిగింది. రేపు బీసీ స్త్రీవాదం, ఆదివాసీ స్త్రీవాదం కూడా ప్రకటించినా ఆశ్చర్యం లేదు. కారంచేడు, చుండూరు ఉద్యమాల అనంతర కాలం నుంచి దళిత రచయిత్రులు– ప్రధానంగా మాదిగ, మాల మహిళల రచనలు– వెలుగు చూస్తున్నయి. విజయభారతి, చల్లపల్లి స్వరూప రాణి, జూపాక సుభద్ర, వినోదిని, మెర్సీమార్గరెట్‌, ఝాన్సీ కేవీ కుమారి, గోగుశ్యామల, జాజులగౌరి, మేరీమాదిగ, తాళ్లపెల్లి యాకమ్మ, సిస్టర్‌ అనసూయ, కన్నారం ఝాన్సీ మొదలగు దళిత రచయిత్రులు మగపెత్తనాలకన్నా తమ చుట్టూత చుట్టుముట్టిన కులహింసల్ని, వివక్షల్ని, సామాజిక అణచివేతల్ని తమ సాహిత్యాల్లో విస్తృతంగా వస్తువీకరించారు. తాము అనుభ వించే హింసల్లో అణచివేతల్లో పదిట్ల పదకొండోదిగ మగపెత్త నాల్ని, అణచివేతల్ని వెలువరిస్తే… మగపెత్తనమే ప్రధాన హింసగా దళిత మహిళలు ఎదుర్కుంటున్నారని ప్రచారం చేస్తున్నది స్త్రీవాద సాహిత్యము. పాశ్చాత్య ఫెమినిజం పరిభాషను అనువదించుకున్న భారత స్త్రీవాదము- పురుషులు స్త్రీలను వ్యవస్థీకృతంగా లోబర్చుకోవడాన్ని ‘పితృస్వామ్యం’గా నిర్వచించి ఈ అవ గాహనలనే ఆయుధంగా చరిత్రలను, సాహిత్యాల్ని, ఉద్యమాలని అధ్యయనం చేస్తుంది. కానీ ఈ నిర్వ చనాలు భారతదేశ కుల సమాజానికి సరిపోని పరికరాలు. ఇక్కడ ఏ కులపురుషులు ఏ కులస్త్రీలను వ్యవస్థీకృతంగా లోబర్చుకున్నారనే చర్చ ఉండది. కుల సమాజంలో పితృస్వామ్యమంటే- ఆర్థిక, రాజ కీయ, సామాజిక వ్యవస్థల్ని నియంత్రించే అతికొద్ది జనాభాగా ఉన్న ఆధిపత్య హిందూ కుల మగ సమాజం మనువాద సూత్రాలతో, పురుష సూక్తాలతో తమ కులాల్లోని ఆడవాళ్లనేగాక, మొత్తం బహుజన కులాల ఆడ మగ సమాజాన్ని వ్యవస్థీకృతంగా బానిసలు చేసుకుని లోబర్చుకోవడం. ఈ పితృస్వామ్యం కేవలం ఆడవాళ్లమీద మగవాళ్లు చేసే పెత్తనం కాదు. తమ ఆడవారిని ‘న స్త్రీ స్వాతంత్రమర్హతి’ అని వంటిళ్లకు పరిమితం చేసి, అసూర్యంపశ్యలను చేసిన మగస్వామ్యం పితృస్వామ్యం. భర్తవుంటేనే బతుకు, లేకుంటే భర్తతో చావాలని ‘సతి’, భర్త చనిపో యినా, వేరుబడినా పునర్వివాహాలు నిషిద్ధం చేసిన క్రూరత్వాలు పితృ స్వామ్యం. ఈ క్రూరత్వాలు బహుజన కులాల్లో ఆడవాళ్ల మీద కనబడవు. ఊరూవాడా మహిళల కాళ్లకు చెప్పులు తొడిగే మగవాళ్లని, ఊరి మహిళల ముట్టుబట్టలు ఉతికే మగవాళ్లని, మహిళల కాలిగోళ్లు తీసి కాలిమైల కడిగే మగవాళ్లని… బహుజన కులాల్లోనే చూస్తాం గానీ ఆధిపత్య హిందూ కులాల మగవాళ్లల్లో చూడం. బహుజన మగసమాజం ఇంటి ఆడవాళ్లమీద అజమాయిషీ, జులుం చేస్తుంది, బైటికిబోతే దానిది బానిస బతుకు. ఈ అజమాయిషీలను, హింసలను కూడా బహుజన కులాల మహిళ నిరసించా ల్సిందే, రూపుమాపాల్సిందే. ఐతే- ఇంటి ఆడవాళ్లని, బైట వ్యవస్థల్నీ కూడా శాసించే, అణచివేసే మగస్వామ్యాలనూ ఇంట్ల పెత్తనం, బయట బాంచరికం చేసే మగ స్వామ్యాలనూ ఒకటే గాట కట్టి అధ్యయనం చేయడం వల్ల బహుజన కుల సమా జాలు నష్టపోతున్నాయి. దళిత మహిళలకు సంబం ధించి ఆధిపత్య వ్యవస్థలన్నీ ప్రతికూలంగా చుట్టుముట్టి ఉంటయి. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో దళిత మహిళలు చదువుకోవడమే ఒక యుద్ధం. చదువుకొని రచయిత్రులుగా సాహిత్యాల్లోకి రావడం పెద్ద యుద్ధమే. వీరి రచనలు వెలుగు చూడడం చిన్న విషయం కాదు. వీరి రచనలు బూతుగా ఉన్నాయనీ, అర్థం కావడం లేదని, వీరి సాహిత్యాల్ని సాహిత్య చరిత్రలు పక్కనబెట్టి అవాచ్యమ్‌ చేసినయి. డీ క్లాస్‌, డీ కాస్ట్‌, డీ జెండర్‌ కావడం సమ సమాజ నిర్మాణం కోసమే కాదు సాహిత్య విమర్శను ప్రజాస్వామ్యీకరించడం కోసం కూడా అవ సరమని చెప్పిన చేరా డీ సవర్ణ జెండర్‌ సాహిత్య విమర్శకాన్నే ఆగి పోయిండు. నాలుగు దశాబ్దాల కిందనే (1980) సవర్ణ రచయిత్రులు సాహిత్యాల మీద వివరణాత్మక విశ్లేషణలు చేసి తెలుగు సాహిత్య విమర్శలోకి జెండర్‌ రాజకీయ అవగాహనకు దోహదం చేశాడు. కానీ తన విమర్శను దళిత జెండర్‌ సాహిత్యాలకు దూరంబెట్టి అప్రజా స్వామికాల్నే కనబరిచిండు. బహుజన విమర్శకులు కూడా చేరా దారులనే అనుసరిస్తున్నారు గానీ దళిత మహిళా సాహిత్యాల పట్ల మౌనమే కనబరుస్తున్నారు. సమాజంలోని ఆఖరి అంచుల జెండర్‌ అస్తిత్వ సమూహాల సాహిత్యాల అధ్యయన పరికరాలను, పద్ధతులను, సిద్ధాంతాలను నిర్మించే, నిర్ధారించే కృషి ప్రజాస్వామిక సాహిత్య సమాజాల మీద మిగిలే ఉంది.
పొట్ట నింపుకునేందుకు కూలి పనికి వెళ్లిన కూలీ ప్రాణం రోడ్డు ప్రమాదంలో లారీచక్రాల కింద నలిగిపోయింది. ఈ ఘటన ప్రమాదంలో మృతి చెందిన పాలమాని హరికృష్ణ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 మరొకరికి గాయాలు మనుబోలు, అక్టోబరు 1: పొట్ట నింపుకునేందుకు కూలి పనికి వెళ్లిన కూలీ ప్రాణం రోడ్డు ప్రమాదంలో లారీచక్రాల కింద నలిగిపోయింది. ఈ ఘటనలో పాలమాని హరికృష్ణ (39) దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మనుబోలు మండలం కృష్ణపట్నం పోర్టు క్రాస్‌రోడ్డు సమీపంలో శనివారం జరిగింది. బాధితుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం అగ్రహారంపేటకు చెందిన పాలమాని హరికృష్ణ ఇటుకబట్టీల వద్ద కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. రోజువారీ పనుల్లో బాగంగా హరికృష్ణ సహచర కూలీలతో కలిసి లారీలో ఇటుకలు నింపుకుని నెల్లూరుకు వెళ్లాడు. అక్కడ ఇటుకలను దింపి అదే లారీలో కృష్ణపట్నం పోర్టు రోడ్డు వరకు వచ్చాడు. అక్కడ కూలీలను దింపేసి లారీ పోర్టుకు వెళ్లింది. దీంతో హరికృష్ణతోపాటు ఉన్న నలుగురు కూలీలు కలిసి నాయుడుపేట వెళ్లేందుకు చెన్నై వెళుతున్న మరోలారీ ఎక్కారు. లారీ 100మీటర్ల దూరం వెళ్లగానే అదేమార్గంలో చెన్నై వెళ్లే లారీ వేగంగా వచ్చి కూలీలున్న లారీని వెనుకభాగంలో ఢీకొట్టింది. లారీలో నిలుచుకుని ప్రయాణిస్తున్న హరికృష్ణ ఢీకొట్టగానే ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. సెకన్ల వ్యవధిలోనే ఢీకొట్టిన లారీ హరికృష్ణ ఛాతీపై దూసుకెళ్లింది. దీంతో హరికృష్ణ తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లముందే హరికృష్ణ చనిపోవడం సహచరకూలీలను కంటతడి పెట్టించింది. రోడ్డుపై మృతుడి వద్ద వారు చేరి రోదించసాగారు. ఈ ప్రమాదంలో మరో కూలి బాలకృష్ణకు స్వల్పగాయమైంది. మృతుడికి భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ. కే. ముత్యాలరావు తెలిపారు.
ALL Breaking News Cinema News Cultural News Eductional News Health News Latest News Political News Sports News ఎడ్యుకేషన్ బిల్ చాలా గొప్పది August 08, 2019 • Roja Rani ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మోనటరింగ్‌ బిల్లు చరిత్రాత్మకం గత ప్రభుత్వంలో చట్టాలను చేసే మంత్రులే.. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కారు.. భావితరాలకు ఆస్తిగా ఇవ్వగలిగేది ఒక్క చదువు మాత్రమే.. పేదరికం నుంచి బయటపడేసే ఆయుధం చదువు.. – ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మోనటరింగ్‌ కమిషన్‌ బిల్లు ఒక చరిత్రాత్మక బిల్లు. మన కళ్ల ఎదుటే ప్రైవేటు స్కూళ్లు ఫీజుల పేరుతో.. తల్లిదండ్రులను ఎడాపెడా బాదుతూ ఉన్నా కూడా, ఎవ్వరూ అడగలేని పరిస్థితి, పట్టించుకోని పరిస్థితి. మన కళ్ల ఎదుటే మనం చూశాం.. సాక్షాత్తూ ఆ పెద్ద పెద్ద స్కూళ్లు, కాలేజీలకు సంబంధించి యాజమాన్యాలకు చెందినవారే గత ప్రభుత్వంలో ఇక్కడ మంత్రులుగా ఉన్నారు. ఆ పెద్ద పెద్ద వాళ్లే మంత్రులుగా ఉన్న పరిస్థితుల్లో.. ఇక వీళ్లు స్కూళ్లను, ఫీజులను నియంత్రించలేని పరిస్థితి. విద్యకు సంబంధించి దేశంలో ఒక చట్టం ఉంది. స్కూళ్లుగాని, కాలేజీలు కాని ఏవీ కూడా లాభాపేక్షతో, వ్యాపార దృక్పథంతో నడపాల్సినవి కావు. దేశంలో ఉన్న చట్టాల ప్రకారం, స్కూళ్లు, కాలేజీలు నడిపితే.. వాటిని ప్రజాసేవలో భాగంగానే నడపాలి. కానీ ఎల్‌కేజీ ఫీజులు, యూకేజీ ఫీజులు, ఫస్ట్‌క్లాస్‌ ఫీజులు కూడా ఏకంగా రూ.63వేలు, లక్ష రూపాయలు అని చెప్తుంటే.. నిజంగా ఎక్కడా కూడా మన పిల్లలు చదివే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్లాన్‌ ప్రకారం ప్రభుత్వ స్కూళ్ళను నీరుగార్చారు.. ప్రతి ప్రైవేటు స్కూల్లోనూ 25శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాలి. తక్కువ ఫీజులు వసూలు చేయాలి, ఆ ఫీజులు కూడా ప్రభుత్వం కట్టాలి. గడిచిన ఐదేళ్లలో ఒక్క స్కూల్లో కూడా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయలేదు. దాంతో ఇష్టానుసారం ఆ స్కూళ్ళలో ఫీజులు పెంచుకునే పరిస్థితులు వచ్చి, వ్యవస్థ అంతా నాశనమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి విధానాల వల్ల గత ఐదేళ్ళూ ప్రభుత్వ స్కూళ్లను క్రమంగా నీరుగార్చారు. చివరకు ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన బకాయిలు కూడా కనీసం 6–8 నెలలపాటు చెల్లంచని పరిస్థితి. సరుకుల బిల్లులు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూళ్లను నీరుగార్చారు. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో పాఠ్యపుస్తకాలను కూడా సమయానికి ఇవ్వలేదు. జూన్‌లో ఇవ్వాల్సిన పుస్తకాలు సెప్టెంబరు, అక్టోబరులో కూడా ఇవ్వని పరిస్థితులను నా పాదయాత్రలో చూశాను. హేతుబద్దీకరణ పేరుతో స్కూళ్లను మూసేయడంతోపాటు ఓ పద్దతి ప్రకారం ప్రభుత్వ స్కూళ్లను అన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. మరోవైపు ప్రైవేటు స్కూళ్లలో ఇష్టానుసారం ఫీజులు పెంచుకునే కార్యక్రమాలను చేశారు. కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. చివరకు విద్య పేరుతో దోచేసే పరిస్థితులు ఆంధ్రరాష్ట్రంలో చూశాం. విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొచ్చే దిశగా..., పేద, మధ్యతరగతి కుటుంబాలకు చదువు అన్నది ఒక హక్కుగా మేం చర్యలు ప్రారంభించాం. తల్లిదండ్రులుగానీ, ప్రభుత్వాలకు గానీ పిల్లలకు, భావితరాలకు ఏదైనా ఆస్తిగా ఇవ్వగలిగేది ఒక్క చదువు మాత్రమే. మన పిల్లలను మనం చదివించుకోగలిగితే వాళ్లు రేపు పొద్దున పేదరికం నుంచి బయట పడతారు. పేదరికంనుంచి బయటపడేసే ఆయుధం చదువు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో చదువులు అతి దారుణంగా ఉన్నాయి. విద్యా వ్యవస్థను మేలుకొలపడానికే ఈ బిల్లును తీసుకు వచ్చాం. ఆంధ్ర రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రానివారు 33 శాతం మంది ఉన్నారు. అంటే ఎంతటి దారుణంగా నిరక్షరాస్యత ఉందో అర్థం చేసుకోండి. తల్లిదండ్రులకు పిల్లలను చదివించాలన్న కోరిక, తపన లేక కాదు, కానీ వారికి ఆర్థిక స్థోమత లేని కారణంగా.. రాష్ట్రంలో నిరక్షరాస్యత 33శాతం ఉంది. దేశంతో పోలిస్తే దేశం మొత్తం మీద నిరక్షరాస్యత 26శాతమే. కానీ రాష్ట్రంలో 33 శాతం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ బిల్లును తీసుకు వస్తున్నాం. చదువు అనేది అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నది ఉద్దేశం. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నియమించే రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిని ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమిస్తున్నాం. 11 మందిని సభ్యులను నియమిస్తున్నాం. జాతీయస్థాయిలో ప్రముఖ విద్యా నిపుణులను ఈ కమిషన్‌లో నియమిస్తున్నాం. ఈ కమిషన్‌ ఏదైనా స్కూలుకు వెళ్లి అక్కడ అడ్మిషన్, టీచింగ్‌ ప్రక్రియలను పర్యవేక్షించగలుగుతారు. స్కూళ్ల గ్రేడింగ్‌ను, విద్యాహక్కు చట్టం అమలును, అక్రిడేషన్‌ను వీళ్ల పరిధిలోకి తీసుకు వస్తున్నాం. యాజమాన్యాలను హెచ్చరించడమే కాదు, జరిమానాలు విధించడం, చివరకు స్కూళ్లను కూడా మూసివేయించే అధికారం ఈ కమిషన్‌కు ఉంటుంది. స్కూళ్లలో ఫీజులు రియాల్టీలోకి రావాలి. ఏ మాత్రం ఫీజులు ఉంటే.. పిల్లలు చదువుకోగలుగుతారు అన్నది వీరు పర్యవేక్షిస్తారు. అక్కడ చదువులు, మౌలిక సదుపాయాలను కూడా పర్యవేక్షిస్తారు. ప్రతి మధ్యతరగతి, పేద వారికి అందుబాటులోకి చదువులను తీసుకెళ్తున్నాం. అందుకే ఈచట్టం చే స్తున్నాం... అని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడారు.
కోర్టు రూం ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్నిఅలరించిన 'జాలీ ఎల్ ఎల్ బీ' ప్రాంచైజీ సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సుభాష్ కపూర్ తెరకెక్కించిన రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని సాధించాయి. మొదటి భాగంలో హర్షద్ వార్షీ.. బోమన్ ఇరానీ.. అమృతరావు..సౌరభ్ శుక్లా ప్రధాన పాత్రల్లో మెప్పించారు. అటు పై 'ఎల్ ఎల్ బీ-2'లో అక్షయ్ కుమార్..అనుకపూర్..హ్యూమా ఖురేషీ పాత్రలు అద్యంతం అలరించాయి. రెండు భాగాలు నాలుగేళ్ల గ్యాప్ లో తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. తాజాగా 'ఎల్ ఎల్ బీ -3' కి రంగం సిద్దం అవుతుందా? అంటే అవుననే తెలుస్తోంది. మూడవభాగాన్ని వచ్చే ఏడాది తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రెండవ భాగంలో ప్రధాన పాత్ర పోషించిన అక్షయ్ కుమార్ నే హీరోగా కొనసాగుతున్నారు. సుభాష్ కపూర్ దర్శకత్వంలో స్టార్ స్టూడియోస్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటికే స్ర్కిప్ట్ వర్కూ కూడా పూర్తి చేసారు. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభించి అన్ని పనులు పూర్తి చేసి అదే ఏడాది చివర్లో నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని కూడా నాలుగేళ్ల గ్యాప్ లోనే తెరకెక్కించాలనుకున్నారు. కానీ అక్షయ్ బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సహా సౌత్ లోనూ సినిమాలు చేయడంతో వీలుపడలేదు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. 'కట్ పుత్లీ'..'రామ్ సేతూ'.. 'సెల్పీ'..'ఓ మైగాడ్ -2'..'క్యాప్సుల్ గిల్'.. 'బడేమియా చోటా మియా' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వీటిలో కొన్ని షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. మరికొన్ని ఆన్ సెట్స్ లో ఉండటంతో అక్షయ్ తీరిక లేకుండా గడుపుతున్నారు. అలాగే తెలుగులో మంచి రోల్స్ వస్తే నటించడానికి అక్షయ్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ మార్కెట్ స్పాన్ పెరిగిన నేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్ అంతా ఇటువైపుగానే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్షయ్ సైతం సౌత్ విషయంలో సీరియస్ గానే ఆలోచన చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. Tupaki TAGS: BollywoodFilm JollyLLBMovie SubhashKapoor LLB2Film AkshayKumar JollyLLB3Film RamsethuFilm OhMyGod2Film BollywoodFilmLLB3
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రెండో రోజూ ఈడీ విచారణకు ఇవాళ హాజరయ్యారు. తన బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకొని ఎమ్మెల్యే విచారణకు హాజరయ్యారు. narsimha lode First Published Sep 28, 2022, 10:39 AM IST హైదరాబాద్: టీఆర్ఎస్ కు చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బుధవారం నాడు ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. నిన్న కూడా ఈడీ అధికారులు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని విచారించారు. నిన్న సుమారు తొమ్మిది గంటల పాటు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. నిన్న జరిగిన విచారణకు కొనసాగింపుగానే ఇవాళ కూడా ఈడీ అధికారులు ఇవాళ విచారణ చేస్తున్నారు. తన బ్యాంకు ఖాతాలకు చెందిన స్టేట్ మెంట్లను తీసుకొని ఈడీ అధికారులు విచారణకు హాజరయ్యారు నిన్న జరిగిన విచారణకు కొనసాగింపుగానే ఇవాళ కూడా ఈడీ అధికారులు ఇవాళ విచారణ చేస్తున్నారు. తన బ్యాంకు ఖాతాలకు చెందిన స్టేట్ మెంట్లను తీసుకొని ఈడీ అధికారులు విచారణకు హాజరయ్యారు. తక్కువ సమయంలోనే రూ. 88 కోట్ల లావాదేవీలను మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేశారని ఈడీ అధికారులు గుర్తించారు.ఈ విషయమై మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనే ఈ విషయమై ఈడీ అధికారులు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసులపై ఈడీ అధికారులకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇదే విషయమై ఈడీ అధికారులు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని విచారిస్తున్నారు. 2014 లో మంచిరెడ్డి కిషన్ రెడ్డి విదేశాలకు వెళ్లాడు. అమెరికాలోని తన బంధువు ద్వారా మంచిరెడ్డి కిషన్ రెడ్డి సుమారు రూ. 2 వేల యూఎస్ డాలర్లను తన ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. . విదేశాల్లో గోల్డ్ మైన్లలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి.ఈ విషయమై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. also read:ముగిసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణ... 8 గంటల పాటు ప్రశ్నల వర్షం 2009లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానం నుండి మంచిరెడ్డి కిషన్ రెడ్డి తొలిసారిగా అసెంబ్లీకి అడుగు పెట్టాడు. టీడీపీ ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2014లో కూడా ఇదే స్థానం నుండి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొన్ని రోజుల్లో ఆయన టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. 2018 లో ఇబ్రహీంపట్నం నుండి ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.
వైసీపీలో పెద్ద‌ల స‌భ టిక్కెట్లు పెద్ద క‌ల‌వ‌ర‌మే సృష్టించ‌నున్నాయి.ఏ ఒక్క‌రి పేరు చివ‌రి దాకా నిర్థార‌ణ‌కు నోచుకునేలా లేదు. ఉత్త‌రాంధ్ర నుంచి బొత్స ఆశించినా కూడా భంగ‌పాటు త‌ప్ప‌లేదు.ఇదే స‌మయంలో జ‌గ‌న్ ఎప్ప‌టి నుంచో ఓ బీసీ మ‌హిళ‌ను రాజ్య‌స‌భ కు పంపాల‌ని యోచిస్తున్నారు. అందుకు కృపారాణి పేరును ప్ర‌తిపాదించారు.ఈమె శ్రీ‌కాకుళం జిల్లా నాయ‌కులు.మాజీ ఎంపీ,కేంద్ర‌మంత్రిగా యూపీఏ హ‌యాంలో ప‌నిచేశారు. ఈమె పేరుపై మాత్రం ఎటువంటి వివాదం అయితే లేదు. జ‌గ‌న్ ఒక్క‌రే కాదు ఆ మాట‌కు వ‌స్తే మిగ‌తా అంద‌రి నాయ‌కుల నుంచి కూడా సానుకూల‌త‌లే వ్య‌క్తం అవుతున్నాయి.ఆ విధంగా చూసుకుంటే మొత్తం వైసీపీకి ద‌క్కే నాలుగు టిక్కెట్ల‌లో రెండు మాత్రం క‌న్ఫం అయ్యాయి.ఒక‌టి అదానీ గ్రూపున‌కు కాగా మ‌రొక‌టి ఉత్త‌రాంధ్ర మ‌హిళా నేత కృపారాణి. ఆమె కూడా ఈ విష‌యాన్ని సూచ‌న ప్రాయంగా స‌న్నిహితుల ద‌గ్గ‌ర అంగీక‌రిస్తున్నారు.త్వ‌ర‌లో త‌న‌కు రాజ‌యోగం ద‌క్కనుంద‌న్న ఆశ‌తోనే ఉన్నారు.ఇదే స‌మ‌యంలో మ‌రికొంద‌రు ఆశావ‌హులు ఉన్నారు.వాళ్లెవ్వ‌రో చూద్దాం. గ‌త కొద్దికాలంగా స్త‌బ్దుగా ఉంటున్న విశాఖ పెద్ద సాయిరెడ్డి మ‌ళ్లీ అదే ప్రాంతంలో హ‌ల్ చ‌ల్ చేయ‌డం ప్రారంభించ‌నున్నారు.ఆ మాటకు వ‌స్తే మళ్లీ సీన్ లోకి సాయిరెడ్డి వ‌చ్చి, పార్టీలోనే ఉన్న శ‌త్రువ‌ర్గాన్ని నిలువ‌రించ‌నున్నారు.జ‌గ‌న్ ద‌గ్గ‌ర మ‌ళ్లీ త‌న మాట నెగ్గించుకుని పెద్ద‌ల స‌భ‌కు వెళ్ల‌నున్నారు.జూన్లో ఖాళీ కానున్న‌నాలుగు రాజ్య‌స‌భ స్థానాలలో ఒక‌టి సాయిరెడ్డికి కేటాయించార‌ని తెలుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు సంబంధించి వైసీపీ కోటాకు గాను నాలుగు సీట్లు రానున్నాయి.అందులో ఒక‌టి అదానీ గ్రూపు సంస్థ‌ల‌కు కేటాయించార‌ని సమాచారం.ప్రీతీ అదాని (గౌత‌మ్ అదానీ జీవ‌న స‌హ‌చ‌రి)కి టికెట్ క‌న్ఫం అయింద‌ని కూడా తెలుస్తోంది.ఇదే స‌మ‌యంలో ఆశావ‌హుడిగా ఉన్న బొత్స పేరు కానీ ఆశావ‌హుడిగా ఉన్న అలీ పేరు కానీ విన‌ప‌డ‌డం లేదు. దీంతో పూర్తి నిరుత్సాహంలోనే బొత్స ఉండిపోయారు. అదేవిధంగా కొంత కాలంగా ఉత్త‌రాంధ్ర జిల్లాల క‌న్వీన‌ర్ ప‌ద‌వి నుంచి సాయి రెడ్డి త‌ప్పుకోవాల‌ని జ‌గ‌న్ చెబుతున్నారు.కానీ ఆయ‌న స‌సేమీరా అంటున్నారు.ఆయన స్థానంలో సీనియ‌ర్ మంత్రి బొత్స‌ను నియ‌మించాల‌ని చూసినా అది కూడా కాలేదు.ఆ విధంగా కూడా బొత్స‌కు నిరాశే. సాయిరెడ్డి మ‌ళ్లీ ఫాంలోకి వ‌స్తే విశాఖ కేంద్రంగా ఉన్న ఆయ‌న అనుకూల వ‌ర్గాల‌న్నింటికీ పండగే పండ‌గ. ఇక మిగ‌తా ఆశావ‌హుల జాబితాలో స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి,మెగాస్టార్ చిరంజీవి, ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంతో స‌హా సీమ‌కు చెందిన కొంద‌రు నేతలు,అదేవిధంగా మైనార్టీ కోటాలో ఉన్న ఇంకొంద‌రు నేత‌లు కూడా ఉన్నార‌ని ప్రాథ‌మిక స‌మాచారం.జ‌గ‌న్ నిర్ణ‌యం అనుసారం ఆఖ‌రి నిమిషంలో అనూహ్య మార్పులు వ‌స్తే త‌ప్ప సాయి రెడ్డి పేరు జాబితా నుంచి తొలిగే అవ‌కాశ‌మే లేదు అని నిర్థారితం అవుతోంది. అదేవిధంగా ప్రీతీ అదానీ,కిల్లి కృపారాణి పేర్లు కూడా దాదాపు ఖ‌రారు అయ్యాయ‌నే అంటున్నారు.మొన్న శార‌దా పీఠంకు వ‌చ్చిన‌ప్పుడు కూడా సీఎంను కృపారాణి క‌లిసి వెళ్లారు.ఆ సంద‌ర్భంలో ఇందుకు సంబంధించిన చ‌ర్చ‌లేవీ రాకున్నా త్వ‌ర‌లో ఆమెకు ప‌ద‌వి ఇచ్చే విష‌య‌మై ముఖ్య‌మంత్రి మాత్రం సానుకూల దృక్ప‌థంతోనే ఉన్నారు.అంటే ఇప్పుడు మూడు స్థానాలు ఎవ‌రివి అన్న‌వి నిర్థార‌ణ అయింది.ఇక మ‌రో టికెట్ ఎవ‌రికి ద‌క్కుతుంది అన్న‌ది తేలాలి.
thesakshi.com : వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. అనారోగ్యంతో ఆమె భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత ఆమెకు మేస్త్రీతో పరిచయం అయ్యింది. కొంతకాలం తరువాత ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. విహారయాత్రలకు వెళ్లి లాడ్జ్ లో రూమ్ లు తీసుకుని జల్సా చేశారు. విహారయాత్రకు వెళ్లిన ఇద్దరూ రెండు రోజుల పాటు ఆ సిటీలోనే ఉన్నారు. తరువాత ఇద్దరూ వేరే ఊరికి విహారయాత్రకు బయలుదేరారు. మార్గం మద్యలో పట్టపగలు పక్కనే నడుచుకుంటూ ఆ ప్రాంతాలు చూస్తూ వెలుతున్న ప్రియురాలి మీద ఆమెప్రియుడు కొడవలి తీసుకుని నరికేశాడు. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ఆంటీ మీద ఆమె ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. కర్ణాటకలోని మండ్య జిల్లాలోని నాగమంగలలో ప్రభా (42) అనే మహిళ నివాసం ఉంటున్నది. పాపన్న అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ప్రభా నాగమంగలలోనే ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. మూడు సంవత్సరాల క్రితం ప్రభా భర్త పాపన్న అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి సంవత్సరం పాటు ప్రభా ఒంటరిగా నాగమంగలలోనే ఉంది. బెంగళూరులోని గోల్లరహట్టిలో నివాసం ఉంటున్న మేస్త్రీ బసవరాజ్ ప్రభా ఆంటీకి పరిచయం అయ్యాడు. కొంతకాలం అప్పుడప్పుడు కలుస్తున్న ప్రభా, బసవరాజ్ తరువాత అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. పలు ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లిన బసవరాజ్, ప్రభా ఆ ప్రాంతాల్లో లాడ్జ్ లో రూమ్ లు తీసుకుని జల్సా చేశారు. మూడు రోజుల క్రితం బసవరాజ్, ప్రభా ఆంటీ మైసూరు సిటీకి వెళ్లి అక్కడ లాడ్జ్ లో రూమ్ తీసుకున్నారు. మైసూరు నగరంతో పాటు మలేమహేశ్వర బెట్ట (కొండ)పరిసర ప్రాంతాల్లో సంచరించిన బసవరాజ్, ప్రభా రెండు రోజులు రాత్రి మైసూరులోని లాడ్జ్ లోనే ఉన్నారు.ఇంకా ఒక్కరోజు ఇక్కడే ఉందామని బసవరాజ్ చెప్పినా అతని ప్రియురాలు ప్రభా అంగీకరించలేదని తెలిసింది. ఉదయం మైసూరు నుంచి బయలుదేరిన తరువాత సూళకెరె పరిసర ప్రాంతాల్లోకి బసవరాజ్, ప్రభా విహారయాత్రకు బయలుదేరారు. మార్గం మద్యలో సూళకెరె సమీపంలో పట్టపగలు పక్కనే నడుచుకుంటూ ఆ ప్రాంతాలు చూస్తూ వెలుతున్న ప్రభా ఆంటీ మీద ఆమె ప్రియుడు బసవరాజ్ కొడవలి తీసుకుని నరికేశాడు. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ప్రభా ఆంటీ మీద ఆమె ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అటువైపు స్థానికులు కొందరు వస్తున్న విషయం గమనించిన బసవరాజ్ అక్కడి నుంచి పరారైనాడు. తీవ్రగాయాలైన ప్రభాను ఆసుపత్రికి తరలించారు. ప్రభా మరో వ్యక్తితో చనువుగా ఉందని కోపంతో బసవరాజ్ ఆమెను చంపేయాలని అనుకున్నాడని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
వైసీపీ గౌరవ అధ్యక్షురాలు(రాజీనామా చేస్తానని ప్రకటించారు) విజయమ్మ చేస్తున్నది త్యాగమా.. లేక రాజకీ యమా? ఇదీ.. ఇప్పుడు చర్చకు వస్తున్న కీలక విషయం. ఎందుకంటే.. ఆమె వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. ఆవెంటనే తాను షర్మిల కోసమే ఇలా చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ రెండింటి మధ్య ఓ తల్లిగా తాను త్యాగం చేస్తున్నట్టు కూడా వ్యాఖ్యానించారు. ఏ తల్లికీ.. ఇలాంటి బాధ రాకూడదని కూడా అన్నారు. అంటే.. ఇప్పటి వరకు విజయమ్మ.. తాను ఇటు జగన్ కోసం.. అటు షర్మిల కోసం..త్యాగం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆమె చేసింది ఏంటి? అని పరిశీలిస్తే.. కేవలం రాజకీయమే. దీనిలో త్యాగం ఏమీ లేదని పరిశీలకులు చెబుతున్నారు. త్యాగం చేసేందుకు విజయమ్మకు అవకాశం ఏం ఉందని అంటున్నా రు. గత ఎన్నికల్లో జగన్ను సీఎం చేసేందుకు ప్రయత్నించి సాధించిన విజయమ్మ.. ఇప్పుడు పార్టీకి రిజైన్ చేయడాన్ని త్యాగం చేస్తున్నానని చెప్పడాన్ని తప్పుబడుతున్నారు. మరోవైపు తెలంగాణలో తన కుమార్తె షర్మిల విషయంలో సాయం చేసేందుకే తాను తెలంగాణకు వెళ్తున్నా నని చెప్పడం ద్వారా.. అక్కడకూడా రాజకీయాలు చేసేందుకేననే విషయం స్పష్టంగా తెలుస్తోందని చెబుతున్నారు. వాస్తవానికి వైసీపీలోనే ఆమె గౌరవ అధ్యక్షురాలిగా ఉంటే.. అక్కడ షర్మిలను ఇప్పటి వరకు నమ్ముతున్నవారు కూడా నమ్మరనే విషయాన్ని గ్రహించి.. ఇప్పుడు వ్యూహాత్మకంగానే ఆమె రాజీనామా చేశారని చెబుతున్నారు. పైగా.. కుమారుడు జగన్తో ఉన్న విభేదాలు.. చికాకుల కారణంగా.. పూర్తిగా వదిలించుకునేందుకు విజయమ్మ.. పార్టీని వదులుకుంటున్నారనే గుస గుస కూడా కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఇలా.. ఇటు జగన్ నుంచి తలనొప్పులు వదిలించుకునేందుకు అటు.. షర్మిలకు ఇతోధికంగా సాయం చేసేందుకు వేసిన ప్లాన్ ప్రకారం.. ఆమె పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారని.. ఇందులో ఏదో పెద్ద త్యాగం ఉందని చెప్పడం అంటే.. ఇది కూడా సెంటిమెంటుతో వైఎస్ కుటుంబాన్ని ఆకట్టుకునేందుకేనని అంటున్నారు.
ఈ నెల 8 నుంచి దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ తెరుచుకోబోతున్నాయి. దేశంలోనే అత్యంత రద్దీ ఉండే ఆలయం అయిన తిరుమల శ్రీనివాసుడి గుడి కూడా ఇదే రోజు తెరుచుకోబోతంది. సోమవారం నుంచే దర్శనాలు మొదలవుతున్నప్పటికీ.. సాధారణ భక్తులకు దర్శనాలు 11న ఆరంభించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆలయ దర్శనానికి సంబంధించి నియమ నిబంధనలు.. ఇతర మార్గదర్శకాల గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. దాని ప్రకారం జూన్ 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. దీన్ని ప్రయోగాత్మక దశగా భావిస్తున్నారు. ఏమైనా లోటు పాట్లు కనిపిస్తే సరిదిద్దుకుంటారు. 10వ తేదీన తిరుమల, తిరుమలకు చెందిన స్థానికులకు దర్శనం ఉంటుంది. 11న సాధారణ భక్తులకు దర్శనాలు మొదలవుతాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7.30 వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. గంటలకు 500 మందికి మించకుండా దర్శనానికి అనుమతిస్తారు. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో సాగుతున్న లడ్డూల విక్రయం ఈ నెల 8తోనే ఆగిపోనుంది. రోజూ సుమారు 3 వేల ఆన్‌లైన్‌ టికెట్లు అందుబాటులోకి తెస్తారు. కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచి భక్తులు తిరుమలకు రావొద్దని టీటీడీ స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ ‌చేసుకున్న వారికి అలిపిరిలో పరీక్షలు నిర్వహిస్తారు. 65 ఏళ్లు పైబడిన వాళ్లు, పిల్లలకు అనుమతి లేదు. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. భౌతికదూరం పాటించాలి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అలిపిరి నడక దారిలో భక్తులకు అనుమతి ఉంటుంది. వసతి గదుల్లో రెండో రోజు కొనసాగేందుకు అనుమతి లేదు. క్యూ లైన్లను ప్రతి రెండు గంటలకోసారి శానిటైజ్‌ చేస్తారు. శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాల దర్శనం ఉండదు. వైరస్‌ ప్రబలే ప్రమాదం ఉన్నందున శఠారి, తీర్థం ఇవ్వరు. శ్రీవారి పుష్కరిణిలో స్నానాలకు భక్తులను అనుమతించరు. శ్రీవారి హుండీ వద్దకు వెళ్లే వారు ఆ మార్గంలో ఉండే శానిటైజర్ వాడాలి. భక్తులకు తిరుమలలోని టీటీడీ వసతి గృహాల్లో మాత్రమే బస ఏర్పాట్లుంటాయి. ప్రైవేటు హోటళ్లకు అనుమతి లేదు.
సినిమా స్క్రిప్ట్ & రివ్యూ : 04/30/16 .Header h1 { font: normal normal 90px Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; color: #ffff00; } .Header h1 a { color: #ffff00; } .Header .description { font-size: 130%; } /* Tabs ----------------------------------------------- */ .tabs-inner { margin: 1em 0 0; padding: 0; } .tabs-inner .section { margin: 0; } .tabs-inner .widget ul { padding: 0; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; } .tabs-inner .widget li { border: none; } .tabs-inner .widget li a { display: inline-block; padding: 1em 1.5em; color: #ffffff; font: normal bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; } .tabs-inner .widget li.selected a, .tabs-inner .widget li a:hover { position: relative; z-index: 1; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } /* Headings ----------------------------------------------- */ h2 { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #00ffff; } .main-inner h2.date-header { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #0f0e0c; } .footer-inner .widget h2, .sidebar .widget h2 { padding-bottom: .5em; } /* Main ----------------------------------------------- */ .main-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner .section { margin: 0 20px; } .main-inner .column-right-inner { margin-left: 20px; } .main-inner .fauxcolumn-right-outer .fauxcolumn-inner { margin-left: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner { margin-right: 20px; } .main-inner .fauxcolumn-left-outer .fauxcolumn-inner { margin-right: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner, .main-inner .column-right-inner { padding: 15px 0; } /* Posts ----------------------------------------------- */ h3.post-title { margin-top: 20px; } h3.post-title a { font: italic bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #b02ef1; } h3.post-title a:hover { text-decoration: underline; } .main-inner .column-center-outer { background: #ffffff none repeat scroll top left; _background-image: none; } .post-body { line-height: 1.4; position: relative; } .post-header { margin: 0 0 1em; line-height: 1.6; } .post-footer { margin: .5em 0; line-height: 1.6; } #blog-pager { font-size: 140%; } #comments { background: #cccccc none repeat scroll top center; padding: 15px; } #comments .comment-author { padding-top: 1.5em; } #comments h4, #comments .comment-author a, #comments .comment-timestamp a { color: #b02ef1; } #comments .comment-author:first-child { padding-top: 0; border-top: none; } .avatar-image-container { margin: .2em 0 0; } /* Comments ----------------------------------------------- */ #comments a { color: #b02ef1; } .comments .comments-content .icon.blog-author { background-repeat: no-repeat; background-image: url(); } .comments .comments-content .loadmore a { border-top: 1px solid #b02ef1; border-bottom: 1px solid #b02ef1; } .comments .comment-thread.inline-thread { background: #ffffff; } .comments .continue { border-top: 2px solid #b02ef1; } /* Widgets ----------------------------------------------- */ .sidebar .widget { border-bottom: 2px solid #f1d08f; padding-bottom: 10px; margin: 10px 0; } .sidebar .widget:first-child { margin-top: 0; } .sidebar .widget:last-child { border-bottom: none; margin-bottom: 0; padding-bottom: 0; } .footer-inner .widget, .sidebar .widget { font: normal normal 14px Georgia, Utopia, 'Palatino Linotype', Palatino, serif; color: #ffe599; } .sidebar .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .sidebar .widget a:visited { color: #6ef12e; } .sidebar .widget a:hover { color: #c1c1c1; text-decoration: underline; } .footer-inner .widget a:link { color: #3630f4; text-decoration: none; } .footer-inner .widget a:visited { color: #000000; } .footer-inner .widget a:hover { color: #3630f4; text-decoration: underline; } .widget .zippy { color: #ffffff; } .footer-inner { background: transparent none repeat scroll top center; } /* Mobile ----------------------------------------------- */ body.mobile { background-size: 100% auto; } body.mobile .AdSense { margin: 0 -10px; } .mobile .body-fauxcolumn-outer { background: transparent none repeat scroll top left; } .mobile .footer-inner .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .mobile .footer-inner .widget a:visited { color: #6ef12e; } .mobile-post-outer a { color: #b02ef1; } .mobile-link-button { background-color: #3630f4; } .mobile-link-button a:link, .mobile-link-button a:visited { color: #ffffff; } .mobile-index-contents { color: #444444; } .mobile .tabs-inner .PageList .widget-content { background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } .mobile .tabs-inner .PageList .widget-content .pagelist-arrow { border-left: 1px solid #ffffff; } sikander777 --> సినిమా స్క్రిప్ట్ & రివ్యూ రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు... టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం! Saturday, April 30, 2016 స్పెషల్ ఆర్టికల్ : గత సంవత్సరం హిట్టయిన చిన్నా పెద్దా సినిమాలు ఎందుకు హిట్టయ్యాయో ఇదివరకు కొన్నిసార్లు చెప్పుకున్నాం. కేవలం ఏ జానర్ ప్రధానంగా ఆ సినిమాలు తీశారో తూచా తప్పకుండా ఆ జానర్స్ ని కలుషితం చేయకుండా, వాటి మర్యాదని కాపాడుతూ తీసిన సినిమాలే హిట్టయ్యాయి. అంటే ప్రేక్షకులు సినిమాలు చూసే పద్ధతిని మార్చుకున్నారా? ఎలాటి నాన్సెన్స్ నీ అంగీకరించడం లేదా? కథ ఏదైనా దాన్ని స్వచ్ఛంగా, సరళంగా, అర్ధవంతంగా చూపించాలని కోరుకుంటున్నారా? ఏమో చెప్పలేం గానీ, అలాటి సినిమాలే హిట్టయ్యాయి...ఈ నేపధ్యంలో ఈ జానర్ మర్యాద అంటే ఏమిటో, దాన్నెలాకాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం జానర్ అంటే కేటగిరీ, వెరైటీ, తరహా, జాతి, గ్రూపు, టైపు, మోడల్...ఇలా అనేక పర్యాయ పదాలున్నాయి. జానర్ అనే మాట ఎందుకు అవసరమైందంటే సినిమాల్ని గుర్తు పట్టడానికే. మీదే జానర్ సినిమా అంటే యాక్షన్ అనో, లవ్ అనో, ఫ్యామిలీ అనో చెప్పొచ్చు. జానర్ గురించి ఇంకా బాగా అర్ధమవాలంటే, మీదే జానర్ సినిమా అని అడిగారంటే, ఏ రస ప్రధానమైన సినిమా అని అడిగినట్టే - హాస్య రస ప్రధానమా, భక్తి రసప్రధానమా అని! ఇలా సినిమాల్ని వివిధ జానర్లుగా గుర్తిస్తున్నారు. పైన చెప్పుకున్న యాక్షన్, లవ్, ఫ్యామిలీ లతో బాటు, కామెడీ, క్రైం, హార్రర్, ట్రాజెడీ, డ్రామా, అడ్వెంచర్, స్పోర్ట్స్ , హిస్టారికల్, బయోపిక్, మ్యూజికల్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, వార్, కౌబాయ్..ఇంకా జానపద, పౌరాణిక, భక్తి, ఉద్యమ, విప్లవ, దేశభక్తి, రాజకీయ, సామాజిక, ప్రయోగాత్మక, బాలల ...చెప్పుకుంటే పోతే ఎన్నో. మళ్ళీ వీటిలో కొన్నిటికి సబ్ జానర్లు కూడా వున్నాయి. ఈ సబ్ జానర్లు వందల్లో వుంటాయి. ఎప్పటికప్పుడు కొత్తకొత్తవి చేరుతూనే వుంటాయి. యాక్షన్ జానర్ కి సబ్ జానర్లు గా యాక్షన్ కామెడీ, థ్రిల్లర్, ఫ్యాక్షన్, టెర్రరిజం, మార్షల్ ఆర్ట్స్, ఎపిక్, స్పై, డిజాస్టర్, సూపర్ హీరో..ఇంకెన్నో వున్నాయి. క్రైం జానర్ లో డిటెక్టివ్, గ్యాంగ్ స్టర్, మాఫియా, రోడ్ మూవీ, రేప్ రివెంజి, లీగల్ థ్రిల్లర్స్, కోర్ట్ రూమ్ డ్రామాలు మర్డర్ మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్..ఇంకా మరెన్నో సబ్ జానర్లుగా వున్నాయి. అలాగే లవ్ జానర్లో రోమాంటిక్ డ్రామా, రోమాంటిక్ కామెడీ, రోమాంటిక్ థ్రిల్లర్, చిక్ ఫ్లిక్స్ లాంటివి అనేకం సబ్ జానర్లుగా వున్నాయి. హారర్ర్ జానర్ కి ఘోస్ట్ హార్రర్, హార్రర్ కామెడీ, పారానార్మల్, జాంబీ, క్షుద్ర శక్తులు, చేతబడి లాంటివెన్నో వున్నాయి... తెలుగులో ఇప్పుడు ఎక్కువగా చెలామణి లో వుంటున్నవి యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, లవ్, హార్రర్, అడ్వెంచర్, టెర్రర్, ప్రయోగాత్మకాలతో బాటు మాస్....పక్కా మాస్ అనే లోకల్ జానర్ సినిమాలు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే కేవలం ఏదో ఒక జానర్ మీద ఆధారపడి సినిమాలు తీయడం అరుదు. రెండు మూడు జానర్ లు కలిపి హైబ్రిడ్ గా తీసే సినిమాలే ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కువగా వుంటున్నాయి. తెలుగులో యాక్షన్ తీస్తే, అందులో కామెడీ, ఫ్యామిలీ కూడా కలప వచ్చు – తప్పని తద్దినం మాస్ అనే పదార్ధాన్ని కూడా అందులో ఎటూ కలపాల్సిందే. హార్రర్ తీస్తే దాన్ని కామెడీతో కలిపి ఇప్పుడు హార్రర్ కామెడీ గా తీయాల్సిందే. లవ్ తీస్తే దాంట్లో కామెడీ కలిపి రోమాంటిక్ కామెడీగా, లేదా డ్రామా కలిపి రోమాంటిక్ డ్రామాగా, థ్రిల్లర్ కలిపి రోమాంటిక్ థ్రిల్లర్ గా తీస్తున్నారు. ఈ కలపడంలో ఎక్కువ తక్కువల దగ్గరే తేడా వస్తోంది. రెండు మూడు జానర్ లు కలిపినప్పుడు వాటిలో ఒకటే మెయిన్ జానర్ గా వుంటుంది, వుండాలి కూడా. మిగిలినవి పక్క వాద్యాలుగా వుండాలి. ఒకవేళ పక్క వాద్యాలలో ఒకటి లేదా రెండూ కలిసి మెయిన్ జానర్ గా మారిపోయి, మెయిన్ జానర్ ని పక్కకి తోసేస్తే ఏం జరుగుతుంది? అది జానర్ మర్యాదని కాపాడని సినిమాగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. మైక్రోఫోన్ ముందు నుంచి మెయిన్ సింగర్ని తోసేసి కోరస్ పాడేవాళ్ళు పాటెత్తుకుంటే ఎలావుంటుందో,అలావుంటుందిమెయిన్ జానర్ తో డ్రెయిన్ (సైడుకాల్వ) జానర్ల పెత్తనం. తాజాగా ఈ ఏప్రెల్ 29 న విడుదలైన ‘రాజా చెయ్యి వేస్తే’ కూడా ఇంతే. డ్రైనేజీ జానర్ల దెబ్బకి మెయిన్ జానర్ మూసీ నదిలా పారింది. సినిమా తీసే దర్శకుడు అసలు సినిమా లెందుకు ఫ్లాపవుతున్నాయో వేయి కళ్ళతో గమనిస్తూ, పరిశీలిస్తూ ఉండడమనే మార్కెట్ మూల్యాంకన చేసుకునే ఓపిక వుంటే తప్ప, తనూ ఇంకో అలాటి ఫ్లాప్ ఇవ్వకుండా ముందు జాగ్రత్త పడలేడు. ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారిపోతున్నాయి. తీసిన సినిమా ఎందుకు ఫ్లాపయయిందో అర్ధం కానంతగా కొత్త కొత్త కారణాలు వచ్చి చేరుతున్నాయి. గత సంవత్సరం కల్తీ లేని జానర్లకే పట్టం గట్టి నట్టే, సింగిల్ స్క్రీన్ సినిమా కథలకే ఓటేశారు ప్రేక్షుకులు. అంటే జానర్ల పరిరక్షణతో బాటు, సింగిల్ స్క్రీన్ కథలు- మల్టీప్లెక్స్ కథలు అనే తేడా కూడా దర్శకులు గుర్తించాల్సిన అగత్యం ఏర్పడిందన్నమాట! పెద్ద, మధ్య తరహా సినిమాలు విడుదల అవుతాయి. చాలా కొన్నే హిట్టవుతాయి. వీటికి రెట్టింపు సంఖ్యలో చిన్న చిన్న సినిమాలు విడుదల అవుతాయి. అన్నీ ఫ్లాపవుతాయి. ఇది ఆన్ స్క్రీన్ దృశ్యం. కానీ చిన్న సినిమాలు ఎన్ని విడుదలై ఫ్లావుతాయో, అన్నేసి అసలే విడుదల కాకుండా బుట్ట దాఖలై పోతున్నాయన్న వాస్తవం కూడా గమనించాలి. ఇది ఆఫ్ స్క్రీన్ గా కన్పించే సీను. చిన్నా చితకా సినిమాలు నిర్మాణ రంగంలోనే తప్ప, ప్రదర్శనా రంగంలో ఎవ్వరికీ నయా పైసా అందించని మొండి ఘటాలైపోయాయి. ఇవి తీసినా ఒకటే తీయకపోయినా ఒకటే అన్నట్టు తయారయ్యింది పరిస్థితి. గత సంవత్సరం జయాపజయాల్ని ఆయా సినిమాల జానర్ మర్యాద కిచ్చిన ప్రాధాన్యమే నిర్ణయించింది. అంటే జానర్ మర్యాద పాటించిన సినిమాలనే తమకి తెలీకుండానే ఎక్కువ చూశారు ప్రేక్షకులు. ఒకసారి ఆ వివరాల్లోకి వెళ్దాం... 2015 లో మొత్తం చిన్నా పెద్దా తెలుగు స్ట్రెయిట్ సినిమాలు 88 విడుదలయ్యాయి. డబ్బింగ్ సినిమాలు 39 విడుదలయ్యాయి. మొత్తం కలిపి విడుదలైన సినిమాల సంఖ్య 127. విడుదలైన 88 స్ట్రెయిట్ చిత్రాల్లో పెద్ద సినిమాలు 10 వుంటే, మధ్య తరహా 36, చిన్నవి 42 వున్నాయి. పెద్ద సినిమాలు పదింటిలో 5 విజయం సాధించగా, మధ్యతరహా 36 లో 9, 42 చిన్న సినిమాల్లో 2 సక్సెస్ మాత్రమే అయ్యాయి. మొత్తం 88 లో 16 హిట్టయ్యాయి. ఈ పదహారూ జానర్ మర్యాదని కాపాడుకున్నవే. పెద్ద సినిమాల్లో శ్రీమంతుడు, గోపాల గోపాల, టెంపర్, బాహుబలి, రుద్రమదేవి, లయన్, బ్రూస్ లీ, సన్నాఫ్ సత్యమూర్తి, కిక్-2, బెంగాల్ టైగర్ అనే 10 వుండగా, శ్రీమంతుడు, గోపాల గోపాల, బాహుబలి, రుద్రమ దేవి, టెంపర్ –ఈ ఐదు మాత్రమే హిట్టయ్యాయి. హిట్టయిన శ్రీమంతుడు జానర్ మర్యాద ఎలా కాపాడుకుందో చూద్దాం. ఇది ఫ్యామిలీ –యాక్షన్ రెండు సజాతి జానర్ల కలబోత కాగా, దీంట్లోకి మళ్ళీ పక్కా మాస్ ని చొరబెట్టలేదు. అలాగే పెద్ద సినిమాల్లో అదేపనిగా వస్తున్న ‘సెకండాఫ్ లో విలన్ ఇంట్లో హీరో చేరుట మరియు బ్రహ్మానందంతో కన్ఫ్యూజ్ కామెడీ చేయుట అవశ్యము’ అనే సింగిల్ విండో స్కీములోకి కథని తోసెయ్యకుండా ఆ రెండు యాక్షన్- ఫ్యామిలీ జానర్లనే కాపాడుకుంటూ కథ నడిపారు. ఇందులో మహేష్ బాబు పాత్ర పూర్తి డొల్లగా వుంటుంది. ఈ సూక్ష్మం ప్రేక్షకులు తెలుసుకోవడం కష్టం. వాళ్లకి డిస్టర్బెన్స్ లేకుండా రెండు జానర్లతో ‘అర్ధమయ్యేలా’ కథ నడిపించారు. ‘గోపాల గోపాల’ నాస్తికుడికీ, దేవుళ్ళ పేర్లతో దందాలు చేసే ఆస్తికులకీ మధ్య సంఘర్షణగా ప్రయోగాత్మకంగా తీశారు. ప్రయోగాత్మకంలో మాస్- కామెడీ ల వంటి విజాతి జానర్ లని చొరబెడితే చాలా అనాగరికంగా వుంటుంది కాబట్టి ఆ జాగ్రత్త పడ్డారు. ఈ కథలో కూడా పెద్ద లోపముంది- తన వ్యాపారం మీద పిడుగుపడి నష్ట పోయినందుకుగాను, ఆ నష్ట పరిహారం దేవుడు చెల్లించాలని దేవుడి మీద కేసు వేస్తాడు నాస్తికుడైన హీరో. కానీ ఇలాటి వాటికి ప్రకృతి వైపరీత్యాల ఖాతాలో నష్ట పరిహారం ఇస్తూనే వుంటాయి ప్రభుత్వాలు. ఈ సూక్షం కూడా ప్రేక్షకులు పట్టించుకోలేదు. పట్టించుకున్నా క్షమించేయ గలరేమో జానర్ మర్యాద దృష్ట్యా. ‘టెంపర్’ని సామాజిక జానర్లో తీశారు. రేప్ అనే సామాజిక సమస్యతో సినిమాటిక్ పరిష్కారంకోసం ప్రయత్నించారు. ఇందులో దాదాపు సగం సినిమా మాస్ ఎలిమెంట్స్ తో గడిచిపోతుంది. సామాజికం - మాస్ సజాతి జానర్లే కాబట్టి చెల్లిపోయింది. కథా పరంగా ఇందులో లక్ష తప్పులున్నా పట్టించుకోలేదు ప్రేక్షకులు. ఈ మూడు మాత్రమే జానర్ల పాలన సరిగ్గా వుండి హిట్టయిన పెద్ద స్టార్ల రెగ్యులర్ సినిమాలు. బాహుబలి, రుద్రమ దేవిల్లాంటి ఫాంటసీ, చారిత్రక సినిమాల్ని కూడా రెగ్యులర్ సినిమాలకి లాగే వాటి జానర్ మర్యాదని చూసి సక్సెస్ చేశారు ప్రేక్షకులు. వీటిలో కథల్లో ఇమడని మాస్, కామెడీ లాంటి జానర్లని తెచ్చి కలపలేదు. ఈ రెండిట్లో మళ్ళీ స్క్రీన్ ప్లే పరంగా పెద్ద లోపాలు చాలానే వున్నాయి. ఫ్లాపయిన లయన్, బ్రూస్ లీ, సన్నాఫ్ సత్యమూర్తి, కిక్-2, బెంగాల్ టైగర్ ఐదింటి జానర్లూ మానభంగానికి గురయ్యాయి. లయన్ ని క్రైం జానర్లో సస్పెన్స్ థ్రిల్లర్ సబ్ జానర్ గా తీశారు. దీంట్లోకి వేరే జానర్లు కలపకపోయినా సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ నే ప్రవేశపెట్ట లేకపోయారు- ‘రాజా చెయ్యి వేస్తే’ లో క్రైం ఎలిమెంట్స్ ని కలపలేకపోయినట్టు. కనీసం ఓ టెంపో గానీ, స్పీడు గానీ ఉండాలన్నా ఆలోచనే చెయ్యలేదు. బ్రూస్ లీ ని ఒక దుష్టుడి బారి నుంచి తన కుటుంబాన్ని- అక్కనీ కాపాడుకునే ఫ్యామిలీ జానర్లో, సిస్టర్ సెంటిమెంట్ అనే సబ్ జానర్ గా తీయబోయారు. దీనికి సజాతి యాక్షన్ జానర్ ని కూడా జోడించారు. ఈ మొత్తాన్నీ మెడబట్టి సింగిల్ విండో స్కీం లోకి నెట్టేశారు. సన్నాఫ్ సత్యమూర్తి లోనైతే ఓపెనింగ్ లోనే ఇదొక నరుక్కునే రాక్షసుల కుటుంబ కథ అన్న సీనేశారు. దీంతో మొత్తం ఫ్యామిలీ జానర్ ఖూనీ అయిపోయింది. ఇందులో హీరో పాత్ర తప్పులతడకయినా, కల్తీ జానరే ప్రాణం తీసింది. యాక్షన్ జానర్ లో కాలం చెల్లిన సబ్ జానర్ ఫ్యాక్షన్ పట్ల విసుగెత్తింది ప్రేక్షకులకి. కిక్-2 సింపుల్ గా తెలుగులో వర్కౌట్ కాని, యాక్షన్ జానర్ లో ‘ఫారిన్ (పరాయి) ఇష్యూ’ సబ్ జానర్ కిందికొస్తుంది. ఎక్కడో రాజస్థాన్ వాళ్ళ సమస్యలు అక్కర్లేదు తెలుగు ప్రేక్షకులకి. ఇక బెంగాల్ టైగర్ మాస్, యాక్షన్ సజాతి జానర్ల కథలోకి, క్రైం జానర్ ని దింపారు. లాజిక్ ని డిమాండ్ చేసే క్రైం జానర్ ని, మాస్ యాక్షన్ తో కలపి, దానికి కూడా లాజిక్ లేకుండా చేయడంతో- మొత్తం మాస్ యాక్షనే సెకండాఫ్ లో డొల్లగా మారింది. ఇలా జానర్ మర్యాదని కాపాడుకుని ఐదు పెద్ద సినిమాలని ప్రేక్షకులు హిట్ చేస్తే, కాపాడుకోలేని ఐదు పెద్ద సినిమాల్ని ఫ్లాప్ చేశారు. (ఇంకా వుంది) -సికిందర్ http://www.cinemabazaar.in Posted by సికిందర్ at 1:02:00 PM Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Newer Posts Older Posts Home Subscribe to: Posts (Atom) ఈ కాన్సెప్ట్ కి బాధితురాలి కథ అవసరం! స్క్రీన్ ప్లే సంగతులు...? Search This Blog contact msikander35@gmail.com, whatsapp : 9247347511 Popular Posts 1255 : రివ్యూ! రచన- దర్శకత్వం : శైలేష్ కొలను తారాగణం : అడివి శేష్ , మీనా క్షీ చౌదరి , కోమలీ ప్రసాద్ , రావు రమేష్ , శ్రీకాంత్ అయ్యంగార్ , తనికెళ్ళ భర... 1257 : రివ్యూ! 2023 లో జరిగే 95 వ ఆస్కార్ అవార్డ్స్ కి మన దేశం తరపున అధికారిక ఎంట్రీ పొందిన గుజరాతీ చలన చిత్రం ‘ చెల్లో షో ’ (చివరి షో) అక్టోబర్... 1260 : రివ్యూ! దర్శకత్వం : అమర్ కౌషిక్ తారాగణం : వరుణ్ ధావన్ , కృతీ సానన్ , దీపక్ దోబ్రియాల్ , పాలిన్ కబాక్ , అభిషేక్ బెనర్జీ తదితరులు. రచన : నీరేన్ భట్ , ... 1258 : సండే స్పెషల్ రివ్యూ! ‘ చాం దినీ బార్ ’ (ముంబాయి బార్ గర్ల్స్ జీవితాలు) , ‘ పేజ్ త్రీ ’ (ఉన్నత వర్గాల హిపోక్రసీ ) , ‘ కార్పొరేట్ ’ (కార్పొరేట్ రంగం... 1259 : రివ్యూ! రచన - దర్శకత్వం : చెల్లా అయ్యావు తారాగణం : విష్ణు విశాల్ , ఐశ్వ ర్యా లక్ష్మి , కరుణాస్ , శ్రీజా రవి , మునిష్కాంత్ తదితరులు సంగీతం : జస్... రైటర్స్ కార్నర్ హై కాన్సెప్ట్ స్క్రిప్ట్ అంటే బిగ్ కలెక్షన్స్ ని రాబట్టే స్క్రిప్ట్. ఈ ఆర్టికల్ లో మీకు బిగ్ కలెక్షన్స్ ని సాధించి పెట్టే హై కాన్స... 1254 : రివ్యూ! రచన - దర్శక త్వం : ప్రదీప్ రంగనాథన్ తారాగణం : ప్రదీప్ రంగనాథన్ , సత్యరాజ్ , యోగి బాబు , ఇవానా , రాధి కా శరత్‌కుమార్ , రవీనా తదితరులు సంగీ త... (no title) ప్ర తిభ నిరూపించుకోవడానికి షార్ట్ ఫిలిమ్సే కాదు, డాక్యుమెంటరీ లనే విభాగం కూడా వుంది. ఐతే ఇది సామాజిక బాధ్యతలతో కూడుకున్నది. వివ... తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17 స్క్రీ న్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసల... 1256 : రివ్యూ! రచ న -దర్శక త్వం : ఆనంద్ జె తారాగణం: రావణ్ రెడ్డి , శ్రీ ని ఖి త , లహ రీ గుడివాడ , రవీంద్ర బొమ్మకంటి , అమృత వర్షిణి తదిత తరులు సంగీతం: ఫ...
thesakshi.com : రఘురామకృష్ణరాజు తనను రాష్ర్టానికి రావద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్నట్లు సహచర ఎంపీలు తనకు చెప్పారని.. రాష్ట్రం ఏమైనా జగన్ సొంతమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసులు సైతం సీఎం ఎలా చెబితే అలా ఆడుతున్నారని మండిపడ్డారు. తాను ఆంధ్రప్రదేశ్‌ రావడానికి వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నట్లు తన దృష్టికి వచ్చిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తన నియోజకవర్గానికి తాను వెళ్తానంటే జగన్‌కి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్ధం కావడం లేదన్నారు. రెబెల్ ఎంపీ రఘురామ జూలై 4న ప్రధాని మోడీ భీమవరం టూర్ లో పాల్గొనేందుకు తాను వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తాజాగా విశాఖ లో పార్లమెంటరీ కమిటీ సమావేశానికి వెళ్లేందుకు ప్రయత్నించినా తనను అడ్డుకున్నారని రఘురామ ఆరోపించారు. అందుకే ప్రధాని మోడీ భీమవరం టూర్ లో తనకు తగిన భద్రత కల్పించేలా జగన్ సర్కార్ కు ఆదేశాలు ఇవ్వాలని రఘురామ కోరారు.అయితే దీనిపై హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు మాత్రం రాలేదు. ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీతో విభేధించి దూరమైన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాష్ట్రంలో తనకు భద్రత లేదంటూ ఏకంగా ఢిల్లీకే మకాం మార్చారు. అప్పటి నుంచి తిరిగి తన నియోజకవర్గం నరసాపురంలో అడుగు పెట్టలేదు. గతంలో పలుమార్లు నియోజకవర్గానికి వచ్చేందుకు ప్రయత్నించి విఫలమైన రఘురామ.. ఈసారి ప్రధాని మోడీ భీమవరం టూర్ ను అడ్డుపెట్టుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కేంద్రం భద్రత కోరుతున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో విభేధించడం మొదలుపెట్టిన తర్వాత ఢిల్లీకే పరిమితమవుతున్నరఘురామ తన సొంత నియోజకవర్గం నరసాపురానికి పూర్తిగా దూరమయ్యారు. తనకు ఓట్లు వేసిన నరసాపురం ప్రజల కంటే రాజకీయాలే ముఖ్యంగా భావించి ఢిల్లీలోనే ఉండిపోయారు. వైసీపీ నేతల నుంచి తనకు రక్షణ లేదంటూ వై ప్లస్ కేటగిరీ భద్రత తీసుకున్న రఘురామ.. ఆ తర్వాత కూడా నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. కానీ మధ్యలో నియోజకవర్గానికి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వీలు కాలేదు. సొంత నియోజకవర్గం నరసాపురానికి తిరిగి వచ్చేందుకు కొంతకాలంగా శత విధాలా ప్రయత్నిస్తున్న రఘురామరాజు.. త్వరలో జరిగే ప్రధాని మోడీ పర్యటనను అవకాశంగా మార్చుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ భీమవరానికి వస్తున్న జూలై 4వ తేదీన ఎలాగైనా అక్కడికి వెళ్లాలని భావిస్తున్నారు. ఓవైపు తనకు రక్షణ లేదంటూనే మరోవైపు భీమవరానికి వెళ్లాలని భావిస్తున్న రఘురామ ఇందుకోసం కేంద్రాన్ని ఆశ్రయించారు. గతంలో ఓసారి కేంద్రాన్ని ఆశ్రయించి వై ప్లస్ కేటగిరీ భద్రత తీసుకున్న రఘురామ… ఇప్పుడు మరోసారి తనకు భీమవరం టూర్ లో భద్రత కోరుతున్నారు. Tags: #ANDHRA PRADESH#Andhrapradesh news#AP CM JAGAN#AP POLITICAL#modi tour andhrapradesh#MP Raghurama Krishnaraju#PM Narendra modi#ysjagan#YSRCP
PunchPrasad: ఎంతో మంది కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసింది జబర్దస్త్. వారిలో చాలా మంది ఆర్టిస్టులు తమ ప్రతిభను నిరూపించుకుని సొంత అభిమానులను సంపాదించుకున్నారు. అలా తనదైన శైలి పంచులతో, ప్రాసలతో, కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులకు తెలుగు టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు “పంచ్ ప్రసాద్”. అయితే ఈ మధ్య పంచ్ ప్రసాద్ జబర్డస్త్ వేదికపై కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ప్రసాద్ ఆరోగ్యం బాగా విషమించిందని.. కనీసం నడవలేని స్థితిలోకి చేరుకున్నాడని.. తోటి జబర్దస్త్ ఆర్టిస్ట్ నూకరాజు తెలియజేసాడు. దానితో ప్రసాద్ అభిమానుల్లో, జబర్దస్త్ ప్రేక్షకుల్లో కలకలం మొదలైంది. ఇక ఇటీవల ప్రసాద్ ఆరోగ్యంపై వారి భార్య మరియు డాక్టర్లు ప్రకటన చేయడంతో ప్రసాద్ కు కావాల్సిన చికిత్స అందుతున్నట్టు తెలిసింది. ప్రసాద్ కు భార్యే దగ్గరుండి సకల సేవలు చేస్తుందట. డయాలిసిస్, ఇతర చికిత్సలు.. ప్రసాద్ కిడ్నీ సమస్యలు ఎదుర్కుంటుండటంతో డాక్టర్లు డయాలిసిస్ మరియు అవసరమైన ఇతర చికిత్సలు అందిస్తున్నారట. దీనితో ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్యం కొంత వరకు మెరుగుపడిందని.. ఐనప్పటికీ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు డాక్టర్లు. ప్రత్యేక కేర్ తీసుకుంటూ ప్రసాద్ భార్య సపర్యలు చేస్తుంది. ఇలాగే మరికొన్ని రోజులు చికిత్స కొనసాగిస్తే.. తొందరలోనే ప్రసాద్ మళ్ళీ పూర్తి స్థాయి ఆరోగ్యవంతునిగా మన ముందుకు వస్తాడు. ఇక ఈ విషయం బయటికి తెలియడంతో ప్రసాద్ అభిమానులు, జబర్డస్త్ ప్రేక్షకులు సంతోష పడుతున్నారు. ప్రసాద్ తొందరగా కోలుకోవాలని, మళ్ళీ మనల్ని నవ్వించాలని ఆశిస్తున్నట్టు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు జనాలు. డాక్టర్లు కూడా ప్రమాదం లేదని తెలుపడం, ప్రసాద్ ఆరోగ్యం ఇంతకు ముందుకంటే మెరుగుపడడం తో త్వరలోనే ప్రసాద్ కోలుకుంటాడని ఆశిస్తున్నారు అభిమానులు.
క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను. మెయిన్ గేటే కాక, ముఖద్వారం కూడా తెరచివుండడం ఆశ్చర్యం గొలిపింది. లోపల ప్రవేశించి, జేబులోంచి పెన్ టార్చ్ తీసి వెలిగించాడు. admin May 29, 2022 - 23:47 Updated: Jul 1, 2022 - 09:36 0 91 Facebook Twitter క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను. మెయిన్ గేటే కాక, ముఖద్వారం కూడా తెరచివుండడం ఆశ్చర్యం గొలిపింది. లోపల ప్రవేశించి, జేబులోంచి పెన్ టార్చ్ తీసి వెలిగించాడు. క్రైమ్ స్టోరీ ఆగంతకుడు రచనః తిరుమలశ్రీ *** శీతాకాలం కావడంతో రాత్రి ఎనిమిది గంటలకే వీధులన్నీ నిర్మానుష్యం అయిపోయాయి. నగరపు శివార్లలో అందమైన భవంతులు రెండు ఎదురుబొదురుగా ఉన్నాయి. వాటిలో ఒకటి ఓ టీవీ ఛానల్ ప్రొడ్యూసరుదీ, రెండవది ఓ ప్రముఖ చిత్రకారుడిదీను. సోడియం వేపర్ ల్యాంప్స్ ఆ ప్రాంతాన్ని పసుపురంగు వెలుతురుతో నింపేస్తున్నాయి. వాటి నీడలలో జాగ్రత్తగా నడుస్తూ ఆ భవంతులను సమీపించాడు ఓ వ్యక్తి. మనిషి పొడగరి, మీడియం బిల్టూను. వోవర్ కోటు, క్యాపూ ధరించాడు. చేతులకు గ్లవ్స్ ఉన్నాయి. ఎన్నో రోజులుగా తిండిలేనివాడిలా ముఖం పీక్కుపోయి నీరసంగా కనిపిస్తున్నాడు…ఆగి భవంతుల వంక చూసాడతను. ఒకదానిలో వెలుతురు కనిపిస్తూంటే, రెండవది చీకటి ముసుగును కప్పుకుంది. క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను. మెయిన్ గేటే కాక, ముఖద్వారం కూడా తెరచివుండడం ఆశ్చర్యం గొలిపింది. లోపల ప్రవేశించి, జేబులోంచి పెన్ టార్చ్ తీసి వెలిగించాడు. విశాలమైన హాలు అది. నేలపైన పరచబడియున్న ఖరీదైన కాశ్మీరీ కార్పెట్, రోజ్ వుడ్ ఫర్నిచర్, గోడలకు ఉన్న అద్భుతమైన ఆయిల్ పెయింటింగ్స్ ఆ ఇంటివారి రిచ్ టేస్టుకు అద్దంపడుతున్నాయి…పై అంతస్థులోంచి సన్నటి వెలుతురు రావడం గమనించి, చప్పుడుకాకుండా మేడమెట్లు ఎక్కాడు. పైన వరుసగా నాలుగు గదులున్నాయి. వెలుతురు చివరి గదిలోంచి వస్తోంది. టార్చ్ ని ఆఫ్ చేసి, అటువైపు నడచాడు. ఆ గది తలుపు ఓరగా తెరచివుంది. మెల్లగా త్రోసి లోపలికి తొంగిచూసాడు. ఎసి చల్లదనం అతని ముఖానికి సోకింది. కుడిచేయి కోటు జేబులోకి వెళ్ళింది. విశాలమైన గది అది. ట్యూబ్ లైట్స్ వెలుతురులో పట్టపగలులా ఉంది. పెయింటింగ్స్, ఆర్ట్ పేపర్, కలర్స్, బ్రష్ లు, పెన్నులు, పెన్సిల్స్, వగైరాలు చిందరవందరగా ఉన్నాయి. కాల్చి పారేసిన సిగరెట్ పీకలు నేలంతా పడున్నాయి. గది మధ్య పెద్ద డ్రాయింగ్ బోర్డ్ ఉంది. ఓ వ్యక్తి ఆ ఈజెల్ ముందు స్టూల్ మీద కూర్చుని ఏదో పెయింటింగ్ ను వేయడంలో పూర్తిగా నిమగ్నమయివున్నాడు. ఓచేతిలో బ్రష్షూ, మరో చేతిలో సిగరెట్టూతో పరిసరాలను పూర్తిగా విస్మరించినట్టు కనిపించాడు. ఆగంతకుడు షూతో నేలపైన చప్పుడు చేసాడు. లోపలి వ్యక్తి తన లోకంలో తాను ఉన్నాడు. ఆగంతకుడి పెదవుల పైన సన్నటి చిరునవ్వు మెరిసింది. తలుపు దగ్గరగా మూసి వెనుదిరిగాడు. మిగతా గదులు ఒక్కొక్కటే తొంగిచూస్తూ వెళ్ళి, ఓ పెద్ద గది ముందు ఆగాడు. లోపల ప్రవేశించి లైట్ వేసాడు. బెడ్ రూమ్ అది. గోడలకున్న ప్లెజెంట్ కలర్ షేడ్స్, ఇల్లూమినేషన్, ఖరీదైన ఫర్నిషింగ్స్, ఫోమ్ బెడ్, అపురూపమైన ఆర్ట్ పీసెస్ వగైరాలతో కూడిన రిచ్ డెకొరేషన్ అబ్బురపరచింది. అంత పెద్ద భవంతిలో ఆ ‘పిచ్చి’ ఆర్టిస్ట్ తప్ప వేరెవరూ లేరన్న విషయం అర్థమయిపోయింది అతనికి. బెడ్ ని చూడగానే రిలాక్స్ అవ్వాలనిపించింది. చేతులకున్న గ్లవ్స్ ని తీసేసి కోటు యొక్క ఎడమ జేబులో దోపుకున్నాడు. కుడి జేబులోంచి పిస్టల్ తీసి టీపాయ్ మీద పెట్టాడు. కోటు విప్పి డ్రెస్సింగ్ స్టాండ్ మీద పడేసి, క్యాప్ ని స్టాండ్ కి తగిలించాడు. అద్దం ముందు నిలుచుని ఓసారి తన రూపం పరీక్షగా చూసుకున్నాడు. గడ్డం మాసివుంది. స్టాండ్ మీదున్న టర్కిష్ టవల్ ని అందుకుని వాష్ రూమ్ వైపు నడచాడు…సువాసనలీనే వాష్ రూమ్ లో ఉన్న ట్విన్-బ్లేడ్ జిలెట్ రేజర్ తో షేవ్ చేసుకున్నాడు. షవర్ క్రింద చన్నీటితో స్నానం చేస్తూంటే శరీరానికి, మనసుకూ హాయిగా అనిపించింది. కూనిరాగాలు తీస్తూ షవర్ క్రింద అవసరానికంటే ఎక్కువసేపే గడిపాడు. తరువాత ఒంటికి టవల్ చుట్టుకుని, డ్రయ్యర్ తో జుట్టును ఆర్చుకున్నాడు. ఒంటికి క్రీమ్స్ రాసుకున్నాడు. వార్డ్ రోబ్ లో తనకు సరిపోయే దుస్తులకోసం చూసాడు. ఆ ఆర్టిస్టూ, తానూ ఇంచుమించు ఒకే ఒడ్డూ పొడవూలో ఉంటారు. తనకు నచ్చిన డ్రెస్ ని ఎంచుకుని తొడుక్కున్నాడు. బెడ్ మీద వెల్లకిలా పడుకుని గదంతా పరికించాడు. చూపులు ఫ్రిజ్ మీద పడడంతో ఆకలి తన్నుకువచ్చింది. చటుక్కున లేచి వెళ్ళి ఫ్రిజ్ తెరచాడు. లోపల రకరకాల వెజ్, నాన్ వెజ్ ఫాస్ట్ ఫుడ్ ఉంది. హాట్ డ్రింక్సు, సాఫ్ట్ డ్రింక్సూ ఉన్నాయి. విస్కీ తీసి గ్లాసులో పోసుకున్నాడు. ఐస్ కలపకుండానే ఒక్క గుక్కలో దాన్ని గొంతులో పోసేసుకున్నాడు. తనకిష్టమైన నాన్ వెజ్ ఫుడ్ ని ప్లేటులో పెట్టుకుని తనివితీరా తిన్నాడు. తరువాత భుక్తాయాసంతో బెడ్ పైన నడుం వాల్చాడు. # నిద్రలోకి ఎప్పుడు జారుకున్నాడో, ఎంతసేపు నిద్రపోయాడో తెలియదు…అడుగుల చప్పుడుకు ఉలికిపడి కళ్ళు తెరచాడు అతను. గుమ్మంలో ఆర్టిస్ట్ నిలుచుని ఉన్నాడు. ఆశ్చర్యంతో కళ్ళు వెడల్పుచేసుకుని, అపనమ్మకంగా ఆగంతకుడి వంక చూస్తున్నాడు. ఆగంతకుడు చటుక్కున లేచి కూర్చుని, ఆర్టిస్ట్ వంక తేరిపారజూసాడు…ముప్పయ్ లలో ఉంటాడు అతను. విశాలమైన నుదురు, మెరిసే కన్నులూను. నైట్ డ్రెస్ లో ఉన్నాడు. డ్రెస్ అంతా రంగుల మరకలు. ముఖానికి కూడా అక్కడక్కడ రంగులు అంటడంతో ఫన్నీగా కనిపించాడు. పెదవుల మధ్య సిగరెట్ ఉంది. ఇద్దరూ ఒకరినొకరు తేరిపారజూసుకున్నారు. తన స్థితి హఠాత్తుగా గుర్తుకు రావడంతో చటుక్కున బెడ్ మీంచి క్రిందికి గెంతాడు ఆగంతకుడు. టీపాయ్ మీది పిస్టల్ అందుకుని ఆర్టిస్టుకు గురిపెట్టాడు. ఆర్టిస్ట్ కనుబొమలు ముడివడ్డాయి. “ఎవరు నువ్వు?” అన్నాడు తీక్ష్ణంగా. ఆగంతకుడు అదోలా నవ్వాడు. “నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది!” అన్నాడు. ఆర్టిస్ట్ కదలబోతే, “కదలకు!” అంటూ అరచాడు. “ఇది డమ్మీ పిస్టల్ కాదు. ఇప్పటికే అరడజను ప్రాణాలు తీసింది. నువ్వు ఏడో విక్టిమ్ వి కాకు”. ఆర్టిస్ట్ నిశ్చేష్ఠుడయ్యాడు. ఆగంతకుణ్ణి ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది అతనికి. కానీ, ఎక్కడ చూసాడో గుర్తుకు రావడంలేదు…లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఆగంతకుడు ఎదురుగా కూర్చుని, పిస్టల్ ని అతనికి గురిపెట్టి వుంచాడు. “రంగులు పులుముకున్న నీ ముఖము, దుస్తులూ చూస్తూంటే…కదులుతూన్న కళాఖండంలా ఉన్నావు!” అంటూ పెద్దగా నవ్వాడు. “నీ పరిచయ భాగ్యం కలిగించు నాకు”. అతని హ్యూమర్ కి ఆర్టిస్ట్ పెదవులపైన చిరునవ్వు నర్తించింది. “ఫన్నీ! నా ఇంట్లో దొంగతనంగా చొరబడింది నువ్వు. నేనెవరో చెప్పుకోమంటున్నావు!” అన్నాడు. “ఓకే. నా పేరు పరంధామ్. ఓ ఆర్టిస్ట్ ని”. “ఈ లంకంత కొంపలో నువ్వు తప్ప మరో జీవి ఉన్నట్టు కనిపించదు. నువ్వింకా పెళ్ళిచేసుకోలేదా?” “నాకు పెళ్ళయింది”. “మరైతే నీ భార్య ఎక్కడ?” “హఠాత్తుగా తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చి వుంటారు!” “వాడ్డుయూ మీన్?” మందహాసం చేసాడు పరంధామ్. “నా స్థితి ఏమిటో నువ్వే చూసావుగా? నువ్వు ఇంట్లో చొరబడడం కూడా ఎరుగను నేను. ఒకసారి ఈజెల్ ముందు కూర్చున్నానంటే నన్ను నేనే మరచిపోతాను. నాలాంటి ఆర్టిస్ట్ ని పెళ్ళాడిన ఏ స్త్రీ అయినా నిరుత్సాహంతో మనసు వికలమై పుట్టింటికి పోవడం అసహజం కాదు!” అన్నాడు. ఆశ్చర్యంగా చూసాడు ఆగంతకుడు. “క్వైట్ ఇంటరెస్టింగ్! నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందన్నమాట!” పరంధామ్ భుజాలు ఎగరేసాడు. ఆగంతకుడు పిస్టల్ తీసి జేబులోకి త్రోస్తూ లేచి నిలుచున్నాడు. “ఐ తింక్ యూ బ్యాడ్లీ నీడ్ ఎ డ్రింక్”. ఫ్రిజ్ తెరచి డ్రింక్స్ బయటకు తీస్తూ, “ఐస్ వేసుకుంటావా?” అనడిగాడు పరంధామ్ ని. అతను తల ఊపడంతో, విస్కీ బాటిల్ తీసి రెండు గ్లాసులలో పోసాడు. ఒకదానిలో ఐస్ క్యూబ్స్ ని వేసి, దాన్ని పరంధామ్ కి అందించాడు. తాను రెండవ గ్లాసు తీసుకుని వెళ్ళి ఓ కుర్చీలో కూర్చున్నాడు. అతని వీపు గుమ్మం వైపు వుంది. ‘చీర్స్’ చెబుతూ పరంధామ్ గ్లాస్ కి తన గ్లాస్ ని తాకించాడు. కొద్ది నిముషాలపాటు మౌనంగా డ్రింక్స్ ను సిప్ చేస్తూ ఉండిపోయారు ఇద్దరూ. ఆగంతకుడు జేబులోంచి పిస్టల్ తీసి తొడపైన పెట్టుకున్నాడు. “నెక్స్ట్ టైమ్ నీ భార్య పుట్టింటికి వెళ్ళేటప్పుడు నాలాంటి అన్-వాంటెడ్ గెస్ట్స్ రాకుండా మెయిన్ డోర్ లాక్ చేసుకుని వెళ్ళమని చెప్పు. నాలాంటివాళ్ళకు శివార్లలో ఉన్నమీ ఇల్లు ఐడియల్లీ సూటెడ్. వాడ్డూయూ సే?” అన్నాడు. “పెళ్ళాల పోకడ, ఆగంతకుల రాకడ ఎవరు ఊహించగలరు!?” నవ్వడానికి ప్రయత్నించాడు పరంధామ్. “నాలాంటి మ్యాడ్ ఆర్టిస్టును పెళ్ళాడినందుకు నా భార్య ఎప్పుడూ సణుక్కుంటూనే వుంటుంది”. ఆగంతకుడి ముఖంలో రంగులు మారిపోయాయి. దవడలు బిగుసుకున్నాయి. పిస్టల్ మీద పట్టు బిగించాడు. “డామిట్! ఆడవాళ్ళందరినీ షూట్ చేసి పడెయ్యాలి! వాళ్ళందరూ ఒకటే! నిజానికి, నా ఈ దుస్థితికి కారణం ఓ ఆడదే!” ఆవేశంతో ఊగిపోయాడు. ఆవేశంలో అతను ఎక్కడ ట్రిగ్గర్ నొక్కుతాడోనని భయం వేసింది పరంధాంకి ఓ క్షణం. ఎందుకంటే, పిస్టల్ తనకే గురిపెట్టబడివుంది. కానీ, ఆగంతకుడు త్వరగానే కోలుకున్నాడు. పరంధామ్ సిగరెట్ వెలిగించి రెండు పీల్పులు పీల్చాడు. “ఇప్పటికైనా నువ్వెవరో తెలుసుకోవచ్చునా నేను?” అడిగాడు. “ఆర్ యూ ఎ ఫ్యూజిటివ్?” ఆగంతకుడు తలూపాడు. “రెండు రోజుల క్రితం సెంట్రల్ జెయిల్ నుండి తప్పించుకున్న ఖైదీని నేనే” అన్నాడు. పరంధామ్ త్రుళ్ళిపడి సిగరెట్ తో మూతి కాల్చుకున్నాడు. “నేను ముందే చెప్పాను, నేనెవరో తెలిస్తే భయపడిచస్తావని!” వికటంగా నవ్వాడు ఆగంతకుడు. పరంధామ్ కి హఠాత్తుగా గుర్తుకువచ్చింది, ఆ వ్యక్తిని ఎక్కడ చూసాడో…గత రెండు రోజులుగా అతని ఫొటో టీవీలోను, వార్తాపత్రికలలోనూ కనిపిస్తోంది. ‘అతని పేరు మహేష్ అనీ…డ్రెడెడ్ కిల్లర్ అనీ…ఐదు హత్యలు చేసినందుకుగాను ఉరిశిక్ష విధింపడిన అతను రెండు రోజుల క్రితం జెయిల్ గార్డును చంపి తప్పించుకున్నాడనీ... పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారనీ… ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ, అతను తారసపడినట్లైతే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి తెలియపరచవలసిందనీ…’ నగర పోలీసులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. “ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్, మేన్? నన్ను పోలీసులకు పట్టించాలనుకుంటున్నావుకదూ? నీ తలలో బులెట్ దూరాలని ఉబలాటంగా ఉంటే తప్ప, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలేవీ చేయకు,” పిస్టల్ ఝళిపిస్తూ హెచ్చరించాడు ఆగంతకుడు. పరంధామ్ సున్నితమనస్కుడైన ఓ కళాకారుడు. ప్రకృతి అందాలను తన కుంచెతో హృద్యంగా, రమణీయంగా మలచే ఓ చిత్రకారుడు. కరడుగట్టిన క్రిమినల్స్ ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. “ఇక్కడికి ఎందుకు వచ్చావ్? నీకేం కావాలి?” అనడిగాడు. “నా పేరు మహేష్. నేను ప్రేమించిన యువతి నన్ను ఘోరంగా మోసం చేసింది. నన్ను హంతకుడిగా మార్చింది. ఉరిశిక్ష పడి నేను జెయిల్లో మగ్గుతూంటే తాను మరొకడితో కులుకుతోంది. నాకంత త్వరగా చావాలని లేదు. కనీసం, ఆమె మీద నా పగ తీర్చుకునేవరకైనా…అందుకే సాహసించి జెయిల్ నుండి తప్పించుకున్నాను. అప్పట్నుంచీ నిద్రాహారాలు, విశ్రాంతీ లేకుండా పోలీసులనుండి పరుగిడుతూనే వున్నాను. అనుకోకుండా ఊరి శివార్లలో ఉన్న నీ భవనం కనిపించింది. నేను దాక్కునేందుకు అనువైన ప్రదేశం ఇదేననిపిస్తోంది. పోలీసులు నాకోసం వెదకడం మానేసేంత వరకు ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాను…” “నో నో!” కంగారుగా అన్నాడు పరంధామ్. “నీకు కావలసినంత సొమ్ము ఇస్తాను. మరో సురక్షిత ప్రదేశానికి వెళ్ళిపో”. “ఇంతకంటె సురక్షిత ప్రదేశం ఎక్కడుంటుంది! నిన్ను చంపి నీ స్థానంలో ప్రవేశిస్తాను నేను. మనిద్దరం ఇంచుమించు ఒకేలా ఉంటాం కనుక ఎవరికీ అనుమానం కలుగదు. ఎలా ఉంది ఐడియా?” వికటంగా నవ్వాడు ఆగంతకుడు. పరంధామ్ నిర్ఘాంతపోయాడు. హఠాత్తుగా ముచ్చెమటలు పోసాయి. ‘ఆగంతకుణ్ణి ఓవర్ పవర్ చేయగలిగితే ఎంత బావుణ్ణు? ఏదో విధంగా పోలీసులకు టిపాఫ్ ఇవ్వగలిగితే…? లేదా, ఈ క్షణంలో సునీత తిరిగిరాకూడదూ?’ అనిపించింది. సునీత అతని భార్య. ఆగంతకుడు ఆర్టిస్ట్ యొక్క ముఖకవళికలను జాగ్రత్తగా గమనించసాగాడు. “వాట్ మేన్, ఏం ఆలోచిస్తున్నావ్? పోలీసులకు టిపాఫ్ ఇవ్వాలనుకుంటున్నావు కదూ? అలాంటి దుస్సాహసానికి పూనుకున్నావంటే అంతిమ ప్రార్థనకు కూడా నోచుకోవు నువ్వు. ఐ వార్న్ యూ!” అన్నాడు కటువుగా. పరంధామ్ జవాబివ్వలేదు. అతను టెన్స్ గా ఉండడం గమనించిన ఆగంతకుడు పరిస్థితిని తేలికపరచడానికి ప్రయత్నించాడు. “టెల్ మీ, మేన్! ఇంతటి అందమైన భవంతిని ఇలా విసిరేసినట్టుగా ఊరి చివర కట్టడంలో నీ ఉద్దేశ్యమేమిటి…అది కూడా, స్మశానానికి చేరువలో? భయంలేదూ?” చిరునవ్వుతో అడిగాడు. “నాకైతే వింత శబ్దాలంటే చచ్చేంత భయం. ఐ మీన్, స్మశానవాటికల వంటి ప్రదేశాల నుండి వస్తుంటాయే…అలాంటి వియర్డ్ సౌండ్స్ అన్నమాట. నిజం చెప్పాలంటే, చిన్నప్పట్నుంచీ ఈరీ-సౌండ్ ఫోబియా ఉంది నాకు. ఎంత ప్రయత్నించినా అది నన్ను వదలడంలేదు… నిన్ను చంపాక ఇక్కడ ఒంటరిగా వుండాలంటే కష్టమే. బట్, ఛాయిస్ లేదు కదా! ఈజ్ దేర్ ఎనీ?” ఉన్నట్టుండి పరంధామ్ కన్నులు మెరవడం ఆగంతకుడి దృష్టిని తప్పించుకోలేదు. “వాటీజ్ దట్?” అనడిగాడు షార్ప్ గా. అప్రయత్నంగా అతని చేయి పిస్టల్ మీద బిగుసుకుంది. ఏదో అనుమానం రావడంతో స్ప్రింగులా లేచి ద్వారం వైపు పరుగెత్తాడు. బయట ఎవరూ కనిపించలేదు. “తన నీడను చూసుకుని భయపడే వ్యక్తి అన్ని హత్యలు చేసాడంటే ఆశ్చర్యకరమే!” అన్నాడు పరంధామ్ మందహాసంతో. తిరిగి కూర్చుంటూ ఆర్టిస్ట్ వంక గుర్రుగా చూసాడు అతను. “నిజానికి నేను భయపడేదంటూ ఉంటే…అది కేవలం నీడలకు, శబ్దాలకే, మిస్టర్! మనుషులకు కాదు…” అన్నాడు తీవ్రంగా. “నిజానికి మనిషి మరో మనిషికి భయపడడు. అతని చేతిలోని ఆయుధానికి భయపడతాడు…ఉదాహరణకు- మనిద్దరమూ ఒకే వయసువాళ్ళం. ఒకే ఫిజిక్ మనది. ఆమాటకువస్తే జెయిల్ కూడు తినీ, రెండు రోజులుగా నిద్రాహారాలు లోపించీ నీరసంగా ఉన్నాను నేను. నువ్వు తలచుకుంటే నన్ను ఓవర్ పవర్ చేయడం కష్టం కాదు. కానీ, అలాంటి ఆలోచనే కలుగదు నీకు. ఎందుకంటే నువ్వు భయపడేది నన్ను చూసి కాదు, నా చేతిలోని పిస్టల్ ని చూసి! అంటే రక్తమాంసాలుగల మనిషి కంటే, ప్రాణంలేని ఆయుధమంటేనే భయం అన్నమాట…” హఠాత్తుగా వింత శబ్దం ఏదో వినరావడంతో ఉలిక్కిపడ్డాడతను. మాటలు ఆపి, చెవులు రిక్కించాడు. అదేమిటన్నట్టు ఆర్టిస్ట్ వంక చూసాడు. ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తోందో అతనికీ బోధపడలేదు. శబ్దాలు క్రమంగా అధికం కావడంతో, ఆగంతకుడి ముఖంలో రంగులు మారసాగాయి. “అవి…ఆ వియర్డ్ సౌండ్స్…ఏమిటి? ఎక్కణ్ణుంచి వస్తున్నాయి?” అన్నాడు సన్నగా కంపిస్తూన్న స్వరంతో. పరంధామ్ జవాబిచ్చే లోపునే, కీచుమంటూ చిన్నపిల్ల ఏడ్పు వినిపించింది. త్రుళ్లిపడి నిటారుగా కూర్చున్నాడు ఆగంతకుడు. “ఎ…ఎవరది?...మీ ఇంట్లో చంటిపిల్లలు ఉన్నారా?” ‘లేరన్నట్టు’ పరంధామ్ తల అడ్డుగా త్రిప్పాడు. ఆ శబ్దాలు మరింత పెరగడమే కాక– ఎవరో స్త్రీ ఏడ్పు…దెయ్యాలు అరచినట్టూ…వేటకుక్కల మొరుగుళ్ళు…గుడ్లగూబల అరుపులు…నక్కల ఊళలు…క్రూరమృగాల గర్జనలు…వగైరా వింత వింత శబ్దాలు భయం గొల్పుతూ వినిపించసాగాయి. భయంతో గుండె వేగంగా కొట్టుకుంటూంటే ఆగంతకుడిలో సన్నగా వణుకు ఆరంభమయింది. “ఏ…ఏమిటా శబ్దాలు? ఎక్కణ్ణుంచి వస్తున్నాయవి?” కళ్ళలో భయం ద్యోతకమవుతూంటే ఆర్టిస్ట్ పైన అరచాడు అతను. “అసలు ఏం జరుగుతోందిక్కడ?” పరంధాం భుజాలు ఎగరేసాడు. అంతవరకూ ఉండి ఉండి విడివిడిగా వివవస్తూన్న శబ్దాలన్నీ ఇప్పుడు కలగాపులగమై ఒకేసారిగా పెద్దగా వినిపిస్తూ ఆ భవనమంతా దద్దరిల్లసాగాయి. దాంతో ఆగంతకుడి భయం తారాస్థాయికి చేరుకుంది. ఒళ్ళు చల్లబడి రక్తం గడ్డకట్టడంతో, భయం భయంగా ఆ గదంతా పరికించాడు. అదిగో, అప్పుడే పడ్డాయి అతని చూపులు – గోడమీదున్న ఆ ఫొటోగ్రాఫ్ మీద. దాన్ని చూడగానే పక్కలో బాంబ్ ప్రేలినట్టు అదిరిపడ్డాడు. అది – పరంధామ్ ఫొటో. దానికి కర్పూరపు దండ వేయబడివుంది…!! ఆగంతకుడి గుండె ఓ బీట్ ని మిస్ చేసింది. పాలిపోయిన వదనంతో ఆర్టిస్ట్ వంక అనుమానంగా చూస్తూ వణికే గొంతుకతో అడిగాడు– “టెల్ మీ, హూ…హూ…ద హెల్…ఆర్…యూ…?” పరంధామ్ నవ్వాడు. ఆ నవ్వు కృతకంగా అనిపించింది ఆగంతకుడికి. ఆ శబ్దాలవీ ఎక్కణ్ణుంచి వస్తున్నాయో పరంధామ్ కూ తెలియదు. కానీ, ఆగంతకుడి కళ్ళలో ప్రతిఫలిస్తూన్న భీతి, క్షణక్షణమూ పెరిగిపోతూన్న భయమూ, అతని వింత ప్రవర్తనా చూస్తూంటే తమాషాగా అనిపించింది. పెద్దగా నవ్వాలనిపించింది. పిరికితనం పెనవేసుకోగా ఆర్టిస్టునూ, గోడమీది ఫొటోనీ మార్చి మార్చి చూసాడు ఆగంతకుడు. చూసిన ప్రతిసారీ అతని గుండె మరింత వేగంగా కొట్టుకోనారంభించింది. పరంధామ్ చిత్రంగా నవ్వుతూ కూర్చున్న చోటునుండి లేచాడు. అదే సమయంలో శబ్దాలు మరింత ఉధృతమయ్యాయి. దాంతో ఆగంతకుడు భయంతో నిలువెల్లా వణకనారంభించాడు. నిలద్రొక్కుకోవడానికి వృధా ప్రయత్నం చేసాడు. ఒక్కో అడుగే వెనక్కి వేస్తూ పిస్టల్ని ఆర్టిస్టుకు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కడానికి ప్రయత్నించాడు. కానీ, అతని చేయి సహకరించలేదు. కంపిస్తూన్న చేతినుండి పిస్టల్ జారి క్రింద పడిపోయింది. “నువ్వు…నువ్వు…మనిషివేనా?” అతని మాట తడబడింది. సమాధానంగా పెద్దగా నవ్వాడు పరంధామ్. “ఆగు! నువ్వు…మనిషివి…కాదు కదూ? ఆర్టిస్ట్ చచ్చిపోయాడు కదూ?” జవాబివ్వలేదు పరంధామ్. చిత్రంగా నవ్వుతూ అతని వైపు అడుగులు వేసాడు. ఆ నవ్వు ఆగంతకుడి గుండెలు అవిసిపోయేలా చేసింది. “బాబోయ్… దె..దెయ్యం…!” అంటూ భయంతో అరచి నేలపైన కూలిపోయాడు. పరంధామ్ విస్తుపోతూ అతని పైకి వంగి పరీక్షగా చూసాడు. శ్వాస ఆడుతోందికానీ, మనిషిలో చలనంలేదు. శబ్దాలు ఎంత హఠాత్తుగా ఆరంభమయ్యాయో, అంత హఠాత్తుగానూ ఆగిపోయాయి! పరంధామ్ భార్య సునీత అక్కడికి వచ్చింది. “థాంక్ గాడ్! నా ప్లాన్ ఫలించింది…” అంటూ తేలికగా నిట్టూర్చింది. ఇద్దరూ కలసి ఆగంతకుణ్ణి త్రాళ్ళతో కట్టేసారు. జరిగిందేమిటో భార్య వివరిస్తూంటే, నోరు తెరచుకుని వింటూ వుండిపోయాడు పరంధామ్ – ‘పరంధామ్ తన పనితో బిజీగా వుంటే, తాను దర్శకత్వం వహిస్తూన్న టీవీ సీరియల్ తరువాయి ఎపిసోడ్స్ గురించి చర్చించేందుకని ఎదురింట్లో ఉన్న ఛానల్ ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్ళింది సునీత…ఆమె తిరిగివచ్చేసరికి ఆగంతకుడెవరో భర్తను పిస్టల్ తో బెదిరిస్తుండడం కనిపించింది. అతను తనకు వున్న ‘ఈరీ సౌండ్స్ ఫోబియా’ గురించి మాట్లాడుతూంటే ఆలకించింది. మొదట పోలీసులకు ఫోన్ చేయాలనుకుంది. కానీ, ఆగంతకుడి వద్ద పిస్టల్ ఉంది. తప్పించుకునేందుకు దానితో పరంధామ్ ని షూట్ చేయవచ్చును. ఆ ఆలోచనను విరమించుకుని, అతగాడి బలహీనతను తెలివిగా వాడుకోవాలనుకుంది. తన టీవీ సీరియల్ కోసం రెండు రోజుల క్రితం వింత ధ్వనులను, వైల్డ్ యానిమల్స్ యొక్క చిత్ర విచిత్ర శబ్దాలనూ రికార్డ్ చేసిన సీడీ ఆమె వద్దే ఉంది. దాన్ని ల్యాప్ టాప్ లో రన్ చేసి ఆగంతకుణ్ణి భయభ్రాంతులకు గురిచేసింది…’ “ఓ మై!” అన్నాడు పరంధామ్. “అదిసరేకానీ…అతను నా ఫొటో చూసి ఎందుకలా ప్రవర్తించాడు? నన్ను చూసి ఎందుకలా వణికిపోయాడు?” ఫొటోవంక చూసిన సునీత ఫక్కుమంది… ‘ఆ రోజు సాయంత్రం కర్పూర మాలలు అమ్మివస్తే, దేవుడి కోసమని ఒకటి తీసుకుందామె. మర్నాడు పూజ సమయంలో అలంకరించవచ్చునని, బైటకు వెళ్ళే హడావుడిలో దాన్ని భర్త ఫొటో ఉన్న మేకుకు తగిలించింది. దాన్ని చూసిన ఆగంతకుడు, పోయినవారి ఫొటోకి దండ వేయడం ఆచారం కాబట్టి… ఆర్టిస్ట్ చనిపోయాడనీ, తన ఎదుట ఉన్నది అతని దెయ్యం అనీ భావించాడు. అది ఆమె నాటకాన్ని రక్తి కట్టించి, కొత్త మలుపు త్రిప్పింది…’ “మార్వెలస్!” అంటూ ఆనందంతో భార్యను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు పరంధామ్. “హేట్సాఫ్, డియర్! నీ సమయస్ఫూర్తి, తెగువ గొప్ప ప్రమాదం నుండి రక్షించాయి మనల్ని. టీవీ సీరియల్స్ డైరెక్టర్ ని భార్యగా పొందడంలో ఉన్న ఎడ్వాంటేజ్ ఏమిటో ఇప్పుడే తెలిసింది!” దంపతులు మనసారా నవ్వుకున్నారు. “ఈ అనుకోని అతిథిని అతిథి గృహానికి పంపొద్దూ?” అని సునీత అనడంతో, “ఓ ష్యూర్!” అంటూ మొబైల్ ఫోన్ ని అందుకున్నాడు పరంధామ్, పోలీసులకు ఫోన్ చేసేందుకు.
దేశంలో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య త్వరలో కోటికి చేరుకోబోతోంది. పరీక్షల విషయంలో ఉన్న అన్ని అవరోధాలనూ తొలగించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించటంతో ఇది సాధ్యమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా కోవిడ్ పరీక్షలకు మార్గం సుగమమవుతోంది. ఇప్పటివరకూ 90,56,173 పరీక్షలు జరిగాయి. పరీక్షల ద్వారా నిర్థారణ జరిపే నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తూ వస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 1065 టెస్టింగ్ లాబ్ లు ఉండగా అందులో768 ప్రభుత్వ రంగంలోను, 297 ప్రైవేట్ రంగంలోను ఉన్నాయి. రోజువారీ పరీక్షల సామర్థ్యం కూడా పెరుగుతూ వస్తోంది. నిన్న ఒక్కరోజే 2,29,588 మందికి కోవిడ్ పరీక్షలు జరిగాయి. ఇప్పుడు కేంద్ర తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం ఫలితంగా ఇకమీదట కోవిడ్ పరీక్షలకు రిజిస్టర్డ్ డాక్టర్లు ఎవరైనా సిఫార్సు చేయవచ్చు. ఇప్పటిదాకా ప్రభుత్వ డాక్టర్లకు మాత్రమే అవకాశం కల్పించారు. ఈ విషయంలో తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ వైద్యులతో సహా అర్హులైన వైద్యులందరి ప్రిస్క్రిప్షన్ నూ లెక్కలోకి తీసుకుంటూ భారత వైద్య పరిశోధనామండలి మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ పరీక్షలు వేగవంతం చేయాలని కోరింది. పరీక్షించటం, గుర్తించటం, చికిత్స చేయటం అనే త్రిముఖ సూత్రం ద్వారా త్వరగా ఈ సంక్షోభాన్ని నివారించాలని కేంద్ర ప్రభుత్వం మరోమారు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ఇందుకోసం కోవిడ్ పరీక్షల లాబ్ లను పూర్తి స్థాయిలో వాడుకోవాలని, ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో దీన్ని పూర్తిగా అమలు జరిగేట్టు చూడాలని కోరింది. అప్పుడే ప్రజలకు ప్రయోజనాలు చేకూరతాయని అభిప్రాయపడింది. లాబ్ లు ఏ ఒక్క వ్యక్తికీ పరీక్షలు జరపటంలో ఎంతమాత్రమూ వెనుకంజ వేయకూడదన్న భారత వైద్య పరిశోధనామండలి ఆదేశాల ఫలితం ఎంతగానో ఉండబోతోంది. రాష్ట్రాలు ఎవరికీ ఈ అవకాశం కాదనకూడదని అప్పుడే తొలిదశలోనే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టే వీలుంటుందని మండలి చెప్పటం గమనార్హం. ఆర్ టి- పిసిఆర్ తో బాటుగా రాపిడ్ యాంటిజెన్ పాయింట్ ఆఫ్ కేర్ పరీక్షల ద్వారా గుర్తించటం పెద్ద ఎత్తున చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం మరోమారు రాష్ట్రాలను కోరింది. రాపిడ్ యాంటిజెన్ పరీక్ష సులువైనది, వేగవంతమైనది, సురక్షితమైనది అని మరోమారు గుర్తు చేసింది. అందుకే కంటెయిన్మెంట్ జోన్లలో వాడాలని భారత వైద్య పరిశోధనామండలి చెప్పటాన్ని ప్రస్తావించింది. ఆ విధంగా ఐ సి ఎం ఆర్ ధ్రువీకరించిన కిట్స్ ఎక్కువగా అందుబాటులో ఉండేట్టు చూడాలని కూడా రాష్ట్రాలకు సూచించింది. పరీక్షా శిబిరాలు, సంచార వాహనాలు ఏర్పాటు చేయటం ద్వారా ప్రచారోద్యమ తరహాలో పరీక్షలు చేపట్టాలని కూడా కేంద్ర రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. దీనివలన పరీక్షా సౌకర్యం ప్రజల గుమ్మందగ్గరికే వె:ళ్ళినట్టవుతుందని అభిప్రాయపడింది. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా శాంపిల్స్ సేకరణకు, వ్యాధి వ్యాప్తి నివారణకు, పాజిటివ్ అని తేలితే వారినుంచి సంక్రమించే అవకాశమున్నవారిని గుర్తించేందుకు వీలవుతుందని చెప్పింది. **** (Release ID: 1635996) Visitor Counter : 148 Read this release in: Punjabi , English , Urdu , Marathi , Hindi , Manipuri , Bengali , Gujarati , Odia , Tamil , Malayalam ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ అవరోధాల తొలగింపుతో కోవిడ్ పరీక్షల వేగవంతం ఇప్పుడు ప్రైవేట్ డాక్టర్లు సైతం కోవిడ్ పరీక్షలకు సిఫార్సు చేయవచ్చు త్వరలో కోటికి చేరనున్న పరీక్షలు Posted On: 02 JUL 2020 2:44PM by PIB Hyderabad దేశంలో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య త్వరలో కోటికి చేరుకోబోతోంది. పరీక్షల విషయంలో ఉన్న అన్ని అవరోధాలనూ తొలగించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించటంతో ఇది సాధ్యమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా కోవిడ్ పరీక్షలకు మార్గం సుగమమవుతోంది. ఇప్పటివరకూ 90,56,173 పరీక్షలు జరిగాయి. పరీక్షల ద్వారా నిర్థారణ జరిపే నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తూ వస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 1065 టెస్టింగ్ లాబ్ లు ఉండగా అందులో768 ప్రభుత్వ రంగంలోను, 297 ప్రైవేట్ రంగంలోను ఉన్నాయి. రోజువారీ పరీక్షల సామర్థ్యం కూడా పెరుగుతూ వస్తోంది. నిన్న ఒక్కరోజే 2,29,588 మందికి కోవిడ్ పరీక్షలు జరిగాయి. ఇప్పుడు కేంద్ర తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం ఫలితంగా ఇకమీదట కోవిడ్ పరీక్షలకు రిజిస్టర్డ్ డాక్టర్లు ఎవరైనా సిఫార్సు చేయవచ్చు. ఇప్పటిదాకా ప్రభుత్వ డాక్టర్లకు మాత్రమే అవకాశం కల్పించారు. ఈ విషయంలో తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ వైద్యులతో సహా అర్హులైన వైద్యులందరి ప్రిస్క్రిప్షన్ నూ లెక్కలోకి తీసుకుంటూ భారత వైద్య పరిశోధనామండలి మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ పరీక్షలు వేగవంతం చేయాలని కోరింది. పరీక్షించటం, గుర్తించటం, చికిత్స చేయటం అనే త్రిముఖ సూత్రం ద్వారా త్వరగా ఈ సంక్షోభాన్ని నివారించాలని కేంద్ర ప్రభుత్వం మరోమారు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ఇందుకోసం కోవిడ్ పరీక్షల లాబ్ లను పూర్తి స్థాయిలో వాడుకోవాలని, ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో దీన్ని పూర్తిగా అమలు జరిగేట్టు చూడాలని కోరింది. అప్పుడే ప్రజలకు ప్రయోజనాలు చేకూరతాయని అభిప్రాయపడింది. లాబ్ లు ఏ ఒక్క వ్యక్తికీ పరీక్షలు జరపటంలో ఎంతమాత్రమూ వెనుకంజ వేయకూడదన్న భారత వైద్య పరిశోధనామండలి ఆదేశాల ఫలితం ఎంతగానో ఉండబోతోంది. రాష్ట్రాలు ఎవరికీ ఈ అవకాశం కాదనకూడదని అప్పుడే తొలిదశలోనే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టే వీలుంటుందని మండలి చెప్పటం గమనార్హం. ఆర్ టి- పిసిఆర్ తో బాటుగా రాపిడ్ యాంటిజెన్ పాయింట్ ఆఫ్ కేర్ పరీక్షల ద్వారా గుర్తించటం పెద్ద ఎత్తున చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం మరోమారు రాష్ట్రాలను కోరింది. రాపిడ్ యాంటిజెన్ పరీక్ష సులువైనది, వేగవంతమైనది, సురక్షితమైనది అని మరోమారు గుర్తు చేసింది. అందుకే కంటెయిన్మెంట్ జోన్లలో వాడాలని భారత వైద్య పరిశోధనామండలి చెప్పటాన్ని ప్రస్తావించింది. ఆ విధంగా ఐ సి ఎం ఆర్ ధ్రువీకరించిన కిట్స్ ఎక్కువగా అందుబాటులో ఉండేట్టు చూడాలని కూడా రాష్ట్రాలకు సూచించింది. పరీక్షా శిబిరాలు, సంచార వాహనాలు ఏర్పాటు చేయటం ద్వారా ప్రచారోద్యమ తరహాలో పరీక్షలు చేపట్టాలని కూడా కేంద్ర రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. దీనివలన పరీక్షా సౌకర్యం ప్రజల గుమ్మందగ్గరికే వె:ళ్ళినట్టవుతుందని అభిప్రాయపడింది. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా శాంపిల్స్ సేకరణకు, వ్యాధి వ్యాప్తి నివారణకు, పాజిటివ్ అని తేలితే వారినుంచి సంక్రమించే అవకాశమున్నవారిని గుర్తించేందుకు వీలవుతుందని చెప్పింది.
Stock Markets Closing: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1016​ పాయింట్లు, నిఫ్టీ 276 పాయింట్లు లాభపడ్డాయి. దీంతో ఏడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడినట్లైంది. Stocks Closing Today: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు.. శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల పెంపు ఆశించిన స్థాయిలోనే ఉండడం వల్ల సూచీలు పుంజుకున్నాయి. దీంతో ఏడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడినట్లైంది. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 1016 పాయింట్లు పెరిగి 57 వేల 426 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 276 పాయింట్ల లాభంతో 17 వేల 094 వద్ద సెషన్​ను ముగించింది. గురువారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌ విలువ 1.19 శాతం పెరిగి 89.54 డాలర్లకు చేరుకుంది. లాభనష్టాల్లో ఇవే.. సెన్సెక్స్‌ 30 షేర్లలో 25 షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా లాభపడిన షేర్లలో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టపోయాయి. రూపాయి విలువ డాలరుతో రూపాయి మారకం విలువ 38 పైసలు లాభపడి 81.32గా స్థిరపడింది. వడ్డీ రేట్లు పెంచిన ఆర్​బీఐ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వు బ్యాంకు.. మరోసారి వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీంతో ప్రస్తుతం వడ్డీ రేటు 5.40 నుంచి 5.90 శాతానికి పెరిగింది. వృద్ధి రేటును 7.2 శాతంగా అంచనా వేయగా తాజాగా దీనిని 7 శాతానికి కుదించింది ఆర్​బీఐ. ద్రవ్యోల్బణాన్ని 6.7 శాతంగా అంచనా వేసింది.
చలికాలం అనగానే పిల్లలనీ, పెద్దలనీ కూడూ జలుబూ జ్వరాలు తరచూ వేధిస్తాయి. ఇవి మాత్రమే కాదు ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి సమస్యలుండే వారికీ ఇది గడ్డుకాలమే. ఇటువంటివారు తరచూ తీసుకోవాల్సిన ఆహారం కమలాలు. జలుబుతో ముక్కుమూసుకుపోయి బాధపడే పిల్లలకు కమలాలని తినిపించడం వల్ల ఉపశమనం కలుగుతుంది. 1. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగి జలుబు రాకుండా ఉంటుంది. వీటిల్లో ఉండే బీటా కెరొటిన్ శరీరంలోని కణాలు ఆరోగ్యంతో తొణికిసలాడేట్టు చేస్తుంది. గర్భస్థ శిశువు మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు అవసరమైన ఫోలిక్ యాసిడ్‌నీ కమలా ఫలాలు అందిస్తాయి. 2. వీటిలో ఉండే బి6 విటమిన్ శరీరంలోని ప్రతి భాగానికీ ఆక్సిజన్ పుష్కలంగా అందేట్టు చేస్తుంది. దానివల్ల చేసే పనిలో చురుకుదనం ఉంటుంది. తెల్లరక్తకణాలు వృద్ధి చెంది వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా చలికాలంలో ఆస్తమా, వైరల్ ఇన్‌ఫెక్షన్లూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. క్యాల్షియం తగినంత అంది ఎముక బలం చేకూరుతుంది. తరచూ కమలాలు తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. 3. పొటాషియం, మెగ్నీషియం తగినంతగా లభించడం వల్ల గుండె జబ్బలూ రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య తలెత్తకుండా ఉంటుంది. కమలా పళ్లలో థయామిన్ పోషకం ఎక్కువగా ఉండటం వల్ల తీసుకున్న ఆహారం కొవ్వుగా మారకుండా, సంపూర్ణమైన శక్తిగా మారే ప్రక్రియ చురుగ్గా సాగుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి సమానంగా ఉంటుంది. 4. వీటిలోని కెరోటినాయిడ్స్‌ నైట్‌ బ్లైండెడ్‌నెస్‌, మస్క్యులర్‌ డిజనరేషన్‌ సమస్యల నుంచి కళ్లకు రక్షణ కల్పిస్తాయి. 5. కమలా పండ్లలోని విటమిన్లు, మినరల్స్‌ చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి. 6. సిట్రస్‌ జాతి పళ్లు తినే వాళ్లకు కేన్సర్‌ వచ్చే అవకాశం 40 - 45శాతం వరకు తక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది
తెలంగాణలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర రెండో రోజు కొనసాగుతుంది. మూడు రోజులు విరామం తర్వాత గురువారం రాహుల్ తన పాదయాత్రను పున:ప్రారంభించారు. Sumanth Kanukula First Published Oct 27, 2022, 9:28 AM IST తెలంగాణలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర రెండో రోజు కొనసాగుతుంది. మూడు రోజులు విరామం తర్వాత గురువారం రాహుల్ తన పాదయాత్రను పున:ప్రారంభించారు. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ.. రోడ్డు మార్గాన మక్తల్ చేరుకున్నారు. అక్కడి పాదయాత్ర శిబిరంలో బస చేసిన రాహుల్ గాంధీ.. గురువారం తెల్లవారుజామున మక్తల్ శివారులోని సబ్ స్టేషన్ వద్ద నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు. రాహుల్‌ గాంధీ పాదయాత్ర ఇవాళ 26.7 కి.మీ మేర సాగనుంది. ఈరోజు రాహుల్ పాదయాత్ర.. కన్యకాపరమేశ్వరి దేవాలయం, పెద్ద చెరువు ట్యాంక్‌బండ్, దండు క్రాస్ రోడ్డు మీదుగా కచ్వార్ గ్రామానికి చేరుకుంటుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం జాక్లార్ క్రాస్ రోడ్డు మీదుగా గుడిగండ్ల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ కార్నర్ మీటింగ్ ఉంటుంది. అనంతరం ఈ రోజు రాత్రి ఎలిగండ్లలో రాహుల్ గాంధీ బస చేస్తారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్న పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు.. ఆయనకు మద్దతు తెలిపారు. రాహుల్ పాదయాత్రకు తెలంగాణ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. రాహుల్ పాదయాత్రలో పాల్గొనేందుకు పలువరు ప్రతినిధులను ఎంపిక చేసింది. ఇక, రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి పునర్జీవనం, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సహం తీసుకురావడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో రాహుల్ పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఈ నెల 23న రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటకలోని రాయచూర్ నుంచి కృష్ణానది బ్రిడ్జి మీదుగా తెలంగాణలోని మక్తల్‌ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అయితే దీపావళి పండగ, కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నేపథ్యంలో.. రాహుల్ పాదయాత్రకు ఈ నెల 24,25,26 తేదీల్లో విరామం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లిన రాహుల్ గాంధీ... బుధవారం రాత్రి తిరిగి తెలంగాణకు చేరుకున్నారు. తెలంగాణలోని 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 12 రోజుల్లో 375 కిలోమీటర్ల మేర గాంధీ పాదయాత్ర చేయనున్నారు. నవంబర్ 4న ఒకరోజు సాధారణ విరామం ఉండనుంది. నవంబర్ 7న రాహుల్ గాంధీ పాదయాత్ర మహారాష్ట్రలో ప్రవేశిస్తుంది. అయితే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో కంటే.. తెలంగాణలో రాహుల్ యాత్రను సూపర్ సక్సెస్‌ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో భారీ బహిరంగ సభకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే.. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయంలో రాహుల్ పూజలు నిర్వహించేలా పార్టీ ప్రణాళిక రూపొందింది. యాత్ర మార్గంలోని పలు దేవాలయాలు, మసీదులను కూడా రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. తెలంగాణలో రాహుల్ పాదయాత్రను సమన్వయం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ 10 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.
వైసీపీ మహిళా నేత, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోయిస్టులు హెచ్చరిక లేఖ రాశారు. లేటరైట్ మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలను భాగ్యలక్ష్మి ప్రోత్సహిస్తున్నారని మావోలు ఆ లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. భాగ్యలక్ష్మి వెంటనే తన పదవికి రాజీనామా చేసి మన్యం విడిచి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చారు. మన్యంలోని జీకే వీధి మండలం చాపరాతిపాలెంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఆపేయాలని హెచ్చరించారు. తమ వార్నింగ్ ను భాగ్యలక్ష్మి పట్టించుకోకపోతే సివేరి సోమ, కిడారి సర్వేశ్వరరావులకు పట్టిన గతే పడుతుందని, ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో ఈ లేఖ విడుదలయింది. కాగా, వైసీపీ నేతలు ఖనిజ సంపదను దోచుకుతింటున్నారని, మన్యంలో వైసీపీ మాఫియా బాక్సైట్ అక్రమ మైనింగ్ ప్రాంతానికి ఎవరినీ రానీయకుండా హెచ్చరిక బోర్డులు పెట్టి మరీ బెదిరిస్తున్నారని గతంలో టీడీపీ నేతలు ఆరోపించారు. మన్యంలో రూ.15 వేల కోట్ల విలువైన బాక్సైట్ అక్రమ మైనింగ్ చేసి అడవిని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ మైనింగ్ మాఫియా ఎంత అడవిని నాశనం చేసిందో గూగుల్ శాటిలైట్ ఫోటోలతో సహా బట్టబయలు చేసింది. అయితే, ఈ వ్యవహారంపై గత ఏడాది మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ క్లారిటీ ఇచ్చారు. అక్కడంతా లాటరైట్ మైనింగ్ జరుగుతోందని, బాక్సైట్ మైనింగ్ కాదని ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు. మరి, తాజాగా మావోల బెదిరింపు లేఖపై ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
30 సెకండ్ల నిడివి గల ఒక బ్రీతింగ్ (శ్వాస) ఎక్షర్సైజ్ వీడియోని షేర్ చేస్తూ, ఈ ఎక్షర్సైజ్ ని సరిగ్గా చేస్తే ఊపిరితిత్తులు బాగున్నట్టని, వారికి కరోనా సోకలేదని అర్ధమని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం. ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు. క్లెయిమ్: కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి సంబంధించిన 30 సెకండ్ల నిడివిగల బ్రీతింగ్ టెస్ట్ వీడియో. ఫాక్ట్ (నిజం): ప్రస్తుతానికి కేవలం PCR, యాంటిజెన్ మరియు యాంటీబాడీ టెస్ట్ల ద్వారా మాత్రమే కరోనా నిర్ధారణ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే 10 సెకండ్స్ ఊపిరి బిగబట్టు కోవడం ద్వారా కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చని ఒక వార్త వైరల్ అయినప్పుడు WHO మరియు PIB ఈ వార్తలో నిజంలేదని స్పష్టం చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్తున్న దాని ప్రకారం ఒక వ్యక్తికి కరోనా సోకిందో లేదో తెల్సుకోవడానికి ప్రస్తుతం మూడు టెస్టులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. PCR యాంటిజెన్ యాంటీబాడీ కేవలం ఈ మూడు టెస్టుల మాత్రమే కరోనా నిర్ధారణ పరిక్షలుగా గుర్తించారు, భారత దేశంలో కూడా ఈ మూడు టెస్టుల ద్వారానే కరోనాని గుర్తిస్తున్నారు. గతంలో ఇలాగే 10 సెకండ్స్ ఊపిరి బిగబట్టు కోవడం ద్వారా కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చని ఒక వార్త వైరల్ అయినప్పుడు WHO ఈ వార్తలో నిజంలేదని స్పష్టం చేసింది. భారతదేశంలో కూడా కరోనా కి సంబంధించిన 10 సెకండ్స్ ఊపిరి బిగబట్టే వార్త వైరల్ అయినప్పుడు, PIB ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. Claim: If you can hold your breath for 10 sec without discomfort, you don’t have #Coronavirus#PIBFactCheck : Most young patients with #Coronavirus will be able to hold their breaths for more the 10 sec and many elderly won't be able to do the same. Conclusion: #FakeNews pic.twitter.com/GXCX2Rujwb — PIB Fact Check (@PIBFactCheck) March 22, 2020 యూనివర్సిటీ అఫ్ మేరీల్యాండ్ UCH లో అంటు వ్యాధుల విభాగంలో వైస్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ ఫహీమ్ యూనస్ కూడా ఇలా 10 సెకండ్లు ఊపిరి బిగబట్టడం ద్వారా కరోనా సోకిందో లేదో గుర్తించోచన్న వార్తలో నిజంలేదని ఒక ట్వీట్ ద్వారా తెలిపాడు. ఒకవేళ ఇలా ఒక బ్రీతింగ్ టెస్ట్ ద్వారా కరోనాని గుర్తించ గలిగితే వార్తా సంస్థలు గాని లేక ప్రభుత్వం గాని దీని గురించి ప్రచారం చేసేవి. కాని ఇలాంటి బ్రీతింగ్ టెస్ట్ ద్వారా కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చని చెప్తూ ఎటువంటి వార్తా కథనాలు లేవు. వీటన్నిటి బట్టి పోస్టులో చెప్పే వార్తలో నిజంలేదని అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో కరోనా కరోనా కేసుల పెరుగుతుండడం మరియు చాలా ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
కీర్తనలు 99:6 – ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి కుత్తరమిచ్చెను. కీర్తనలు 118:5 – ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను కీర్తనలు 138:3 – నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. Christ gives యోహాను 4:10 – అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను యోహాను 4:14 – నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటిబుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. యోహాను 14:14 – నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. Christ received యోహాను 11:42 – నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను. హెబ్రీయులకు 5:7 – శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను. Granted -through the grace of God యెషయా 30:19 – సీయోనులో యెరూషలేములోనే యొక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొఱ్ఱవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. -Sometimes Immediately యెషయా 65:24 – వారికీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను. దానియేలు 9:21 – నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. దానియేలు 9:23 – నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయ నారంభించినప్పుడు, ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవలెనని ఆజ్ఞ బయలుదేరెను; కావున ఈ సంగతిని తెలిసికొని నీకు కలిగిన దర్శనభావమును గ్రహించుము. దానియేలు 10:12 – అప్పుడతడు దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొనవలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలనుబట్టి నేను వచ్చితిని -Sometimes after delay లూకా 18:7 – దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? -Sometimes differently from Our desire 2కొరిందీయులకు 12:8 – అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. 2కొరిందీయులకు 12:9 – అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును -Beyond expectation యిర్మియా 33:3 – నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఎఫెసీయులకు 3:20 – మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, Promised యెషయా 58:9 – అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నేనున్నాననును. ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని యిర్మియా 29:12 – మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మత్తయి 7:7 – అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. Promised especially in times of trouble కీర్తనలు 50:15 – ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పరచెదవు. కీర్తనలు 91:15 – అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడైయుండెదను అతని విడిపించి అతని గొప్పచేసెదను Received by those who -seek God కీర్తనలు 34:4 – నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను. -seek God with all the heart యిర్మియా 29:12 – మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. యిర్మియా 29:13 – మీరు నన్ను వెదకినయెడల, పూర్ణమనస్సుతో నన్నుగూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, -wait Upon God కీర్తనలు 40:1 – యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను. -return to God 2దినవృత్తాంతములు 7:14 – నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును. యోబు 22:23 – సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడల నీ గుడారములలోనుండి దుర్మార్గమును దూరముగా తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు. యోబు 22:27 – నీవు ఆయనకు ప్రార్థనచేయగా ఆయన నీ మనవి నాలకించును నీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు. -Ask in faith మత్తయి 21:21 – అందుకు యేసు మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండినయెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యాకోబు 5:15 – విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును. -Ask in the name of Christ యోహాను 14:13 – మీరు నా నామమున దేనినడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును. – Ask according to God’s will 1యోహాను 5:14 – మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మనమెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము. -call Upon God in Truth కీర్తనలు 145:18 – తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. -fear God కీర్తనలు 145:19 – తనయందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును. -Set their love Upon God కీర్తనలు 91:14 – అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను కీర్తనలు 91:15 – అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడైయుండెదను అతని విడిపించి అతని గొప్పచేసెదను – Keep God’s commandments 1యోహాను 3:22 – ఆయన ఆజ్ఞ యేదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననునదియే. -call Upon God under Oppression యెషయా 19:20 – అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును. -call Upon God under Affliction కీర్తనలు 18:6 – నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను. కీర్తనలు 106:44 – అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. యెషయా 30:19 – సీయోనులో యెరూషలేములోనే యొక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొఱ్ఱవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా 30:20 – ప్రభువు నీకు క్లేషాన్నపానముల నిచ్చును ఇకమీదట నీ బోధకులు దాగియుండరు నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు -Abide in Christ యోహాను 15:7 – నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. -humble Themselves 2దినవృత్తాంతములు 7:14 – నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును. కీర్తనలు 9:12 – ఆయన రక్తాపరాధమునుగూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడువారిని జ్ఞాపకము చేసికొనును వారి మొఱ్ఱను ఆయన మరువడు. -Are Righteous కీర్తనలు 34:15 – యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. యాకోబు 5:16 – మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థత పొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. -Are Poor and needy యెషయా 41:17 – దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. Saints -Are assured of 1యోహాను 5:15 – తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడుకొనును; అతనిబట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. -love God for కీర్తనలు 116:1 – యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. -bless God for కీర్తనలు 66:20 – దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నాయొద్దనుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక. -praise God for కీర్తనలు 116:17 – నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన చేసెదను కీర్తనలు 118:21 – నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చియున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. A motive for continued prayer కీర్తనలు 116:2 – ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱపెట్టుదును Denied to those who -Ask amiss యాకోబు 4:3 – మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు. -regard iniquity in the heart కీర్తనలు 66:18 – నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినయెడల ప్రభువు నా మనవి వినకపోవును. -Live in Sin యెషయా 59:2 – మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. యోహాను 9:31 – దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును. -offer unworthy service to God మలాకీ 1:7 – నా బలిపీఠముమీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమిచేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరచినందుచేతనే గదా మలాకీ 1:8 – గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించినయెడల అది దోషము కాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చినయెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. మలాకీ 1:9 – దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి; మీచేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మునుబట్టి యెవరినైన అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. -forsake God యిర్మియా 14:10 – యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు తమ కాళ్లకు అడ్డములేకుండ తిరుగులాడుటకు ఇచ్ఛగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు; ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసికొనును; వారి పాపములనుబట్టి వారిని శిక్షించును. యిర్మియా 14:12 – వారు ఉపవాసమున్నప్పుడు నేను వారి మొఱ్ఱను వినను; వారు దహనబలియైనను నైవేద్యమైనను అర్పించునప్పుడు నేను వాటిని అంగీకరింపను; ఖడ్గమువలనను క్షామమువలనను తెగులువలనను వారిని నాశము చేసెదను -Reject the call of God సామెతలు 1:24 – నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయి చాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి సామెతలు 1:25 – నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసివేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి. సామెతలు 1:28 – అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును. -hear Not the law సామెతలు 28:9 – ధర్మశాస్త్రము వినబడకుండ చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము. జెకర్యా 7:11 – అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండ చెవులు మూసికొనిరి. జెకర్యా 7:12 – ధర్మశాస్త్రమును, పూర్వికులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణచేత తెలియజేసిన మాటలను, తాము వినకుండునట్లు హృదయములను కురువిందమువలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవాయొద్దనుండి మహోగ్రత వారిమీదికి వచ్చెను. జెకర్యా 7:13 – కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. -Are deaf to the cry of the Poor సామెతలు 21:13 – దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱ పెట్టునప్పుడు అంగీకరింపబడడు. -Are blood shedders యెషయా 1:15 – మీరు మీచేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీచేతులు రక్తముతో నిండియున్నవి. యెషయా 59:3 – మీచేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది. -Are idolaters యిర్మియా 11:11 – కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు తాము తప్పించుకొనజాలని కీడు వారిమీదికి రప్పింపబోవుచున్నాను, వారు నాకు మొఱ్ఱపెట్టినను నేను వారి మొఱ్ఱను వినకుందును. యిర్మియా 11:12 – యూదా పట్టణస్థులును యెరూషలేము నివాసులును పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొఱ్ఱపెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. యిర్మియా 11:13 – యూదా, నీ పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలున్నవి గదా? యెరూషలేము నివాసులారా, బయలు దేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దానిపేరట బలిపీఠములను స్థాపించితిరి. యిర్మియా 11:14 – కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము; వారి నిమిత్తము మొఱ్ఱపెట్టకుము ప్రార్థన చేయకుము, వారు తమ కీడునుబట్టి నాకు మొఱ్ఱపెట్టునప్పుడు నేను వినను. యెహెజ్కేలు 8:15 – అప్పుడాయన నరపుత్రుడా, యిది చూచితివి గాని నీవు తిరిగి చూచినయెడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి యెహెజ్కేలు 8:16 – యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు ఇరువది యయిదుగురు మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పుతట్టును తిరిగియుండెను; వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. యెహెజ్కేలు 8:17 – అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. యెహెజ్కేలు 8:18 – కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొఱ్ఱపెట్టినను నేను ఆలకింపకుందును. -Are wavering యాకోబు 1:6 – అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. యాకోబు 1:7 – అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు -Are hypocrites యోబు 27:8 – దేవుడు వాని కొట్టివేయునప్పుడు వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? యోబు 27:9 – వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొఱ్ఱ వినువా? -Are Proud యోబు 35:12 – కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమునుబట్టి మొఱ్ఱపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తర మిచ్చుటలేదు. యోబు 35:13 – నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని బెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు. -Are self-Righteous లూకా 18:11 – పరిసయ్యుడు నిలువబడి దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలె నైనను, ఈ సుంకరివలె నైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. లూకా 18:12 – వారమునకు రెండుమారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను. లూకా 18:14 – అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను -Are the Enemies of Saints కీర్తనలు 18:40 – నా శత్రువులను వెనుకకు నీవు మళ్లచేసితివి నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేసితిని కీర్తనలు 18:41 – వారు మొఱ్ఱపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను యెహోవాకు వారు మొఱ్ఱపెట్టుదురు గాని ఆయనవారి కుత్తరమియ్యకుండును. -cruelly oppress Saints మీకా 3:2 – అయినను మేలు నసహ్యించుకొని కీడుచేయ నిష్టపడుదురు, నా జనుల చర్మము ఊడదీసి వారి యెముకలమీది మాంసము చీల్చుచుందురు. మీకా 3:3 – నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి యెముకలను విరిచి, ఒకడు కుండలోవేయు మాంసమును ముక్కలు చేయునట్టు బానలోవేయు మాంసముగా వారిని తుత్తునియలుగా పగులగొట్టియున్నారు. మీకా 3:4 – వారు దుర్మార్గత ననుసరించి నడుచుకొనియున్నారు గనుక వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండ తన్ను మరుగుచేసికొనును. Exemplified -Abraham ఆదికాండము 17:20 – ఇష్మాయేలునుగూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండు మంది రాజులను కనును; అతనిని గొప్ప జనముగా చేసెదను; -Lot ఆదికాండము 19:19 – ఇదిగో నీ కటాక్షము నీ దాసునిమీద వచ్చినది; నా ప్రాణము రక్షించుటవలన నీవు నాయెడల కనుపరచిన నీ కృపను ఘనపరచితివి; నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను; ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో ఆదికాండము 19:20 – ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది గదా, నేను బ్రదుకుదునని చెప్పినప్పుడు ఆదికాండము 19:21 – ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని; – Abraham’s servant ఆదికాండము 24:15 – అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను. ఆదికాండము 24:16 – ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు; ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని యెక్కి రాగా ఆదికాండము 24:17 – ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. ఆదికాండము 24:18 – అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవనుచేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. ఆదికాండము 24:19 – మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేది పోయుదునని చెప్పి ఆదికాండము 24:20 – త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొనిపోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను. ఆదికాండము 24:21 – ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలముచేసెనో లేదో తెలిసికొనవలెనని ఊరకుండెను. ఆదికాండము 24:22 – ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమెచేతులకు పది తులముల ఎత్తు గల రెండు బంగారు కడియములను తీసి ఆదికాండము 24:23 – నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము; నీ తండ్రి యింట మేము ఈ రాత్రి బసచేయుటకు స్థలమున్నదా అని అడిగెను. ఆదికాండము 24:24 – అందుకామె నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను. ఆదికాండము 24:25 – మరియు ఆమె మాయొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్నవనగా ఆదికాండము 24:26 – ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి ఆదికాండము 24:27 – అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను -Jacob ఆదికాండము 32:24 – యాకోబు ఒక్కడు మిగిలిపోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆదికాండము 32:25 – తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడగూడు వసిలెను. ఆదికాండము 32:26 – ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను. ఆదికాండము 32:27 – ఆయన నీ పేరేమని యడుగగా అతడు యాకోబు అని చెప్పెను. ఆదికాండము 32:28 – అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఆదికాండము 32:29 – అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయననీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను. ఆదికాండము 32:30 – యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. -Israelites నిర్గమకాండము 2:23 – ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టిపనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టిపనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను. నిర్గమకాండము 2:24 – కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను. -Moses నిర్గమకాండము 17:4 – అప్పుడు మోషే యెహోవాకు మొఱపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. నిర్గమకాండము 17:5 – అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసికొని ప్రజలకు ముందుగా పొమ్ము; నీవు నదిని కొట్టిన నీ కఱ్ఱను చేతపట్టుకొని పొమ్ము నిర్గమకాండము 17:6 – ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను. నిర్గమకాండము 17:11 – మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి, నిర్గమకాండము 17:12 – మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసికొనివచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను. నిర్గమకాండము 17:13 – అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. నిర్గమకాండము 32:11 – మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలమువలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల? నిర్గమకాండము 32:12 – ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమిమీదనుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొనిపోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్నినుండి మళ్లుకొని నీవు నిర్గమకాండము 32:13 – నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితో ఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమునకిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను. నిర్గమకాండము 32:14 – అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. -Samson న్యాయాధిపతులు 15:18 – అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొఱ్ఱపెట్టినీవు నీ సేవకునిచేతివలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి, సున్నతి పొందనివారిచేతిలోనికి పడవలెనా? అని వేడుకొనగా న్యాయాధిపతులు 15:19 – దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దానినుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రదికెను. కాబట్టి దానిపేరు నేటివరకు ఏన్హక్కోరె అనబడెను; అది లేహీలో నున్నది. -Hannah 1సమూయేలు 1:27 – ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకనుగ్రహించెను. -Samuel 1సమూయేలు 7:9 – సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగబలిగా అర్పించి, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. -Solomon 1రాజులు 3:9 – ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయచేయుము. 1రాజులు 3:12 – నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను; బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను; పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు, ఇకమీదట నీవంటివాడొకడును ఉండడు. -Man of God 1రాజులు 13:6 – అప్పుడు రాజు నా చెయ్యి మునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగై మునుపటివలె ఆయెను. -Elijah 1రాజులు 18:36 – అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థన చేసెను యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవుచేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. 1రాజులు 18:37 – యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. 1రాజులు 18:38 – అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. యాకోబు 5:17 – ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమిమీద వర్షింపలేదు. యాకోబు 5:18 – అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. -Elisha 2రాజులు 4:33 – తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్థనచేసి 2రాజులు 4:34 – మంచముమీద ఎక్కి బిడ్డమీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటిమీదను తన కండ్లు వాని కండ్లమీదను తనచేతులు వాని చేతులమీదను ఉంచి, బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. 2రాజులు 4:35 – తాను దిగి యింటిలో ఇవతలనుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి, మరల మంచముమీద ఎక్కి వానిమీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను. -Jehoahaz 2రాజులు 13:4 – అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజుచేత బాధనొందిన ఇశ్రాయేలువారిని కనికరించి అతని మనవి నంగీకరించెను. -Hezekiah 2రాజులు 19:20 – అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాయొద్దకు ఈ వర్తమానము పంపెను ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను. -Jabez 1దినవృత్తాంతములు 4:10 – యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను. -Asa 2దినవృత్తాంతములు 14:11 – ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా 2దినవృత్తాంతములు 14:12 – యెహోవా ఆ కూషీయులను ఆసా యెదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. -Jehoshaphat 2దినవృత్తాంతములు 20:6 – మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై యున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకెవరికిని బలము చాలదు. 2దినవృత్తాంతములు 20:7 – నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి ఈ దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగానిచ్చిన మా దేవుడవు నీవే. 2దినవృత్తాంతములు 20:8 – వారు అందులో నివాసము చేసి, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను, మామీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ యెదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొఱ్ఱపెట్టినయెడల 2దినవృత్తాంతములు 20:9 – నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకొని, యిచ్చట నీ నామ ఘనతకొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా. 2దినవృత్తాంతములు 20:10 – ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయాబీయులతోను శేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారియొద్దనుండి తొలగిపోయిరి. 2దినవృత్తాంతములు 20:11 – మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మా కిచ్చిన నీ స్వాస్థ్యములోనుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. 2దినవృత్తాంతములు 20:12 – మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. 2దినవృత్తాంతములు 20:13 – యూదావారందరును తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి. 2దినవృత్తాంతములు 20:14 – అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతనిమీదికి రాగా అతడీలాగు ప్రకటించెను 2దినవృత్తాంతములు 20:15 – యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. 2దినవృత్తాంతములు 20:16 – రేపు వారిమీదికి పోవుడి; వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు, మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొనదగ్గర వారిని కనుగొందురు. 2దినవృత్తాంతములు 20:17 – ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలువబడుడి; మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతో కూడ ఉండును. -Manasseh 2దినవృత్తాంతములు 33:13 – ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను. 2దినవృత్తాంతములు 33:19 – అతడు చేసిన ప్రార్థననుగూర్చియు, అతని మనవి వినబడుటనుగూర్చియు, అతడు చేసిన పాపద్రోహములన్నిటినిగూర్చియు, తాను గుణపడకముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటనుగూర్చియు, దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయబడియున్నది. -Ezra ఎజ్రా 8:21 – అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. ఎజ్రా 8:22 – మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించువారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరిమీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులును రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ఎజ్రా 8:23 – మేము ఉపవాసముండి ఆ సంగతినిబట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను -Nehemiah నెహెమ్యా 4:9 – మేము మా దేవునికి ప్రార్థనచేసి, వారి భయముచేత రాత్రింబగళ్లు కావలి యుంచితివిు. నెహెమ్యా 4:15 – వారి యోచన మాకు తెలియబడెననియు, దేవుడు దానిని వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారము వినగా, మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. -Job యోబు 42:10 – మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. -David కీర్తనలు 18:6 – నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను. -Jeremiah విలాపవాక్యములు 3:55 – యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి నేను నీ నామమునుబట్టి మొరలిడగా విలాపవాక్యములు 3:56 – నీవు నా శబ్దము ఆలకించితివి సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా చెవిని మూసికొనకుము. -Daniel దానియేలు 9:20 – నేను ఇంక పలుకుచు ప్రార్థన చేయుచు, పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా యెదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని. దానియేలు 9:21 – నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. దానియేలు 9:22 – అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను దానియేలూ, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. దానియేలు 9:23 – నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయ నారంభించినప్పుడు, ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవలెనని ఆజ్ఞ బయలుదేరెను; కావున ఈ సంగతిని తెలిసికొని నీకు కలిగిన దర్శనభావమును గ్రహించుము. -Jonah యోనా 2:2 – నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు. యోనా 2:10 – అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేలమీద కక్కివేసెను. -Zacharias లూకా 1:13 – అప్పుడా దూత అతనితో జెకర్యా భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. -blind Man లూకా 18:38 – అప్పుడు వాడు యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా లూకా 18:41 – వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, వాడు ప్రభువా, చూపు పొందగోరుచున్నాననెను. లూకా 18:42 – యేసు చూపుపొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను; లూకా 18:43 – వెంటనే వాడు చూపుపొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరు అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. -Thief on the cross లూకా 23:42 – ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. లూకా 23:43 – అందుకాయన వానితో నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. -Apostles అపోస్తలులకార్యములు 4:29 – ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి అపోస్తలులకార్యములు 4:30 – రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము. అపోస్తలులకార్యములు 4:31 – వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. -Cornelius అపోస్తలులకార్యములు 10:4 – అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అపోస్తలులకార్యములు 10:31 – కొర్నేలీ, నీ ప్రార్థన వినబడెను; నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడియున్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి -the Christians అపోస్తలులకార్యములు 12:5 – పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అపోస్తలులకార్యములు 12:7 – ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతని చేతులనుండి ఊడిపడెను. -Paul and Silas అపోస్తలులకార్యములు 16:25 – అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి. అపోస్తలులకార్యములు 16:26 – అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. -Paul అపోస్తలులకార్యములు 28:8 – అప్పుడు పొప్లియొక్క తండ్రి జ్వరముచేతను రక్తభేదిచేతను బాధపడుచు పండుకొనియుండెను. పౌలు అతనియొద్దకు వెళ్లి ప్రార్థన చేసి, అతనిమీద చేతులుంచి స్వస్థపరచెను. Refusal of, exemplified -Saul 1సమూయేలు 28:15 – సమూయేలు నన్ను పైకిరమ్మని నీవెందుకు తొందరపెట్టితివని సౌలు నడుగగా సౌలు నేను బహు శ్రమలోనున్నాను; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నా కేమియు సెలవియ్యకయున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిననెను. -elders of Israel యెహెజ్కేలు 20:3 – నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నాయొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే. నా జీవముతోడు నావలన ఏ ఆలోచనయైనను మీకు దొరకదు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
ఈ రోజు దేశంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన కాంట్రి బ్యూషన్‌ పెన్షన్‌ స్కీం (సిపిఎస్‌) కూడా ఆ నూతన ఆర్థిక విధానాల విష ఫలమే. లిబరలైజేషన్‌, ప్రైవేటేజేషన్‌, గ్లోబలైజేషన్‌ వంటి నూతన ఆర్థిక విధానాల ద్వారా ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విధానమే ఈ కాంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ స్కీం అన్నది బహిరంగ రహస్యం. నూతన పెన్షన్‌ స్కీం అనేది భారత పార్లమెంట్‌ చట్టం ద్వారా సృష్టించబడిన పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ చేత నియంత్రించబడే పెన్షన్‌ వ్యవస్థ. జనవరి ఒకటి,2004 తర్వాత ఉద్యోగులకు పాత పెన్షన్‌ నిలిపివేయడానికి సిపిఎస్‌ ప్రారంభమైంది. భారత ప్రభుత్వం 1999 సంవత్సరంలో ఓఎఎస్‌ఐయస్‌, ఐఆర్‌డిఏ, భట్టాచార్య కమిటీలను వివిధ విభాగ పెన్షన్‌ విధానాలను పరిశీలించడానికి నియమించింది. ఆ కమిటీల సిఫారసుల ఆధారంగా నూతన పెన్షన్‌ వ్యవస్థను ఎన్‌డియే ప్రభుత్వం జనవరి ఒకటి, 2004లో అమలులోకి తెచ్చింది. ఆయా రాష్ట్రాలు దీనిని స్వచ్ఛందంగానే ఎంచుకొనుటకు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పటికీ చాలా రాష్ట్రాలు ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలంలో ఈ విధానాన్ని ఎంపిక చేసుకొని 2004 సెప్టెంబర్‌ ఒకటిన జిఒఎంఎస్‌ నెంబర్‌ 653 ద్వారా అమల్లోకి తేవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త తెలంగాణ ప్రభుత్వం కూడా జిఒఎంఎస్‌ నెంబర్‌ 28 ద్వారా కాంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ స్కీంను అంగీకరిస్తూ అమల్లోకి తేవడం జరిగింది. కాంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ స్కీమ్‌ ప్రారంభంలో చాలా రాష్ట్రాలు ఒప్పుకొన్నప్పటికీ వామపక్ష ప్రభుత్వంగల వెస్ట్‌ బెంగాల్‌, త్రిపుర, కేరళ రాష్ట్రాలు మాత్రం దీనికి అంగీకరించలేవు. కేరళలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, త్రిపురలో బిజెపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ విధానాన్ని అమలులోకి తెచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ విధానాన్ని ఒప్పుకోలేదు. పాతపెన్షన్‌ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయంలో పెద్దమొత్తంగా జీతభత్యాల కోసం ఖర్చు చేయాల్సి వస్తుందని వాటిని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నూతన పెన్షన్‌ విధానాన్ని తెచ్చే ప్రయత్నం చేశాయని చెప్పిన్పటికీ అసలు ఉద్దేశం మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్‌ విధానంలో దాచుకున్న డబ్బును బడా కార్పొరేట్‌ సంస్థలకు పెట్టుబడిగా మార్చే ఉద్దేశ్యం దాగి ఉందని అర్థమవుతుంది. మార్చి 2019 నాటికి 1.24 కోట్ల మంది చందాదారులు ఈ పెన్షన్‌లో చేరారు. మార్చి 2019 నాటికి ఎన్‌పిఎస్‌ ఆస్తులు మూడు లక్షల పదకొండువేల మూడు వందల యాభై నాలుగు కోట్లు. చందాదారుల్లో 35 శాతం అకౌంటులో 88 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వాట ఉంది. నూతన పెన్షన్‌ విధానంలో ఉద్యోగికి ఎంత పెన్షన్‌ వస్తుంది అనే విషయంపైన స్పష్టత లేదు. పిఎఫ్‌ఆర్‌డిఎ యాక్ట్‌ 2013 సెక్షన్‌ 20లో పెన్షన్‌ ఎంత వస్తుందో మార్కెట్‌ నిర్ణయిస్తుందని పేర్కొంటుందంటే . 30 సంవత్సరాలకుపైగా ప్రభుత్వ సేవలో ఉన్న వ్యక్తికి ప్రభుత్వం ఇచ్చే బహుమానం ఇదేనా? దేవకినందన్‌ నకర కేసుల్లో సుప్రీంకోర్టు పెన్షన్‌ భిక్షకాదని జీవితకాలం పనిచేసినందుకు పొందే మానవ హక్కు అని పేర్కొంది. పెన్షన్‌ పై ఫోర్త్‌ పే కమిషన్‌, అనుకోకుండా (మరణం) జరిగినా, అనుకోని (వృద్ధ్యాప్యం) జరిగే సంఘటనలకు సామాజిక భద్రత కల్పించడమే పెన్షన్‌ ముఖ్య లక్ష్యంగా పేర్కొంది. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 41 సామాజిక భద్రత కల్పించాలని పేర్కొంటోంది. ఆర్టికల్‌ 14 పౌరుల మధ్య సమానత్వం గురించి పేర్కొంటుంది. ఈ విధంగా రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక భద్రత, సమానత్వం అనే విషయాలను ఈ నూతన పెన్షన్‌ విధానం ఉల్లంఘిస్తుంది. పెన్షన్‌కు భారీగా ఖర్చువుతుందని అంటున్న ప్రభుత్వాలు సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు కార్పొరేట్‌ సంస్థలకు రాయితీ రూపంలో ఇస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న నూతన పెన్షన్‌ (సిపిఎస్‌)లో వారి పెన్షన్‌ను మార్కెట్‌ నిర్ణయిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌ ఒడిదుడుకులకు లోబడి నెలనెలా పెన్షన్‌ మారుతూ వృద్ధ్యాప్యంలో వారి ఆర్థికభద్రత గాలిలో దీపంగా మార్చుతుంది. సుమారు 30 సంవత్సరాలు ప్రభుత్వ సేవలో ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? మార్కెట్‌పై ఆధారపడ్డ నూతన పెన్షన్‌ వృద్ధాప్యంలో వారికి ఎలా తోడ్పడుతుంది? ఉద్యోగుల వాటా, ప్రభుత్వ వాటా మొత్తం స్టాక్‌ మార్కెట్‌లో పెడితే, వారి బతుకులు భద్రత లేని బతుకులు కావా? వ ్యవస్థీకృత రంగంలో అందులో ప్రభుత్వంలో సేవలందించిన వారి వృద్ధాప్య బతుకులను మార్కెట్‌ జూదానికి వదిలిపెట్టడం ప్రభుత్వానికి సమంజసమా? ప్రభుత్వాలు తెచ్చిన ఈ విధానం వల్ల పదవి విరమణ చేసినవారు గౌరవంగా ఎలా బతుకగలరు? ఈ మధ్యనే పదవీ విరమణ చేసినవారి నూతన పెన్షన్‌ (సిపిఎస్‌) ఆసరా పెన్షన్‌ కన్నా అధ్వాన్నంగా ఉంది. రాజకీయ నాయకులకు ఒకటి, రెండుసార్ల పదవిలో ఉంటేనే పెన్షన్‌ ఇస్తున్నప్పుడు 30 సంవత్సరాలు ప్రభుత్వ సేవలో ఉన్న ఉద్యోగులకు వృద్ధాప్యంలో ఇచ్చే గుర్తింపు ఇదేనా? పెన్షన్‌ లెక్కలను లాభనష్టాలతో చూడడానికి ప్రభుత్వం ఏమైనా వ్యాపార సంస్థనా? పెన్షన్‌ అనేది ఉద్యోగి ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొంది. పెన్షన్‌కు దూరం చేయడం అంటే వ్యక్తి జీవించే హక్కును కాలరాయడమే.
పవన్‌కు దమ్ముంటే 175 స్థానాల్లో అభ్యర్థులను దింపాలి ‘వైయ‌స్ఆర్‌సీపీ కంచుకోటను ఇంచుకూడా కదపలేరు’ వైయ‌స్ జగన్‌ గారిపై విషం చిమ్మడమే పవన్‌ కళ్యాణ్‌ లక్ష్యం వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ పుట్టిన బిడ్డ ద‌గ్గ‌ర నుంచి పండు ముస‌లి వ‌ర‌కూ ప్రతి ఒక్కరికి ప్ర‌భుత్వం తోడు వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందనలు వైయ‌స్ఆర్‌సీపీ బీసీల పార్టీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణె You are here హోం » Others » ప్రత్యేకహోదా సాధించే వరుకూ పోరాటం ఆగదు.. ప్రత్యేకహోదా సాధించే వరుకూ పోరాటం ఆగదు.. 26 Dec 2018 10:26 AM ఢిల్లీ వేదికగా చంద్రబాబు మోసాలను ఎండగడతాం... వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి శ్రీకాకుళంః ఏపీకి ప్రత్యేకహోదా సాధించే వరుకూ పోరాటం ఆగదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి చేసిన మోసాలను ఢిల్లీ వేదికగా ఎండగడతామన్నారు.ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు డాక్టరేట్‌ సాధించారని విమర్శించారు.అధికారంలోకి వస్తే ప్రజలకు సురక్షిత పాలన అందిస్తామని చెప్పడమే కాకుండా విభజిత ఏపీకి 10 సంవత్సరాల పాటు ప్రత్యేకహోదా తీసుకువస్తామని వెంకటేశ్వరస్వామి సాక్షిగా తిరుపతిలో ప్రసంగించిన మోదీ,చంద్రబాబులు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకహోదాను పూర్తిగా విస్మరించారన్నారు.వంచనపై గర్జన నిరసన ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి చేసిన అన్యాయాన్ని రేపు ఢిల్లీ వేదికగా నిలదీస్తామన్నారు.హోదా అంటే జైలే అన్న చంద్రబాబు మళ్లీ ధర్మపోరాట దీక్షల పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.హోదా కోసం పోరాటం చేసిన వారిని జైలుకు పంపిన చరిత్ర చంద్రబాబు అని దుయ్యబట్టారు. హోదా కోసం వైయస్‌ జగన్‌ అనేక రూపాల్లో దీక్షలు చేశారన్నారు.హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు పదవులకు రాజీనామాలు చేశారన్నారు.కేంద్ర ప్రభుత్వంపై వైయస్‌ జగన్‌ అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
కరోనా వైరస్‌ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, స్వైన్‌ఫ్లూతో పోలిస్తే కరోనా మరణాల శాతం చాలా తక్కువ అని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదని రెలిపారు. TV9 Telugu Digital Desk | Edited By: Mar 03, 2020 | 5:27 PM కరోనా వైరస్‌ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, స్వైన్‌ఫ్లూతో పోలిస్తే కరోనా మరణాల శాతం చాలా తక్కువ అని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదని తెలిపారు. హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ కేసు నమోదైన నేపథ్యంలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. కరోనా వచ్చిన వారిలో 81 శాతం మందికి ఎలాంటి ట్రీట్‌మెంట్ లేకుండా తగ్గిపోతుందన్నారు. ప్రజలు బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తే వైరస్‌ వ్యాపించదని తెలిపారు. కరోనా ఉన్న వారు మాట్లాడినపుడు ఆ తుంపర్లు ఇతరుల ముఖంపై పడితే వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశముందన్నారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటే కరోనా వైరస్‌ను అరికట్టవచ్చని ఈటల చెప్పారు. కాగా.. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నచోట కరోనా వైరస్‌ జీవించే ఆస్కారముంది. మన వద్ద ఉష్ణోగ్రతలు ఎక్కువ కనుక వైరస్‌ వచ్చే అవకాశం తక్కువ. ముందు జాగ్రత్త చర్యలుగా హోర్డింగ్‌లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేపడుతున్నాం. దీనిపై 104 హెల్ప్‌లైన్‌ అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వైరస్‌ సోకిన వారిలో 3 శాతం కూడా మరణాలు లేవు. బహిరంగ ప్రదేశాల్లో తుమ్మినపుడు, దగ్గినపుడు టవల్‌ను అడ్డు పెట్టుకోవాలి. మిలిటరీ, చెస్ట్‌, ఫీవర్‌, వికారాబాద్‌ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని ఈటెల స్పష్టంచేశారు. తెలంగాణలోని వైద్య కళాశాలల్లో 600 నుంచి 800 పడకలు ఉన్నాయి. వాటిలో 200 పడకలు ఐసోలేషన్‌ కోసం వాడేలా చర్యలు తీసుకుంటున్నాం. మిగతా ఆస్పత్రుల్లో 3వేల పడకలకుపైగా వాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాం. 200 నుంచి 300 మందికి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కొంతకాలం పాటు ఎవరికీ షేక్‌ హ్యాండ్ ఇవ్వొద్దు. అత్యంత ఆప్తులు కలిసినా నమస్కారం చేయండి. విదేశీ ప్రయాణాలకు వీలైనంత వరకు రాష్ట్ర ప్రజలు దూరంగా ఉండాలి. మాస్కులు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం” అని మంత్రి ఈటల వివరించారు.
టాలీవుడ్ లో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే పేరు సమంత. ఎదో ఒక అంశంతో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. మొన్నటి వరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండంటంలో వల్ల.. ఇటీవల సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల అందరి నోట్లో సమంత పేరు నానింది. తాజాగా ఈ స్టార్ హీరోయిన్ మయోసైటిస్ అనే వ్యాధి బారిన విషయం తెలిసిందే. దీని తర్వాత కూడా సామ్ రోజుల తరబడి ట్రెండింగ్ లో ఉంటుంది. MoreMovies News Kushi : సెకండ్ హీరోయిన్ గా కృతి Sujeeth: అభిమాని నుండి దర్శకుడు వరకు Nidhi: ఆ హీరోతో అవకాశం వస్తే రెమ్యూనరేషన్ కూడా వద్దు ఇంతటి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ సినిమా చేస్తే.. అది కూడా లేడీ ఓరియెంటెడ్ అయితే.. అంచనాలు పీక్స్ లో ఉంటాయి. నిజానికి సామ్ ముఖ్య పాత్రలో నటించిన యశోదకు మొదటి నుంచి అలాంటి హైప్ నే క్రియేట్ అయింది. సమంత వ్యాధి బారిన పడిన తర్వాత కూడా యశోదపై ఉన్న బజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఒకింత పెరిగిందనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా.. దర్శక నిర్మాతలకు ఇప్పడే అసలైన సమస్యలు వస్తున్నాయి. యశోదకు ప్రస్తుతం ఉన్న బజ్ కు తోడు.. ప్రమోషన్లు చేస్తే మరింత హైప్ క్రియేట్ అవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. సామ్ పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు ప్రమోషన్ లలో పాల్గొనే స్థితిలో లేదు. ఇంటర్వ్యూలకు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేనని దర్శక నిర్మాతలతో చెప్పేసిందట. సామ్ లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం చాలా కష్టం. దీంతో ఈవెంట్ నిర్వహించకుండానే డైరెక్ట్ గా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ప్రమోషన్స్ లేకుండా సినిమా రిలీజ్ చేయడం వల్ల యశోద ఫలితంపై ప్రభావం కూడా చూపే అవకాశాలు లేకపోలేదు. ఎంత వరకు అయితే అంత అని వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తో ఇంటర్వ్యూలు చేయిస్తున్నారు.ఇది సినిమాపై హైప్ క్రియేట్ చేయడంలో సహాయపడుతుందా అంటే, దానికి సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు. ఇన్ని ఇబ్బందుల మధ్య యశోద రిలీజ్ అవుతుంది. మరి దీని ఫలితం ఎలా ఉంటుంది ? నిర్మాతలు ఎంత వరకు లాభపొందుతారు అని తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసు కుంటున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మంజుల, భానుమూర్తి అన్నారు. సోమవారం రాయచోటిలోని డైట్‌ పాఠశాలలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ సమావేశంలో మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 బకాయిలు తక్షణం చెల్లించాలి ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మంజుల, భానుమూర్తి రాయచోటిటౌన్‌, అక్టోబరు 3: విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసు కుంటున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మంజుల, భానుమూర్తి అన్నారు. సోమవారం రాయచోటిలోని డైట్‌ పాఠశాలలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులపై కక్షగట్టింద న్నారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి జగన్‌ నిలబెట్టు కోవాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్ర సంద ర్భంగా సీపీ ఎస్‌ను రద్దు చేస్తానని, పీఆర్‌సీని న్యాయపరంగా ఇస్తానని చెప్పిన జగన్‌ అధికారం లోకి వచ్చాక మాట మార్చి విద్యా వ్యతిరేక విధానాలను అవలం బిస్తూ, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటమాడు తున్నారని ఆరోపిం చారు. డీఏ, పీఎఫ్‌, ఈఐలను తక్షణమే చెల్లించా లని డిమాండ్‌ చేశారు. అనం తరం ఏపీటీఎఫ్‌ అన్నమయ్య జిల్లా నూతన ఉపాఽ ద్యక్షుడుగా అబ్బవరం హరిబాబును ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యాంసుందర్‌రెడ్డి, అశోక్‌కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి రఘుబాబు, ఏపీటీఎఫ్‌ అన్నమయ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామదస్తగిరిరెడ్డి, శ్రీనివాసులు, నాయకులు అదిబయన్న, రాజశేఖర్‌, శేషారావు, రమేష్‌, శ్రీను, రామాంజనేయులు, ఆర్‌వీ రమణ, అబ్బవరం రాయుడు, మల్లూరు నాగరాజు, రెడ్డెయ్య తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా? బీసీల పల్లకి మోస్తున్న జ‌న‌నేత సీఎం వైయ‌స్ జగన్‌ మళ్లీ వైయ‌స్‌ జగన్‌నే గెలిపించుకుందాం You are here హోం » ప్రత్యేక కథలు » గిట్టనివారికి శఠగోపం పెట్టే చిట్టీల రాము నెత్తిన రెండు టోపీలు! గిట్టనివారికి శఠగోపం పెట్టే చిట్టీల రాము నెత్తిన రెండు టోపీలు! 21 Oct 2022 6:21 PM ఒకటి పత్రికాధిపతిగా, రెండోది చిట్టీల కంపెనీ ఓనర్‌ గా! 15 ఏళ్ల క్రితమే వ్యాఖ్యానించిన ‘సుప్రీం’ జడ్జి జస్టిస్‌ రవీంద్రన్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి అమ‌రావ‌తి: చెరుకూరి రాము (సీహెచ్‌ రామోజీ) తన 70వ జన్మదినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్న సమయంలో–2006 నవంబర్‌ మొదటి వారం రామోజీ గ్రూపుపై ‘పిడుగు’ పడినంత పనైంది. రామూ కుటుంబ (హెచ్‌ యూ ఎఫ్‌–అవిభక్త హిందూ కుటుంబం) నిర్వహణలోని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ వందల కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేయడం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధమని వెల్లడైంది. దీంతో అంతకు ముందు మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ లో తమ సొమ్ము దాచుకున్న వందలాది మంది డిపాజిటర్ల ప్రయోజనాలు కాపాడడానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి ప్రభుత్వం వెంటనే (2006 డిసెంబర్‌) అధికారికంగా స్పందించింది. కనీసం తన పేరుతో బోర్డు కూడా లేకుండా దశాబ్దాలుగా పనిచేస్తున్న ఈ కంపెనీపై దర్యాప్తునకు ఎన్‌.రంగాచారి కమిటీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. సొంత పేరుతో బోర్డుతో పాటు సొంత కార్యాలయాలు కూడా లేని ఈ కుటుంబ కంపెనీ అప్పట్లో రామూ తొలి ఒరిజినల్‌ కంపెనీ ‘మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ఆఫీసుల నుంచే పనిచేసేది. ఫలితంగా, రాష్ట్ర సర్కారు ఈ కంపెనీ పత్రాల కోసం రామూ చిట్టీల కంపెనీ ప్రధాన కార్యాలయంలో, బ్రాంచీలలో అధికారులతో తనిఖీలు చేయించింది. ఈ తనిఖీలు అన్యాయమనీ, వాటిని తనకు హక్కుగా దక్కిన పత్రికా స్వాతంత్య్రంపై చేసిన దాడులుగా పరిగణించాలని ‘రాజగురువు’ కోర్టుల తలుపులు తట్టారు. ఏపీలో తనపై వైఎస్‌ సర్కారు తీసుకుంటున్న చర్యలను నిలిపివేయాలని అభ్యర్థిస్తూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎసెల్పీ) కూడా దాఖలు చేశారు. ‘‘మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ కేసులో రాష్ట్ర సర్కారు స్పందన (రంగాచారి కమిటీ వేయడం) మా మీడియా వ్యాపారాన్ని దెబ్బదీయడానికి ఉద్దేశించిన చర్య. ‘ఈనాడు’ దినపత్రికను, 12 టీవీ చానల్స్‌ ను నడపనీయకుండా మమ్మల్ని ఆర్థికంగా కుంగదీయడమే లక్ష్యంగా తలపెట్టిన కార్యక్రమం ఇది,’’ అంటూ ఈ ఎసెల్పీలో రాము సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. తక్షణమే మార్గదర్శిపై చర్యలను నిలిపివేయాలని ఆదేశించాలని అభ్యర్థించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ స్పందిస్తూ, ‘ ఆర్థిక సంస్థలు (ఫైనాన్స్‌ కంపెనీలు) ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉంటున్నాయి. అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోకూడదు?’ అని ప్రశ్నించారు. ఇక్కడ కీలక విషయం ఏమంటే రాము పిటిషన్‌ విచారించిన మరో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వీ.రవీంద్రన్‌ విచారణ జరుపుతూ, ‘ముఖ్యమంత్రి తప్పుచేస్తే మీరు వెంటనే దాని గురించి చెబుతారు. అలాగే, మీరు తప్పు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్యతీసుకుంది. మీ క్లయింటు (రామోజీరావు) రెండు టోపీలు పెట్టుకుని తిరుగుతున్నారు. ఒకటి వార్తాపత్రిక యజమానిగా, రెండోది చిట్‌ ఫండ్‌ కంపెనీ అధిపతిగా పెట్టుకుంటున్నారు,’ అని రాచపుండు రాము లాయర్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది జరిగింది 2007 జూన్‌ మాసంలో. ఇదంతా గుర్తుచేయడానికి కారణం పెదపారుపూడి రాముడి నెత్తి మీద ఇప్పుడు కూడా మనకు కనిపించని అనేక టోపీలు ఉన్నాయి. ఎప్పుడూ తెల్ల బట్టలే ధరించినాగాని–సందర్భాన్ని బట్టి టోపీలు మార్చుతారు కుల మార్గదర్శి. సెంచరీ కొట్టే క్రమంలో 86వ రన్‌ తీయడానికి దగ్గరలో ఉన్న రాము ఏకకాలంలో ఇన్ని టోపీలు ధరించడం నిజంగా గ్రేట్‌. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని, దశలవారీగా దీన్ని అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై […] Category: Trending News, ఆంధ్ర ప్రదేశ్ by NewsDeskLeave a Comment on ఆగస్ట్ 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్: సిఎం ఆంధ్ర ప్రదేశ్ 5 mins ago Smt. Droupadi Murmu: మహిళా సాధికారతకు ప్రతిరూపం: సిఎం జగన్ ఒక సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, అణగారిన వర్గాల కోసం అచంచలమైన కృషి చేసిన వ్యక్తిగా అన్నింటికంటే మించి ఒక గొప్ప మహిళగా...
‘మా’ ఎన్నికలు ఎంతటి హాట్ హాట్ గా మారాయో తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేనంత ఉద్రిక్త వాతావరణానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ ఎన్నికలకు సంబంధించి తాజాగా వెలుగుచూస్తున్న వీడియోలు మరింత వేడిని పెంచేలా ఉండటం గమనార్హం. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ జరగటానికి కొన్ని గంటల ముందు విష్ణు టీంకు సపోర్టు చేసే నరేశ్.. ఒక వీడియోను విడుదల చేయటం.. అదే తన చివరి వీడియోగా పేర్కొంటూ సంచలన ఆరోపణలు చేయటం తెలిసిందే. ఈ వీడియోకు కౌంటర్ అన్న రీతిలో నటుడు కమ్ ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరఫున ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న హీరో శ్రీకాంత్ రియాక్టు అయ్యారు. డబ్బులు పంచుతున్నామని.. ఒక్కో ఓటుకు రూ.15వేల నుంచి రూ.25 వేల వరకు ఇస్తున్నట్లుగా చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. వాళ్లే డబ్బులు ఇవ్వటానికి మనుషుల్ని పెట్టి.. ప్రకాశ్ రాజ్ ఇదంతా చేస్తున్నారని చెప్పేందుకు ప్లాన్ చేశారని.. సభ్యులంతా ఈ విషయాల్ని గమనించాలన్నారు. ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయాల్సిన అవసరం తమకు లేదన్న ఆయన.. అమ్మవారి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఇలా చేస్తే నాశనమైపోతాం.. ఇప్పటికైనా నరేశ్.. ఇలాంటి ఆరోపణల్ని ఇక్కడితో ఆపేయాలంటూ సీరియస్ అయ్యారు. తాజాగా విడుదల చేసిన వీడియో క్లిప్ లో శ్రీకాంత్ ఏమన్నారంటే.. ‘‘ఇప్పుడే నరేష్‌గారి వీడియో చూశా. నరేష్ గారూ.. ఎందుకండీ ఇంకా అబద్దాలు ఆడతారు. మేము డబ్బులు పంచుతున్నామా? మూడు మూడు సెంటర్లలో డబ్బులు పంచుతున్నామా? మీరు డబ్బులు వేరే వాళ్లతో పంపించి.. ప్రకాశ్ రాజ్ డబ్బులు ఇస్తాడు అని చెప్పదలుచుకున్నారా? ఆపేయండి సార్.. ఇక్కడితో ఆపేయండి. ఇంకా ఎక్స్‌ట్రాలు ఏమీ మాట్లాడవద్దు. దయచేసి మెంబర్స్ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. నరేష్ గారు ఈ రోజు ఎంత తప్పుడు మాట మాట్లాడుతున్నాడంటే.. వాళ్లు చేసే పని మా మీద రుద్దడానికి ట్రై చేస్తున్నాడు’’ అని మండిపడ్డారు. ‘ ‘దయచేసి.. మెంబర్స్ అందరూ అర్థం చేసుకోండి. మా లైఫ్‌లో అటువంటి కల్చర్‌లెస్ పనులు చేయం. దసరా సందర్భంగా పూజలందుకుంటున్న అమ్మవారి మీద ఒట్టేసి చెబుతున్నాం. అలాంటి కల్చర్‌లెస్ పనులు మేము చేయం. ఏమైనా తేడా వస్తే.. ఆ అమ్మవారే మమ్మల్ని నాశనం చేస్తారు. మెంబర్స్‌కి ఒకటే చెబుతున్నాం. ఇటువంటివి నమ్మవద్దు. మేము మందు పార్టీలు ఇవ్వలేదు. డబ్బులు పంచలేదు.. ఏమనుకుంటున్నారు నరేష్ మీరు? మా మీద బురద జల్లాలని అనుకుంటున్నారా? ఇంకా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ని నాశనం చేయడానికే ఉన్నారా? మీరంతా. ఆలోచించుకోండి.. మైండ్ కొంచెం పెట్టండి. ఏం మాట్లాడుతున్నారు మీరు?’’ అంటూ శ్రీకాంత్ సీరియస్ అయ్యారు ‘‘రేపు ఎలక్షన్స్ అనగా ఈ రోజు డబ్బులు పంచుతున్నామని పెడతారా? డబ్బులు పంచింది మీరు. ఇంకా బురద జల్లాలని చూస్తున్నారా? లాస్ట్ టైమ్ ఇదే చేశారుగా. అసోషియేషన్ డబ్బులు మొత్తం పోయాయ్. మెంబర్స్‌ని నమ్మించాలని ఇలాంటి పనులు చేస్తున్నారా? అంటే దీనిని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే.. ఎవరి ద్వారానో మీరు డబ్బులు పంచేలా చేసి.. ఓ మాకు ప్రకాశ్ రాజ్ పంపించాడు అని చెప్పడానికా? మీరు చేసేది. ముందస్తు రాజకీయమా ఇది? ప్లీజ్.. మెంబర్స్ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను.. ఇటువంటి ప్రలోభాలకు లొంగవద్దని నేను ఎప్పుడో చెప్పాను. ఇటువంటివి చాలా జరుగుతాయి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి’’ అని పేర్కొన్నారు. పోటాపోటీగా సాగుతున్న ఆరోపణలు.. ఘాటు కౌంటర్ల నేపథ్యంలో తుది ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు. Actor #Srikanth counter to #Naresh regarding distribution of money for Votes #MAAElections pic.twitter.com/J4BZOtfQYY
అరవై ఏళ్ల చీకట్లను చీల్చుకొని దూసుకొచ్చిన స్వేచ్ఛాకిరణం! వేయి మందికిపైగా అమరవీరుల స్ఫూర్తి జ్వలిస్తుంటే.. నాలుగు కోట్ల మంది ప్రజలు నిశీధి వీధుల్లో కాంతిరేఖలను అనుభూతించిన అపూర్వ సందర్భం! సంబురం.. సంరంభం..! ఉల్లాసం.. ఉత్సాహం.. పట్టపగ్గాలేని ఆనందం! తెలంగాణ గజ్జె పది జిల్లాల్లోనూ ఘల్లుమన్నది! స్వేచ్ఛను ప్రకటించింది తెలంగాణ డప్పు! జాతిని జాగతపరిచిన గీతాల జనజాతర! గుండెలు నిండిన ఆత్మగౌరవం! పోరాడితే పోయిందేమీ లేదు.. వలసపాలన సంకెళ్లు తప్ప! అవును.. మన స్వప్నం నిజమైంది! కొన్ని రుధిర ధారలు.. మరికొన్ని అగ్నిజ్వాలలు పునీతం చేసిన గడ్డ ఇది! లక్షల మంది త్యాగాల పునాదులపై ఆవిష్కతమైన జనసౌధమిది! ఇప్పుడిది విముక్త తెలంగాణ మాగాణం! జూన్ రెండు తొలి ఘడియ.. భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం! ఇప్పుడిక మన రాష్ట్రంలో మనం! ఈ అపురూప సందర్భాన్ని పది జిల్లాలు ప్రణమిల్లి స్వాగతించాయి! ఊరూవాడా.. పల్లె పట్నం తన్మయత్వంతో ఊగిపోయాయి! జై తెలంగాణ నినాదాలు.. పటాకుల మెరుపులతో తెలంగాణ ప్రగతిబాట జాజ్వల్యమైంది! ప్రజలు పట్టం గట్టిన మన ఇంటిపార్టీ అధినేత కేసీఆర్.. ఆ వెలుగుల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా నేటి ఉదయం 8.15 గంటలకు ప్రమాణం స్వీకరించగానే ఇక తెలంగాణకు శాసించే దశ! నేటినుంచే నవశకం – కేసీఆర్‌తోపాటు 10 మంది మంత్రులుగా ప్రమాణం.. -పరేడ్ గ్రౌండ్స్‌లో ఆవిర్భావ వేడుకలు -గులాబీమయమైన రాజధాని హైదరాబాద్.. -హోరెత్తిన హుస్సేన్‌సాగర్ -అర్ధరాత్రినుంచే టీఆర్‌ఎస్ ఆధ్యర్యంలో సంబురాలు.. -జిల్లాల్లోనూ భారీ వేడుకలు సీమాంధ్ర పాలకులపై తెలంగాణ ప్రజలు జరిపిన ఆరు దశాబ్దాల పోరాటం ఫలించి ప్రత్యేక రాష్ట్రం సాకారమవుతున్నది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ సోమవారం ఆవిర్భవిస్తున్నది. రాష్ట్రపతిపాలనను ఎత్తివేస్తూ సోమవారం ఉదయమే కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీచేయడంతో తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వస్తుంది. నూతన రాష్ర్టానికి గవర్నర్‌గా ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్‌సేన్ గుప్తా రాజ్‌భవన్‌లో ఉదయం 6.30 గంటలకు ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌లో ఉదయం 8.15 గంటలకు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. అంతకు ముందే ఉదయం 7.30 గంటలకు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులు అర్పించి రాజ్‌భవన్ చేరుకుంటారు. ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం పది మంది రాష్ట్ర మంత్రులుగా కూడా ప్రమాణం చేస్తారు. వీరితో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌ను సర్వాంగసుందరంగా అలంకరించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. పోలీసులు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజ్‌భవన్ పరిసరాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా కేసీఆర్ కటౌట్లు, గులాబీ జెండాలు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌లో ప్రమాణం అనంతరం కేసీఆర్ నేరుగా తెలంగాణ భవన్‌కు వెళతారు. అక్కడ తెలంగాణ తల్లి, జయశంకర్, అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఉదయం 10.10 గంటలకు తెలంగాణ రాష్ర్టావతరణ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. నూతన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వేడుకల్లో పాల్గొని జాతీయజెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12.57 గంటలకు సచివాలయంలో సీ-బ్లాక్‌లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా సచివాలయం ఆవరణలోని నల్లపోచమ్మ ఆలయంలో ఆయన పూజలు నిర్వహిస్తారు. పదవీ స్వీకారం అనంతరం ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చుతూ కొన్ని కీలక ఫైళ్లపై ఆయన సంతకం చేయనున్నారు. విస్తత ఏర్పాట్లు..: కాగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, నూతన ప్రభుత్వ పదవీ స్వీకార కార్యక్రమాలకు ప్రభుత్వం విస్తత ఏర్పాట్లు చేసింది. రాజ్‌భవన్,పరేడ్ గ్రౌండ్‌లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారులు కనివిని ఎరుగని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం నమూనా పరేడ్ నిర్వహించారు. అవతరణ దినోత్సవాల్లో భాగంగా తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అనేక సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ శ్రేణులు రాజ్‌భవన్, పరేడ్ మైదానం నలువైపులా గులాబీ జెండాలతో నింపేశారు. కేసీఆర్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. నూతన రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. కేసీఆర్ వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ క్రమబద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వాహనాలతో రిహార్సల్ కూడా నిర్వహించారు. ముఖ్య ఉత్సవాలు నిర్వహించే పరేడ్ గ్రౌండ్స్ చుట్టుపక్కల వివిధ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఇప్పటికే మీడియా ద్వారా ప్రకటించారు. ఈ ఉత్సవాలకు వివిధ జిల్లాలనుంచి భారీగా ప్రజలు హాజరుకానుండడంతో నగరంలో ప్రవేశించే వాహనాలకు వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక సచివాలయంలో నూతన ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ అధికారులు, తెలంగాణ ఉద్యోగులు భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ మిగిలిన 9 జిల్లాల్లో ఆవిర్భావ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు. గులాబీమయంగా నగరం…: నూతన రాష్ట్ర ఆవిర్భావం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు కలిసి రావడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు చేస్తున్నారు. నగరంలోని అన్ని మార్గాలను పూర్తిగా గులాబీమయం చేశారు. రహదార్ల పోడవునా గులాబీ తోరణాలు వేలాడదీశారు. అన్ని కూడళ్లలో భారీగా ప్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేశారు. నగరంలో ప్రధాన మార్గాల్లో భారీ హోర్డింగులు అమర్చారు. ఎటుచూసినా గులాబీ జెండాల రెపరెపలే కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గన్‌పార్క్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్‌లను సర్వాంగసుందరంగా అలంకరించారు. ఆదివారం అర్దరాత్రినుంచే తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ భవన్, ట్యాంక్‌బండ్, పీపుల్స్ ప్లాజాలు ఈ వేడుకలకు వేదికలయ్యాయి. ఆటపాటలు, సాంస్కతిక కార్యక్రమాలతో హుస్సేన్ సాగర్ హోరెత్తిపోయింది. తెలంగాణకు 44మంది ఐఏఎస్‌లు.. : తెలంగాణలో పరిపాలన వ్యవహారాలు సాఫీగా సాగడానికి కేంద్రం తాత్కాలికంగా 44మంది ఐఎఎస్‌లను కేటాయించింది. తెలంగాణలో పరిపాలన యంత్రాంగం నడవడానికి 163మంది ఐఎఎస్‌లు, 112ఐపిఎస్లను 65మంది ఐఎఫ్‌ఎస్‌లను కేటాయించాలని నిర్ణయించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రత్యూష సిన్హ ఆధ్యర్యంలోని ఆరుగురు సభ్యుల కమిటీ చేసిన ఈ సిఫారసుకు డిపార్డ్‌మెంట్ ఆఫ్ పర్సనెల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) ఆమోదం తెలిపింది.తెలంగాణలో వివిధ శాఖల్లో పని చేయడానికి తాత్కాలికంగా 9893ఉద్యోగులను కేటాయించారు. నేడు ప్రమాణం చేయనున్న మంత్రులు వీరే.. 1. ఈటెల రాజేందర్ 2. కొప్పుల ఈశ్వర్ 3. మహమూద్ అలీ 4. జోగు రామన్న 5. నాయిని నర్సింహారెడ్డి 6. పోచారం శ్రీనివాస్‌రెడ్డి 7. టీ హరీశ్‌రావు 8. కే తారకరామారావు 9. గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 10. మహేందర్‌రెడ్డి 11. రాజయ్య
కియారా అద్వానీ తన అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకలోకాన్ని బుట్టలో వేసుకుందిభరత్ అనే నేను తో పాపులర్ అయినా బాలీవుడ్ స్మార్ట్ బ్యూటీ తరువాత వినయ విధేయ రామ తో మెరిసిన పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.. Video Advertisement ఆ సినిమా ప్లాప్ అవ్వడం తో మళ్ళి టాలీవుడ్ లో ఇంత వరకు కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీ గా గడిపేస్తూ ఉన్న ఈ బ్యూటీ…ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తి కరమైన విషయాలను పంచుకుంది..ఎవరితో అయినా ప్రేమలో పడితే తనకు శృ0గార0 అభ్యంతరం లేదు అన్నది అది కూడా అవతలి వ్యక్తి పెళ్ళికి ఒప్పుకుంటే మాత్రం ఇష్టమే నట కచ్చితంగా పెళ్ళికి ఒప్పుకుంటేనే రిలేషన్షిప్ ని కొనసాగిస్తాను అన్నది. ప్రస్తుతానికి అయితే ఎవరితోనూ ప్రేమలో లేను అంటూ చెప్పుకు వచ్చింది ఆలా ఎవరినా ఉంటె మీడియా కి కచ్చితంగా వెల్లడిస్తా అన్నది,ఎంతయినా ఇలాంటి కామెంట్స్ ఇవ్వడానికి గట్స్ ఉండాలి కదూ.లేటెస్ట్ సమాచారం మేరకు మహేష్‌తో తెలుగులో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. Recent Posts ‘అరవింద సమేత’ స్టోరీ ని మంచు విష్ణు సినిమా లో అప్పుడే చెప్పారుగా..!! సొంత “దుస్తుల బ్రాండ్” తో పాటు… “మహేష్ బాబు” కి ఉన్న ఈ 5 వ్యాపారాలు ఏంటో తెలుసా..? “తేరి రీమేక్ అయితే కాదుగా.?” అంటూ…“పవన్ కళ్యాణ్” తో “హరీష్ శంకర్” సినిమా గురించి ట్వీట్ పై 10 ట్రోల్స్.!
జబర్దస్త్ వల్ల ఫేమ్ అయిన యాంకర్ అనసూయ. బుల్లితెర మీదే కాదు అటు వెండి తెర మీద కూడా అవకాశాలు సంపాదిస్తూ ముందుకి దూసుకెళ్తుంది. ప్రస్తుతం అనసూయ. పవన్ కళ్యాణ్,క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతుంది. దాంతో పాటు అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో కూడా అనసూయ పాత్రే కథకు కీలకం అని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ అసభ్యంగా ప్రవర్తించిన వారికి తన స్టైల్ లో కౌంటర్ లు ఇస్తూ ఉంటారు అనసూయ. Video Advertisement కరోనా మహమ్మారిని అరికట్టేక్రమంలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మరింత ఆక్టివ్ గా ఉంటున్నారు అనసూయ. ఈ నేపథ్యంలో “తరుణ్ భాస్కర్‌ తో కలిసి ఓ పార్టీలో తాగి గోల చేశారట కదా” అని ఒకరు అడిగితే `”నువ్వు ఇంకా పరిణతి చెందినట్లు లేవు. పరిణతి చెందితే నీకు అసలు నిజం ఏంటో తెలుస్తుంది” అంటూ కౌంటర్ ఇచ్చారు అనసూయ. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అన్ని జిల్లాల్లో లాక్ డౌన్ అని ముఖ్యమంత్రులు తెలిపారు.ఈ క్రమంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి బియ్యంతో పాటు 1500 రూపాయలు అందచేస్తామని సీఎం కెసిఆర్ తెలిపారు. దీనిపై ట్విట్టర్ లో కేటీఆర్ కు రిప్లై ఇచ్చింది అనసూయ. “సార్. ప్రభుత్వం చెప్పింది పాటించాలి.. కానీ కొన్ని ప్రొఫెషన్స్ విషయంలో మాత్రం ఈ పద్దతులు సడలించండి..మేం పని చేయకపోతే మాకు డబ్బులు రావు.. కానీ మేం మా ఇంటి రెంట్ కట్టుకోవాలి.. కరెంట్ బిల్లు కట్టుకోవాలి.. EMI భరించాల్సిందే.. నెలసరి బిల్స్ కూడా ఉంటాయి. కాబట్టి కాస్త మాపై దయ చూపించండి ” అంటూ ట్వీట్ చేసింది. అనసూయ అలా ట్వీట్ చేసేసరికి ఓ రేంజ్ లో ట్రోల్ల్స్ చేసారు సోషల్ మీడియాలో. కొందరు నెటిజెన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఎంతో రిచ్ అయిన మీరే ఇలా అంటే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ట్రోల్ల్స్ పై అనసూయ స్పందించారు.”అయ్య బాబోయ్.. ఏంటి ఇంత మందా? ఇంతమంది బుర్రలేని వాళ్లా? ఇంతమంది వితండవాదులా? ` మేము` అంటే `నేను` అనేసుకున్నారా?.. ఏం చేస్తాం లెండి.. కామన్‌సెన్స్ ఉంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది. నేను భయపడుతున్నది రాబోయే పరిస్థితుల గురించి” అంటూ కామెంట్ చేసింది.
కొందరు రచయితలూ కవులు రచనలలోనే కాదు జీవితం జీవించి చూపడంలో కూడా ప్రేమైక స్వభావమే. ఆ ప్రేమ కోసం లోకం గీసిన సరిహద్దురేఖలను చెరిపేసి తమకు కావాల్సిన విధంగా జీవించి చూపుతారు. వద్దనుకుంటే తేలికగా జీవితాన్ని ముగించుకుంటారు. అది వారి ముద్ర . ఆమె కవితలో చిన్న భాగం ఇక్కడ .. పురాతన ధాత్రి ఒకనాడు జన్మించింది అందరికీ తెలిసినట్టుగానే , చాలా కాలం క్రితం ఈ పురాతన ధరణి మరణించాల్సిందే . కనుక వేడి గాలులను రేగనివ్వండి , నీలి కెరటాలను తీరం తాకనివ్వండి ; ఎందుకంటే ప్రతి ఇరు సంధ్యలూ ఇక నీవు చూడలేవు శాశ్వతంగా. అన్నీ జన్మించినవే ఏవీ తిరిగి రావు మరల ఎందుకంటే జన్మించినవన్నీతప్పక మరణించాల్సిందే! "ప్రేమంటే శరీరంతోనో, హృదయంతోనో వేరు వేరుగా జీవించడం కాదు. దూరంగా వున్నప్పటికీ వొకరి మనసు స్పందిస్తే రెండో వారికి గుండె మెలిపెట్టినట్లు వుండటం" అని ఆమెకి అనుభవమై వొడలెల్లా కన్నీటి సంద్రమే. ఆ సంద్రంలో ఆ క్షణంలోనే ఆమె మునిగిపోవచ్చు. - నేను వ్రాసిన కథ "రాతి హృదయం " నుండి ఈ వాక్యం. ఈ బ్లాగ్ లో పదే పదే చదవడం చూసాను.ఎవరో ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యారనుకున్నాను. కానీ అనుమానం రాలేదు. జరగాల్సింది జరిగిపోయాక యిప్పుడనిపిస్తుంది.. అయ్యో ..అని. ఆమె తన ధాత్రి బ్లాగ్ నుండి ఆ కథను పదే పదే చదివారని తెలిసింది. సాహితీ లోకం గురించిన తెలిసిన వారందరికీ విశాఖ జగతి గారు తెలిసే వుంటారు. జగమెరిగిన జగతి జగద్దాత్రి అనుకోవచ్చు. అందరిని ప్రేమగా పలకరించే ఆమెను మర్చిపోవడం కష్టం. సహచరుడు రామతీర్ధ గారు మరణించాక కల్గిన వొంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయం తెలియగానే షాక్ అయ్యాను. ఆమెతో ఫేస్బుక్ లో కాకుండా వ్యక్తిగతంగా మూడు నాలుగుసార్లు వ్యక్తిగత సంభాషణ జరిగింది. నేనెవరో ఆమెకు పరిచయం లేకపోయినా నా కవిత "నా ఏకాంతంలో నేను" అనే poem translate చేసారు. "మర్మమేమి" కథ తీసుకున్నారు. Translate చేయడానికని. ఈ మధ్య “రేపటి టీచర్లు” అనే కథ రాసారు share చేసి Tag చేయబోతే Facebook deactivate చేసి వుంది. Call చేస్తే తీయలేదు. కొద్దిరోజులకు facebook కి మళ్ళీ వచ్చారు. నేను మంజు యనమదల కలిసి ఆమె దగ్గరకు వెళదామనుకున్నాము. ఇంతలో యిలా.. ఒంటరితనం అంత భయంకరం యింకోటి లేదు. 😞😢 జగద్దాత్రి చనిపోయిన తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం గురించి అనేక సంగతులు బయటకు వచ్చాయి. అవన్నీ నాకు తెలియక ముందు యెలాంటి ఫీలింగ్ వుందో తెలిసిన తర్వాత అదే ఫీల్ నాకు. నేను జడ్జ్ చేయను. కానీ moral policing చేస్తూ యెన్నెన్నో వ్యాఖ్యానాలు. అసహ్యమేసింది మనిషి చనిపోయాక కూడా వ్యాఖ్యానించడం చూసి. ఒంటరితనం భరించలేక చనిపోయారు అని అంటే అదే బాధ. ప్చ్. ఒంటరితనం వేయి కొండచిలువులు కలసి చుట్టేసిన ఊపిరాడనితనం. అందరూ జీవించడానికి రకరకాల కారణాలు వెదుక్కుంటారు ఆమె జీవించడానికి కారణమే లేదు అనుకుని ఉండవచ్చు. కవులు రచయితలు సున్నిత మనస్కులు అని నిరూపించారు 😥 ఈ కల్లోల ప్రపంచంలో రకరకాల బాధలు. మనవి కాకపోయినా యేదో బాధ. నాలుగైదు రోజులుగా నాలో అలాంటి బాధే! మనసు కృంగకుండా ప్రశాంతంగా వుండటాన్ని సాధన చేస్తున్నా.. ఆమె గురించి సానుభూతిగా వ్రాసిన మాటలు చూసి మెసెంజర్ ద్వారా కొన్ని వివరాలు అందించారు ఇద్దరు వ్యక్తులు. ఆ వివరాలు చూసిన తర్వాత కూడా ఆమెపై నా అభిప్రాయమేమీ మారలేదుకూడా! తర్వాత నా ఆలోచనలు నాణేనికి రెండో వైపు అనుకుంటూ ..ఇలా వ్రాసుకున్నాను. ఉబుసుపోక కాదు యీ మాటలు రాస్తున్నది. నా ఆలోచనలను వ్రాస్తున్నా! జరిగిన తప్పిదంలో పురుషుడిని వదిలేసి స్త్రీని మాత్రమే జడ్జ్ చేయడం నాకు నచ్చలేదు. ఒకప్పుడు నా మధ్య నా భర్త మధ్య జరిగిన ఒక సంభాషణ గుర్తు చేసుకుంటున్నాను. "ఒక పురుషుడు హటాత్తుగా చనిపోతే ప్రియురాలు కూడా వెంటనే చచ్చిపోతుంది అతనంటే అంత ప్రేమ. భార్య కావాలంటే పొర్లుగింతలు పెడుతూ గుండెలు బాదుకుంటూ యేడుస్తుంది కానీ .. అని నా భర్త. వెంటనే.. "భార్యకు అనేక భాధ్యతలుంటాయి వాటిని వదిలేసి భర్త తో పాటే మరణించడానికి ఆ ప్రేమ అనేది అతను ఆమెకు ఏనాడైనా యిస్తే కదా.. ఆ భాధ్యతలేమిటో అతనికి తెలిస్తే కదా " అన్నాను నేను. ప్రేమ తెలియకపోయినా పర్లేదు బాధ్యత మాత్రం అందరికి తెలిసి ఉండాలి. ఆ బాధ్యత లేకుండా వ్యక్తిగత ఆనందం కోసం ప్రాకులాడిన వారికి అయిన వాళ్ళెవరూ మిగలరూ..సమాజమూ వారిని అర్ధం చేసుకోదు. రాళ్ళుచ్చుకుని వెంటబడి మరీ కొడుతుంది. మనుషుల వ్యక్తిగత వివరాలు తెలియకుండా నాకు తెలిసిన వారు యిలా మరణించినవారు రెండు జంటలున్నాయి. ప్రియురాలు చనిపోయాక కొన్నాళ్ళకు ఆ పురుషుడు చనిపోవడం వొకటి అయితే రెండవది పురుషుడు చనిపోయాక అతని ప్రియురాలు విరక్తితో వొంటరితనంతో ఆత్మహత్య చేసుకోవడం. కారణాలు ఏవైనా .. ఇలాంటి సహజీవనాలలో స్త్రీ ని వొక్కరినే తప్పు పట్టడం భావ్యం కాదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఎవరెవరో అవాకులు చెవాకులు పేలిన మాటలు వింటున్నా బాధేస్తుంది. అప్పుడిలా అనుకుంటాను. స్త్రీలకూ వొక విజ్ఞప్తి మీ చదువులు ఆర్ధిక స్వావలంబనలూ దైర్యాన్ని ఒక్కటే కాదు విజ్ఞతను కూడా యివ్వాలి. ముఖ్యంగా మీరు తల్లిదంద్రులైతే మీరు మరింత బాధ్యతగా ఉండాలని గుర్తెరగాలి తప్ప సమాజానికి సవాల్ విసిరి బ్రతుకుతున్నాం అని గొప్పగా బోర విరుచుకుని నడిచి కడకు అనామకులుగా కడతేరిపోకూడదు. మరో రాజేశ్వరి కాకూడదు అని అనుకోవాలి అని. ఈ విషయం అర్ధమైనా సరే అనుచితంగా కామెంట్స్ చేయకండి ప్లీజ్.. సానుభూతి చూపుతూ కూడా మనం ఆలోచించవచ్చు. పాఠాలు నేర్చుకోవచ్చు అని సున్నితంగా హెచ్చరించాను. అయినా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే వున్నారు. సరే ఒకరి అభిప్రాయాన్ని మనం మార్చలేం. ఎవరి అభిప్రాయం వారిది. గతంలో ఇలాంటి అనుభవంతోనే "జాబిలి హృదయం " కథ వ్రాసాను. ఆసక్తి ఉంటే యీ లింక్ లో చదువుకోవచ్చు. జగతి జగద్ధాత్రి గురించి నా స్పందనను చూసిన మరికొందరు మెసెంజర్ లలో ఫోన్ కాల్స్ లో విపరీతంగా చెప్పుకున్నారు. ఆ విషయం నాకు తెలిసి నవ్వుకున్నాను. మనుషులకు ఎంతసేపు సమాజాన్ని వేలెత్తి చూపించే పని మాత్రం 24*7 కావాలి. సమాజానికి కళ్ళెం వేసి నడిపించడం మావల్ల కావాలి అన్నట్టు వుంటాయి వారి మాటలు. సంస్కృతీ సంప్రదాయం వివాహ వ్యవస్థ అనైతికం అంటూ మూకుమ్మడిగా గళాలు విప్పడం మొదలెడతారు. నేను శుద్ద సంప్రదాయవాదినే. కానీ ఇతరుల జీవితాలను నిర్దేశించాలనో కట్టడిచేయాలనో అనుకోను. వేష భాషలందు ఆధునికంగా వుంటాను. మూఢాచారాలను నిరసిస్తూ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా నిలబడుతూ... స్త్రీ పక్షపాతిగా వుంటూనే పురుషులను సమానంగా గౌరవిస్తాను. ప్రతి వ్యక్తికి వ్యక్తి స్వేచ్ఛ వుంటుంది. ఆ స్వేచ్ఛతో వారు బ్రతకడం వల్ల ఇతరులకు యేమి హాని జరగదు. జరగనంత వరకూ ఎవరి బ్రతుకు వారిని బ్రతకనివ్వాలి తప్ప ముల్లు కర్రతో వెనుక పొడవడం సమంజసంకాదు. జగద్దాత్రి ఆమె వ్యక్తిగత ఆకాంక్షలకు వ్యక్తిస్వేఛ్చకు ప్రతీకగా నిలిచారు. ఆమె నిర్ణయాలకు ఆమె జవాబుదారీ. యిష్టమైనట్టు జీవించడం మరణించడం ఆమె హక్కు. మీ అభిప్రాయం మీకున్నట్లే ఎదుటివారికి వారి అభిప్రాయాలుంటాయి. మీ అభిప్రాయమే సరైనది అనుకుంటూ యితరులను బాధ పెట్టకూడదు. సమాజం మొత్తాన్ని right track పై నడిపించాలనుకునే మితిమీరిన ఆశ నాకు లేదు ఇతరులకు వుండకూడదని భావిస్తాను. మాటల ద్వారా పరోక్ష వ్యాఖ్యానాల ద్వారా ఒక మనిషిని బాధకు గురిచేసేంత కుసంస్కారం వుండకూడదు. అది మరీ పాపం. పాండిత్యం వున్న వాళ్ళు పండితులు జ్ఞానం వున్న వాళ్ళు గురువులు కావచ్చు. కానీ హృదయ సంస్కారం వున్నవాళ్ళు అన్నీ కాగలరు. ఓం శాంతి శాంతి శాంతి. జగద్ధాత్రి గురించి నా స్పందనతో పాటు ఆమె మరణం తర్వాత విన్న వ్యాఖ్యానాలను ఇక్కడ ఉదహరించాను. ఇది నివాళి కాదు. ఆమె పై నా అభిమానం యిలా వుంది, లోకం తీరు యిలా వుంది అని చెప్పడమే నా వుద్దేశ్యం. రామతీర్ధ తో తనకున్న అనుబంధం యేమిటో "ఆ కిటికీ " అనే కవితలో వ్రాసుకున్నారు. అది చదివాక కూడా మనం వారి బంధాన్ని ఆమోదించలేని కుసంస్కారం నెలకొని వుంటే మనం నిత్యం చూస్తున్న అనేకానేక బంధాల బోలుతనాన్నికూడా గర్హించాలి అని నా అభిప్రాయం. ప్రేమమూర్తి జగతి జగద్దాత్రి గురించి ఆమెకు ఎంతో సన్నిహితురాలైన "సాయిపద్మ" వ్రాసిన నివాళి క్రింద క్లిప్పింగ్ లో చూడవచ్చు. జగద్దాత్రి బ్లాగ్ ఈ లింక్ లో .. ఆమె వ్రాసుకున్న వ్రాతలు రచనలు ఇక్కడ కొన్ని చూడవచ్చు. వీరిచే పోస్ట్ చేయబడింది వనజ తాతినేని వద్ద గురువారం, ఆగస్టు 29, 2019 కామెంట్‌లు లేవు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: ముద్ర, untold 25, ఆగస్టు 2019, ఆదివారం ముగింపు వాక్యం నీలాంజన అనే ఫ్రెండ్ ఉంది. నాతోపాటు సంస్థలో పనిచేసేది. బాగా చదువుకుంది ఎందుకో అప్పట్లో వివాహం చేసుకోలేదు యాబై రెండేళ్ళ వయస్సులో వొక రచయితను పెళ్ళి చేసుకుంది. మీ వూరులోనే వుందట.. ఈసారి నేను వచ్చినప్పుడు నన్ను ఆమె యింటికి తీసుకెళ్ళాలి అంది ఉమ ఫోన్ లో మాట్లాడుతూ. "రచయితా, అతని పేరేమిటి ?" ఆసక్తిగా అడిగింది హేమ. "ఏదో పేరు. నోట్లో ఆడుతుంది కానీ బయటకు రావడంలేదు. లెక్చరర్ గా చేసి రిటైర్ అయ్యాడంట. భార్య చనిపోయిన తర్వాత అరవై యెనిమిదేళ్ళ వయస్సులో ఈమెని పెళ్ళి చేసుకున్నాడు" అంది. “ఆమెలా చేసుకుంది అంత వయస్సాయనను. గట్టిగా వున్నన్నాళ్ళు వుండి ఆఖరికి యేదో వొక ఆధారం దొరికితే చాలనుకుని కాటికి కాళ్ళు జాపుకున్న వాడిని చేసుకుంటారు. ఏం బలహీనతో యేమో, వయసు పెరిగే కొద్ది వొంటరిగా బ్రతకలేమన్న భయం ప్రవేశిస్తుందేమో మరి" విసుక్కున్నట్టు అంది హేమ. "నువ్వన్నది నిజమే, ఎమ్ ఏ చేసింది. ఆంగ్లం హిందీ మీద మంచి పట్టున్న మనిషి. మంచి ప్రసంగాలు చేసేది. ఆమె మాట్లాడుతుంటే హాలంతా పిన్ డ్రాప్ సైలెన్స్. ఊపిరి పీల్చుకోకుండా 45 నిమిషాలు, సమయమిస్తే యింకా యింకా మాట్లాడేది. సడన్ గా ఆ రచయితను పెళ్ళి చేసుకుని గృహిణిగా స్థిర పడింది. ఆ పెళ్ళి కూడా బంధువులు కుదిర్చి చేసారంట. తమ్ముళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లల మధ్య బాగానే ఉండేది. తర్వాతెందుకోవుండలేకపోయింది. ఒకసారి వెళ్లి చూసి రావాలి నువ్వు తీసుకెళ్ళాలి తప్పదు అంది. "ముందు నువ్వు నీ కొలువుకి సెలవులిచ్చి రావమ్మా, కనీసం పది రోజులైనా వుండాలిక్కడ, లేకపోతే వూరుకోను" అంది హేమ. ***************** "సరేలే .. నీ వుద్యోగం ఎలా వుంది?. బాగానే సంపాదిస్తున్నావ్. బరువులు తగ్గాయి. ఇక పెళ్ళి చేసుకోరాదు ఈ రోజుల్లో అమ్మాయిలకు భలే డిమాండ్ వుందిలే. అదే అబ్బాయిలైతే ముప్పై దాటితే పెళ్లవడం కష్టంగా ఉంది" అంది హేమ "సుఖంగా వున్న ప్రాణానికి పెళ్ళి ఆలోచన యెందుకులే ? ఇప్పుడీ వయసులో చేసుకుని సాధించేదేముంది చెప్పు? చేసుకోదల్చుకుంటే సంస్థలో మాతోపాటు పనిచేసేవాళ్ళనే చేసుకుంటాను. ఆలోచనా విధానం దగ్గరగా వుంటుంది. కాస్త సేవ చేసేందుకు అనుమతి వుంటుంది." "అయితే ఆలోచనలు కలిస్తేనే పెళ్ళి చేసుకుంటానంటావ్," "ఎక్కడో అయినవాళ్ళకు దూరంగా మెయిడ్ గా పనిచేసే బదులు మంచి స్థితిపరులైన రెండో సంబంధం వాడిని చేసుకుని సుఖపడటం నేర్చుకో అని అమ్మ గొడవ పెడుతుంది. రెండు మూడు సంబంధాలున్నాయి కూడా. నా మనస్తత్వం నాకు తెలుసు ఆలోచనలకు ముల్లు గుచ్చుకుంటే పోట్లాడతాను. అదే మనసుకు గుచ్చుకుంటే నొచ్చుకుని దూరంగా జరుగుతాను. ముడుచుకుని ఒంటరినై పోతాను. నాలాంటి వాళ్లకి పెళ్ళి అవసరమా ?" "నీకవసరం లేదేమో కానీ లోకానికి అవసరం. రెండో పెళ్ళి చేసుకునే పురుషుల క్యూ చెంతాడంత వుంటుంది. పాపం వాళ్ళ పై జాలి చూపిస్తావని చెపుతున్నా" అని కొంటెగా అంది హేమ "మరీ చిన్నపిల్లవైపోతున్నావ్" అంటూ హేమ వీపుపై గట్టిగా చరిచింది. "ఆడదానికి పెళ్ళి అనే వల పడటానికి వయసుతో పనేమీ లేదులే. 80 యేళ్ళు వచ్చాక కూడా పెళ్ళి సంబంధాలు వస్తాయి. అంత డిమాండ్ వుంది, దిగులు పడకు" అంది హేమ మళ్ళీ కొంటెగా . ఉమకి ఆ మాటల్లో లోతు అర్ధమై ఆపకుండా నవ్వింది. "ఇలాగే నవ్వు. నీ నవ్వు చూసి ఎవరో వొక బాలా కుమారుడు యేదో వొకనాడు నిన్నెత్తుకుపోయి తన వంటగదికి పట్టమహిషిని పడక గదికి వేశ్యను చేస్తానంటాడు చూడు" అంది హేమ. "ఆ ఊబి లో నేనెప్పుడూ పడనులే కానీ , వొకసారి నీలాంజన దగ్గరకు వెళ్ళి వద్దాం ప్లీజ్ ప్లీజ్ .. ." "ఎందుకు తన అనుభవాలు చెపుతుందని, తెలుసుకోవాలనే ఆసక్తి కదూ నీకు. మొత్తానికి గ్రౌండ్ వర్క్ బాగానే చేస్తున్నావ్ అయితే త్వరలో పప్పన్నం పెడతావ్" అంది. "అదేమీ కాదులే చాలా సంవత్సరాలైంది చూసి. మంచి మనిషి. వెళ్ళాలి తప్పదు" అభ్యర్ధనగా చూసింది ఉమ.. తను తెచ్చిన నీలాంజన నెంబర్ కు ఫోన్ చేస్తే గుర్తుపట్టి సంతోషంగా మాట్లడింది. ఇంటికి రమ్మని ఆహ్వానించి పదేళ్ళకి పైగానే అయిందిగా నన్ను చూసి గుర్తు పడతావో లేదో నాకు శరీరమంతా సొరియాసిస్ వచ్చింది అని చెప్పింది. "అయ్యో అలాగా" అని ఊరుకుంది ఉమ నాలుగు రోజుల తర్వాత వీలు చూసుకుని నీలాంజన చెప్పిన అడ్రెస్స్ కి చేరుకొని కాల్ చేస్తే మూడు రోజులనుండి హాస్పిటల్ లో ఉన్నాం. భర్తకి బాగోకపోతే హాస్పిటల్ లో జాయిన్ చేసాను అని చెప్పింది. హాస్పిటల్ వివరాలు తెలుసుకుని యిద్దరూ అక్కడికి వెళ్ళారు.అతను ఐ సి యూ లో వుంటే ఆమె కారిడార్ లో పడిగాపులు పడుతూ కనిపించింది. "ఎలా ఉండేవారు నీలాంజన. మిమ్మల్నిలా చూస్తానని యెన్నడూ అనుకోలేదు" అంది ఆమెని సానుభూతిగా చూస్తూ. "రెండేళ్ళ నుండే ఇలా మొదలైంది'' అంది విచారంగా. విపరీతమైన మానసిక వొత్తిడి వుంటేకూడా సోరియాసిస్ వస్తుందని డాక్టర్స్ చెపుతుంటే వింది హేమ. ఆమె కూడా ఆ జాబితాలో మనిషని గ్రహించేసింది. "మీరు కష్టంలో వున్నారు. రాకూడని పరిస్తితుల్లో వచ్చినట్టున్నాము క్షమించండి" అంది హేమ. "పర్లేదండీ అభిమానం ఉండబట్టేగా వెతుక్కుని మరీ వచ్చారు. ఉమ కూడా యెక్కువ రోజులు ఉండటానికి వీలవుతుందో లేదోనని రమ్మన్నాను". "మీ వారి వయస్సు మరీ అంత మీద పడలేదు ఇంకొంత కాలం జీవిస్తే మంచి సాహిత్యం వస్తుందేమో ఆయన కలం నుండి" అంది. "ఒకపుడు మీలాగానే నేను భ్రమపడినదాన్నేనీళ్ళ గురించో ఆడదాని కన్నీళ్ళ గురించో పన్నీరు గురించో ఆకట్టుకునే కథలు వ్రాయగలరు కానీ భార్యను బాధించని వాళ్లుంటారా” అంది నిర్లిప్తతంగా. గాలి జొరబడని హాస్పిటల్ కారిడార్ లో వరుస కుర్చీలలో కూర్చుని తన మనసు ఉక్కపోతని స్నేహితురాలు ఉమ ముందు దూసిపోసింది నీలాంజన. "రెండో పెళ్ళి చేసుకునే పురుషుడు చెప్పే అతిశయాల ముందు.. సినిమా పాటల్లో ప్రేమికుడు పాడే అతిశయాలు కూడా పనికిరావనుకో.". హేమకు ఆమాట వింటుంటే ప్రియా ప్రియా చంపొద్దె అనే పాట గుర్తుకొచ్చి పెదవులపై నవ్వులు విరబూసాయి. నీలాంజన చెప్పుకుపోతుంది అలాంటి మాటలకు కళ్ళు మూసుకుపోయి తమకి తాము అన్యాయం చేసుకుంటున్నారు ఆడవాళ్ళూ. ఈయన విషయానికే వస్తే రచనలు ఆదర్శంగా ఉంటాయి కదా, మనిషి కూడా అలాగే ఉంటాడనుకున్నా, మొదటి పరిచయం గుడిలో. నా అవివాహ జీవితాన్ని గురించి మాట్లాడి జీవితాన్ని పండ బెట్టుకోవాలి కానీ యెండ బెట్టుకోకూడదు అని చెప్పాడు. నీ సంపాదనకు అలవాటు పడ్డ మీ వాళ్ళు పెళ్ళి చేసే ఆలోచన వున్నట్టు లేదు. నువ్వు బిడియాలను వొడకట్టేయాలి. కావాల్సినదానికొరకు పెదవి విప్పాలి అని ఉద్బోధ చేసాడు. తరచి చూసుకుంటే కొన్ని మాటలు సత్యానికి దగ్గరగా అవును కదా అనిపింపజేసాయి. ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాను. నిలువునా పూచిన కొమ్మనై అతని దరి చేరాను. అతనేమో తన శృంగార యజ్ఞంలో నేనొక సమిధను అనుకునేవాడు. అతను నాకు గొడుగయ్యాడు అనుకున్నా . ఆయనేమో నాకు పైటయ్యాను అనుకునేవాడు. ఇంకా తానొక దీనజన బంధువును అనికూడా చెప్పుకునేవాడు. వివాహానికి పూర్వం గుండెల్లో పెట్టుకుని దేవతలా పూజించుకుంటాను అని వాగ్ధానం చేస్తారు కానీ నరకంలో దేవతలుండలేరు అని పురుషులు యెప్పటికి తెలుసుకోలేరు" అంది ఆవేదనగా. మనిషికి అణువణువునా అహంకారమే.. ఏ పని స్వతంత్రంగా చేయడానికి వీలులేదు. ఏ చిన్న పని చేయబోయినా నిన్నెవడూ చేయమన్నాడు అనడం పరిపాటి. అతను తాగకుండా కాఫీ తాగడాన్ని కూడా తప్పు పట్టేవాడు. రెండుపూటలా కూరేమి చేయమంటారు అని అడిగి చేయాలి. అతను సంతృప్తిగా తిని చేయికడిగాక తుడుచుకోవడానికి నాప్కిన్ అందించి వక్కపలుకులు అందించాక కానీ భోజనానికి కూర్చోకూడదు. కంచాలు కంచాలు లాగిస్తూ కూర్చోకుండా.. త్వరగా రా, కాళ్ళు పట్టాలి అనేవాడు. వింటున్న హేమ ముఖం చిట్లించింది. ఉమ యింకా చెప్పమన్నట్టు ఉత్సాహంగా చూసింది పెళ్ళి చేసుకుని నాలుగేళ్ళైనా తన పెన్షన్ వివరాలలో నామిని కాలమ్ లో భార్యగా నా పేరు వ్రాయించడానికి యేవో కుంటి సాకులు చెప్పేవాడు. అడిగినవారికి అడగనివారందరికీ ఈ వయస్సులో పెళ్ళి చేసుకోవడానికి పెద్ద కారణమేమిలేదు. ఒక అభాగ్యురాలికి నీడనిచ్చి నా తర్వాత కూడా కాస్త డబ్బులొచ్చే యేర్పాటు చేద్దామని యిలా చేసాను అనేవాడు. ఈ వయసులో నాకు పెద్ద కోరికలేమి వుంటాయ్, అన్నీ ఆమెతోనే కడతేరి పోయాయి అనేవాడు కాస్త వైరాగ్యం నటిస్తూ. అతని అభ్యుదయపు కబుర్లు విని “విన్నావు కదమ్మా, ఆయన్ని బాగా చూసుకో పిల్లాజెల్లా కూడా లేరు మనసులో మాట చెప్పుకోవడానికి నాలుగురోజులుండి రావడానికి” అని అనేవారు ఆ వచ్చినవాళ్ళు. నేనే ఆఫీస్ చుట్టూ తిరిగి వివరాలిచ్చి నామిని పేరుగా ఎంటర్ చేసుకుని వస్తే నీకు అన్ని తెలుసే. బాగానే పనులు చేయించుకోవడం తెలుసు. లంచంగా యేమిచ్చావ్ ముద్దా కౌగిలా.. అని అసహ్యంగా మాట్లాడేవాడు. తరచూ నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కనివ్వను నీకు, అనాధశరణాలయానికి రాసేస్తాను అనేవాడు. రచయితలు కూడా ఇలాగ వుంటారా అని ఆశ్చర్యపోయేదాన్ని అని వాపోయింది నీలాంజన. "రచయితల్లోనే పైత్యం ఎక్కువ కనబడుతుందిపుడు. సంప్రదింపు మార్గాలు సులువయ్యాక ఓ రాయేసి చూద్దాం అనుకోవడం మొదలెట్టారు. నా అనుభవంలోకి వచ్చిన ఇద్దరు ముగ్గురు గురించి చెపుతాను వినండి".. "పత్రికలో వచ్చిన కథ బాగుంది అంటూ వొకతను ఫోన్ చేసాడు. అతను కూడా వొక రచయిత అంట. బోలెడంత లిస్ట్ చెప్పాడు. అందులో నేను చదివినవీ వున్నాయి. అందుకనే అపుడు కాస్త యెక్కువగా మట్లాడాల్సివచ్చింది. కొన్నాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసాడు కథల గురించే అన్నాడు. వ్యక్తిగత వివరాలు అడిగాడు. విడో ని అని పిల్లలు దూరదేశాల్లో వున్నారని చెప్పాను. దాచుకోవాల్సింది వుందని తర్వాత తెలిసింది. మళ్ళీ కొన్నాళ్ళకు ఫోన్ చేసి విడోవర్ అని.. మీకు అభ్యంతరం లేకుంటే వొక విషయం అడుగుతాను అన్నాడు కాస్త సంస్కారంగా. అడగండీ అనగానే మిమ్మలను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. కోపం తన్నుకొచ్చింది. వాడికి నా వాసం గ్రాసం గురించి యేమైనా చెప్పానా? ఎంత దైర్యం? తమాయించుకుని క్షమించండి నాకలాంటి ఆలోచన లేదు అని సున్నితంగా ఫోన్ పెట్టేసాను. వాడు తర్వాత కూడా ఫోన్ చేస్తూనే వున్నాడు. బ్లాక్ లిస్ట్ లో పెట్టేసా." "అలాగే ఇంకొకతను పేరు చెప్పనులే, గవర్నమెంట్ సర్వీస్ లో వున్నాడు. సాహితీ ప్రియుడైతే మనసారా అభినందిచకమానం. కానీ ఆ ముసుగేసుకుని వేటాడేరకం. ఏదో వొక సాహిత్యకార్యక్రమంలో చూసి వివరాలు సేకరించాడు. మిమ్మలను చదివాను. ఓ పిల్ల తెమ్మెర తాకితే చాలు మీ చూపులను గుర్తుకు తెచ్చింది అంటూ పైత్యం వెళ్ళగక్కాడు. కవి కదా మరి. మరొకరోజు మన వేవ్ లెంగ్త్స్ కలుస్తున్నాయి. మిమ్మలను చూసే కొలది నాకేదో Spirit inject అవుతుంది. నా జీవితకాలమంతా వెతుకుతున్నా యిటువంటి వ్యక్తికోసం. మీరు ఊ అంటే ప్లాట్ కారు అన్నీ యేర్పాటు చేస్తాను. మనసైనపుడు కలుస్తూవుంటాను అని రహస్య నెంబరు నుండి మెసేజ్ పెట్టాడు. అసహ్యమేసింది. ఇలా మీ యేర్పాటులలో మీరుంటే మీ భార్య తనకు వేవ్ లెంగ్త్స్ కలిసే వాళ్ళ కోసం వెతుక్కోవచ్చు జాగ్రత్తండీ.. అన్నాను. ఈ చిత్తకార్తె కుక్కల సొంగలు ఫోన్ ద్వారా యిలా కారుతూ వుంటాయి. ఆడది వొంటరిగా వుంటుందని తెలిస్తే చాలు పడకగదికో వంటగదితో పనికొస్తుందని చిత్తచాపల్యమో నాలుక చాపల్యమో గుర్తుకొస్తాయి యిలాంటివాళ్ళకు" అని కసి తీరా తిట్టింది హేమ . కాసేపు మౌనం రాజ్యమేలింది. చెవి ప్రక్కన తలానించి చిన్నగా ఇలా జరిగిందని నాకెప్పుడూ చెప్పలేదే? అంది ఉమ. "నువ్వు మంచి మనిషివి అనిపించలేదు అందుకే చెప్పలేదు" అంది హేమ నవ్వుతూ వాతావరణాన్ని తేలిక చేయాలని. మళ్ళీ కొనసాగిస్తూ ...ఇంకొకరి అనుభవం కూడా చెపుతున్నా వినండి. ఆమె తొలిమలిగా కథలు వ్రాస్తున్నరోజులు. ఆమె వ్రాసిన కథకు మంచి పేరు వచ్చింది. ఒక సాహిత్య భాంధవుడు ఆమెను కలిసి మట్లాడాడు. మీరేదో వార్షిక కథల సంకలనాలు వేస్తారటగా. అందులో నేను వ్రాసిన కథ వేయడానికి అవకాశం వుంటుందా అని అడిగిందట. అప్పటికి అతను నవ్వి వూరుకున్నాడు. మర్నాడు ఆమె పని చేస్తున్న ఆఫీస్ నెంబర్ కి ఫోన్ చేసి .. నీ కథను తీసుకుని డిన్నర్ కు రా ... మంచి చెడ్డా మాట్లాడుకుందాం అన్నాడట. ఇదేమిటి ఇలా అంటున్నాడు. కనీసం ఫ్యామిలీతో కలిసి రా అని అనకుండా వొంటరిగా రమ్మంటాడేమిటీ కథను గురించి నాతో చర్చించేది ఏముంటుంది.. అ కథపై అప్పటికే వేదికలపై బోలెడంత చర్చ జరిగింది అనుకుని అనేక అనుమానాలతో వెళ్ళకుండా వుండిపోయింది. అప్పుడే కాదు తర్వాతెప్పుడూ కూడా ఆమె కథ ఆ సంకలనాలలో రాలేదు అని చెప్పింది. అంతలో "పిన్నీ.. ఏవో మెడిసన్ కావాలి అంటున్నారు. వెళ్ళి పట్టుకొస్తాను" అంటూ వచ్చింది వొక యువతి. నీలాంజన హ్యాండ్బేగ్ తెరిచి కొంత డబ్బు ఆమెకి యివ్వబోయింది. భలేదానివి పిన్నీ! ఈ మాత్రం నేను ఖర్చు పెట్టకూడదా? నువ్వు తొందరపడి నగలు అమ్మేసి డబ్బులు తెచ్చావు. ఆయన అదృష్టం అది. జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన మీరిద్దరూ కూడా కర్పూరంలా కరిగిపోయే గుణం వున్నవారు” అని లి్ప్ట్ వైపు అడుగులు వేసింది. "అదేంటి? మీ వొంటి మీద బంగారం అమ్మేసారా? "ఆశ్చర్యపోయింది ఉమ. "మరి ఏం చేయను. ఎటిఎమ్ కార్డ్ కనబడుతున్నా ఏమీ చేయలేకపోయాను పిన్ నెంబర్ కూడా తెలియదు".. అంది నిస్సహాయంగా.. "ఎవరామె, ఏమవుతుంది మీకు? మళ్ళీ ఉమ ఆరా. "పెంపుడు కూతురు. మొదటి భార్య చెల్లెలి కూతురు. బెంగుళూరులో వుంటుంది. వుద్యోగానికి సెలవు పెట్టి వచ్చింది. మా పెద్దమ్మను కూడా క్షణక్షణం యిలాగే సాధించి పెట్టేవాడు. పుణ్యాత్మురాలు జబ్బు చేసి యీ బాధలనుండి విముక్తి పొందింది అంటుంది యెపుడూ." అసలేం జరిగిందంటే పది రోజుల కిందట బేగ్ కి బట్టలు సర్దుకుని వెళ్ళిపోయాడు. అభిమాని నడుపుతున్న వృద్ధాశ్రమంలో ప్రశాంతంగా బ్రతుకుతానని. వేసుకునే మందులు కూడా చేతిలో పెడితే కాని మింగని ఆయనకు వేడి వేడిగా రుచికరంగా యెవరొండి పెడతారక్కడ? గంట మోగినపుడు వెళ్ళి కూర్చుని తినిరావడం సౌకర్యాలు లేకపోవడం చూసి విసుక్కుంటుంటే యిక్కడ యిలాగే వుంటాయ్. మీకిష్టమైతే వుండండి లేకపోతే దయచేయండి అన్నాడట ఆ శిష్యుడు కమ్ అభిమాని. వెంటనే పెట్టె సర్దుకుని వచ్చేసాడు. నేను వివరాలేమీ అడక్కుండా మాములుగానే వేణ్ణీళ్ళు పెట్టి స్నానం చేస్తుంటే ఒళ్ళు రుద్ది.. గబగబా వంట చేసి వడ్డించాను. తిని త్రేపుతూ అక్కడిలా జరిగింది అని చెప్పి.. మళ్ళీ నీ పాపిష్టి చేతి కూడు తినాలని నాకు రాసి పెట్టి వుంది. అందుకే వచ్చానన్నాడు. పన్నెండేళ్ళలో యెన్నడూ యెదురుమాటాడని యెప్పుడూ వొక మాట కూడా అనని నేను కడుపు మండి “మరి యెందుకు వచ్చారు? ఆ బేరేజీ యెక్కి కృష్ణలో దూకేపని కదా” అన్నాను. నావైపు క్రోధంగా చూసి వేలు చూపిస్తూ “నువ్వెవరవే నన్నుచావమని చెప్పడానికి ? చెప్పడానికి కూడా అర్హత వుండాలి అది తెలుసుకో ముందు " అని అంటూ చొక్కా తొడుక్కుని కిందకి వెళ్ళారు. కాసేపటి తర్వాత వచ్చి పడుకున్నారు. నేను పుస్తకం చదువుకుంటూ హాలులో పడుకున్నాను. ఓ గంట గంటన్నర తర్వాత మందులిద్దామని గదిలోకి వెళితే నురగలు క్రక్కుతూ కనబడితే కంగారు పడి అంబులెన్స్ కు ఫోన్ చేసాను. ప్రక్కనే కొత్త నిద్రమాత్రల సీసా ఖాళీగా కనబడింది. ఆయన తమ్ముళ్ళకు ఫోన్ఆ చేసాను. ఆత్మహత్యా ప్రయత్నం చేసాడని చెప్పుకుంటే మనకే నగుబాటు అలా అని చెప్పకు. ఊపిరి అందడంలేదు అని చెప్పు. వెనక ముందు మేము వస్తాం అన్నారే కానీ వొక్క తమ్ముడూ రాలేదు. మరొకసారి ఫోన్ చేస్తే ఆయనేమన్నా తక్కువాడా! పిల్లల్లేరు ఆస్తిలో భాగం యెందుకు, చిన్నాచితకవాళ్ళం, మా పిల్లలకు వుంటుంది అంటే విని వుదారం చూపాడా? పైగా నా వాటా వాళ్ళకెందుకివ్వాలని అసహ్యంగా మాటలు జారిన అహంకారి. ఎలాగూ పోతే రావాలిగా, అప్పటికి వస్తాంలే అన్నారు. “పురుషులందు రచయిత పురుషులు వేరు కాదయా. అందరూ ఆ దుంపలో వాళ్ళే! కాకపోతే కొంతమంది మరీ దురద దుంప లాంటి వారు ఈయన లాగా” అంది హేమ. ”కట్టుకున్న వాడు ఎలాంటి వాడనేది కాదు, మగవాడితో ముడిపడిన ప్రతి ఆడదాని కథ కంచి కెళ్ళని కథే కదా.. కాటికెళ్ళేదాకా వాడి చుట్టూరే తిరుగుతూ వుంటుంది” నిర్వేదంగా అంది నీలాంజన. ఉమను ఎలాగోలా పెళ్ళికి ఒప్పించమని వాళ్ళమ్మ చెప్పిన విషయాన్నియింతటితో మర్చిపోవాలనుకుంది హేమ ఆ సాయంత్రానికి నలుగురు డాక్టర్ల మూడు రోజుల విశ్వప్రయత్నం తర్వాత అతనిప్పుడు సేఫ్. మీరెళ్ళి చూడొచ్చు అన్న డాక్టర్ మాట నీలాంజన కళ్ళలో వెలుగురేఖను గీసింది. నీలాంజన భర్తను చూడటానికి వెళ్ళబోతుంటే నువ్వు కూడా వెళ్ళు అని ఉమ వైపు చూసి సైగ చేసింది హేమ. "ఇలాంటి దుర్మార్గుడిని చూడాటానికి అసహ్యమేస్తుంది. నేను వెళ్ళను కానీ నువ్వెళ్ళు" అంది ఉమ గుస గుసగా . వడి వడిగా నడిచి నీలాంజనతో పాటు హేమ కూడా లోపలకి వెళ్ళింది. కళ్ళు మూసుకునే వున్నాడు ఆమె భర్త. నీలాంజన అతని చేతిమీద అరచేతిని ఆన్చి నెమ్మదిగా కదిపింది. అతను కళ్ళు తెరచి ఎదురుగా వున్న ఆమెని చూడగానే . "... డా, నన్నెందుకు బతికించావే హాయిగా చావనీయకుండా, నీ చేతి పాపిష్టి కూడు తినడానికా" అన్నాడు క్రోధంగా. సెలైన్ పెట్టబోతున్న నర్స్ బాటిల్ వదిలేసి గిరుక్కున తిరిగి ఆమె వైపు చూసింది. ఆక్రోశంతో ఒకవిధమైన కీచు గొంతుతో ఆమె అరిచిన అరుపు ధబ్ మన్నసెలైన్ బాటిల్ శబ్దంతో పాటు కలిసిపోయింది. తర్వాత ముఖాన చేతులుంచుకుని గట్టిగా యేడుస్తూ గోడని ఆసరాగా చేసుకుంది నీలాంజన. “కొన్ని భావ ప్రకటనలను రికార్డ్ చేయడానికి భాష సరిపోదు” బాధగా అనుకుంది హేమ. *********0******** వీరిచే పోస్ట్ చేయబడింది వనజ తాతినేని వద్ద ఆదివారం, ఆగస్టు 25, 2019 కామెంట్‌లు లేవు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: కథ, తిరిగొచ్చిన కథలు, తెలుగు కథ, నీలాంజన, రచనలు, వనజవనమాలికథలు, untold, VanajaTatineniTeluguStories 24, ఆగస్టు 2019, శనివారం రోజు వారి ఆలోచనలు కొన్ని... రోజు వారి ఆలోచనలు కొన్ని... వచ్చే పండగ కోసం సరిగా నిద్రపోని గత రాత్రి ఇవాళ త్వరగా పడకేసింది అలసిన కనురెప్పలపై మస్కారాలా పూసుకున్న సంతోషాన్ని తుడవకుండానే. **** వాన వాసన వాన శబ్దం యెరిగి వుండటానికి ఓ ఏడాది వయసు చాలునేమో బిడ్డకు తలపులవానలో తడిసి ఆరడమంటే యేమిటో మీద పడుతున్న ముదిమిలో కూడా తెలియకపోవడమన్న దురదృష్టం ఇంకొకటి లేదు మనిషికి. ****** లిఫ్ట్ లో నుండి ఘాటైన పరిమళం ఏ అదుపు ఆజ్ఞ లేకుండా వంటింటిదాకా జొచ్చుకుని వచ్చినట్టు మనుషులు రాలేరు కదా.. గుండెలో అడుగుల సడి ముద్రింపబడితే తప్ప. ****** దేహంపై యవ్వనం చిగురులు తొడుగుతుంది ఏ చినుకుకూ తడవకుండానే. రాలే కాలానికి జడివానక్కూడా యెన్నిమార్లు తడిసినా రానేరాదు పాపం! 23/08/2019. 11:10 PM. వీరిచే పోస్ట్ చేయబడింది వనజ తాతినేని వద్ద శనివారం, ఆగస్టు 24, 2019 కామెంట్‌లు లేవు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: కవిత్వవనంలో నేను 23, ఆగస్టు 2019, శుక్రవారం వెలుగు పూలతో వీరిచే పోస్ట్ చేయబడింది వనజ తాతినేని వద్ద శుక్రవారం, ఆగస్టు 23, 2019 కామెంట్‌లు లేవు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: అభిరుచి, భక్తి కెరటం 21, ఆగస్టు 2019, బుధవారం కొత్త బాటలో నేను నేను రచయితను. నా ఆత్మ స్థైర్యాన్ని యెవరూ దెబ్బతీయలేరు. ఒక పత్రిక వారి నుండి ఏడు కథలు తిరిగివచ్చాక కూడా నేను రచనలు చేయకూడదు అని అనుకోను.. ఈ మాటలు వెనుక ... చాలా వుంది. అది యేమిటంటే...తిరిగివచ్చిన ఏడవ కథ గురించి చిన్న వివరణ.. రచయితల పాత్రలతో కథలు రాస్తే పత్రికలు యెందుకని ప్రచురించవు? రచయితలు అందరూ కథలలో నెగెటివ్ పాత్రలు కాదగని వుత్తమోత్తమలు అయిపోతారా? నీరు గురించి పన్నీరు గురించి కన్నీరు గురించి కరుణ రసాత్మక కథలు రాసి పాఠకలోకంలో ఆహా ఓహో అనిపించుకున్న రచయితల ముసుగులో గోముఖ వ్యాఘ్రాలు వున్నాయని యెందరికి తెలుసు. ఏం రచయితలు ఆకాశం నుండి వూడిపడ్డారా..? మాములు మనుషుల్లాగానే వారిలోని నెగెటివ్ అంశాలు గురించి ఇంకా అనేకమంది రచయితల వాచాలత గురించి రచయితలు పెట్టే గృహహింస గురించి కథలు వ్రాయకూడదా... అవి సామాజిక ఇతివృత్తాలు కాదా? నాకు సందేహాలున్నాయి. పత్రికల ఎడిటర్స్ కొంతమంది కథలను ప్రచురించడంలో అతిప్రేమ కొంతమంది రచనలను తిరస్కరించడంలో అత్యుత్సాహం .. ఏమిటీ వైపరీత్యం. ఒక పత్రిక ఒక రచయిత వ్రాసిన కథలను పదే పదే తిప్పి పంపడం.. యెందుచేత? ఆ పత్రికకు ఏడు కథలు పంపితే .. కథలన్నీ తిప్పి పంపితే ఆ కథలలో నాలుగు కథలు వేరొక పత్రికల్లో ప్రచురింపబడితే.. దానికి అర్దం యేమిటి? కాస్త బాగానే ఆ రచయిత వ్రాస్తున్నట్లు అర్దమే కదా! వేరు వేరు ఒంకలు చెప్పి.. కథలు తిప్పి పంపడంలో ఔచిత్యం వారికే తెలియాలి. వారికి యిష్టమైతే పర్సనల్ మెయిల్ ఐడి ద్వారా వెళ్ళిన కథలు.. కేవలం పదిహేను రోజులలో పత్రికలలో ప్రచురితం. ఇష్టం లేని వారి రచనలు సంవత్సరం అయినా డస్ట్బిన్ పరం. ఈ పత్రికల వారి తీరు గర్హనీయం. రచయితలు గొంతు విప్పాలి. రచయితలకు కనీస గౌరవం యివ్వకుండా నిర్లక్ష్యధోరణి ప్రదర్శించడం మానుకోవాలి. రచయితలూ స్పందించండి.. ఈ సాహిత్య రాజకీయాలను ఖండించండి. పత్రికలకు చందాలు కట్టడం ఆపేయండి. ఇష్టానుసారంగా ప్రచురించుకునే రచనలు చదవాల్సిన అవసరం లేదు. పట్టుకుని వేలాడాల్సిన పని లేదు. వేదికలు మనమే సృష్టించుకోగలం. .. — feeling positive. అందుకే ..ఈ నిర్ణయం ..పత్రికలు తిప్పి పంపిన కథలను యిక్కడ ప్రచురిస్తాను. వర్షం కురుస్తున్న రోజు తెరల వెనుక నిలబడి.. అబ్బ .. ప్రకృతి యెంత ఆహ్లాదంగా వుంది వాన ఆగినాక వచ్చే ఎండ మధ్య విరిసిన ఇంద్రధనస్సు యెంత బాగుంది అనుకుంటూ ఆహ్లాదపడిపోతుంటాం. ఆ వర్షం కురిసిన రోజు బీదాబిక్కి కట్టుబట్టలతో రోడ్డునపడి తలదాచుకోవడానికి చిన్న నీడ లేక ఆకలికి తాళలేక చావు రాక నిస్సహాయ స్థితిలో బ్రతకాల్సి రావడమనేది పాపమో శాపమో ... తెరలు తీసి అదే మనసు తెరలు తీసి చూడలేని మనుషులకు అర్ధం కాదు.అదిగో అలాంటి స్థితిలో వున్న వాళ్ళ ఆక్రోశాన్ని ఆవేదనను వెల్లడించే కథలు. అవి నీటి కథలు, కన్నీటి కథలు, పొడారిన బతుకు కథలు మధ్యతరగతి స్త్రీల మందహాస కథలు. మొత్తం 12 కథలు వున్నాయి. ఇక్కడే ప్రచురిస్తాను ... ముగింపు మాత్రం ఇవ్వను .. పుస్తక రూపంలో వచ్చాక ముగింపు చదువుకోవాల్సిందే మరి. Beyond the blinds.. శీర్షికన ... ప్రతి ఆదివారం ఒక కథ .. 25/08/2019 న ... మొదటి కథ .... "ముగింపు వాక్యం " తో ..మొదలు ... tagవర్షం కురుస్తున్న రోజు తెరల వెనుక నిలబడి.. అబ్బ .. ప్రకృతి యెంత ఆహ్లాదంగా వుంది వాన ఆగినాక వచ్చే ఎండ మధ్య విరిసిన ఇంద్రధనస్సు యెంత బాగుంది అనుకుంటూ ఆహ్లాదపడిపోతుంటాం. ఆ వర్షం కురిసిన రోజు బీదాబిక్కి కట్టుబట్టలతో రోడ్డునపడి తలదాచుకోవడానికి చిన్న నీడ లేక ఆకలికి తాళలేక చావు రాక నిస్సహాయ స్థితిలో బ్రతకాల్సి రావడమనేది పాపమో శాపమో ... తెరలు తీసి అదే మనసు తెరలు తీసి చూడలేని మనుషులకు అర్ధం కా వీరిచే పోస్ట్ చేయబడింది వనజ తాతినేని వద్ద బుధవారం, ఆగస్టు 21, 2019 కామెంట్‌లు లేవు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: అంతరంగమాలిక, untold 20, ఆగస్టు 2019, మంగళవారం మాట ప్రియం .. మాటే ... దేనికైనా మూలం. తీయని పలుకుల మధ్య నిండుకుండ విషం కూడా కప్పెట్టేయవచ్చు. అసలు మనుషుల మధ్య మాట లేకపోతేనే కష్టం . గల గల మాట్లాడే వారు హఠాత్తుగా మౌనం వహిస్తే బెంగ . ఆ మాటకి మౌనం తాళం ఎందుకయిందో తెలిస్తే ..మనసుకి బాధ. మనుషుల వైఖరిపట్ల విముఖత. మౌనాన్నే ఆభరణంగా ధరిస్తే బావుంటుంది కదా ..అని ఆలోచన . వ్రాత పాతదే .. ఆ మాట గురించి వొక కథ వ్రాస్తే ... ప్రచురణ కోసం యెదురుచూసి యెదురుచూసి వొక ఉదాసీనత అలముకున్నాక యేదో వొకనాడు మధ్యాహ్నం పూట గాఢమైన నిద్రలో వుండగా ఫోన్ కాల్ ద్వారా లేపి మరీ చెపితే ఆ భావాతీతమైన క్షణాన్ని అక్షరాలలో వర్ణించడం అంత సులువుకాదు. సంతోషమో విచారమో ..యేదో తెలియని స్థితి .. సరే ..మొన్న ఆదివారం ప్రచురింపబడింది .. "మాటల దారం " కాస్త చదవడానికి ప్రయత్నించండి. వేలిముద్రలు వ్యాఖ్యలు అభిప్రాయాలు చెప్పకపోయినా పర్లేదు .. :) ఈ కథ వెనుక కథ .. నేను గత సంవత్సరం USA వెళ్ళినప్పుడు మా ఇంట్లో వాళ్ళు మా బంధువులు ఫ్రెండ్స్ కాకుండా.. నేను ఇతరులతో మాట్లాడిన మాటలు.. మా అబ్బాయి ఇంటిప్రక్కనున్న పొరుగు మనిషి .. హాయ్ అని పలకరిస్తే మళ్ళీ తిరిగి విష్ చేసాను. ఒకరోజు బయటకు వెళుతుంటే ఒక బాలుడు కనబడ్డాడు. అయిదారేళ్ళు ఉండవచ్చు. ఆ పిల్లాడిని చూసి ..ఈ పిల్లాడు మన తెలుగు వాళ్ళబ్బాయి లాగా వున్నాడు అని మా కోడలితో అన్నాను. అ పిల్లవాడు ముందుకు నడుస్తున్నవాడల్లా ఆగి వెనక్కి తిరిగి చూసి "వ్వాట్ " అన్నాడు. నేను "నథింగ్" అని చెప్పి నవ్వుకున్నాను.మా అబ్బాయి ఇంటి చుట్టుప్రక్కల చాలామంది మన ఆంధ్రులు ఉండేవారు. కానీ ఎవరూ ఎవరితో మాట్లాడరు. చుట్టుప్రక్కల ఎవరెవరు వున్నారా, యేమిటీ అని అన్నీ గమనిస్తారు కానీ తెలియనట్లు నటిస్తారు. అమెరికా వాళ్ళలా ప్రవర్తిస్తారు. అవసరం లేకపోతే మాట్లాడరు. ఆరు నెలల కాలంలో నేను ఇతరులతో మాట్లాడిన మాటలు ఆ రెండే. షాపింగ్ కి వెళితే అక్కడ స్టాఫ్ పలకరించేవాళ్ళు హాయ్ అంటే ఒక మాట అది తక్కువ హౌ ఆర్ యూ అంటే ఇంకో మాట ఎక్కువైన మాట. ఇంతే ! మనుషులతో మాట్లాడకుండా మూగవాళ్ళలా చిన్న చిరునవ్వు ముఖానికి అంటించుకుని చూస్తూ ఏళ్ళకు యేళ్ళు ఎలా బ్రతికేయగల్గుతారో ఏమిటో ! మనమధ్య కూడా అలాంటి వాతావరణమే ప్రబలిపోతుంది. ఎవరూ మనుషులతో మాట్లాడటం లేదు. నేను ఎక్కువ మాట్లాడేది పలకరించేది నా చుట్టూ వున్న చిన్న పిల్లలను . వాళ్లకి లెక్కలేసుకోవడం రాదు కాబట్టి హాయిగా మాట్లాడతారు. ఇక ఇవాల్టి విషయానికి వస్తే .. నా కథ యిలా నా ఆలోచనల్లోనుండే కాదు వాస్తవంలో నుండి పుట్టిన కథ. అక్షరమంత అబద్దమైనా లేదు. మాటలు కావాలి. ఆ మాటలను కలిపే మనుషులే దారంగా కావాలి. ఆ మాటల దారం మనుషులను పూలలా కలిపి ఉంచాలి అని నా ఆకాంక్ష. ఈ కథకు నాకు స్ఫూర్తినిచ్చిన .. ఈ "రమ" అనుభవాలు కూడా యీ కథకు మూలం. పసుపుపూల వనం ముందు పచ్చని మనసు "రమ" ఈవాల్టికే కాదు నా ..స్నేహజీవితంలో వొకానొక నాయిక. రమ నేనూ ఇద్దరం కలిసిన photos వుండాలి..వెతికి చూస్తాను. ప్రస్తుతానికి .. ఇలా .. వీరిచే పోస్ట్ చేయబడింది వనజ తాతినేని వద్ద మంగళవారం, ఆగస్టు 20, 2019 కామెంట్‌లు లేవు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: అంతరంగమాలిక, స్నేహం, స్పందన 18, ఆగస్టు 2019, ఆదివారం మాటల దారం మాటల దారం - వనజ తాతినేని ఇంట్లో మనుషులు మనుషులతో కాకుండా గ్రూఫ్ ల్లోనూ గోడలపైన మాట్లాడుకునే రోజులివి. మనుషులు మనసులతో మాట్లాడుకుంటున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రస్తుతం మనసుమాట ప్రక్కనపెట్టి మనషుల కోసమే మరీ కరువాసి పోతున్నానేను . చేతిలో వున్న పుస్తకం చూస్తే రమ చప్పున గుర్తుకొచ్చింది. ఏలూరు రోడ్ లో వున్న సాహిత్య నికేతన్ కి వెళ్ళి స్వంత డబ్బుతో పుస్తకాలు కొనుక్కెళ్ళి అందరికి అభిమానంగా పంచి చదవమని ప్రోత్సహిస్తుంది. అలాగే మా అబ్బాయికివ్వమని యిచ్చిన పుస్తకం యిది. నేను నా కొడుకు దగ్గరకు ప్రయాణమవుతున్నప్పుడు వచ్చి రెండు మూడు రోజులుండి వస్తువులు సర్దటంలో సాయం చేసి నేను బయలుదేరాకే తను యింటికి బయలుదేరింది. ప్రతి మనిషి నుండి యేదో వొకటి నేర్చుకోవడం నాకలవాటు.నాకొక కొత్తచూపునిచ్చిన మిత్రురాలు రమ.మమ్మల్ని కలపడానికి చిన్నపాటి అభిరుచి కారణమై వుండొచ్చుకానీ వూడల్లా దిగిపోయిన స్నేహానికి కారణం మరొకటి వుంది. అది మా ఆలోచనా విధానం అని తర్వాత అర్ధమవుతూ వచ్చింది నాకు. అప్పటికప్పుడు తనతో మాట్లాడాలనిపించింది.సమయం చూస్తే అక్కడ అర్ధరాత్రి దాటి వొక గంటే అయింది. మరో రెండు గంటలు వేచి చూడటం దుర్భరంగా అనిపించినా రమతో స్నేహం గుర్తుకుతెచ్చుకుంటే హాయిగా వుంది ఆ క్షణంలో. కాళ్ళు కడుక్కుని లోపలి వస్తూ గాయం యెలా వుంది జ్వరం తగ్గిందా అంటూ వొంటిపై చెయ్యేసి చూసి కాలు పట్టుకుని చూసి ఇంత లోతు గాయాలైతే జ్వరం రాక యేమొస్తుంది అంది. కళ్ళల్లో నీరు ఉబికింది. ఆ మాత్రం అయినవాళ్ళు నలుగురు అరకిలోమీటరు దూరంలో వున్నా కూడా ఆత్మీయంగా పలకరింపుకి నోచుకోని కడుపేదరాలిని. ప్రొద్దున్నే తను ఫోన్ చేసినప్పుడు మా మాటల్లో బంధువుల యింటికి వెళితే అక్కడ కుక్క కరిచిందని, వస్తూ వస్తూనే యాంటీ రేబిస్ ఇంజెక్షన్ చేయించుకుని వచ్చానని తెల్లవారేటప్పటికి వొళ్ళు నొప్పులతో బాటు జ్వరం బాగా వచ్చిందని అన్నాను. ఎవరున్నారు యింట్లో అనడిగింది. అత్తగారు అప్పుడే వెళ్ళిపోయిందని చెప్పాను. చెప్పిన మూడుగంటలకి రమ నా ముందు ప్రత్యక్షమైంది. వాళ్ళ వూరుకి మా పట్టణానికి మూడు గంటల ప్రయాణ సమయమన్నది నేనెలా మరువగలనూ! "మనసెలా వొప్పిందీ యిలా వున్న మనిషిని వొదిలేసి యెలా వెళ్ళింది" అనంటూ బాధపడింది. అయిదు రోజులుంది. సేవలు యేమి చేసిందనేది లెక్క కాదు. అదొక తోడు అంతే. “ఇవాళ రైల్వే స్టేషన్ లో కొంతమందిని చూస్తే అసహ్యం వేసింది “ అంది రమ. ఎందుకు అన్నట్లు చూసాను. “ముద్ద ముప్పావల, కాదు కాదు ముప్పై రూపాయలుగా తినేవాళ్ళు తిని జీర్ణించుకునేవాళ్ళు తమ ముందు దీనంగా చెయ్యిచాచిన వాళ్ళని తుస్కారంగా చూసినా పర్వాలేదు కానీ తూటాల్లాంటి మాటలతో యెగతాళి చేయడం బాధ కల్గిస్తుంది “ అంది. “కష్టపడి సంపాదించి దారినపోయే పిల్లులకు రోజూ రెండు పాల పేకెట్లు పాలు పొసే నీ మనసంత మనసు వుండొద్దూ.. అందరికీ” అన్నాను. “ఏమిటో కొందరిలా అంత కఠినంగా నేనుండలేను, మొదట్లో అమ్మ కూడా గొడవ చేస్తుండేద. రాక్షసిలా అరిచేదాన్ని. ఇప్పుడు వాళ్ళకీ ఆ దయా గుణం అబ్బి రెండు రూపాయల రేషన్ బియ్యాన్ని కట్టెలపొయ్యి ముట్టించి వూది వూది దగ్గు వస్తున్నా సరే లెక్కచేయకుండా అన్నం వొండి వీధి కుక్కలకి పెడుతున్నారు, పక్షులకి వేస్తున్నారు” అని చెప్పింది.. రమ ను చూస్తే నాకెంతో అబ్బురం. మనిషి మాటల్లో కాదు చేతల్లో కనబడుతుంది. ప్రేమ విఫలమై బ్రతుకు బండయినా కానీ స్వచ్ఛంగా స్పందించే మనసు తనది. భావపురి వాళ్ళది. ఊరి చివర ఆర్టీసీ బస్టాండ్ పక్క సందులో చివరింట్లో చుట్టూ ఎలుకలు తవ్వేస్తున్న ప్రహరీగోడల మధ్యలో యజమాని ప్రక్క పోర్షన్లో వుంటూ జీవితాన్ని జీవించడమెలాగో తెలిసిన మనిషి. ఏళ్ళ తరబడి బలవంతంగా భర్త యిచ్చిన విడాకుల బరువును మోస్తున్న రెండో అక్క, అక్కుపక్షి లాంటి అమ్మతో కలిసి జీవిస్తుంది. ముందు గదిలో రెండు కుట్టు మిషన్లు పెట్టుకుని బట్టలు కుడుతున్నట్లే మనుషులనూ మాటల దారంతో కుట్టుకుంటూ వెళుతుంది. అవసరమైనచోట నిర్మొహమాటంగానూ సమాజంతో స్నేహంగా మిత్రులతో ఆప్యాయంగా, తోటి ప్రాణులపట్ల కరుణగా అమ్మంటే ప్రాణంగా ఇతరులకు సాయంగా ఉండే అబ్బురమైన మనిషి. తీరిక చేసుకుని అప్పుడప్పుడూ ఏదో స్వచ్చంద సంస్థ లో కార్యకర్త గా పని చేస్తూ వుంటారు అక్క చెల్లెళ్ళు. మనుషుల మధ్య కులాల మతాల గోడల్ని బద్దలుకొట్టి మరీ యింటికి ఆహ్వానించి యిన్ని టీ నీళ్ళిచ్చి వేళకి వెళితే ఆదరంగా పచ్చడి మెతుకులైనా ఆప్యాయంగా పెట్టే మనుషులు. ఏళ్ళ తరబడి మోస్తున్న కుటుంబ భారానికంటే యెక్కువ మానసిక వేదనని కల్గించిన అమెరికా బావని పచ్చని పెళ్లిపందిరిలో బంధుమిత్రుల సమక్షంలో కాలర్ పట్టుకుని గిర గిరా త్రిప్పుతూ ప్లాస్టిక్ కుర్చీ యెత్తి కొడుతూ ఉగ్ర స్వరూపం ప్రదర్శిస్తే ఆశ్చర్యపోవడం నా వంతే కాదు ప్రైమ్ టైమ్ వార్తలలో తెర ముందు కూర్చున్న ప్రేక్షకులది కూడా. “వాడి డబ్బు మదం, అంగబలం చూసి భయమేయలేదా “ అనంటే.. " సైనికుడిని ప్రేమించిన మనసు నాది ఆ మాత్రం ధైర్యంగా వుండొద్దూ" అంటుంది. అంతలోనే దిగులు పడుతుంది. కులం వేరని మా బండది నా ప్రేమని పెళ్లిని చెడగొట్టింది అని రెండో అక్కని తిడుతుంది . తనకన్నా రెండు నిమిషాలు చిన్నవాడైన తమ్ముడు అయినవాళ్ళ చెప్పుడు మాటలు విని అనారోగ్యంతో వున్న తండ్రికి వైద్యం చేయించలేక యిల్లు వదిలేసి వెళ్ళినా ఆడదాన్నని బెదిరిపోకుండా కుటుంబానికి యజమానిగా నిలబడిన తన దైర్యం చూస్తే ముచ్చటేస్తుంది. ఆ తమ్ముడే ఆస్తులు సంపాదించుకుని పెళ్ళిచేసుకుని పిల్లలను కని వాళ్ళకు యే లోటూ లేకుండా చూసుకుంటూ తల్లి అనారోగ్యం పాలైతే రిక్త హస్తాలతో వచ్చి నిలబడి బంధువుల దగ్గర నాకు వాళ్ళేమిచ్చారు నేను వాళ్ళకివ్వడానికి అని అంటుంటే విని వెళ్ళేటప్పుడు చార్జీలకని జేబులో డబ్బులు పెట్టిపంపిన రమ చూపు యెంత తీక్షణమైందో! అప్పుడు ఆమె చూసిన చూపు ఆ తమ్మునికి సిగ్గుచేటు అనిపించడం తేలికగానూ జీర్ణించుకోవడం కష్టంగాను వుండాలి కదా అనుకున్నాను. “మనుషులను చూసే దృష్టి. మారాలి. కార్లు వున్నవాళ్ళకు తలనొప్పి అన్నా పరామర్శించడానికే పరిగెత్తే జనం అదే రక్తస్పర్శ కల్గిన నా అన్న వాళ్ళు యెవరూ లేని కడు పేదరాలను పట్టించుకున్న పాపానపోరు. ధనం వెంట పరుగులు. ఎవరెక్కడ స్పందించాలో యెంత స్పందించాలో యెంత మృదువుగా మాట్లాడాలో ఆకట్టుకునేలా సమాధానమెలా చెప్పాలో అన్నీ తరగతులకు హాజరై మరీ నేర్చుకుంటున్నారు. మనుషులను సహజంగా సాధారణంగా స్వభావసిద్దంగా బతికే స్వేచ్ఛను దూరం చేసుకుంటున్నారు “ అంటుంది కోపంగా. నిజం కాదని నేనలా అనగలనూ! ఆర్దికంగా యెంత యిబ్బంది వున్నా డబ్బు వున్నప్పుడు పెళ్ళి రాదుకదా అని అప్పు తీసుకుని బాబాయి కూతురు పెళ్ళికి వెళ్ళాను. బాబాయి పిన్ని సంతోషంగా పలకరించి బాగానే మర్యాదలు చేసారు. పెళ్ళికూతురే యెవరో తెలియదన్నట్టుగా చూసింది తప్ప అక్కా బాగున్నావా! అని పలకరించకపోయింది. సాఫ్ట్‌వేర్ వుద్యోగం చేసి లక్ష రూపాయలు సంపాదిస్తే గొప్ప కాదు. ఆ పిల్ల ప్రవర్తన గుర్తొస్తే ములుకులా గుచ్చుకుంటూనే వుంటుంది అని చెప్పింది ఒకసారి. మాటేగా వారధి. అదికూడ తెలియని వాళ్ళతో సంబంధాలు యేమి వుంటాయి. మానవ సంబంధాలు యెవరికి కావాలి. ఆర్ధిక సంబంధాలో రాజకీయ సంబంధాలో తప్ప.. మా పెద్దక్క భర్త పెద్దగా చదువుకోలేదు ఆర్జితమే తప్ప యే కోశానా అభిమానం చూపడం తెలియని మనిషి. బేంక్ లావాదేవీలు యేవీ తెలియదు కాబట్టి హడావిడిగా వూరు నుండి ఫోన్ చేస్తాడు బేంక్ దగ్గరికి రా రమ్మని. ఆ లోన్లు పని అదీ పూర్తయ్యేటప్పటికి నాలుగుగంటలు పట్టినా బేంక్ యెదురుగా టీ కొట్టు కనబడుతున్నా టీ తాగుదాం రామ్మా అని పిలవడు ఒక్కడే వెళ్ళి తాగి వస్తాడు. అలాంటి ఆయనకు కూడా సమయానికి చేసిపెట్టిన టిఫిన్ వుంటే డబ్బాలో పెట్టుకుని వెళుతుంది రెండో అక్క . తనే టీ కొట్టు కెళ్ళి ఆయనకూ టీ పట్టుకెళ్ళి యిస్తుంది. ఎప్పుడూ జేబును గట్టిగా పట్టుకుంటాడు.డబ్బంటే అంత తీపి ఆయనకు. ముందస్తు సూచనలు కనబడ్డా డబ్బు ఖర్చు అవుతాయని వెనుకాడితే కేన్సర్ ముదిరిపొయ్యాక ప్రాణం మీద తీపితో లక్షలు ఖర్చుపెట్టినా ప్రయోజనం లేకపోయింది. చూసే దానికి ఇవన్నీ చిన్న విషయాలు లాగానే కన్పిస్తాయి కానీ యివే మనుషుల గుణాన్ని తెలియజేస్తాయి అని చెప్పింది మరొకసారి. ఒకసారి ఆమెతోపాటు వాళ్ళింటికి వెళ్ళింది తను. అతిధి మర్యాద కన్నా ప్రేమ యెక్కువ కనబడిందక్కడ. నేలపై బొంత పరుచుకుని ముగ్గురు అక్క చెల్లెళ్ళులా పడుకుంటే... పక్కనే వాళ్ళింట్లో వున్న వొకే వొక చిన్న నవ్వారు మంచంపై వాళ్ళమ్మ. అందరూ పడుకుని మాట్లాడుకున్న మాటల్లో పడుతున్న కష్ట నిష్ఠూరాలను విప్పి చెప్పుకుని మనసులను తేలికపరుచుకున్నాం. నాలుగున్నర గంటల కన్నా ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకుని బుట్ట పట్టుకుని రెండు పర్లాంగుల దూరంలో ఉన్న పాలబూత్ కి వెళుతుంటే దట్టంగా కురుస్తున్న ఆ మంచులో రమతో కలిసి నడిచింది తను కూడా. తెల్లని చుడీ దారు ధరించి తెల్లని పొగమంచులో కలిసిపోయే రమని గుర్తించడానికి ఒకటే మార్గం తల మీదుగా చుట్టుకున్న ఆకుపచ్చని చున్నీ. సందుమూల మెయిన్ రోడ్ లో ఉన్న కిరాణా షాపు అతన్ని "ఏమయ్యా ప్రకాష్ మీ లక్ష్మి ఎలా ఉంది, లేచి తిరుగుతుందా" అని పలకరిస్తుంది. షాపు ముందు శుభ్రం చేసుకుంటున్న అతను పనాపి "పర్వాలేదక్కా కాస్త లేచి నిలబడుతుంది" అని సమాధానమిచ్చి "ఎక్కడికి వెళ్ళారు నాలుగు రోజులనుండి కనబడటం లేదు" అని ప్రశ్నించాడు. మా స్నేహితురాలికి కుక్క కరిచి జ్వరమొస్తుంటే తోడుగా వుందామని వెళ్లాను అంది. "ఇప్పుడెలా వుంది ఆమెకి" అనంటాడు ఆదుర్దాగా. పర్వాలేదు. ఇదిగో ఆమె ఈమె అంటూ ప్రక్కనున్న నన్ను చూపించింది. ముందుకు నడుస్తూ " లక్ష్మి అంటే ప్రకాష్ పక్కింటి వాళ్ళ ఆవు దూడ. ఏదో జబ్బుచేసి నిలబడే ఓపిక కూడా లేకపోతే కటిక వాడికి అమ్మేస్తుంటే అతనికి డబ్బులిచ్చి ఆ ఆవుదూడని కొన్నాడు. ఇంకో మనిషిని తోడుగా తీసుకుని మోటార్ సైకిల్ పై పెట్టుకుని గుంటూరు హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం చేయించాడతను. చచ్చిపోయే దానిని బ్రతికించాడు" అని చెప్పింది. అప్రయత్నంగా ఓసారి వెనక్కి తిరిగి చూసాన్నేను. ఇంకొంచెం ముందుకెళుతుంటే పెద్దాయనొకరు వాకింగ్ కి వెళుతూ యెదురైనారు "బాబాయి గారూ మంచు దట్టంగా కురుస్తుంది. వచ్చేపోయే వాహనాల లైట్లు కూడా కనబడటం లేదు కాస్త ఎండెక్కినాక వెళ్ళేపనిగా" అంటుంది. "వచ్చావమ్మా రమా, నోరారా పలకరించే వాళ్ళు లేక నోరు మూగబోతుందనుకో. నువ్వు మాత్రం ఇంత మంచులోనే బయలుదేరావెందుకూ .. పిల్లులు అప్పుడే కాళ్ళకి చుట్టుకుంటున్నాయా పాల కోసం" అన్నాడాయన. "వాటి కోసమనే యేముందిలెండి అమ్మ కి కూడా కావాలిగా" అంది మొహమాటంగా. "నీకు భూతదయ యెక్కువమ్మా, పిచ్చితల్లి యెలా బతుకుతావో యేమిటో " .. అనుకుంటూ ముందుకు వెళ్ళాడాయన. పాల బూత్ దగ్గరికి వెళ్ళి శుభోదయం చెప్పి "గణేష్ నేను లేని నాలుగు రోజులు ఇంటిదగ్గర పాలు యిచ్చినందుకు ధన్యవాదాలు" అంది. "పర్వాలేదులే అక్కా "అన్నాడు . "ఇదిగో నువ్వడిగిన పుస్తకం"అంటూ బుట్టలో నుండి తీసి అందించింది . పుస్తకం విలువ యివ్వబోతే "భలేవాడివి నువ్వు డబ్బులిస్తావని తెచ్చి యిచ్చానా" అని కోపగించుకుంది. "ఆ నల్లకుక్క యెలా వుంది కాలు కట్టుకున్నట్లేనా?" అని ఆరా తీస్తుంది. "తగ్గినట్లుంది అయినా అదిక్కడ నుండి పోనట్టు వుంది నేను చేసిన సేవ రుణం తీర్చుకోవాలనేమో" అని అన్నాడతను. "కుక్కకి ఏమైంది ?"అని అడిగాను. "వీధికుక్క , ఏ బండో ఎక్కి వుంటుంది. కుంటుతూ నడుస్తుంటే చేరదీసి కట్టు కట్టాడు. కొంచెం దయ చూపిస్తే విశ్వాసంగా ఉంటాయి జంతువులు. మనుషులకే విశ్వాసం వుండదు " అంది. మనుషులు ఇలా కూడా వుంటారా అని అనిపించింది . ఆ మాటే అంటే "మనిషికి మనిషికి అడ్డుగోడ కట్టుకుని జీవించడం మానేస్తున్నారు. కేవలం నటిస్తున్నారు. మేము ఇలాగే వుంటాం. ఇలాగే పలకరించుకుంటాం. ఓ చిన్న నవ్వు పడేసి పని వున్నట్టు హడావిడిగా వెళ్లిపోవడమో కాస్త డబ్బు సంపాదించేటప్పటికీ వాళ్ళెవరో మాకు తెలియదన్నట్టు చూడటమో చేస్తారు కొంతమంది మనుషులు. కష్టం వచ్చినప్పుడు కాస్త మనిషి సాయమో ఆపదలో అప్పు యిచ్చి మనిషిమనిపించుకోవడం ధర్మం కదా" అంది. ఆ రోజు తనతో కలిసి నడిచిన నాలుగు పర్లాంగులు మనిషి అంటే యేమిటీ మనుషుల మధ్యన వేసుకున్న వంతెన యెటువంటిదన్నది నాకర్ధమైంది. తను నాపట్ల మాత్రమే అలాంటి స్నేహాన్ని వ్యక్తపరిస్తే కేవలం కృతజ్ఞతగా వుండేదాన్ని. ఆమె చుట్టూ అల్లుకున్న స్నేహాలు మనుషులు మాటలను చూస్తే గొప్ప గౌరవభావం నాకే కాదు యెవరికైనా యేర్పడుతుందనేది సత్యం. సాయంత్రం వాకింగ్ కి వెళుతూ అయిదు లీటర్ల కేన్ తో నీళ్ళు నింపుకుని వెళ్ళి యెండిపోయిన చెట్లకి పోసి వాటిని బ్రతికించినట్లే సిమెంట్ బెంచీలపై కూర్చున్నయెండిపోయిన వృద్దులకూ మాటల తడితో కాస్త జీవం పోస్తుంది. నిత్యం వీథిలో నాటిన మొక్కలకు నీళ్ళు పోస్తుంది. పూజకి పూలు కోసుకు వెళ్ళే వాళ్ళది చూసి నవ్వుకుంటారు.మీ నవ్వులే రేపటి పువ్వులు అంటుంది. కసుక్కున గుచ్చుకోవడం అంటే అర్ధం కాని వాళ్ళు మళ్ళీ నవ్వుకుంటారు. యెందరో స్నేహితులు పరిచయస్తులు. తాను వాలంటీర్ గా పనిచేస్తున్న స్వచ్చంద సంస్థ రాష్ట్రం వేరు పడినప్పుడు వేరు పడిపోయినా వాళ్ళు పిలిస్తే చాలు వెళ్ళిపోయేది. తన అవివాహ జీవితం గురించి వెకిలితనంతో వ్యాఖ్యానించినా సర్దుకుంది కానీ కులరాజకీయాలు ఆహారపు అలవాట్లతో విడదీసి చూడటం మనుషులను వెలివేసినట్లు చూడటం జరిగేపటప్పటికీ మనసుకి కష్టం కలిగి పక్కకు తప్పుకుంది. సంస్థ తరపున పనిచేయడం మానేసినా ఆ మనుషుషులందరూ తనవాళ్ళే అన్నట్లు వాళ్ళకు తన చేతనైన విధంగా చేసే మాట సాయాలు చిరు సహాయాలు. తన చుట్టూ వుండే ప్రపంచమే వేరసలు. అదొక మానస ప్రపంచం. చేసిన సాయాలు వ్యర్థం కావులే అంటే తిరిగి ప్రతిఫలం ఆశించి నేను చేయడంలేదు అంటుంది. ఎన్నోసార్లు నా కష్టంలో సుఖంలో నా యింటి మనిషై నిలబడటం మాత్రమే కాదు తన మనసు బాగోలేనప్పుడు పని వొత్తిడిలో అలసిపోయినప్పుడల్లా నా దగ్గరకొచ్చి పడుతుంది. వినకోరిన హిందీ పాటలు వినిపించి తన అనుభవాలని చెప్పించుకోవడం నాకిష్టం. అప్పటిదాకా విన్నపాటలని ఈల పాటలో పాడి నన్ను అబ్బురపరిచేది. ఏవేవో పాత పాటలు అడిగితే వాటిని వెతికి డౌన్లోడ్ చేసి మెమరీ కార్డ్ లోకి యెక్కించకపోతే అలిగి కూర్చుండటం చూస్తే ఫక్కున నవ్వుకోవడం నావంతయ్యేది. చాలాసార్లు దేశంలో ఆమెతో కలసి పర్యటిస్తూ ఆమెంటే యేమిటో బాగా అర్దం చేసుకోగల్గాను.మనుషుల్లోనూ తోటి ప్రాణుల్లోనూ దైవత్వాన్ని దర్శిస్తూ యెన్నో అగాధాలను పూడ్చేస్తూ జీవన ప్రయాణం చేస్తూ వుంది. తోటి మనుషుల పట్ల కొంచెం ఆత్మీయత ఇతర ప్రాణులపై పిడికెడంత దయ కురిపించలేనివాళ్ళు కనీసం పక్క మనిషిని పలకరించకుండా వెళ్ళిపోవడం, అదే మనుషులు వారికి అవసరమైతే చాలు అమాంతం యెలా ప్రేమలు వొలకబోస్తారో చూస్తుంటే రమకి తెలియకుండా వీడియో తీసి ఆమె సాధారణ జీవితంలో అసాధారణను ప్రపంచానికి పరిచయం చేయాలనిపిస్తుంది. మా ప్రక్కింటామె చెల్లెలింటి గేటు తెరుస్తుంటే "ముండకి యేమి అవసరం వచ్చిందో కోడల్ని వేసుకుని మరీ వచ్చింది"అని అనబడటం వినబడిందట. ఇక ఆ అక్కకు చెల్లెలు ముఖం చూడాలనిపిస్తుందా! ఇవి రక్తసంబంధాల బోలుతనం. చిన్న విషయాలుగా అనిపించే పెద్ద పెద్ద అవమానాలు. అగాధాలు. మనుషులు ఆ అగాథాలలో పడిపోకుండా కాపాడేది మాటనే స్పర్శమణి యే కదా. ఆ మాట వెనుక వున్న మనిషి గుణమే కదా!మాటే కదా మనుషుల మధ్య వంతెన. మాటే కదా మనుషులను కలిపి కుట్టే దారం. ఇలా రమ గురించి జ్ఞాపకాలు తవ్వుకుంటూ కాస్తంత ఆత్మీయంగా మాటలు పంచుకోవాలనుకునే కదా నేనూ ఓ మనిషిని వెతుక్కుంటున్నానిపుడు అనుకుంటూ .. సమయం చూస్తే దేశ కాలమానం ఉదయం నాలుగున్నర. ఆ సమయానికి దట్టమైన మంచులో తెల్లని చుడీదారులో ఆకుపచ్చ చున్నీ కప్పుకుని ఊరుతో మాట్లాడటానికి వెళుతున్న రమ దృశ్యంలా కనబడింది నాకళ్ళకి. ఏ మాత్రం స్వార్ధం లేని మాట కూడా వినబడింది.
వివేకా నందరెడ్డి హత్య కేసు విచారణలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జోక్యం లేదని మాజీ డిజిపి గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. ఆ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, నిజాల్ని బయటకు తీసి దోషులకు శిక్షపడేలా చూడాలని సిఎం తనకు ఎప్పుడూ చెప్పేవారని ఆయన తెలిపారు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి డిజిపిగా ఉన్న సమయంలో తాను మాట్లాడానంటూ కొన్ని వ్యాఖ్యలు పత్రికల్లో వచ్చాయని, అందులో వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి, అవినాశ్‌రెడ్డిల కుటుంబాలు తనకు రెండు కళ్లులాంటివని మాత్రమే సిఎం తనకు చెప్పారని అందులో వివరించారు. సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి 2019 సెప్టెంబరులో తనను కలిసినప్పుడు ఇదే విషయాన్ని చెప్పానని తెలిపారు. అదే సమయంలో అమాయకులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆయన తనతో చెప్పారని కూడా వారికి తెలియజేశానని పేర్కొన్నారు. తదనంతరం ఈ కేసుకు సంబంధించి అన్ని రికార్డులు, వాస్తవాలను కోర్టు ముందుంచాలని సీఎం జగన్‌ తమకు స్పష్టంగా నిర్దేశించారని తెలిపారు. సక్రమంగా దర్యాప్తు చేయడమే కాకుండా అదే విశ్వాసాన్ని అందరిలోనూ కల్పించాలని సీఎం నిర్దేశించారని ఆయన చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో ఏ దశలోనూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. అదే విధంగా, తాను డిజిపిగా ఉన్నప్పుడు ఏనాడూ అవినాశ్‌రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి తనను కలవలేదని సవాంగ్‌ తెలిపారు. కాగా, వైఎస్‌ వివేకాందరెడ్డి హత్య కేసులో ఎల్లో మీడియా స్క్రిప్ట్‌ ప్రకారమే టీడీపీ నేతలు తొలుత ఎంపీ అవినాష్‌రెడ్డి పైన, ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పైన నిందలు మోపుతున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ఆరోపించారు. వివేకా హత్య కేసులో టీడీపీ, ఎల్లో మీడియా ఒక పథకం ప్రకారం రోజుకోరకంగా కథనం రచించి, రోజుకో టీడీపీ నాయకుడితో మాట్లాడిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ కేసులో బీటెక్‌ రవి, రాజశేఖర్, టీడీపీ ప్రోద్బలంతో బీజేపీలో చేరిన ఆదినారాయణరెడ్డిపై ఎందుకు నిందలు మోపడం లేదని ప్రశ్నించారు. కాగా, సిబిఐ వెల్లడిస్తున్న పలు సాక్షుల కధానాలలో అవినాష్ రెడ్డి కీలక నిందితుడిగా ఆరోపణలు వస్తుండటం, మొత్తం సూత్రధారి ముఖ్యమంత్రి జగన్ అంటూ టిడిపి నేతలు ఆరోపణలు చేస్తుండడంతో సవాంగ్ ప్రకటన ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల సమ్మె రెండోరోజూ విజయవంతమైంది. జోరువానను సైతం లెక్కచేయకుండా కార్మికులు మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట గంటల తరబడి ధర్నాలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ నినాదాలు చేశారు. సమ్మె వల్ల జరిగే నష్టానికి, ప్రజల ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఎన్నికల మేని ఫెస్టోలో 95శాతం వాగ్ధానాలు అమలు చేశామని, తమది సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుం టున్న ప్రభుత్వం పారిశుధ్య కార్మికులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హామీల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మె రెండోరోజుకి చేరుకోవ డంతో మున్సిపాలిటీల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకు పోయింది. నగరాల్లో ఎటు చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. జోరువానలోనూ విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు పెద్దసంఖ్యలో ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తుంటే ప్రభుత్వం 2024 ఎన్నికల్లో తమను గెలిపిస్తే అప్పుడు పరిష్కరిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కార్మిక సంఘాల నాయకులతో సోమవారం మంత్రులు, అధికారులు చర్చల సమయంలో న్యాయబద్ధంగా వ్యవహరించలేదన్నారు. మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇచ్చేలా జీవో జారీ చేయడంతోపాటు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం హెల్త్‌ అలవెన్సులను ఎటువంటి కోత లేకుండా పాత బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ రాష్ట్ర నాయకుడు సీహెచ్‌ బాబూరావు, ఏఐటీయుసీ అనుబంధ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆసుల రంగనాయకులు, నాయకులు జె.జేమ్స్‌, రమేష్‌, సీఐటీయూ నాయకులు డేవిడ్‌, జ్యోతిబసు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట జోరువానలో నిర్వహించిన ధర్నాలో సీపీఐ సీనియర్‌ నాయకుడు మోదుమూడి రామారావు, సీపీఎం నాయకుడు కొడాలి శర్మ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు యర్రంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్‌ తాడిగడప మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు చేపట్టిన ధర్నాకు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ మద్దతు ఇచ్చారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ, జగ్గయ్యపేట మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట జేఏసీ ఆధ్వర్యాన ధర్నాలు నిర్వహించారు. హామీలను విస్మరించడం దారుణం: వెలుగూరి రాధాకృష్ణమూర్తి ఎన్నికలకు ముందు జగన్‌మోహన్‌ రెడ్డి మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించడం సమంజసం కాదని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి అన్నారు. కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేస్తామని, అందరినీ పర్మినెంట్‌ చేస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని, సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్మికుల రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా రెండవ రోజు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు బందెల రవికుమార్‌ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావుల అంజిబాబు, ఆకిటి అరుణ్‌కుమార్‌, సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు చల్లా మరియదాసు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ కోశాధికారి కోటి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యం తగదు: చలసాని రామారావు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా ఎన్నికల సందర్భంగా మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ అమలు చేయకపోవడం దారుణమని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చలసాని వెంకట రామారావు విమర్శించారు. ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన మున్సిపల్‌ కార్మికుల సమ్మెలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చాట్ల పుల్లారావు, ఇందుపల్లి సత్య ప్రకాష్‌ పాల్గొనగా, ఏలూరులో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, భజంత్రీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ది జోనల్‌ మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నగర కార్యదర్శి ఏ అప్పలరాజు భోజన విరామ సమయంలో కార్మికులకు మద్దతుగా సంఫీుభావం తెలిపి నిరసన తెలిపారు. జంగారెడ్డి గూడెంలో సీపీఐ నాయకులు మన్నవ కృష్ణ చైతన్య, చింతలపూడిలో కంచర్ల గురవయ్య, తుర్లపాటి బాబు, పశ్చిమగోదావరి జిల్లాలో కోనాల భీమారావు, ఎం సీతారాం ప్రసాద్‌, చెల్లబోయిన రంగారావు పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. నరసాపురంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు, తణుకులో సీపీఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె విజయవంతమైంది. స్థానిక కొండయ్య సెంటర్‌ నుండి ప్రదర్శనగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్దకు చేరుకుని రెండవ రోజు కార్యాలయం ఎదుట సమ్మె ప్రారంభించారు. సమ్మెకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ విచ్చేశారు. సామర్లకోటలో 2వ రోజు కార్మికులు సమ్మె నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు పాల్గొన్నారు. కర్నూలులో మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కర్నూలు,డోన్‌, ఆదోని, ఎమ్మిగనూరు, నంది కొట్కూరు, నంద్యాల, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, గూడూరులో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. డోన్‌లో మున్సిపల్‌ కార్మికులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మిగతా చోట్ల కార్మికులు కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. దశాబ్దాల పాటు ఆ స్థానాల్లో టీడీపీ సత్తా చాటుతూ వస్తుంది..కానీ గత ఎన్నికల్లో కంచుకోటల్లో టీడీపీ ఓటమి పాలైంది. అయితే గుంటూరు వెస్ట్, రేపల్లె స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇక గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మద్దాలి గిరి..వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో వెస్ట్ సీటులో టీడీపీ ఖాళీ అయింది..మద్దాలి అటు వెళ్ళడంతో కోవెలమూడి రవీంద్రని ఇంచార్జ్‌గా పెట్టారు. అయితే కోవెలమూడికి నెక్స్ట్ గుంటూరు వెస్ట్ సీటు ఇస్తారా? అంటే అది డౌటే అని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు…కోవెలమూడికి సీటు హామీ ఇవ్వలేదు. కేవలం వెస్ట్‌లో పార్టీ బలం పెంచే విధంగా పనిచేయాలని ఇంచార్జ్ పదవి ఇచ్చారు. కానీ వెస్ట్ సీటుపై కోవెలమూడి ఆశలు పెట్టుకున్నారు. ఈయనే కాదు..ఇంకా కొంతమంది వెస్ట్ సీటుపై కన్నేశారు. ఎందుకంటే ఈ సీటులో నిలబడితే ఈజీగా గెలిచేయొచ్చు..ఇక్కడ టీడీపీకి బలం ఎక్కువ కాబట్టి..సేఫ్ సీటు అని భావిస్తున్నారు. కానీ ఈ సీటు చంద్రబాబు ఎవరికి ఇస్తారో క్లారిటీ లేదు. పైగా జనసేనతో పొత్తు ఖాయమయ్యేలా ఉంది. దీంతో గుంటూరులో కొన్ని సీట్లు జనసేనకు వదలాలి. గుంటూరులో కొన్ని సీట్లలో జనసేనకు బలం ఉంది. గెలిచే బలం లేదు గాని..గెలుపోటములని డిసైడ్ చేసే బలం ఉంది. తెనాలి, గుంటూరు వెస్ట్, ఈస్ట్, ప్రత్తిపాడు, సత్తెనపల్లి సీట్లలో జనసేనకు బలం ఉంది. వీటిల్లో ఖచ్చితంగా రెండు, మూడు సీట్లు జనసేన అడిగే అవకాశాలు ఉన్నాయి. తెనాలిలో ఎలాగో నాదెండ్ల మనోహర్ ఉన్నారు.. ఆ సీటు అడిగే ఛాన్స్ ఉంది. కానీ అక్కడ టీడీపీ తరుపున బలమైననేత ఆలపాటి రాజా ఉన్నారు. ఒకవేళ తెనాలి రాజాకు ఇస్తే..నాదెండ్లకు జనసేన తరుపున గుంటూరు వెస్ట్ సీటు ఇవ్వొచ్చు. లేదంటే నాదెండ్ల తెనాలిలోనే ఉంటే.. రాజాని వెస్ట్‌కు పంపిస్తారని తెలుస్తోంది. ఒకవేళ బీజేపీతో కూడా పొత్తు ఉంటే…అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ వెస్ట్ రేసులోకి రావచ్చు. మొత్తానికి గుంటూరు వెస్ట్ సీటుపై కన్ఫ్యూజన్ ఉంది. Tags Janasena TDP Previous articleటాప్ తీసేసి తెలుగు అమ్మాయి నగ్న ప్రదర్శన.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న బోల్డ్ పిక్స్..!!
దసరా నాడు కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేయబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ పై కొందరు రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన కేసీఆర్…రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేయకుండా…జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ పై ఫోకస్ పెడితే టీఆర్ఎస్ బలహీన పడి ఓటమి పాలయ్యే చాన్స్ ఉందని అనుకుంటున్నారు. అలా కాకుండా, ముందు అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసి, అందులో గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెడితే హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ మాటకు చెల్లుబాటు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అలా కాకుండా, సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేని పరిస్థితులు వస్తే..అపుడు జాతీయ రాజకీయాలలో కేసీఆర్ కు పట్టు ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ విషయాలన్నీ కేసీఆర్ కు తెలియవా? అంత అనాలోచితంగా కేసీఆర్ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకొని ఉంటారా? కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఉద్యమ నేత ఏ వ్యూహం లేకుండానే మోడీతో ఢీకి రెడీ అవుతారా? అన్న ప్రశ్నలు కొందరు తెలంగాణ నేతల మదిలో మెదులుతున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయడం వెనుక కేసీఆర్ అసలు ప్లాన్ ఇదేనంటూ సరికొత్త ప్రచారం మొదలైంది. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకే కేసీఆర్…జాతీయ పార్టీ పాట పాడుతున్నారు. ఢిల్లీ గద్దెపై కూర్చునేందుకు తెలంగాణ బిడ్డ కేసీఆర్ పోరాడుతున్నారని, అటువంటి కేసీఆర్ పార్టీని తెలంగాణ ప్రజలు ఓడిస్తారా? అనే నినాదంతో కేసీఆర్ ముందుకు పోబోతున్నారట. బలమైన మోడీకి ఎదురువెళ్తున్న తనకు ప్రజలు మద్దతివ్వరా అన్న సెంటిమెంట్ తో కేసీఆర్ కొట్టబోతున్నారట. తాను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే తెలంగాణ పరువు పోయినట్లేనని, జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైన తెలంగాణ బిడ్డను సొంత రాష్ట్రంలో ఓడిస్తారా అన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లబోతున్నారట. పదేళ్ల పాలనలో ప్రజల్లో కొద్దోగొప్పో వ్యతిరేకత ఉందన్న విషయం గ్రహించిన కేసీఆర్…ఇలా జాతీయ పార్టీ ఎత్తుగడతో ప్రజల్లోకి వెళితే…రాష్ట్ర సమస్యలను ప్రజలు పట్టించుకోరన్న భావనలో కేసీఆర్ ఉన్నారట. ఈ నేషనల్ ప్లాన్ లో కేసీఆర్ ఎంతవరకు సక్సెస్ అవుతారు అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
సాంస్కృతిక శిఖరం వై.కె.నాగేశ్వరరావు గారిని అందరూ స్మరించుకుంటున్నారు. నాగేశ్వరరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా జంట నగరాల్లోని పలు సాంస్కృతిక సంస్థలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమి వారు శుక్రవారం (22-4-22) హైదరాబాద్, త్యాగరాయ గానసభ లో వైవిధ్య కార్యక్రమం నిర్వహించి వై.కె.గారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ప్రత్యేకంగా వై.కె.స్మారక జీవన సాఫల్య పురస్కారం, వై.కె.ఆప్త మిత్ర పురస్కారాలను ప్రవేశపెట్టారు. అలాగే ప్రముఖ గాయకుడు దివంగత కె. వెంకటరావు స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. పురస్కార గ్రహీతలకు సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండి బండారు సుబ్బారావు, శృతిలయ చైర్మన్ డాక్టర్ బి.భీంరెడ్డి ఆశీస్సులు అందించారు. శృతిలయ సంస్థ ఏ కార్యక్రమం చేపట్టినా తొలుత జరిగే సినీ సంగీత విభావరిలో లీడ్ సింగర్ వెంకట్రావుగారే. అలాగే సభాధ్యక్షులుగా తొలుత మాట్లాడేది వై.కె.నాగేశ్వర రావుగారే. వీరిద్దరూ తమ సంస్థ కు రెండు కళ్ళు లాంటి వారని శృతిలయ అధినేత్రి శ్రీమతి ఆమని తెలిపారు. వారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నదని, ఆ లోటు ఎన్నటికీ తీరనిదని కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారు. సాంస్కృతిక దిగ్గజం వై.కె.నాగేశ్వరరావు స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ రాజకీయ దిగ్గజం, పూర్వ డిప్యూటీ స్పీకర్, పూర్వ మంత్రివర్యులు మండలి బుద్ధప్రసాద్ స్వీకరించారు. గాయకుడు కె.వెంకట్రావు స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని ఆలిండియా రేడియో పూర్వ డిప్యూటీ డైరెక్టర్, గాయకుడు శ్రీ చంద్రతేజ అందుకున్నారు. వైకె నాగేశ్వరరావు ఆప్త మిత్ర పురస్కారాలు, నూతన వస్త్రాలతో తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి, ప్రముఖ సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు వంశీ ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ వంశీ రామరాజు, యువకళావాహిని అధ్యక్ష ఉపాధ్యక్షులు లంక లక్ష్మి నారాయణ, బొప్పన బుజ్జి, శ్రీ భాగిశాస్త్రి, జి.వి.ఆర్. ఆరాధన వ్యవస్థాపకులు గుదిబండి వెంకటరెడ్డి, ఆరాధన అధినేత లోకం కృష్ణయ్య, కథక్ నాట్యగురువు అంజిబాబు, కనకదుర్గ నృత్య విభావరి నాట్య గురువు శ్రీమతి నిర్మల ప్రభాకర్, ఆదర్శ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కుసుమ భోగరాజు, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, పాత్రికేయులు పవన్ కుమార్ లను సన్మానించారు. వీరంతా వై.కె.నాగేశ్వరరావు గారికి అత్యంత ఆప్తులు కావడం విశేషం. పురస్కారాల ఎంపిక కమిటీ చైర్మన్ గా డాక్టర్ మహ్మద్ రఫీ వ్యవహరించారు. శృతిలయ సంస్థ కార్యదర్శి, నవరస గాయని శ్రీమతి ఆమని, శ్రీ చంద్రశేఖర్ పర్యవేక్షించారు. ఇదే వేదిక పై కనకదుర్గ నృత్య విభావరి శ్రీమతి నిర్మల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆమని గారిని వై.కె.స్మారక పురస్కారం తో ప్రత్యేకంగా సన్మానించడం విశేషం. ఈ సందర్భంగా ఆమనిగారి నేతృత్వంలో శ్రీ చంద్రతేజ, శ్రీమతి వి.కె.దుర్గ, శ్రీ సుభాష్, శ్రీ బి.శ్రీనివాస్, శ్రీ రాజన్ తదితరులు ఎస్.జానకి పాటలు ఆలపించి “స్నేహని కన్నా మిన్న లోకాన లేదురా” అనే సందేశాన్ని చాటిచెప్పారు. ఎ.తులసీరాం, పి.ఎం.కె.గాంధీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
అది అటవీ ప్రాంతం.చుట్టూ పచ్చని చెట్లు. రోడ్డు ఖాళీగా ఉంది. మార్నింగ్ వాకర్స్ అలా రోడ్డుపై వెళ్తున్నారు. ఇంతలో పెద్దపులి రోడ్డెక్కింది. అంతే దాన్ని చూసిన ఓ వ్యక్తికి గుండె ఆగింది. ఆసుపత్రికి తీసుకోయేలోపే దారుణం జరిగింది. అసలేం జరిగిందటే… మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన ప్రవీణ్ మార్తే గురువారం ఉదయం మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లాడు. అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కన కారును పార్క్ చేశాడు. అక్కడ రోడ్డుపై నడుస్తుండగా ఒక్కసారిగా పులి రోడ్డెక్కింది. దాన్ని చూసిన ప్రవీణ్ భయంతో వణికిపోయాడు.పులి దాడి చేస్తుందేమోనని కంగారు పడ్డాడు. పరుగు తీయబోయి కుప్పకూలాడు. ఇది చూసిన మార్నింగ్ వాకర్స్ ప్రవీణ్ దగ్గరకు వచ్చారు. ప్రవీణ్‌కు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో అంబులెన్స్ కు ఫోన్ చేసి రప్పించారు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రవీణ్ ప్రాణాలు విడిచాడు. ఆలస్యం కాకుంటే… కాల్ చేసిన గంట తర్వాత అంబులెన్స్ వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అంబులెన్స్ త్వరగా వచ్చి ఉంటే ప్రవీణ్ ప్రాణాలు దక్కేవని వారంటున్నారు. గతంలో కూడా కొందరికి ఈ ప్రాంతంలో పులి కనిపించింది. ఇక్కడ పులి తిరుగుతుందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని కొందరు అంటున్నారు. పులి చిక్కిందోచ్ అటు చంద్రపూర్ అటవీ ప్రాంతంలో తిరుగుతున్న పులిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. నాలుగు నెలలుగా ఈ ప్రాంతంలో సంచరిస్తోంది. గతంలో నలుగురిపై దాడి చేసి చంపేసింది. ఎంతకాలంగా పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు శుక్రవారం పులిని బంధించారు. చంద్రపూర్‌లో కనిపించిన పులి..ఇప్పడు పట్టుకున్న ఒకటేనా,కాదా అనే క్లారిటీ లేదు.
అతడు తన బేబీ నామకరణ మహోత్సవం చాలా గ్రాండ్ గా చేద్దామనుకుని, పురోహితుడిని కూడా మాట్లాడుకున్నాడు. తన బేబీకి చక్కని పేరు పెట్టాలని ఆలోచిస్తున్న అతనికి అతని తాతయ్య బామ్మలు, తల్లిదండ్రులు, రక్తసంబంధీకులేకాక, ఆ ఫంక్షన్ కోసం ఇంటికొచ్చిన బంధువులంతా బేబీకి తమ పేరు పెట్టవద్దంటే తమ పేరు పెట్టవద్దని కరాఖండీగా చెప్పేశారు. చివరికి ఆఫీసులో అతని బాసు కూడా ఈ విషయమై అతడిని హెచ్చరించాడు. పుట్టక పుట్టక పుట్టిన తన బేబీకి చక్కగా పేరు పెడదామనుకుంటే ఇలా అందరూ తమవారి పేర్లు పెట్టవద్దంటూ అడ్డం తిరగటంతో అతడు చికాకు పడిపోయాడు. ఎందుకలా అందరూ అతనికి వ్యతిరేకంగా మాట్లాడారు? దీని వెనక గల కారణం ఏమిటి? బొరుసు చంద్రరావు స్మారక ఉగాది కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకున్న గండ్రకోట సూర్యనారాయణ శర్మ హాస్య కథ ‘నీ పేరేంటో చెప్పు బేబీ’ తప్పక చదవండి. 2. యతి : ట్రెక్కింగులో ఆ నలుగురు యువకులూ అసాధారణ నిపుణులే. దేశంలోని వేర్వేరు ప్రదేశాలలో ఉండే ఆ నలుగురికీ కుటుంబ అవసరాలకోసం డబ్బు సంపాదన అత్యావశ్యకమైంది. అందుకుగాను వారు ఒక అజ్ఞాత వ్యక్తి చెప్పిన ఒక ప్రమాదకరమైన అసైన్మెంట్ ను ఒప్పుకోవాల్సివచ్చింది. రెండు యతులను తెచ్చి ఆ వ్యక్తికి అప్పగించటమే ఆ అసైన్మెంట్. యతి అనేది మనిషి, కోతి కలగలిసినట్లు భీకర ఆకారంలో మంచుమనిషి అనీ, హిమాలయ పర్వత ప్రాంతాలలో మాత్రమే ఈ యతులు నివసిస్తాయనీ వారికి తెలుసు. అందుకే యతులను తీసుకురావటానికి ఆ నలుగురూ హిమాలయపర్వత ప్రాంతానికి బయలుదేరారు. భయంకరమైన చలిలో కత్తులతో కోస్తున్నట్లుగా వీచే మంచుగాలులకు, తుపానులకు తట్టుకుని ఎలాగైతేనేం రెండు యతులను వారు కనిపెట్టగలిగారు. ఆపైన వారేం చేశారు? ఆ రెండు యతులను బంధించారా? తమకిచ్చిన ఆ అసైన్మెంట్ పూర్తిచేశారా? కొసమెరుపు కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన శ్రీసుధామయి అత్యంత సాహసోపేతమైన కథ ‘యతి’ తప్పక చదవండి. 3. పోలీస్ స్టోరీ : ఆ ఊరికి కొత్తగా పోస్టింగ్ వచ్చిన యువ ఎస్సై, ఒక వ్యక్తి మిస్సింగ్ కేస్ దర్యాప్తులో భాగంగా సిటీలోకి వచ్చిపోయే వాహనాలు చెకింగ్ చేయటం మొదలుపెట్టాడు. ఒక్కో వాహనాన్ని చెక్ చేస్తున్న ఆ ఎస్సైకి, ఒక కారు వెనుక సీట్లో ఒక వ్యక్తి పడుకుని ఉండటం కనిపించింది. అతని విషయమై విచారిస్తే, అతడు తన తమ్ముడనీ, బాగా తాగి పడుకున్నాడనీ ఆ కార్ డ్రైవర్ చెప్పటంతో సరేనంటూ, కారు పేపర్లన్నీ చెక్ చేసి, అన్నీ సవ్యంగా ఉండటంతో అతన్ని వెళ్లిపొమ్మన్నాడు. తర్వాత కానిస్టేబుల్ తో మాట్లాడుతూ పోలీసింగ్ అంటే ఏమిటో చెప్తూ, తాను వెళ్ళమన్న ఆ కారును మళ్ళీ ఆపించాడు. ఆ కార్ ఎందుకు ఆపించాడు? అందులో ఏముంది? గొర్లి శ్రీనివాసరావు ఉత్కంఠ కలిగించే క్రైమ్ కథ ‘పోలీస్ స్టోరీ’ తప్పక చదవండి. 4. పున్నమి రేడు : పున్నమి వెన్నెల వస్తే చాలు ఆమె పరవశించిపోతుంది. ఆ పండు వెన్నెలలో తన జీవితేశ్వరునితో ఎన్నెన్నో అనుభూతులను పంచుకోవాలని ఆమె ఆరాటపడింది. కానీ ఆయుర్వేద వైద్యుడైన ఆమె భర్త ప్రతి పున్నమి రాత్రీ తన భార్య ఊసు పట్టించుకోకుండా, ఎకరం భూమిలో తాను పెంచుతున్న ఆయుర్వేద మొక్కల మధ్య తిరుగుతూ, ఒక్కో మొక్కనీ పలకరిస్తుంటాడు. మిగిలిన రోజుల్లో కూడా రాత్రిళ్ళు అతడు ఆ మొక్కల గురించే ఉత్సాహంగా మాట్లాడుతుంటే ఆమె ఓపికగా వినేది. అయితే ‘ఆ అందమయిన వెన్నెల రాత్రులను తాము ప్రియసంభాషణలతో, ప్రణయ సన్నివేశాలతో ఎప్పుడు నింపుకుంటామా’ అని ఆమె విరహతాపంతో ఎదురుచూసేది. అతనిలో మార్పు తీసుకురావటానికి ఆమె చివరికి ఏం చేసింది? అతనిలో మార్పు వచ్చిందా? పసుపులేటి సత్య శ్రీనివాస్ రచించిన రసరమ్య ప్రణయ గాథ ‘పున్నమి రేడు’ చదవండి. 5. ఫ్యాన్సీ నంబర్ : అతడు మోజుపడి తన ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ కు ఒక ఫ్యాన్సీ నంబర్ని తీసుకున్నాడు. ఆ నంబర్ని చూసిన అతడి స్నేహితుడు ఆ నంబర్ చాలా బాగుందనీ, తను కొత్తగా పెట్టిన బిజినెస్ అభివృద్ధి చెందటం కోసం వాడుకుంటానని బ్రతిమాలటంతో అతడు ఒప్పుకున్నాడు. ఇక ఆరోజునుంచి అతడికి ఫోన్ల మీద ఫోన్లు రావటం మొదలుపెట్టాయి. ఆ రాంగ్ కాల్స్ అతడికి నిద్ర లేకుండా చేశాయి. దానికి తోడు అతని స్నేహితుడు వారపత్రికలు, ఆడియో రికార్డింగ్ షాపు, రెస్టారెంట్, క్యాటరింగ్, టైలరింగ్ అంటూ రకరకాల వ్యాపారాలు మారుస్తూ ఉండటంతో అతడికి ఆ స్నేహితుడి బిజినెస్ తాలూకు కష్టమర్లు ఫోన్లో ఇతడిని సతాయించటం మొదలుపెట్టారు. చివరికి అతడు తన స్నేహితుడి బెడద ఎలా వదిలించుకున్నాడు? ఆ ఫ్యాన్సీ నంబర్ చివరికి ఏమైంది? బుద్ధవరపు కామేశ్వరరావు రచించిన ఫన్నీ స్టోరీ ‘ఫ్యాన్సీ నంబర్’ తప్పక చదవండి. 6. అందరూ అనుమానితులే : ఆ దంపతులు ఊరికి వెళ్ళి వచ్చేసరికి, ఇంట్లో ఉన్న వారి కూతురు మృతురాలై పడి ఉంది. పక్కనే నిద్రమాత్రల సీసా పడి ఉండటంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని అనుకున్నారు. కానీ పోలీసులు వచ్చి ఆమెది ఆత్మహత్య కాదనీ, ఎవరో ఆమె గొంతు నులిమి హత్య చేశారనీ చెప్పటంతో ఆ దంపతులు హతాశులయ్యారు. గత కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్న ఒక యువకుడు, ఆమెకు పెళ్లి సంబధం కుదిరిందని తెలిసి, వచ్చి వెళ్లాడని వాచ్ మెన్ చెప్పటంతో, ఆ యువకుడిపై అనుమానం బలపడింది. ఆఫీసులో ఆమె కొలీగ్ కూడా ఆమెతో చాలా గొడవ పడిందని తెలిసి, ఆమెను కూడా అనుమానించారు. అయితే ఆమె సెల్ ఫోన్లో వాట్సాప్ చాట్ చూశాక హత్య చేసిందెవరో పోలీసులకు తెలిసిపోయింది. ఇంతకూ ఆమెను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? డి.వి.డి. ప్రసాద్ క్రైమ్ కథ ‘అందరూ అనుమానితులే’ లో ఈవారం సహరిలో చదవండి.
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలను నైజాంలో విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ చిరంజీవి, బాలయ్య చిత్రాలతో మొదటి అడుగు వేయనున్నారట. Sambi Reddy First Published Nov 10, 2022, 5:22 PM IST నైజాం కింగ్ గా దిల్ రాజు అవతరించాడు. ఆయన చెప్పిందే వేదంగా మారుతుంది. ఈ క్రమంలో కోట్లు కుమ్మరించి సినిమాలు తీస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ లోకి ప్రవేశించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇటీవల ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. మొదటగా తమ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారట. ఈ రెండు చిత్రాల నైజాం థియేట్రికల్ రైట్స్ రూ. 35 కోట్లుగా వాల్యూ కట్టారట. వాల్తేరు వీరయ్య సినిమాను దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి ఊర మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. సినిమా వైజాగ్ నేపథ్యంలో సాగనుంది. రవితేజ కీలక రోల్ చేస్తున్నారు. దీపావళి కానుకగా విడుదలైన టీజర్ మెప్పించింది. ఇక వీరసింహారెడ్డి చిత్రాన్ని క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. వీరసింహారెడ్డి టైటిల్ తో పాటు ప్రోమోలు అదిరిపోయాయి. అఖండ మూవీతో ఫార్మ్ లోకి వచ్చిన బాలయ్య వీరసింహారెడ్డిపై కూడా భారీ అంచనాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ రెండు చిత్రాల్లో ఒకదాన్ని సంక్రాంతి బరి నుండి తప్పిద్దాం అనుకున్నారట. అయితే బాలయ్య, చిరంజీవిలలో ఎవరూ కాంప్రమైజ్ కాలేదట. సంక్రాంతి సీజన్ కావడంతో ఎన్ని చిత్రాలు విడుదలైన కలెక్షన్స్ రాబట్టవచ్చు. దీంతో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు ఒకేసారి విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. బాలయ్య-చిరంజీవి సంక్రాంతి బరిలో పోటీపడి చాలా కాలం అవుతుంది. మరి ఈసారి విన్నర్ ఎవరు అవుతారో చూడాలి.
ఆళ్లగడ్డ నియోజకవర్గ రుద్రవరం ఉయ్యాలవాడ మండలంలోని సర్వాయిపల్లె గ్రామానికి చెందిన బెల్లం సంధ్య అనే యువతి అదృశ్యం అయినట్లు ఏఎస్సై రామక్రిష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి పోయిందన్నారు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదని యువతి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు చేశారన్నారు. అదే గ్రామానికి చెందిన కోడూరు శివకుమార్‌పై అనుమానం ఉన్నట్లు ఆమె తెలిపారు. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com Categories National International Business Sports Health Education Science Technology Foods Entertainment Lifestyle
World Heart Day : గుండెపోటు అంటే కార్డియాక్ అరెస్ట్ లాంటిదేనని ప్రజలు తరచుగా అనుకుంటారు. అయితే, మీరు తెలుసుకోవలసిన తేడాలు ఉన్నాయి. గుండెపోటు మరియు కార్డియాక్ అరెస్ట్ మధ్య తేడాను గుర్తించడానికి ఈ రెండు ప్రక్రియలలో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడం మొదటి ముఖ్యమైనది. గుండెపోటు అంటే ఏమిటి? బ్లాక్ చేయబడిన ధమని ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం గుండెలోని వివిధ భాగాలకు చేరకుండా నిరోధించినప్పుడు గుండెపోటు రావచ్చు. బ్లాక్ చేయబడిన ధమని తిరిగి తెరవడంలో విఫలమైతే, సాధారణంగా ఆ ధమని ద్వారా పోషణ పొందిన గుండె భాగం చనిపోతుంది. ఒక వ్యక్తి చికిత్స లేకుండా ఎక్కువ కాలం వెళితే, ఎక్కువ నష్టం జరుగుతుంది. Also Read : మీ రక్తాన్ని సహజంగా శుద్ధి చేయడానికి 5 సులభమైన మార్గాలు గుండెపోటు యొక్క లక్షణాలు: ఒక వ్యక్తికి గుండెపోటు ఉంటే, అతను లేదా ఆమె తీవ్రమైన మరియు వెంటనే లక్షణాలను అనుభవిస్తారు. మీరు ఛాతీ నొప్పి, ఎడమ చేయి నొప్పి, అలసట, మైకము, చల్లని చెమట, అజీర్ణం, వికారం, అసౌకర్యం, శ్వాసలోపం లేదా భుజం అసౌకర్యం మొదలైనవి అనుభవించవచ్చు. కొన్నిసార్లు, గుండెపోటు యొక్క లక్షణాలు నెమ్మదిగా ప్రారంభమవుతాయి మరియు గంటలు, రోజులు లేదా వారాల పాటు కొనసాగుతాయి. గుండెపోటు రాకముందే. మీరు ఈ లక్షణాలను గుర్తించి, వైద్య సహాయం తీసుకోవాలి. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? ఒకరు గుండె ఆగిపోవచ్చు, దీనిని ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ (SCA) అని కూడా అంటారు. క్రమరహిత హృదయ స్పందన (అరిథ్మియా అని పిలుస్తారు) ఫలితంగా గుండెలో విద్యుత్ లోపం కారణంగా దీనిని చూడవచ్చు. గుండె యొక్క పంపింగ్ చర్యకు అంతరాయం ఏర్పడినప్పుడు, గుండె తగినంత రక్తాన్ని ఊపిరితిత్తులు మరియు మెదడు వంటి శరీరంలోని ఇతర భాగాలకు పంప్ చేయలేకపోతుంది. అతను/ఆమె సకాలంలో చికిత్స పొందకపోతే అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వల్ల కూడా ఒకరు ప్రాణాలు కోల్పోవచ్చు. కాబట్టి, సమయానుకూలంగా జోక్యం చేసుకోవడం చాలా ముఖ్యం Also Read : డెంగ్యూ చికిత్స కోసం బొప్పాయి ఆకు రసం ఎలా పనిచేస్తుంది ? ఆకస్మిక గుండె ఆగిపోవడానికి కారణాలు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ యొక్క ఇతర కారణాలు కొరోనరీ ఆర్టరీ వ్యాధి, పుట్టుకతో వచ్చే గుండె పరిస్థితులు మరియు విపరీతమైన శారీరక శ్రమలతో కనుగొనబడ్డాయి. ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌కు ఇతర ప్రమాద కారకాలు కుటుంబ చరిత్ర, గుండె ఆగిపోవడం, మధుమేహం, మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు పొటాషియం మరియు మెగ్నీషియం యొక్క రక్త స్థాయిలలో హెచ్చుతగ్గులు లేదా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ యొక్క ముందస్తు ఎపిసోడ్ కూడా. కాబట్టి, గుండె జబ్బులు, లేదా ఊబకాయం యొక్క లక్షణాలను విస్మరించవద్దు మరియు ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోండి. గుండెపోటు మరియు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ రెండూ సమానంగా ప్రమాదకరమని మరియు తక్షణ వైద్య సహాయం అవసరమని గుర్తుంచుకోండి. ఇవి అత్యవసర పరిస్థితులు కాబట్టి మీరు బతికే అవకాశం కోసం సమీపంలోని ఆసుపత్రికి చేరుకోవడానికి ప్రయత్నించాలి.
అనగనగా ఒక చెరువులో కొన్ని చేపలు ఉండేవి. ఒక రోజు ఒక అబ్బాయి ఆ చేపలలో నుంచి చిన్నచేపను పట్టుకున్నాడు. దానిని తీసుకుని వెళ్లి ఇంట్లో ఉన్న తొట్టెలో కొంతకాలం పెంచాడు. అది సహజమైన వాతావరణంలో పెరిగితేనే సంతోషంగా ఉంటుందని ఎవరో చెప్పడంతో దానిని తిరిగి అదే చెరువులో వదిలేశాడు. ఆ చేప పిల్ల తిరిగి తనకు స్వేచ్ఛ దొరికినందుకు, తనవాళ్లను కలుసుకున్నందుకు చాలా సంతోషించింది. కానీ అది తిరిగి వచ్చిన కొన్నిరోజులకే ఆ చెరువులో నీళ్లు తగ్గిపోయాయి. వేసవి కాలంలో ఎండలు గతంలో కంటే ఎక్కువగా ఉండడంతో వేడికి నీరు ఆవిరై చెరువులో నీళ్లు బాగా తగ్గాయి. చేపపిల్లకు ఆ వేడిని తట్టుకోవడం కష్టమైంది. మిగిలిన చేపలు మాత్రం వేడిని తట్టుకోగలిగాయి. ‘‘నేను నీడ పట్టున హాయిగా ఉండేదాన్ని. అనవసరంగా మళ్లీ ఈ చెరువులో వచ్చి పడ్డాను. అక్కడే ఉంటే చల్లగా, హాయిగా ఉండేదాన్ని’’ అని బాధ పడసాగింది. అది గమనించిన ఒక పెద్దచేప, దాని బాధనంతా ఓపికగా విని అర్థం చేసుకుంది. ‘‘ఏదో ఒక రకంగా నన్ను తిరిగి ఇంతకు ముందు ఉన్న చోటికే పంపించేయండి’’ అని పెద్దచేపను బతిమిలాడింది చిన్నచేప. ‘‘ఈ వేడి ఎంతో కాలం ఉండదు. కొన్నిరోజులు కష్టపడవలసి వస్తుందని నువ్వు జీవితమంతా ఎక్కడో బందీగా ఉంటావా? స్వేచ్ఛ కోసం ఈ మాత్రం ఇబ్బందులను కూడా భరించలేని నువ్వు మా మధ్య ఉండక్కర్లేదు’’ అని చివాట్లు పెట్టింది. అప్పుడు చిన్న చేప ‘‘అయితే నేను వెళ్లను. ఇక్కడే ఉంటాను’’ అంది. ఆ తర్వాత కొన్నిరోజులకు వర్షాలు కురిశాయి. చెరువులో నీళ్లు పెరిగాయి. వేడంతా తగ్గిపోయింది. తొందరపడి వెళ్లిపోకుండా అక్కడే ఉన్నందుకు చిన్నచేప చాలా సంతోషించింది. వీరిచే పోస్ట్ చేయబడింది గౌతమి వద్ద 12:44 PM కామెంట్‌లు లేవు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: చేప పాట్లు, చేపపిల్ల, వేసవి కాలంలో ఎండలు, neethikathalu telugulo, podupukathalu, telugu neethi kathalu కిట్టూ అనగనగా ఒక ఊరిలో కిట్టూ అనే అబ్బాయి ఉండేవాడు. కిట్టూ తల మీద జుట్టు ఎక్కువ ఉండేది కాదు. దాంతో ఆ ఊరిలో ఉండే ఆకతాయి పిల్లలు కిట్టూని ‘గుండూ... గుండూ...’ అని ఏడిపించేవారు. అందుకే కిట్టూ ఆడుకోవడానికి బయటికి వెళ్లే వాడు కాదు. ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆ ఊరి పిల్లలందరూ ఆడుతూ ఉంటే కిట్టూ ఇంటి లోపల నిలబడి చూసేవాడు. రోజూ సాయంత్రం ఆ వీధిలో నుంచి ఒక తాతగారు నడుచుకుంటూ వెళ్లే వారు. అక్కడ ఆడుకుంటున్న వారిలో ఆకతాయి పిల్లలు ఎంత హేళనగా మాట్లాడినా ఆయన పట్టించుకోకుండా వెళ్లి పోయేవాడు. దాంతో తాతగారికి చెవులు సరిగా వినిపించవని అనుకున్నారు వాళ్లు. అప్పటినుంచి ఆయన ఆ దారిలో వెళుతున్నపుడల్లా ‘చెవిటి తాతా’ అని అరిచేవారు. ఆయన ఏమీ వినబడనట్టే వెళ్లి పోయేవాడు. ఒక రోజు కిట్టూ గేటు దగ్గర నిలబడి చూస్తున్నాడు. రోజూ అక్కడ ఆడుకునే పిల్లలు ఎవరూ ఆ రోజు ఇంకా రాలేదు. రోజూ లాగే తాతగారు ఆ వీధిలో నుంచి వెళ్తున్నారు. రోజూ ఎవరో ఒకరు ఆ తాతని ఏదో ఒక మాట అనడం గుర్తు వచ్చిన కిట్టూ ‘‘చెవిటి తాతా! నీ పేరేంటి?’’అని అరిచాడు. వెంటనే తాత గారు కిట్టూ దగ్గరగా వచ్చి ‘‘నా పేరు రాఘవయ్య’’ అని చెప్పాడు. కిట్టూ ఆశ్చర్యంతో నోరు తె రిచాడు. భయంగా లోపలికి పారిపోబోయాడు. అప్పుడు రాఘవయ్య కిట్టూని చేతిలో పట్టుకొని ఆపాడు. ‘‘చూడు బాబూ! నిన్ను వాళ్లు హేళన చేస్తారనే కదా నువు ఆడుకోవడానికి వెళ్లకుండా ఉంటున్నావు. మరి నువ్వు కూడా వాళ్లలాగే ప్రవర్తిస్తే ఎలా? నాకు చెవుడు లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఎవరేమన్నా నేను పట్టించుకోను. కానీ అందరూ నాలాగా ఉండరు కదా! నీలాగ బాధ పడే వాళ్లు కూడా ఉంటారు. కాబట్టి హేళనగా మాట్లాడడం మంచిది కాదు. ఇదంతా మిగిలిన వాళ్లెవరికీ చెప్పకుండా నీతో మాత్రమే ఎందుకు చెపుతున్నానంటే, నువు మంచి పిల్లాడివి. మంచి విషయాలు చెపితే అర్థం చేసుకునే మనసు నీకు ఉందని నా నమ్మకం’’ అని రాఘవయ్య వెళ్లిపోయాడు. ఆయన చెప్పిన మాటల గురించే కిట్టూ చాలా సేపు ఆలోచించాడు. ఆయన చెప్పినది బాగా నచ్చింది కిట్టూకి. ఆ రోజు తర్వాత కిట్టూ ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. అంతే కాకుండా ఎవరేమన్నా పట్టించుకోకుండా ధైర్యంగా బయటికి వెళ్లి ఆడుకోవడం మొదలు పెట్టాడు. వీరిచే పోస్ట్ చేయబడింది గౌతమి వద్ద 12:42 PM 1 కామెంట్‌: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: కిట్టూ, హేళనగా మాట్లాడడం మంచిది కాదు, neethi kathalu, podupukathalu 8 ఆగస్టు, 2011 ప్రమాదంలో పడ్డ బాతు అనగనగా ఒక చిన్న అడవిలో రెండు బాతుపిల్లలు ఉండేవి. అవి ప్రతిరోజూ ఏదో ఒక పోటీ పెట్టుకునేవి. పరుగు పందెమో, ఈత పోటీయో, ఎగిరే పోటీయో పెట్టుకుని సంతోషిస్తూ ఉండేవి. అవి ఆడుకోవడానికి వెళ్లేటపుడు తల్లి బాతు చాలా జాగ్రత్తలు చెప్పేది. బాతు పిల్లలు ఆ జాగ్రత్తలన్నీ పాటించి ఆటలన్నీ ముగిశాక క్షేమంగా తిరిగి వస్తుండేవి. ఒకరోజు అవి ఒక నదిలో ఈత పోటీ పెట్టుకున్నాయి. రెండూ ఒకసారే ఈదడం మొదలుపెట్టాయి. ఒక బాతుపిల్ల నీటి ప్రవాహం ఎక్కువగా లేని వైపు నుంచే ఈదుకుంటూ వెళ్తోంది. కానీ రెండోది మాత్రం ఎక్కువ కష్టపడి ఈదకుండానే గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆత్రుతతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నవైపుకి వెళ్లింది. ‘‘ నీరు వేగంగా వెళ్లేచోట ఈదకూడదు. నీటితో పాటు కొట్టుకుపోతారు. అక్కడ సుడిగుండాలు కూడా ఉంటాయి. అందుకే అటువైపు వెళ్లకూడదు’’ అని తల్లి చెప్పిన జాగ్రత్త గుర్తుకు వచ్చింది. కాసేపు ఆలోచించి ‘‘నేను ఇప్పుడు కాస్త పెద్దగా అయ్యాను కదా! ప్రమాదం ఏమీ ఉండదులే!’’ అనుకుంది ఆ బాతుపిల్ల. కానీ అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. బాతుపిల్ల వేగంగా ఉన్న నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోసాగింది. బాతుపిల్ల భయపడింది. తల్లి చెప్పినమాట వినకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డానని బాధ పడింది. ఇంకో బాతుపిల్ల దానిని గమనించింది. కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. అక్కడ చెట్టు మీద ఉన్న ఒక పెద్ద కోతి అంతా గమనించింది. ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు దూకుతూ వెళ్లి ఒక చెట్టు కొమ్మ మీది నుంచి నదిలోకి వేలాడుతూ తోకతో బాతుపిల్లను చుట్టి బయటికి లాగేసింది. బాతుపిల్ల ప్రమాదం నుంచి బయటపడింది. బాతుపిల్లలు రెండూ కోతికి కృతజ్ఞతలు తెలిపాయి. ప్రమాదం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆ బాతుపిల్ల అప్పటి నుంచి తల్లి చెప్పిన జాగ్రత్తల్ని అన్నిటినీ పాటించడం మొదలుపెట్టింది.
చిరు ధాన్యాలు, కూరగాయలు, చిలకడదుంపలు ఇలా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాల... హెల్త్ టిప్స్రో: జా లిప్స్... సొసైటీలో చర్మ సౌందర్యం ఎంతో ప్రాముఖ్యమైంది. స్టేటస్ మైంటైన్ చెయ్యలలనుకునే వారికి స్కిన్క్ విషయంలో అత్యంత శ్రద్... New Device Enables Heart Surgery with out stopping Heart Scientists say that they have developed a unique device that will enable doctors to perform heart bypass surge...
చిరు ధాన్యాలు, కూరగాయలు, చిలకడదుంపలు ఇలా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాల... హెల్త్ టిప్స్రో: జా లిప్స్... సొసైటీలో చర్మ సౌందర్యం ఎంతో ప్రాముఖ్యమైంది. స్టేటస్ మైంటైన్ చెయ్యలలనుకునే వారికి స్కిన్క్ విషయంలో అత్యంత శ్రద్... New Device Enables Heart Surgery with out stopping Heart Scientists say that they have developed a unique device that will enable doctors to perform heart bypass surge...
గాడ్ ఫాద‌ర్ స‌క్సెస్ మీట్‌లో గరికపాటి ఎపిసోడ్ ప్రస్తావన క‌నిపించింది. ఈ వేదిక‌పై మాట్లాడ‌డానిక వ‌చ్చిన వ‌క్తలు… గ‌రిక‌పాటి ఎపిసోడ్ ని గుర్తు చేస్తూ మాట్లాడారు. ముందుగా…ద‌ర్శ‌కుడు బాబి మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇండైరక్ట్ గా ప్రస్దావించారు. మెగాస్టార్ చిరంజీవి ని ఉద్దేశించి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో 'చిరంజీవి గారు.. ఫొటో సెషన్ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా' అని గరికపాటి అసహనం వ్యక్తం చేయడం వివాదానానికి దారి తీసింది. అయితే ఆ వివాదం చల్లారుతోందనుకున్న టైమ్ లో మళ్లీ నిప్పులు రాజేసినట్లైంది. తాజాగా గాడ్ ఫాద‌ర్ స‌క్సెస్ మీట్‌లో ఈ ప్రస్తావన క‌నిపించింది. ఈ వేదిక‌పై మాట్లాడ‌డానిక వ‌చ్చిన వ‌క్తలు… గ‌రిక‌పాటి ఎపిసోడ్ ని గుర్తు చేస్తూ మాట్లాడారు. ముందుగా…ద‌ర్శ‌కుడు బాబి మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇండైరక్ట్ గా ప్రస్దావించారు. డైరక్టర్ బాబి మాట్లాడుతూ... ”చిరంజీవి గారు ఆమ‌ద్య నిశ్శ‌బ్ద విస్పోట‌నం అన్నారు. ఆ మాట విలువ రెండ్రోజుల క్రిత‌మే తెలిసింది. ఎవడు ప‌డితే వాడు.. మాటిమాటికీ స‌రిసాటి రానివానోళ్లు అంతా మాట్లాడుతుంటే కూడా.. పట్టించుకోకుండా చిన్న చిరునవ్వుతో ఆయన త‌న ప‌ని తాను చేసుకొంటూ.. ఆ క్ష‌ణం అలాగే పోయాలే ఆయన పనికి వెళ్తున్నారు చూసారా అదీ చిరంజీవి అంటే..” అంటూ గ‌రిక‌పాటి ఎపిసోడ్‌ని ప‌రోక్షంగా గుర్తుకు తెచ్చారు. ఆ తర్వాత ఛోటా కె.నాయుడు ఇదే స్టేజిపై ఇదే టాపిక్ పై కాస్త ఘాటుగానే మండి ప‌డ్డారు. ”దేశంలో ఎంత‌మంది స్టార్లున్నా.. మెగాస్టార్ ముందు స‌రిపోరు. ఈమ‌ధ్య ఓ బుల్లి ఇన్సిడెంట్ జ‌రిగింది. ఆడెవ‌డో… ఫొటోలు తీసుకొంటామండీ… ఆయ‌నపై అభిమానంతో తీసుకొంటాం.. మాట్లాడేవాడు మ‌హా పండితుడు… ఆయ‌న అలా మాట్లాడొచ్చా అండీ.. అది త‌ప్పు క‌దా…అలాంటి వాడ్ని కూడా… చిరంజీవి గారు ఇంటికి ఆహ్వానిస్తానంటే.. ఇది క‌దా సంస్కారం.. ఇది క‌దా నేర్చుకోవాల్సింది.. అనిపించింది.. ఆయ‌న్నుంచి ఇదే నేర్చుకొంటాం కూడా” అంటూ గ‌రిక‌పాటి – చిరు ఎపిసోడ్ లో చిరువైపు నిల‌బ‌డి మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతోంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో గరికపాటి ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవి వచ్చారు. చిరుతో సెల్ఫీలు దిగేందుకు అక్కడున్న వారు పోటీలు పడ్డారు. దీంతో, గరికపాటి ప్రసంగానికి అంతరాయం కలిగింది. ఈ క్రమంలో... చిరంజీవి ఫొటో సెషన్ ఆపకపోతే తాను వెళ్లిపోతానని గరికపాటి అన్నారు. వెంటనే చిరంజీవి సెల్ఫీలు దిగడం ఆపేసి వచ్చారు. కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి ఇద్దరూ బాగానే మాట్లాడుకున్నారు. అయితే, చిరంజీవి సోదరుడు నాగబాబు చేసిన ట్వీట్లు వివాదాన్ని రాజేశాయి. ఏపాటి వాడైనా చిరంజీవి ఇమేజ్ ను చూస్తూ ఆ పాటి అసూయపడటం పరిపాటేనని నాగబాబు అన్నారు. నాగబాబు ట్వీట్ పై బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ మండిపడ్డారు. నిత్యం ప్రవచనాలతో సమాజాన్ని సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాది, ఆథ్యాత్మికవేత్తను పట్టుకుని... నటనావ్యాపారం తప్ప సమాజహితాన్ని మరిచిన ఒక చిత్ర వ్యాపారిని చూసి అసూయ చెందాడనడం ఆకాశం మీద ఉమ్మేయడం వంటిదేనని విమర్శించారు. జరిగిన పరిణామాల పట్ల ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఈ క్రమంలో, మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. గరికపాటి వారు ఏదో మూడ్ లో అలా అని ఉంటారని భావిస్తున్నామని తెలిపారు. అయితే, గరికపాటి లాంటి పండితుడు అలా అనకుండా ఉండాల్సిందన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాలని మాత్రమే భావించామని అన్నారు. అంతేతప్ప, ఆయనతో క్షమాపణలు చెప్పించుకోవాలని తాము కోరుకోలేదని నాగబాబు స్పష్టం చేశారు. గరికపాటి స్పందిస్తూ, ఎవరూ తనను ఇబ్బందిపెట్టలేదన్నారు. చిరంజీవి ఎంతో సహృదయుడని, ఈ విషయంపై ఆయనతో మాట్లాడతానని గరికపాటి వివరణ ఇచ్చారు. ఈ విషయం అందరికీ చెప్పండి... ఇవాళే తప్పకుండా మాట్లాడతాను అని భవానీ రవికుమార్ కు తెలిపారు. ఈ ఫోన్ కాల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో ప్రక్క గాడ్ ఫాధర్ సినిమాకి పాజిటివ్‌ రివ్యూస్‌ వస్తున్నాయి. `బాస్‌ ఈజ్‌ బ్యాక్‌` అంటున్నారు. చిరంజీవికి సరిగ్గా సరిపోయిన స్టోరీ అని, ఆయన తన విశ్వరూపం చూపించారని చెబుతున్నారు సినిమా చూసిన ఆడియెన్స్. ప్యూర్‌ మాస్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని, చిరంజీవి స్వాగ్‌ నెక్ట్స్ లెవల్‌. సల్మాన్‌ తన పాత్రని బాగా చేశాడని అంటున్నారు.
మీరు హోమ్ బటన్‌ను డబుల్ క్లిక్ చేసి, మీ అనువర్తనాలను స్క్రీన్ పైభాగంలో స్వైప్ చేయండి: మంచి ఆలోచన లేదా చెడు ఆలోచన? మీ ఐఫోన్ మరియు ఐప్యాడ్ అనువర్తనాలను మూసివేయడం ఉపయోగకరంగా ఉందా లేదా హానికరం కాదా అనే దానిపై ఇటీవల కొంత గందరగోళం ఉంది, ముఖ్యంగా బ్యాటరీ జీవితానికి సంబంధించి. ఇది మంచి ఆలోచన అని నేను ఎప్పుడూ చెప్పాను: మీ అనువర్తనాలను మూసివేయండి నా వ్యాసం యొక్క చిట్కా # 4 ఐఫోన్ బ్యాటరీ జీవితాన్ని ఎలా ఆదా చేయాలి. మీరు లేడీబగ్‌ను కనుగొన్నప్పుడు దాని అర్థం ఏమిటి ఈ వ్యాసంలో, నేను ఎందుకు వివరిస్తాను మీ అనువర్తనాలను మూసివేయడం మీ ఐఫోన్ బ్యాటరీ జీవితానికి సహాయపడుతుంది , అందించడానికి ఆపిల్ డెవలపర్ డాక్యుమెంటేషన్ నుండి సారాంశాలు దానికి మద్దతు ఇవ్వడానికి మరియు కొన్నింటిని చేర్చడానికి వాస్తవ ప్రపంచ పరీక్షల నుండి ఉదాహరణలు నేను ఆపిల్ డెవలపర్ సాధనాలు మరియు నా ఐఫోన్‌ను ఉపయోగించాను. నేను వ్రాసేటప్పుడు, నేను అందించే సమాచారం సహాయకరంగా మరియు సులభంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి. నేను సాధారణంగా చాలా సాంకేతికంగా ఉండను, ఎందుకంటే ఆపిల్ స్టోర్‌లో పనిచేసిన నా అనుభవం నాకు దానిని చూపించింది ప్రజల కళ్ళు మెరుస్తూ ఉంటాయి నేను మాట్లాడటం ప్రారంభించినప్పుడు ప్రక్రియలు , CPU సమయం , మరియు అనువర్తన జీవిత చక్రం . ఈ వ్యాసంలో, మేము కొంచెం లోతుగా డైవ్ చేస్తాము అనువర్తనాలు ఎలా పని చేస్తాయి కాబట్టి మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్ అనువర్తనాలను మూసివేయడం మీకు సరైనదా అనే దాని గురించి మీకు సమాచారం ఇవ్వవచ్చు. మొదట, మేము దాని గురించి మాట్లాడుతాము అనువర్తన జీవిత చక్రం , ఇది మీరు అనువర్తనాన్ని తెరిచిన క్షణం నుండి మూసివేసి జ్ఞాపకశక్తి నుండి క్లియర్ అయ్యే వరకు ఏమి జరుగుతుందో వివరిస్తుంది. అనువర్తన జీవిత చక్రం ఐదు ఉన్నాయి అనువర్తన స్థితులు ఇది అనువర్తన జీవిత చక్రం. మీ ఐఫోన్‌లోని ప్రతి అనువర్తనం ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది మరియు చాలా వరకు ఉన్నాయి అమలులో లేదు రాష్ట్రం. ఆపిల్ డెవలపర్ డాక్యుమెంటేషన్ ప్రతి ఒక్కటి వివరిస్తుంది: కీ టేకావేస్ అనువర్తనాన్ని వదిలివేయడానికి మీరు హోమ్ బటన్‌ను నొక్కినప్పుడు, అది నేపథ్య లేదా సస్పెండ్ చేయబడింది రాష్ట్రం. మీరు హోమ్ బటన్‌ను డబుల్ క్లిక్ చేసి, స్క్రీన్ పైన ఉన్న అనువర్తనాన్ని స్వైప్ చేసినప్పుడు మూసివేస్తుంది మరియు లోకి వెళుతుంది రన్నింగ్ కాదు రాష్ట్రం. అనువర్తనం రాష్ట్రాలు అని కూడా సూచిస్తారు మోడ్‌లు. అనువర్తనాలు నేపథ్య మోడ్ ఇప్పటికీ నడుస్తున్నాయి మరియు మీ బ్యాటరీని హరించడం, కానీ అనువర్తనాలు సస్పెండ్ మోడ్ వద్దు. అనువర్తనాలను స్వైప్ చేయడం: మూసివేయడం లేదా బలవంతంగా నిష్క్రమించడం? పరిభాష గురించి కొంత గందరగోళాన్ని తొలగించడానికి, మీరు మీ ఐఫోన్‌లోని హోమ్ బటన్‌ను డబుల్ క్లిక్ చేసి, స్క్రీన్ పైభాగంలో ఒక అనువర్తనాన్ని స్వైప్ చేసినప్పుడు, మీరు ముగింపు అనువర్తనం. బలవంతంగా విడిచిపెట్టడం అనువర్తనం వేరే ప్రక్రియ, నేను భవిష్యత్ వ్యాసంలో వ్రాయడానికి ప్లాన్ చేస్తున్నాను. గురించి ఆపిల్ యొక్క మద్దతు కథనం iOS మల్టీ టాస్కింగ్ దీనిని నిర్ధారిస్తుంది: “అనువర్తనాన్ని మూసివేయడానికి, ఇటీవల ఉపయోగించిన అనువర్తనాలను చూడటానికి హోమ్ బటన్‌ను రెండుసార్లు క్లిక్ చేయండి. మీరు మూసివేయాలనుకుంటున్న అనువర్తనంలో స్వైప్ చేయండి. ” మేము మా అనువర్తనాలను ఎందుకు మూసివేస్తాము? గురించి నా వ్యాసంలో ఐఫోన్ బ్యాటరీ జీవితాన్ని ఎలా ఆదా చేయాలి , నేను ఎప్పుడూ ఇలా చెప్పాను: “ప్రతిరోజూ లేదా రెండుసార్లు, మీ అనువర్తనాలను మూసివేయడం మంచిది. పరిపూర్ణ ప్రపంచంలో, మీరు దీన్ని ఎప్పటికీ చేయనవసరం లేదు మరియు చాలా మంది ఆపిల్ ఉద్యోగులు మీరు తప్పక చెప్పరు… అనువర్తనం ఉన్నప్పుడు చాలా బ్యాటరీ కాలువ సమస్యలు సంభవిస్తాయి అనుకుంటారు మూసివేయడానికి, కానీ లేదు. బదులుగా, అనువర్తనం నేపథ్యంలో క్రాష్ అవుతుంది మరియు మీ ఐఫోన్ బ్యాటరీ జీవులు మీకు కూడా తెలియకుండానే ప్రవహిస్తాయి. ” సంక్షిప్తంగా, ది ప్రధాన మీ అనువర్తనాలను మూసివేయాలని నేను సిఫార్సు చేస్తున్నాను అనువర్తనం ప్రవేశించనప్పుడు మీ బ్యాటరీ ఎండిపోకుండా నిరోధించండి నేపథ్య స్థితి లేదా సస్పెండ్ స్టేట్ అది తప్పక. గురించి నా వ్యాసంలో ఐఫోన్లు ఎందుకు వేడెక్కుతాయి , నేను మీ ఐఫోన్ యొక్క CPU (సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆపరేషన్ యొక్క మెదడులను) కారు ఇంజిన్‌తో పోలుస్తాను: మీరు పెడల్‌ను లోహానికి ఎక్కువసేపు ఉంచితే, కారు ఇంజిన్ వేడెక్కుతుంది మరియు ఇది చాలా గ్యాస్‌ను ఉపయోగిస్తుంది. ఐఫోన్ యొక్క CPU ఎక్కువ కాలం 100% వరకు పునరుద్ధరించబడితే, ఐఫోన్ వేడెక్కుతుంది మరియు మీ బ్యాటరీ త్వరగా తగ్గిపోతుంది. అన్ని అనువర్తనాలు మీ ఐఫోన్‌లో CPU ని ఉపయోగిస్తాయి. సాధారణంగా, ఒక అనువర్తనం తెరిచినప్పుడు రెండవ లేదా రెండుసార్లు పెద్ద మొత్తంలో CPU శక్తిని ఉపయోగిస్తుంది, ఆపై మీరు అనువర్తనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు తక్కువ పవర్ మోడ్‌కు తిరిగి థ్రోట్ చేస్తుంది. అనువర్తనం క్రాష్ అయినప్పుడు, ఐఫోన్ యొక్క CPU తరచుగా 100% వద్ద చిక్కుకుంటుంది. మీరు మీ అనువర్తనాలను మూసివేసినప్పుడు, అనువర్తనం తిరిగి రావడం వలన ఇది జరగదని మీరు నిర్ధారించుకోండి రన్నింగ్ స్టేట్ కాదు . అనువర్తనాన్ని మూసివేయడం హానికరమా? ఖచ్చితంగా కాదు. మీ Mac లేదా PC లోని అనేక ప్రోగ్రామ్‌ల మాదిరిగా కాకుండా, ఐఫోన్ అనువర్తనాలు మీ డేటాను సేవ్ చేయడానికి ముందు “సేవ్ చేయి” క్లిక్ చేసే వరకు మీరు వేచి ఉండరు. ఆపిల్ డెవలపర్ డాక్యుమెంటేషన్ అనువర్తనాలు టోపీ డ్రాప్ వద్ద ముగించడానికి సిద్ధంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి: 'ఎప్పుడైనా జరగడానికి అనువర్తనాలు సిద్ధంగా ఉండాలి మరియు వినియోగదారు డేటాను సేవ్ చేయడానికి లేదా ఇతర క్లిష్టమైన పనులను చేయడానికి వేచి ఉండకూడదు. సిస్టమ్ ప్రారంభించిన ముగింపు అనువర్తనం యొక్క జీవిత చక్రంలో ఒక సాధారణ భాగం. ” ఎప్పుడు మీరు అనువర్తనాన్ని మూసివేయండి, ఇది కూడా సరే: “మీ అనువర్తనాన్ని ముగించే సిస్టమ్‌తో పాటు, మల్టీటాస్కింగ్ UI ని ఉపయోగించి వినియోగదారు మీ అనువర్తనాన్ని స్పష్టంగా ముగించవచ్చు. వినియోగదారు ప్రారంభించిన ముగింపు సస్పెండ్ చేయబడిన అనువర్తనాన్ని ముగించినట్లే ఉంటుంది. ' ఐఫోన్ మరియు ఐప్యాడ్ అనువర్తనాలను మూసివేయడానికి వ్యతిరేకంగా వాదన మీ అనువర్తనాలను మూసివేయడానికి వ్యతిరేకంగా ఒక వాదన ఉంది మరియు ఇది వాస్తవానికి ఆధారపడి ఉంటుంది. అయితే, ఇది a పై ఆధారపడి ఉంటుంది చాలా ఇరుకైన వీక్షణ వాస్తవాలు. దీని యొక్క దీర్ఘ మరియు చిన్నది ఇక్కడ ఉంది: నుండి అనువర్తనాన్ని తెరవడానికి ఎక్కువ శక్తి అవసరం అమలులో లేదు దాని నుండి తిరిగి ప్రారంభించే దానికంటే రాష్ట్రం నేపథ్య లేదా సస్పెండ్ చేయబడింది రాష్ట్రం. ఇది ఖచ్చితంగా నిజం. ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ మెమరీని సమర్ధవంతంగా నిర్వహిస్తుందని నిర్ధారించుకోవడానికి ఆపిల్ చాలా ప్రయత్నాలు చేస్తుంది, ఇది బ్యాటరీ అనువర్తనాలు వాటిలో ఉన్నప్పుడు వాటిని తగ్గిస్తుంది నేపథ్య లేదా సస్పెండ్ చేయబడింది రాష్ట్రం. ఇది కూడా నిజం. మీ అనువర్తనాలను మూసివేస్తే మీరు బ్యాటరీ జీవితాన్ని వృధా చేస్తున్నారు ఎందుకంటే ఐఫోన్ అనువర్తనాలను నేపథ్యం మరియు సస్పెండ్ చేసిన స్థితి నుండి తిరిగి ప్రారంభించడానికి ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించే దానికంటే మొదటి నుండి ఐఫోన్ అనువర్తనాలను తెరవడానికి ఎక్కువ శక్తి అవసరం. కొన్నిసార్లు నిజం. సంఖ్యలను చూద్దాం డెవలపర్లు తరచుగా ఉపయోగిస్తారు CPU సమయం పనులను నెరవేర్చడానికి ఐఫోన్ ఎంత ప్రయత్నం చేసిందో కొలవడానికి, ఎందుకంటే ఇది బ్యాటరీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. నేను ఆపిల్ డెవలపర్ సాధనాన్ని ఉపయోగించాను ఇన్స్ట్రుమెంట్స్ నా iPhone యొక్క CPU లో అనేక అనువర్తనాల ప్రభావాన్ని కొలవడానికి. ఫేస్బుక్ అనువర్తనాన్ని ఉదాహరణగా ఉపయోగిద్దాం: నడుస్తున్న స్థితి నుండి ఫేస్బుక్ అనువర్తనాన్ని తెరవడం సుమారు 3.3 సెకన్ల CPU సమయాన్ని ఉపయోగిస్తుంది. ఏదైనా అనువర్తనాన్ని మూసివేయడం దాన్ని మెమరీ నుండి తుడిచివేస్తుంది, అది అమలులో లేని స్థితికి తిరిగి వస్తుంది మరియు వాస్తవంగా CPU సమయాన్ని ఉపయోగించదు - .1 సెకన్లు. హోమ్ బటన్‌ను నొక్కితే ఫేస్‌బుక్ అనువర్తనాన్ని నేపథ్య స్థితికి పంపుతుంది మరియు సుమారు 6 సెకన్ల CPU సమయాన్ని ఉపయోగిస్తుంది. నేపథ్య స్థితి నుండి ఫేస్బుక్ అనువర్తనాన్ని తిరిగి ప్రారంభించడం .3 సెకన్ల CPU సమయాన్ని ఉపయోగిస్తుంది. అందువల్ల, మీరు ఫేస్బుక్ అనువర్తనాన్ని రన్నింగ్ స్టేట్ (3.3) నుండి తెరిచి, దాన్ని మూసివేసి (.1), మరియు రన్నింగ్ స్టేట్ (3.3) నుండి మళ్ళీ తెరిస్తే, ఇది 6.7 సెకన్ల CPU సమయాన్ని ఉపయోగిస్తుంది. మీరు నడుస్తున్న స్థితి నుండి ఫేస్‌బుక్ అనువర్తనాన్ని తెరిస్తే, దాన్ని నేపథ్య స్థితికి (.6) పంపడానికి హోమ్ బటన్‌ను నొక్కండి మరియు నేపథ్య స్థితి (.3) నుండి తిరిగి ప్రారంభించండి, ఇది 4.1 సెకన్ల CPU సమయాన్ని మాత్రమే ఉపయోగిస్తుంది. వావ్! ఈ సందర్భంలో, ఫేస్బుక్ అనువర్తనాన్ని మూసివేసి, దాన్ని మళ్ళీ తెరవడం ఉపయోగిస్తుంది మరింత 2.6 సెకన్లు CPU సమయం. ఫేస్బుక్ అనువర్తనాన్ని తెరిచి ఉంచడం ద్వారా, మీరు 39% తక్కువ శక్తిని ఉపయోగించారు! మరియు విజేత… అంత వేగంగా కాదు! మనం చూడాలి పెద్ద చిత్రం పరిస్థితి యొక్క మరింత ఖచ్చితమైన అంచనాను పొందడానికి. శక్తి వినియోగాన్ని దృక్పథంలో ఉంచడం 39% చాలా అనిపిస్తుంది, మరియు అది - మీరు గ్రహించే వరకు మీ ఐఫోన్‌ను ఉపయోగించటానికి తీసుకునే శక్తితో పోల్చితే మేము మాట్లాడుతున్న శక్తి ఎంత తక్కువ. మీరు గ్రహించే వరకు మీ అనువర్తనాలను మూసివేయడానికి వ్యతిరేకంగా వాదన చాలా బాగుంది ఇది పట్టింపు లేని గణాంకంపై స్థాపించబడింది. మేము చర్చించినట్లుగా, మీరు ఫేస్బుక్ అనువర్తనాన్ని మూసివేయడానికి బదులుగా తెరిచి ఉంచినట్లయితే మీరు 2.6 సెకన్ల CPU సమయాన్ని ఆదా చేస్తారు. మీరు ఉపయోగించినప్పుడు ఫేస్‌బుక్ అనువర్తనం ఎంత శక్తిని వినియోగిస్తుంది? నేను నా న్యూస్‌ఫీడ్ ద్వారా 10 సెకన్ల పాటు స్క్రోల్ చేసాను మరియు 10 సెకన్ల CPU సమయాన్ని ఉపయోగించాను లేదా సెకనుకు 1 సెకను CPU సమయం ఉపయోగించాను. ఫేస్బుక్ అనువర్తనాన్ని ఉపయోగించిన 5 నిమిషాల తరువాత, నేను 300 సెకన్ల CPU సమయాన్ని ఉపయోగించాను. మరో మాటలో చెప్పాలంటే, 5 నిమిషాల బ్యాటరీ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపడానికి నేను 115 సార్లు ఫేస్‌బుక్ అనువర్తనాన్ని తెరిచి మూసివేయాల్సి ఉంటుంది ఉపయోగించి ఫేస్బుక్ అనువర్తనం. దీని అర్థం ఇది: ఒక చిన్న గణాంకం ఆధారంగా మీ అనువర్తనాలను మూసివేయాలా వద్దా అని నిర్ణయించవద్దు. మీ ఐఫోన్‌కు ఏది ఉత్తమమో దానిపై మీ నిర్ణయం తీసుకోండి. మీ అనువర్తనాలను మూసివేయడం మంచి ఆలోచన మాత్రమే కాదు. వెళ్ళేముందు… నేపథ్య మోడ్‌లో నెమ్మదిగా మరియు స్థిరంగా ఉండే CPU బర్న్ అనువర్తనం నేపథ్య మోడ్‌లోకి ప్రవేశించినప్పుడు, మీ ఐఫోన్ మీ జేబులో నిద్రిస్తున్నప్పుడు కూడా ఇది బ్యాటరీ శక్తిని ఉపయోగిస్తుంది. ఫేస్బుక్ అనువర్తనం యొక్క నా పరీక్ష ఇది జరుగుతుందని నిర్ధారిస్తుంది నేపథ్య అనువర్తన రిఫ్రెష్ ఆపివేయబడినప్పుడు కూడా. నేను ఫేస్బుక్ అనువర్తనాన్ని మూసివేసిన తరువాత, ఐఫోన్ ఆపివేయబడినప్పుడు కూడా ఇది CPU ని ఉపయోగించడం కొనసాగించింది. ఒక నిమిషం వ్యవధిలో, ఇది .9 సెకన్ల అదనపు CPU సమయాన్ని ఉపయోగించింది. మూడు నిమిషాల తరువాత, ఫేస్బుక్ అనువర్తనాన్ని తెరిచి ఉంచడం ఉపయోగించబడుతుంది మరింత మేము దానిని వెంటనే మూసివేస్తే దాని కంటే శక్తి ఉంటుంది. కథ యొక్క నైతికత ఇది: మీరు ప్రతి కొన్ని నిమిషాలకు ఒక అనువర్తనాన్ని ఉపయోగిస్తుంటే, మీరు దాన్ని ఉపయోగించిన ప్రతిసారీ దాన్ని మూసివేయవద్దు. మీరు దీన్ని తక్కువసార్లు ఉపయోగిస్తుంటే, అనువర్తనాన్ని మూసివేయడం మంచిది. నిజం చెప్పాలంటే, చాలా అనువర్తనాలు బ్యాక్‌గ్రౌండ్ మోడ్ నుండి సస్పెండ్ మోడ్‌లోకి వెళ్తాయి మరియు సస్పెండ్ మోడ్‌లో, అనువర్తనాలు ఏ శక్తిని ఉపయోగించవు. ఏదేమైనా, బ్యాక్‌గ్రౌండ్ మోడ్‌లో ఏ అనువర్తనాలు ఉన్నాయో తెలుసుకోవడానికి మార్గం లేదు, కాబట్టి మంచి నియమం అవన్నీ మూసివేయండి . గుర్తుంచుకోండి, దీనికి ఎంత శక్తి అవసరమో తెరిచి ఉంది స్క్రాచ్ నుండి వచ్చే అనువర్తనం అది తీసుకునే శక్తి మొత్తంతో పోల్చితే వా డు అనువర్తనం. సాఫ్ట్‌వేర్ సమస్యలు అన్ని సమయాలలో జరుగుతాయి మీరు గ్రహించిన దానికంటే ఎక్కువసార్లు ఐఫోన్ అనువర్తనాలు క్రాష్ అవుతాయి. అత్యంత సాఫ్ట్‌వేర్ క్రాష్‌లు చిన్నవి మరియు స్పష్టమైన దుష్ప్రభావాలను కలిగించవు. మీరు దీన్ని ఇంతకు ముందే గమనించి ఉండవచ్చు: మీరు అనువర్తనాన్ని ఉపయోగిస్తున్నారు మరియు అకస్మాత్తుగా, స్క్రీన్ మెరిసిపోతుంది మరియు మీరు హోమ్ స్క్రీన్‌పై తిరిగి వస్తారు. అనువర్తనాలు క్రాష్ అయినప్పుడు ఇది జరుగుతుంది. మీరు క్రాష్ లాగ్‌లను కూడా చూడవచ్చు సెట్టింగులు -> గోప్యత -> డయాగ్నోస్టిక్స్ & వాడుక -> విశ్లేషణ మరియు వినియోగ డేటా. చాలా సాఫ్ట్‌వేర్ క్రాష్‌లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా మీరు మీ అనువర్తనాలను మూసివేస్తే. తరచుగా, సాఫ్ట్‌వేర్ సమస్య ఉన్న అనువర్తనం మొదటి నుండి ప్రారంభించాల్సిన అవసరం ఉంది. సాధారణ సాఫ్ట్‌వేర్ సమస్యకు ఉదాహరణ ఇది భోజన సమయం మరియు మీ ఐఫోన్ బ్యాటరీ 60% కి పడిపోయిందని మీరు గమనించవచ్చు. అల్పాహారం ద్వారా, మీరు మీ ఇమెయిల్‌ను తనిఖీ చేసారు, సంగీతం విన్నారు, బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ గురించి నిట్టూర్చారు, TED చర్చను చూశారు, ఫేస్‌బుక్ ద్వారా తిప్పబడ్డారు, ట్వీట్ పంపారు మరియు గత రాత్రి బాస్కెట్‌బాల్ ఆట నుండి స్కోర్‌ను తనిఖీ చేశారు. క్రాషింగ్ అనువర్తనాన్ని పరిష్కరించడం క్రాష్ అవుతున్న అనువర్తనం మీ బ్యాటరీని త్వరగా హరించడానికి కారణమవుతుందని మరియు అనువర్తనాన్ని మూసివేయడం దాన్ని పరిష్కరించగలదని మీరు గుర్తుంచుకుంటారు, కానీ మీకు తెలియదు ఇది అనువర్తనం సమస్యను కలిగిస్తుంది. ఈ సందర్భంలో (మరియు ఇది నిజం), నేను నా ఐఫోన్‌ను ఉపయోగించనప్పటికీ TED అనువర్తనం CPU ద్వారా మండిపోతోంది. మీరు సమస్యను రెండు విధాలుగా పరిష్కరించవచ్చు: మీ కంప్యూటర్‌ను Mac కి కనెక్ట్ చేయండి, డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి Xcode మరియు ఇన్స్ట్రుమెంట్స్ , అభివృద్ధి కోసం మీ ఐఫోన్‌ను ప్రారంభించండి, మీ ఐఫోన్‌లో నడుస్తున్న వ్యక్తిగత ప్రక్రియలను పరిశీలించడానికి అనుకూల పరీక్షను ఏర్పాటు చేయండి, వాటిని CPU వాడకం ద్వారా క్రమబద్ధీకరించండి మరియు మీ CPU 100% వరకు పునరుద్ధరించబడే అనువర్తనాన్ని మూసివేయండి. మీ అనువర్తనాలను మూసివేయండి. నేను 100% సమయం ఎంపికను ఎంచుకుంటాను మరియు నేను గీక్. (ఐచ్ఛికం 1 ను ఉపయోగించి నేను ఈ ఆర్టికల్ కోసం సమాచారాన్ని సేకరించాను.) మీ అనువర్తనాలను అమలు చేయని స్థితి నుండి తిరిగి తెరవడం నేపథ్యం లేదా సస్పెండ్ చేయబడిన స్థితి నుండి తెరవడం కంటే ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది, అయితే ఒక అనువర్తనం ఉన్నప్పుడు జరిగే ముఖ్యమైన విద్యుత్ ప్రవాహంతో పోలిస్తే తేడా చాలా తక్కువ. క్రాష్‌లు. మీ అనువర్తనాలను మూసివేయడం మంచి ఆలోచన అని నేను ఎందుకు నమ్ముతున్నాను మీరు మీ అనువర్తనాలను ఉపయోగించిన ప్రతిసారీ వాటిని మూసివేసినప్పటికీ, మీరు బ్యాటరీ జీవితంలో తేడాను చూడలేరు ఎందుకంటే అనువర్తనాన్ని తెరవడానికి ఎంత శక్తి అవసరమో అది అనువర్తనాన్ని ఉపయోగించటానికి తీసుకునే శక్తితో పోలిస్తే చాలా తక్కువ. మీరు మీ ఐఫోన్‌ను ఉపయోగించనప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మోడ్‌లో నడుస్తున్న అనువర్తనాలు శక్తిని ఉపయోగించడం కొనసాగిస్తాయి మరియు ఇది ఒక రోజు వ్యవధిలో జతచేస్తుంది. మీ ఐఫోన్ బ్యాటరీ హరించడానికి కారణమయ్యే తీవ్రమైన సాఫ్ట్‌వేర్ సమస్యలను నివారించడానికి మీ అనువర్తనాలను మూసివేయడం మంచి మార్గం అతిశీఘ్రంగా . ఈ కథనాన్ని మూసివేయండి ఈ వ్యాసం నేను సాధారణంగా వ్రాసే వ్యాసాల కంటే చాలా లోతుగా ఉంటుంది, కానీ ఇది ఆసక్తికరంగా ఉందని మరియు మీ ఐఫోన్‌లో అనువర్తనాలు ఎలా నడుస్తాయనే దాని గురించి మీరు క్రొత్తదాన్ని నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. నేను రోజుకు కొన్ని సార్లు నా అనువర్తనాలను మూసివేస్తాను మరియు ఇది నా ఐఫోన్‌ను వీలైనంత సజావుగా అమలు చేయడానికి సహాయపడుతుంది. పరీక్షలు మరియు ఆపిల్ టెక్ వలె వందలాది ఐఫోన్‌లతో పనిచేసే నా మొదటి అనుభవం ఆధారంగా, మీ అనువర్తనాలను మూసివేయడం నిజంగా ఐఫోన్ బ్యాటరీ జీవితాన్ని కాపాడటానికి మంచి మార్గం అని నేను నమ్మకంగా చెప్పగలను.
‘సింహాలు తమ చరిత్రను చెప్పే చరిత్రకారులను కలిగివుండనంతకాలం వేటగాడు చెప్పే కట్టుకథలూ, పిట్టకథలూ ఎల్లవేళలా వేటగాడినే కీర్తిస్తూ అదే చరిత్రగా చెలామణీ అయిపోతుంది.’ ఇది ఆఫ్రికన్‌ సామెత. భారతదేశంలో దైవ సమ్మతితోనే కర్మసిద్ధాంతం, వర్ణవ్యవస్థలు ఏర్పడినట్టు శాస్త్రాలు, అధికారాలు, శిక్షాస్మృతులు పుట్టించినప్పటి నుండీ ఈ దేశంలో మెజారిటీ శూద్ర ప్రజలకు బానిసత్యం అనేది ‘సేవకులు’ అనే పర్యాయపదంతో బలవంతంగా రుద్దబడిరది. అప్పటినుండీ వారి శ్రమకు, సేవలకు చరిత్రలో న్యాయమైన స్థానం కాదు కదా కనీస స్థానం లేకుండా పోయింది. మరోవైపు నిచ్చెనమెట్ల అసమానతల వర్ణవ్యవస్థను పరిరక్షించే రాజుల రాజ్య వ్యూహాలు, యుద్దతంత్రాలు, మంత్రుల కుటిలనీతి పన్నాగాలు ఈ దేశంలో పురాణగాధలుగా, ఇతిహాసాలుగా, చరిత్రలుగా జనబాహుళ్యంలోకి చొప్పించబడ్డాయి. తమ చరిత్రను తామే వెలికితీసే ప్రయత్నం వర్ణవ్యవస్థ కులవ్యవస్థగా, ఊరు `వాడల విభజనగా రూపాంతరం చెందాక అతిశూద్రులుగా, అస్పృశ్యులుగా మారిన నేటి దళితుల శ్రమ,త్యాగాలూ అయితే నాటి నుంచి నేటివరకూ యధేచ్ఛగా ‘బహిష్కరణ’ జాబితాలనే కొనసాగుతున్నాయి. ఈ చారిత్రక అన్యాయ నేపథ్యంలో నుంచి దళితులనుంచి ఎదిగివస్తున్న ఉద్యమ నాయకత్వం, మేధావివర్గం తమ చరిత్రను తామే వెలికితీసే కర్తవ్యానికి పూనుకుంటున్నారు. గతంలోను, వర్తమానంలోను దళితుల చరిత్ర, సంస్కృతి, జీవనవిధానం, సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను కేంద్రీకరించి అధ్యయనం చేస్తున్నారు. సత్యదర్శనంతో తగిన ఆధారాలతో సాధికారంగా ప్రపంచంముందు ఆవిష్కరిస్తున్నారు. అంతేకాదు, జాతీయ భావనలతో, దేశభక్తితో భారతదేశ నిర్మాణంలో క్రియాశీల భాగస్వామ్యం వహించిన దళితనేతలు సవర్ణుల భావనలో ఇప్పటికీ వారు జాతీయనేతలుగా కాకుండా దళితనేతలుగానే పరిగణించబడుతున్న వివక్షాపూరిత స్వభావ వైనాన్నీ విశ్లేషిస్తున్నారు. ఇక్కడితో ఆగిపోకుండా భవిష్యత్తులో దేశం ఎదుర్కొనే సవాళ్ళు, రాజ్యాంగ లక్ష్యాలకు ఎదురయ్యే అడ్డంకులను సమీక్షిస్తూ రాజ్యాంగ రక్షణకు, దేశ సమైఖ్యతకు మార్గ నిర్దేశం చేసే మేధోకృషిని అంకితభావంతో నెరవేరుస్తున్నారు. ఈ పరంపర నుంచి మరో గొప్ప ముందడుగుగా వస్తున్నదే ‘ది దళిత్‌ ట్రూత్‌’ పుస్తకం. ‘ది దళిత్‌ ట్రూత్‌’ లోపలి అంశాలకు వెళ్ళేముందు ఈ సంకలనం నేపథ్యాన్ని తెలుసుకోవాలి. 75 ఏళ్ళ భారత స్వాతంత్య్ర ప్రస్థానం వెలుగునీడలు, భారతరాజ్యాంగం లక్ష్యాల వెలుగులో నేడు దేశం ఆలోచించాల్సిన కీలక అంశాలపై మేధోమధనం చేయాలని, భవిష్యత్తులో భారత రాజ్యాంగానికి, దాని లక్ష్యాలకు ఎదురయ్యే సవాళ్ళను అధికమించేందుకు మార్గనిర్దేశం చేసే విధానాలను, కార్యాచరణలను కొన్ని సంకనాల రూపంలో ముద్రించాలని ‘సమ్రుద్ద భారత్‌ ఫౌండేషన్‌ సంస్థ’ భావించింది. ఈ ఆలోచనలో భాగంగా ‘పెంగ్విన్‌ రేండమ్‌ హౌస్‌ ఇండియా’తో కలిసి ‘ విజన్‌ ఫర్‌ ఎ నేషన్‌ `‘రీ ధింకింగ్‌ ఇండియా’ పేరుతో కొన్ని కీలక అంశాలపై దేశంలోని అనేక మంది గుర్తింపు పొందిన ప్రముఖ మేధావుల భాగస్వామ్యంతో ,రచనలతో ఇంగ్లీషులో 14 పుస్తకాలను తీసుకురావాలని నిర్ణయించారు. ఈ కృషిలో ఇప్పటికే ఏడు పుస్తకాలు ప్రచురణ పూర్తయి పాఠకుల ముందుకు వచ్చాయి. ఎనిమిదవ సంకలనంగా ‘ది దళిత్‌ ట్రూత్‌’ వస్తోంది. ‘ది దళిత్‌ ట్రూత్‌’ సంకలనాన్ని ఎడిట్‌ చేసే బాధ్యత మాజీ ఐ.ఎ.ఎస్‌ అధికారి, బహుజన మేధావి, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఎస్సీ, ఎస్టీ,బిసి, మైనార్టీ విభాగాల కో ఆర్డినేటర్‌ కొప్పుల రాజుకి దక్కింది. తెలుగుసమాజంతోపాటు దేశం గర్వించదగిన ప్రపంచస్థాయి మానవీయ కవులు, పద్మభూషణులు, కళాప్రపూర్ణ బిరుదాంకితులు గుఱ్ఱం జాషువా మరియు బోయిభీమన్నలకు ఈ ఇంగ్లీషు సంకాలనాన్ని అంకితమివ్వడం ఎంతో సముచితంగావుంది. 13మంది దళిత మేధావుల రచనలు దళిత సమాజ హితంకోసం అంకితభావంతో పనిచేస్తున్న 13 మంది ప్రముఖ దళిత మేధావుల, ఉద్యమ నేతల, పరిశోధకుల వ్యాసాలు ఇందులో ఉన్నాయి. 1)యు.జి.సి.మాజీ చైర్మన్‌,ఆర్దికవేత్త,పద్మశ్రీ, ప్రొ.సుఖదేవ్‌ ధొరాట్‌, 2) ఐ.ఎ.ఎస్‌.అధికారి,‘అంబేద్కర్‌,గాంధీ అండ్‌ పటేల్‌: దిమేకింగ్‌ ఆఫ్‌ ఇండియాస్‌ ఎలక్టోరల్‌ సిస్టమ్‌’ పుస్తక రచయిత రాజశేఖర్‌ ఉండ్రు, 3) సుప్రీంకోర్టు న్యాయవాది, మానవహక్కులనేత కిరూబా మునుసామి, 4) ‘కాస్ట్‌ మేటర్స్‌’ (బెస్ట్‌సెల్లర్‌)పుస్తక రచయిత, సూరజ్‌ యంగ్డే, 5)ఆర్‌.ఎస్‌.ఎస్‌.పూర్వ కార్యకర్త, పాత్రికేయుడు, ‘ఐ కుడ్‌ నాట్‌ బి హిందూ’ పుస్తక రచయిత భన్వర్‌ మేఘవంశీ, 6) జి.బి.పంత్‌ సోషల్‌ సైన్స్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌,అలహాబాద్‌, ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ హిందూత్య’ పుస్తక రచయిత బద్రి నారాయన్‌, 7) గుజరాత్‌ దళిత ఉద్యమనేత, న్యాయవాది, ఎమ్మెల్యే జిగ్నేష్‌మేవాని, 8) ‘దళిత్‌ ఎసర్షన్‌ అండ్‌ ది అన్‌ఫినిష్డ్‌ డెమోక్రటిక్‌ రివల్యూషన్‌’ పుస్తక రచయిత ప్రొ.సుధాపాయ్‌, 9) ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత పా.రంజిత్‌, 10) మాజీ ఐ.పి.ఎస్‌.అధికారి, బిఎస్పీ తెలంగాణ నాయకుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, 11) కర్నాటక కాంగ్రెస్‌నేత,మాజీమంత్రి,ప్రస్తుత ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే, 12) ఎస్‌.ఓ.ఏ.ఎస్‌, యూనివర్శిటీ ఆఫ్‌ లండన్‌లో పరిశోధకుడు నీరజ్‌ షెట్యే,.13).సీనియర్‌ ఐ.ఎ.ఎస్‌.అధికారి, హార్వర్డ్‌ యూనివర్శిటీలో పరిశోధకుడు బుడితి రాజశేఖర్‌.ల వ్యాసాలు ఈ సంకలనంలో చోటుచేసుకున్నాయి. ఈ సంకలనంలోని ప్రతివ్యాసం ఒక పరిశోధనాగ్రంధంగా పరిగణించవచ్చు. రచయితలు పేర్కొన్న ప్రతి అభిప్రాయానికీ తగిన ఆధారాలను, రిఫరెన్స్‌లను ఇవ్వడం మూలంగా ఈ పుస్తకానికి ‘ది దళిత్‌ ట్రూత్‌’ శీర్షిక వందకు వందశాతం సరైనది మాత్రమేకాదు సాధికారికమైనదికూడా. ఈ సంకలనం నేటి చరిత్ర పరిశోధకులకు, దేశభవిష్యత్‌ విధాన నిర్ణేతలకు, రాజకీయపార్టీలకు దళితుల దృష్టికోణంపై స్పష్టమైన మార్గనిర్దేశంగా నిలుస్తుందనడంలో సందేహంలేదు. ఈ పుస్తకానికి కె.రాజు రాసిన పరిచయవ్యాసం దళితుల అన్యాయాలకు సంబంధించి భాదాతప్త భావోద్వేగ ప్రవాహ దృశ్యచిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. అంతేకాదు దేశనిర్మాణంలో దళితుల భాగస్వామ్యం సత్యదర్శనమై ఉద్వేగంతో పిడికిలి బిగించి ‘సత్యమేవజయతే’ అని నినదించేలా చేస్తుంది. కె.రాజు వ్యాసంలోని కొన్ని ముఖ్యాంశాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాను. ఝాన్సీబాయి సరే జల్కరీబాయి సంగతేమిటి? తొలి భారత స్వాతంత్య్ర సంగ్రామంగా భావించే 1857 సిపాయిల తిరుగుబాటులో సమరయోధుడు మంగల్‌పాండే గురించి లిఖితమైన చరిత్ర నాడు పాండేకు స్పూర్తినిచ్చిన దళితుడైన మతాదిన్‌ భాంగీ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు ఎందుకని ? తొలిస్వాతంత్య్ర పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రాణత్యాగం చేసిన దళిత దంపతులు ఉదాదేవి, మక్కా పాశీల గురించి చరిత్ర రచనల్లో ఒకవాక్యంకూడా చోటుదక్కకపోవడానికి కారణం ఏమిటి ? అలాగే 1857 పోరాటంలో బ్రిటిష్‌వారితో పోరాడిన జాన్షీ లక్ష్మీభాయి గురించి సుపరిచితమైన చరిత్ర, జాన్షీ రాజ్యంలో మహిళా సైనిక దళ నేతగా ఎదిగి యుధ్ద నైపుణ్యాలు నేర్చుకుని కీలకసమయంలో లక్ష్మీభాయి స్థానంలో తానే బ్రిటిష్‌వారితో యుద్దంచేసి అమరత్వం పొందిన యోధురాలు దళిత మహిళ జల్కరీబాయికి చరిత్రలో దక్కిన స్థానం ఎంత? ఇలా స్వాతంత్య్ర పోరాట సంగ్రామంలో దళితుల భాగస్వామ్య చరిత్రలు మరెన్నో ఇప్పుడిప్పుడే వెలికి వస్తున్నాయని కె.రాజు ప్రస్తావించారు. అలాగే స్వాతంత్రానంతరం దేశానికి సేవలందించిన కొందరు ముఖ్య దళితనేతల సేవలనూ గుర్తుచేసారు. రాజ్యాంగ నిర్మాణ సభలో 15 మంది దళిత మహిళలు భారత రాజ్యాంగ నిర్మాణ సభకు ఎంపికైన 15 మంది మహిళల్లో దేశంలోనే తొలి దళిత మహిళా గ్రాడ్యుయేట్‌ అయిన దాక్షాయని వెలుయుధాన్‌ ఒకరు. గాంధేయవాదిగా ఉంటూనే దళితుల,మహిళల సమస్యల ప్రస్తావన వచ్చినప్పుడు డా.బి.ఆర్‌.అంబేద్కర్‌కి అండగా నిలిచిన దాక్షాయని సేవలు ఆధునిక భారత నిర్మాణంలో భాగమయ్యాయి.కానీ మహిళానేతల జాబితాలో దాక్షాయనికి స్థానం కనిపించదు. డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ సేవల గురించి, త్యాగం గురించీ చెప్పనక్కర్లేదు. ఆధునిక భారత చరిత్రలో దళితులు,ఆదివాసులు, బలహీనవర్గాలు,మహిళల హక్కులకోసం రాజీలేని పోరాటం చేసిన యోధుడు. రాజ్యాంగ రచనంలో అగ్రగామి పాత్ర పోషించిన మహామేధావి. ప్రజాస్వామిక మేధావిగా దేశంలోనేకాదు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతున్న మహాదార్శినికుడు. సామాజికన్యాయానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా మారిన ఆరాధ్యుడు. దేశం గర్వించదగిన అనేకమంది గొప్ప అగ్రనేతల్లో అంబేద్కర్‌ స్థానం ప్రత్యేకమైనది. కీలకనేత బాబూజగజ్జీవన్ రామ్ అదేవిధంగా బాబూజగజ్జీవన్‌రామ్‌ దేశ అగ్రనేతల్లో మరో కీలకనేత. బీహార్‌నుంచి వచ్చి దేశరాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఎదిగిన దళిత నేత. సమర్ధ పరిపాలనాదక్షుడు. దేశంలో ఆహార సంక్షోభం తలెత్తినప్పుడు వ్యవసాయమంత్రిగా వ్యవసాయవిప్లవ చర్యలు చేపట్టి దేశాన్ని అన్నపూర్ణగా మార్చిన మార్తదర్శి. పాకిస్తాన్‌, ఇండియా యుద్ద సమయంలో (1971) రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నెరవేర్చి దేశాన్ని గెలిపించిన ధీశాలి. దేశానికి నిస్వార్దమైన సేవలందించిన వారిలో జగజ్జీవన్‌రామ్‌స్థానం విస్మరించరానిది. దేశంలోనే దళితవర్గం నుంచి తొలి ముఖ్యమంత్రి గా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బాధ్యతలు చేపట్టిన దామోదరం సంజీవయ్య అత్యంత నిజాయితీ పరుడిగా చరిత్రలో నిలిచాడు. జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేసి పేదలకు సంక్షేమాన్ని అందించే అనేక సంస్కరణలు తీసుకువచ్చిన మార్గదర్శి. వృద్ధులకు పించను పథకాన్ని ప్రవేశపెట్టిన మానవతావాది. మండల్‌ కమిషన్‌ రాకముందే బలహీనవర్గాలకు విద్యా,ఉద్యోగ రంగాల్లో 27 శాతం రిజర్వేషన్లు అమలుచేసిన గొప్ప సామాజిక సంస్కరణవాది. ఇలా స్వాతంత్య్ర పోరాటంలోనూ, రాజ్యాంగ నిర్మాణంలోను, స్వాతంత్య్రానంతర దేశ పురోభివృద్ధిలోను జాతీయ భావాలతో సేవలందించిన మహోన్నతులైన దళితనేతలు,మేధావులు అనేకమంది వున్నారనేది దాచేస్తే దాగని సత్యం. దేశంలో ఏమూలకువెళ్ళినా దళిత నివాశాలు ఉన్నచోట డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాలు నేడు కనిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని చేతపట్టి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తున్న చూపుడువేలుతో కనిసించే అంబేద్కర్‌ విగ్రహాలను దళితులు ప్రతిష్టించుకోవడంలో వారు అంబేద్కర్‌తోపాటు రాజ్యాంగాన్ని సొంతం చేసుకుంటున్న సత్యం స్పష్టమౌతుంది. రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ రాజ్యాంగంగా దళితులు భావిస్తున్నారు. దేశానికి ప్రగతిశీల రాజ్యాంగం రూపొండటంలో డా.బి.ఆర్‌.అంబేద్కర్‌కు వెన్నుదన్నుగా కాంగ్రెస్‌పార్టీ నిలిచిందనే చారిత్రక వాస్తవాన్ని గ్రహించిన దళితులు అనేక దశాబ్దాలు కాంగ్రెస్‌పార్టీకి ప్రధాన మద్దతుదార్లుగా నిలిచారు. అలాగే కాంగ్రెస్‌ కూడా దళితులకు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, కీలకమైన కేంద్ర,రాష్ట్ర మంత్రులుగా, గవర్నర్‌లుగా, కీలకస్థానాల్లో ఉన్నత ఉద్యోగులుగా అనేక అవకాశాలను అందించింది. కానీ నేడు హిందూత్య రాజకీయ వాదుల అబద్దాల వలలో చిక్కుకుంటూ కొన్ని రాష్ట్రాల్లో దళితులు కాంగ్రెస్‌కు దూరం జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రగతిశీల రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేకమైన శక్తులవైపు కొందరు దళితులు మొగ్గుతున్న వైన ఆందోళన కలిగిస్తోంది. అయినా రాజ్యాంగ పరిరక్షణకోసమేకాదు దళితుల నిజమైన అభివృద్ధి, విముక్తి కాంగ్రెస్‌పార్టీ ద్వారానే సాధ్యమౌతుందని నమ్ముతున్నట్లు కె.రాజు తన అభిప్రాయాన్ని వెల్లడిరచారు. కె.రాజు పరిచయవ్యాసంలో ఇంకా అనేక కీలక అంశాలు వున్నాయి. నేను ముందే ప్రస్తావించినట్టు పుస్తకంలోని వ్యాసాలు ఒక్కొక్కటీ ఒక పరిశోధనాగ్రంధం. సామాజిక,ఆర్ధిక,రాజకీయ రంగాల్లో దళితులపై నేటికీ సాగుతున్న వివక్షతని ఆధారాలతో పట్టిచూపడమేకాదు. నిర్దిష్టమైన పరిష్కార మార్గాలను సూచించాయి. ప్రగతిశీల ప్రజాస్వామిక చరిత్రకారులు,మేధావులు ముఖ్యంగా విద్యావంతులైన దళితుల చేతిలో వుండాల్సిన సత్య దర్శనం, అక్షర ఆయుధం ‘ది దళిత్‌ ట్రూత్‌’ సంకలనం.
గూగుల్ ఎర్త్ అన్ని గూగుల్ అనువర్తనాల్లో చక్కనిది కావచ్చు. ఇది గూగుల్ మ్యాప్స్ చిన్నది, సాంకేతిక పరిజ్ఞానం గల తోబుట్టువు వంటిది. ఏ ఇతర ఉచిత, ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్ మీకు మా భాగస్వామ్య గ్రహాన్ని అన్వేషించే సామర్థ్యాన్ని ఇస్తుంది, మీ ఇంటి నుండి భూగోళం యొక్క మరొక వైపున ఉన్న నగరానికి జూమ్ చేయండి లేదా కొన్ని క్లిక్‌లు లేదా ట్యాప్‌లలో అంతరిక్షంలోకి కూడా వెళ్లవచ్చు? ఈ వ్యాసంలో, గూగుల్ ఎర్త్‌లో దూరాలు, ప్రాంతాలు మరియు ఎత్తులను ఎలా కొలిచాలో మేము మీకు చూపుతాము. మొదటి దశ గూగుల్ ఎర్త్ యొక్క సంస్కరణను ఎంచుకోవడం. మూడు ప్రధాన వెర్షన్లు ఉన్నాయి. ప్రారంభించడానికి శీఘ్ర మార్గం, మద్దతు ఉన్న వెబ్ బ్రౌజర్ నుండి earth.google.com ని సందర్శించడం ద్వారా వెబ్‌లో గూగుల్ ఎర్త్‌ను యాక్సెస్ చేయడం. ప్రస్తుతం, మద్దతు ఉన్న బ్రౌజర్‌లలో క్రోమ్, ఫైర్‌ఫాక్స్, ఎడ్జ్ మరియు ఒపెరా ఉన్నాయి. మొబైల్ పరికర వినియోగదారులు గూగుల్ ఎర్త్ అనువర్తనాన్ని ఆపిల్ యొక్క యాప్ స్టోర్ నుండి లేదా గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరియు మీలో మరిన్ని ఫీచర్లను యాక్సెస్ చేయాలనుకునే వారు గూగుల్ ఎర్త్ ప్రోని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాని పేరులో “ప్రో” ఉన్నప్పటికీ, ఈ డెస్క్‌టాప్ అప్లికేషన్ ఉచితం మరియు పిసి, మాక్ మరియు లైనక్స్ కోసం అందుబాటులో ఉంది. గూగుల్ ఎర్త్ ప్రోలో చారిత్రక చిత్రాలు మరియు వెబ్ మరియు మొబైల్ అనువర్తనాలు లేని GIS డేటా లక్షణాలను దిగుమతి మరియు ఎగుమతి చేసే సామర్థ్యం ఉన్నాయి. గూగుల్ ఎర్త్‌తో దూరాలను ఎలా కొలవాలి గూగుల్ ఎర్త్‌లో దూరాలను ఎలా కొలవాలి అనేదానికి వెళ్ళే ముందు, మొదట ఖచ్చితత్వం గురించి హెచ్చరిక. ఈ అంశంపై వాల్యూమ్‌లు వ్రాయబడ్డాయి మరియు గూగుల్ ఎర్త్‌లో స్థాన ఖచ్చితత్వం సంపూర్ణంగా లేదు, ముఖ్యంగా ఎక్కువ దూరాలకు. చాలా మంది ఔత్సాహిక వినియోగదారులు మరియు ఉపయోగాలకు, ఇది సరిపోతుంది. గూగుల్ ఎర్త్‌లో రెండు పాయింట్ల మధ్య దూరాన్ని కొలవడం చాలా సులభం అని మీరు కనుగొంటారు. 1. మీ ప్రారంభ స్థానం కోసం శోధించండి. 2. ఉపకరణపట్టీలో పాలకుడిని ఎంచుకోండి. 3. మ్యాప్‌లో క్లిక్ చేయడం ద్వారా మీ ప్రారంభ బిందువును ఎంచుకోండి. 4. మ్యాప్‌లో రెండవ పాయింట్‌ను ఎంచుకోండి. రెండు పాయింట్ల మధ్య రేఖ పసుపు రంగులో ఉంటుంది మరియు వాటి మధ్య దూరం ప్రదర్శించబడుతుంది. మీరు సెట్ చేసిన చివరి పాయింట్‌ను తొలగించాలనుకుంటే, చర్యరద్దు చేయి ఎంచుకోండి. మీరు ఇప్పటికే సెట్ చేసిన పాయింట్లను కూడా క్లిక్ చేసి లాగవచ్చు. గూగుల్ ఎర్త్‌లో దూరం యొక్క యూనిట్లు గూగుల్ ఎర్త్ స్వయంచాలకంగా కొలత యూనిట్‌ను ఎన్నుకుంటుంది, అది మీరు కొలిచిన దూరానికి చాలా అర్ధమే. ప్రత్యామ్నాయంగా, మీరు కొలత యొక్క అనేక యూనిట్ల మధ్య టోగుల్ చేయవచ్చు. దూరం పక్కన ఉన్న డ్రాప్‌డౌన్ బాణాన్ని ఎంచుకుని, మీ కొలత యూనిట్‌ను ఎంచుకోండి. ఎంపికలు సెంటీమీటర్లు, మీటర్లు మరియు కిలోమీటర్లు వంటి మెట్రిక్ యూనిట్ల నుండి అంగుళాలు, అడుగులు, గజాలు మరియు మైళ్ళు వంటి సామ్రాజ్య కొలతల వరకు ఉంటాయి. మీరు నాటికల్ మైళ్ళు లేదా స్మూట్స్ కూడా ఎంచుకోవచ్చు. గూగుల్ ఎర్త్‌తో ప్రాంతాన్ని ఎలా కొలవాలి గూగుల్ ఎర్త్‌లో బహుభుజి యొక్క వైశాల్యాన్ని కొలవడం రెండు పాయింట్ల మధ్య దూరాన్ని కొలవడానికి చాలా పోలి ఉంటుంది. మూడు లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లను జోడించి, మొదటి పాయింట్‌ను ఎంచుకోవడం ద్వారా ఆకారాన్ని మూసివేయండి. సమాచార ప్యానెల్ ఇప్పుడు మీరు సృష్టించిన చుట్టుకొలత మరియు ఆకారం యొక్క ప్రాంతం రెండింటినీ ప్రదర్శిస్తుంది. మళ్ళీ, మీరు ప్రతి కొలత పక్కన డ్రాప్‌డౌన్ బాణాన్ని ఎంచుకోవడం ద్వారా కొలత యూనిట్‌ను మార్చవచ్చు. గూగుల్ ఎర్త్‌లో ఎత్తును కొలవడం ఎలా గూగుల్ ఎర్త్ గ్రహం మీద ఏదైనా ప్రదేశం యొక్క ఎత్తును కనుగొనడం చాలా సులభం చేస్తుంది. మ్యాప్‌లో ఒక పాయింట్‌ను ఎంచుకోండి, మరియు ఎలివేషన్ మ్యాప్ యొక్క దిగువ-కుడి మూలలో ప్రదర్శించబడుతుంది. గూగుల్ ఎర్త్‌లో మీ ఇంటి ఎత్తును ఎలా కొలవాలి ఇప్పుడు మీకు ఎత్తును ఎలా కొలిచాలో తెలుసు, గూగుల్ ఎర్త్ భవనాన్ని 3D లో రెండర్ చేస్తుంటే మీ ఇంటి ఎత్తును (లేదా ఏదైనా భవనం) లెక్కించడానికి మీరు ఆ జ్ఞానాన్ని ఉపయోగించవచ్చు. ఈ వ్యాయామం మూడు దశలకు వస్తుంది: భూస్థాయిలో మ్యాప్‌లోని ఒక పాయింట్‌పై క్లిక్ చేయడం ద్వారా భూస్థాయి ఎత్తును నిర్ణయించండి. మ్యాప్ యొక్క దిగువ-కుడి మూలలో ఆ పాయింట్ యొక్క ఎత్తు కొలతను గమనించండి. మ్యాప్‌లోని భవనం పైకప్పుపై క్లిక్ చేయడం ద్వారా మీరు ఎత్తును కొలవాలనుకునే భవనం పైకప్పు యొక్క ఎత్తును నిర్ణయించండి. మ్యాప్ యొక్క దిగువ-కుడి మూలలో ఆ పాయింట్ యొక్క ఎత్తు కొలతను గమనించండి. కప్పు యొక్క ఎత్తు నుండి భూస్థాయి ఎత్తును తీసివేయండి మరియు అది మీకు భవనం యొక్క ఎత్తును ఇస్తుంది. గూగుల్ ఎర్త్ ప్రోతో 3 డి బహుభుజాలను కొలవడం మీరు గూగుల్ ఎర్త్ ప్రో ఉపయోగిస్తుంటే, మీరు దీని గురించి వేరే విధంగా వెళ్ళవచ్చు. 1. లేయర్స్ ప్యానెల్‌లో, 3D భవనాల పక్కన ఉన్న పెట్టె తనిఖీ చేయబడిందని నిర్ధారించుకోండి. 2. పాలకుడు సాధనాన్ని ఎంచుకోండి. 3. రూలర్ పాప్-అప్ విండోలో, 3D బహుభుజి టాబ్‌ను ఎంచుకోండి. 4. మీ పాయింట్లను సెట్ చేయడానికి మ్యాప్ పై క్లిక్ చేయండి. ఉదాహరణకు, మీరు భవనం యొక్క ఒక వైపు నాలుగు మూలలను ఎంచుకోవచ్చు. రూలర్ ప్యానెల్ చుట్టుకొలత మరియు మీరు సృష్టించిన బహుభుజి ఆకారం యొక్క వైశాల్యాన్ని ప్రదర్శిస్తుంది. మళ్ళీ, మీరు కొలత యొక్క వివిధ యూనిట్లను ఎంచుకోవడానికి డ్రాప్‌డౌన్ బాణాలను ఉపయోగించవచ్చు. గూగుల్ ఎర్త్‌తో మీరు ఏమి చేయవచ్చు? గూగుల్ ఎర్త్‌కు దూరాలు మరియు ప్రాంతాలను కొలవడానికి మించి చాలా ఎక్కువ ఉన్నాయి. వాయేజర్ ప్రదర్శనను ప్రారంభించండి మరియు ఇంటరాక్టివ్ పర్యటనలు, క్విజ్‌లు మరియు మ్యాప్ లేయర్‌లను ఆస్వాదించండి. లేదా, నిజమైన గూగుల్ పద్ధతిలో, “నేను అదృష్టవంతుడిని” ఐకాన్‌ను ఎంచుకోండి, మరియు గూగుల్ ఎర్త్ మిమ్మల్ని ఇంతకు ముందెన్నడూ వినని ప్రపంచంలోని కొంత భాగానికి దూరం చేస్తుంది. మరియు, మీరు బయలుదేరే ముందు, గూగుల్ ఎర్త్ ప్రోలో దాగి ఉన్న ఉచిత ఫ్లైట్ సిమ్యులేటర్ గేమ్‌ను ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి!
సినిమా స్క్రిప్ట్ & రివ్యూ : 03/19/19 .Header h1 { font: normal normal 90px Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; color: #ffff00; } .Header h1 a { color: #ffff00; } .Header .description { font-size: 130%; } /* Tabs ----------------------------------------------- */ .tabs-inner { margin: 1em 0 0; padding: 0; } .tabs-inner .section { margin: 0; } .tabs-inner .widget ul { padding: 0; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; } .tabs-inner .widget li { border: none; } .tabs-inner .widget li a { display: inline-block; padding: 1em 1.5em; color: #ffffff; font: normal bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; } .tabs-inner .widget li.selected a, .tabs-inner .widget li a:hover { position: relative; z-index: 1; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } /* Headings ----------------------------------------------- */ h2 { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #00ffff; } .main-inner h2.date-header { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #0f0e0c; } .footer-inner .widget h2, .sidebar .widget h2 { padding-bottom: .5em; } /* Main ----------------------------------------------- */ .main-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner .section { margin: 0 20px; } .main-inner .column-right-inner { margin-left: 20px; } .main-inner .fauxcolumn-right-outer .fauxcolumn-inner { margin-left: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner { margin-right: 20px; } .main-inner .fauxcolumn-left-outer .fauxcolumn-inner { margin-right: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner, .main-inner .column-right-inner { padding: 15px 0; } /* Posts ----------------------------------------------- */ h3.post-title { margin-top: 20px; } h3.post-title a { font: italic bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #b02ef1; } h3.post-title a:hover { text-decoration: underline; } .main-inner .column-center-outer { background: #ffffff none repeat scroll top left; _background-image: none; } .post-body { line-height: 1.4; position: relative; } .post-header { margin: 0 0 1em; line-height: 1.6; } .post-footer { margin: .5em 0; line-height: 1.6; } #blog-pager { font-size: 140%; } #comments { background: #cccccc none repeat scroll top center; padding: 15px; } #comments .comment-author { padding-top: 1.5em; } #comments h4, #comments .comment-author a, #comments .comment-timestamp a { color: #b02ef1; } #comments .comment-author:first-child { padding-top: 0; border-top: none; } .avatar-image-container { margin: .2em 0 0; } /* Comments ----------------------------------------------- */ #comments a { color: #b02ef1; } .comments .comments-content .icon.blog-author { background-repeat: no-repeat; background-image: url(); } .comments .comments-content .loadmore a { border-top: 1px solid #b02ef1; border-bottom: 1px solid #b02ef1; } .comments .comment-thread.inline-thread { background: #ffffff; } .comments .continue { border-top: 2px solid #b02ef1; } /* Widgets ----------------------------------------------- */ .sidebar .widget { border-bottom: 2px solid #f1d08f; padding-bottom: 10px; margin: 10px 0; } .sidebar .widget:first-child { margin-top: 0; } .sidebar .widget:last-child { border-bottom: none; margin-bottom: 0; padding-bottom: 0; } .footer-inner .widget, .sidebar .widget { font: normal normal 14px Georgia, Utopia, 'Palatino Linotype', Palatino, serif; color: #ffe599; } .sidebar .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .sidebar .widget a:visited { color: #6ef12e; } .sidebar .widget a:hover { color: #c1c1c1; text-decoration: underline; } .footer-inner .widget a:link { color: #3630f4; text-decoration: none; } .footer-inner .widget a:visited { color: #000000; } .footer-inner .widget a:hover { color: #3630f4; text-decoration: underline; } .widget .zippy { color: #ffffff; } .footer-inner { background: transparent none repeat scroll top center; } /* Mobile ----------------------------------------------- */ body.mobile { background-size: 100% auto; } body.mobile .AdSense { margin: 0 -10px; } .mobile .body-fauxcolumn-outer { background: transparent none repeat scroll top left; } .mobile .footer-inner .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .mobile .footer-inner .widget a:visited { color: #6ef12e; } .mobile-post-outer a { color: #b02ef1; } .mobile-link-button { background-color: #3630f4; } .mobile-link-button a:link, .mobile-link-button a:visited { color: #ffffff; } .mobile-index-contents { color: #444444; } .mobile .tabs-inner .PageList .widget-content { background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } .mobile .tabs-inner .PageList .widget-content .pagelist-arrow { border-left: 1px solid #ffffff; } sikander777 --> సినిమా స్క్రిప్ట్ & రివ్యూ రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు... టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం! Tuesday, March 19, 2019 800 : వెబ్ సిరీస్ సంగతులు Q : నాకు కామెడీ వెబ్ సిరీస్ దర్శకత్వం అవకాశం వచ్చింది. ఇందుకు నేను కామెడీ షుగర్ కోటింగ్ నిస్తూ క్యాంప్ బెల్ ‘హీరోస్ జర్నీ’ ఫాలో అవచ్చా? క్యాంప్ బెల్ స్ట్రక్చర్ యూట్యూబ్ లో వుంది. వెబ్ సిరీస్ పది ఎపిసోడ్లు వుంటుంది. నిడివి ఐదు నుంచి 10 నిమిషాలు. ప్రతీ ఎపిసోడ్ ముగింపులో ఒక ట్విస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అది తర్వాతి ఎపిసోడ్ కి లీడ్ అవుతుంది. ఇలా చివరి ఎపిసోడ్ లో హీరో గోల్ సాధించే వరకూ ట్విస్టులుంటాయి. ఇలా వెబ్ సిరీస్ సీరియల్ కథ ఎపిసోడిక్ విరామాలతో వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారా? ―హరీష్, అసిస్టెంట్ డైరెక్టర్ A : కంగ్రాట్స్, ఇలా ముందుకు వెళ్తున్నందుకు. ఐతే వెబ్ సిరీస్ రచన సినిమా రచన ఒకటి కాదు. జోసెఫ్ క్యాంప్ బెల్ స్ట్రక్చర్ అనేది సినిమాల వరకే. అది కూడా ఒకప్పటి సినిమాలకే. గత 30 ఏళ్లుగా హాలీవుడ్ సిడ్ ఫీల్డ్ ని అనుసరిస్తోంది. పురాణాల ఆధారంగా క్యాంప్ బెల్ స్ట్రక్చర్ లో 10 ప్లాట్ పాయింట్స్ వుంటాయి. దీని వల్ల కథ భారంగా, నిదానంగా సాగుతుంది. ఒకప్పటి కళాఖండాలకిది సరిపోయింది. సిడ్ ఫీల్ట్ ఈ ప్లాట్ పాయింట్స్ ని ఐదుకి కుదించి (మూడు ప్లాట్ పాయింట్స్, రెండు పించ్ పాయింట్లు) వేగం పెంచాడు. సిడ్ ఫీల్డ్ ని అనుసరిస్తూ వచ్చిన జేమ్స్ కెమెరాన్ ఇటీవల ‘అలీటా’ కి, క్యాంప్ బెల్ ‘హీరోస్ జర్నీ’ స్ట్రక్చర్ అనుసరిస్తే ఏమైందో తెలిసిందే. ఈ బ్లాగులోనే వివరించాం. అలాగని వెబ్ సిరీస్ కి సిడ్ ఫీల్డ్ పారడైం పనికొస్తుందని కాదు. సినిమాకి పనికొచ్చేదేదీ వెబ్ సిరీస్ కి పనికి రాదు. సినిమా కథ బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలతో కూడిన త్రీ యాక్ట్స్ లో వుంటుంది. దీన్ని పది ఎపిసోడ్ల వెబ్ సిరీక్ కి వర్తింపజేస్తే, బిగినింగ్ ఓ రెండు ఎపిసోడ్లు, మిడిల్ ఓ ఆరు ఎపిసోడ్లు, ఎండ్ ఓ రెండు ఎపిసోడ్లుగా చేసుకోవాల్సి వస్తుంది. అంటే మొదటి రెండు ఎపిసోడ్లూ బిగినింగ్ బిజినెస్ అయిన పాత్రల పరిచయం, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా చేసి, ముగింపులో ప్లాట్ పాయింట్ వన్ కి తెచ్చి గోల్ ని ఏర్పాటు చేయాలన్న మాట. దీని తర్వాత మిడిల్ ఆరు ఎపిసోడ్స్ లో ఆ గోల్ కోసం సంఘర్షణ చూపించుకొస్తూ, మిడిల్ ఆరవ ఎపిసోడ్ ముగింపులో ప్లాట్ పాయింట్ టూ ఏర్పాటు చేయాలన్న మాట. అప్పుడు చివరి రెండు ఎండ్ ఎపిసోడ్స్ లో వెబ్ సిరీస్ కి ముగింపు నిచ్చుకోవాల్సి వస్తుంది. ఇదంతా సిల్లీగా వుంటుంది. అంటే మొదటి రెండు వారాలు పాత్రల పరిచయం, సమస్యకి దారితీసే పరిస్థితులే చూపిస్తూ కూర్చోవాలి. గోల్ ఏర్పాటు అంటే కథా ప్రారంభమే కాబట్టి, కథేమిటో రెండో వారంలో గానీ చెప్పలేం. అప్పటి వరకూ ప్రేక్షకులుంటారా? అలాగే చివరి రెండు వారాలు ముగింపు చూపిస్తూ కూర్చోవాలి. వెబ్ సిరీస్ కి రెండు వారాల పాటు ముగింపు అంటే, రెండు భాగాల ఎన్టీఆర్ బయోపిక్ లాంటిదే. ఇక మధ్యలో మిడిల్ ఆరు వారాలూ గోల్ కోసం సంఘర్షణ చూపిస్తూ కూర్చోవడమే. ఒకే గోల్ ని వారాల పాటు చూపిస్తూ కూర్చుంటే బోరు కొట్టక మానదు. ఎప్పుడో రెండో వారంలో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పాటు చేసిన గోల్ ని, ఐదో వారం కల్లా ప్రేక్షకులు మర్చిపోవచ్చు కూడా. ఆ మిడిల్ సంఘర్షణ చూస్తూ, ఇంతకీ దేని కోసమబ్బా ఈ సంఘర్షణా అని బుర్ర గోక్కోవాల్సిందే. ఆ పై వారం కట్ చేసి పారేసి, పక్క వెబ్ సిరీస్ కి జంపై పోవడమే. వెబ్ సిరీస్ బిజినెస్ కూడా టీఆర్పీ బిజినెస్సే నని మరువకూడదు. గతవారమే ఒక దర్శకుడితో వెబ్ సిరీస్ ప్రస్తావన వచ్చినప్పుడు, స్మార్ట్ ఫోన్ కుర్రాడు వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ ని ఐదు నిమిషాలకి మించి చూడడని తేల్చేశారు. స్మార్ట్ ఫోన్ లో ఏదైనా చకచకా అయిపోవాలి, ఎక్కువసేపు చూసే ఏకాగ్రత వుండదన్నారు. టీవీ సీరియల్స్ ప్రేక్షకులు వేరు, వెబ్ సిరీస్ చూసే ప్రేక్షకులు వేరన్నారు. ఇరవై నిమిషాలు - అరగంట నిడివి వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ చూడడం కష్టమన్నారు. ఇదొక అభిప్రాయం. అయితే ఇప్పుడు తీస్తున్న వెబ్ సిరీస్ అరగంట నిడివిగలవే. ఈ నిడివి కారణంగా సహజంగానే వీటి కథన వేగం తక్కువ. మీది పది నిమిషాలలోపే అన్నారు కాబట్టి కథన వేగం ఎక్కువ. మంచి వ్యూస్ స్కోర్ చేయవచ్చు. ఐతే దీని స్ట్రక్చర్ ఎట్లా? పైన చెప్పుకున్నట్టు వారాలకి వారాలు త్రీయాక్ట్స్ లో చూపిస్తూ ప్రేక్షకుల్ని కోల్పోవాలా? దీనికి PCR మెథడ్ అని వుంది. మీరు స్ట్రక్చర్ స్కూలే కాబట్టి మీకిది నచ్చవచ్చు. వెబ్ సిరీస్ స్ట్రక్చర్ కి PCR మెథడ్ లో ఆలోచించండి. ప్రొఫెసర్ జే మొరార్టీ దీన్ని1970 లలో టీవీ లో కామెడీ సిరీస్ రాస్తున్నప్పుడు రూపొందించాడు. ఈ మెథడ్ లో నేరుగా మొదటి ఎపిసోడ్ ని ప్లాట్ పాయింట్ వన్ తో ప్రారంభించడమే. ప్లాట్ పాయింట్ వన్ తోనే ప్రారంభం. అంటే నేరుగా సమస్య చూపించేయడం. పాత్రల పరిచయాలు, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా వంటి ఉపోద్ఘాతాలుండవు. పాత్రని నేరుగా సమస్యలో పెట్టి, ఆ పాత్ర లేమిటో వాళ్ళ మాటల్లోనే ఇక్కడే చెప్పేయాలి. హీరో అలసి సొలసి ఆర్ధరాత్రి తూలుతూ ఫ్లాట్ కొచ్చాడనుకుందాం. డోర్ తీసుకుని లోపలికెళ్తే లోపల ఎవడో పడుకుని వుంటాడు. వీడెవడో తెలీదు, ఎలా లోపలి కొచ్చాడో తెలీదు. ఇదీ సమస్య. వెంటనే సమస్యలోకి వెళ్ళిపోవడం. ప్లాట్ పాయింట్ వన్ ని తెచ్చి పడెయ్యడం. . PCR లో P, అంటే Problem వెంటనే ఎస్టాబ్లిష్ అవడం. ఇప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్ధం. వచ్చిన వాడు ఎవరనేది చెప్పడు. ఈ ఫ్లాట్ తనదేనంటాడు...ఇలా ప్రాబ్లం పెద్దదై పోతుంది. ఇది PCR లో C, అంటే Complication. చివరికి ఈ మొదటి ఎపిసోడ్ లో హీరోకి ఈ ప్రాబ్లంకి ఒక పరిష్కారం దొరుకుతుంది. దీన్నిగోల్ అనొచ్చు. ఆ పరిష్కారమార్గంతో వచ్చిన వాణ్ణి చిత్తు చేసే గోల్ తో పైచేయి సాధిస్తాడు. PCR లో ఇది R, అంటే Resolution. ఇప్పుడు PCR = Problem + Complication + Resolution, దట్సాల్. మరి ఎపిసోడ్ చివర ట్విస్ట్? ఆ వచ్చిన వాడు చిత్తవడం ట్విస్టు అవదు. ఆ చిత్తయ్యాక, అంటే Resolution పూర్తయ్యాక, రివర్స్ లో ఇంకోటి జరిగి ఇంకో ప్రాబ్లం అక్కడే పుట్టడమే ట్విస్టు. రెండో ఎపిసోడ్ కి మీరన్నట్టు లీడ్. సినిమాలో హీరో చంపేస్తే విలన్ చచ్చిపోవడం ఎండ్. కానీ చచ్చిన వాడు లేచి కూర్చుంటే ట్విస్ట్. వెబ్ సిరీస్ లో చచ్చిందనుకున్న ప్రాబ్లం లేచి కూర్చుంటుంది. ఈ ట్విస్టు ఎపిసోడ్ ముగింపు. హీరో ప్రాబ్లం సాల్వ్ చేశాననుకుంటే అది కాస్తా ఇంకో ప్రాబ్లంగా తిరగబెట్టడం ట్విస్ట్. ఈ ట్విస్టు తర్వాతి ఎపిసోడ్ కి ప్రారంభం. అంటే P. దీంతో C, దీనికి R. ఈ R కి మళ్ళీ ట్విస్టుతో ఎపిసోడ్ ఎండ్. మళ్ళీ తర్వాతి ఎపిసోడ్ కి ఈ ట్విస్టు P... ఇలా రిపీటవుతూనే వుంటుంది చైన్ రియాక్షన్ లా చివరి ఎపిసోడ్ వరకూ. PCR తో లాభాలేమిటంటే, మొదటి ఎపిసోడ్ లోనే కథేమిటో తెలిసిపోతుంది. ఇక ప్రేక్షకులు పారిపోరు. అంతే కాదు, ప్రాబ్లం ఏమిటో, గోల్ ఏమిటో కూడా తెలిసిపోతాయి. ఇక ప్రతీ ఎపిసోడ్ కి ఒక కొత్త ప్రాబ్లం, ఆ ప్రాబ్లంతో ఫ్రెష్ గా కొత్త గోల్... ప్రాబ్లం మారుతూంటే గోల్ ఫ్రెషప్ అవుతూనే వుంటుంది ప్రతీ ఎపిసోడ్ కీ. త్రీ యాక్ట్ లోలాగా ఒకే గోల్ ని చివరి దాకా ఈడ్చుకుపోవడనే సమస్య వుండదు. ఇక ప్రేక్షకులు మర్చిపోయే సమస్యా వుండదు. ‘టీఆర్పీ’ ని కోల్పోయే ప్రమాదమూ వుండదు. మొదటి ఎపిసోడ్ లో చూపించే గోల్ మాస్టర్ గోల్ అవుతుంది. అంటే వచ్చిన వాణ్ణి ఫ్లాట్ లోంచి వెళ్ళ గొట్టడం మాస్టర్ గోల్. ఈ మాస్టర్ గోల్ కి తర్వాతి ఎనిమిది ఎపిసోడ్స్ లో పుట్టే ఒక్కో ప్రాబ్లం ని సాల్వ్ చేసేందుకు అక్కడికక్కడే పుట్టేవి మినీ గోల్స్. చివరి ఎపిసోడ్ లో మాత్రం మాస్టర్ గోల్ కే రిజల్ట్ చెప్పాలి. హీరో వాణ్ణి ఫ్లాట్ లోంచి వెళ్ళగొట్టాడా లేదా? సినిమా కథకే ఒకే సమస్య, దాన్ని సాధించే ఒకే గోల్, ఆ గోల్ కి, లేదా సమస్యకి ఒకే ముగింపూ వుంటాయి. పైన చెప్పుకున్న ఎపిసోడిక్ కథనాలతో గోల్స్ మారిపోతూంటే అది సినిమాలా వుండదు. విడివిడి సమస్యలు చూపిస్తున్న డాక్యుమెంటరీలా వుంటుంది. ఇందుకే టైగర్ హరిశ్చంద్ర, ఆటోనగర్ సూర్య లాంటివి ఇలాటి కథనాలు చేసి ఫ్లాపయ్యాయి. విచిత్రమేమిటంటే క్యాంప్ బెల్ ని చదువుకుని ‘ప్రస్థానం’ తీసిన దర్శకుడు దేవకట్టా, ‘ఆటోనగర్ సూర్య’కి సినిమా మాధ్యమానికి వ్యతిరేకమైన ఎపిసోడిక్ కథనం చేయడం! చివర్న మీరడిగింది - ఎపిసోడిక్ విరామాలతో వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారా? – అంటే ఎపిసోడిక్ విరామాలెక్కడున్నాయి? ప్రతీ ఎపిసోడ్ ముగింపూ ఇంకో ఎపిసోడ్ కి ప్రారంభమే కదా? ఇక ఒక్కో ఎపిసోడ్ క్లిక్ అవాలంటే చివర ట్విస్టు అవసరమే. ఐతే ప్రతీ ఎపిసోడుకిచ్చే ట్విస్టు, వెనక ఎపిసోడ్ కి మించిన స్థాయిలో వుండాలి. పది ఎపిసోడ్లుంటే పది మెట్లు ఒక్కో తీవ్రతతో ఎక్కుతూ పైపైకి పోతూండాలి ట్విస్టులు - ఒకదాన్ని మించొకటి. అప్పుడే వెబ్ సిరీస్ నిలబడుతుంది. ఈ ట్విస్టుల్ని క్లిఫ్ హేంగర్ మూమెంట్స్ అంటారు. ఈ మూమెంట్స్ ని ఎప్పుడూ సాగదీయకూడదు. సాగదీస్తే వీగిపోతుంది. సడెన్ జర్క్ ఇచ్చి ముగించెయ్యాలి. క్లిఫ్ హేంగర్ మూమెంట్స్ కథల్లో, నవలల్లో ఎక్కువుంటాయి. ముగింపు ట్విస్టులకి మాస్టర్ రైటర్ ఓ హెన్రీ కథలు చదువుకోవచ్చు. వాటిలోంచి మీ ఎపిసోడ్స్ కి భిన్నమైన ఐడియాలు రావచ్చు. అలాగే కొన్ని నవలల్లోంచి తీసిన 12 రకాల ట్విస్టులున్నాయి. ఈ లింక్ క్లిక్ చేసి స్టడీ చేయండి. ఏదీ చదవకుండా, చూడకుండా సొంత ఆలోచనలతో కథలు ఎప్పుడూ రాయకూడదు. ఎందరెందరో పోటీ పడుతున్న మీడియాలో నిలదొక్కుకోవాలన్నా, ముందుండాలన్నా చేస్తున్న కథలకి అవసరమైన రీసెర్చి చేసి కొత్తకొత్త ఆలోచనలు చేయాల్సిందే. ఇకపోతే, పదినిమిషాల లోపు వెబ్ సిరీస్ ఎపిసోడ్ శాంపిల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక మీ ఎపిసోడ్స్ కథ గురించి ఇక్కడ చర్చిండం బాగోదు. ఫోన్ చేయండి. స్ట్రక్చర్ గురించి చాలావరకూ మీకు ఫోన్లోనే వివరించాం మెసెంజర్ లో మీ ప్రశ్న చూసి. అయినా నల్గురికీ ఉపయోగపడుతుందని బ్లాగులో రాయమంటే రాశాం. ―సికిందర్ Posted by సికిందర్ at 9:26:00 AM Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Newer Posts Older Posts Home Subscribe to: Posts (Atom) ఈ కాన్సెప్ట్ కి బాధితురాలి కథ అవసరం! స్క్రీన్ ప్లే సంగతులు...? Search This Blog contact msikander35@gmail.com, whatsapp : 9247347511 Popular Posts 1255 : రివ్యూ! రచన- దర్శకత్వం : శైలేష్ కొలను తారాగణం : అడివి శేష్ , మీనా క్షీ చౌదరి , కోమలీ ప్రసాద్ , రావు రమేష్ , శ్రీకాంత్ అయ్యంగార్ , తనికెళ్ళ భర... 1257 : రివ్యూ! 2023 లో జరిగే 95 వ ఆస్కార్ అవార్డ్స్ కి మన దేశం తరపున అధికారిక ఎంట్రీ పొందిన గుజరాతీ చలన చిత్రం ‘ చెల్లో షో ’ (చివరి షో) అక్టోబర్... 1260 : రివ్యూ! దర్శకత్వం : అమర్ కౌషిక్ తారాగణం : వరుణ్ ధావన్ , కృతీ సానన్ , దీపక్ దోబ్రియాల్ , పాలిన్ కబాక్ , అభిషేక్ బెనర్జీ తదితరులు. రచన : నీరేన్ భట్ , ... 1258 : సండే స్పెషల్ రివ్యూ! ‘ చాం దినీ బార్ ’ (ముంబాయి బార్ గర్ల్స్ జీవితాలు) , ‘ పేజ్ త్రీ ’ (ఉన్నత వర్గాల హిపోక్రసీ ) , ‘ కార్పొరేట్ ’ (కార్పొరేట్ రంగం... 1259 : రివ్యూ! రచన - దర్శకత్వం : చెల్లా అయ్యావు తారాగణం : విష్ణు విశాల్ , ఐశ్వ ర్యా లక్ష్మి , కరుణాస్ , శ్రీజా రవి , మునిష్కాంత్ తదితరులు సంగీతం : జస్... రైటర్స్ కార్నర్ హై కాన్సెప్ట్ స్క్రిప్ట్ అంటే బిగ్ కలెక్షన్స్ ని రాబట్టే స్క్రిప్ట్. ఈ ఆర్టికల్ లో మీకు బిగ్ కలెక్షన్స్ ని సాధించి పెట్టే హై కాన్స... 1254 : రివ్యూ! రచన - దర్శక త్వం : ప్రదీప్ రంగనాథన్ తారాగణం : ప్రదీప్ రంగనాథన్ , సత్యరాజ్ , యోగి బాబు , ఇవానా , రాధి కా శరత్‌కుమార్ , రవీనా తదితరులు సంగీ త... (no title) ప్ర తిభ నిరూపించుకోవడానికి షార్ట్ ఫిలిమ్సే కాదు, డాక్యుమెంటరీ లనే విభాగం కూడా వుంది. ఐతే ఇది సామాజిక బాధ్యతలతో కూడుకున్నది. వివ... తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17 స్క్రీ న్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసల... 1256 : రివ్యూ! రచ న -దర్శక త్వం : ఆనంద్ జె తారాగణం: రావణ్ రెడ్డి , శ్రీ ని ఖి త , లహ రీ గుడివాడ , రవీంద్ర బొమ్మకంటి , అమృత వర్షిణి తదిత తరులు సంగీతం: ఫ...
విశ్వక్ సేన్ తెలుగు సినిమా ప్రామిసింగ్ నటులలో ఒకరు. ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో, vishwak sen విరామం లేకుండా పని చేస్తున్నాడు. అన్‌స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్‌కి విశ్వక్ సేన్ మరియు DJ Tilli ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ అతిధులుగా వచ్చారు. విశ్వక్ సేన్ ఇటీవల తన జీవితంలో జరిగిన ఓ ఎమోషనల్ మూమెంట్ గురించి వెల్లడించారు. విశ్వక్ తన రాబోయే చిత్రం ధుమ్కీ షూటింగ్‌లో ఉన్నాడు. ఇందులో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు సినిమా నిర్మాతలు నెల రోజుల పాటు సమ్మెకు పిలుపునివ్వడంతో సినిమా ఘోరంగా దెబ్బతింది. ఇది కాకుండా, సినిమా బడ్జెట్‌ను పెంచే అనేక ఘటనలు జరిగాయి. దీంతో ఖర్చు తడిసి మోపెడయ్యింది. అదే సమయంలో విశ్వక్ సేన్ సోదరి ఆస్పత్రి పాలయ్యింది. అప్పటికే సినిమా పరంగా తీవ్రమైన దు:ఖంలో ఉన్నపుడు ఆమెను ఐసీయూలో చేర్చడం పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది. ఆ సమయంలో విశ్వక్ సేన్ నిద్రలేని రాత్రులు గడిపాడట. అతను రాత్రంతా ఆసుపత్రులలో గడపవలసి వచ్చిందట. మళ్లీ ఉదయాన్నే ధమ్కీ షూటింగ్‌కి హాజరయ్యేవాడినని విశ్వక్ సేన్‌ చెప్పాడు. “బడ్జెట్ ఇప్పటికే ఎక్కువైంది. సినిమా ఆపలేను. చెల్లెలిని విడిచిపోలేను. దీందో అటు చెల్లి, ఇటు సినిమా రెంటికీ హాజరు కావడం తప్ప నాకు వేరే మార్గం లేదు. మా తల్లిదండ్రులు మా చెల్లెలిని చూసుకున్నారు మరియు నేను రాత్రులు ఆసుపత్రిలో గడిపాను. మూడు గంటలపాటు నిద్రపోయి సెట్స్‌కి వెళ్లాల్సి వచ్చింది. షాట్ లాక్ అయిన తర్వాత, నేను ఏడ్చేవాన్ని. అవి నా జీవితంలో అత్యంత కష్టమైన రోజులు” అని విశ్వక్ సేన్ ఆ చీకటి రోజుల గురించి నందమూరి బాలయ్య అన్ స్టాపబుల్ లో చెప్పుకువచ్చారు. విశ్వక్ సినిమా ధమ్కీ త్వరలో విడుదల కానుంది.
పర్యావరణ మార్పుల ప్రభావం వల్ల ప్రపంచ దేశాలు తల్లడిల్లుతున్నాయి. ఒక్కో దేశం ఒక్కో రకంగా సతమతమవుతోంది. భూతాపం ఒక్కసారిగా పెరిగిపోవటం వల్ల మొట్టమొదటి సారిగా యూకేలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను దాటి పోయాయి. అమెరికాలోని కొన్ని ప్రాంతాలు గత ఏడాది వీచిన వేడిగాలుల వల్ల దావానాల ప్రభావానికి లోనయితే, మరికొన్ని హారికేన్ల బారిన పడ్డాయి. పాకి స్తాన్‌ను వరదలు, తూర్పు ఆఫ్రికాను కరవు, ఆహార కొరత వంటి సమస్యలు పీడిస్తున్నాయి. నైజేరియాలో వరదలకు 600 మంది మరణించారు. 1.3 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. మన దేశంలో 75 శాతం జిల్లాలు తీవ్రమైన పర్యావరణ ప్రభావా నికి లోనవుతున్నాయని కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్‌, ‌వాటర్‌ (‌సీఈఈ) అధ్యయనం వెల్లడించింది. 2021 గ్లోబల్‌ ‌క్లయిమేట్‌ ‌రిస్క్ ఇం‌డెక్స్ ‌నివేదిక ప్రకారం, ప్రపంచంలో తీవప్రభావానికి లోనయ్యే దేశాల్లో భారత్‌ ఏడో స్థానంలో ఉంది. పర్యావరణ ప్రభావం వల్ల ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పసిపిల్లలు, వృద్ధులు అకాల మరణాల పాలవుతున్నారు. ఈ ముప్పును అధిగమించటానికి ప్రపంచ దేశాలు సమష్టిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు ఏ మేరకు బాధ్యత వహించాలి? అనే అంశంపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి ఏటా పర్యావరణ సదస్సును నిర్వహిస్తోంది. ఆ క్రమంలో ఈ ఏడాది ఈజిప్టులో 27వ సదస్సు (కాప్‌ 27) ‌నవంబరు 6 నుంచి 18 వరకూ షర్మ్ -ఎల్‌- ‌షేక్‌లో నిర్వహించారు. 200 దేశాలకు చెందిన 35వేల మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే ‘లాస్‌ అం‌డ్‌ ‌డ్యామేజెస్‌’‌కు అభివృద్ధిచెందిన దేశాలు బాధ్యత తీసుకోవాలని, అవసరమైన ఆర్థిక సాయం అందించాలని ఈసారి సమావేశాల్లో ప్రముఖంగా చర్చ జరిగింది. సదస్సుకు ముందు 66 అభివృద్ధి చెందిన దేశాలు తమ ‘లాస్‌ అం‌డ్‌ ‌డ్యామేజెస్‌’‌కు సంబంధించిన నివేదికలు సమర్పించాయి. ఏ రంగానికి ఎంత నష్టం సంభవించిందనే అంశంపై స్పష్టత లేదు. 2024కు ముందే ఒక అంచనాకు రావాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు. కాప్‌ ‌సదస్సులంటే.. కాప్‌ అం‌టే.. కాన్ఫరెన్స్ ఆఫ్‌ ‌పార్టీలు . ఇక్కడ పార్టీలు అంటే సదస్సుకు హాజరయ్యే దేశాలు. ఇవన్నీ కూడా 1992లో ‘యునైటెడ్‌ ‌నేషన్స్ ‌ఫ్రేమ్‌ ‌వర్క్ ‌కన్వెన్షన్‌ ఆన్‌ ‌క్లయిమేట్‌ ‌ఛేంజ్‌ ( ‌యూఎన్‌ఎఫ్‌సిసి)పై సంతకం చేసిన దేశాలు. చమురు, బొగ్గు, గ్యాస్‌ ‌వంటి శిలాజ ఇంధనాలను కాల్చటం వల్ల ఉద్గారాలు విడుదలై భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భూ ఉష్ణోగ్రతలు 1.1మీకి పెరిగాయి. ఇవి 1.5కి చేరుకునే దిశగా సాగుతున్నాయని ఇంటర్నేషనల్‌ ‌ప్యానల్‌ ఆన్‌ ‌క్లయిమేటు ఛేంజి (ఐపీసీసీ•)లోని ఐరాస శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు 1850లలో నమోదయిన స్థాయిని దాటి 1.7 నుంచి 1.8మీకి పెరిగితే ప్రపంచ జనాభాలో సగం మంది ప్రాణాంతకమైన వేడి, ఉక్కపోతకు గురవుతారని ఐపీసీసీ అంచనా వేసింది. ఈ పరిస్థితిని అధిగమించి ఉష్ణోగ్రత 1.5మీ నుంచి పెరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిని చర్చించటమే పర్యావరణ సదస్సుల ప్రధాన లక్ష్యం. వీటిని కాప్‌ ‌సదస్సులు అని పిలుస్తారు. అందరి చూపు భారత్‌ ‌వైపు నరేంద్రమోదీ నాయకత్వంలోని భారత్‌కు ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దానికి తోడు ఈ ఏడాది డిసెంబరులో జీ-20 అధ్యక్ష హోదాను ఇండోనేసియా నుంచి భారత్‌ ‌స్వీకరించ నుంది. భద్రతామండలిలో ఇప్పటి వరకూ తాత్కాలిక సభ్యత్వ దేశంగా ఉన్న కొనసాగుతున్న భారత్‌కు అధ్యక్ష స్థానం దక్కనుంది. అలాగే వచ్చే ఏడాది షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్సీఓ) ఛైర్మన్‌ ‌షిప్‌ ‌కూడా దక్కనుంది. ఈ నేపథ్యంలో కాప్‌ ‌సదస్సులో భారత్‌ ‌కీలకపాత్ర పోషించాలని చిన్న దేశాలు కోరుతున్నాయి. పర్యావరణ అంశానికి సంబంధించి భారత్‌ ‌కొన్ని లక్ష్యాలకు కట్టుబడి ఉంది. మిగతాదేశాల మాదిరిగా గాంభీర్య ప్రకటనలు చేయకుండా సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకుని తన నిబద్ధతను ప్రకటించుకుంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంపు, ఉద్గారాల జీడీపీ సామర్థ్యం తగ్గింపు, అడవుల విస్తీర్ణాన్ని పెంచటం వంటి లక్ష్యాలను విధించుకుని ముందుకు వెళుతోంది. నిధుల సంగతేమిటి? వాతావరణ మార్పుల కట్టడికి అందిస్తున్న నిధులను మూడు భాగాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది: మార్పుల తీవ్రతను తగ్గించటం కోసం, అంటే శిలాజ ఇంధనాలతో పాటు ఇతర కాలుష్య కారక చర్యలకు దూరంగా ఉండాలి. రెండోది : మార్పులను తట్టుకుని నిలబడటం కోసం..ఇక మూడో రకం నిధులు వివాదాస్పదమైనవి. వీటినే ‘లాస్‌ అం‌డ్‌ ‌డ్యామేజ్‌ ‌ఫైనాన్స్’‌గా పిలుస్తారు. ఇప్పటికే సంక్షోభం ఎదుర్కొన్న దేశాలకు పరిహారంగా ఈ నిధులు అందిస్తారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2020 నాటికి ఏటా వంద బిలియన్‌ ‌డాలర్లు (రూలలో 8, 19,160 కోట్లు) వంతున నిధులు అందిస్తామని అభివృద్ధి చెందిన దేశాలు 2009లో అంగీకరించాయి. అయితే 2020 ఆ మొత్తం 83.3 బిలియన్‌ ‌డాలర్లు (రూ.6,82,360 కోట్లు)కు చేరింది. 2023 నాటికి ఆ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ కేవలం ఐదు యూరోపియన్‌ ‌దేశాలు లాస్‌ అం‌డ్‌ ‌డ్యామేజెస్‌కు నిధులిస్తామని వాగ్దానం చేశాయి. అందులో జర్మనీ, ఆస్ట్రేలియా, బెల్జియం మొత్తం 220 మిలియన్‌ ‌యూరోలు అందిస్తామని హామీ ఇచ్చాయి. అంతకు ముందు డెన్నార్క్, ‌స్టాట్లాండ్‌ ‌వరుసగా 13 మిలియన్‌ ‌పౌండ్లు, 5 మిలియన్‌ ‌పౌండ్లు ఇవ్వటానికి ముందుకొచ్చాయి. స్వీడన్‌ ‌లాంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే నాయకత్వాన్ని ప్రదర్శించాయి. అభివృద్ధి చెందిన దేశాలు సహజ ఉత్పాదకాలపై ముందస్తు హెచ్చరికలకు స్పందించి 800 మిలియన్‌ ‌డాలర్లు గనక వెచ్చించగలిగితే, ఏటా 3 నుంచి 16 బిలియన్‌ ‌డాలర్ల వరకూ నష్టాలను అధిగమించ గలరని వరల్ట్ ‌మెటీరియాజి కల్‌ ఆర్గనైజేషన్‌ ‌పేర్కొంది. ఇలా అభివృద్ధి చెందిన దేశాల ‘లాస్‌ అం‌డ్‌ ‌డ్యామేజెస్‌’ 2050 ‌నాటికి ఒకటి నుంచి 8 ట్రిలియన్‌ ‌డాలర్లకు చేరతాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. బొగ్గును ఇంధన వనరుగా ఉపయోగించటమే భూతాపానికి కారణమని గత ఏడాది యూకేలోని గ్లాస్గోలో నిర్వహించిన కాప్‌ 26 ‌సమావేశం మొట్ట మొదటిసారిగా తేల్చింది. ఆ వినియోగాన్ని దశల వారీగా పూర్తిగా నిలిపివేయాలని వివిధ దేశాలు ప్రతిపాదించాయి. ఆ మేరకు భారత్‌, ‌చైనా ప్రతిపాదించి అందులో మార్పులు చేశాయి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని ఆపటమే వాతావరణ సమస్యల పరిష్కారానికి మార్గమని ఈ దఫా సదస్సులో భారత ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భారత్‌ ‌తన కర్బన ఉద్గారాల నియంత్రణకు 2070 వరకు తన దీర్ఘకాలిక ప్రణాళిక (రోడ్‌ ‌మ్యాప్‌)‌ను ఈ సదస్సులో ప్రవేశపెట్టింది. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌ ‌మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాలు త్వరితగతిన తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత చొరవ చూపాలన్నారు. తన పర్యావరణ ప్రణాళికలను ఐరాసకు అందించిన దేశాల్లో భారత్‌ 57‌వ దేశం. పేదదేశాలకు ధనిక దేశాలు పరిహారం అందించటం అనే అంశం పైన చర్చించటం, బాధితుల పట్ల సంఘీభావాన్ని ప్రకటించినట్టవుతుందని కాప్‌ 27 అధ్యక్షుడు, ఈజిప్టు పర్యావరణ మంత్రి సమే షౌక్రి అభిప్రాయపడ్డారు. ఐరాస వాతావరణ ప్యానెల్‌ ‌చీఫ్‌ ‌హౌసంగ్‌ ‌లీ.. గ్లోబల్‌ ‌వార్మింగ్‌ ‌ప్రభావాలకు అనుగుణంగా జీవించటం, గ్రీన్‌ ‌హౌస్‌ ‌వాయువుల ఉద్గారాలను తగ్గించటానికి కృషి చేయటం వంటి అంశాల గురించి ఆయన మాట్లాడారు. ఈ దఫా అమెరికా, చైనా అధికారిక చర్చలకు సిద్ధం కాలేదు గానీ, రెండు దేశాల ప్రతినిధులు జాన్‌ ‌కెర్రీ, షునీ జూనూహా ఇందులో అనధికారికంగా చర్చలకు సిద్ధం కావటం విశేషంగా చెప్పుకోవాలి. యూఎస్‌ ‌హౌస్‌ ‌స్పీకరు నాన్సీ పెలోసి తైవాన్‌ ‌సందర్శన అనంతరం గత ఆగస్టులో బీజింగ్‌ అన్ని రకాల చర్చలను నిలిపివేసింది. గ్లోబల్‌ ‌వార్మింగ్‌ను నియంత్రించేందుకు ప్రపంచం అంతా కర్బన ఉద్గారాలను తగ్గించవలసిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ‌సదస్సులో పిలుపు నిచ్చారు. ఆయన ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. పారిస్‌ ఒప్పందం మేరకు 2030 నాటికి తాము లక్ష్యాలకు కట్టుబడతామని చెప్పారు. తాము చేపట్టే చర్యల వల్ల ఉద్గారాలు 2030 నాటికి బిలియన్‌ ‌టన్నులు తగ్గుతాయని చెప్పారు. ఇక ఉక్రెయిన్‌ అయితే, రష్యా ప్రకటించిన యుద్ధం వల్ల పర్యావరణానికి, మానవాళికి సంబంధించిన వినాశనాన్ని ప్రత్యేకంగా ఎత్తి చూపింది. దాదాపు రెండు డజన్ల మంది అధికారులు హాజరయ్యారు. భారీగా ఆయుధాలతో దాడులు, పెద్ద ఎత్తున సైన్యం కదలికల వల్ల భూమి, నీరు, వాయువుల కలుషితమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల ఐదోవంతు రక్షిత భూమి నాశనమైందని, సాగు భూమి విషతుల్యం కావటం వల్ల 11.4 బిలియన్‌ ‌డాలర్ల నష్టం సంభవించిందని చెప్పుకొచ్చారు. బ్రిటన్‌ ‌ప్రధాని రుషిసునాక్‌ ఈ ‌సమావేశాలకు హాజరై అర్ధాంతరంగా వైదొలిగారు. ఇందుకు కారణాలు వెల్లడి కాలేదు. హైదరాబాద్‌ ‌విద్యార్థికి అరుదైన అవకాశం హైదరాబాద్‌ ‌పబ్లిక్‌ ‌స్కూలు విద్యార్థి అంకిత్‌ ‌సుహాస్‌రావుకు ఈ సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశందక్కింది. సదస్సుకు హాజరయిన వారందరి లోకి అతడు అత్యంత పిన్నవయస్కుడు. వ్యవసాయంలో స్థానికత గురించి ప్రముఖంగా ప్రస్తావించి అందరి మన్ననలు అందుకున్నాడు. స్థానికంగా సాగుకు అనుకూలమైన కాయగూరలు ఎంచుకోవాలని, వాతావరణానికి సరిపడనివి ఎంచుకున్నప్పుడు ఎరువులు, పురుగుమందులు ఎక్కువ అవసరం అవుతాయని ప్రకటించాడు. తన బృందంతో కలిసి ‘గ్లోబల్‌ ‌ఛైల్డ్ ‌క్లయిమేట్‌ ‌మేనిఫెస్టో’ రూపకల్పనలో భాగస్వామి అయ్యాడు. ‘ఇది నా జీవితకాల అనుభవం. సదస్సులో రైతు పక్షాన సుస్థిర వ్యవసాయం గురించి మాట్లాడటమే కాదు, తీవ్రమైన వాతావారణ మార్పులు మహిళలు, పిల్లలు, వెనకబడిన వర్గాల్లో కలిగించే దుష్ఫలితాల గురించి తెలుసుకోగలిగాను. ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాల వల్ల కలుగుతున్న వినాశానాన్ని అర్థం చేసుకోగలిగాను’ అని సదస్సు అనుభవాలను పంచుకున్నాడు. షర్మ్ఎల్‌ ‌షేక్‌ ‌సమీపాన గల దహాబ్‌ ‌బీచ్‌ను శుభ్రపరిచే కార్యక్రమంలో కూడా ఆ విద్యార్థి పాల్గొన్నాడు. అవినీతి, ఆర్థిక అస్థిరత్వం, పర్యావరణ మార్పులు వంటి అంశాల్లో మార్పులు తేగల శక్తి తమకు ఉందని తన బృందం తరఫున గట్టిగా చెప్పాడు. ఈజిప్టులో నిర్వహించిన కాప్‌ 27 ‌సదస్సులో ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి. అవన్నీ కార్యాచరణకు నోచుకున్నప్పుడే అనుకున్న పర్యావరణ లక్ష్యాలను సాధించటం వీలవుతుంది. ఇది చెప్పినంత తేలిక కాదు. చాలా దూరం ప్రయాణించాలి.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేసిందని సాకు చూపి.. ఆంధ్రప్రదేశ్‌లోనూ రవాణా వాహనాలపై ఎంట్రీ ట్యాక్స్ వేయాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశంపై కనీసం కోర్టును ఆశ్రయించలేదని వైఎస్సార్‌సీపీ తప్పుపట్టింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 15ను సవాలు చేస్తూ కొందరు వాహనాల యజమానులు, ప్రైవేట్ ఆపరేటర్లు కోర్టుకు వెళ్లారేగానీ.. ఇప్పటివరకు ఆ జీవోను ఏపీ ప్రభుత్వం కోర్టులో ఛాలెంజ్ చేయలేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎద్దులు పోట్లాడితే దూడ కాళ్లు విరిగాయన్న చందంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తెలుగు ప్రజలు అల్లాడుతున్నారు. ఇద్దరూ వారు చెప్పిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించడానికి లేనిపోని వివాదాలు ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉన్నారు. కానీ ప్రజలపై బాదుడు కార్యక్రమాన్ని మాత్రం ఇద్దరూ మాట్లాడుకునే చేస్తారు. రెండు ప్రభుత్వాలూ ఒకేరోజు పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ పెంచాయి. ఒకట్రెండు రోజుల తేడాతో విద్యుత్ చార్జీలను పెంచాయి. దీంట్లో మాత్రం తగాదాలు లేవు. చూస్తే ఇద్దరూ మాట్లాడుకునే పన్నులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏ చిన్నసాకు దొరికినా ప్రజలపై పన్ను బాదుడు మానడం లేదు. రవాణా వాహనాలపై వేస్తున్న ఎంట్రీ ట్యాక్స్ ఇలాంటిదే’’ అని దుయ్యబట్టారు. అడ్డుకునేందుకు ఏ ప్రయత్నం చేయలేదు.. ఎంట్రీ ట్యాక్స్‌ను అడ్డుకునేందుకు అనేక అవకాశాలున్నప్పుటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరి నిమిషం వరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని మైసూరారెడ్డి విమర్శించారు. ‘‘విభజన చట్టంలో సెక్షన్ 72 ప్రకారం.. రెండు రాష్ట్రాల మధ్య ఎంట్రీ ట్యాక్స్‌కు అవకాశం లేదు.. కానీ రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ జారీ చేసిన జీవో ప్రకారం ఈ ఏడాది మార్చి 31 తరువాత రెండు ప్రభుత్వాలు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, గడువు ముగిసేవరకు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణతో ఎలాంటి చర్చలకు చొరవ చూపలేదు’’ అని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ మంత్రులు గవర్నర్ వద్దకు వెళ్లి ఆర్జీ పెట్టెలో వినతులు వేస్తున్నారని.. కానీ ఆయన రెండు రాష్ట్రాల్లోని దేవాలయాలకు ముత్యాలు తీసుకుపోవడం తప్ప అంతకుమించి చేస్తున్నది ఏమీ కనిపించట్లేదని మైసూరా విమర్శించారు. అందరి ఇటుకలతో ఏం కడతారట! ప్రజలనుంచి విరాళాలుగా ఇటుకలు సేకరించి చంద్రబాబు సింగపూర్ తరహా రాజధాని ఏం కట్టగలరని మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. విలేకరులడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘అందరి ఇటుకలు తెచ్చి కడితే.. సింగపూర్ రాజధాని ఏం కడతారట ఆయన. నేను పరిపాలన దక్షుడిని. నేనే ఈ రాష్ట్రాన్ని గటెక్కిస్తానన్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కేంద్రం సాయం చేయట్లేదంటున్నారు. కేంద్రం సాయం చేస్తే నీ పాలనా దక్షత ఏంటీ? ఉన్న సంసారం పొదుపుగా చేసి గట్టెక్కిస్తే మంచిగా సంసారం చేసినట్టు. అంతేగానీ ఎవరో డబ్బిస్తే నేను సంసారాన్ని బాగా చేస్తానంటూ.. రోజూ లగ్జరీ హోటళ్లలో తిరగడం చందంగా చంద్రబాబు తీరు ఉంది’’ అని చమత్కరించారు.
Uppena Heroine Krithi Shetty Images, Age, Photos, Family, Biography, Movies: Uppena Heroin Krithi Shetty is an Indian film actress Tamil, Kannada, and Telugu fi... Recent Posts రోహిత్ శర్మ లాగానే… గాయాలను లెక్కచెయ్యకుండా మైదానం లో పోరాడిన 11 క్రికెటర్స్.! నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అని భార్య అడిగేసరికి…ఆ భర్త చెప్పిన ఈ ఆన్సర్ కరెక్ట్ అంటారా.? “మెగాస్టార్ చిరంజీవి-పూరి జగన్నాధ్” కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్టోరీ సినిమా ఇదేనా..? ఒకవేళ ఇదే నిజమైతే..? “ఇంక మాకు ఇండియా టీమ్ మీద ఆశలు ఏం లేవు” అంటూ… బంగ్లాదేశ్ తో భారత్ రెండో ODI కూడా ఓడిపోవడంపై 15 ట్రోల్స్.! “పోలో టీం” నుండి… లక్షల విలువ చేసే “వాచ్” వరకు… మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్” దగ్గర ఉన్న 9 ఖరీదైన వస్తువులు..!
ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒత్తిళ్లన్నీ మాయమై మనసుకి ప్రశాంతంగా అనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అదేమీ పెద్ద కష్టమైన విషయం కాదు. దానికోసం ఇంటిని ‘జెన్’ పద్ధతిలో డిజైన్ చేస్తే చాలు. ఇంట్లో ప్రత్యేకంగా మెడిటేషన్ రూమ్, జెన్ రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసుకోవడం ఇప్పటి ట్రెండ్. మోస్ట్ సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ ఇంటీరియర్ ట్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘జెన్’ ముందుంది. జెన్ అంటే ధ్యానం అని అర్థం. గదిని జెన్ స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలా డిజైన్ చేయొచ్చంటే.. గదిలో తేలికపాటి రంగులు ఉండేలా చూసుకోవాలి. కాంట్రాస్ట్ లేకుండా ఒకేరకమైన రంగులను ఎంచుకోవాలి. లైటింగ్ కాస్త డల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండాలి. గదిని వస్తువులతో నింపేయకుండా ఎక్కువ స్పేస్ ఖాళీగా ఉంచుకోవాలి. గదిలో ఒకట్రెండు మొక్కలు పెట్టాలి. గది మూలల్లో సువాసనలు వెదజల్లే కొవ్వొత్తులను ఉంచాలి. గదిలో ఒక మీడియం సైజు బుద్ధుడి బొమ్మ లేదా జెన్ ఆర్ట్, క్రాఫ్ట్స్ లాంటివి పెట్టుకోవాలి. అలాగే గదిలో సున్నితమైన శబ్దాలు వచ్చేలా సన్ క్యాచర్స్, సింగింగ్ బౌల్ కూడా పెట్టుకోవచ్చు. మరిన్ని వార్తలు సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న మిల్లులకు వడ్లు కేటాయించని కలెక్టర్‌
నా పేరు రమ్య.నేను నా చదువు పూర్తి అయినా తరువాత మా Lబాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను.వాళ్ళ ఇంట్లో ముగ్గురు వుంటారు.మా బాబాయ్ చిన్ని తమ్ముడు. నాతో నలుగురు.ఎండాకాలం లో 10రోజులు ఉండాలని వెళ్ళాను.మా తమ్ముడు 24 సంవత్సరాలు.నేను 25 సంవత్సరాలు.నా కంటే 1సంవత్సరమ్ చిన్న.మేడ మీద మేము ఒక రోజు పాడుకున్నాము. నా పక్కలనే మా తమ్ముడు పడుకున్నాడు.నాకు కాలు వేసే అలవాటు వుంది. నిద్రలో వాడి మీద కాలు వేసాను.వాడు నా వైపు మళ్ళీ పడుకున్నాడు.నా కాలు వాడి రెండు కల మీదంగా వెళ్లి అరికాలు వాని పిర్రలకు తాకుతుంది.నా పెదాలు వాని పెదాలకు ఇంచు దూరంలో ఉన్నాయి.నా ఊపిరి వాడి ఊపిరి కలుస్తుంన్నాయి.వాని మోకాలు నా పూకుకు తాకుతుంది.ఆలా కొంత సేపటికి నాకు మేలుక వచ్చింది.కానీ నా పోసిషన్ ని మారువలేదు. ఎందుకంటే వాడు సెక్సీ గా ఉంటాడు.వాని చిన్న గడ్డం పెదాలు ఆ బాడీ నాకు 10 రోజుల నుంచి పిచ్చెకిస్తున్నాయి.వాడు అందగాడు.నిద్రలో వున్నట్టే వున్నాను.కానీ వాడు మెళుకువతోనే వున్నాడు.ఎం చేస్తాడో చూద్దాం అనుకున్న.వాడు కళ్ళు తెరిచి నన్ను అంత బాగా చూసి పెదాలను మెల్లగా తాకిస్తున్నాడు.ఆ తరువాత మెల్లగా చేయి సంకలో వేసి కిందికి జరుపుతూ సన్లను తాకీతాకనట్టు తాకుతున్నాడు. పెదాలను బెల్లాన్ని నాకినట్టు ముద్దులు పెడుతున్నాడు.చేతితో మెడను పట్టుకొని మొఖం తో తాకుతూ మత్థేకిస్తున్నాడు.నా నడుం పై చై వేసి పిసుకుతూ బోడ్డును అదుముతున్నాడు.రొమ్ములపై మొకం పెట్టి సన్లను ముద్దాడాడు.చిన్నగా చేతులను డ్రెస్ లోనించి సన్లకు తాకేలా పెట్టాడు.మేడమీద చల్లని గాలి మరో వైపు వాని వేడి నాకు ఆయిగా వుంది.నా వొళ్ళు పులకరించడం మొదలైది.పెదాలను కొరుకుతు రెండు చేతులతో సన్లను పిసుకుతూ మోకాలుతో పూకును తాకుతున్నాడు.నాకు స్వర్గం అనిపించింది.కొంతసేపయ్యాక నా పాయింట్ లొనుచి వెనుకాల చేయి పెట్టి పిర్రలను పిసుకుతున్నాడు. వాని గట్టి చేతులు ఆలా చేస్తుంటే . నొప్పి అనిపించినా కదలలేదు ఎందుకంటే నాకు సమ్మగా వుంది. వాడు గుద్దలో వేలుపెట్టి గెలుకుతుంటే పూకు అదురుతుంది వాని చేతులు పూకుకి తాకుతున్నాయి.నాకు కళ్ళు వెడల్పు చాపి దెంగించుకోవాలి అనిపించింది. కానీ ఎం లాభం పక్కనే చిన్ని బాబాయ్.సరేలే అనుకున్న. వాడు నాపూకుని తాకడం మొదలు పెట్టాడు అబ్భా ఆ.. ఆ… ఆ. వాని రెండు పెద్ద వేళ్ళు లోపలికి దూచి బయటికి తీస్తుండగా నేను కదిలాను. వాడు ఆ వేళ్ళు అలాగే ఉంచాడు.కాసేపడికి బయటికి లోపలికి అనడం ప్రారంభించాడు. ఆలా 2 గంటలు చేసాడు. నాది కారింది.వాని వేళ్ళు తడిచావి.వేళ్ళు తీసి బొంతకు తుడిచి. వాన్ని సుల్లి బయటికి తీసాడు.నేను చిన్నగా చూసీచూడనట్టు చూసాను కానీ వానిది చాలా అంటే చాలా పెద్దగా వుంది.మరియు లావుగా వుంది. బలంగా గట్టిగ ఉన్నట్టు కనపడింది.సుల్లిని నాకు ముందరంగా నా రెండు కాళ్ళ సందున అనగా ముందలంగా పూకు కింద కాళ్ళ సందున పెట్టి ముందుకు వెనుకకు ణుకుతున్నాడు.10నిమిషాల తరువాత వాని వీర్యం నా కాళ్ళ సందున పడింది.దాని బొంతతో తుడిచాడు.వాడు నా మీద కలిసి అల్లుకొని పడుకున్నాడు.తెల్లారా వచ్చింది. వాడు నన్ను వదిలి దూరంగా పడుకున్నాడు.చిన్ని కి బాబాయ్ కి డ్యూటీ వుంది వాళ్ళు యదావిధిగా తయారవుతున్నారు.నాకు కోరిక తీరలేదు. వాళ్ళు వెళ్ళాక ఇద్దరమే ఉంటాం.అప్పుడు వాన్ని రాత్రి చేసింది బాబాయ్ కి చెప్తానని భయపెట్టి ఆ తరువాత వానితో రోజంతా దెంగించుకోవాలి అని అనుకున్నాను.చిన్ని బాబాయ్ డ్యూటీ కి వెళ్లారు. సోఫాలో కూర్చొని మేము సినిమా చూస్తున్నాం. అందులో rape సీన్ వస్తుంది.నా పూకు గుసగుసలాడుతుంది. వాని మొడ్డ కూడా కొంచెం లేసినట్టు అనిపించింది.అరేయ్ రాత్రి ఎం చేసావురా అని వాన్ని అడిగా. వానికి అర్ధం అయింది. సారీ అక్క.ఎందుకు ఆలా చేసావ్ అని అడిగా. అక్క నువ్వు వచ్చినప్పటి నుంచి రోజు bathroom లో నిన్ను ఊహించుకుంటూ పంపు (హస్థప్రయోగం ) చేసుకున్న.ఆగలేకపోయాను అక్క సారీ.అయినా నీకు నిజంగా తెలియదా.ఇప్పుడెందుకు అడుగుతున్నావు.తెలుసురా నిన్ను చూసినప్పటి నుంచి నీతో దెంగించుకోవాలని వుంది కానీ నీవు ఒప్పుకొంటావో లేదో నేను అడిగితె గలీజ్ద్దని అవుతానని అడగలేదు. కానీ నీ మొడ్డ బలంగా ఉందిరా అనగానే వాడు నన్ను గోడకేసి వత్తుతు ముద్దులు పెడుతున్నాడు.నా పెదాలను కసిగా జుర్రుతున్నాడు.పెదాలను కొరుకుతున్నాడు చెంపలను మెడను ముద్దాడుతూ కొరుకుతున్నాడు.నాకు సమ్మగా వుంది.నేను పంజాబీ డ్రెస్ లో వున్నాను. వాడు టీషర్ట్ నిక్కర్ లో వున్నాడు. వాటిని తొందరగా తీసేసాడు.ఒక్క డ్రాయర్ మాత్రమే వుంది.నన్ను బలంగా గోడకు వత్థుతు సన్లను డ్రెస్ పై నుంచే రెండు చేతులతో బలంగా ఓత్థాడు నోరుతో కొరికాడు.ఒక్కసారి నొప్పనిపించి అబ్బా అన్నాను.అయినా వదలక పిండిని పిసికినట్టు పిసికాడు.నా డ్రెస్ ని విప్పి bra ఉక్కులను నోటితో తీసి నా సంక నాకుతూ సన్లను నాకాడు.సను రొమ్ములను నోట్లో పెట్టుకొని రబ్బరును సాగదీసినట్టు చీకాడు.నా కోన రొమ్మును కొరికాడు. అబ్బా లంజాకొడకా చిన్నగారా నేను మనిషినే.మరల ఆ సా ఆ ఆ…. హ్హ్హ్హ్హ్హ్… కాస్… కాస్… ఆ.. నా విపినంగా చేతులు వేసి వాని రొమ్ములకు నా రొమ్ములను గట్టిగా అత్తుకున్నాడు.నా పిర్రల కిందగా చెయ్ వేసి ఒక సంక కిందగా సనురొమ్మును మరో చేతితో పట్టుకొని ఎత్త్తుకున్నాడు.Bedroom లోకి తీసుకెళ్లి Bed పై పడేసి డ్రాయర్ ని విప్పి సుల్లిని నోట్లో పెట్టాడు.ఆ సుల్లి పెద్దగా లావుగా వుంది.నా పూకులో పడతాదా లేదా అన్నట్టు వుంది. 5నిముషాలు చీకగనే నా పాయింట్ నీ విప్పాడు.నా నిగనిగ లాడే నల్ల రేగడి పొలాన్ని చూడగానే సుల్లి మరింత లేచింది.పూకు పై పడి నాలుకతో కాసేపు దెంగాడు.పూకు రేకులను విప్పి పూకంతా నాకాడు.ఆలా నాకుతూ నా రెండు పిర్రలను పిసికాడు. గుద్దలో వేలుపెట్టి దెంగాడు.నా పొడుగుతా పైన పడుకొని పెదాలను కోరుకుతూనే పూకులో మొడ్డ మెల్లగా పెడ్తున్నాడు. నాకు మొదటిసారి కాబట్టి నొప్పి చాలా ఎక్కువ. అయినా ఓర్చుకున్న.లోపలికి సగం దూరింది. ప్రాణం పోయినట్టు అనిపించింది.నొప్పి చాలా ఎక్కువ నేను ఏడవటం మొదలుపెట్టాను. నా కన్నీళ్లను నాలుకతో తుడుస్తూ ఎంత sexy గా వున్నవే. ఏడుస్తే చాలా అందంగా వున్నావు అని ముద్దుల మీద ముద్దులు పెట్టాడు. నేను అలాగే ఏడుస్తున్నాను. అయినా వాని పొడుగాటి మొడ్డ మొత్తం పూకులోనికి పోనిచ్చాడు. అది ఎక్కడో లోపల తాకుతుంది.దాని తాకిడి బొడ్డుకు తాకినట్టు అనిపిస్తుంది.బొడ్డుకు సుల్లి అనొచ్చు అనిపించింది. మెల్లగా ముందుకు వెనక్కు అనడం మొదలుపెట్టాడు. 10 నిమిషాలు బాధ అనిపించినా సుల్లి సాఫీగా ఆడడం మొదలయింది.నా రెండు పంగలను వెడల్పుగా విప్పి వాని ఒట్టలు గుద్దకి తాకుతుంటే గేప్ప గేప్ప దెంగుతున్నాడు.నేను మెల్లగా మూల్గుతుంటే లంజాదనా నీ పూకు ఇంత sexy గా వుంది. ఇంత కసిగా పుట్టావ్ అని గొంతు పట్టి గట్టిగ దెంగుతూ నడుమును పిసికాడు.నాకు నొప్పులు ఎక్కువైనవి వాడు దెంగే దెంగుడుకు. వద్దు వద్దు వద్దు అన్నా వినకుండా దెంగాడు.ఎక్కువ ఏడుస్తుంటే కాసేపు అపి వాని మీద నన్ను పడుకోపెట్టుకుని వెన్నుని తడుతూ ఉంటే ఆపడ్డులే అనుకున్న. కానీ అరవకుండా నోటిని నోటితో అంటే పెదాలను వాని పెదాలతో మూసేసాడు అరచిన బయటికి సౌండ్ రాదు.వాడు పిర్రలని వెడల్పు అని గుద్దలో వేలుపెట్టి గునపం లాంటి సుల్లి తో నా పూకుని 2గంటలు దున్నీ దున్నీ ఆపాడు. నేను లేవలేకుంట అయినాను నను బోర్లా వేసి పిర్రలను విప్పి లావు సుల్లికి ఆయిల్ పూసి గుద్దలో ఇంత పోసి సుల్లిని మెల్లగా పంపిస్తున్నాడు గుద్ద లోపలికి.నాకు నొప్పి మరి ఎక్కువైంది వాన్ని తన్నాను. అయినా వాడు నన్ను లేవకుండా జుట్టు పట్టుకొని వొంగపెట్టి గుద్దలోకి పంపాడు. ఇక నా బాధ…… నేను ఏడుస్తున్న పట్టించుకోకుండా పక్క పక్క దెంగాడు.నేను లేవలేను నన్ను వాడిపై పాడేసుకొని పూకులో సుల్లిని అలాగే ఉంచి ముద్దుల పెడుతుంటే ఇద్దరం మాట్లాడుకొంటూ ఉండిపోయాం.ఆలా రెండు గంటలు. మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా దెంగించుకున్నాం.వాడు నన్ను bathroom లోకి తీసుకెళ్లి వొళ్ళంతా సబ్బు రాసి స్నానం చేయిస్తూ దెంగాడు వాడు స్నానం చేసాడు.ఆ తరువాత bedroom లోకి వచ్చి బట్టలు వేసుకున్నాం.అన్నం తిన్నాము.tv ముందర సోఫాలో వానిమీద కూర్చున్న మూడొచ్చినప్పుడల్లా ముద్దులు పెట్టుకున్నాం. సాయంత్రం 5pm.ఇంటి బెల్ మ్రోగింది.నేను లేచి పోయి డోర్ తీసా మా బాబాయ్ చిన్ని వచ్చార.
It has been decided to extend the vacation of all educational institutions in Telangana till 30.1.2022. Office of Chief Secretary, Telangana State. ఈ నెల 30 వరకు పాఠశాలలకు సెలవులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల సెలవులను పొడగించింది కేసీఆర్‌ సర్కార్‌. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే… పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేసీఆర్‌ సర్కార్‌. కేసీఆర్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం… తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు ఉండనున్నాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలోనే.. ఈ నెల 8 నుంచి 16 వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. అయితే.. ఇప్పటికే కరోనా కేసులు తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే… కేసీఆర్‌ సర్కార్‌ జనవరి 30వ తేదీ వరకు విద్యాసంస్థల సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. తెలంగాణలోని కాలేజీలు, పాఠశాలలు జనవరి 30 వరకు మూత పడనున్నాయి
TIRUPATI, 15 MAY 2022: The two-day literary event in connection with the 292nd Jayanthi of Matrusri Tarigonda Vengamamba concluded in Tirupati on Sunday. As part of it, floral tributes were paid to Vengamamba statue located in MR Palle Circle by All Projects Program Officer Sri Vijayasaradhi. Later Sahiti Sadas commenced at Annamacharya Kalamandiram in Tirupati. Scholars Sri Malayavasini from Visakhapatnam, Dr Nagarajya Lakshmi from Guntur spoke on the great works and life of Vengamamba presided over by Sri Krishna Reddy. In the evening devotional cultural programme were performed. In Tarigonda, the native place of Vengamamba, Sri Lakshmi Narasimha Kalyanam was observed. ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI ముగిసిన వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు విగ్రహానికి పుష్పాంజలి ఆకట్టుకున్న సాహితీ సదస్సు, సంగీత సభ తిరుపతి, 2022 మే 15: తిరుపతిలో రెండు రోజులపాటు జరిగిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం తిరుపతి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టిటిడి ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజయసారథి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు సాహితీ సభ ప్రారంభమైంది. సభకు అధ్యక్షత వహించిన శ్రీ ఎస్.కృష్ణారెడ్డి “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – సంచార క్షేత్రాలు” అనే అంశంపై ఉపన్యసించారు. వెంగమాంబ ప్రధానంగా తన జన్మస్థలమైన తరిగొండ, ఆ తరువాత తిరుమలలో ప్రధానంగా సంచరించారని తెలిపారు. తరిగొండలో 5, తిరుమలలో 13 కలిపి మొత్తం 18 రచనల ద్వారా స్వామివారి కీర్తిని ఇనుమడింపచేశారని తెలిపారు. వెంగమాంబ తన జీవితాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేశారని తెలిపారు. విశాఖపట్టణానికి చెందిన ఆచార్య కె.మలయవాసిని “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచనలు – భక్తితత్వం” అనే అంశంపై ఉపన్యసిస్తూ వెంగమాంబ వ్యక్తిగా, సంస్కర్తగా, యోగినిగా, కవయిత్రిగా శ్రీవారి భక్తితత్వాన్ని ప్రచారం చేశారని వివరించారు. అన్నమయ్య కీర్తనల ద్వారా స్వామివారిని ఆరాధించగా, వెంగమాంగ గద్యం, పద్యం, యక్షగానాల రచన ద్వారా భక్తిని చాటుకున్నారని వివరించారు. గుంటూరుకు చెందిన డా|| వి.నాగరాజ్యలక్ష్మి ”మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – శ్రీవేంకటాచల మహత్యం” అనే అంశంపై మాట్లాడుతూ శ్రీవేంకటాచల మహత్యం గ్రంథంలో శ్రీవారి కల్యాణఘట్టాన్ని సరళంగా, సుందరంగా భక్తులకు అందించారని చెప్పారు. వెంగమాంబ తెలుగులో రచించిన వేంకటాచల మహత్యం చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు. సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చెందిన కుమారి కె.లక్ష్మీరాజ్యం, శ్రీ లోకనాథరెడ్డి బృందం సంగీత సభ జరుగనుంది. ఈ కార్యక్రమంలో టిటిడి ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజయసారథి, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి కోకిల, భక్తులు పాల్గొన్నారు. తరిగొండలో… తరిగొండలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆ తరువాత సంగీత, హరికథ కార్యక్రమాలు నిర్వహించారు. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. « POURNAMI GARUDA SEVA ON MAY 16 _ మే 16న తిరుమ‌ల‌లో వైశాఖ పౌర్ణమి గరుడసేవ » VASANTOTSAVAM COMMENCES _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం
ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా ‘ది వారియర్’. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చెన్నైలో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో.. లెజెండ్రీ డైరెక్ట‌ర్ భార‌తీ రాజా మాట్లాడుతూ ‘‘మ‌ణిర‌త్నంగారు.. నార్త్‌లో షూటింగ్ చేస్తోన్న శంక‌ర్ స‌హా ఇంత మంది ద‌ర్శ‌కులు ఇక్క‌డ‌కు వచ్చారంటే కార‌ణం లింగుసామిగారే. ఆయ‌న‌పై అభిమానమే. ది వారియ‌ర్ సినిమాను త‌ను తెర‌కెక్కించిన విధానం అద్భుతం. బుల్లెట్ సాంగ్, విజిల్ సాంగ్‌కు అద్భుత‌మైన కొరియోగ్ర‌ఫీ చేశారు. రామ్ ఇక్క‌డ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. త‌ను డాన్సులు చూశాను.. బ్యూటీఫుల్‌. ఓ రకంగా అసూయ ప‌డ్డాను. నాకు కాస్త వ‌య‌సు త‌క్కువ‌గా ఉండుంటే నేను కూడా వీరితో క‌లిసి చేసేవాడిని క‌దా అనిపించింది. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ ఎక్క‌డికో వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన గ్రాండియ‌ర్‌కు శంక‌ర్‌లాంటి ద‌ర్శ‌కుడు దారి చూపించాడు. శంక‌ర్ ఆలోచ‌న‌ను చూస్తే ఆశ్చ‌ర్య‌పోతున్నాను. లింగుసామి టెక్నిక‌ల్‌గానూ సినిమాను అద్భ‌తుంగా తీర్చిదిద్దాడు. ఇప్పుడున్న ద‌ర్శ‌కులంతా గొప్ప గొప్ప‌వారు. ఎన్నెన్ని జ‌న్మ‌లెత్తినా సినిమా డైరెక్టర్‌గానే పుట్టాల‌ని కోరుకుంటాను’’ అన్నారు. ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం మాట్లాడుతూ ‘‘లింగుస్వామి ఈ సినిమా కోసం ఇంత మంది వారియ‌ర్స్‌ను తీసుకొస్తాడ‌ని తెలుసుంటే నా సినిమాకు సంబంధించిన వార్ సీన్స్‌ను ఇక్క‌డే చేసుండేవాడిని. లింగుస్వామి చాలా మంచి వ్య‌క్తి. కోవిడ్ స‌మ‌యంలో ఇక్క‌డ అంద‌రి డైరెక్ట‌ర్స్‌ను సంధానం చేశాడు. త‌న వ‌ల్ల నాకు ప్ర‌తి ఒక డైరెక్ట‌ర్‌తో ప‌ర్స‌న‌ల్‌గానూ మంచి అనుబంధం ఏర్ప‌డింది. నేను నా పొన్నియ‌న్ సెల్వ‌న్‌ను హైద‌రాబాద్‌లో షూట్ చేస్తున్న‌ప్పుడు లింగుస్వామి కూడా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఆయ‌న త‌ర్వగా పూర్తి చేసేశారు. ఆయ‌న రోడ్ బాగా వేస్తే .. వెన‌కాలే నేను కూడా వ‌చ్చేస్తాను. ది వారియ‌ర్ సినిమాలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మాట్లాడుతూ ‘‘ది వారియర్.. చాలా మంచి టైటిల్. అందరం జీవితంలో ఏదో సాధించటానికి ఫైట్ చేస్తూనే ఉంటాం. కాబ‌ట్టి ఇది అంద‌రికీ సూట్ అయ్యే టైటిల్‌. ఈ సినిమాలోని బుల్లెట్ సాంగ్ స‌హా అన్ని పాట‌లు బావున్నాయి. దేవిశ్రీ ప్ర‌సాద్‌కి అభినంద‌న‌లు. రామ్ కోసం ఈ సినిమా చూడ‌బోతున్నాను. కృతి శెట్టి .. మంచి న‌టిగా ఎదిగి నేష‌న‌ల్ అవార్డ్‌ను ద‌క్కించుకోవాల‌ని అనుకుంటున్నాను. లింగుసామి మంచి స్నేహితుడు. క‌రోనా స‌మ‌యంలో నాకు చాలా స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. త‌న‌తో చెప్పుకుంటే త‌ను అండ‌గా నిల‌బ‌డ్డారు. అంత మంచి వ్య‌క్తి చేసిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. వారియ‌ర్ ట్రైల‌ర్ చూశాను. చూస్తుంటే రామ్‌లో ఓ ఫైర్ క‌నిపించింది. వారియ‌ర్ సినిమా కోసం చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ ‘‘కోలీవుడ్ ఎంట్రీ కోసం 15 ఏళ్లుగా వెయిట్ చేశాను. అయితే ఈ రేంజ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఉంటుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు. నాకే కాదు.. ఇండియ‌న్ సినిమాల్లోనే ఇంత మంది లెజెండ్స్ ఏ సినిమాకు కూడా వ‌చ్చి ఉండ‌రు. అది లింగుస్వామిగారి వ‌ల్ల‌నే సాధ్య‌మైంది. ఇక్క‌డ‌కు వ‌చ్చిన ఒక్కొక్క గెస్ట్‌ను చూస్తే లింగు స్వామిగారు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు సాధించిన‌ట్లే అనిపిస్తుంది. ఆయ‌న్ని వ్య‌క్తిగా ఎంత ఇష్ట‌ప‌డుతున్నారో ఈ వేదిక‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇంత గొప్ప డెబ్యూతో త‌మిళ్ ఎంట్రీ ఇస్తున్నందుకు ఆశీర్వాదంగా భావిస్తున్నాను. బుల్లెట్ సాంగ్ మాత్ర‌మే కాదు.. ప్ర‌తీ సాంగ్‌ను దేవిశ్రీ ప్ర‌సాద్ ఎక్స‌లెంట్‌ను ఇచ్చాడు. ఆ సాంగ్‌ను మాట్లాడిన శింబుకి స్పెష‌ల్ థాంక్స్‌. అలాగే ఆది పినిశెట్టి నాకు సోద‌ర స‌మానుడు. త‌ను మంచి హీరో. అయితే ఓ క్యారెక్ట‌ర్‌ను విని దాన్ని నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్ల‌డ‌మ‌నేది చాలా గొప్ప విష‌యం. ఆది ఈ సినిమాలో స‌గ భాగం. త‌ను ఈ పాత్ర చేసినందుకు థాంక్స్‌. కృతికి కూడా ఇది డెబ్యూ మూవీ. సూర్య‌గారు, శివ కార్తికేయ‌న్ స‌హా అంద‌రూ స‌పోర్ట్ చేసినందుకు థాంక్స్‌. న‌దియా గారితో క‌లిసి వ‌ర్క్ చేయ‌టం చాలా హ్యాపీగా ఉంది. నిర్మాత శ్రీనివాసా చిట్టూరిగారు చాలా మంచి వ్య‌క్తి. ఆయ‌న‌తో మ‌రో సినిమా చేయ‌బోతున్నాను. ఈ వేడుక‌లో మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌’’ అన్నారు. డైరెక్టర్ ఎన్‌.లింగు స్వామి మాట్లాడుతూ ‘‘సినిమా అనౌన్స్ చేసిన తర్వాత టైటిల్ పెట్టాలని అందరూ అనుకున్నాం. చాలా టైటిల్స్ చెప్పారు. కానీ ఏదీ సెట్ కాలేదు. అప్పుడు నిర్మాతగారు మంచి టైటిల్ చెబితే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు. మా దగ్గర సంతోష్ ది వారియర్ అనే టైటిల్ చెప్పారు. నేను చాలా పెద్ద కోటీశ్వరుడినని పేపర్లో ప్రింట్ చేయించుకుని వచ్చి మరీ పార్థిపన్‌గారు నా గురించి మాట్లాడారు. అలాగే రామ్‌గారు మ‌నుషుల‌ను సంపాదించుకోవాలంటే గొప్ప మ‌న‌సుండాల‌ని మాట్లాడారు. నేను ఏం సంపాదించినా, సంపాదించ‌క‌పోయినా నా కోసం వ‌చ్చిన వారిని వ‌దులుకోకుండా ఉంటే చాలు. అంత‌కు మించిన కోట్ల రూపాయ‌లు నాకు అవ‌స‌రం లేదు. మ‌ణిర‌త్నంగారు ఆయ‌న పొన్నియ‌న్ సెల్వ‌న్‌తో బిజీగా ఉన్నారు. వ‌స్తారో రారో అనుకుని ఫోన్ చేసి ఇలా ఫంక్ష‌న్ ఉంద‌ని చెప్ప‌గానే ఎప్పుడు, ఎక్క‌డ అని అడిగారంతే.. అలాగే శంక‌ర్‌గారికి ఫోన్ చేశాను. సాధార‌ణంగా నాకు ప్ర‌తి విష‌యంలోనూ ఆయ‌న స‌పోర్ట్ చేస్తుంటారు. నేను అడ‌క్క‌పోయినా ఆయ‌నే ఫోన్ చేసి మ‌రీ అడుగుతుంటారు. అంత మంచి మ‌న‌సు ఆయ‌న‌ది. పంజాబ్‌లో షూటింగ్ చేస్తున్నారు. నేను పిలిచాన‌ని చెప్పి మ‌రీ వ‌చ్చారు. అలాగే నేను, ఇంకా చాలా మంది అవ‌కాశాల కోసం ఎవ‌రి గుమ్మం ద‌గ్గ‌ర అయితే నిల‌బ‌డ్డామో అలాంటి వ్య‌క్తులు నా కోసం ఇక్క‌డ‌కు వ‌చ్చి ఇలా నిల‌బ‌డ‌టం కంటే గొప్ప ఇంకేం కావాలి. నేను ఊరి నుంచి వ‌చ్చేట‌ప్పుడు ఏమీ తీసుకురాలేదు. ఇలాంటి వ్య‌క్తుల‌ను సంపాదించుకోవ‌టం కోసం నా జీవితాంతం ఇంకా నిజాయ‌తీగా ఉండ‌టానికి ప్ర‌య‌త్నిస్తాను. కొన్ని సినిమాలకు ఎనర్జీ లెవల్స్ చక్కగా కుదురుతాయి. నాది, రామ్‌గారిది, దేవిశ్రీ ప్ర‌సాద్‌గారి ఎన‌ర్జీ లెవ‌ల్స్ స‌మానంగా ఉంటాయి.దేవిశ్రీ .. ఆడియెన్స్ మూడ్ తెలిసిన మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ప్ర‌తి సాంగ్‌ను అద్భుతంగా ఇచ్చారు. ఆయ‌న‌తో మ‌రిన్ని సినిమాల‌కు క‌లిసి ప‌ని చేస్తాను. న‌దియాగారంటే హీరోయిన్‌గా చాలా ఇష్టం. ఆమెతో క‌లిసి ఓ సినిమా అయినా చేయాల‌నుకున్నాను. ఈ సినిమాకు అది కుదిరింది. ఆమె అద్భుతంగా చేశారు. కృతి శెట్టిని తీసుకోవాలా, ర‌ష్మిక మంద‌న్న తీసుకోవాలా అనిఆలోచించాను. కృతిశెట్టి ఫొటో చూడ‌గానే మీరా జాస్మిన్ అంత పేరు తెచ్చుకుంటుంద‌నిపించింది. అందుకే ఈ సినిమాకు బుక్ చేశాను. ఆదిగారు క‌థ విన్నారు. నేను ఊహించిన దాని కంటే నెక్ట్స్ రేంజ్‌లో పాత్ర కోసం ప్రిపేర్ అయ్యి వ‌చ్చారు. నా కెరీర్లో తనే బెస్ట్ విలన్ అని చెప్పగలను. శ్రీనివాస్ చిట్టూరిగారు.. నేను ఏం అడిగినా దాన్ని సమకూర్చుకుంటూ వచ్చారు. బడ్జెట్ అనుకున్న లెక్కలు దాటింది.. కానీ ఆయన సినిమాపై నమ్మకంతో చేశారు. ఆయ‌న న‌మ్మ‌కం వ‌మ్ముకాద‌ని చెబుతున్నాను. రామ్‌గారు గురించి చెప్పాలంటే.. ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న పేరు మ‌రింత పెద్ద సౌండ్‌తో వినిపిస్తుంది. న‌న్ను న‌మ్మండి. ఆయ‌న టైమ్ సెన్స్ మామూలుగా లేదు. హీరోయిజం, డాన్సులు సూప‌ర్బ్‌. నేను చేసిన పందెం కోడి, భ‌య్యా చిత్రాల కోవ‌లో రామ్‌గారికి ది వారియ‌ర్ సినిమా నిలిచిపోతుంది. నేను తెలుగులో స్ట్ర‌యిట్ సినిమా చేయాల‌ని మ‌హేష్ బాబుగారితో.. అల్లు అర్జున్ గారిఓత చ‌ర్చించాను. కానీ అవేవీ సెట్ కాలేదు. వారియ‌ర్ సినిమా కుదిరింది. ఈ సినిమా చ‌క్క‌గా అంద‌రినీ మెప్పిస్తుంద‌ని భావిస్తున్నాను. శింబుగారికి, సూర్య‌గారికి, శివ కార్తికేయ‌న్‌గారికి థాంక్స్‌. ఈ జ‌ర్నీలో నాకు అండ‌గా నిల‌బ‌డిని ప్ర‌తీ ఒక్క‌రికీ హృద‌య‌పూర్వ‌కంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను’’ అన్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘ది వారియర్ సినిమా వేడుకకి వచ్చిన లెజెండ్రీ డైరెక్ట‌ర్స్ అంద‌రూ ఇండియ‌న్ సినిమానే కాదు.. ప్ర‌పంచ సినిమాలోనే గుర్తింపు సంపాదించుకున్నవారు. వారి ఒక్కొక్కరి అపాయింట్‌మెంట్ కావాలంటేనే క‌నీసం ఓ నెల పాటు వెయిట్ చేయాలి. అలాంటిది అంద‌రూ క‌లిసి ఓ ద‌ర్శ‌కుడు కోసం వ‌చ్చారు. లింగుస్వామిగారికి దీని కంటే పెద్ద విజ‌యం మ‌రోటి లేదు. నేను, ఆయ‌న‌తో క‌లిసి చాలా సార్లు క‌లిసి ప‌ని చేయాల‌ని అనుకున్నాం. కానీ కుద‌ర‌లేదు. ఎట్ట‌కేల‌కు ఓ భారీ చిత్రంతో అల‌రించ‌డానికి రెడీ అయ్యాం. లింగుస్వామి ఎన్నో గొప్ప సినిమాల‌ను తెర‌కెక్కించారు. అయితే ఏ ద‌ర్శకుడిని ఒక్క మాట కూడా అన‌లేదు. ఆయ‌న మ‌న‌స్త‌త్వం చూసి ఆయ‌న‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాను. ఆయ‌న రూపొందించిన ఈ సినిమాలో నేను భాగం కావ‌టం చాలా ఆనందంగా ఉంది. ఆది పినిశెట్టి విల‌నిజం పీక్స్‌లో ఉంటుంది. రామ్ నా సోద‌రుడు.. టాలీవుడ్‌లో ఆయ‌న్ని స్టార్టింగ్లో ల‌వ‌ర్ బాయ్ అనుకున్నాం. కానీ హార్డ్ వ‌ర్క్‌తో ఉస్తాద్ అనే మాస్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. రామ్ అద్భుత‌మైన డాన్స‌ర్‌. బుల్లెట్ సాంగ్ అంద‌రికీ న‌చ్చేసింది. కొరియోగ్ర‌ఫీ ఎక్స‌లెంట్‌. కృతి శెట్టి కూడా పోటీ ప‌డి న‌టించింది. రామ్‌ను కోలీవుడ్ ప్రేక్ష‌కులు చ‌క్క‌గా రిసీవ్ చేసుకుంటార‌ని భావిస్తున్నాను. నాతో పాటు కలిసి పనిచేసిన ఎంటైర్ టీమ్‌కు ధ‌న్య‌వాదాలు’’ అన్నారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ ‘‘లింగుస్వామిగారికి థాంక్స్. ఇంత మంది గొప్ప ద‌ర్శ‌కులున్న వేదిక‌పై నేను కూర్చోవ‌డం మాటల్లో చెప్ప‌లేని అనుభూతినిచ్చింది. జూలై 14న సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్స్‌లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. డైరెక్టర్, నటుడు ఎస్‌.జె.సూర్య మాట్లాడుతూ ‘‘ది వారియర్ వేడుకకి తమిళ సినీ ఇండ‌స్ట్రీలోని గొప్ప డైరెక్ట‌ర్స్ అంద‌రూ వ‌చ్చారు. ఓ పాజిటివిటీతో అంద‌రూ ఓ స్టేజ్‌పై రావ‌టం అనేది చాలా గొప్ప విష‌యం. భార‌తీరాజాగారి ద‌గ్గ‌ర నేను డైరెక్ష‌న్ ఛాన్స్‌కు వెళ్లిన‌ప్పుడు నాకు అవ‌కాశం రాలేదు. చాలా బాధ‌ప‌డ్డాను అయితే ఆయ‌న్ని ఫాలో అయ్యాను. ఆయ‌నెలా డైరెక్ట్ చేస్తున్నారు. ఎలా న‌ట‌న‌ను నేర్పిస్తున్నారు. కావాల్సిన ఔట్‌పుట్‌ను ఎలా రాబ‌ట్టుకుంటున్నార‌నే విష‌యాల‌ను గ‌మ‌నించాను. ఎక్క‌డో విదేశాల‌కు వెళ్లి కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి నేర్చుకునే విష‌యాల‌ను ద‌గ్గ‌రుండే నేర్చుకునే అవ‌కాశాన్ని దేవుడు క‌లిగించాడ‌ని అప్పుడు అనిపించింది. అలాగే లింగుస్వామిగారికి కాస్త గ్యాప్ వ‌చ్చింది. అయితే అద్భుత‌మైన విజయాన్ని సాధించ‌డానికే ఈ గ్యాప్‌ని దేవుడు ఇచ్చాడ‌ని నాకు ఇప్పుడు అర్థ‌మ‌వుతుంది. ఆయ‌న ఇంకా గొప్ప గొప్ప సినిమాల‌ను చేయాల‌ని, నిర్మాత‌గా రాణించాల‌ని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆయ‌న డైరెక్ట్ చేసిన ది వారియ‌ర్ సినిమా పెద్ద హిట్ అవుతుంది. బుల్లెట్ సాంగ్ బుల్లెట్‌లా అంద‌రికీ త‌గిలింది. అదే స‌క్సెస్‌కు సూచ‌న‌. దేవిశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన స‌క్సెస్‌ను అందించింది. తెలుగు ప్రేక్ష‌కులు ఎలాగైతే ర‌జినీకాంత్‌గారు, విజ‌య్‌గారిని ద‌గ్గ‌ర‌కు తీసుకున్నారో.. అలాగే త‌మిళ ప్రేక్ష‌కులు కూడా రామ్‌ను ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను. ది వారియ‌ర్ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్‌ను తిర‌గ రాయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. సెల్వ‌మ‌ణి మాట్లాడుతూ ‘‘ది వారియర్ కథ విన్నాను. అద్భుతమైన స్టోరి. రామ్ పోతినేనికి అదృష్ట‌వ‌శాత్తు ఈ సినిమా ద‌క్కింద‌నేది నా భావ‌న‌. క‌చ్చితంగా సినిమా అద్భుతంగా ఉంది. ఇక్క‌డే కాదు.. పాన్ ఇండియాగా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. భార‌తీరాజాగారికి సినీ ద‌ర్శ‌కులంద‌రి త‌ర‌పున పెద్ద స‌న్మాన స‌భ‌ను ఏర్పాటు చేయాల‌ని కోరుకుంటున్నాను. ది వారియ‌ర్ సినిమా భారీ హిట్ కావాలి. సినిమాను లింగుసామి అంత‌గా ప్రేమించి తెర‌కెక్కించాడు’’ అన్నారు. విశాల్ మాట్లాడుతూ ‘‘సినిమాకు లింగుసామి కరెక్ట్ టైటిల్ పెట్టారు. తనతో నాకు చాలా ఏళ్ల నుంచి చాలా మంచి అనుబంధం ఉంది. నాకు ఇప్పుడున్న యాక్ష‌న్ హీరో అనే ఇమేజ్‌ను ఆయ‌న సినిమా పందెం కోడి వ‌ల్లే వ‌చ్చింది. లింగుసామి దెబ్బ తిన్న పులిలా ది వారియ‌ర్ సినిమాతో వ‌స్తున్నాడు. ఈ సినిమాలో న‌టించిన రామ్‌ను చూస్తే అసూయ‌గా అనిపిస్తుంది. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది. రామ్‌ని తమిళ సినిమా ఇండస్ట్రీలోకి ఆహ్వానిస్తున్నాను. ఆది పిని శెట్టికి అభినంద‌న‌లు. కృతి శెట్టికి ఆల్ ది బెస్ట్‌. పాట‌లు, ట్రైల‌ర్ ఇప్ప‌టికే స‌క్సెస్ అయ్యాయి. సినిమా హిట్ కావ‌టానికి అదే సూచ‌కం. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు. హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ ‘‘లెజెండ్రీ డైరెక్టర్స్ ఆశీర్వాదాలు ద‌క్క‌డం మా అదృష్టం. ది వారియ‌ర్ సినిమాపై ఇప్ప‌టికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. సినిమాకు వ‌ర్క్ చేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు పేరు పేరునా ధ‌న్య‌వాదాలు. శ్రీనివాసా చిట్టూరి గారికి ఆల్ ది బెస్ట్‌. ఆయ‌న బ్యాన‌ర్‌లో నెక్ట్స్ సినిమా కూడా చేస్తున్నాను. దేవిశ్రీ ప్ర‌సాద్‌గారు ఉప్పెన సినిమాకు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు ది వారియ‌ర్ సినిమాకు దాన్ని మించి మ్యూజిక్ ఇచ్చారు. ఆది పిని శెట్టి త‌న క్యారెక్ట‌ర్‌ను క్యారీ చేసిన తీరు చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. అలాగే రామ్ నా ల‌వ్‌లీ కో యాక్ట‌ర్‌. త‌న‌ను అంద‌రూ ఉస్తాద్ అని పిలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. త‌ను ఫ్యాన్స్‌ను నుంచి సంపాదించుకున్న పేరు. త‌మిళంలోనూ రామ్ స్టార్ హీరో కావాలి. న‌న్ను ఆద‌రిస్తున్న ఫ్యాన్స్‌కి థాంక్స్‌’’ అన్నారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో బృందా సార‌థి, లిరిక్ రైట‌ర్ వివేక‌, డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్‌, హీరో ఆర్య‌, బాలాజీ శ‌క్తివేల్, అన్బు చెలియ‌న్, పార్థిప‌న్ త‌దిత‌రులు పాల్గొని ది వారియ‌ర్ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.
Telugu News » Entertainment » Tollywood » Know the reason and idea of behind Mannat’s new swanky nameplate sharukh khan wife Gauri Khan reveals telugu cinema news Gauri Khan: ఇంటి నేమ్ ప్లేట్‏ వజ్రాలతో రెడీ చేయడానికి అదే కారణమట.. అసలు విషయం చెప్పిన షారుఖ్ ఖాన్ భార్య.. ఇంటి గేట్‌కు వజ్రాలు పొదిగిన నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెంబర్‌ ప్లేట్‌కు సుమారు రూ. 35 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా. Gauri Khan Rajitha Chanti | Nov 22, 2022 | 4:16 PM బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ నివాసం మన్నత్. ముంబైలో ఉన్న అత్యంత ప్రముఖుల ఇళ్ల కంటే మన్నత్ ప్రత్యేకం. ఈ విలాసవంతమైన భవనం రాజభవనానికి ఏమాత్రం తక్కువ కాదు. షారుఖ్ నివాసం విలువ సుమారు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. అయితే కొద్దిరోజులుగా షారుఖ్ ఇంటి గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి ఇంటి నేమ్‌ప్లేట్‌తో మన్నత్ వార్తల్లోకి ఎక్కింది. ఇంటి గేట్‌కు వజ్రాలు పొదిగిన నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెంబర్‌ ప్లేట్‌కు సుమారు రూ. 35 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా. రాత్రిపూట దగదగమంటూ మెరుస్తోన్న వజ్రాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే నేమ్ ప్లేట్‏కు వజ్రాలు పెట్టడానికి గల కారణాన్ని బాద్ షా భార్య గౌరీ ఖాన్ తన ఇన్ స్టా ఖాతాలో వెల్లడించింది. నేమ్ ప్లేట్ పక్కన నిల్చున్న ఫోటో షేర్ చేస్తూ.. మీ ఇంటి ప్రధాన ద్వారం.. మీకు.. మీకు కుటుంబం.. స్నేహితులకు ప్రవేశ స్థానం. కాబట్టి నేమ్ ప్లేట్ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. మేము సానుకూల.. ఉత్తేజకరమైన.. ప్రశాంతమైన అనుభూతి కలిగించేందుకు గాజు స్పటికాలతో కూడిన పారదర్శక పదార్థాన్ని ఎంపిక చేసుకున్నాము అంటూ రాసుకొచ్చింది. ఇక గౌరీ ఖాన్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుంది. మన్నత్.. నేమ్ ప్లేట్ డిజైన్ వెనక గౌరీ ఖాన్ ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. షారుఖ్ 2001లో బాంద్రా వెస్ట్‌లో సముద్రానికి ఎదురుగా ఉండే ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ నివాసానికి గతంలో విల్లా వియన్నా అని పేరు పెట్టారు. గ్రాండ్ విల్లా భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి చాలా సంవత్సరాల ముందు నిర్మించబడింది. ఆర్కిటెక్ట్-డిజైనర్ కైఫ్ ఫాకీతో కలిసి గౌరీ ఖాన్ ఇంటి ఇంటీరియర్‌లను పునరుద్ధరించారు.
మునుగోడు మండలంలో కాల్పుల కలకలం రేగింది. ఓ యువకుడు బైక్‌ పై వెలుతుండగా కొందరు దుండగులు అతని పై కాల్పులకు తెగబడ్డారు. బాధితుడికి తీవ్రగాయాలవడంతో.. హుటా హుటిన సమీపంలోని నార్కెట్‌పల్లి ఆసుప్రతికి తరలించారు. స్థానిక సమాచారంతో..పోలీసులు అక్కడ చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి మునుగోడులో కూల్‌డ్రింక్స్‌, నీటి బాటిళ్లను విక్రయిస్తూ.. దీంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. రోజులాగే రాత్రి దుకాణం మూసేసి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో మునుగోడు మండలం సింగారం శివారు దాటగానే కొందరు ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే.. లింగస్వామి చనిపోయినట్లు భావించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే అక్కడే స్వామి అనే వ్యక్తి ఈఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు. read also: <a href=”https://ntvtelugu.com/sports/india-at-common-wealth-games-2022-3-209951.html”>Common Wealth Games 2022: కామన్‌వెల్త్‌లో దూసుకెళ్తున్న భారత్.. 20 పతకాలు కైవసం</a> సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో వున్న బాధితులు లింగస్వామిను నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లుగా సమాచారం. అయితే.. ఘటన జరిగిన స్థలం వద్ద ఓ బుల్లెట్‌ ను పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితుల కోసం గాలింపు చేపట్టామని నల్గొండ డీఎస్పీ నర్సింహరెడ్డి తెలిపారు. అయితే.. బాధితుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్వగ్రామమైన బ్రహ్మణవెల్లంల గ్రామానికి చెందిన లింగస్వామిగా గుర్తించారు. కామినేని ఆసుపత్రి వద్దకు వెళ్లి పరిశీలించారు. బాధితుడుతో మాట్లాడారు.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో పాటు మరికొందరిపై అనుమానం ఉందని బాధితుడు డీఎస్పీకి తెలిపారని సమాచారం. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. <a href=”https://ntvtelugu.com/national-news/whats-today-updates-as-on-august-5th-2022-209953.html”>What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?</a>
సి స్టడ్ రోల్ ఏర్పాటు యంత్రం ప్రధానంగా పైకప్పు మరియు గోడ, ఒమేగా ఉత్పత్తి, ప్రధాన ఛానల్, ఫ్యూరింగ్ ఛానల్ మరియు T బార్తో కలిసి యాంగిల్ ఉత్పత్తి, జిమ్ప్సమ్ బోర్డును ఉపయోగించడం, పైకప్పు ఫ్రేమ్ను తయారు చేయడానికి ఉమ్మడి ప్లాస్టార్వాల్ స్క్రూ ఉపయోగించడం. సాధారణ C స్టఫ్ ఉత్పత్తి మందం 0.5mm, అద్దము ఉక్కు పదార్థం. ఇది చిన్న కోణం ఉత్పత్తి. అన్ని పరిమాణం అనుకూలీకరించవచ్చు. పూర్తి రోల్ ఏర్పాటు యంత్రం లైన్ డెకోలర్, రోల్ ఏర్పాటు యంత్రం, కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్ మరియు టేబుల్ అవుట్ను కలిగి ఉంటుంది. మా యంత్రాంగాలు వివరాలు మా వెబ్ సైట్ ను పక్కన పెట్టండి అనుకూలీకరించిన, మీరు మా వెబ్ సైట్ లో మీ అవసరం ఉత్పత్తులు కనుగొనేందుకు లేకపోతే, నాకు మీ అవసరం డ్రాయింగ్ చూపించడానికి దయచేసి, ఇక్కడ మేము డిజైన్ జట్టు disscuss మరియు మీరు ఒక సంతృప్తి ప్రత్యుత్తరం ఇస్తుంది.
సైమన్ అండ్ షూస్టర్ పేపర్ బాక్స్ వాళ్ళ Dialogues of Plato (2010) చదివాను. ప్లేటో పేరు మీద లభ్యమవుతున్న సుమారు 41 సంభాషణల్లో, 24 దాకా ప్లేటో రచించినట్టు నిశ్చయంగా చెప్పవచ్చు. అందులో ఆయన మొదటిదశలో రాసిన 7 సంభాషణల్లో ‘యుథిప్రొ’,’అపాలజీ, ‘క్రీటో’ ఈ పుస్తకంలో ఉన్నాయి. మధ్య దశలో రాసిన 11 సంభాషణల్లో ‘ఫేడో’, ‘సింపోజియం’, ‘మెనో’ ఉన్నాయి. ఇవి కాక, చివరిదశలో మరొక ఆరు సంభాషణలు, ఉత్తరాలు కూడా రాసాడు. ఈ పుస్తకంలో ఉన్న ఆరు సంభాషణలూ కూడా సుప్రసిద్ధ ప్లేటో అనువాదకుడు బెంజమిన్ జోవెట్ చేసిన అనువాదాలే. కానీ, ఈ పుస్తకానికున్న విశేషం, ప్లేటో జీవితం, సంభాషణల చారిత్రిక సందర్భం గురించిన పరిచయంతో పాటు, సవివరమైన నోట్సు, ప్లేటో మీద వచ్చిన ముఖ్యవ్యాఖ్యానాల పరిచయం కూడా ఉన్నాయి. ప్లేటో తత్త్వచింతన గురించీ, సోక్రటీస్ గురించీ మొదటిసారిగా చదవబోయేవాళ్ళకి ఈ చిన్న పుస్తకం చాలా చక్కని కరదీపిక. ప్లేటోని ఇంతకు ముందు చదివినవాళ్ళకి ఈ పుస్తకం మళ్ళా మరొక గాఢానుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే, ఇందులో అయిదు సంభాషణలు సోక్రటీస్ విచారణ, మరణశిక్ష చుట్టూ నడిచేవే. తనమీద ఏథెన్సు పౌరుడొకడు చేసిన ఆరోపణలకు తానెట్లా జవాబివ్వాలా అని సోక్రటీస్ ఆలోచిస్తూండగా, విచారణా కార్యాలయం ఎదట యుథిప్రొ అనే తన మిత్రుడు కనిపిస్తాడు. అతడు తన తండ్రి మీద నేరారోపణ చెయ్యడానికి అక్కడికి వచ్చి ఉంటాడు. తన తండ్రి ఒక బానిస మరణానికి కారణమయ్యాడనీ, అటువంటి అన్యాయం ఎవరు చేసినా తాను సహించలేననీ, తండ్రి అయినా సరే హంతకుడైనప్పుడు ఎదిరించి తీరవలసిందేననీ యుథిప్రో చెప్పుకొస్తాడు. అప్పుడాతడికీ, సోక్రటీస్ కీ మధ్య నడిచిన సంభాషణ యుథిప్రొ. ఒక పని పవిత్రమైందని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? అది దేవతలకి ఇష్టమైంది కాబట్టి పవిత్రమయిందా లేక ఆ పని పవిత్రమైంది కాబట్టి దేవతలకి ఇష్టమయిందా? సోక్రటీస్ తరహా గతితార్కిక విచారణకి ఈ సంభాషణ చక్కని నమూనా. ఈ సంభాషణతో ఈ పుస్తకం మొదలుపెట్టడం వల్ల పాఠకుడికి సోక్రటీస్ ఆలోచనాక్రమం ఎలా ఉంటుందో ఒక పరిచయం లభిస్తుంది. కఠినమైన ఆ తర్కం ముందు నిలబడలేక యుథిప్రో మెల్లగా జారుకుంటాడు. రెండవ సంభాషణ, ‘అపాలజి’ ఏథెన్సు పౌరసభ ముందు తనన్ని తాను సమర్థించుకుంటూ సోక్రటీస్ చేసిన ప్రసంగం. దీని గురించి గాంధీజీ రాసిన మాటలు ఇంతకు ముందే పరిచయం చేసాను. చాలా ఏళ్ళ కిందట, ఈ సంభాషణ తెలుగు అనువాదం ‘సమర్థన’ పేరిట చదివాను. దక్షిణభారత పుస్తకసభ వాళ్ళు వేసారు. అనువాదకుడు ఎవరో గుర్తులేదు. బహుశా బి.వి.సింగరాచార్య అయి ఉండవచ్చు. మూడవ సంభాషణ క్రీటో. క్రీటో సోక్రటీస్ శిష్యుడు, సంపన్నుడూ, బాగా పలుకుబడి ఉన్నవాడూనూ. అతడు సోక్రటీస్ చెరసాలలో ఉండగా, మర్నాడే శిక్ష అమలుచెయ్యబోతున్నారనగా, సోక్రటీస్ తో జైలునుంచి తప్పించుకుని విదేశాలకు వెళ్ళిపొమ్మనీ, అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ తాను చూసుకుంటాననీ చెప్తాడు. సోక్రటీస్ ఆ ప్రతిపాదనని తిరస్కరిస్తూ, తనకి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడం కన్నా, మరణించి తాను నమ్మిన సత్యాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో వివరిస్తాడు. ఈ రచన కూడా ‘సమర్థన’ తో పాటే తెలుగులోకి వచ్చినట్టు గుర్తు. ఇవి మూడూ ప్లేటో తొలిరచనలు. ఇందులో కనిపించే సోక్రటీస్ చారిత్రిక సోక్రటీస్ కి చాలా దగ్గరగా కనిపిస్తాడనీ, అతడు తనకేమీ తెలియదనే సత్యం తెలుసుకున్నవాడు మాత్రమేననీ, తన సమకాలీన ఏథెన్సు పౌరులకీ,వాళ్ళ దగ్గర ముక్కుపిండి డబ్బు వసూలు చేసి వాళ్ళకి ‘జ్ఞానం’ బోధించే సోఫిస్టులకీ అది కూడా తెలియదనీ ఆ రచనల సారాంశం. తర్వాతి మూడు సంభాషణలూ ప్లేటో రెండవ దశలో రాసినవి. ఇక్కడి వచ్చేటప్పటికి, ప్లేటో తన అభిప్రాయాలు చెప్పడానికి సోక్రటీస్ ను ఒక పాత్రగా వాడుకున్నాడనీ, అతడి పేరు మీద తన తాత్త్విక చింతననే ప్రకటించాడనీ అంటారు. మెనో సోక్రటీస్ మరొక శిష్యుడు. శీలం లేదా నడవడిక లేదా ధర్మం అనేదాన్ని మనం బోధించగలమా లేదా అన్న దాని మీద సోక్రటీస్ కీ మెనో కీ మధ్య జరిగిన చర్చ మెనో లో ఇతివృత్తం. ఇక్కడ కూడా సోక్రటీస్ తనకి ‘శీలం’,’ధర్మం’ అంటే ఏమిటో తెలియవనీ,ఇక వాటిని బోధించగలమో లేదో తనకెట్లా తెలుస్తుందనీ అంటాడు. ఈ రచన బహుశా ప్లేటో రెండవదశలో మొదటి రచన అయి ఉండాలి. ఎందుకంటే, ఇదే దశలో రాసిన ‘ప్రొటాగరస్’ అనే సంభాషణలో సోక్రటీస్ శీలాన్నీ, ధర్మాన్నీ బోధించగలమనే అంటాడు. ఈ పుస్తకంలో ప్రొటాగరస్ లేదు గానీ, విద్య గురించి, సోక్రటీస్, ప్లేటో ల అభిప్రాయాలు తెలుసుకోదలచినవాళ్ళు తప్పకుండా చదివి తీరవలసిన సంభాషణలు ‘మెనో’, ‘ప్రొటాగరస్’ లు. సోక్రటీస్ కి మరణశిక్ష అమలయ్యే రోజున ఆయన చూడటానికి వచ్చిన శిష్యులతో సూర్యాస్తమయం దాకా కూడా తత్త్వచర్చ చేసిన రచన ‘ఫేడో’. ఫేడో సోక్రటీస్ శిష్యుడు. అతడు సోక్రటీస్ చివరి రోజున చెరసాలలో ఎట్లా గడిపాడో తమతో ఏం మాట్లాడేడో ,ఎచ్చేక్రేట్స్ అనే మిత్రుడికి వివరించడంతో ఈ సంభాషణ మొదలవుతుంది. అది చాలా సంక్లిష్టమైన సంభాషణ అయినప్పటికీ, అనేక అంశాల దృష్ట్యా, ఎంతో విలువైన సంభాషణ. అందులో జరిగిన చర్చ ప్రధానంగా ఆత్మ గురించీ, ఆత్మ అమరత్వం గురించీను. మనిషి పుట్టుకకి ముందు ఆత్మ ఉంటుందని సోక్రటీస్ చెప్పిన మాటని అతడి శిష్యులు వెంటనే అంగీకరిస్తారు.కాని మరణానంతరం కూడా ఆత్మ కొనసాగుతుందనే మాటని మాత్రం వాళ్ళంత తోందరగా ఒప్పుకోలేరు. మరణించేది శరీరం మాత్రమే తప్ప, ఆత్మ కాదనే తన నమ్మకాన్ని సోక్రటీస్ వాళ్ళకి హేతుబద్ధంగా వివరించడమే ‘ఫేడో ‘ సారాంశం. ‘ఆ సత్యమేమిటో పొద్దున తెలిస్తే, ఆ సాయంకాలానికల్లా తృప్తిగా మరణించవచ్చు’ అంటాడు కన్ ఫ్యూషియస్ తన శిష్యులతో ఒకసారి. సోక్రటీస్ ఆ మాటకి సజీవ ఉదాహరణగా ఫేడో లో కనిపిస్తాడు. ఆత్మ నిత్యత్వం మీద అంత నమ్మకం లేకపోతే, అతడంతా నిబ్బరంగా తన స్వహస్తాల్తో మృత్యుపానం చేసి ఉండడని ఆ సంభాషణ పూర్తయ్యేటప్పటికి మనం గ్రహిస్తాం. ఇక ‘సింపోజియం’ ప్లేటో రచనలన్నిటిలోనూ అత్యుత్తమ రచన. కావ్యత్వాన్ని అందుకున్న రచన. విద్యావంతుడైన ప్రతి ఒక్కడూ చదివితీరవలసిన రచన. అగాధాన్ అనే ఒక శిష్యుడికి నాటక రచనలో బహుమతి వచ్చిన సందర్భంగా మిత్రులంతా అతణ్ణి అభినందించడానికి కలుసుకుంటారు. ఆ సమావేశానికి సోక్రటీస్ కూడా వస్తాడు. ఆ సందర్భంగా ఏదైనా విషయం మీద అందరూ మాట్లాడితే బాగుంటుందని ఎవరో ప్రతిపాదిస్తారు. అప్పుడంతా ప్రేమ గురించి ప్రసంగిస్తారు. ఒకరి వెనక ఒకరు అయిదుగురు వక్తలు ప్రేమ గురించి అద్భుతంగా ప్రసంగించాక సోక్రటీస్ వంతు వస్తుంది. ఆయన ఎప్పటిలానే తనకి ప్రేమ గురించి ఏమీ తెలియదని మొదలుపెడతాడుగానీ, తన భాగ్యవశత్తూ డయోటిమా అనే ఒక స్త్రీ ద్వారా ప్రేమజ్ఞానం లభించిందని చెప్తాడు. ఆమె చెప్పినమాటలు వాళ్ళకి చెప్తున్నట్టుగా సోక్రటీస్, సోక్రటీస్ ద్వారా ప్లేటో, ప్రేమ గురించి ఒక అజరామర ప్రసంగం చేస్తారు. ప్రేమ మొదట దేహాల్ని ఆలంబన చేసుకునే ప్రభవిస్తుందనీ, అయితే ఆ క్రమంలో చివరికి మనం దేహాతీతమైన, కాలాతీతమైన ఒక మహాసౌందర్యసాక్షాత్కారానికి చేరుకుంటామనీ, ఆ సౌందర్య దర్శనం లభించడమే మానవజన్మకి సార్థక్యమనీ ఆ స్త్రీ తనకి బోధించిందని సోక్రటీస్ వారికి చెప్తాడు. సోక్రటీస్ ప్రసంగం ముగించగానే ఆల్సిబియాడిస్ అనే ఒక సుందరయువకుడు, ప్రజాభిమానాన్ని చూరగొన్న ఏథెన్సు పౌరుడు, సోక్రటీస్ శిష్యుడు, తాను ప్రేమ గురించి కాక, సోక్రటీస్ గురించే మాట్లాడతానంటూ, సోక్రటీస్ గుణగానం చేస్తాడు. అతడు ఆవిష్కరించిన సోక్రటీస్ అంతకు ముందు సోక్రటీస్ ఎటువంటి ప్రేమదర్శనం గురించి మాట్లాడేడో,ఆ దర్శనానికి నిలువెత్తు నిరూపణగా కనిపిస్తాడు. కొన్నేళ్ళ కిందట, ఆచార్య రఘురామరాజు నన్ను సింపోజియాన్ని తెలుగు చెయ్యమని అడిగారు. అక్కడితో ఆగకుండా , సింపోజియాన్నీ, ఛాందోగ్యోపనిషత్తునీ అనువదించి, రెండింటినీ కలిపి పుస్తకంగా వేస్తే బాగుంటుందనీ, రెండింటినీ పోలుస్తూ ఒక పరిచయం కూడా రాయాలనీ అడిగారు. ఆ ఉత్సాహంలో ‘పానగోష్ఠి’ పేరిట సింపోజియాన్ని తెలుగు చెయ్యాలనుకున్నానుగానీ, నేను చెయ్యలేకపోయిన ప్రాజెక్టుల్లో అది కూడా ఒకటిగా మిగిలిపోయింది. ఇప్పుడు మళ్ళా ఉత్సాహం కలుగుతోంది. కాని ఈ సారి ‘పానగోష్ఠి’ అని కాదు, ‘ప్రేమ గోష్ఠి’ అని చెయ్యాలనుంది. ఒక్క ఛాందోగ్యమే కాదు, చాలా అంశాల్లో, సింపోజియం మనకి బృహదారణ్యకాన్నీ, తైత్తిరీయాన్ని కూడా స్ఫురింపచేస్తూంటుంది. ఫేడో లో సోక్రటీస్ తత్త్వశాస్త్రమంటే మృత్యువుని అధ్యయనం చేసే శాస్త్రమంటాడు. కానీ సింపోజియానికి వచ్చేటప్పటికి తత్త్వశాస్త్రం అమరత్వ చర్చగా మారిపోయింది. ఉపనిషత్తులు అభయం, అమృతం, ఆనందాల గురించి మాట్లాడేయి. ఈ ఆరు సంభాషణలు చదివినవాళ్ళకి కూడా అభయం, అమృతం, ఆనందాల గురించిన చర్చలో పాల్గొన్నట్టే అనిపిస్తుందని చెప్పవచ్చు.
ముమ్మడి కృష్ణరాజ ఒడయర్ మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన కాలంలో మైసూరు రాజాస్థానం అపూర్వవైభవంతో, సమస్త విద్వాంసులు, రసికులు, కళాకోవిదుల నిలయంగా విరాజిల్లుతూ ఉండేది. మహారాజావారు స్వభావతః ఉదారశీలురు. స్వయంగా పండితుడు, శాస్త్రవిదుడు, కావ్యకర్త. అందువల్ల విద్య పట్ల ఆయనకు పూజ్యభావం ఉండేది. ఈ కారణం వల్ల ఆయన ఏ కళలోనైనా, ఏ కొద్దిపాటి పరిజ్ఞానమున్న వారైనా తనను ఆశ్రయిస్తే కాదనకుండా ఆదరించేవారు. ముమ్మడి కృష్ణరాజ ఒడయర్ 1794–1868 1860 ప్రాంతంలో ఆవిధంగా మహారాజావారి పోషణలో జీవించిన పండితులలో పురాణ కోవిదుడైన నారాయణశాస్త్రిగారు ఒకరు. శాస్త్రిగారి పూర్వీకులు రామరాజనగరవాసులు. మూడు నాలుగు తరాల కిందట వారు అక్కడి నుంచి మైసూరుకు వచ్చి స్థిరపడ్డారు. శాస్త్రిగారు ప్రాచీన సంస్కృత సాహిత్యమంతటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అయితే పురాణ పఠనంలో ఆయనకు ప్రత్యేకమైన ప్రావీణ్యం ఉండేది. ఆయన కంఠస్వరం గంభీరంగా, మధురంగా ఉండేది. ఆయన గొంతు నుంచి పదాలు అవిరళధారాప్రవాహంగా వెలువడేవి. అందుచేత సభలో ఉపన్యాసమివ్వడంలో ఇతర పండితులందరికంటే ఎక్కువగా ఆయన రాణించేవారు. రాజావారు దైవభక్తి నిరతుడు కావడం వల్ల శాస్త్రిగారిని పురాణపఠనానికి వినియోగించారు. శాస్త్రిగారు శ్రావ్యంగా వినిపించడమేకాక ఆయా పురాణాలకు పండితులు చెప్పిన భాష్యాలను వివరించేవారు. శాస్త్రిగారు పఠనాన్ని ఒక కళగా సాధన చేశారు. అందుకే ఆయనను అందరూ 'పురాణం శాస్త్రిగారు' అంటూ ఉండేవారు. నారాయణ శాస్త్రిగారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. అతడి పేరు సుబ్బణ్ణ. అతడు ఇద్దరు ఆడపిల్లల తర్వాత వాడు. తండ్రిలా సుబ్బణ్ణ కూడా సంస్కృతపండితుడై ఉంటే అతడిని సుబ్రహ్మణ్యశాస్త్రి అని పిలిచి ఉండేవారు. తండ్రిలాగే అతడు కూడా రాజాస్థానంలో పురాణపఠనం చేసి ఉండేవాడు. కాని అతడి మనస్సు సంస్కృతంపై లగ్నం కాలేదు. సంగీతం అతడిని ఆకర్షించింది. అందుకే అతడు సుబ్రహ్మణ్యశాస్త్రి కాలేకపోయాడు. సుబ్బణ్ణగానే మిగిలిపోయాడు. ఆరోజుల్లో శాస్త్రి అనిపించుకునేటంత యోగ్యత సంగీత కళాకారుడికి ఉండేది కాదు. ఈకథ ఆ సుబ్బణ్ణదే. నేను సుబ్బణ్ణ గారిని చూసినది ఆయన చివరి రోజుల్లోనే. ఆయన బాల్య జీవితవిశేషాలను ఆయనే అప్పుడప్పుడూ కొద్ది కొద్దిగా చెప్పగా తెలుసుకున్నాను. ఆయన తొరెయపురంలో ఉన్నప్పటి కథ అంతా మా మామగారికి, మా అక్కకి తెలుసు. అప్పటి ఆయన జీవితాన్ని నేనూ కొద్దిగా చూశాను. ఆయన చరమ జీవితాన్ని మాత్రం నేను పూర్తిగా కళ్ళారా చూశాను. ఆయన జీవితానికి సంబంధించిన మరికొన్ని విశేషాలను అక్కడక్కడ అడిగి తెలుసుకున్నాను. ఆయన వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని ఈకథలో నేను సమగ్రంగా చిత్రించగలిగానని చెప్పలేను. కఠినశిల మధ్యలో ఏక్కడో రవంత బంగారం ఉంటుంది. ఆ బంగారాన్ని రాబట్టడానికి ఆ శిలను పగలకొడతాం. చూర్ణం చేస్తాం. కరగిస్తాం. బంగారాన్ని వేరుచేసి శుద్ధి చేస్తాం. ఆ బండరాయికి ఈ బంగారానికి ఏమైనా పోలిక ఉందా? సుబ్బణ్ణ మొదట గండశిలలాగానే ఉండేవాడు. దైవానుగ్రహం వల్ల క్రమక్రమంగా అతడి మనస్సు పూర్ణసంస్కారాన్ని సంతరించుకొని అపరంజిగా మారింది. ఆ విచిత్ర పరిణామ క్రమమంతటినీ యథాతథంగా వర్ణించగల శక్తి నాకు లేదు. కనీసం నేను కళ్లారా చూసిన ఆయన చరమ దశలోని ఔన్నత్యాన్నైనా సమగ్రంగా వర్ణించడం నావల్ల కాదు. ఆ చివరి రోజుల్లో ఆయన ఆత్మవిశ్వాసక్రమాన్ని నేను ప్రత్యక్షంగా గమనించాను. రోజురోజుకూ ఆయనలో ఎటువంటి మార్పు వస్తున్నదో కాస్త పరిశీలనగా చూసిన వారెవరికైనా కనిపించేది. నా వర్ణన సమగ్రం కాకపోయినా పాఠకులు సానుభూతితో, తమ ఊహాశక్తిని జోడించి చదివితే సుబ్బణ్ణ కథకు పూర్ణత్వం సిద్ధించవచ్చు. (2) సుబ్బణ్ణ సుబ్రహ్మణ్యశాస్త్రి కాలేకపోయాడని ఇంతకు ముందు చెప్పాను. ఈ కథ సారాంశం ఇదే అని చెప్పవచ్చు. మగపిల్లవాడు పుట్టినందుకు నారాయణశాస్త్రి గారు ఎంతో సంతోషించారు. అప్పటికి ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వారిలో ఒక పిల్ల చనిపోయింది. నాల్గవ సంతానం కూడా ఆడపిల్ల అయితే ఏం చేయాలి? అలా కాకుండా మగపిల్లవాడు పుట్టడం ఆయనకు నిజంగా పుత్రోత్సవమే అయింది. ఆయన భార్య కూడా ఎంతో సంతోషించింది. దంపతులిద్దరూ పిల్లవాడిని అతిగారాబంగా పెంచసాగారు. పిల్లవాడు ఏడేళ్లవాడయ్యాడు. శాస్త్రిగారు వాడికి అక్షరాభ్యాసం చేశారు. అమరకోశంలోని ఒకటి రెండు సర్గలను చదివించారు. ఆ తరువాత పిల్లవాడి విద్య ముందుకు సాగలేదు. మొదటినుంచీ ఎందుకో పిల్లవాడికి సంగీతం మీదనే మనస్సు. అతడికి శాస్త్రిగారి మధుర గంభీర స్వరం అబ్బింది గాని ఆయనగారి సంస్కృతం మాత్రం అబ్బలేదు. అమరకోశంలోని ఏదైనా శ్లోకం కంఠస్థంచేసి వల్లించమంటే రాగయుక్తంగా, శ్రావ్యంగా వినిపించేవాడు గాని దాని అర్థం మాత్రం అతడి మనసుకెక్కేది కాదు. తండ్రి అతడిని ఇంట్లో పాఠానికి కూర్చోపెట్టి పనిమీద బైటికి వెడితే పిల్లవాడు ఆయన వచ్చేవరకు రాగాలు సాధన చేస్తూ ఉండేవాడు. పాఠం సంగతి మరచిపోయేవాడు. పిల్లవాడు శ్రావ్యంగా శ్లోకాలు గానం చేస్తున్నందుకు తల్లిదండ్రులు మొదట మురిసిపోయారు. ఇంటికి ఎవరైనా వస్తే వాడిచేత శ్లోకాలు చదివించేవారు. విన్నవారు శభాష్ అని మెచ్చుకునేవారు. అలా మెచ్చుకుంటున్న కొద్దీ పిల్లవాడు ఇంకా శ్రద్ధగా గానసాధన చేసేవాడు. అలా చిన్నతనం నుంచి అతడికి సంగీతం పట్ల శ్రద్ధ, సంస్కృతం పట్ల అశ్రద్ధ ఏర్పడ్డాయి. మైసూరు మహారాజభవనం ఆ చిన్న వయస్సులోనే రాజావారి అంతఃపురంలో జరిగిన ఒక సంఘటనలో సుబ్బణ్ణ సహజ గాన ప్రావీణ్యానికి మరింత ప్రోత్సాహం లభించింది. ఒకరోజు శాస్త్రిగారు రాణివాసంలో పురాణ పఠనానికి వెడుతూ పిల్లవాడిని కూడా తీసుకువెళ్లారు. పురాణం ప్రారంభించే ముందు పిల్లవాడి చేత 'శుక్లాంబరధరం' శ్లోకం చదివించారు. పిల్లవాడి స్వర మాధుర్యాన్ని అంతఃపుర స్త్రీలు మెచ్చుకున్నారు. కాసేపటికి రాజావారు కూడా వచ్చి కూర్చున్నారు. సుబ్బణ్ణ తండ్రి పక్కనే ఒదిగి కూర్చుని ఆయన చెప్పే ప్రతి మాటా ఎంతో కుతూహలంతో వింటూ మధ్య మధ్య రాజావారికేసి చూస్తున్నాడు. రాజావారి సుందర వదనాన్ని, ఆ వదనానికి గాంభీర్యాన్ని చేకూర్చే పెద్ద పెద్ద మీసాలను వింతగా చూస్తున్నాడు. రాజావారు కూడా రెండు మూడు సార్లు సుబ్బణ్ణకేసి చూసి పిల్లవాడు ముచ్చటగా ఉన్నాడని మనస్సులోనే మెచ్చుకున్నారు. పురాణ పఠనం ముగిసిన తరువాత "ఈ పిల్లవాడు మీ కుమారుడా?" అని శ్రాస్తిగారిని అడిగారు. శాస్త్రిగారు "అవును మహాప్రభూ?" అన్నారు. రాజావారు సుబ్బణ్ణవైపు తిరిగి నవ్వుతూ, "ఏమయ్యా... పెద్దయ్యాక నువ్వూ మీ నాన్నగారిలాగానే పురాణ పఠనం చేస్తావా?" అని అడిగారు. పిల్లవాడు "లేదండీ, నేను పురాణాలు చదవను. సంగీతం పాడతాను" అని జవాబిచ్చాడు. రాజావారు "ఓహో అలాగా? ఏదీ ఒక పాట వినిపించు" అని అడిగారు. సుబ్బణ్ణ "శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం" శ్లోకాన్ని రాగయుక్తంగా శ్రావ్యంగా గానం చేసి, "నాకు కస్తూరీ తిలకం శ్లోకం కూడా వచ్చు" అని చెప్పాడు. రాజా వారు ఎంతో సంతోషించారు. ఒక పళ్లెంలో నూతన వస్త్రాలు ఉంచి పిల్లవాడికి బహూకరించారు. "నువ్వు మంచి బుద్ధిమంతుడివి. సంగీతం ఇంకా బాగా నేర్చుకో, మేము ఇంకా మంచి కానుకలు ఇస్తాము" అని మెచ్చుకున్నారు. తరువాత శాస్త్రిగారి వైపు తిరిగి "మీ అబ్బాయి బలే చురుకైన వాడు. బాగా తర్ఫీదు ఇవ్వండి. గొప్పవాడవుతాడు" అన్నారు. శాస్త్రిగారు, సుబ్బణ్ణ సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటి నుంచి సుబ్బణ్ణకు ఇంకా బాగా సంగీతసాధన చేసి రాజావారి సన్మానాలందు కోవాలనే పట్టుదల ఎక్కువయింది. నేను స్వయంగా చూసిన సుబ్బణ్ణ గారు కూడా అటువంటి పట్టుదల మనిషే. ఏ పనైనా పట్టు విడవకుండా చివరిదాకా చేసేవాడు. ఆ లక్షణం ఆయనకు చిన్నప్పటి నుంచే ఉండి ఉంటుంది. రాజావారి మెప్పు పొందాలనే లక్ష్యంతో సుబ్బణ్ణ సంగీత కచేరీ ఎక్కడ జరిగినా వెళ్లి శ్రద్దగా వినేవాడు. సంగీత విద్వాంసుల నుంచి మెలకువలు గ్రహించేవాడు. చిన్న చిన్న కచేరీలలో తనూ పాడుతూ ఉండేవాడు. అలా పధ్నాలుగేళ్ల వయస్సుకే అతడికి సంగీతంలో అద్భుతమైన పరిజ్ఞానం అలవడింది. వయస్సులో అతడికంటే ఎంతో పెద్దవారైన గాయకులు అతడిని తమ సాటి గాయకుడిగా పరిగణించి గౌరవించేవారు. కొందరు అతడిని చూసి ఈర్ష్య పడేవారు కూడా. గాత్ర సంగీతంలోనే కాదు, వీణ, వైలిన్, మృదంగం వాయించడంలో కూడా సుబ్బణ్ణ ప్రావీణ్యం సంపాదించాడు. కుమారునికి సంస్కృతం పట్ల, పురాణాల పట్ల శ్రద్ధ లేకపోవడం శాస్త్రిగారికి బాధాకరంగా ఉండేది. అయితే సుబ్బణ్ణ ఏకాగ్రతతో, సంగీత సాధన చేస్తున్న సంగతి ఆయనకు తెలియదు. తెలిస్తే కనీసం ఇంకొక రంగంలోనైనా తన కుమారుడు అభివృద్ధి సాధిస్తున్నందుకు ఆయనకు కొంత ఊరటగా ఉండేదేమో. కాని సుబ్బణ్ణ తన సంగీత సాధనను గోప్యంగా ఉంచుకున్నాడు. సంగీతంలో అత్యున్నత స్థితిని అందుకున్న తరువాత తన విద్వత్తును ప్రదర్శించి సంగీత ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేయాలనీ, అంతవరకు తన సాధన గురించి ఇంట్లో వాళ్లకి తెలియనివ్వకూడదనీ అనుకున్నాడు. సుబ్బణ్ణ తన సాధన గురించి ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వకపోవడానికి మరో కారణం కూడా ఉంది. ఈ సంగీత కచేరీలు, గాయకుల గోష్ఠులు-ఎప్పుడైనా విద్వాంసుల ఇళ్ళలో జరిగినా-ఎక్కువగా వారకాంతల ఇళ్ళలో జరుగుతూ ఉండేవి. సంగీతం పట్ల ఆసక్తితో సుబ్బణ్ణ అటువంటి కచేరీల కోసం తరచుగా వారకాంతల ఇళ్ళకు వెడుతూ ఉండేవాడు. సుబ్బణ్ణ అందగాడు. విశాలమైన నుదురు, మెరిసే పెద్ద పెద్ద కళ్ళు తీర్చిదిద్దినట్లుండే కనుబొమలు, ఎర్రటి పెదవులు చూపరులను ఆకర్షించేవి. ఆ కాలపు వారు నెలకో, రెండు నెలలకో ఒకసారి క్షౌరం చేసుకొనేవారు. అలా పెరిగిన లేత మీసం సుబ్బణ్ణ ముఖానికి వింత అందాన్ని తెచ్చింది. అతడు నిత్యకర్మలు యథావిధిగా నిర్వర్తించేవాడు. వాటి వల్ల అతడి ముఖానికి అవర్ణనీయమైన వర్చస్సు చేకూరింది. పాలకోసం మాతృస్తనాన్ని తడుముకొనే శిశువులాగా జీవితంలో తీయదనం కోసం వెతుక్కునే కౌమార ప్రాయపు అమాయకత అతనిలో కనిపించేది. అటువంటి యువకుని చూసిన వారు మోహించకుండా ఎలా ఉండగలరు? అతడంటే వారకాంతలకు అసాధారణమైన ప్రేమ ఉండేది. సంగీతం కోసం అతడు వారి ఇళ్ళకు వెళ్ళినప్పుడు వారు పళ్ళు, పాలు ఇచ్చి మర్యాద చేసేవారు. ఒక పాట పాడమని కోరేవారు. అలా పాడమని అడిగితే మహాభాగ్యంగా భావించి పాడి వినిపించేవాడు. అలా పదహారేళ్ళ వయస్సు వచ్చేసరికి అతడు సంగీత ప్రపంచంలో తనకొక నిశ్చితమైన స్థానాన్ని సంపాదించుకొన్నాడు. ప్రముఖ సంగీతకారుల కోవలో చేరాడు. అప్పటికే సుబ్బణ్ణకు పెళ్ళయింది. ఆయన భార్య పేరేమిటో నాకు ఇప్పటికీ తెలియదు. ఆయనతో నాకు గల పరిచయంలో ఎప్పుడైనా యథాలాపంగా తప్ప-తన భార్య గురించి చెప్పలేదు. ఆవిడ పేరేమిటని ఆయనని అడిగే ధైర్యం నాకు లేకపోయింది. ఆయనెప్పుడూ 'ఆవిడ' అని మాత్రమే ప్రస్తావించేవారు. ఒకసారి ఆయన "లలిత అనే పేరు అమ్మకు సరిగా సరిపోయే పేరు. అందుకే శంకరాచార్యుల వారు సహస్రనామాన్ని లలితా సహస్త్రనామం అన్నారు. ఆ లలితమ్మే మన తల్లి కాకపోతే మనందరి గతి ఏమయ్యేది?" అన్నారు. కొంచెం ఆగి "ఆ పేరు గల స్త్రీల తీరే వేరు. లోకమాత అంశంతో పుట్టారా అనిపిస్తుంది వారి ప్రవర్తన చూస్తే" అన్నారు. ఎక్కడో దూరంగా శూన్యంలోకి చూస్తూ ఆయన ఆ మాటలన్నారు. తన భార్య జ్ఞాపకం రాగా ఆయన అలా అన్నట్లు నాకు అనిపించింది. దాన్ని బట్టి ఆయన భార్య పేరు లలిత అయి ఉండవచ్చునని అనుకున్నాను. సుబ్బణ్ణకు పదిహేడేళ్ళ వయస్సు వచ్చేసరికి అతడి భార్య కాపురానికి వచ్చింది. ఒక్క శాస్త్రిగారి సంపాదనతోనే ఇట్లు గడవ వలసిన పరిస్థితి. సుబ్బణ్ణకు సంపాదన లేదు. సంగీతంలో ధనార్జన చేయాలంటే ఇంకా చాలా కాలం కృషి చేయవలసి ఉంటుంది. సంస్కృత పరిజ్ఞానం కాస్తయినా ఉంటే పౌరోహిత్యం చేసుకోవచ్చు. లేదా ఇంకేదైనా పని దొరికేది. సంస్కృతం ఇంకా బాగా నేర్చుకుంటే పురాణాలు చెప్పి సంపాదించవచ్చు. కాని సుబ్బణ్ణకు సంస్కృతం రాదు. శాస్త్రిగారికి ఇంట్లో ఎదిగిన కొడుకు ఉన్నా అదనపు సంపాదన లేకపోయింది. సుబ్బణ్ణకు పెళ్ళికాకపోయి ఉంటే అంత ఇబ్బంది ఉండేది కాదు. కాని అతగాడికి పెళ్ళయి పిల్ల కాపురానికి రావడంతో కుటుంబంపై అదనపు భారం పడింది. శాస్త్రిగారు ఎంత మంచివాడైనప్పటికీ, ఎదిగిన కొడుకు పైసా సంపాదన లేకుండా ఇంట్లో ఊరికే ఉండడం ఆయనకు కష్టంగా తోచింది. ఏదో ఒక సంపాదన చూసుకోవడం మంచిదని ఆయన అప్పుడప్పుడూ కొడుకుతో అనేవారు. సుబ్బణ్ణ చాలాసార్లు మౌనంగా సహించాడు గాని చివరికి ఒకరోజు "సంపాదించడం లేదని మాటిమాటికి సతాయిస్తారు దేనికి? నేను ఈ ఇంటికి అంత భారంగా ఉంటే చెప్పండి. ఎక్కడికైనా పోతాను. నా తిండి నేను సంపాదించుకోగలను" అని జవాబిచ్చాడు. "అవునవును. నువ్వు వెడతావు. నీ తిండి నువ్వు సంపాదించుకుంటావు. కాని నీ పెళ్ళాం సంగతేమిటి? దానికి తిండి ఎవరు పెడతారు? దాన్ని కూడా తీసుకుపోతావా?" అంది తల్లి. "నాకు పెళ్ళి చెయ్యమని ఎవరడిగారు? నేను అడిగానా? కోడలిని తెచ్చుకున్నది మీరు. మీరే పోషించండి దాన్ని. పోషించలేకపోతే దాన్ని పుట్టింటికి పంపేయండి" అని సమాధానమిచ్చాడు సుబ్బణ్ణ. ఇంట్లో ఈ రాద్ధాంతం జరగడంతో సుబ్బణ్ణ కోపంగా బైటికి వెళ్ళిపోయాడు. రాత్రి భోజనానికి రాలేదు. అతను రాకపోవడంతో అతడి భార్య లలిత కూడా తినలేదు. శాస్త్రిగారికి భోజనం చేయాలనిపించలేదు. కాని ఎలాగో నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని అయిందనిపించి బైటికి వెళ్ళిపోయారు. ఆయన భార్య కోడలిని భోజనం చేయమని అడిగింది. కోడలు నిరాకరించడంతో ఆవిడ "నీకూ మీ ఆయనకీ భోజనం అక్కర్లేకపోతే నాకేనా కావలసింది?" అంటూ ఆ పూట పస్తుపడుకుంది. సుబ్బణ్ణ అప్పటికింకా సంగీతం ద్వారా డబ్బు సంపాదించకపోయినా సంపాదించగల స్థితికి వచ్చాడు. రాబోయే నవరాత్రి ఉత్సవాలలో మహారాజా వారి ఎదుట గానం చేసే అవకాశం అతడికి లభించింది. అందుచేత అతడు ఇంకా ఎక్కువగా సాధన చేయడం మొదలుపెట్టాడు. ఇల్లు అనుకూలంగా లేకపోవడంతో అతడు ఒక వేశ్య ఇంటికి వెళ్ళి సాధన చేసేవాడు. ఆ వేశ్య వల్ల అతడు చెడిపోయాడో లేదో నేను చెప్పలేను. నాకు తెలియదు. అదీ కాక, 'చెడిపోయాడు' అనే మాటను జనం ఏ ఉద్దేశంతో అంటారో నాకు అర్థం కాదు. నీలసాని అనే వేశ్య ఇంట్లో సుబ్బణ్ణ గాత్ర సాధన, వైలిన్ సాధన చేసేవాడు. నీలసాని అతడి సంగీతాన్ని ఆరాధించేది. బ్రాహ్మణుడు కావడం వల్ల అతడిని దేవుడిలా చూసేది. ఆమెకు డబ్బు కొదవలేదు. సిరిగల దొరలెందరో ఆమె వద్దకు వచ్చేవారు. కాని ఆమెకు సుబ్బణ్ణ పట్ల విశేషమైన భక్తి గౌరవాలు ఉండేవి. ఆమె గోపిక వంటిది. శ్రీకృష్ణ భక్తురాలు. సుబ్బణ్ణ సుందర రూపాన్ని అతడి వర్చస్సును చూసి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ఈ రూపంలో వచ్చాడా అనుకునేది. అతడు రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేది. తరువాత తన మేడ మీద పెద్ద గదిలోకి తీసుకువెళ్ళేది. ఆ గదిలో అతడి సంగీత సాధనకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసేది. ధ్యానం చేసుకోవడానికి పీట, గానం చేసేటప్పుడు కూర్చోవడానికి రత్నకంబళం, విశ్రాంతి తీసుకోవడానికి ఒరగుదిండు, ఫిడేలు, వీణ, మృదంగం అన్నీ ఆ గదిలో ఉండేవి. అతడికి ఆకలి వేస్తే తినేందుకు ఒక అలమరులో బ్రాహ్మణుల చేత శుచిగా వండించిన వంటకాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవి. సుబ్బణ్ణ గదిలోకి వచ్చి కూర్చున్న తరువాత ఆమె అల్లంత దూరంలో కూర్చుని ఓ పది నిమిషాలు మాట్లాడి "ఇంక మీరు సాధన చేసుకోండి" అని చెప్పి వెళ్ళిపోయేది. సుబ్బణ్ణ ఒక్కడూ కూర్చుని గాత్ర సాధన చేసేవాడు. కొంత సేపు వైలిన్ అభ్యాసం చేసేవాడు. గాత్రంలోని కొన్ని గమకాలను వైలిన్ మీద, వైలిన్ మీది గమకాలను గాత్రంలో పలికించడానికి ప్రయత్నించేవాడు. అలా గంటల తరబడి సాధన చేసేవాడు. నీలసాని వచ్చి "చాలా పొద్దుపోయింది. మీరు ఇంక ఇంటికి వెళ్ళాలి" అని జ్ఞాపకం చేసే వరకు అతడికి కాలాతీతమయిందన్న సంగతి తెలిసేది కాదు. ఆ రోజు ఇంట్లో జగడమైన తరువాత సుబ్బణ్ణ తిన్నగా నీలసాని ఇంటికి వెళ్ళాడు. అనేక కారణాల వల్ల అతడి మనస్సు వ్యాకులంగా ఉంది. తను తండ్రికి భారంగా ఆయన ఇంట్లో ఉంటున్నాననే భావన అతడి అశాంతికి మొదటి కారణం. ఒక వయస్సు వచ్చేసరికి సాధారణంగా ఎవరికైనా ఇటువంటి అసంతృప్తి కలుగుతుంది. బాల్యంలో అందరం తండ్రి ఇంట్లోనో, ఇతర బంధువుల ఇళ్ళలోనో ఉంటాము, తింటాము. అలా ఉండేందుకు, తినేందుకు మనకు హక్కు ఉన్నదా అనే ప్రశ్న ఆ వయస్సులో రాదు. కొంత వయస్సు వచ్చాక ఆ ప్రశ్న వస్తుంది. అలా తినే హక్కు మనకు లేదనే గుర్తింపు వస్తుంది. తన బతుకుతెరువు తాను చూసుకోవాలన్న సంగతి తన తండ్రి చెప్పకముందే గుర్తించాడు సుబ్బణ్ణ. కాని, బ్రతుకుతెరువు కోసం ఏం చేయాలో అతను నిర్ణయించుకోలేకపోయాడు. త్వరలో తాను మహారాజా వారి సమక్షంలో తన సంగీత ప్రావీణ్యాన్ని ప్రదర్శించబోతున్నాడు. రాజావారు మెచ్చి తనకు నెలసరి వేతనం ఏదైనా మంజూరు చేయవచ్చునన్న ఆశ కూడా ఉంది. అది జరిగితే తాను ఇలా తండ్రి సంపాదనపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. ఈ ఆశతో సుబ్బణ్ణ తాను రాజావారి ఎదుట గానం చేస్తున్నట్లు, సభలో విద్వాంసుల మధ్య కూర్చున్న తండ్రి తన పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నట్లు, కొడుకు ఇంతటి వాడైనందుకు ఆయన గర్విస్తున్నట్లు ఊహించుకునేవాడు. అలా తీయని ఊహల్లో తేలిపోతున్న తరుణంలో ఇంట్లో ఇంత రాద్ధాంతం జరగడం, తల్లిదండ్రులు తనని అయోగ్యుడుగా, అప్రయోజకుడుగా జమకట్టడం అతడికి చాలా మనస్తాపం కలిగించింది. తండ్రి తనను చూసి గర్వించకపోగా, తనకు తిండి పెట్టడానికే బాధపడుతున్నాడు. తను దమ్మిడీకి చెల్లని వాడని ఆయన అనుకుంటున్నాడు. తనకి తోడు తనకొక భార్య. తను ఒక్కడే అయితే తల్లిదండ్రులకి భారం కాకుండా తన దారిని తాను పోయి ఉండేవాడు. కాని భార్య కాపురానికి వచ్చి పరిస్థితిని మరీ జటిలం చేసింది. ఎంత దౌర్భాగ్యం! భార్యల పట్ల ఆ కాలపు వారికి గల ప్రేమ ఆపాటిదేనా అని పాఠకులకు సందేహం కలగవచ్చు. కానీ నిజానికి ఇప్పుడు మనం మామూలుగా 'ప్రేమ' అంటున్నది శారీరక వాంఛమాత్రమే. ఆ కాలపు వారి ప్రేమ ఒక రకమైన అశ్రద్ధతో ప్రారంభమై భార్య అంటే జగన్మాత అంశ అనే పూజ్యభావంతో ముగిసేది! సుబ్బణ్ణ విషయంలోనూ అలాగే జరిగింది!. ఆ చిన్న వయస్సులో అతనికి భార్య విషయంలో ఏ మాత్రం శ్రద్ధ ఉండేది కాదు. అతని దృష్టి ఎప్పుడూ తన కళపైన, తన జీవనపరిస్థితిపైనే ఉండేది. అదీగాక ఆ రోజుల్లో భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకోవటానికి ఎక్కువ అవకాశం ఉండేది కాదు. లలితమ్మ సావిత్రి అవతారమే అయినా ఇంట్లో తన భర్తకు పాదసేవ చేయటానికి ఆమెకు అవకాశమే దొరికేది కాదు. భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఆమె దూరం నుంచే అతనిని చూసి సంతోషించేది. "మీ ఆయన వచ్చాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వు" అని అత్తగారు ఆజ్ఞాపిస్తేనే ఆమె నీళ్ళు ఇవ్వాలి. రోజూ ఇంతే మామూలే కదా అని ఆమె ఒక రోజు అత్తగారు చెప్పకుండానే నీళ్ళు ఇచ్చింది. ఆ రోజు అత్తగారు స్వగతంగా అనుకుంటున్నట్లే ఇతరులకి వినిపించేటంత బిగ్గరగా దీర్ఘాలు తీస్తూ "అబ్బ... ఎంత నాగరికత ముదిరింది ప్రపంచంలో! ఏదో యాభై యేళ్ళ నుంచీ కాపురం చేస్తున్నదానివల్లే తనంతట తనే వెళ్ళి మొగుడికి నీళ్ళిస్తోంది. మా కాలంలో ఇవన్నీ ఎరుగదుమా?" అంది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఐదారుసార్లు ఆవిడ అలా సణిగింది. "అత్తగారు ఈ ఒక్క అపరాధం మన్నిస్తే ఇంకెప్పుడూ ఇలా చేయను దేవుడా" అని తనలో తనే అనుకుంది లలితమ్మ. ఆ సంఘన తరువాత మళ్ళీ ఎప్పుడూ ఆమె ఆ పని చేయలేదు. లలితమ్మ తనకు నీళ్ళు ఇచ్చినందుకు తల్లి ఎంత రాద్ధాంతం చేసిందో సుబ్బణ్ణకూ తెలుసు. కానీ ఏమీ ఎరగనట్లు మెదలకుండా ఉండిపోయాడు. నిజానికి ఆ సంఘటన గురించి అతను అంతగా ఆలోచించలేదు కూడా. అతను పూర్తిగా సంగీత ప్రపంచంలో నిమగ్నుడై ఉన్నాడు. ఈ ఇంట్లో భార్య నీళ్ళు ఇవ్వకపోయినా వేరే ఇంట్లో నీలసాని మాత్రం ఇస్తుంది. సాధారణంగా మగవారు ఎక్కడో ఒకచోట తమకు ఈ మాదిరి మర్యాదలు జరిగితే చాలుననుకుంటారు. ఒకచోట అటువంటి సేవ దొరికితే మరొకచోట దొరకలేదన్న చింత ఉండదు. సుబ్బణ్ణ జీవితంలో భార్య కంటే ముఖ్యమైన స్థానం నీలసానికి లభించింది. భార్య చేసే శుశ్రూషకంటే నీలసాని చేసే సేవ మనస్సుకు ఎంతో సంతోషం కలిగించేది. భార్య తనకొక భారంగా కూడా అనిపించేది. అందుకే అతను ఆ రోజంతా నీలసాని ఇంట్లో గడపి రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. శాస్త్రిగారు అంతకు కొంచెం ముందుగా ఇంటికి చేరాడు. ఎదిగిన కొడుకుని తను ఆ విధంగా అనడం తప్పని ఆయనకి అనిపించింది. తన మాటలకి కొడుకు బాధపడినందుకు ఆయనెంతో నొచ్చుకున్నాడు. ఎంతైనా కొడుకంటే ఆయనకి ప్రేమే. ఇంటికి రాగానే ఆయన - "వాడింకా ఇంటికి రాలేదా" అని భార్యని అడిగాడు. ఆవిడ రోజంతా పస్తు ఉంది. చాలా కోపం మీద ఉంది. "నన్ను అడుగుతారు దేనికి? ఆ లోపాముద్రని అడగండి" అంది. భార్య ఏమన్నదో శాస్త్రిగారికి సరిగా వినిపించలేదు. "ఎవరినే అడగమంటున్నావు?" అని అడిగాడు ఆయన. "మీదంతా అయోమయం. ఎప్పుడూ కొడుకు కొడుకు అంటూ వాడినే కలవరిస్తారు. ఎప్పుడూ వాడి మీదే భ్రాంతి. కనడం పెంచడం వరకే మన వంతు. ఆ తరువాత ఏలుకోవడానికి ఇంకొకరు వచ్చి కూర్చుంటారు. చూడండి మీ అబ్బాయి వరస. ఇంట్లో అమ్మ అన్నం తినకుండా ఎదురు చూస్తూ ఉంటుందన్న జ్ఞానం ఏమైనా ఉందా వాడికి? నాతోపాటు కోడలు కూడా అన్నం మెతుకు ముట్టలేదు. అన్నానికి రావద్దని అదే నేర్పి పెట్టింది వాడికి. ఈ కాలపు ఆడపిల్లల తీరే అంత. మాయావినులు; నేను ఉపవాసాలతో చస్తే చూడాలనుకుంటోంది. అందుకే భోజనానికి రావద్దని మొగుణ్ణి పంపించేసింది" అంది ఆవిడ. ఇల్లాలి వాగ్ధార ఆగిన తరువాత శాస్త్రిగారు "ఒకరు చెప్పడం ఏమిటే. ఎవరికి తోచినట్టు వారు చేస్తారు" అన్నారు. "ఈవిడ గారు రాక ముందు మీ అబ్బాయి ఇలా ఎప్పుడైనా ప్రవర్తించాడా? ఈవిడ గారు వచ్చాకనే ఇల్లు ఈ స్థితికి వచ్చింది" అంది శాస్త్రిగారి భార్య. తన మాటలు లలితమ్మను ఎంతగా బాధిస్తాయో ఆవిడకు తెలియదు. ఇలాంటి రగడలు సాధారణంగా ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. తన కొడుకు తనంతట తానుగా తప్పు చేస్తాడంటే తల్లికి నమ్మబుద్ధికాదు. ఎవరో అతణ్ణి పురికొల్పి ఉంటారని అనుకుంటుంది. ఎవరో అని సందేహం కూడా దేనికి? ఆ మాయావిని కోడలేనని అత్తగారి ప్రగాఢ విశ్వాసం. అసలు ప్రతి తల్లి తన కొడుకు చేసే తప్పులన్నింటికీ నిందలు మోసేందుకే కోడలిని తెచ్చుకుంటుందా అనిపిస్తుంది. సుబ్బణ్ణ ఇంటికి వచ్చేసరికి తల్లి ఇంకా బిగ్గరగా మాట్లాడుతూనే ఉంది. తండ్రి సంధ్యావందనం మొదలుపెట్టాడు. లలితమ్మ ఓ మూల కూర్చుని ఏడుస్తోంది. సుబ్బణ్ణ ఎవరితో మాట్లాడకుండా నీళ్ళు తీసుకుని కాళ్ళూ చేతులూ కడుక్కుని సంధ్యావందనానికి కూర్చున్నాడు. ఇంట్లో ఆడవాళ్ళు అరుస్తుంటే మగవారికి సంధ్యావందనంపై మనస్సు ఎలా నిలుస్తుంది? తండ్రీ కొడుకులిద్దరూ తొందరగా సంధ్యావందనం ముగించారు. వెంటనే సుబ్బణ్ణ మళ్ళీ ఉత్తరీయం భుజాన వేసుకుని బయలుదేరాడు. తల్లి అరుపులు వింటుంటే అతనికి ఇంట్లో ఉండ బుద్ధి కాలేదు. తండ్రి అతనిని గమనించి "అదేమిట్రా... భోజనం చేసి వెళ్ళు" అన్నాడు. "నాకు ఆకలిగా లేదు" అన్నాడు సుబ్బణ్ణ. "అవునురా నాయనా. నీ కెందుకు ఆకలిగా ఉంటుంది. నీ పెళ్ళాం పుట్టింటి నుంచి అమృతం తెచ్చిందిగా. రోజూ ఆ అమృతం తాగుతూ ఉంటే ఆకలెందుకు వేస్తుంది? నీకూ ఆకలి లేదు. దానికీ ఆకలి లేదు. ఈ రాకాసి ఆకలంతా నాకూ, ఆయనకే" అంది తల్లి. శాస్త్రిగారు "ఎందుకే నోరుపారేసుకుంటావు. ఊరుకో" అని భార్యని కసిరి కొడుకు వైపు తిరిగి "ఎందుకురా నా మీద అంత కోపం? పొరపాటున నోరు జారి నేనేదైనా అన్నాననుకో. ఆ మాత్రానికి నువ్వూ, నీ పెళ్ళాం భోజనం మానేయాలా?" అన్నాడు. "భోజనానికి రావే. నువ్వు భోజనం చేస్తే నేనూ చేస్తాను అని ఎంతో బతిమాలాను దాన్ని. కాళ్ళ మీద పడడం ఒక్కటే తక్కువ. ఎంత చెప్పినా వింటేనా? దానికీ, దాని మొగుడుకీ అన్నం అక్కర్లేకపోతే నాకేనా కావాల్సింది" అంది శాస్త్రిగారి భార్య. ఆ మాటలను బట్టి తల్లి భోజనం చేయలేదన్న సంగతి సుబ్బణ్ణకు తెలిసింది. దానితో అతనికి ఒక్కసారిగా భార్య మీద కోపం పెల్లుబికింది. రోజంతా అతి కష్టం మీద అణచుకున్న కోపమంతా ఆ క్షణంలో వెళ్ళగక్కాడు. భార్య దగ్గరకు వెళ్ళి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ - "ఈ రభసంతా ఏమిటి? ఎందుకు భోంచేయలేదు నువ్వు" అని గర్జించాడు. తల్లికీ, తండ్రికీ వినిపించేటంత గట్టిగా లలితమ్మ చెంప ఛెళ్ళుమనిపించాడు. ఈ మాటలు రాస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. లలితమ్మ తరువాత జీవితంలో చాలా సుఖసంతోషాలను అనుభవించింది. సుబ్బణ్ణ ఆమెను దేవి అవతారంగా సంభావించాడు. కాని ఆ రోజు అతడు ఆమెను కొట్టిన సంగతి తలుచుకుంటే ఎవరికైనా బాధ కలుగుతుంది. లలితమ్మ చేసిన తప్పేమిటి? భర్త భోజనం చేయలేదు కనుక తానూ భోజనం చెయ్యలేదు. అతడు భోజనం చేయకపోవడానికి కారణం కోపం. ఆమె తినకపోవడానికి కారణం భర్త తినకపోవడమే. అంతకుమించి వేరే కారణం లేదు. భర్తకు గాని, తనకు గాని ఏదో అవమానం జరిగిందన్నది కారణం కాదు. తన భర్తను మామగారు ఏదో అనడం, తన భర్త కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కూడా కారణం కాదు. ఆ ఇంటికి తన భర్త భారమైపోతే తనూ భారమేకదా అన్న ఆలోచనకూడా ఆమెకు రాలేదు. ఒకవేళ అటువంటి ఆలోచన వచ్చినా ఆమె సరిపెట్టుకుపోయేది. తండ్రీ కొడుకుల మధ్య ఏవో గొడవలుంటాయి. వాటితో తనకేమి సంబంధం అనుకుని సమాధానపడి ఉండేది. తల్లీ కొడుకులు మాటా మాటా అనుకున్నప్పుడు కూడా ఆమె అలాగే అనుకుని ఊరుకుంది. "కన్నది, పెంచింది ఆవిడ. కోపం వస్తే ఏదైనా అంటుంది. ఆవిడకి ఆ అధికారం ఉంది" అని సరిపెట్టుకునేది. తన వల్ల ఏదైనా పొరపాటు జరిగి అత్తగారు కోప్పడినప్పుడు కూడా ఆమె "అవును మరి... ఆవిడ కొడుకు ఆవిడ కొడుకే. నేనెవరిని? మధ్యలో బైట నుంచి వచ్చినదాన్ని" అని సమాధానపడేది. తను ఆ ఇంటికి పరాయిదాన్ననే భావం వచ్చినప్పుడు ఒక్కక్షణం బాధపడి "ఇంకెప్పుడూ ఈ పొరపాటు చేయకూడదు. అత్తగారి ఇష్టప్రకారమే నడుచుకోవాలి" అనుకునేది. లలితమ్మ మంచి గౌరవ కుటుంబంలో పుట్టిన పిల్ల. ఆమె తల్లి ఎంతో ఉత్తమ ఇల్లాలు. అత్తమామలు, బావగార్లు, మరదులు, తోడికోడళ్ళు ఉన్న ఇంట్లో ఇరవైయేళ్ళు సంసారం చేసిన అనుభవసారమంతటినీ ఆవిడ తన కూతురికి నూరిపోసింది. సహనం, వివేకం బోధించింది. ఆవిడ బోధల వల్ల లలితమ్మకు పదహారేళ్ళకే ముప్ఫయ్యేళ్ళ స్త్రీకి ఉండే పెద్దరికం అబ్బింది. అత్తమామల విషయంలో గాని, ఇతరుల విషయంలో గాని ఆమె ఎప్పుడూ ఏది మంచి అని ఆలోచించి తదనుగుణంగా ప్రవర్తించేది. ఇంట్లో ఏం జరిగినా సరే అత్తమామల పట్ల ఆమె గౌరవం మాత్రం చెదిరేది కాదు. ఆ వివేకంతోనే ఆమె ఆరోజు ఉపవాసం చేసింది. తన భర్త ఆకలితో ఉన్నాడు. అతడు భోజనం చేయకుండా తను ఎలా తినగలదు? తను చేసింది మంచిపనేనని ఆమె నిశ్చితాభిప్రాయం. కాని అలా చేసినందుకే భర్త తనని కొట్టాడు. ఆ క్షణంలో ఆమె నిర్ఘాంతపోయింది. పూజగదిలోకి వెళ్ళి గోడను ఆనుకుని నించుని, తన తల్లిని తలుచుకుని ఐదు నిమిషాలు వెక్కి వెక్కి ఏడిచింది. తర్వాత ఎలాగో తనను తాను సంబాళించుకుంది. తాను ఇప్పుడు చేయవలసింది ఏడుస్తూ కూర్చోవడం కాదని తెలుసుకుంది. గదిలో నుంచి బైటకు వచ్చి మామగారికీ, తన భర్తకీ పీటలు, విస్తళ్ళు వేసింది. భార్యను కొట్టినందుకు సుబ్బణ్ణ బాధపడుతున్నాడు. భార్యపై చెయ్యి చేసుకున్న మరుక్షణంలోనే అతను తాను చేసింది పిరికి పని అని గ్రహించాడు. కోపం వల్లనే తాను ఒకతప్పు తరువాత ఒక తప్పు చేస్తున్నానని కూడా గ్రహించాడు. ఇంట్లో నుంచి బైటికి పోయే ఆలోచన విరమించుకున్నాడు. తండ్రి స్తోత్రం పూర్తి చేసిన తరువాత వెళ్ళి విస్తరిముందు కూర్చున్నాడు. తండ్రీ కొడుకులిద్దరూ మౌనంగా భోజనాలు చేశారు. తరువాత సుబ్బణ్ణ తన తండ్రి భద్రపరచిన పాత పుస్తకాల దుమ్ము దులపడం మొదలుపెట్టాడు. మరికాసేపటికి లలితమ్మ కూడా భోజనం చేసి అత్తగారికి అన్నం వడ్డించింది. అత్తగారి భోజనం అయిన తరువాత వంటఇల్లు సర్ది, కడిగి, తుడిచి పడకగదిలోకి వెళ్ళింది. భర్తకు పక్కవేసి, మళ్ళీ వచ్చి దేవుడి గదిలో అత్తగారి పక్కన కూర్చుంది. అంత రగడ జరిగాక ఇంకా మేలుకొని కూర్చోవాలని ఎవరికీ అనిపించలేదు. శాస్త్రిగారు అంతకుముందే సావిట్లో తన మామూలు స్థానంలో పడకవేశాడు. అత్తగారు కోడలిని వెళ్ళి పడుకోమని చెప్పింది. "ప్రతిరోజూ నేను చెప్పేదాకా ఆగడం దేనికమ్మాయ్. పో... వెళ్ళి పడుకో" అంది ఆవిడ. లలితమ్మ తన గదిలోకి వెళ్ళింది. చేతనైతే నేనిక్కడ లలితమ్మను వర్ణించాలి. ఆమె మానసిక స్థితిని వివరించాలి. కాని నాకు అంతటి శక్తిలేదు. నేను ఆమెను చూడలేదు. ఆమె రూపం ఎలా ఉండేదో నాకు తెలియదు. ఆమెను చూడలేక పోయినందుకు నాకేమీ విచారం లేదు. ఒకవేళ చూసి ఉండినా ఆమెను వర్ణించేవాణ్ణి కానేమో. కవులు స్త్రీని వర్ణించేటప్పుడు ఔచిత్యపు హద్దు మీరుతున్నారని నా అభిప్రాయం. అయ్యా కవిగారూ? మీరు మీవంటి కాముకులను తృప్తిపరచడానికి కామదృష్టితో వర్ణించే స్తనాలు జగన్మాత ఈలోకంలో మనలాంటి కోట్లాది అల్పజీవుల ఆకలి తీర్చడం కోసం ధరించిందని గ్రహించండి. వాటిని మీరు ఒక విటుడిలాగా వర్ణించడం ఎంత అవమానకరం! మీ తల్లిని అలా అంగాంగ వర్ణన చేస్తారా? కవి అనేపేరు తగిలించుకున్నంత మాత్రాన స్త్రీని అలా వర్ణించే అధికారం మీకుందా? స్త్రీ ప్రేయసి కావచ్చు. కాని అంతకంటే ముఖ్యంగా ఆమె ఒక తల్లి. మీ భార్యకూడా మీ సంసారంలో ఒక సమయంలో మాత్రమే భార్య. మిగిలిన కాలమంతా ఆమె మిమ్మల్ని తల్లి లాగానే చూస్తుంది. నేను కవిని కాను. అందుచేత నేను లలితమ్మను చూసి ఉన్నా ఆమె ముఖాన్ని కళ్ళని, పెదవులని వర్ణించడానికి నాకు మనసాప్పేది కాదు. ఆమె అందంగా ఉంటుందని ఒక్కమాట మాత్రం చెప్పి ఊరుకునేవాడిని. మన గృహిణులలో మనం చూసే సౌందర్యం ఏమిటి? వారి రూపురేఖలు కావు. ఎవరైనా ఒక అపరిచిత స్త్రీని మొదటిసారి చూసినప్పుడు ఆమె రూపాన్ని గమనిస్తామేమోగాని రోజూ ఇంట్లో స్త్రీలను అలా చూడము కదా. ఎంత అందగత్తె అయిన స్త్రీనైనా ఆమె సొగసును గమనించేది స్వల్పకాలమే. ఆ తరువాత మనం చూసేది అవర్ణనీయమైన స్త్రీ వ్యక్తిత్వాన్నో ఆమె ప్రేమ, దయ, కరుణ, లాలిత్యం, సౌకుమార్యం-ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె స్త్రీత్వాన్ని చూస్తాము. చేతనైతే లలితమ్మలోని ఈ గుణాలను నేను వర్ణించాలి. కాని వర్ణించగల శక్తి నాకు లేదు. స్త్రీత్వాన్ని ఇంతగా ప్రస్తుతిస్తున్నానంటే ఈ ప్రస్తుతి స్త్రీలందరికీ వర్తిస్తుందని గాని, స్త్రీలందరూ ఒక్కలాగా ఉంటారని గాని నా అభిప్రాయంకాదు. లలితమ్మా స్త్రీయే. ఆమె అత్తగారూ స్త్రీయే. కాని వారిద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. స్త్రీలలో లలితమ్మ శ్రేష్టురాలు. ఆ రోజు భర్త తనను కొట్టినప్పుడు భీతి, బాధ ఆమెను అవహించాయి కాని, త్వరలోనే ఆమె ఆ స్థితి నుంచి బైటపడింది. అంతేకాదు. భర్త విషయంలో-అప్పటి వరకు ఎరుగని ఒకకొత్త భావన - 'ఇతను నావాడు. నా సొంతం' అనే భావన ఏర్పడింది. అప్పటి వరకు ఆమె, సుబ్బణ్ణ ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోలేదు. కాపురానికి వచ్చినా ఆమె ఇంకా చిన్నపిల్ల. అతనూ చిన్నవాడే. మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఏమీలేకపోయినా ఏదో ఒకటి కల్పించుకుని మాట్లాడే స్వభావం కాదు ఇద్దరిదీ. మాట్లాడుకోవాలన్నా రాత్రి పడకగదిలో తప్ప అవకాశం ఉండదు. పడకగదిలో భర్తకు దగ్గరగా ఉన్నా మాట్లాడడానికి జంకేది లలితమ్మ. గదిబైట తలుపు దగ్గర నుంచుని అత్తగారు వింటుందేమోనని ఆమెకు అనుమానం. అందు వల్ల ఎప్పుడైనా మాట్లాడవలసివస్తే ఒకటి రెండు మాటలు మాత్రమే మాట్లాడేది. సుబ్బణ్ణ కూడా సంసార సుఖం గురించి అట్టే ఆలోచించేవాడు కాడు. సంగీతంలో గొప్ప పాండిత్యం సంపాదించాలన్న ఆలోచన తప్ప అతనికి వేరే ఆలోచన ఉండేది కాదు. ఆ వయస్సులో సాధారణంగా ఏమగవాడైనా స్త్రీ నుంచి పొందగోరే ఉపచారాలన్నీ అతనికి నీలసాని నుంచి లభించేవి. అటువంటి ఉపచారాలు అతడికి తన ఇంట్లో లభించవు. లలితమ్మ తన భర్తను తృప్తిగా కళ్ళారా చూసుకోవాలంటేనే రాత్రి పడకగదిలో తప్ప సాధ్యమయ్యేది కాదు. ఇంక నీలసాని లాగా అతడికి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇవ్వడం, పీటవేసి కూర్చోబెట్టి నవ్వుతూ మాట్లాడడం-ఇవన్నీ ఎలా కుదురుతాయి? అందుకే సుబ్బణ్ణ, లలితమ్మల సంబంధం అప్పటి వరకు సూక్ష్మంగానే ఉండిపోయింది. దీన్నే మనవాళ్ళు 'చీమకుట్టినంత' అని వర్ణిస్తారు. ఎందుకంటే చీమకుట్టితే అట్టే నెప్పెట్టదు. కాబట్టి దాన్ని 'కరవడం' అనడానికి వీల్లేదు. 'ముద్దుపెట్టుకుంది' అనడానికీ వీల్లేదు. ఎందుకంటే చీమ కుడితే హాయిగా ఉండదు. సమాజం లతమ్మని, సుబ్బణ్ణని భార్యా భర్తలుగా గుర్తించింది కనుక వారు దంపతులయ్యారు. ఆరోజు సుబ్బణ్ణ భార్యను కొట్టాడంటే తమ ఇద్దరి మధ్యగల దాంపత్య బంధాన్ని పురస్కరించుకొని తనకు గల అధికారాన్ని ఉపయోగించుకున్నాడన్నమాట. ఆ చర్య ద్వారా తమ సంబంధాన్ని ధ్రువపరచుకొన్నాడన్నమాట. ఇదే భావం లలితమ్మకూ కలిగింది. "మేమీద్దరం ఒకటి. మామగారు, అత్తగారు, మిగతా ప్రపంచం అంతా వేరు. మేమిద్దరం మాత్రమే ఒకటి" అని ఆమె మనస్సు పదేపదే చెప్పింది. "ఆయన నన్ను కొట్టడంలో ఆశ్చరమేముంది? కొట్టింది నా భర్తేకదా. పరాయి వాడు కాదు కదా. ఆయన నావాడు" అనుకున్నది తనలో తనే. అప్పుడు ఆమెకు తల్లి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. "నీ భర్త ఏం చేసినా అతనే నీదైవం, మగవారు తమ దైవం కోసం బైట వెతుక్కోవాలి. కాని ఆడవారికి పతియే ప్రత్యక్ష దైవం. భగవంతుడు మనకు కష్టాలు కలిగిస్తున్నాడని ఆయన్ని మనం వదిలేస్తున్నామా? వదిలేద్దామనుకున్నా దేవుణ్ణి కాదని ఎక్కడికి వెడతాము? అలాగే స్త్రీ కూడా భర్తకొట్టినా తిట్టినా అతణ్ణి విడిచి ఎక్కడికీ పోలేదు". తల్లి చెప్పిన ఈ మాటలను మననం చేసుకోవడంతో పడక గదిలో చేరే సమయానికి ఆమె మనకు కుదుట బడింది. "ఆయన ఈపాటికే నిద్రపోయి ఉంటాడా? మేలుకుని ఉంటాడా? నాతో మాట్లాడతాడా?" అనుకుంటూ గదిలో అడుగుపెట్టింది. చప్పుడు కాకుండా నెమ్మదిగా తలుపువేసి పడక వద్దకు వెళ్ళింది. సుబ్బణ్ణ ఎడమ చేతి వైపు తిరిగి కళ్ళు మూసుకుని పడుకున్నాడు. లలితమ్మ అంత త్వరగా గదిలోకి వస్తుందని అతను అనుకోలేదు. మామూలుగా ఆమె అతను పడుకున్న చాలాసేపటికి వచ్చి పడుకుంటుంది. సుబ్బణ్ణ కళ్ళు మూసుకున్నా మెలకువగానే ఉన్నాడు. అతను తన జీవన పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచనతో పాటే రోజూ లలితమ్మ గదిలోకి ఎలా వస్తుందో, తనకు నిద్రవస్తుండగా నెమ్మదిగా - నిద్రాభంగం కలగకుండా - ఎలా దుప్పటి కప్పుతుందో, దీపం అర్పి తన పక్కకు వచ్చి ఎలా పడుకొంటుందో జ్ఞాపకం చేసుకొంటున్నాడు. "ఇవాళ కూడా రోజులాగే చేస్తుందా, లేకపోతే కొంచెం దూరంగా పడుకొంటుందా? ఆమె లోపలికి వచ్చిన తరువాత తను ఆమెతో మాట్లాడాలా, మౌనంగా ఉండిపోవాలా?" ఈ ప్రశ్నలు అతని మనస్సులో తిరుగుతున్నాయి. "తప్పు ఆమెదే. అయినా నేను కొట్టకుండా ఉండాల్సింది. కాని ఈ సంఘటనకు ఆమె బాధ్యురాలు. అయినా ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తాను" అనుకున్నాడు. లలితమ్మ మామూలుగా అతనికి దుప్పటికప్పి ఉంటే, దీపం ఆర్పి ఉంటే ఆమె వచ్చిన సంగతి అతడికి తెలిసేది. కాని, లలితమ్మ దీపం అలాగే ఉంచి, చప్పుడు కాకుండా నెమ్మదిగా పడక దగ్గరకు వచ్చి కూర్చుంది. భర్త నిద్రపోతున్నాడని ఆమె అనుకుంది. అతను పూర్తిగా తన సొంతం అనే భావన కొత్తగా ఏర్పడడంతో ఆమె మామూలుగా కంటే ఎక్కువగా అతడి ముఖాన్ని తేరిపార చూసింది. "ఆడది భర్తని కన్నార్పకుండా చూడకూడదు. మగవాడు పారిజాత పుష్పంలాంటివాడు. కన్నార్పకుండా చూస్తే పారిజాతం వాడిపోతుంది. అలా చూస్తే మగవాడికి దిష్టితగులుతుంది" అని చిన్నప్పుడు తల్లి చెప్పిన మాటలు జ్ఞాపకం రావడంతో లలితమ్మ తన చూపు మరలించుకుంది. కాని అతను తనవాడు అనే భావన బలీయం కావడంతో ఆమె చూపులు మళ్ళీ భర్తవైపే తిరిగాయి. అతణ్ణి చూస్తుంటే ఆమెకు చెప్పలేనంత ప్రేమ కలిగింది. పాపాయిలాగా అతణ్ణి తన చేతుల్లోకి తీసుకోవాలనిపించింది. కాని అంత చనువు ఎలా తీసుకోగలదు? పైగా అతను నిద్రపోతున్నాడు. అందుకని ఆ ఆలోచన మానుకుని తనని కొట్టిన అతడి కుడిచేతిని చూస్తూ కూర్చుంది. ఒక్కక్షణం ఆగి నెమ్మదిగా ముందుకు వంగి అతి సున్నితంగా ఆ చేతిని ముద్దు పెట్టుకుంది. నిజంగా నిద్రపోతున్న వాడైతే అతడికి ఏమాత్రం నిద్రాభంగం కలగనంత సున్నితంగా ముద్దు పెట్టుకుంది. సుబ్బణ్ణ నిద్రపోవడంలేదు కనుక అతడికి స్పర్శ తెలిసింది. కళ్ళు తెరిచి, తన చేత దెబ్బలు తిన్న భార్యను చూశాడు. పార్వతీదేవి తపస్సుకు మెచ్చి అనుగ్రహించిన శివుడి లాగా నిశ్శబ్దంగా, నిస్సంకోచంగా ఆమె చేతిని అందుకొని దగ్గరకు తీసుకున్నాడు. "బాగా నొప్పెట్టిందా?" అని అడిగాడు. ఈ సన్నివేశం రాస్తుంటే నవ్వొస్తోంది. ఇక్కడ శివపార్వతుల ప్రస్తావన దేనికి? చెంప చెళ్ళుమనిపించి 'నొప్పెట్టిందా' అని అడగడం ఏమిటి? ఇది నాటకం కాదు. జీవితం. అందుకని ఆ పరిస్థితిలో సంభాషణ అలాగే ఉంటుంది. సుబ్బణ్ణ నాటక రచయిత కాదు. రచయిత అయి ఉంటే రసవత్తరమైన పదజాలంతో మాట్లాడే వాడేమో? నాయకుడు అడిగిన ప్రశ్నకు నాయిక అందమైన మాటలతో ఎలా బదులు చెప్పాలో నాటక రచయితకి తెలుస్తుంది. కాని మనం రోజూ ఆడే జీవిత నాటకంలో భార్య ఏం మాట్లాడబోతున్నదో భర్తకి తెలియదు. అందుచేత తను ఏం మాట్లాడాలో ముందుగా ఆలోచించుకొని తయారు కావడం కుదరదు. ఆ రాత్రి అతడు అడిగిన ఆ ప్రశ్న తరువాత వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఎలా వర్ణించడం? సుబ్బణ్ణ, లలితమ్మ ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన చిన్నపిల్లలు. కొత్తగా అనుభవంలోకి వచ్చిన ఆ ప్రేమలో వారిద్దరూ ఏమేమో మాట్లాడుకున్నారు. ఆ మాటల అర్థం ఏదైతేనేం - మొత్తం మీద ఇద్దరూ ఇదివరకెప్పుడూ మాట్లాడుకోనంత ఎక్కువ సేపు మాట్లాడు కున్నారు. ఫలితంగా వారిరువురి హృదయాలూ పరస్పరం సన్నిహితమైనాయి. ఇరువురి హృదయాలూ దాదాపు ఒక్కటైనాయి. లలితమ్మ ఒక్కసారిగా తన భర్తకు యజమానురాలూ, అతడి ఆస్తీ కూడా అయింది. అంతకు ముందు మాత్రం అతను ఆమె సొంతం కాదా, ఆమె అతడి ఆస్తికాదా అని మీరు అడగవచ్చు. భర్త హృదయంలో స్థిరమైన స్థానం తనకు లభించిందన్న భావన కలిగినప్పుడే స్త్రీకి తన భర్త సొంతమవుతాడు, తను అతడికి సొంతం మవుతుంది. సుబ్బణ్ణ హృదయంలో లలితమ్మకు అటువంటి స్థానం ఆరాత్రే లభించింది. నండూరి పార్థసారథి (1987లో అనువదించబడినది) Previous Post Next Post Random Article I'm Feeling Lucky! Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works
స్లైస్, నక్షత్ర, పానాసోనిక్, లాక్మే, లోరియల్, రీబాక్ ఇండియా, ఇమామి, లినో పెరోస్ లాంటి అగ్రగామి బ్రాండ్లకు ప్రమోషన్స్ చేస్తుంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ.. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన 'జీ లే జరా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'జీ లే జరా' చిత్రంతో అలియా భట్, ప్రియాంక చోప్రా కూడా నటించారు. కెరీర్ ప్రారంభంలో తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి చిత్రాల్లోనూ కనువిందు చేశారు. ఆ తర్వాత బీటౌన్ లో బిజీ అయిపోయారు. సినిమాల్లోనే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ ఎక్కువే.. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 67 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న కైఫ్.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కు సుమారు రూ. 97 లక్షలు వసూలు చేస్తుందని తాజా మీడియా నివేదిక వెల్లడించింది
శివుడు లింగరూపంలో దర్శనం ఇస్తుంటాడు. జ్యోతిర్లింగం అంటే శివుడిని లింగ రూపంలో ఆరాధించే చోటు అని చెబుతారు. శివుడు తన ఆత్మ శక్తిని లింగరూపంలో నింపి మన దేశంలో 12 చోట్ల స్వయంభువుగా వెలిశాడని పురాణం. వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. ఇక్కడ వెలసిన స్వామివారికి ఎంతో పురాణం ఉంది. మరి ఇక్కడ శివుడు ఎలా వెలిసాడు? శివుడు వెలసిన ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్ర, పూణే జిల్లాలో భీమా శంకర్ ఉంది. ఇక్కడే భీమనాది జన్మస్థలం అని చెబుతారు. ఒక గుంట లాంటి ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ ఆలయంలో ఎనిమిది అడుగుల స్థలంలో గుంటలాంటి తొట్టి నిండుగా నేలబారుగా నీళ్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న తొట్టిలోనే భీమనాది జన్మించింది. ఇక పురాణానికి వస్తే, శివుడు త్రిపురాసురుని సంహరించిన తరువాత ఇక్కడ సహ్యాద్రి పర్వతాల మీదకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో భీమకుడు అనే రాజు ఇటుగా వచ్చి స్వామిని చూసి భక్తితో నమస్కరించి, స్వామి నేను ఈ అడవిలో వేయడానికి వచ్చాను ఇలా వెడుతున్న సమయంలో పొరపాటున ఇద్దరు మునులను గాయపరిచాను ఆ పాపపరిహారం ప్రసాదించమని శివుడిని ప్రార్దించాడట. అప్పుడు శివుడు సరేనని చెప్పి అతడికి అభయం ఇచ్చాడు. అయితే శివుడూ అంతకుముందే త్రిపురాసురుడితో యుద్ధం చేసి సంహరించి రావడం వలన ఆ శ్రమ కారణంగా శివుడి శరీరం నుండి చెమట ధారగా కారి, అది ఒక చిన్న ప్రవాహం లాగా మారింది. అప్పుడు శివుడి శరీరం నుండి వచ్చిన ఆ ప్రవాహానికి భీమకుడు నమస్కరించి అందులో స్నానం చేసి తన పాపం నుండి విముక్తి అయ్యాడు. ఇక అయన ప్రార్థన మేరకు శివుడు అక్కడే వెలిశాడని పురాణం. ఇలా ఆ ప్రవాహ ధార భీమాకుని పేరు మీదుగా భిమానదిగా మారింది. ఇక ఈ ఆలయంలో ముందు వైపు ఉన్న మెట్ల మీద నిలబడి కాళ్ళు, చేతులు కడుక్కోవడం మాత్రమే చేయవచ్చు. ఆలా ఆ మెట్ల నుండి కిందకి అంటే భూగర్భం నుండి తొట్టిలోని నీరు ప్రవహిస్తూ కొండక్రింద నుండి ఎక్కడో బయట పడుతుంది. ఆ ప్రదేశమే భిమానదిగా పిలువబడుతుంది. ఇక ఈ ఆలయంలో స్వామివారికి ఐదు తలలు ఉండగా, ఇక్కడ ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. ఇలా శివుడు చెమట చుక్కతో వెలసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.
సినిమా స్క్రిప్ట్ & రివ్యూ : 11/22/21 .Header h1 { font: normal normal 90px Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; color: #ffff00; } .Header h1 a { color: #ffff00; } .Header .description { font-size: 130%; } /* Tabs ----------------------------------------------- */ .tabs-inner { margin: 1em 0 0; padding: 0; } .tabs-inner .section { margin: 0; } .tabs-inner .widget ul { padding: 0; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; } .tabs-inner .widget li { border: none; } .tabs-inner .widget li a { display: inline-block; padding: 1em 1.5em; color: #ffffff; font: normal bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; } .tabs-inner .widget li.selected a, .tabs-inner .widget li a:hover { position: relative; z-index: 1; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } /* Headings ----------------------------------------------- */ h2 { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #00ffff; } .main-inner h2.date-header { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #0f0e0c; } .footer-inner .widget h2, .sidebar .widget h2 { padding-bottom: .5em; } /* Main ----------------------------------------------- */ .main-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner .section { margin: 0 20px; } .main-inner .column-right-inner { margin-left: 20px; } .main-inner .fauxcolumn-right-outer .fauxcolumn-inner { margin-left: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner { margin-right: 20px; } .main-inner .fauxcolumn-left-outer .fauxcolumn-inner { margin-right: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner, .main-inner .column-right-inner { padding: 15px 0; } /* Posts ----------------------------------------------- */ h3.post-title { margin-top: 20px; } h3.post-title a { font: italic bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #b02ef1; } h3.post-title a:hover { text-decoration: underline; } .main-inner .column-center-outer { background: #ffffff none repeat scroll top left; _background-image: none; } .post-body { line-height: 1.4; position: relative; } .post-header { margin: 0 0 1em; line-height: 1.6; } .post-footer { margin: .5em 0; line-height: 1.6; } #blog-pager { font-size: 140%; } #comments { background: #cccccc none repeat scroll top center; padding: 15px; } #comments .comment-author { padding-top: 1.5em; } #comments h4, #comments .comment-author a, #comments .comment-timestamp a { color: #b02ef1; } #comments .comment-author:first-child { padding-top: 0; border-top: none; } .avatar-image-container { margin: .2em 0 0; } /* Comments ----------------------------------------------- */ #comments a { color: #b02ef1; } .comments .comments-content .icon.blog-author { background-repeat: no-repeat; background-image: url(); } .comments .comments-content .loadmore a { border-top: 1px solid #b02ef1; border-bottom: 1px solid #b02ef1; } .comments .comment-thread.inline-thread { background: #ffffff; } .comments .continue { border-top: 2px solid #b02ef1; } /* Widgets ----------------------------------------------- */ .sidebar .widget { border-bottom: 2px solid #f1d08f; padding-bottom: 10px; margin: 10px 0; } .sidebar .widget:first-child { margin-top: 0; } .sidebar .widget:last-child { border-bottom: none; margin-bottom: 0; padding-bottom: 0; } .footer-inner .widget, .sidebar .widget { font: normal normal 14px Georgia, Utopia, 'Palatino Linotype', Palatino, serif; color: #ffe599; } .sidebar .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .sidebar .widget a:visited { color: #6ef12e; } .sidebar .widget a:hover { color: #c1c1c1; text-decoration: underline; } .footer-inner .widget a:link { color: #3630f4; text-decoration: none; } .footer-inner .widget a:visited { color: #000000; } .footer-inner .widget a:hover { color: #3630f4; text-decoration: underline; } .widget .zippy { color: #ffffff; } .footer-inner { background: transparent none repeat scroll top center; } /* Mobile ----------------------------------------------- */ body.mobile { background-size: 100% auto; } body.mobile .AdSense { margin: 0 -10px; } .mobile .body-fauxcolumn-outer { background: transparent none repeat scroll top left; } .mobile .footer-inner .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .mobile .footer-inner .widget a:visited { color: #6ef12e; } .mobile-post-outer a { color: #b02ef1; } .mobile-link-button { background-color: #3630f4; } .mobile-link-button a:link, .mobile-link-button a:visited { color: #ffffff; } .mobile-index-contents { color: #444444; } .mobile .tabs-inner .PageList .widget-content { background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } .mobile .tabs-inner .PageList .widget-content .pagelist-arrow { border-left: 1px solid #ffffff; } sikander777 --> సినిమా స్క్రిప్ట్ & రివ్యూ రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు... టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం! Monday, November 22, 2021 1091 : రైటర్స్ కార్నర్ ప్రతి వృత్తికీ సాధనాలు అవసరం. ప్రాథమికంగా పారా పలుగూ లేకుండా మీరు ఇల్లు నిర్మించలేరు. బ్రోకర్ లేకుండా షేర్స్ వ్యాపారం చేయలేరు. బాస్కెట్‌ బాల్ ఆటగాళ్ళు హూప్స్, బాల్ లేకుండా బాస్కెట్ బాల్ ఆడలేరు. చిత్రకారులకి కుంచెలు, రంగులు అవసరం...మీరు సినిమా రచయితైతే మీకో టూల్ బాక్స్ అవసరం! ఆ టూల్ బాక్స్ లో ఏఏ సాధనాలు అవసరం? ఓ పెన్నూ కాగితమా? ఓ కంప్యూటరా? ఇవి సరే, ఇంకేం అవసరం? వృత్తిపరంగానో, అభిరుచిగానో స్క్రీన్‌ప్లేలు రాయాలనుకుంటే, మీరు మీ సొంత టూల్ బాక్స్ ని అనుభవాల సారంగా నిర్మించుకోవడం, అనుకూలీకరించు కోవడమూ ప్రారంభించాల్సిందే! సినిమా రచన భౌతికమైనది కాబట్టి మీకు టైప్‌రైటర్ లేదా రైటింగ్ సాఫ్ట్ వేర్ తో బాటు చాలా రిఫరెన్స్ పుస్తకాలతో కూడిన కంప్యూటర్ అవసరం. స్క్రీన్ రైటింగ్ అనేది ఒక క్రాఫ్ట్ కాబట్టి మీకు విద్య, శిక్షణ, అభ్యాసం చాలా అవసరం. స్క్రీన్ రైటింగ్ అనేది ఒక కళ కాబట్టి కూడా మీరు అనుభవించిన ప్రతి అనుభవం, మీరు ఎప్పుడైనా చూసిన లేదా చదివిన ప్రతి కథ, మీరు ఎప్పుడైనా విన్న ప్రతి విషయం మీరు ఉద్వేగభరితంగా భావించే ప్రతిదానికీ అవసరం. ఈ వ్యక్తిగత అనుభవాలన్నీ మీ టూల్‌ బాక్స్ లోకి వెళ్ళడానికి అవసరం. అదృశ్య సాధనాలు : “నేను ఐదేళ్ళ వయసులో నా మొదటి స్క్రీన్‌ప్లే రాసేశా, పన్నెండు సంవత్సరాల వయసులో నా మొదటి ఆస్కార్‌ గెలిచేశా, నా రెండవ ఆస్కార్ పదిహేనవ యేట వచ్చేసింది...” చెప్పాడు యమ బిజీగా వున్న పిల్లవాడు. “ఈ వయస్సులో మీరు దేని గురించి రాశారండీ?” అడిగాడు అనామకుడు. "జీవితం గురించి రాసేశా!” చెప్పాడు బుడ్డోడు. “కానీ మీరు తగినంత జీవితాన్ని అనుభవించలేదు కదండీ?” అన్నాడు అనామకుడు. "ఓహ్, అనుభవించేశా!” అరిచాడు బుడతడు,“తెలీదేమో మీకూ, నా గత జన్మల విశేషాలన్నీనాకు బాగా గుర్తుంటాయి మరి!” అన్నాడు మళ్ళీ ముక్కు తుడుచుకుంటూ. ఇలా మీ వ్యక్తిగత అనుభవాలే, పరిశీలనలే మీ అదృశ్య సాధనాలు. ఇదేం మీరు భౌతికంగా బయట కొనుగోలు చేసి మీ ఊహాత్మక టూల్‌ బాక్స్ లో వుంచగలిగేది కాదు. కానీ ఇది అన్ని రచనా వ్యాసంగాలకీ ముఖ్యావసరమే. మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే, చూస్తే, అనుభూతిస్తే, అంత ఎక్కువ రాసేటప్పుడు సారం మీ రచనల్లో ప్రవహిస్తుంది. ఈ రకమైన సాధనాలని సేకరించడానికి సంవత్సరాలు పట్టొచ్చు. ఈ రకమైన సాధనాలని మరింత అభివృద్ధి చేయడానికి ఉత్తమ మార్గం ప్రతిదీ వినడం, గ్రహించడం, ప్రాసెస్ చేయడమే. ప్రపంచంలో అత్యంత చెడ్డ లేదా నీచమైన వ్యక్తికి కూడా ఒక దృక్కోణం వుంటుంది. రచయితగా మీ విలువలకి, నమ్మకాలకి విరుద్ధంగా వుండే విభిన్న దృక్కోణాలని మీరు అర్థం చేసుకోవాలి. ఇతర వ్యక్తుల్ని అర్థం చేసుకోవడానికి మీరు ఎంత ఓపెన్‌గా వుంటే, మీ పాత్రలు అంత లోతుగా వుంటాయి. క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌లో తప్పు, ఒప్పు అన్నవి వుండవు - కేవలం దృక్కోణాలే వుంటాయి. అందుకే చాలా మంది రచయితలు విశ్లేషకులుగా పుట్టుకొచ్చారు. "మీకు తెలిసింది రాయండి" అన్నారు. మీ వ్యక్తిగత అనుభవాలతో నాలెడ్జ్ బేస్ పెరిగేకొద్దీ (దురదృష్టవశాత్తూ, వయస్సుతో పాటూ), మీరు మీ అదృశ్య సాధనాలని విస్తరించడమూ, ఉన్నతస్థాయి రచనలల్నిచేయడమూ ప్రారంభిస్తారు. నా సలహా, నోట్ ప్యాడ్ దగ్గరుంచుకుని బయటకి వెళ్ళండి. బయట ఏం తెలుసుకుంటున్నారో రాసుకోండి. తిరిగి వచ్చాక విశ్లేషించుకోండి. మీరు లోతైన రచనలు చేయడానికి ఇది అవసరం. క్రాఫ్టింగ్ సాధనాలు : “నేను ఆ సినిమా కంటే బ్రహ్మాండమైన సినిమా కథ రాయగలను. వందల కొద్దీ సినిమాలు చూశా, నాకు చాలా ఈజీ!” చెప్పాడు బిజీ ప్రేక్షకుడు. “సరే రాయ్ మరి” చెప్పాడు అనామకుడు. నెలరోజుల తర్వాత, “ఏం సార్, పూర్తయిందా మీ బ్రహ్మాండమైన సినిమా కథ?” అడిగాడు అనామకుడు. “ఫస్ట్ పేజీ మీద హెవీ వర్క్ చేస్తున్నానబ్బా ఆగు!” అన్నాడు హెవీ ప్రేక్షకుడు. మీ క్రాఫ్టింగ్ సాధనాలు మీ సినిమా రచన విద్యా, శిక్షణా, అభ్యాసాల ద్వారా మాత్రమే అభివృద్ది చెందుతాయని గుర్తు పెట్టుకోండి. సినిమాలు చూస్తున్నంత మాత్రాన ఏమీ వొరగదు. మీకు సినిమా రచనలో డిగ్రీ లేకుంటే (చాలా మందికి వుండదు కూడా), వర్క్ షాపులు, స్క్రీన్ రైటింగ్ పుస్తకాలతో స్వబోధనా మీకు తోడ్పడతాయి. కొత్తగా వచ్చేవాళ్ళు కనీసం రెండు వర్క్ షాపులు హాజరవాలని నేను సిఫార్సు చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇతరులు ఎలా రాస్తున్నారో చదవడానికీ, చర్చించడానికీ అవకాశముంటుంది. దీంతో అపారమైన అంశాల మీద మీకు పట్టు లభిస్తుంది. ఇతరులు చేస్తున్న తప్పులు కూడా తెలుసుకుని మిమ్మల్ని దిద్దుకోగల్గుతారు. సినిమా రచన ప్రాథమికాలని నేర్చుకోవడంలో సార్వత్రిక కథా నిర్మాణం (యూనివర్సల్ స్టోరీ స్ట్రక్చర్) తెలుసుకోవడం అతి ముఖ్యమైన భాగం. మౌలిక కథా నిర్మాణం జానపద కథల నుంచి, పురాణాల నుంచీ లభిస్తోంది. ఈ విషయాలని బోధించే తరగతులకి మీరు హాజరైతే వృత్తిలో మీరు ముందుంటారు. ఈ విద్య మీకు స్క్రీన్ రైటింగ్ పుస్తకాల్లోంచి కూడా లభిస్తుంది. మరొక క్రాఫ్టింగ్ సాధనం తిరగ రాయడం. రాసింది దిద్దుకుంటూ తిరగ రాయడం. ఎన్నిసార్లయినా తిరగ రాయండి. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత మంచి రచయితవుతారు. సినిమా రచననేది ఒక క్రాఫ్టు. ఎంత సాధన చేస్తే అంత మేలైన రచయితవుతారు. భౌతిక సాధనాలు: ఇక్కడ కొన్ని రిఫరెన్సు పుస్తకాలని సూచిస్తున్నాను. అసంఖ్యాకంగా లభిస్తున్న స్క్రీన్ రైటింగ్ పుస్తకాల్లో ఏవి తీసుకోవాలన్న తికమక లేకుండా మీకు సూచిస్తున్నాను. పాత్ర, కథ ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి ముడిపడి వుంటాయి. ఏ పుస్తకం దేని కవసరమో ఈ కింద జాబితాలో బ్రాకెట్లలో సూచిస్తున్నాను. 1. ది ఆర్ట్ ఆఫ్ డ్రమటిక్ రైటింగ్, లాజోస్ ఎగ్రి - ఈ పుస్తకం 1946 లో వెలువడింది. ప్రత్యేకంగా ప్లే రైటింగ్ (నాటకాల) కోసం. స్క్రీన్ రైటింగ్ కోసం దీన్ని సిఫార్సు చేస్తాను. ఇందులో వున్న లోతైన సమాచారంతో బలమైన రచనలు చేయగల్గుతారు (క్యారెక్టర్ డెవలప్‌మెంట్, స్టోరీ స్ట్రక్చర్) 2. పోయెటిక్స్, అరిస్టాటిల్ మాస్టర్ - కథా నిర్మాణాన్ని పరిశోధించి విశ్లేషించిన మొదటి పండితుడు. ఆయన చెప్పిన బేసిక్స్ ఇంకా మారలేదు (స్టోరీ స్ట్రక్చర్) 3. ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్, జోసెఫ్ కాంప్‌బెల్ - ఈ పుస్తకం చదవడం అంత తేలికైనది కాదు. అయితే క్లాసిక్ మిథ్ స్ట్రక్చర్‌ (మోనో మిథ్) ని ఉపయోగించి కథానాయకుడి కథా ప్రయాణాన్ని వివరిస్తుంది (క్యారెక్టర్ డెవలప్‌మెంట్, స్టోరీ స్ట్రక్చర్) 4. ది రైటర్స్ జర్నీ, క్రిస్టఫర్ వోగ్లర్ - ఇది ‘ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’ కి గైడ్ లాంటిది. దీని కంటెంట్ ని నేరుగా దాని నుంచి తీసుకున్నారు. ఫిల్టర్ చేసి విషయం చెప్పారు. పురాణాల నిర్మాణంపై దృష్టి పెట్టి రాశారు (స్టోరీ స్ట్రక్చర్) 5. స్టీలింగ్ ఫైర్ ఫ్రమ్ ది గాడ్స్, జేమ్స్ బానెట్ - ఇది కూడా పురాణాల నిర్మాణాన్ని పరిశోధించి రాసిన పుస్తకం. కల్పిత కథలకి మీకు కొత్త అంతర్దృష్టిని కల్పిస్తుంది (క్యారెక్టర్ డెవలప్‌మెంట్, స్టోరీ స్ట్రక్చర్) 6. స్క్రీన్ రైటింగ్ ఫ్రమ్ ది హార్ట్, జేమ్స్ ర్యాన్ - పాత్ర చోదిత కథా కథనాలకి సహాయపడే ప్రత్యేకతలున్న పుస్తకం (క్యారెక్టర్ డెవలప్‌మెంట్) 7. స్క్రీన్‌ప్లే, సిడ్ ఫీల్డ్ - ప్లాట్ పాయింట్‌లని పేజీ నంబర్‌లుగా మార్చి చూపిన ప్రసిద్ధ పుస్తకం. స్క్రీన్‌ప్లే నిర్మాణాన్ని నేర్చుకోవడం ప్రారంభించడానికి ఇది మంచి పుస్తకం. ఐతే ఒక హెచ్చరిక - అలాగని పేజీ నంబర్లు ముందే అనుకుని ప్లాట్ పాయిట్స్ రాయకండి. అంకాల నిడివిని బట్టి పేజీ నంబర్లు మారవచ్చు. —గినీ వాన్ నేమ్ (రచయిత్రి, నిర్మాత) గమనిక : పై పుస్తకాల్లో మొదటి ఐదిటి గురించి బ్లాగులో అప్పుడప్పుడు ప్రస్తావిస్తున్నదే. అలాగే ముందుగానే ఈ పుస్తకాలు చదివే ప్రయత్నం చేయవద్దని కూడా చెప్పాం. ఇవి హయ్యర్ స్టడీస్. ప్రాథమికంగా బేసిక్స్ తెలియకపోతే ఈ పుస్తకాలు అర్ధం గావు. బేసిక్స్ నేర్చుకున్నాకే, ఎంతో అనుభవం పొందిన తర్వాతే వాటి జోలికెళ్ళాలంటూ, బేసిక్స్ కోసం సిడ్ ఫీల్డ్ - ‘స్క్రీన్‌ప్లే’ పుస్తకాన్ని సూచిస్తూ వచ్చాం. కనుక పై జాబితాలో చివర సూచించిన సిడ్ ఫీల్డ్ - ‘స్క్రీన్‌ప్లే’ మాత్రమే మొదట అభ్యసించాలి. ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం కొనేసుకుంటే అయోమయ జీవిగా మిగిలిపోవడం ఖాయం – సికిందర్ Posted by సికిందర్ at 10:18:00 AM Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Newer Posts Older Posts Home Subscribe to: Posts (Atom) ఈ కాన్సెప్ట్ కి బాధితురాలి కథ అవసరం! స్క్రీన్ ప్లే సంగతులు...? ఒక దర్శకుడు నుంచి స్క్రీన్ ప్లే టిప్... Search This Blog contact msikander35@gmail.com, whatsapp : 9247347511 Popular Posts 1255 : రివ్యూ! రచన- దర్శకత్వం : శైలేష్ కొలను తారాగణం : అడివి శేష్ , మీనా క్షీ చౌదరి , కోమలీ ప్రసాద్ , రావు రమేష్ , శ్రీకాంత్ అయ్యంగార్ , తనికెళ్ళ భర... 1250 : రివ్యూ! (దేశవిదేశ పాఠకులందరికీ నమస్కారం. సినిమాలు చూస్తూనే వున్నా రాయాలంటే రైటర్స్ బ్లాక్ లాంటిది అడ్డుపడి ఇప్పుడు రిలీజ్ చేసింది. ఇక నుంచి రెగ్యు... 1251 : స్క్రీన్ ప్లే సంగతులు -1 దె య్యాలు ఎలాగైతే మూఢ నమ్మకమో , చేతబడి అలాటి మూఢ నమ్మకమే. దెయ్యాలతో హార్రర్ సినిమాలు తీసి ఎంటర్ టైన్ చేయడం వరకూ ఓకే. చేతబడి వుందంటూ నమ... తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17 స్క్రీ న్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసల... 1256 : రివ్యూ! రచ న -దర్శక త్వం : ఆనంద్ జె తారాగణం: రావణ్ రెడ్డి , శ్రీ ని ఖి త , లహ రీ గుడివాడ , రవీంద్ర బొమ్మకంటి , అమృత వర్షిణి తదిత తరులు సంగీతం: ఫ... 1252 : స్క్రీన్ ప్లే సంగతులు-2 ఇ క కథా నడక నియమాలకి విరుద్ధంగా , ఫస్టాఫ్ లో ముగియాల్సిన బిగినింగ్ విభాగమింకా సెకండాఫ్ లో కంటిన్యూ అవుతూ , కూతుర్ని హాస్పిటల్ కి... 1253 : రివ్యూ! రచన - దర్శక త్వం : ఏఆర్ మోహన్ తారాగణం : అల్లరి నరేష్ , ఆనంది , వెన్నెల కిషోర్ , ప్రవీణ్ , సంపత్ రాజ్ , శ్రీ తేజ్ , రఘుబాబు తదితరులు ... 1257 : రివ్యూ! 2023 లో జరిగే 95 వ ఆస్కార్ అవార్డ్స్ కి మన దేశం తరపున అధికారిక ఎంట్రీ పొందిన గుజరాతీ చలన చిత్రం ‘ చెల్లో షో ’ (చివరి షో) అక్టోబర్... (no title) డా ర్క్ మూవీస్ జానర్ కి 1930 లలో బ్లాక్ అండ్ వైట్ ‘ ఫిలిం నోయర్ ’ సినిమాలు బీజం వేశాయని చెప్పుకున్నాం. వీటి డీఎన్ఏ హార్డ... 1249 : రివ్యూ! రచన - దర్శకత్వం : రాజ్ విరాట్ తారాగణం : నందు విజయ్ కృష్ణ , రష్మీ గౌతమ్ , కిరీటి దామరాజు , రఘు కుంచె తదితరులు సంగీతం : ప్రశాం...
1881లో పుట్టి పంథొమ్మిదేళ్ల చిన్నవయసులోనే (1899లో) మరణించిన వేమూరి శారదాంబ పదహారేళ్ళ వయసులో చెప్పిన ప్రబంధం నాగ్నజితీ పరిణయం. శారదాంబ సంగీత సాహిత్య వేత్త, సాంఘికన్యాయాన్ని ఆకాంక్షించిన సంస్కర్త, న్యాయవాది అయిన దాసు శ్రీరాములుగారి కూతురు. ఆరుగురన్నల చెల్లెలు. స్త్రీవిద్యాభిమాని అయిన శ్రీరాములుగారు బిడ్డకు సంస్కృత తెలుగు సాహిత్యాలు చెప్పించటమే కాక, సంగీతంలోనూ శిక్షణ ఇప్పించారు. తొమ్మిదేళ్లకే సంగీత కచేరీలు ఇవ్వగలిగిన స్థాయికి చేరింది. పదునాలుగేళ్లకే పద్యరచన ప్రారంభించింది. మాధవ శతకం ఆమె మహిళాభ్యుదయ దృక్పథానికి సంబంధించిన రచన కాగా నాగ్నజితీ పరిణయం ఆమె ప్రాచీన సాహిత్య పాండిత్య గరిమకు నిలువుటద్దం. శారదాంబ ఇంటి పేరు పెళ్లి వల్ల వేమూరి అయింది. వేమూరి రామచంద్రరావు ఆమె భర్త. 1888లో వాళ్ళ పెళ్లి అయింది. అప్పటికి శారదాంబ వయసు ఏడేళ్లు. మరొక ఐదారేళ్లకు కాపురానికి పోయిందనుకొన్నా ఆమె సంసార జీవితం ఐదారేళ్లను మించదు. కాపురానికి వెళ్లిన కాలం, కవితా వ్యవసాయం ప్రారంభించిన కాలం దాదాపు ఒకటే. తొలి చూలు ఆడపిల్ల దుర్గాంబ. మలి చూలు మగబిడ్డ పార్థసారథి. ఈ ప్రసవంలోనే ఆమె మరణించింది. నాగ్నజితీ పరిణయం కృతి భర్త పార్థసారథి. చెన్నైలోని పార్థసారథి కోవెల దేవుడు ఆయన. భర్తతో మద్రాసులో కాపురమున్న కాలంలో శారదాంబ ఈ కావ్యం రాసి ఉంటుందని భావిస్తున్నారు. కూతురి అకాల మరణాన్ని ప్రస్తావిస్తూ దాసు శ్రీరాములుగారు శ్రీ దేవీ భాగవతములో రాసిన ఒక సీస పద్యాన్ని బట్టి నాగ్నజితీ పరిణయం ఆమె 16వ ఏట రాసినట్లు తెలుస్తున్నది. అంటే అది 1896 కావాలి. మాధవ శతకాన్ని ఆయన ప్రస్తావించలేదు. కనుక దాని రచనాకాలం తెలియదు. 14వ ఏట నుండి ‘ముద్దుముద్దుగా అల్లిబిల్లిగా పద్యమల్లటం’ నేర్చినదని తండ్రి చెప్పిన మాటను బట్టి ఆ అల్లిక శతక పద్య మాలిక అయినట్లు ఊహించవచ్చు. అది ఆమె మరణాంతరం 1901లో శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారి సంపాదకత్వంలో వచ్చిన కళావతి మాసపత్రికలో మూడు భాగాలుగా అచ్చయింది. నాగ్నజితీ పరిణయం అయినా ఆమె జీవించి ఉండగా అచ్చయిందో లేదో తెలియదు. ప్రచురణకాలం, తదితర వివరాలు ముద్రించిన పుటలు లేని ప్రతి మాత్రమే లభ్యమైంది. దాసు శ్రీరాములుగారి వంశవారసులు పూనుకొని మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితిని ఏర్పాటు చేసి ఆయన సాహిత్యంతో పాటు శారదాంబగారి ఈ రెండు రచనలు సేకరించి పునర్ముద్రించారు. స్త్రీల సాహిత్య చరిత్రలో వేమూరి శారదాంబ పేరు జారిపోకుండా ఆంధ్రకవయిత్రులులో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కూర్చిపెడితే, స్త్రీల సాహిత్య అధ్యయనానికి ఈ విధంగా అరుదైన వనరులు సమకూర్చి పెట్టినవారు డాక్టర్ దాసు అచ్యుతరావుగారు. నాగ్నజితీ పరిణయము మూడాశ్వాసాల ప్రబంధం. పద్యాలు, వచనాలు కలిపి 231 ఉన్నాయి ఈ కావ్యంలో. మూడు ఆశ్వాసాల చివర పునరావృతమయ్యే ఒక పద్యంతో కలిపితే ఆ సంఖ్య 232 అవుతుంది. ఆ పద్యం ఇది. భాసురమైన నీ వెడదవక్షమునందున శ్రీ వెలుంగగా దాసుల కే కొఱంత సతతమ్మును సంతస మూరి శోభితా వాసులుగారె విశ్వపరిపాలన సుందరరామ శారదా భ్రాసమకీర్తిపూరిత దిగంతరవైభవచంద్ర మాధవా. మాధవుడిని సంబోధించే స్తుతి రూపకమైన ఉత్పలమాల పద్యం ఇది. నీ వక్షస్థలంపై లక్ష్మి విలసిల్లుతుండగా భక్తులకు ఏ కొరతా లేదు. అంతటా సంతోషమే అని చెప్పటం, విశ్వాన్ని పాలించే సుందర రాముడని, వైభవ చంద్రుడని మాధవుడిని స్తుతించటం ఇందులో విషయాలు. అంతే అయితే ఇది సాధారణ పద్యం. ఇందులో శారదాంబ తన భర్త పేరును నాలుగు పంక్తులలో గర్భితం చేసి చెప్పటం విశేషం. ప్రతి పాదం చివరి రగణంలో మొదటి రెండక్షరాలు శారదాంబ భర్త వేమూరి రామచంద్రరావు పేరులోని (రావు అన్న తుది భాగాన్ని మినహాయించి) భాగాలను వరుసగా సూచిస్తాయి. గౌరవ చిహ్నమైన శ్రీ-తో ప్రారంభించి వె- అన్న అక్షరాన్ని కలుపుకున్న భాగాన్ని మొదటి పాదంలో, మూరి- అన్న భాగాన్ని రెండవ పాదంలో, రామ- అన్న భాగాన్ని మూడవ పాదంలో, చివరి పాదంలో చంద్ర- అన్న భాగాన్ని చూడవచ్చు. మాధవ శతకం కూడా ఈ పద్యంతోనే ముగియటం గమనించదగినది. కావ్య పద్ధతి 19వ శతాబ్ది కవయిత్రి వేమూరి శారదాంబ నాగ్నజితీ పరిణయ రచన మధ్య యుగాలలో స్థిరపడిన కావ్యనిర్మాణ పద్దతిలో సాగింది. ప్రథమాశ్వాసంలో మొదటి 10 పద్యాలు కావ్యావతారిక వంటివి. ఇష్టదేవతా స్తుతి, కృతి భర్తను నిర్దేశించుకొనటం ఇందులో ప్రధానం. విష్ణువు, లక్ష్మి, శివుడు, పార్వతి, బ్రహ్మ, సరస్వతి, వినాయకుడు సత్యవాక్కును, భద్రతను ఇచ్చి రక్షించాలని కోరుకొంటుంది. తన కృతిని కన్యగా సంభావించి ‘తిరువలిక్కేణి దివ్యమందిరములోన/ నింతి రుక్మిణితో సుఖియించుచున్న /నంద సుతుడైన సచ్చిదానంద మూర్తి’ని కృతి భర్తగా ఎంచుకున్నది. ఆ తరువాత ఉన్న పద్యం ప్రత్యేకంగా పరిశీలించదగినది. స్త్రీల కావ్యావతారికలలో మాత్రమే అటువంటి పద్యాలు కనబడతాయి. ఎన్నఁగల పొత్తములనేమిఁ గన్నదాన విన్నదాననుఁగాను నే నెన్నఁడైనఁ గన్నవారెల్లఁ గరుణనిందున్నయట్టి యన్ని తప్పుల క్షమియింతురని తలంతు ఏనాడూ చెప్పుకోదగిన పుస్తకాలేమీ చూచినదాన్ని గాను, విన్నదానను గాను, ఈ కావ్యం చూచిన వాళ్ళెవరైనా దయతో ఇందులోని తప్పులన్నీ క్షమిస్తారని తలుస్తాను, అని శారదాంబ వినయంగా పాఠకోత్తములను, పండితులను కోరుకొన్నది ఈ పద్యంలో. ఏ మొల్ల కవితా శైలి అలవడిందని శారదాంబను మెచ్చుకొంటారో ఆ మొల్లనుండి మొదలు పెట్టి ఏ కవయిత్రి అయినా పాఠకోత్తములకు ఈ రకంగానే విన్నపాలు చేసుకొన్నది. మొల్ల తనకు తెలుగు సంస్కృత భాషలు, పద సంపద, వ్యాకరణ ఛందో అలంకార శాస్త్రాలు–ఏవీ తెలియవని, తన కవిత్వంలో తప్పులెంచవద్దని సాటి కవులను కోరింది. తరిగొండ వెంగమాంబ కూడా తాను గురువుల వద్ద చదువుకోలేదని, ఛందస్సు తెలియదని, కావ్య నాటక అలంకార శాస్త్రాల గురించి వినను కూడా లేదని, ఇతిహాసపురాణాలు చదవలేదని పేర్కొనటమే కాదు తనది బాలభాష అంటుంది. ‘నా తప్పొప్పులే రీతిగానైనా గెలిసేయక చిత్తగింపవలయు’నని కోరింది. 16వ శతాబ్ది నుండి మూడువందల ఏళ్ళు ముందుకు వచ్చినా, సాహిత్యరంగంలో మహిళా కవుల మాట వరుస మారలేదంటే సాహిత్య సామాజిక రంగాలు యథాపూర్వకంగా పురుషుల రంగాలుగా ఉండటం వల్లనే. నన్నయ నుండి ఏ పురుష కవి అయినా తమ ప్రతిభా పాండిత్యాల గురించి చెప్పుకొన్నవాళ్ళే గానీ ఇలా తమకేమీ తెలియదని చెప్పుకోలేదు. తప్పులే చేయము అన్న ధిషణాశక్తిపరులు కనుక క్షమించమని కోరే ప్రసక్తే లేదు. ఏ పాండిత్యం లేకుండా కావ్యాలు రాయటం స్త్రీలకు మాత్రం సాధ్యమా అంటే కాదు అనే సమాధానం. వేళ్ళ మీద లెక్కించదగిన సంఖ్యలో మాత్రమే ఉన్న మహిళా కవులు అల్పసంఖ్యాక వర్గంగా పురుషులదైన కావ్య ప్రపంచంలోకి బెదురుబెదురుగా ప్రవేశిస్తున్నారనటానికి, వాళ్ళను ప్రసన్నం చేసుకొనటానికి వాళ్ళకంటే తామెందులోనూ అధికులం కామని నమ్మబలికి వారి దయను పొందటానికి తాపత్రయ పడుతున్నారనటానికి నిదర్శనం. ఇదంతా కవులుగా తమ అస్తితను చాటుకొనే అవకాశాలను కల్పించుకొనటంలో భాగమే. శారదాంబ ఆ వరుసలోని కవయిత్రే. మన ఇతిహాస పురాణ కావ్య ప్రబంధ సాహిత్యరచన అంతా సూతుడు శౌనకాది మహామునులకు చెప్పిన క్రమాన్నో, శుకుడు పరీక్షిత్తునకు చెప్పిన క్రమాన్నో, వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన క్రమాన్నో ప్రస్తావించి ఆ ప్రత్యేక క్రమంలో తాము రాస్తున్నట్లు ఆయా కవులు పేర్కొనటంగా ఉంటుంది. అదొక పద్ధతి. రాసే కవి సర్వానికి తానే కర్తనని అహంకరించకుండా పరంపరాగత మానవానుభవాలను ప్రజలకు అనుస్యూతంగా అందించే సాంస్కృతిక రాయబారిగా తనను తాను వ్యక్తీకరించుకొనటం ఈ పద్దతిలోని ఒక అందం. ఆ వరుసలోనే శారదాంబ తాను ఒనర్పం బూనిన నాగ్నజితీ పరిణయము కథా క్రమం ‘శుక మహర్షి పరీక్షిన్నరేంద్రున కెరింగించిన తెఱంగు’ అని చెప్పుకొన్నది. నాగ్నజితి శ్రీకృష్ణుడి అష్టభార్యలలో ఒకతె. నగ్నజిత్తుడి కూతురు కనుక ఆమె నాగ్నజితి. శ్రీకృషుడితో ఆమె వివాహమైన తీరు ‘నాగ్నజితీ పరిణయము’ కావ్య కథా విషయం. వేమూరి శారదాంబ కంటే పూర్వం ఈ ఇతివృత్తంతో కావ్యాలు రాసిన వాళ్ళు ముగ్గురు. రాజవోలు సుబ్బారాయుడు, వల్లూరి నరసింహ కవి, వెలిదండ్ల అళగిరి. శారదాంబ సమకాలికులు ముగ్గురు. మాడభూషి నరసింహాచార్యులు, శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి, శ్రీనివాసాచార్యులు. శారదాంబతో కలిసి ఏడుగురు. ఒకే విషయాన్ని ఏడుగురు ఎట్లా కవిత్వం చేశారు? కావ్యాలల్లారు? పోల్చి చూచి గుణగణాలను అంచనా వేయటం అది వేరే సంగతి. వీళ్ళ ఎవరికైనా మూల కథావనరు భాగవతమే. భాగవతం పురాణం. పురాణేతిహాస కథలను ప్రబంధాలుగా పెంచి రాసే పద్ధతి మను, వసు చరిత్రల కాలానిది. ఆ మార్గంలోనే వేమూరి శారదాంబ భాగవత పురాణంలోని నాగ్నజితీ పరిణయ కథను పెంచి ప్రబంధం చేసింది. భాగవతం దశమస్కంధం ఉత్తరభాగంలో 126 నుండి 144 వరకు 19 గద్యపద్యాలలో ఉన్న కథ ఇది. శ్రీకృష్ణుడి ఎనిమిదిమంది భార్యలలో ఆరవ ఆమె నాగ్నజితి. ఆమె అసలు పేరు సుదంత. శ్రీకృష్ణుడి పెళ్లిళ్లు దశమస్కంధం పూర్వభాగం చివర రుక్మిణీ కల్యాణంతో ప్రారంభమై ఉత్తర భాగంలో కొనసాగుతాయి. రుక్మిణీ కళ్యాణం తరువాత వివరంగా చెప్పబడిన పెళ్లికథలలో లక్షణా పరిణయం తరువాతది నాగ్నజితీ పరిణయం. స్వయంవరానికి వీరత్వ నిరూపణ షరతుగా ఉండటం, శ్రీకృష్ణుడి విజయం, వైభవోపేతంగా వివాహం, భారీగా కట్నకానుకల చెల్లింపు రెండు పెళ్ళిళ్ళలోనూ సామాన్యమే. అయితే శారదాంబను ఆకర్షించిన అంశం ఏమిటోగానీ నాగ్నజితీ పరిణయ గాథను కావ్యరచనా విషయంగా స్వీకరించింది. ఆధునిక యుగపు ఆలోచనలకు తీసిన తెర కోసలపుర రాజైన నగ్నజిత్తు, ఆయన భార్య మోహనాంగి సంతానం లేదని బాధపడుతూ, నారదుడి బోధతో సంతానగౌరీ వ్రతం చేసి ఒక కొడుకును, ఒక కూతురిని కనటం, పెరిగి పెద్దదయిన కూతురు సుదంతకు తగిన మగడి కోసం వెతుకుతుండగా నారదుడు వచ్చి శ్రీకృష్ణుడే ఆమెకు తగిన భర్త అని చెప్పి కొన్నిరోజులలో నగరానికి వచ్చి తోటలూ దొడ్లూ పాడుచేసే ఏడు వృషభాలను పట్టి కట్టిన ధీరునకు కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వేస్తే కృష్ణుడు వచ్చి ఆ పని సాధించి సుదంతను పెళ్లాడతాడని చెప్పి వెళ్ళటం శారదాంబ కావ్యకథా నిర్మాణంలో మొదటి అంతస్తు. నగరానికి వచ్చిన శ్రీకృష్ణుడిని చూచి భాగవత సుదంత మాధవుడిని తనకారాధ్యుడైన నాథుడుగా కోరుకొన్నదన్న మాటను పట్టుకొని తండ్రి దగ్గర నారదుడు కృష్ణుడి గురించి చెప్పిన విషయాలు విని నాగ్నజితి మనసు కృష్ణుడిపై లగ్నమైనట్లు, ఆమె విరహ వ్యధ చూడలేక సుదంత చెలికత్తె ఇందుమతి యోగి వేషంలో ద్వారకకు వెళ్లి ఆ వార్త శ్రీకృష్ణుడికి చేరవేసినట్లు శారదాంబ దానిపై పెద్ద అల్లికపని చేసింది. కృష్ణుడు కొమ్ములు వంచి పట్టితెచ్చి స్తంభాలకు కట్టివేసిన ఏడు ఎద్దులు పరమశివుడి శాపం పొందిన కుబేర అనుచరులన్న కల్పన కూడా అదనమే. అస్థిపంజరం వంటి భాగవత కథను మాంసలం చేసి జీవవంతం చేసింది శారదాంబ. ఈ క్రమంలో కావ్య లక్షణాలుగా దండి చెప్పిన అష్టాదశ వర్ణనలలో నగర వర్ణన, ఉద్యానవన వర్ణన, సూర్యాస్తమయ వర్ణన, ఋతు వర్ణన, విరహ వర్ణన, వివాహ వర్ణన, కుమారోదయ వర్ణన, నాయకాభ్యుదయం వంటి వాటికి అవకాశం కల్పించుకొన్నది శారదాంబ. నగర వర్ణనలో భౌగోళిక విశేషాలు, జలవనరులు, తోటలు, పంటపొలాలు, పశు సంపద మొదలైన వాటితో పాటు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల వారి వర్ణన సర్వసాధారణం. శారదాంబ ప్రత్యేకత ఆ నగర ఇల్లాళ్లను వర్ణించటం. ఆధునిక స్త్రీ సహజ ఆత్మ చేతన నుండి నగరం అన్న తరువాత మహిళలు ఉండరా? వాళ్ళను ఎందుకు ప్రధాన స్రవంతి జనం నుండి మినహాయించారు? అన్న కొత్త ప్రశ్నలతో సంప్రదాయ నగర వర్ణనకు ఆమె చేసిన కొత్త చేర్పు ఇది. ఆ ఇల్లాళ్లు పతిని దైవంగా పూజించేవాళ్ళు, అత్తమామలయందు అణకువ చూపేవాళ్లు, బంధుమిత్రులను ఆదరించేవాళ్లు, బీదవాళ్ళను ఆదరించేవాళ్లు, పనులకు బద్ధకించనివాళ్ళు అని ఆమె చేసిన వర్ణన సంప్రదాయ స్త్రీ నమూనాకు భిన్నమైందేమీ కాదు. అది వేరే సంగతి. అయినా సంగీత సాహిత్య విద్యలు తెలిసినవాళ్లుగా వాళ్ళను పేర్కొనటం మాత్రం ఆమె ఆధునిక దృష్టిని సూచిస్తుందని చెప్పక తప్పదు. సుదంత పెరిగిన తీరు వివరించే పద్యాలలో అది మరింత స్పష్టంగా రుజువైంది. పురాణ ప్రబంధాలలో బాలికలను వర్ణించే వేళ బొమ్మల పెళ్ళిళ్ళు చేయటం, చిలకలకు పాఠాలు చెప్పటం, పాటలు పాడటం, వీణ వాయించటం, బొమ్మలు గీయటం, తరచు వాళ్ళ కార్యకలాపాలుగా చెప్పబడ్డాయి. నగ్నజిత్తు కూతురైన సుదంత కూడా ఇవి చేస్తూనే పెరిగింది. అంతవరకే చెప్తే శారదాంబ గురించి చెప్పుకోవలసిందేమీ లేదు. అంతకు మించి సుదంత ‘…మృదు కావ్యములన్ బఠియింప నేర్చెగా/ పూని సునీతిమంతములఁ బొత్తములన్ రచియింపనేర్చె…’ నని చెప్తుంది కవయిత్రి. కావ్య పఠనా రచనాదులు శారదాంబ అనుభవ విషయాలు. ఆడపిల్లలు అవి నేరుస్తూ పెరగటాన్ని ఆధునిక సంస్కరణ దృక్పధం నుండే ఆమె సంభావించింది. నాగ్నజితీ పరిణయము కావ్యం ముగింపులో భాగవత మూలానికి భిన్నంగా శారదాంబ చేసిన ఒక మార్పు ప్రత్యేకం పరిశీలించదగినది. శ్రీకృష్ణుడు భార్యలందరి పట్ల సమతాభావంతో మెలిగాడని చెప్పిన భాగవతమే ఆయన ‘సత్యభామా ప్రియకరుడ’ని చెప్తుంది. నాగ్నజితీ పరిణయ కథకు ముగింపుగా ఉన్న ‘ఇట్లు హరి నాగ్నజితిo బెండ్లియాడి యరణముల పుచ్చుకొని, ద్వారకా నగరంబునకు వచ్చి సత్యభామతో గ్రీడించుచుండె’ అన్న వాక్యం అదే సత్యమని, సమత్వం భ్రమ అని స్పష్టం చేయనే చేసింది. నాగ్నజితిని పెళ్ళాడి రావటం ఏమిటి? సత్యభామతో క్రీడించటం ఏమిటి? ఈ అసంబద్దత నాగ్నజితికే కాదు, ఆత్మగౌరవం కల ఏ స్త్రీకి అయినా అవమానకరమైనదే. ఈ స్పృహ మెండుగా ఉండటం వల్లనే శారదాంబ ‘… జగములెల్ల/ నేలుచును దంపతులు సుఖియించి రెలమి’ అని నాగ్నజితీ శ్రీకృష్ణుల దాంపత్య జీవితం గురించే చెప్పి ఈ కావ్యాన్ని ముగించింది. ఆ రకంగా సంప్రదాయ కథలను ఆ చట్రంలోనే అయినా సంస్కరణోద్యమ ప్రభావంతో, సామాన్య లౌకిక స్వీయ జీవితానుభవ జ్ఞానం నుండి, అభివృద్ధిచెందిన ఆధునిక దృష్టి కోణంతో స్త్రీలు మార్చి రాయటానికి చేసిన ప్రారంభ ప్రయత్నాలకు ఈ నాగ్నజితీ పరిణయ కావ్యం ప్రాతినిధ్యం వహిస్తుంది. సరళ సుందరమైన పద్య రచన, కథనరీతి శారదాంబ కావ్యలక్షణం. పందొమ్మిదవ శతాబ్ది చివరి భాగంలో తెలుగు కవితాకాశంలో మెరుపై మెరిసిన శారదాంబ వారసత్వం 20వ శతాబ్దిలోకి ఎంతగా విస్తరించిందో ఇలాంటి కవులను వెలుగులోకి తెచ్చి అధ్యయనం చేసే క్రమంలో అర్ధం అవుతుంది.
ప్రతి వర్షపాతం ప్రతి మండలంలో డిప్యూటీ తహశీల్దార్ చేత ఉదయం 8.30 గంటలకు కొలుస్తారు మరియు తహసిల్ కార్యాలయంలో గుర్తించబడింది. సంబంధిత ఎంపిఎస్‌ఓ రోజువారీ వర్షపాతాన్ని జిల్లా కార్యాలయానికి నివేదిస్తుంది. జిల్లా స్థాయిలో ప్రతిరోజూ వర్షపాతం యొక్క విశ్లేషణలను తీసుకొని డైరెక్టరేట్ మరియు సంబంధిత అధికారులకు క్రమం తప్పకుండా తెలియజేస్తారు. TSDPS: వర్షపాతం, గాలి వేగం, పవన దిశ, పీడనం, తేమ మరియు ఉష్ణోగ్రతను సేకరిస్తుంది, ఇది ప్రతి గంట గంట వ్యవధిలో కావలసిన ప్రదేశంలో గ్లోబల్ రేడియేషన్ మరియు నేల తేమను కొలుస్తుంది మరియు GSM సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి SMS రూపంలో ప్రసారం చేస్తుంది. http://tsdps.telangana.gov.in డేటా సరైన ప్రణాళిక మరియు అమలు o కోసం వాటాను హోల్డర్స్ వాడుకుంటున్నాయి f విభిన్నంగా ఉండుట ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు. జిల్లాల్లోని వివిధ పంటలకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యుబిసిఐఎస్) అమలు కోసం అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా కూడా AWS డేటాను ఉపయోగిస్తోంది. కాలానుగుణ పరిస్థితులు: ఒక ll MPS యొక్క Os Mandals వారం (ప్రతి బుధవారం సిద్ధం చేస్తుంది ) మరియు మంత్లీ న (ఎ) వర్షపాతం (బి) ఏరియా రంలో వివరముల కాలానుగుణ పరిస్థితులపై నివేదిక వరకు వారం (సి) ప్రజారోగ్యంపై సమాచారం, పశువుల పరిస్థితి, తాగు లభ్యత నీరు (డి) ఆహార ధాన్యాలు మరియు పశుగ్రాసం లభ్యత . కత్తిరించిన ప్రాంత వివరాలు: (2) asons తువులకు, అంటే, ఖరీఫ్ మరియు రబీలకు వ్యవసాయ సారాంశాలను తయారు చేయడానికి అన్ని ఆహార మరియు ఆహారేతర పంటల విస్తరించిన విత్తనాల బొమ్మల సేకరణ . జిల్లాలోని అన్ని మండలాల నుండి గరిష్ట పంటకోత కాలంలో వ్యవసాయ హార్వెస్ట్ ధరల సేకరణకు ఉపయోగించే ప్రాంతం నాటిన వివరాలు . వ్యవసాయ గణాంకాల సకాలంలో రిపోర్టింగ్ (TRAS): ప్రతి సంవత్సరం TRAS కింద ప్రతి మండలంలో 20% గ్రామాలను ఎన్నుకోవాలి మరియు సంబంధిత మండలాలకు తెలియజేయాలి . ఎంపిక గ్రామాలు ప్రాంతంలో వివరముల కత్తిరించే లో sh లో అమర్చిన సూత్రీకరణ pahanies AEO ద్వారా s మరియు ట్రాస్ కార్డులు లో అమర్చు. ఈ పథకంలో (4) అన్ని పంటల విస్తీర్ణంతో కూడిన TRAS కార్డులు ప్రస్తుత సీజన్ మరియు అంతకుముందు సంవత్సరం నాటిన రెండు సీజన్లలో సేకరించిన మరియు DE & S కి సమర్పించిన గణాంకాలను. సాధారణ పంట అంచనా సర్వేలు (జిసిఇఎస్): పంట అంచనా సర్వేల లక్ష్యం పంట కోత ప్రయోగాలు నిర్వహించడం ద్వారా హెక్టారుకు సగటు దిగుబడి (ఉత్పాదకత) మరియు సూత్రప్రాయ పంటల మొత్తం జిల్లా స్థాయిలో అంచనాలను పొందడం. జిల్లాలోని ప్రతి పంట పరిధిలోని ప్రాంతానికి అనులోమానుపాతంలో నమూనా పరిమాణం నిర్ణయించబడుతుంది. TRAS కింద ఎంచుకున్న గ్రామాల్లోని ప్రతి మండలంలో ఆహారం మరియు ఆహారేతర పంటలపై పంట కోత ప్రయోగాలు నిర్వహించబడతాయి. ధరల సేకరణ: మండలాలు మరియు డివిజనల్ ప్రధాన కార్యాలయాల నుండి వివిధ స్థాయిలలో ద్రవ్యోల్బణాన్ని సంకలనం చేయడానికి రోజువారీ, వార, నెలవారీ ప్రాతిపదికన ధరలు సేకరించబడ్డాయి . GSDP యొక్క అంచనాలో ధర గణాంకాల సేకరణ చాలా ముఖ్యమైన పరామితి. (ఎ) నిత్యావసర వస్తువులు (బి) ప్రతి సీజన్‌లో వ్యవసాయ ధరలు (సి) వ్యవసాయం మరియు వ్యవసాయేతర కార్మికుల వేతనాలు (డి) పశువుల టోకు ధరలు మరియు ప్రత్యక్ష స్టాక్ ఉత్పత్తుల ధరలు (ఇ) నిర్మాణ సామగ్రి ధరలు వంటి వివిధ అంశాలపై ధరలు సేకరించబడుతున్నాయి. .
రాజకీయాల్లో మాత్రమే కాదు.. ప్రజల్లో కూడా సెంటిమెంట్లు చాలా బలమైన పాత్ర పోషిస్తాయి. చంద్రబాబు పాలనలో వర్షాలు కురవవు అనే సెంటిమెంట్ ఎలా ప్రచారంలోకి వచ్చిందో.. ఇప్పుడు జగన్ పాలనపై అదే తరహాలో మరో సెంటిమెంట్ వ్యాపిస్తోంది. August 23, 2020 at 3:58 PM in Latest News, Politics Share on FacebookShare on TwitterShare on WhatsApp (విశాఖపట్నం నుంచి లియోన్యూస్ ప్రతినిధి) ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖను పరిపాలన రాజధానిగా కొత్త ప్రభుత్వం ప్రకటించాక జరుగుతున్న వరుస పరిణామాలు ప్రజల్లో ఒక రకమైన సెంటిమెంట్‌కు దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో విశాఖలో జరుగుతున్న వరుస ప్రమాదాలు ఇందుకు కారణమవుతున్నాయి. విశాఖలో కుప్పలు తెప్పలుగా ఉన్న పరిశ్రమలున్నాయి. తూర్పు నావికా దళ ప్రధాన కార్యాలయం, dockyard, NAD, NSTL లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇక్కడ నెలకొన్నాయి. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం విశాఖ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన వెంటనే ప్రతిపక్షాలు సంధించిన మొదటి ప్రశ్న ‘భద్రత’? ప్రశాంతమైన విశాఖ నగరంలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? సువిశాల తీర ప్రాంతం ఉన్న విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నెలకొల్పడం వల్ల- సునామీ, భూకంపం లాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రమాద తీవ్రత, నష్టం ఎలా ఉంటుందనే అంశం ఇటీవల తెరపైకి వచ్చింది. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు… రాజధాని ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రజల్లో ఆందోళన రేకెత్తించడం లో రాజకీయ పక్షాలు ముందువరుసలో నిలబడ్డాయి. ఇటువంటి వాదప్రతివాదనలు జరుగుతున్న తరుణంలో… విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటన యావత్ దేశ ప్రజల దృష్టిని ఇటు వైపు మళ్లించింది. ఈ ప్రమాదంలో 13 మంది మృత్యువాత పడగా, వందల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం, క్యాబినెట్ మంత్రులు మూడు రాజధానులు అంశాన్ని హైలెట్ చేస్తున్న ప్రతి సందర్భంలోనూ విశాఖ లోని ఏదో ఒక పరిశ్రమలో ఏదో ఒక దుర్ఘటన జరుగుతూనే ఉంది. ఇది కాస్త ఒక రకమైన సెంటిమెంట్ కు దారితీస్తుందని అనేక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విశాఖ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండు మూడు నెలల్లో అనేక ప్రమాదాలు జరగడమే ప్రధాన కారణం. ఎల్జి పాలిమర్స్, హిందుస్థాన్ షిప్ యార్డ్ సంస్థలకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ రెండు పరిశ్రమల్లోనూ గతంలో ఎన్నడూ చోటు చేసుకోని దుర్ఘటనలు సంభవించాయి. విశాఖను అభివృద్ధి చేస్తామని, విశాఖ అభివృద్ధి చంద్రబాబు అడ్డుకుంటున్నారని, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అధికార పార్టీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి మరీ నిందించిన ప్రతిసారి విశాఖలో ఏదో ఒక దుర్ఘటన జరుగుతూనే ఉంది. ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత ఫార్మాసిటీలో వరుసగా రెండు ప్రమాదాలు సంభవించాయి. అచ్యుతాపురంలో మరో సంఘటన… అది మరువకముందే హిందుస్థాన్ షిప్ యార్డ్ లో క్రేన్ కూలిపోయి పది మంది దుర్మరణం పాలయ్యారు. అలాగే షీలా నగర్ లోని ఓ కంటైనర్ సంస్థలోనూ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తేనే ఇంత అనర్థం జరుగుతోంది… పాలనా ప్రక్రియ ప్రారంభం అయితే మన పరిస్థితి ఏంటి? అన్న అనుమానం చాలామందిలో ఇటీవలకాలంలో వ్యక్తమవుతోంది. శాస్త్రీయంగా ఈ వాదన నిలబడదు. కానీ కొందరిలో అలాంటి సెంటిమెంట్ ఏర్పడుతున్నదాన్ని కాదనలేం. సెంటిమెంట్ ను కాదని వితండవాదం చేయడం కూడా సమంజసం కాదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు కురవవు అని.. అనావృష్టి తప్పదని సెంటిమెంట్ ప్రజల్లో ఉండేది. ఆ అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ కూడా బాగానే ప్రచారం చేసేది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాలనలోనూ మరో రకమైన సెంటిమెంట్ బలపడుతోంది. విశాఖ పారిశ్రామిక రంగంలో వరుస ప్రమాదాలు జగన్ పాలన పై… గుంటూరు రమేష్ హాస్పిటల్ ప్రమాదం వంటివి అటువంటి సెంటిమెంట్ కే దారితీస్తున్నాయి. ఈయన పాలనలో అన్ని అనర్థాలే… అన్న సెంటిమెంట్ కు తెర లేపుతున్నాయి. పరిపాలన రాజధాని ప్రకటనకే ఇన్ని విపత్తులు సంభవిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో? అన్న ఆందోళన, భయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
కమర్షియల్ ఫార్మాట్ లోనే ఎంతో కొంత కొత్తదనం చూపించే దర్శకుడు మారుతి. మిడ్ రేంజ్ సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో చిన్న చిత్రాలు కూడా చేస్తుంటాడు. మారుతి ప్రతిరోజూ పండగే వంటి సూపర్ హిట్ తర్వాత చేస్తోన్న చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఈ సినిమాను చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేసాడు. - Advertisement - మంచు రోజులు వచ్చాయి విడుదలకు సిద్ధమైంది. ముందుగా దసరాకు విడుదల చేద్దామనుకున్నా కానీ ఇప్పుడు దీపావళికి విడుదల కాబోతోంది. నవంబర్ 4న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ట్రైలర్ వంతు. ఈరోజు నుండి దసరా సందర్భంగా ప్రమోషన్స్ ను షురూ చేసారు. అలాగే రేపు అంటే అక్టోబర్ 14న ఉదయం 9 గంటలకు మంచి రోజులు వచ్చాయి ట్రైలర్ ను విడుదల చేస్తున్నారు. ఏక్ మినీ కథ చిత్రంతో పాపులర్ అయిన సంతోష్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా చేయగా మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్, ఎస్కెఎన్ సంయుక్తంగా నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. టీజర్ తో ఇది ఒక ఫన్ రైడ్ అన్న భావన కలిగింది. మరి ట్రైలర్ తో అంచనాలు పెరుగుతాయో లేదో చూద్దాం.
Jun 28, 2022 foods for sleep, healthy sleep, healthyfoods, insomnia, Sleep, sleep quality, sleepdisorders, అశ్వగంధ, గుమ్మడికాయ గింజలు Please Share It Better Sleep : మీరు నిద్రతో పోరాడుతున్నారా? ముగ్గురిలో ఒకరికి నిద్ర సమస్యలు ఉన్నాయి – మరియు ఇది మహిళలకు అధ్వాన్నంగా ఉంటుంది. కాబట్టి, నిద్రలేమిని అధిగమించి మిమ్మల్ని నిద్రలోకి పంపే మొదటి ఐదు ఆహారాలు ఇక్కడ ఉన్నాయి అశ్వగంధ: అశ్వగంధ యొక్క ప్రధాన క్రియాశీల పదార్థాలు వితనోలైడ్‌లు, ఇవి ఒత్తిడిని తగ్గించే సామర్థ్యంతో సహా అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు. అదనంగా, ఇది సహజంగా ట్రైఎథిలీన్ గ్లైకాల్‌ను కలిగి ఉంటుంది, ఇది నిద్రలేమిని కలిగిస్తుంది. మంచి రాత్రి నిద్ర కోసం మీరు నిద్రవేళకు 30 నిమిషాల ముందు దీన్ని తీసుకోవచ్చు. Also Read : మీ జుట్టు పెరుగుదలను వేగవంతం చేసే ఆహారాలు ? బాదం: బాదంలో ఫైబర్ మరియు మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి, ఇది దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. బాదం మెగ్నీషియం యొక్క మంచి మూలం, ఇది నిద్రను ప్రోత్సహించే మెలటోనిన్‌ను నియంత్రించడానికి అవసరం. మెగ్నీషియం మీ కండరాలను కూడా సడలిస్తుంది. చమోమిలే టీ: ఇది పూర్తి సూపర్ స్టార్. మీకు కావలసిందల్లా కొంచెం గోరువెచ్చని నీరు, ఒక కప్పు మరియు చమోమిలే టీ బ్యాగ్ మీకు తిరగాలని అనిపించని రోజుల్లో. చమోమిలే టీ అనేది అపిజెనిన్‌తో కూడిన చోకో-పూర్తిగా ఉంటుంది, ఇది మెదడులోని గ్రాహకాలను బంధించే యాంటీఆక్సిడెంట్ నిద్రను ప్రోత్సహిస్తుంది. Also Read : ఈ చిట్కాలతో మీ కీళ్లు మరియు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజలు, పెపిటాస్ అని కూడా పిలుస్తారు, ట్రిప్టోఫాన్ అలాగే మంచి మొత్తంలో జింక్ ఉంటుంది, ఈ రెండూ మెదడు మెలటోనిన్‌కు పూర్వగామి అయిన ట్రిప్టోఫాన్‌ను సెరోటోనిన్‌గా మార్చడంలో సహాయపడతాయి. జాజికాయ పాలు: ఒక గ్లాసు నిండా పాలను ఒక చుక్క జాజికాయతో కలిపి తాగడం వల్ల నిద్ర స్థితిని మెరుగుపరుస్తుంది. పాలలో ట్రిప్టోఫాన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉంటుంది, ఇది శరీరంలో సెరోటోనిన్ మరియు మెలటోనిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది, ఈ రెండూ నిద్రను ప్రేరేపించడంలో సహాయపడతాయి.
అను ఇమ్మాన్యూల్ కి ఇప్పటివరకు నటిగా పెద్దగా పేరు రాలేదు. పెద్ద పెద్ద సినిమాల్లో నటించినా ఆమె చేసినవన్నీ కూరలో కరివేపాకు పాత్రలే. అందుకే, అనుకి సరైన గుర్తింపు రాలేదు. ఐతే, ఇప్పుడు చిన్న సినిమా ఆమెకి ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టింది. గతవారం విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’లో ఆమె పాత్ర కీలకం. హీరో, హీరోయిన్ ఇద్దరిదీ సమానమైన పాత్ర. ఒకవిధంగా చెప్పాలంటే హీరో కన్నా బలమైన పాత్ర. ‘ఊర్వశివో రాక్షసివో’కి మంచి రివ్యూస్ వచ్చాయి. కానీ, కలెక్షన్లు మాత్రం లేవు. వసూళ్ల సంగతి ఎలా ఉన్నా.. అను ఇమ్మాన్యూల్ కి పెద్ద సినిమాలతో రాని పేరు ఈ సినిమాతో వచ్చింది. ఆ విధంగా ఆమెకి ఇది పెద్ద ప్లస్. మరి, ఇపుడైనా ఈ బ్యూటీ దశ తిరుగుతుంది. అంతే కాదు, ముద్దుల సీన్లలో హద్దులేని చెరిపేసింది. ఆ విధంగా హాట్ నెస్ లో కూడా తగ్గేదే లే అని ప్రూవ్ చేసింది. సో, ఇటు యూత్ సినిమాలకు బాగా సరిపోతానని ప్రూవ్ చేసింది ఈ 26 ఏళ్ల సుందరి. ప్రస్తుతం ఆమె చేతిలో రవితేజ హీరోగా రూపొందుతోన్న ‘రావణాసుర’ ఉంది. అందులో ఐదుగురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తుంది. సోలో భామగా అవకాశాల కోసం చూస్తోంది.
Khiladi Movie Heroines: ఫిబ్రవరి 11న విడుదలవుతున్న సినిమాల్లో ఎక్కువగా హైప్ క్రియేట్ చేస్తున్న చిత్రం 'ఖిలాడి'. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ విడుదలయినప్పటి నుండి ఇందులో హీరోయిన్స్ గురించి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒకరిని మించి మరొకరు గ్లామర్‌ను ఒలికించారు. ప్రస్తుతం వీరి హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మీనాక్షి చౌదరి కంటే ముందు డింపుల్ హయాతినే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ముందుగా 'గద్దలకొండ గణేష్' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి టాలీవుడ్‌లోని అందరి దృష్టిని ఆకర్షించింది డింపుల్. అప్పటికీ మీనాక్షి ఇంకా మోడలింగ్‌లోనే స్థిరపడింది. డింపుల్ కంటే మీనాక్షినే ముందుగా హీరోయిన్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. 2021లో వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా మీనాక్షికి హీరోయిన్‌గా మొదటి సినిమా. 2017లో విడుదలయిన 'గల్ఫ్' అనే చిత్రం డింపుల్‌కు హీరోయిన్‌గా ఫస్ట్ మూవీ. ప్రస్తుతం వీరిద్దరు రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడిలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఖిలాడి సినిమా ప్రమోషన్స్‌లో డింపులే ఎక్కువ యాక్టివ్‌గా కనిపించడంతో మీనాక్షిది సెకండ్ హీరోయిన్ రోల్ అయ్యింటుంది అనుకున్నారు ప్రేక్షకులు. ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డింపుల్, మీనాక్షి క్యారెక్టర్స్‌కు సమానంగా ప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు రమేశ్ వర్మ స్పష్టం చేశాడు. ఖిలాడి సినిమా వల్ల వీరిద్దరి కెరీర్‌లు మలుపు తిరుగుతాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటికే నాని నిర్మిస్తున్న 'హిట్ 2' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది మీనాక్షి చౌదరీ. కానీ డింపుల్ మాత్రం ఇంకా అవకాశాలు కోసం ఎదురుచూస్తోంది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల చివరి దశలో పార్టీలపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం పెనుగోలు.. K Sammaiah | Feb 21, 2021 | 6:04 AM ఏపీలో పంచాయతీ ఎన్నికల చివరి దశలో పార్టీలపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం పెనుగోలు టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. టీడీపీ బలపరిచిన గ్రామ సర్పంచి అభ్యర్థి సంగెపు జ్యోతి ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. టీడీపీ అధిష్టానం తమను మోసాగించిందని అంటున్నారు జ్యోతి. 14 వార్డు నెంబర్లు పోటీల్లో నుండి బహిష్కరిస్తున్నట్లు వివరించారు. టీడీపీ ఎలక్షన్ లో తమకు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పిన నాయకులు తమను పట్టించుకోలేదని మండిపడ్డ పోటీలోని అభ్యర్థులు. పార్టీ వ్యవహార శైలికి నిరసనగా ఎన్నికలు బహిష్కరిస్తున్నామన్నారు.టీడీపీ వైఖరికి నిరసిస్తూ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేస్తున్నానని కోటా హరిబాబు ప్రకటించారు.
బైడెన్ కంటే ముందే ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోనియా సోటోమేయర్‌ ప్రమాణం చేయించనున్నారు. X అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలు దాటగానే.. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. 127 ఏళ్ల కుటుంబ బైబిలుపై ఆయన ప్రమాణం చేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌.. బైడెన్‌ చేత ప్రమాణం చేయిస్తారు. వాషింగ్టన్‌లోని అమెరికా కాంగ్రెస్‌ భవనం 'క్యాపిటల్‌ హిల్‌'లో ఈ కార్యక్రమం జరగనుంది. బైడెన్ కంటే ముందే ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోనియా సోటోమేయర్‌ ప్రమాణం చేయించనున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని తొలిసారి ఒక మహిళ చేపట్టనున్నారు. భారతీయ మూలాలున్న కమల ఇక మీదట శ్వేతసౌధంలో అత్యంత కీలకపాత్ర పోషించనున్నారు. ఓ రకంగా చెప్పాలంటే పాలన వ్యవహారాల్లో ఆమే కీలకం కానున్నారు. కేపిటల్‌ భవనంపై దాడి కారణంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా 25,000 మంది నేషనల్‌ గార్డ్స్‌తో వాషింగ్టన్‌లో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. మాజీ అధ్యక్షులు, సెనెటర్లు తదితర వెయ్యి మంది ఆహ్వానితులు మాత్రమే హాజరుకానున్నారు. కరోనా కారణంగా బైడెన్‌ ప్రమాణస్వీకారోత్సవం ఒకింత నిరాడంబరంగానే సాగనుంది. ఆహ్వానితులు మాస్కులు, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేశారు. సైనిక వందనం కూడా వర్చువల్‌గానే సాగనుంది. ప్రమాణ స్వీకారాత్సోవం అనంతరం బైడెన్‌, కమలా హారిస్‌లు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం వారు శ్వేత సౌధంలోకి అడుగుపెడతారు. అదే సమయంలో అన్ని రాష్ట్రాల్లోనూ వర్చువల్‌ పరేడ్‌లు నిర్వహిస్తారు. ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రముఖ పాప్‌ సింగర్‌ లేడీ గాగా అమెరికా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. నటుడు టామ్‌ హ్యాంక్స్‌ నేతృత్వంలో రాత్రి 8.30కు ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది. అలాగే ప్రముఖ నటి జెన్నిఫర్‌ లోపెజ్‌, గార్త్‌ బ్రూక్స్‌ల ప్రదర్శనలు కూడా ఉంటాయి.
TIRUPATI, 06 APRIL 2022: On the penultimate day of Sri Kodanda Rama Swamy Brahmotsavams Aswa Vahanam was observed on Wednesday evening. The processional deity of Sri Rama was taken along four Mada streets to bless His devotees on the divine horse carrier which marked the conclusion of vahana sevas. Senior and Junior Pontiffs of Tirumala, Spl Gr DyEO Smt Parvati and others were present. ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI అశ్వవాహనంపై శ్రీరామచంద్రుడి వైభవం తిరుపతి, 2022 ఏప్రిల్ 06: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం రాత్రి స్వామివారు అశ్వ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. రాత్రి 10 గంటల వరకు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ జరుగనుంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వ వాహనాధిరూఢడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామసంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి తరించమని ప్రబోధిస్తున్నాడు. వాహ‌న‌సేవ‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది. « PATANJALI YOGA DARSHANAM TO COMMENCE ON SRI RAMA NAVAMI DAY _ ఏప్రిల్ 10 నుండి తిరుమ‌ల‌లో ప‌తాంజ‌లి యోగ దర్శ‌నం » Total pilgrims who had darshan on 06.04.2022: 68,009
ఈ రోజు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి. ఈ రోజు సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ రోజు పనులలో అవాంతరాలు అధిగమిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనయోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. ఉద్యోగాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ఈ రోజు వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఈ రోజు చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపార,ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి బంధువు ఈ రోజు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి అధికారుల అనుగ్రహం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఈ రోజు ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి. నూతన రుణ యత్నాలు చేస్తారు.ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఈ రోజు ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి. అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఈ రోజు సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన రుణయత్నాలు సాగిస్తారు.
గుంటూరు నగరంలోని రోడ్లు గుంతలమయంగా మారాయి. గతంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం తవ్వి వదిలేసిన రోడ్ల గురించి పట్టించుకోకపోవడంతో పలు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 గోతుల రోడ్డులో బైక్‌ పైనుంచి పడిన వైసీపీ కార్పొరేటర్‌ పొన్నూరు రోడ్డు దుస్థితికి ఈ సంఘటనే ఒక నిదర్శనం గుంటూరు (కార్పొరేషన్‌), నవంబరు 1: గుంటూరు నగరంలోని రోడ్లు గుంతలమయంగా మారాయి. గతంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం తవ్వి వదిలేసిన రోడ్ల గురించి పట్టించుకోకపోవడంతో పలు ప్రధాన రహదారుల పరిస్థితి దారుణంగా మారింది. రాత్రిళ్లు, వర్షాల సమయంలో ఆ రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా.. ఓ వైసీపీ కార్పొరేటర్‌ గోతుల రోడ్డులో బైక్‌పై నుంచి పడి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న ఘటన స్థానిక పొన్నూరు రోడ్డులో మంగళవారం చోటుచేసుకుంది. గుంటూరు నగరపాలక సంస్థ 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ షేక్‌ ఆబిద్‌.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫాకి స్వయానా బంధువు. ఆయన ప్రాతినిఽధ్యం వహిస్తున్న డివిజన్‌ పరిధిలోని పొన్నూరు రోడ్డులో మంగళవారం ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అయితే గోతుల కారణంగా బండి అదుపుతప్పడంతో ఆయన కిందపడిపోయారు. దుస్తులకు బురద కూడా అంటుకుంది. ఇది గమనించిన ఓ యువకుడు పరుగున వచ్చి ఆబిద్‌ను, ఆయన బండిని పైకి లేపాడు. జగనన్న పాలనలో వైసీపీకి చెందిన కార్పొరేటర్‌కి ఈ దుస్థితి ఏర్పడిందంటే.. ప్రజలు నిత్యం ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో ఈ సంఘటనే తెలియజేస్తుంది.
ఓషో (రజనీష్) రచనల్లో ' ఆనందం' (osho - joy) ఒకటి.. ఇది సామాన్యమానవుడి అతి చిన్న సందేహాలకు ..మనసు మెచ్చే జవాబులకు ఆలంబనగా నిలుస్తుది ఈ పుస్తకం.. ఆధ్యాత్మిక గందరగోళపు ఎడారిలో ఉన్న నాకు ఇది ఒక ఒయాసిస్ లా కనిపించింది అంటారు ఈ పుస్తక అనువాదకురాలు.. ఆనందంగా జీవించడానికి కావాల్సింది మనిషి అరచేతిలోనే ఉందని అంటారు ఓషో ...సంతోషంగా ఉన్నానని చెపితే ఎందుకు ఎవరు నమ్మరని ప్రశ్నిస్తారు ఓషో. ఓషో జ్ఞానసిద్ధి పొందిన గురువు. ఆత్మజ్ఞానాన్ని మనిషిలో మరింత వృద్దిపరచటానికి వీలైనన్నిమార్గాల ద్వారా కృషి చేస్తున్నారు.. - దలైలామా 'ఆనందం' ముందుమాట...మీ కోసం "మా డాక్టర్ మిమ్మల్ని తప్పనిసరిగా చూడమని చెప్పారు. "ఒక రోగి మానసిక శాస్త్రవేత్తతో అన్నాడు. "ఎందుకో నాకు తెలియదు - సంతృప్తికరమైన వివాహ జీవితం, సురక్షితమైన ఉద్యోగం. చాలామంది స్నేహితులు, బాధలు లేవు." ఉత్సాహంగా నోటు పుస్తకాన్ని అందుకుంటూ "ఈ విధంగా ఎన్నాళ్ళ నుంచి ఉన్నావు అన్నారు మనస్తత్వ శాస్త్రవేత్త." సంతోషంగా ఉండటం నమ్మశక్యం కానిది. మనిషి సంతోషంగా ఉండలేడట. నీ నిరుత్సాహం గురించి, దైన్యం గురించి మాట్లాడితే అందరూ నమ్ముతారు. అది సహజం అనిపిస్తుంది. నీ సంతోషం గురించి నువ్వు మాట్లాడితే నిన్ను ఎవ్వరూ నమ్మరు - అది అసహజంగా అనిపిస్తుంది. 40 సంవత్సరాలు వేలాది మనుషులతో కలిసి పనిచేసి, వేలాది కలతపడ్డ మనసులను శోధించి మానవ మస్తిష్కం గురించి పరిశోధన చేసిన 'సిగ్మండ్ ఫ్రాయిడ్' సంతోషం కేవలం కల్పన అనే నిర్ణయానికి వచ్చాడు : మనిషి సంతోషంగా ఉండలేడు. కొంతవరకు పరిస్థితులను మెరుగు పరుచుకోవచ్చు. మహా అయితే దుఖాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు, కానీ సంతోషం? అది మనిషి దగ్గర లేదు. ఇది నిరాశావాదంగా ధ్వనిస్తుంది... కాని నువ్వు మానవజాతిని పరిశీలిస్తే అదే నిజం అనిపిస్తుంది. ఒక్క మనుష్యులే సంతోషంగా లేరు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఇది నేను మీకు నా స్వాదికారంతో చెబుతున్నాను. మనుష్యులు పక్షులకన్నా, చెట్లకన్నా, నక్షత్రాలకన్నా సంతోషంగా ఉండగలరు. ఎందుకంటే ఏ చెట్టుకీ, పక్షికీ, ఏ నక్షత్రానికీ లేని చైతన్యం వారిలో ఉంది. మనుష్యులు విపరీతంగా సంతోషంగా ఉండగలరు. చాలా దుఖంతోనూ ఉండగలరు. వారికి ఏది కావాలో నిర్ణయించుకోవడమే. ఈ స్వేఛ్చ అపాయకరమైనది. ఈ స్వేఛ్చ చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే దానికి నువ్వే బాధ్యత వహించవలసి ఉంటుంది. మనిషి స్వేచ్చకి ఎక్కడో, ఏదో తప్పు జరిగింది. మనిషి తలక్రిందులయ్యాడు. మనుష్యులు ధ్యానాన్ని అన్వేషిస్తున్నారు. మీరు సంతోషంగా ఉండడానికి నిర్ణయించుకోలేదు కనుక, ధ్యానం అవసరం అయింది. సంతోషంగా ఉండడానికి నిర్ణయించుకుంటే ధ్యానావశ్యకతే లేదు. ధ్యానం రోగానికి మండులాంటిది. నీకు జబ్బు చేస్తే మందు అవసరం ఉంటుంది. ఒకసారి సంతోషాన్ని కోరుకోవడం మొదలెడితే, సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుంటే ధ్యానం అవసరం ఉండదు. దానంతట అదే మొదలవుతుంది. నువ్వు చేస్తున్న పనిని నువ్వు ప్రేమిస్తే, నీ జీవన విధానాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వు ధ్యానిస్తున్నట్లే. అప్పుడు ఏది నీ మనస్సుని మళ్ళించలేదు. ఏదైనా నీ ఏకాగ్రతని చెదరగొడితే, నువ్వు చేస్తున్న పనిపట్ల నీకు శ్రద్ద లేదన్నది తెలియచేస్తుంది. ధనం, ప్రతిష్ఠ, అధికారం లాంటి అసహజమైన వాటిలోకి మనం మళ్ళింపబడ్డాం. పక్షుల పాటలు వింటుంటే ధనం లభించదు. అలా వినడం వలన అధికారం, ప్రతిష్ఠ లభ్యం కావు. సీతాకోకచిలుకని చూస్తుంటే ఆర్ధికంగా, రాజకీయంగా, సాంఘికంగా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇవన్ని లబ్ధిని చేకూర్చవు కానీ నిన్ను సంతోషపెడతాయి. తనకి సంతోషం కలిగించే వాటితోనే సాగే ధైర్యం నిజమైన మనిషికి ఉంటుంది. అతడు బీదగానే ఉంటాడు. దానిపట్ల అతడు ఎలాంటి అభియోగం చేయడు. అతనికి ఏ విధమైన అయిష్టత ఉండదు. "నా దారి నేను ఎన్నుకున్నాను - పక్షులని, సీతాకోకచిలులకలని, పువ్వులని, నేనే ఎన్నుకున్నాను. నేను ధనికుడిని కాలేను. అయినా ఫరవాలేదు నేను ధనికుడినే. ఎందుకంటే నేను సంతోషంగా ఉన్నాను కనుక" అని అంటాడు. కానీ మానవులు తలక్రిందులయ్యారు. నేను ఎక్కడో చదివాను.. కొన్ని గంటలు వృద్దుడు నది ఒడ్డున కూర్చొని గాలం వేశాడు. ఒక్క చేప కూడా పడలేదు. సీసాల కొద్ది తాగిన బీరు, సూర్యుడి తీవ్రత వలన అతడు కునికిపాటు పడ్డాడు. ఒక పెద్ద చురుకైన చేప గాలానికి తగిలింది. దానికి సంసిద్దుడుగా లేడు. సమతుల్యత లేకపోవడంతో నదిలో పడ్డాడు. ఒక చిన్న కుర్రవాడు జరుగుతున్నదంతా ఆశక్తిగా గమనించాడు. నదిలో నుంచి బయటికి రావడానికి అతడు పెనుగులాడుతున్నప్పుడు, ఆ కుర్రవాడు తన తండ్రిని అడిగాడు. " నాన్నా, ఆ మనిషి చేపను పడుతున్నాడా లేక ఆ చేప మనిషిని పడుతుందా? అని ... మనిషి పూర్తిగా తలక్రిందులయ్యాడు. నువ్వు చేపని పట్టుకోవడం లేదు. చేపే నిన్ను పట్టుకుని లాగుతుంది. ఎక్కడ ధనాన్ని చూసినా నువ్వు నువ్వుగా ఉండడం లేదు. ఎక్కడ అధికారం, ప్రతిష్ఠ చూసినా నువ్వు నువ్వుగా ఉండడం లేదు. అంతా మరచిపోతున్నావు. నీ ఆనందం, నీ సంతోషం, నీ ఆహ్లాదం - సహజ సిద్దంగా ఉండే నీ జీవితపు విలువలు అన్నింటినీ మరచిపోతున్నావు. బయటి నుంచి ఏదో ఎన్నుకునే, నీలో ఉన్న దేనినైనా పోగొట్టుకోవటానికి సిద్దపడుతున్నావు. లోపలిది పోగొట్టుకుని బయటిది పొందున్నావు. పిల్లల్లో డెవలప్ చేయాల్సిన 5 మైండ్స్..వేణు భగవాన్(అమ్మ, నాన్న ఓ జీనియస్) యండమూరి వీరేంద్రనాథ్ స్పెషల్ ఇంటర్వ్యూ.....
ఎన్నికల సందడి ప్రారంభమైంది. గెలిచి తీరాలనే కసితో ఉన్న పార్టీలు ఏపీలో జోరు పెంచాయి. అదేసమ యంలో అధికారంలోకి వచ్చేయాలనే కసితో టీడీపీ ఉంది. అదేవ్యూహాన్ని జనసేన పార్టీఅధినేత పవన్ కూడా అవలంభిస్తున్నారు. వెరసి.. రాజకీయంగా.. ఏపీ వేడెక్కుతోంది. మరీ ముఖ్యంగా..వచ్చే ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను ముందుగానే.. అమల్లో పెడుతున్నారు. టీడీపీ విషయాన్ని తీసుకుంటే.. ఇప్ప టికే చంద్రబాబుజోరు పెంచారు. నాయకులను సమీకరిస్తున్నారు. నాయకులను ఏకం చేస్తున్నారు. అదేసమయంలో నియోజకవర్గాల్లో బస్సు యాత్రకు కూడా చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఇదిలావుంటే.. దీనికి ముందుగానే..నారా లోకే ష్.. పార్టీని ముందుకు నడిపించేలా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా.. సంక్రాంతి తర్వాత.. పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 450 రోజుల పాటు..నిర్వహించాలని నిర్ణయించు కున్న ఈ యాత్ర ద్వారా.. ప్రజలను కలవనున్నారు. ఇక జనసేన విషయాన్ని పరిశీలిస్తే.. ఆ పార్టీ కూడా.. ప్రజలను కలవుంది. అయితే.. ఇప్పటికే బస్సు యా త్ర చేయాలని నిర్ణయించుకున్నా.. అనూహ్యంగా జనసేనాని దీనిని వాయిదా వేసుకున్నారు. అయితే.. త్వరలోనే.. ఆయన ప్రజల్లోకి రావడం.. నియోజకవర్గాల్లో పర్యటనలు చేయడం.. కూడా ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంతైనా..ప్రచారం ముఖ్యం కదా.. వాస్తవానికి అటు చంద్రబాబు.. ఇటు పవన్.. ఎక్కడ ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా.. ఫాలోయింగ్ ఉంటోంది. అయితే.. దీనికి మించి.. అన్నట్టుగా.. ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళ్లాలంటే.. మరింత.. మీడియా దన్ను అవసరమనే భావన ఉంది. ఈ క్రమంలోనే ఏకంగా.. టీడీపీకి ఐదు ఛానళ్లు.. జనసేనకు 3 ఛానళ్లు సపోర్టు చేసేందుకు రెడీగా ఉన్నాయని తెలుస్తోంది. లోకేష్ పాదయాత్రను లైవ్లో ప్రసారం చేయడం.. ద్వారా.. ఆయనకు మరింత మద్దతు కూడగట్టేందుకు రెడీ అవుతున్నారు. అదేవిధంగా.. జనసేన అధినేత నిర్వహించే యాత్రకు కూడా కవరేజీ కోసం.. ప్రత్యేకంగా చానళ్లుబుక్ చేసుకుంటున్నారట. మరి.. దీనిని బట్టి.. ఈ రెండు పార్టీలు ఏ రేంజ్లో దూసుకుపోతాయో.. అనే చర్చ జరుగుతోంది. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. Tupaki TAGS: APAssemblyElections YSRCPGovernment APPolitics YSJaganMohanReddy APGovernment TDPParty ChandrababuNaidu MediaPolitics JanasenaParty
వాల్ స్ట్రీట్ మరో ప్రతికూల త్రైమాసికంలో మరియు S&P 500 మరియు డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ రెండూ మూసివేయబడిన తర్వాత సోమవారం ఉదయం స్టాక్ ఫ్యూచర్స్ మిశ్రమంగా ఉన్నాయి. మార్చి 2020 నుండి వారి చెత్త నెల ముగిసింది. నాస్డాక్ 100 ఫ్యూచర్స్ 0.52% పడిపోయాయి, అయితే S&P 500కి లింక్ చేయబడిన ఫ్యూచర్స్ 0.14% నష్టపోయాయి. డౌ జోన్స్ పారిశ్రామిక సగటు ఫ్యూచర్స్ 0.07% లేదా 21 పాయింట్లు పెరిగాయి. నవంబర్ 2020 తర్వాత మొదటిసారిగా డౌ 500.10 పాయింట్లు లేదా 1.71% పడిపోయి 29,000 దిగువన పడిపోయింది, శుక్రవారం అన్ని ప్రధాన సగటులకు ప్రతికూల నెల మరియు త్రైమాసికం ముగిసింది. త్రైమాసికంలో, డౌ 6.66% పడిపోయింది, 2015 మూడవ త్రైమాసికం నుండి దాని మొదటి మూడు త్రైమాసిక నష్టం. S&P మరియు నాస్‌డాక్ కాంపోజిట్ రెండూ వరుసగా 5.28% మరియు 4.11% పడిపోయి, వారి వరుసగా మూడవ ప్రతికూల త్రైమాసికానికి ముగింపు పలికాయి. 2009 తర్వాత తొలిసారి. సెప్టెంబర్‌లో డౌ 8.8% పడిపోయింది, అయితే S&P 500 మరియు నాస్‌డాక్ కాంపోజిట్ వరుసగా 9.3% మరియు 10.5% నష్టపోయాయి. అన్ని ప్రధాన సగటులు ఏడులో వారి ఆరవ ప్రతికూల వారాన్ని పోస్ట్ చేశాయి. కొత్త త్రైమాసికంలో, అన్ని S&P 500 సెక్టార్‌లు తమ 52 వారాల గరిష్ట స్థాయికి కనీసం 10% తగ్గాయి. త్రైమాసికంలో తొమ్మిది రంగాలు ప్రతికూలంగా ముగిశాయి. 4.1% కంటే ఎక్కువ లాభపడి కన్స్యూమర్ విచక్షణ ఉత్తమ పనితీరును కనబరిచింది. నాల్గవ త్రైమాసికంలో, ఎలివేటెడ్ ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక వ్యవస్థకు అర్థం ఏమిటనే దానితో సంబంధం లేకుండా పెరుగుతున్న ధరలను ఆపాలనే ఫెడరల్ రిజర్వ్ ఉద్దేశం మార్కెట్లపై బరువును కొనసాగిస్తుందని ట్రస్ట్ యొక్క కీత్ లెర్నర్ చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, ఓవర్‌సోల్డ్ పరిస్థితులు మార్కెట్‌ను శుభవార్తపై స్వల్పకాలిక బౌన్స్‌కు గురి చేస్తాయి, అన్నారాయన. “మేము ఒక రకమైన పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేయబడతామని నేను భావిస్తున్నాను, అయితే ఈ సమయంలో అంతర్లీన ధోరణి ఇప్పటికీ దిగువ ధోరణి మరియు నిరంతర జలాలు” అని లెర్నర్ చెప్పారు.
P-TECH విద్యార్థులు IBM స్పేస్ మరియు ఎండ్యూరెన్స్ క్యూబ్ శాట్ తో నిమగ్నం కావడానికి2022-06-17T15:22:22-04:00 P-TECH విద్యార్థులు IBM స్పేస్ మరియు ఎండ్యూరెన్స్ క్యూబ్ శాట్ తో నిమగ్నం కావడానికి అపోలో యొక్క ప్రారంభ రోజుల నుండి, నాసా చంద్రునిపై మొదటి మానవులను దింపినప్పుడు, ఐబిఎమ్ కు అంతరిక్ష అన్వేషణ ప్రయత్నాలలో కీలక పాత్ర పోషించిన విశిష్టమైన గౌరవం లభించింది. IBM మొదటి మనిషిని చంద్రునిపైకి పంపడానికి సహాయపడే మెయిన్ ఫ్రేమ్ ను సృష్టించింది. ఇప్పుడు, ఎండ్యూరెన్స్ స్పేస్ మిషన్ అయినప్పటికీ అంతరిక్షాన్ని ప్రజాస్వామ్యీకరించడంలో సహాయపడటానికి ఐబిఎం చర్యలు తీసుకుంటోంది. ఎండ్యూరెన్స్ సిబ్బంది IBM యొక్క నైపుణ్య కార్యక్రమం, P-TECH లో పాల్గొనే విద్యార్థులతో కలిసి పనిచేస్తారు, తద్వారా వారు కూడా స్థలాన్ని అనుభవించవచ్చు. ఎండురోశాట్ భాగస్వామ్యంతో, మూడు పి-టెక్ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల ఐదు బృందాలు ఓపెన్ సోర్స్, క్లౌడ్ మరియు ఎడ్జ్ కంప్యూటింగ్ టెక్నాలజీల ద్వారా స్థలాన్ని అనుభవిస్తాయి. దరఖాస్తు ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడ్డ విద్యార్థి బృందాలు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్ డమ్ మరియు తైవాన్ లకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ ప్రాప్యతతో, అవి ఇప్పుడు అంతరిక్షం యొక్క భవిష్యత్తును మార్చడానికి సహాయపడతాయి. క్యూబ్ శాట్ టీమ్ ఫాల్కనాట్స్, ఫాల్కన్ టెక్ నుండి, లాంచ్ చూస్తున్నారు చిత్రం సౌజన్యంతో థెరిసా జకావెక్ మే 25, 2022 న, స్పేస్ఎక్స్ యొక్క ట్రాన్స్పోర్టర్ 5, ఫాల్కన్ 9 రాకెట్, ఎండ్యురోశాట్ ఐబిఎం యొక్క ఎండ్యూరెన్స్ మిషన్తో ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. శాటిలైట్ డేటాను వేగంగా ప్రాసెస్ చేయడంలో సహాయపడటానికి ఎండ్యూరెన్స్ స్పేస్ లో ఎడ్జ్ కంప్యూటింగ్ ను ఉపయోగిస్తుంది. శాటిలైట్ డేటా సమయానికి ఒక సంగ్రహావలోకనాన్ని అందిస్తుంది. భూమి యొక్క వనరులు మరియు సంఘటనలను మ్యాపింగ్ చేయడం మరియు పర్యవేక్షించడం ద్వారా జియోసైన్సెస్, రవాణా మరియు అంతర్జాతీయ సంబంధాలతో సహా అనేక విభిన్న పరిశ్రమలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. IBM P-TECH విద్యార్థి బృందాలు క్యూబ్ శాట్ తో నేరుగా ఇంటరాక్ట్ కావడం ద్వారా ఈ ప్రయోగానికి దోహదపడతాయి. విద్యార్థులు వివిధ సెన్సార్ల నుండి డేటాను యాక్సెస్ చేసుకోవడానికి, చిత్రాలను తీయడానికి, గణనలు చేయడానికి మరియు గ్రౌండ్ స్టేషన్లు మరియు IBM క్లౌడ్ ద్వారా ఫలితాలను తిరిగి భూమికి పొందడానికి కోడ్ ను ఉపయోగిస్తారు. ఈ అనుభవం ద్వారా, విద్యార్థుల బృందాలు ఇంజినీరింగ్, కోడింగ్ మరియు స్పేస్ టెక్నాలజీలతో సహా అంశాలపై ఐబిఎమ్ నిపుణుల నుండి నేర్చుకోవడానికి నిరంతర అవకాశాన్ని కలిగి ఉంటాయి. వారు సహకారం, విశ్లేషణాత్మక ఆలోచన, చురుకుదనం మరియు వ్యవస్థాపకతతో సహా అమూల్యమైన పనిప్రాంత నైపుణ్యాలను కూడా పొందుతారు. ఏ ప్రయత్న౦లోలాగే, అనుభవాలు, దృక్కోణాల వైవిధ్య౦ మనల్ని క్రొత్తదాన్ని కనుగొనే౦దుకు పురికొల్పుతు౦ది. అన్వేషణలో త్వరగా నిమగ్నం కావడానికి మనకు ఆ ఉద్భవిస్తున్న ఆవిష్కర్తలు అవసరం. అంతరిక్షంలో కనుగొనడానికి చాలా ఉంది, కానీ అన్వేషించగల వారు పెట్టుబడి మరియు శక్తి ఉన్న వారు మాత్రమే అలా చేస్తే మనల్ని మనం పరిమితం చేసుకుంటున్నాము. IBMతో, Red Hat, ఎండురోశాట్, మరియు P-TECH వంటి మా విద్యార్థి నైపుణ్యాల కార్యక్రమాలు , ఎండ్యూరెన్స్ మిషన్ కోసం కలిసి వస్తున్నాయి, మేము అంతరిక్ష అన్వేషకుల కొత్త తరం సృష్టిస్తున్నాము మరియు ప్రపంచంలోని తదుపరి ఆవిష్కర్తల యొక్క ఆసక్తికరమైన మనస్సులను అన్లాక్ చేస్తున్నాము. విశ్వంలో మన స్థానం మరియు ప్రపంచ చరిత్రను అన్వేషిస్తున్నప్పుడు అంతరిక్ష అన్వేషణ మానవత్వం గురించి ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. అంతరిక్షం అనేది మన గురించి మనందరికీ చెప్పే ప్రదేశం. అయినప్పటికీ, అంతరిక్ష అన్వేషణ సంస్థలు, శక్తివంతమైన దేశాలు మరియు అధిక సంపన్నుల యొక్క చిన్న ఉపసమితిచే నియంత్రించబడింది. అధిక సంఖ్యాకులకు, అంతరిక్షం అనేది మనం పైకి చూసే మరియు ఆశ్చర్యపోయే ప్రదేశం మాత్రమే. ఎన్విరాన్మెంటల్ సైన్స్, కెమిస్ట్రీ లేదా మెరైన్ బయాలజీలో ఆసక్తి ఉన్న విద్యార్థుల మాదిరిగా కాకుండా, అంతరిక్షంలో ఆసక్తి ఉన్న చాలా మంది విద్యార్థులు స్థలాన్ని అనుభవించలేరు లేదా అది ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా చూడరు. ఈ విభాగాల మాదిరిగా కాకుండా, స్థలం అందుబాటులో ఉండదు. ఇంకా. అంతరిక్ష అన్వేషణ యొక్క భవిష్యత్తు మరింత ప్రజాస్వామ్యీకరణకు పిలుపునిస్తుంది. మేము స్థలాన్ని ప్రజాస్వామ్యీకరించినప్పుడు, తగినంత డబ్బు లేదా శక్తిని కలిగి ఉన్న కంపెనీలు, ప్రజలు మరియు ప్రభుత్వాలు మాత్రమే స్థలాన్ని అన్వేషించగలవు మరియు సృజనాత్మకతను నడపగలవు. మరింత అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, ప్రయోగశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు చిన్న కంపెనీలు, విద్యార్థులు మరియు చాలా మంది ఇతరులు కూడా అన్వేషించగలరు. ఎక్కువ మంది ప్రజలు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని యాక్సెస్ చేసుకోగలిగినప్పుడు, ఈ రంగాన్ని వేగంగా కదిలించే మరిన్ని ఆవిష్కరణలు ఉంటాయి. నయీమ్ కథ చిన్నతనంలో, నేను తరచుగా అంతరిక్షం గురించి కలలు కనేవాడిని. నేను పాకిస్తాన్ లోని నా ఇంటి పైకప్పుపై పడుకునేవాడిని మరియు అంతకు మించి ఏమి ఉందో అని ఆశ్చర్యపోతున్న నక్షత్రాల వైపు చూసేవాడిని. నేను ఆకాశంలో ఉన్న అవకాశాల గురించి కలలు కన్నాను, కానీ నేను వాటిని ఎలా అన్వేషిస్తానో ఎప్పుడూ తెలియదు. పాకిస్తాన్ లో పెరిగినప్పుడు, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంపై లోతైన అవగాహన పొందడానికి చాలా అవకాశాలు లేవు. నా కుటు౦బ౦ అమెరికాకు వెళ్లినప్పుడు, ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయ౦ ను౦డి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, నేను ఐబిఎమ్ కోస౦ పనిచేయడ౦ ప్రార౦భి౦చాను, సృజనాత్మకతను పె౦పొ౦ది౦పజేసే౦దుకు కృషిచేశాను, చివరికి ఒక విశిష్ట ఇంజనీరుగా మారాను. ఈ కార్యనిర్వాహక హోదా నేను చిన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయిన అంశాలను అన్వేషించడానికి నాకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు, నేను అంతరిక్ష పరిశ్రమలో నా ఉత్సుకతను అనుసరించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు చిన్నప్పుడు నేను కోరుకున్న అవకాశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకే భవిష్యత్ అన్వేషకులు మరియు నాయకుల యొక్క తరువాతి తరం వారికి స్ఫూర్తిని అందించడానికి నేను "అంతరిక్షానికి ప్రాప్యతను ప్రజాస్వామ్యీకరించడం" దిశగా పనిచేస్తున్నాను!
gas time sunny leioni porn briyish grannies yellow xxx vizak telugu auntys sex stories lesbianas de gorditas sexxxxzx sxse sxxxxxs nagis sex sixxx faim www wapking video aleta osen x 3gp downlod first sex vegina full hd videos www saxvideos com tristan sommers xxx telugu kadhalu sany leony sox hd siksi xxx bur far bangladesh bf sexy HD తెలుగు సెక్స్ వీడియోస్ వారి కొత్త మరియు ఉచిత శృంగార వీడియోలతో అన్ని అతిధులను స్వాగతం! ప్రతి రోజు శృంగారంలో కనిపించే హాట్ sottenka తాజా శృంగారం, మీరు ఉచితంగా మరియు నమోదు లేకుండా ఆన్లైన్ చూడవచ్చు. శృంగార నాణ్యత కోల్పోవద్దు - మీ ఫోన్లో మంచి HD నాణ్యతలో శృంగార వీడియోలను డౌన్లోడ్ చేయండి లేదా బుక్మార్క్ అశ్లీల సైట్కు జోడించండి. సాధారణంగా, మేము ఆన్ లైన్ లో చూడండి, ఆనందించండి మరియు అన్నిటిని చాలు ఫక్ ... HD XXX VIDEOS Copyright 2020 All Hashtag #freeporn Web Site PORN HD VIDEOS! DMCA | 18 U.S.C. 2257 | Privacy Policy | Terms and conditions | Telugu Porn videos | Telugu Sex videos
TDP Rythu Poru Bata: వైకాపా ప్రభుత్వంలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందలేదని తెదేపా నాయకులు విమర్శించారు. కోనసీమ జిల్లా మండపేటలో రైతు సమస్యలపై తెదేపా నాయకులు ఏర్పాటు చేసిన పోరుబాటు సదస్సు ముగిసింది. రాష్ట్రంలో అన్నదాతలకు న్యాయం జరగాలంటే.. అందరూ ఏకమై ఉద్యమించాలని సూచించారు. TDP Rythu Poru Bata Program in AP: కోనసీమ జిల్లా మండపేటలో రైతు సమస్యలపై తెదేపా నాయకులు ఏర్పాటు చేసిన పోరుబాటు సదస్సు ముగిసింది. ఈ సమావేశానికి.. 34 నియోజకవర్గాల నాయకులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ధాన్యానికి దక్కని మద్దతు ధర, రైతులకు అందని వ్యవసాయ పరికరాలు, వరదలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందని పరిస్థితులపై తమ గళాన్ని వినిపించారు. గోరంట్ల బుచ్చయ్య: రాష్ట్రంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే నాథుడే లేడంటూ తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ధర స్థిరీకరణకు రూ.3 వేల కోట్లు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలు ఎన్ని పూర్తిచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో.. తుపాను రాబోతోందని.. ఆ తుఫాన్​లో వైకాపా ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవడం ఖాయమని గోరంట్ల జోస్యం చెప్పారు. ప్రత్తిపాటి పుల్లారావు: ధాన్యం కొనుగోలు చేసి.. రైతులకు డబ్బులు ఇవ్వట్లేదని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. తెదేపా హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో వ్యవసాయ రంగంపై సమీక్షలు జరపడం లేదని మండిపడ్డారు. వ్యవసాయ మంత్రి ఎక్కడ ఉన్నారో తెలియని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందని విమర్శించారు. యనమల: రైతుల సమస్య పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని తెదేపా నేత యనమల రామకృష్ణా పిలుపునిచ్చారు. పంజాబ్, రాజస్థాన్ రైతుల మాదిరిగా ఆంధ్రప్రదేశ్​లో సైతం రైతులు ఉద్యమించాలి యనమల పేర్కొన్నారు. చినరాజప్ప: మండపేటలో తెదేపా రైతు పోరుబాట సదస్సులో తెదేపా నేత చినరాజప్ప పాల్గొన్నారు. వైకాపా పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిందని విమర్శించారు. వైకాపా పాలనలో ఆక్వా రంగం అధోగతిపాలైంది ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును సీఎం చేస్తేనే రైతులు కాస్త కోలుకొనే పరిస్థితి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ పరిశుద్ధ గ్రంథ వివరణ Prev Next 1. సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి అపో. కార్యములు 8:1-3; అపో. కార్యములు 22:9-11; ఫిలిప్పీయులకు 3:6. 2. యీ మార్గ మందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల, వారిని బంధించి యెరూషలేము నకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. “మార్గాన్ని”– క్రీస్తు మార్గం (యోహాను 14:6). సిరియాకు రాజధానిగా ఉన్న దమస్కు చాలా పురాతన నగరం. అది జెరుసలంకు పూర్వోత్తర దిక్కున సుమారు 200 కిలోమీటర్ల దూరాన ఉంది. అప్పటికే శుభవార్త అక్కడికి వ్యాపించింది. క్రీస్తు సంఘం ఎక్కడ కనిపించినా దాన్ని నాశనం చేద్దామని సౌలు ఆశయం. 3. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను. దేవుడు అందరికంటే సంఘానికి గొప్ప శత్రువును అందరికంటే సంఘానికి గొప్ప ఉపదేశకుణ్ణిగా మార్చే సమయం వచ్చింది. ఇది దేవుని కృప, కరుణ, ప్రేమ వల్లే జరిగింది. 1 తిమోతికి 1:12-16; 2 తిమోతికి 1:9. ప్రకాశమానమైన ఒక్క క్షణంలో సౌలు జీవితం పూర్తిగా మారిపోయింది. 4. అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. క్రీస్తుకు చెందినవారిని హింసించడం అనేది క్రీస్తును హింసించడమే. అసలు, వారికి వ్యతిరేకంగా లేక వారికోసం మనం జరిగించేదేదైనా ఆయనకు వ్యతిరేకంగా లేక ఆయనకోసం జరిగిస్తున్నామన్నమాట. వారు శరీరం, ఆయన ఆ శరీరానికి శిరస్సు (1 కోరింథీయులకు 12:12-13; ఎఫెసీయులకు 1:22-23; కొలొస్సయులకు 1:18). “శరీరాన్ని”, లేక దానిలో ఏ వ్యక్తిని అయినా హింసించే సమయంలో “శిరస్సును” హింసించకపోవడం అసాధ్యం. మత్తయి 10:40; మత్తయి 18:5; మత్తయి 25:34-46; లూకా 9:48; యోహాను 17:20-23 పోల్చి చూడండి. “యేసు” అనే ఈ మాట వినబడగానే సౌలుకు ఎంత కంగారు, ఎంత నివ్వెరపాటు కలిగి ఉండాలి! ఆ ఒక్క క్షణంలో అతని తలంపులన్నీ ఎలా తలకిందులైపోయాయో ఆలోచించండి. 5. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించు చున్న యేసును; 6. లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. సౌలు తాను అపో. కార్యములు 22:10 లో తెలియజేసిన ప్రశ్న ఇప్పటికి అడిగాడు. ఈ ప్రశ్నవల్ల సౌలు ప్రభువుకు లొంగిపోతున్నాడనీ ఆయనకు విధేయత చూపేందుకు సిద్ధంగా ఉన్నాడనీ అర్థమవుతున్నది. సౌలు అపో. కార్యములు 26:16-18 లో తాను ఏమి చేయాలో అప్పుడు కొంతమట్టుకు ప్రభువు తెలియజేశాడని చెప్పాడు. 7. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువ బడిరి. అపో. కార్యములు 22:9. 8. సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేక పోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. దేదీప్యమానమైన ఈ వెలుగు అతని కళ్ళకు గుడ్డితనం కలిగించింది. దీనికంటే గొప్ప వెలుగు అతని హృదయంలోకి ప్రకాశించి అతని మనోనేత్రాలను తెరచింది. 2 కోరింథీయులకు 4:5 చూడండి. 9. అతడు మూడు దినములు చూపులేక అన్నపానము లేమియు పుచ్చుకొన కుండెను. 10. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయా, అని అతనిని పిలువగా అననీయ అంటే “యెహోవా దయాళుడు” అని అర్థం (హీబ్రూలో ఈ పేరు హనన్యా). అతడు క్రీస్తుమీద నమ్మకముంచిన యూదుడు (అపో. కార్యములు 22:12). దర్శనాల గురించి నోట్ ఆదికాండము 15:1. 11. అతడు ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థనచేయుచున్నాడు. “తార్సు”– ఇప్పుడు ప్రస్తుత టర్కీ దేశంలో ఒక పట్టణం. అది సౌలు సొంత పట్టణం (అపో. కార్యములు 9:30; అపో. కార్యములు 11:25; అపో. కార్యములు 21:39; అపో. కార్యములు 22:3). ప్రభువు తనకు ప్రత్యక్షమైనప్పటి నుంచి సౌలు ఏమి చేస్తున్నాడో ఈ వచనంలో చూస్తున్నాం. అతడు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అతడు ఆరంభించినది తన మిగిలిన జీవిత కాలమంతా చేస్తూ వచ్చాడు (అపో. కార్యములు 16:25; అపో. కార్యములు 20:36; అపో. కార్యములు 22:17). 12. అతడు అననీయ అను నొక మనుష్యుడు లోపలికివచ్చి, తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచి యున్నాడని చెప్పెను. యేసుప్రభువు తాను సౌలుకు ప్రత్యక్షం కాగోరిన స్థలం దమస్కు దగ్గర అనీ రాయబారులున్న జెరుసలం కాదనీ, అతని దగ్గరికి పంపినది వారిలో ఒకరు గాక అనామకుడైన సామాన్య విశ్వాసి అనీ గమనించతగిన విషయం. యెషయా 55:8-9 చూడండి. 13. అందుకు అననీయ ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి యున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని. “పవిత్రులు” అంటే దేవుడు తనకోసం ప్రత్యేకించు కొన్నవారు. ఇది విశ్వాసులకు మరో పేరు (రోమీయులకు 1:1; మొ।।). 14. ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయు వారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొంది యున్నాడని ఉత్తరమిచ్చెను. 15. అందుకు ప్రభువునీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు ఈ రెండు వచనాలలో ప్రభువు 13-28 అధ్యాయాల్లో వర్ణించబడిన పౌలు జీవితం, పని సారాంశాన్ని తెలియజేశాడు. పౌలు ప్రభువు ఎన్నుకొన్న “సాధనం” (అపో. కార్యములు 26:16-18; గలతియులకు 1:15; ఎఫెసీయులకు 3:2, ఎఫెసీయులకు 3:7-8; కొలొస్సయులకు 1:25; 1 తిమోతికి 1:12; 2 తిమోతికి 1:11). క్రీస్తు కోసం బాధ అనుభవించడం పౌలు సేవలో తప్పించుకోలేని భాగం. దానిలో ఆనందించడం అతడు నేర్చుకొన్నాడు (2 తిమోతికి 1:12; 1 థెస్సలొనీకయులకు 3:3-4; కొలొస్సయులకు 1:24; 2 కోరింథీయులకు 7:4; 2 కోరింథీయులకు 4:16-18; రోమీయులకు 5:3). దేవుని రాజ్యంలో పరలోక రాజు తనకోసం తన సేవకులను బాధపడనివ్వడం అనుగ్రహానికి గుర్తు అని పౌలు గ్రహించాడు (మత్తయి 5:10-12; రోమీయులకు 8:17; ఫిలిప్పీయులకు 1:29). 16. ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. 17. అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతని మీద చేతులుంచి సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టి పొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి యున్నాడని చెప్పెను. దీన్ని బట్టి చూస్తే పౌలు పవిత్రాత్మను పొందినది అననీయ చేతులు ఉంచడంద్వారా అనిపిస్తుంది (అయినా రాసిన మాటలవల్ల ఈ సంగతి అంత స్పష్టం కాదేమో). మనుషులు దేవుని ఆత్మను లేక ఆ ఆత్మ సంపూర్ణతను పొందినది వేరువేరు రీతులుగానని ఈ గ్రంథం తెలియజేస్తున్నది – నేరుగా దేవునినుంచి (అపో. కార్యములు 2:1-4; అపో. కార్యములు 10:44-45), క్రీస్తు రాయబారులు చేతులుంచడం ద్వారా (అపో. కార్యములు 8:17; అపో. కార్యములు 19:6), ఈ ఒక సందర్భంలో సామాన్య శిష్యుడు చేతులుంచడం ద్వారా. ఆత్మను పొందడం నీటి బాప్తిసం తరువాత జరిగింది, నీటి బాప్తిసానికి ముందు కూడా జరిగింది. దేవుని ఆత్మ తన ఇష్టప్రకారం పని చేశాడు. ఆయన పని చేయకముందు ఎలా పని చేస్తాడో ఎవరూ చెప్పలేకపోయారు. అననీయ చేసిన విషయాన్ని చూస్తే అలా చేయాలని ప్రభువు విశేషంగా తేటగా అతణ్ణి ఆజ్ఞాపించాడని మనం గ్రహించాలి. అతడు చేసినట్టు ప్రభువునుంచి ఇలా నేరుగా వచ్చిన ఆదేశం లేకుండా ఎవరూ చేసేందుకు తెగించకూడదు. అతడు సౌలును “సోదరుడా” అంటూ సంబోధించాడని గమనించండి. ఈ విధంగా సౌలును విశ్వాసుల సహవాసంలో చేర్చుకొన్నాడు. 18. అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. “బాప్తిసం”– అపో. కార్యములు 2:38; మత్తయి 3:6; మార్కు 16:16 చూడండి. బాప్తిసం పొందాలని చెప్పింది అననీయ (అపో. కార్యములు 22:16). బాప్తిసం ఇచ్చింది కూడా అతడే అని కనిపిస్తున్నట్టుంది. ఆ సమయంలో సౌలు దగ్గర మరింకెవరు ఉన్నారు? అననీయ మామూలు శిష్యుడని గమనించండి. 19. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్ని దినములుండెను. 20. వెంటనే సమాజమందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. సౌలు గమలీయేల్ దగ్గర పాత ఒడంబడిక గ్రంథంలోని సత్యాలను సరిగా నేర్చుకోలేదు గానీ తాను చూచిన ప్రభు దర్శనాన్ని బట్టి, పవిత్రాత్మతో నిండిపోయినందు వల్ల అతడు ఆ సత్యాలను గ్రహించగలిగాడు. 21. వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికికూడ వచ్చి యున్నాడని చెప్పు కొనిరి. 22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడిఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. 23. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా 2 కోరింథీయులకు 11:33. యూదులు పౌలును చంపే అనేక ప్రయత్నాలలో ఇది మొదటిది మాత్రమే (వ 29; అపో. కార్యములు 13:45; అపో. కార్యములు 14:5, అపో. కార్యములు 14:19; అపో. కార్యములు 17:5, అపో. కార్యములు 17:13; అపో. కార్యములు 18:6; అపో. కార్యములు 21:27-31). అతని జీవితంలో ఒక భాగంగా ఉన్న బాధలు (వ 16) ఆరంభమయ్యాయి. 24. వారి ఆలోచన సౌలునకు తెలియ వచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వార ములయొద్ద కాచుకొనుచుండిరి 25. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొని పోయి గంపలో ఉంచి, గోడగుండ అతనిని క్రిందికి దింపిరి. 26. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నముచేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి. గలతియులకు 1:15-19. మూడు సంవత్సరాల నుంచి వారు సౌలును చూడలేదు. అతని గురించి వదంతులు మాత్రం విన్నారు. వారు భయపడడం వింత కాదు. 27. అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలుల యొద్దకు తోడుకొనివచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను. బర్నబా తన పేరుకున్న అర్థాన్ని తన జీవితంలో నెరవేర్చాడు (అపో. కార్యములు 4:36; అపో. కార్యములు 11:22-24). ఈ సమయంలో క్రీస్తు రాయబారులలో ఇద్దరు మాత్రమే జెరుసలంలో ఉన్నట్టు కనిపిస్తున్నది (గలతియులకు 1:18-19. అయితే గలతీయవారికి రాసిన లేఖలో పౌలు వేరే సమయాన్ని గురించి రాశాడేమో). 28. అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచు పోవుచు, దేవుని ఆత్మతో నిండి ఉన్న వారి లక్షణాలలో ధైర్యం ఒకటి (అపో. కార్యములు 4:13, అపో. కార్యములు 4:31). 29. ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచునుండెను. వ 23. 30. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడు కొనివచ్చి తార్సునకు పంపిరి. వ 11. 31. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. క్రీస్తుసంఘాన్ని హింస నాశనం చేయదనీ దాని సాక్ష్యాన్ని ఆపలేదనీ యూద నాయకులు గ్రహించారు. ముఖ్య హింసకుడు (సౌలు) యేసు శిష్యుడైన సంగతికి వారు తప్పక నివ్వెరపడి ఉండాలి. ప్రభు భయాన్ని గురించి నోట్స్ ఆదికాండము 20:11; యోబు 28:28; కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; సామెతలు 1:7. 32. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధులయొద్దకు వచ్చెను. “లుద్ద”– జెరుసలంకు పశ్చిమోత్తర దిక్కున సుమారు 40 కిలోమీటర్ల దూరాన, యొప్పేదగ్గర ఉన్న పట్టణం. 33. అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిది ఏండ్లనుండి మంచము పట్టియుండిన ఐనెయ అను ఒక మనుష్యుని చూచి, 34. పేతురు ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా “సీమోను పేతురు నిన్ను బాగు చేస్తున్నాడు” అని అతడు అనలేదు. అపో. కార్యములు 3:6, అపో. కార్యములు 3:12 చూడండి. 35. వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్నవారందరు అతనిచూచి ప్రభువుతట్టు తిరిగిరి. అద్భుతాలు వాటంతట అవి విశ్వాసాన్ని పుట్టించలేవు (లూకా 16:31), గానీ తాను దగ్గరగా ఉన్నాననీ చర్యలు జరిగిస్తున్నాననీ ప్రజలను ఒప్పించడానికి దేవుడు అద్భుతాలు ఉపయోగించవచ్చు. అద్భుతాల గురించి నోట్స్ మత్తయి 8:1; యోహాను 2:11. 36. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్‌ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను. యొప్పే జెరుసలంకు సుమారు 55 కిలోమీటర్ల దూరాన మధ్యధరా సముద్ర తీరాన ఉన్న రేవు పట్టణం. తబితా అరమేయిక్ పేరు, దొర్కస్ గ్రీకు పేరు. రెంటికి ఒకే అర్థం – లేడి. పేదలకు సహాయం చేయడంలో ఆమె క్రైస్తవులందరికీ ఒక ఆదర్శం. పేదలకు సహాయం చేయడం గురించి గలతియులకు 2:10; మత్తయి 19:21; 2 కోరింథీయులకు 9:9 చూడండి. 37. ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ బెట్టిరి. 38. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుటచేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, అతడు తడవుచేయక తమయొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు దొర్కస్‌ను బ్రతికించగలడని వారికి ఆశాభావం ఉన్నట్టుంది. 39. పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొని వచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి. 40. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. మార్కు 5:21-24, మార్కు 5:35-43; యోహాను 14:12-13 పోల్చి చూడండి. ఈ గ్రంథంలో చనిపోయినవారిని బ్రతికించడం అనే రెండు సంఘటనల్లో ఇది మొదటిది. మరొకటి అపో. కార్యములు 20:7-12 లో కనిపిస్తున్నది. ప్రభువు ఇలాంటి అద్భుతం జరిగించినది అరుదు. అయినా ఇది మరి ఏ ఇతర అద్భుతం కంటే ఆయనకు కష్టతరం కాదు. 41. అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను. 42. ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువు నందు విశ్వాసముంచిరి. చనిపోయిన వ్యక్తిని బ్రతికించినది పేతురు కాదు గాని ప్రభువే అని వారు గుర్తించారు. అపో. కార్యములు 3:12 చూడండి. 43. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను. చర్మకారుడి వృత్తి అశుద్ధమని యూద మత గురువులు అనుకొనేవారు. అయినా దాని గురించి పేతురుకు ఏమీ పట్టింపు లేదు. Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు బుధవారం చేసిన ప్రకటనపై జిల్లాలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేలుస్తున్న మేయర్‌ సునీల్‌రావు, నాయకులు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 - గులాబీ శ్రేణుల సంబరాలు - సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం గణేశ్‌నగర్‌, ఆక్టోబరు 6: సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు బుధవారం చేసిన ప్రకటనపై జిల్లాలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. నగరంలో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున వేడుక చేశారు. నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌ కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సంర్బంగా మేయర్‌ యాదగిరి సునీల్‌రావు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖితమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు దేశ ప్రజల ప్రగతి కోసం జాతీయ రాజకీల్లోకి అడుగుపెట్టడం దేశానికి శుభసుచకమన్నారు. నాడు రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన కేసీఆర్‌ నేడు ఉజ్వల భారత్‌ కోసం జాతీయ రాజకీల్లోకి అడుగు పెట్టారని అన్నారు.
యెహోషువ 17:18 – మీకు అధికబలముగలదు, మీకు ఒక్కవంతు చీటియేకాదు; ఆ కొండ మీదే, అది అర ణ్యము గనుక మీరు దానిని నరకుడి, అప్పుడు ఆ ప్రదే శము మీదగును; కనానీయులకు ఇనుపరథములుండినను వారు బలవంతులైయుండినను మీరు వారి దేశమును స్వాధీన పరచుకొనగలరనెను. యెషయా 28:1 – త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోవుచున్న పుష్పమువంటి వారి సుందర భూషణమునకు శ్రమ ద్రాక్షారసమువలన కూలిపోయినవారి ఫలవంతమైన లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ. The whole kingdom of Israel sometimes called యెహెజ్కేలు 16:46 – నీ యెడమ ప్రక్కను నివసించు షోమ్రోనును దాని కుమార్తెలును నీకు అక్కలు, నీ కుడిప్రక్కను నివసించు సొదొమయు దాని కుమార్తెలును నీకు చెల్లెండ్రు. యెహెజ్కేలు 16:51 – షోమ్రోను సహా నీ పాపములలో సగమైన చేయలేదు, అది చేసినవాటి కంటె నీవు అత్యధికముగా హేయక్రియలు చేసితివి; నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనుపరచితివి. హోషేయ 8:5 – షోమ్రోనూ, ఆయన నీ దూడను (విగ్రహము) విసర్జించెను నా కోపము వారిమీదికి రగులుకొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు? హోషేయ 8:6 – అది ఇశ్రాయేలువారిచేతిపనియే గదా? కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు గదా; షోమ్రోను చేసికొనిన యీ దూడ ఛిన్నాభిన్నములగును. Had many cities 1రాజులు 13:32 – యెహోవా మాటనుబట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను, షోమ్రోను పట్టణములోనున్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికి విరోధము గాను, అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను. Samaria the capital of -built by Omri king of Israel 1రాజులు 16:23 – యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియొకటవ సంవత్సరమున ఒమీ ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను; ఆ పండ్రెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. 1రాజులు 16:24 – అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండను నాలుగు మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండమీద పట్టణమొకటి కట్టించి, ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరునుబట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను1 అను పేరు పెట్టెను. -Called after Shemer the owner of the hill on which it Was built 1రాజులు 16:24 – అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండను నాలుగు మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండమీద పట్టణమొకటి కట్టించి, ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరునుబట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను1 అను పేరు పెట్టెను. -Called the mountain of Samaria ఆమోసు 4:1 – షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టు వారలారా మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, యీ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా ఆమోసు 6:1 – సీయోనులో నిర్విచారముగా నున్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతములమీద నిశ్చింతగా నివసించువారికి శ్రమ; ఇశ్రాయేలువారికి విచారణకర్తలై జనములలో ముఖ్యజనమునకు పెద్దలైనవారికి శ్రమ -Called the head of Ephraim యెషయా 7:9 – షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని; షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు; మీరు నమ్మకుండినయెడల స్థిరపడకయుందురు. -Kings of Israel Sometime Took their Titles from 1రాజులు 21:1 – ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలువాడైన నాబోతునకు ఒక ద్రాక్షతోట కలిగియుండగా 2రాజులు 1:3 – యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో ఈలాగు సెలవిచ్చెను నీవులేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి యిట్లనుము ఇశ్రాయేలువారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయైన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోవుచున్నారా? -the residence of the Kings of Israel 1రాజులు 16:29 – యూదా రాజైన ఆసా యేలుబడిలో ముప్పదియెనిమిదవ సంవత్సరమున ఒమీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలువారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఇరువదిరెండు సంవత్సరములు ఏలెను. 2రాజులు 1:2 – అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలోనుండి క్రిందపడి రోగియై మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా 2రాజులు 3:1 – అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను. 2రాజులు 3:6 – యెహోరాము షోమ్రోనులోనుండి బయలుదేరి ఇశ్రాయేలువారినందరిని సమకూర్చెను. -the burial place of the Kings of Israel 1రాజులు 16:28 – ఒమీ తన పితరులతో కూడ నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజాయెను. 1రాజులు 22:37 – ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను. 2రాజులు 13:13 – యెహోయాషు తన పితరులతో కూడ నిద్రించిన తరువాత యరొబాము అతని సింహాసనముమీద ఆసీనుడాయెను; యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధియందు పాతిపెట్టబడెను. -Was A Fenced city, and Well Provided with arms 2రాజులు 10:2 – మరియు మీకు రథములును గుఱ్ఱములును ప్రాకారముగల పట్టణమును ఆయుధ సామగ్రియును కలవు గదా -the pool of Samaria Near to 1రాజులు 22:38 – వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. -the prophet Elisha dwelt in 2రాజులు 2:25 – అతడు అచ్చటనుండి పోయి కర్మెలు పర్వతమునకు వచ్చి అచ్చటనుండి పోయి షోమ్రోనునకు తిరిగివచ్చెను. 2రాజులు 5:3 – అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను. 2రాజులు 6:32 – అయితే ఎలీషా తన యింట కూర్చునియుండగా పెద్దలును అతనితోకూడ కూర్చుండియున్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడినవాడు ఎలీషా దగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టియుండి, ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండ తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి; వాని యజమానుని కాళ్లచప్పుడు వానివెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా -Besieged by Benhadad 1రాజులు 20:1 – తనయొద్ద గుఱ్ఱములను రథములను సమకూర్చుకొనిన ముప్పది ఇద్దరు రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడివేసి దానిమీద యుద్ధము చేసెను. 1రాజులు 20:2 – అతడు పట్టణమందున్న ఇశ్రాయేలురాజైన అహాబునొద్దకు దూతలను పంపి 1రాజులు 20:3 – నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యముగలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారిచేత వర్తమానము తెలియజేసెను. 1రాజులు 20:4 – అందుకు ఇశ్రాయేలు రాజు నా యేలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున నున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా 1రాజులు 20:5 – ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగివచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీయొద్దకు నా సేవకులను పంపియున్నాను. 1రాజులు 20:6 – రేపు ఈ వేళకు వారు నీ యింటిని నీ సేవకుల యిండ్లను పరిశోధించుదురు; అప్పుడు నీ కంటికి ఏది యింపుగా నుండునో దానిని వారు చేతపట్టుకొని తీసికొనిపోవుదురు. 1రాజులు 20:7 – కాగా ఇశ్రాయేలు రాజు దేశపు పెద్దలనందరిని పిలువనంపించి బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానము పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు; ఆ మనుష్యుడు చేయగోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలిసికొనుడనెను. 1రాజులు 20:8 – నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలును జనులందరును అతనితో చెప్పిరి, 1రాజులు 20:9 – గనుక అతడు మీరు రాజైన నా యేలినవానితో తెలియజెప్పవలసినదేమనగా నీవు మొదట నీ సేవకుడనైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని, నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదునొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా 1రాజులు 20:10 – బెన్హదదు మరల అతనియొద్దకు దూతలను పంపి నాతోకూడ వచ్చిన వారందరును పిడికెడు ఎత్తికొనిపోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలినయెడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురు గాక అని వర్తమానము చేసెను. 1రాజులు 20:11 – అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దానివిప్పి తీసివేసినవానివలె అతిశయపడకూడదని చెప్పుడనెను. 1రాజులు 20:12 – బన్హదదును ఆ రాజులును గుడారములయందు విందు జరిగించుకొనుచుండగా, ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా -deliverance of, Predicted 1రాజులు 20:13 – ప్రవక్తయైన యొకడు ఇశ్రాయేలు రాజైన అహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే; నేను యెహోవానని నీవు గ్రహించునట్లు నేడు దానిని నీచేతి కప్పగించెదను. 1రాజులు 20:14 – ఇది యెవరిచేత జరుగునని అహాబు అడుగగా అతడు రాజ్యాధిపతులలో ఉన్న యౌవనులచేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలెనని రాజు అడుగగా అతడు నీవే అని ప్రత్యుత్తరమిచ్చెను. -deliverance of, effected 1రాజులు 20:15 – వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్కచూడగా వారు రెండువందల ముప్పది ఇద్దరైరి. తరువాత జనులను, అనగా ఇశ్రాయేలు వారినందరిని లెక్కింపగా వారు ఏడువేల మందియైరి. 1రాజులు 20:16 – మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ఆ ముప్పది ఇద్దరు రాజులును గుడారములలో త్రాగి మత్తులైయుండిరి. 1రాజులు 20:17 – రాజ్యాధిపతులలోనున్న ఆ యౌవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలిసికొనుటకై బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రోనులోనుండి కొందరు వచ్చియున్నారని బంటులు తెలియజేయగా 1రాజులు 20:18 – అతడువారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయ వచ్చినను వారిని సజీవులుగా పట్టుకొనిరండని ఆజ్ఞాపించెను. 1రాజులు 20:19 – రాజ్యాధిపతులలోనున్న ఆ యౌవనులును వారితో కూడనున్న దండువారును పట్టణములోనుండి బయలుదేరి 1రాజులు 20:20 – ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలువారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుఱ్ఱమెక్కి రౌతులతో గూడ తప్పించుకొనిపోయెను. 1రాజులు 20:21 – అంతట ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుఱ్ఱములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను. -Besieged again by Benhadad 2రాజులు 6:24 – అటుతరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడివేసెను. -suffered severely from famine 2రాజులు 6:25 – అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగియుండగా గాడిదయొక్క తల ఎనుబది రూపాయలకును, అరపావు పావురపు రెట్ట అయిదు రూపాయలకును అమ్మబడెను; వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి. 2రాజులు 6:26 – అంతట ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారముమీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని 2రాజులు 6:27 – యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడనుండి నీకు సహాయము చేయుదును? కళ్లములోనుండి యైనను ద్రాక్షగానుగలోనుండి యైనను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి 2రాజులు 6:28 – నీ విచారమునకు కారణమేమని యడుగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు 2రాజులు 6:29 – మేము నా బిడ్డను వంటచేసికొని తింటివిు. అయితే మరునాటియందు నేను దాని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను. -Elisha Predicted plenty in 2రాజులు 7:1 – అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును. 2రాజులు 7:2 – అందుకు ఎవరి చేతిమీద రాజు ఆనుకొనియుండెనో ఆ యధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు నీవు కన్నులార దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. -delivered by miraculous means 2రాజులు 7:6 – యెహోవా రథముల ధ్వనియు గుఱ్ఱముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్లు చేయగా వారు మనమీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చియున్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని 2రాజులు 7:7 – లేచి తమ గుడారములలోనైనను గుఱ్ఱములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో నున్నవాటిలోనైనను ఏమియు తీసికొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని, సందెచీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయియుండిరి. -remarkable plenty in, as Foretold by Elisha 2రాజులు 7:16 – జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల యవలును అమ్మబడెను. 2రాజులు 7:17 – ఎవని చేతిమీద రాజు ఆనుకొనియుండెనో ఆ యధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనునియొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడుచేత అతడు మరణమాయెను. 2రాజులు 7:18 – మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్ననిపిండియు, రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. 2రాజులు 7:19 – ఆ యధిపతియెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు నీవు కన్నులార చూచెదవుగాని దానిని తినకపోదువని ఆ యధిపతితో చెప్పెను. 2రాజులు 7:20 – జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. -Besieged and Taken by Shalmaneser 2రాజులు 17:5 – అష్షూరు రాజు దేశమంతటిమీదికిని షోమ్రోనుమీదికిని వచ్చి మూడు సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. 2రాజులు 17:6 – హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెరగొనిపోయి. గోజానునది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను. 2రాజులు 18:9 – రాజైన హిజ్కియా యేలుబడిలో నాలుగవ సంవత్సరమందు, ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషేయ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు, అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోను పట్ణణముమీదికి వచ్చి ముట్టడివేసెను. 2రాజులు 18:10 – మూడు సంవత్సరములు పూర్తియైన తరువాత అష్షూరీయులు దాని పట్టుకొనిరి. హిజ్కియా యేలుబడిలో ఆరవ సంవత్సరమందు, ఇశ్రాయేలురాజైన హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను. A mountainous country యిర్మియా 31:5 – నీవు షోమ్రోను కొండలమీద ద్రాక్షావల్లులను మరల నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఆమోసు 3:9 – అష్డోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి; ఎట్లనగా–మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతములమీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి; అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి. People of characterised as -Proud and Arrogant యెషయా 9:9 – అది ఎఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును ప్రజలకందరికి తెలియవలసియున్నది. -Corrupt and Wicked యెహెజ్కేలు 16:46 – నీ యెడమ ప్రక్కను నివసించు షోమ్రోనును దాని కుమార్తెలును నీకు అక్కలు, నీ కుడిప్రక్కను నివసించు సొదొమయు దాని కుమార్తెలును నీకు చెల్లెండ్రు. యెహెజ్కేలు 16:47 – అయితే వారి ప్రవర్తన ననుసరించుటయు, వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్పకార్యమని యెంచి, వారి నడతలను మించునట్లుగా నీవు చెడుమార్గములయందు ప్రవర్తించితివి. హోషేయ 7:1 – నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయ దలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకొందురు. ఆమోసు 3:9 – అష్డోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి; ఎట్లనగా–మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతములమీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి; అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి. ఆమోసు 3:10 – వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారముచేతను దోపుడుచేతను సొమ్ము సమకూర్చుకొందురు. -Idolatrous యెహెజ్కేలు 23:5 – ఒహొలా నాకు పెండ్లిచేయబడినను వ్యభిచారముచేసి ఆమోసు 8:14 – షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు, దానూ, నీ దేవుని జీవము తోడనియు, బెయేర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండ కూలుదురు. మీకా 1:7 – దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును, దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును, అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడుచేతును, అది వేశ్యయై సంపాదించుకొనిన జీతముపెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయగుదాని జీతముగా మరల ఇయ్యబడును. Predictions respecting its destruction యెషయా 8:4 – ఈ బాలుడు నాయనా అమ్మా అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కుయొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడుసొమ్మును ఎత్తికొని పోవుదురనెను. యెషయా 9:11 – యెహోవా వానిమీదికి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు. యెషయా 9:12 – తూర్పున సిరియాయు పడమట ఫిలిష్తీయులును నోరుతెరచి ఇశ్రాయేలును మింగివేయవలెనని యున్నారు ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు.ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది. హోషేయ 13:16 – షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసెను గనుక అది శిక్షనొందును, జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకువేసి కొట్టబడుదురు, గర్భిణి స్త్రీల కడుపులు చీల్చబడును. ఆమోసు 3:11 – కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా శత్రువు వచ్చును, అతడు దేశమంతట సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును. ఆమోసు 3:12 – యెహోవా సెలవిచ్చునదేమనగా గొల్లవాడు సింహము నోటనుండి రెండు కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించునట్లుగా షోమ్రోనులో మంచములమీదను బుట్టాలువేసిన శయ్యలమీదను కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు. మీకా 1:6 – కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్లకుప్పవలె చేసెదను, ద్రాక్షచెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను, దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టుడురాళ్లను లోయలో పారబోసెదను; Inhabitants of, carried captive to Assyria 2రాజులు 17:6 – హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెరగొనిపోయి. గోజానునది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను. 2రాజులు 17:23 – తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున, ఆయన ఇశ్రాయేలువారిని తన సముఖములోనుండి వెళ్లగొట్టెను. ఆ హేతువుచేత వారు తమ స్వదేశములోనుండి అష్షూరు దేశములోనికి చెరగొనిపోబడిరి; నేటివరకు వారచ్చట ఉన్నారు. 2రాజులు 18:11 – తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికిని లోబడక అతిక్రమించి యుండిరి. Repeopled from Assyria 2రాజులు 17:24 – అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అను తన దేశములలోనుండి జనులను రప్పించి, ఇశ్రాయేలువారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వంతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. 2రాజులు 17:25 – అయితే వారు కాపురముండ నారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను.
తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 08: తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారికి రూ.ల‌క్ష‌ విలువైన బంగారు పూత వేసిన రాగి ఆభ‌ర‌ణాలను మంగ‌ళ‌వారం అజ్ఞాత భ‌క్తుడు కానుకగా సమర్పించారు. ఆల‌యంలో దాత ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడికి వీటిని అందించారు. ఇందులో ఉత్స‌వ‌మూర్తుల‌కు అలంక‌రించే మూడు కిరీటాలు, శ్రీ‌దేవి, భూదేవి అమ్మ‌వార్ల‌కు సాదారాళ్లు పొదిగిన నాలుగు ముఖ ప‌ట్టిలు ఉన్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో ఏఈవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎపి.శ్రీ‌నివాస‌దీక్షితులు, సూప‌రిండెంట్ శ్రీ నారాయ‌ణ‌,టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కామ‌రాజు, ఆల‌య అర్చ‌కులు, ప‌రిచార‌కులు పాల్గొన్నారు. టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. « GARUDA VAHANA OBSERVED _ గ‌రుడ వాహనంపై సకలలోక రక్షకుడు » హ‌నుమంత వాహ‌నంపై వేంక‌టాద్రిరామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు
కంచికచర్ల టీడీపీ మండలాధ్యక్షుడు కోగంటి బాబు జన్మదినం సందర్భంగా మండలంలోని కీసర గ్రామంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయ టం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల రూరల్‌, అక్టోబరు 4 : కంచికచర్ల టీడీపీ మండలాధ్యక్షుడు కోగంటి బాబు జన్మదినం సందర్భంగా మండలంలోని కీసర గ్రామంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయ టం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ అబివృద్ధికి కృషి చేయటంతో పాటు కార్యకర్తల కష్టసుఖాలలో పాలు పంచుకుంటున్న గొప్ప వ్యక్తన్నారు. ఇటువంటి జన్మదిన వేడుకలను బాబు మరె న్నో జరుపుకోవాలని కోరుతూ జన్మదిన కేక్‌ను కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కీసర గ్రామానికి చెందిన దామాల రమేష్‌, కలతోటి సిలువరాజాతో పాటు ఎనిమి ది కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మన్నే సాత్విక, కుమా రి, స్వర్ణకుమారి, పలువురు నేతలు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే జన్మలో చూడని హైదరాబాద్‌ను చూపిస్తానని కేసీఆర్ ప్రకటించారు. తనలాంటి మొండోడు ఉంటేనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఖండాంతారాలు దాటుతుందని చెప్పారు. -జన్మలో చూడని హైదరాబాద్‌ను చూపిస్తా -పొట్టకూటి కోసం వచ్చిన సెటిలర్లతో విభేదాల్లేవు -విద్వేషాలు రెచ్చగొట్టేందుకే జేపీ, దినేశ్‌రెడ్డి మల్కాజిగిరిలో పోటీ -అల్వాల్ సభలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని అల్వాల్‌లో టీఆర్‌ఎస్ బహిరంగ సభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ను గెలిపించడం ద్వారా ట్రాఫిక్, కాలుష్యం, మురికివాడలు లేని భాగ్యనగరం చూడగల్గుతామని చెప్పారు. కేంద్రం ప్రకటించిన ఐటీఐఆర్ కావాలన్నా.. లక్షల కోట్ల నిధులు రావాలన్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుందని అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని బంజారాహిల్స్ మాదిరిగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. నగరానికి 24 గంటల నిరంతరాయ విద్యుత్‌తోపాటు, మంచినీటికి కొరత లేకుండా చూస్తానని చెప్పారు. వితంతువులకు వేయి రూపాయలు, వృద్ధులకు రూ.15 వందలు పింఛన్లు ఇస్తామన్నారు. కేవీపీ కాళ్లు మొక్కిన పొన్నాల వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దగ్గర గుమస్తాగా పని చేసిన కేవీపీ కాళ్ళు మొక్కి పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ రాష్ర్టానికి న్యాయం చేస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. ఆరు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న పొన్నాల కనీసం స్వంత నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసుకోలేని అసమర్ధుడని విమర్శించారు. ఇటువంటి వ్యక్తి తెలంగాణను ఎలా ఉద్ధరిస్తాడని ప్రశ్నించారు. ఉద్యమంలో కాంగ్రెస్ నేతలెక్కడ? తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆంధ్ర ఉద్యోగులు వెళ్ళి పోవాలంటే తప్పా? అని నిలదీశారు. చచ్చినా.. చంపినా సరే తెలంగాణ దిక్కే మాట్లాడుతానని కేసీఆర్ ఉద్ఘాటించారు. పొట్టకూటి కోసం వచ్చిన సెటిలర్లతో విభేదాలు లేవని, కేవలం పొట్టకొట్టే సీమాంధ్రుల పైనే పోరాటం అన్నారు. చం ద్రబాబు, వెంకయ్యనాయుడు కలిసి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నాయకులు వద్దని చెప్పినా చంద్రబాబుతో వెంకయ్య బీజేపీకీ లింకు పెట్టించాడని అన్నారు. 90 సీట్లలో టీఆర్‌ఎస్‌దే జయం రాబోయే ఎన్నికల్లో 90 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేసారు. నగర శివార్లలో టీఆర్‌ఎస్‌కు బలం లేదని విమర్శించేవారు ఈ సభకు వచ్చిన జనా న్ని చూడాలని అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీలకు ఓటు వేస్తే తెలంగాణ చిన్నబోతదని అభిప్రాయపడ్డా రు. 14 వందల మంది బలిదానాలు చేసుకుంటే మల్కాజిగిరి ప్రజలు సోయితప్పి ఎందుకున్నారని తెలంగాణ బాధపడ్తదని అన్నారు. దినేశ్‌రెడ్డి, జేపీలకు మల్కాజిగిరి స్థానంపై ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. సెటిలర్ల ఓట్లు ఉన్నాయని ఇక్కడ పోటీ చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ సెటిలర్లు వారికి ఓటు వేస్తే.. మనంకూడా జిద్దుగా ఉండాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి మైనంపల్లి హన్మంతరావును ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాలన్నారు. మైనంపల్లిని విజయవాడలో నిలబెడితే ఆంధ్ర ప్రజలు ఒక్క ఓటైనా వేస్తారా? అని ప్రశ్నించిన కేసీఆర్.. మరి మనమెందుకు సీమాంధ్ర నాయకులకు, సీమాంధ్ర పార్టీలకు ఓట్లు వేయాలని అన్నారు. మల్కాజిగిరిలో టీఆర్‌ఎస్‌ను గెలిపించుకుని తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇది ఆత్మగౌరవానికి పరీక్ష అన్నారు. చివరి వరకూ అడ్డుకున్న బాబు చంద్రబాబు చివరి వరకు తెలంగాణను అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. కొంతమంది సన్నాసులు ఇంకా చంద్రబాబును అంటిపెట్టుకున్నారని అన్నారు. సీమాంధ్రులు ఇంకా తెలంగాణ ప్రజల మీద పెత్తనం చెలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లోక్‌సత్తాకు సత్తా లేదని ఆది ఏక్‌సత్తాగా తయారైందని అభివర్ణించారు. కేసీఆర్ విద్వేషాలు రెచ్చగొడ్తారని ఆరోపిస్తున్నారని, నిజానికి సీమాంధ్రులే విద్వేషాలు రెచ్చగొడ్తున్నారని ఆరోపించారు. దినేష్‌రెడ్డి నెల్లూరులో, జేపీ విజయవాడలో పోటీ చేయకుండా తెలంగాణలో పోటీ చేయడం విద్వేషాలు రెచ్చగొట్టడం కిందకు రాదా? అని ప్రశ్నించారు. 60 ఏళ్ళలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే తెలంగాణకు తీరని నష్టం చేశాయన్నారు. కొత్తగా టీఆర్‌ఎస్ మేస్త్రీనే ఎన్నుకోవాలని సూచించారు. సభలో మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కనకారెడ్డి, కంటోన్మెంట్ అభ్యర్థి గజ్గెల నగేష్, మేడ్చల్ అభ్యర్థి సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్, ఉప్పల్ అభ్యర్థి సుభాష్‌రెడ్డి, కూకట్‌పల్లి అభ్యర్థి పద్మారావు, కుత్బుల్లాపూర్ అభ్యర్థి కొలను హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
యస్.యమ్. కె ఫిలిమ్స్ మరియు వి.యన్.ఆర్.ఫిలిమ్స్ పతాకాలపై మోహన్ కృష్ణ ,వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ ,హీరో హీరోయిన్లుగా రాజుబాబు దర్శకత్వంలో యస్.యమ్. కె ఫిలిమ్స్, వి.యన్.ఆర్.ఫిలిమ్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం ఘరానా మొగుడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ మణికొండ లోని శివాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు సాగర్ గారు హీరోహీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశం పై గౌరవ దర్శకత్వం వహించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు,జెమిని సురేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏ.ఎస్ రవికుమార్ గారు స్క్రిప్ట్ అందించారు. పూజా కార్యక్రమాల అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో *తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ* ..మోహన్ గారు చిరంజీవికి హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా టైటిల్ తో తను సినిమా తీస్తున్నాడు. చిరంజీవి గారి ఘరానా మొగుడు ఎంత ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు తను తీస్తున్న ఈ ఘరానా మొగుడు చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని అన్నారు . *దర్శకుడు సాగర్ మాట్లాడుతూ*… మోహన్ కృష్ణ నాకు మంచి మిత్రుడు తను డిఫరెంట్ సబ్జెక్ట్ ను సెలక్ట్ తీసుకొని మూవీ తీస్తాడు. వాణి విశ్వనాథ్ నా చిత్రంలో నటించింది.ఇప్పుడు ఈ ఘరానా మొగుడు చిత్రంలో వాణి విశ్వనాథ్ కూతురు వర్శ విశ్వనాథ్ నటిస్తున్నందంటే ఇది నాకు సొంత బ్యానర్ లాంటిదే ఈ చిత్రం మోహన్ కు, వర్శ విశ్వనాథ్ కు మంచి విజయం సాధించి వారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని అన్నారు. *రవికుమార్ చౌదరి మాట్లాడుతూ* ..1992 లో చిరంజీవి గారి ఘరానా మొగుడు చిత్రం గొప్ప సంచలనం సృష్టించింది. ఆ చిత్రం లాగే ఈ మూవీ కూడా పెద్ద విజయం సాధించాలని కోరుతూ ఈ చిత్ర బృందానికి మంచి పేరు రావాలని అన్నారు. *హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మాట్లాడుతూ* ..ఈ ప్రొడక్షన్ లో ఈ మూవీ చెస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది .నా మొదటి సినిమా రెడ్డి గారి ఇంట్లో రౌడీ ఇజం విడుదల కు సిద్ధంగా ఉంది. నా సెకండ్ మూవీ మా అమ్మగారు నటించిన ఘరానా మొగుడు టైటిల్ లో నేను నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. *నిర్మాత, హీరో, మోహన్ కృష్ణ మాట్లాడుతూ* ..ఇప్పటివరకు నేను బావ మరదలు, మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ సినిమాలు తీయడం జరిగింది .ఇది ప్రొడక్షన్ నెంబర్ త్రీ లో చిరంజీవిగారు నటించిన ఘరానా మొగుడు టైటిల్ తో చిత్రం తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో వాణి విశ్వనాథ్ గారి కూతురు విశ్వనాథ్ గారు నటిస్తున్నారు. దర్శకుడు నాకు చెప్పిన కథ నచ్చడంతో నేను సినిమా తీయడానికి ముందుకు వచ్చాను. మంచి సబ్జెక్టు తీసుకొని మంచి కంటెంట్ తో వస్తున్న ఈ ఘరానా మొగుడు చిత్రం అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు. *దర్శకుడు రాజుబాబు మాట్లాడుతూ* …నాకు చిరంజీవి గారు అంటే ఎనలేని అభిమానం చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఈ ఘరానా మొగుడు సినిమా వచ్చినప్పుడు నేను సెవెంత్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ వ్రాస్తున్నాను. సినిమా చూసిన తర్వాత నాకు సినిమాపై మక్కువ ఏర్పడింది. ఆ తరువాత 1999 లో సినిమా ఇండస్ట్రీ కి వచ్చాను 2019 వరకు నేను పలు దర్శకుల దగ్గర పనిచేశాను. మొదటిసారి నేను మోహన్ కృష్ణ గారికి కథ చెప్పడంతో తను ఈ సినిమాను చేద్దామని చెప్పారు. ఇది నా మొదటి సినిమా. నేను చూసిన మొదటి సినిమా ఘరానా మొగుడు టైటిల్ కు నేను దర్శకత్వం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో దర్శకులపై పూరి గారు నేనింతే తీశాడు. దానికి అది దానికి భిన్నంగా చూపించడం జరిగింది అలాంటి కాన్సెప్ట్ తోనే ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను. ఇది ఒక దర్శకుడి సినిమా ,మాస్ ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న సినీ దర్శకుడి కథ. ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గా తీసుకొని ఘరానా మొగుడు స్టోరీని చేయడం జరిగింది. ఒక సినీ దర్శకుడు సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత దర్శకుడు ఎలాంటి ఆశలతో భావాలతో వస్తాడు ఎలాంటి అంకితభావంతో పని చేస్తాడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని తను ఎలా దర్శకుడిగా నిర్వర్తిస్తాడు అదే సమయంలో అందమైన మంచి మనసు ఉన్న అమ్మాయి తన జీవితంలో ఎదురైన తరువాత ఆయన ప్రయాణం ఎలా సాగింది అనే కథతో ఈ సినిమా తీయడం జరిగింది. అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అన్నారు *నటీనటులు* మోహన్ కృష్ణ(హీరో), వర్ష విశ్వనాథ్ (హీరోయిన్), రావు రమేష్ రావు రమేష్ ,జీవి సుధాకర్ నాయుడు, భానుచందర్, ప్రసన్న కుమార్, సుధ, దేవి, కలర్స్ వాసు, గీతాసింగ్, జబర్దస్త్ అప్పారావు, పృథ్వి ,బోనం బాబి, సమీర్ శర్మ ,పింగ్ పాంగ్ సూర్య, రమేష్ ,బాలాజీ, కీర్తి ,జయశ్రీ తదితరులు *సాంకేతిక నిపుణులు* బ్యానర్ : యస్.యమ్. కె ఫిలిమ్స్, వి.యన్.ఆర్.ఫిలిమ్స్స్క్రీన్ ప్లే డైరెక్షన్. రాజుబాబు అచ్చరథ డి.ఓ.పి : మురళి మ్యూజిక్ :- ఘనశ్యాం స్టోరీ డైలాగ్స్ :- శింగలూరి మోహన్ రావుఎడిటర్ :- కె ఎ వై పాపారావు ఫైట్ మాస్టర్ :- రామ్ సుంకర లిరిక్స్ :-శరత్ చంద్ర స్టిల్స్ :-అంజి డాన్స్ :-రాజ బోయిన, మహేష్ పి.ఆర్.ఓ:- సాయి సతీష్ , రాంబాబు పర్వత నేనిపబ్లిసిటీ డిజైనర్ :- విజయ్ కుమార్ బండి ల్యాబ్ :- లైట్ లైన్ స్టూడియోస్
చాలా మంది మానసికంగా బలహీనంగా ఉంటారు. అలా కాకుండా మానసికంగా దృఢంగా ఉండాలంటే ఈ హాబిట్స్ ని అలవాటు చేసుకోవాలి. ఈ రోజు వీటిని మీరు అలవాటుగా మార్చుకుంటే అప్పుడు ఖచ్చితంగా మానసికంగా దృఢంగా ఉండడానికి అవుతుంది అయితే మరి మానసికంగా దృఢంగా ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ముఖ్యం: సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వాళ్లు కచ్చితంగా సాధించడానికి అవుతుంది ఏదైనా ఫెయిల్ అయితే ఇతరుల మీద కి తోసేయడం.. పని చేయకుండా ఎస్కేప్ అయిపోవడం ఇలాంటివి చేయకుండా సెల్ఫ్ డిసిప్లిన్ తో బాధ్యతగా ఉంటే పనులు సక్రమంగా పూర్తవుతాయి దీనితో మానసికంగా దృఢంగా ఉండడానికి అవుతుంది. తప్పుల్ని తెలుసుకొని ఇంప్రూవ్ చేసుకోవడం: చాలామంది ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు కానీ మళ్లీ మళ్లీ అవే తప్పుల్ని రిపీట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా తప్పుని తెలుసుకుని దానిని సరి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇలా ఉండడం వల్ల కూడా మానసికంగా ధృడంగా ఉండొచ్చు. ప్రమాదకరమైన రిలేషన్షిప్స్ కి దూరంగా ఉండండి: చాలామంది మానసికంగా బలహీనంగా అవడానికి కారణం ఫేక్ రిలేషన్షిప్స్. అనవసరంగా ఫేక్ రిలేషన్ షిప్ లో ఇరుక్కోవద్దు. దీని వల్ల మానసికంగా కృంగిపోతుంటారు మనశ్శాంతి కూడా ఉండదు మానసికంగా దృఢంగా ఉండాలంటే ఇటువంటి రిలేషన్స్ కి దూరంగా ఉండాలి. బలహీనతల్ని బలంగా మార్చుకోండి: ఏదైనా బలహీనత ఉంటే దానిని బలంగా మార్చుకోవడానికి చూసుకోవాలి వాటిని ఎదుర్కొని జాగ్రత్తగా బలంగా మార్చుకుంటే మానసికంగా దృఢంగా ఉంటారు. విజేతలవుతారు.
Telugu News » Health » Canada confirms 681 cases of monkeypox 331 reported from Quebec international news in Telugu Monkeypox: కెనడాను వణికిస్తున్న మంకీపాక్స్.. 681 కేసుల నిర్ధారణ.. నిత్యం పదుల సంఖ్యలో.. Monkeypox in Canada: కెనడా దేశాన్ని మంకీపాక్స్ వణికిస్తోంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 681 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయినట్లు పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా (PHAC) వెల్లడించింది. Monkey Pox Janardhan Veluru | Jul 23, 2022 | 11:22 AM Monkeypox in Canada: కెనడా దేశాన్ని మంకీపాక్స్ వణికిస్తోంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 681 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయినట్లు పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా (PHAC) వెల్లడించింది. క్యూబెక్‌ ప్రావిన్స్‌లో అత్యధికంగా 331 కేసులు నమోదయ్యాయి. అంటారియోలో 288, బ్రిటిష్ కొలంబియాలో 48, అల్బెర్టాలో 12, సస్కట్చేవాన్‌లో రెండు కేసులు నిర్ధారణ అయినట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రాంతీయ, ప్రాదేశిక ప్రజారోగ్య భాగస్వాములతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు PHAC తెలిపింది. అక్కడ నెలకొన్న పరిస్థితుల ఆధారంగా రోగనిరోధక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. మంకీపాక్స్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కెనడా ప్రజలు హడలెత్తిపోతున్నారు. జూలై 18 నాటి వరకు కెనడాలోని క్యూబెక్‌లో అత్యధికంగా మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఆ మేరకు అక్కడ వైరస్ వ్యాప్తి రిస్క్ ఎక్కువగా ఉన్న వారికి 12,553 మోతాదుల వ్యాక్సిన్‌ను అందించారు. క్యూబెక్ ప్రాంతాలలో హై రిస్క్ ఏరియాల్లోని జనాభాకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. మంకీపాక్స్ అనేది ఒక వైరల్ వ్యాధి. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి లైంగిక సంబంధం, చర్మ ఇన్ఫెక్షన్, శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. అలాగే ఈ వ్యాధి బారినపడిన ఓ వ్యక్తి వినియోగించిన దుస్తులు, బెడ్, తువ్వాళ్లు, టూత్ బ్రష్‌లు, నార వంటి వస్తువులను మరో వ్యక్తి వాడినా.. మంకీపాక్స్ వ్యాధి వ్యాపిస్తోంది. స్వలింగ సంపర్కుల ద్వారా కూడా మంకీపాక్స్ వైరస్ వ్యాపిస్తుందని అధ్యయనాల్లో నిర్థారణ అయ్యింది. భారత్‌లో మూడు కేసులు నిర్ధారణ.. కాగా మన దేశంలో ఇప్పటి వరకు మూడు మంకీ పాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మూడు కేసులు కేరళలోనే నమోదయ్యాయి. దీంతో కేరళతో పాటు పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మంకీపాక్స్ కేసులు పెరగకుండా నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నాయి. విదేశీ ప్రయాణీకులకు విమానాశ్రయాలు, ఓడరేవుల్లో హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు మూడు మంకీపాక్స్ కేసులు నమోదుకావడంతో అటు కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విదేశీ ప్రయాణీకులకు కఠిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా విమానాశ్రయాలు, ఓడరేవులకు ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీలకు విస్తృతంగా హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించింది. ఇవి కూడా చదవండి Crime news: చనిపోయి రెండున్నరేళ్లయినా ఇంట్లోనే డెడ్ బాడీ.. అయినప్పటికీ నెలనెలా అద్దె వసూలు Viral Video: నది మధ్యలో ట్రైన్‌.. ఊహించని రీతిలో భారీ అగ్నిప్రమాదం.. షాకింగ్ వీడియో.. Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్‌కు గట్టి షాక్‌.. లిజ్‌ ట్రస్‌కే జై కొడుతున్న టోరీ సభ్యులు.!
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 సాధారణ రోజులతో పోలిస్తే 50 శాతం పెరిగిన ధరలు దసరా పండుగ ఎఫెక్ట్‌ నాటుకోళ్లు, గొర్రెలు, మేకల కొనుగోలుకు తరలివచ్చిన జనం రావికమతం, అక్టోబరు 4: మండలంలోని మేడివాడలో మంగళవారం జరిగిన సంతలో గొర్రెలు, మేకలు, నాటుకోళ్ల అమ్మకాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా నాటుకోళ్లను కొనుగోలు చేయడానికి జనం ఎగబడ్డారు. కొంతమంది అయితే మేడివాడ శివారులో ఇటు నర్సీపట్నం వైపు, అటు రావికమతం వైపు కాపు కాసి, సంతలో కోళ్లను అమ్మడానికి తీసుకువస్తున్న వారిని ఆపి మరీ కొనుగోలు చేశారు. దసరా పండుగ కావడంతో సాధారణ రోజులతోపోలిస్తే సుమారు 50 శాతం వరకు ధరలు పెరిగాయని అంటున్నారు. మండలంలోని మేడివాడ ప్రతి మంగళవారం సంత జరుగుతుంది. చుట్టుపక్కల మండలాల నుంచి పలువురు రైతులు గేదెలు, ఆవులను, జీవాల పెంపకందారులు గొర్రెలు, మేకలు, నాటుకోళ్లను తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. కాగా బుధవారం దసరా పండుగ కావడంతో గొర్రెలు, మేకలు (పోతులు), నాటుకోళ్ల అమ్మకందారులు, కొనుగోలుదారులు భారీగా తరలివచ్చారు. చుట్టుపక్కల మండలాలతోపాటు అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, తదితర దూర ప్రాంతాల నుంచి దళారులు, వ్యాపారులు పోటెత్తారు. దీంతో గొర్రెలు, మేకలు, నాటుకోళ్లకు గిరాకీ పెరిగింది. సాధారణంగా కిలోన్నర బరువు వుండే నాటు కోడి రూ.600లకు లభిస్తుంది. కానీ ఈ వారం రూ.1,000 నుంచి రూ.1,200 పలికింది. మూడు కిలోల పుంజు అయితే రూ.2 వేలు పైబడి, నాలుగు కిలోల పుంజు రూ.3 వేలకు అమ్ముడుపోయాయి. గొర్రె పొట్టేళ్ల ధరలు కూడా బాగానే పెరిగాయి. సుమారు 20 కిలోల బరువున్న పొట్టేలు రూ.15,000 పలికింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు పొట్లేళ్లను కొనుగోలు చేసి మినీవ్యాన్‌లో తరలించుకుపోయారు. తమకు మంచి ఆదాయం లభించిందని అమ్మకం దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సంప్రదాయ ఆహారపు అలవాట్లలో మనం చాలా పోగొట్టుకొన్నాం. కాలం మారుతున్నపుడు మనం కూడా కాలానికి అనుగుణంగా మారక తప్పదు. అయితే ఈ మార్పు ఇతరులని అనుకరించడం వల్ల తెచ్చిపెట్టుకున్న మార్పా లేక మన పునాది ఆధారంగా కాలానుగుణంగా ప్రాంతీయ వాతావరణ నేపధ్యంగా చేసుకుంటున్న మార్పా అన్న దాని మీద స్పష్టత ఉండాలి. సంప్రదాయ వంటల్ని సూక్ష్మంగా పరిశీలిస్తున్నపుడు కొన్ని కాలానికి తగ్గట్టు మరికొన్ని శరీర ప్రకృతికి తగ్గట్టు, ఇంకా కొన్ని ప్రాంతీయతని అట్టిపెట్టుకుని ఉన్నట్టు చూడగలం. వైవిధ్యమున్న వంటల్లో వైవిధ్యమున్నచారు కూడా ఒకటి. అలాంటి చారుల ని గురించి ముచ్చటించుకోవడం నేటి మన ముచ్చట. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జానపదగిరిజన విజ్ఞానపీఠం వరంగల్లు, వరంగల్లు, తూర్పు గోదావరి జిల్లాల్లో జరిపిన క్షేత్రపర్యటన సమాచారం దీనికి ఆధారం. ఆ సమాచారమంతా విషయదాతల పరంగా నోటు పుస్తకాలలోకి ఎక్కించడమే కాకుండా గ్రామాల ఆధారంగా, ఒక్కో ప్రక్రియకి సంబంధించిన రిపోర్టులు కూడా తయారు చేసినారు. 1995 నుంచి ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అల్లం చారు, ఉలవపప్పు చారు, కంద చారు, కందిపప్పు చారు, గుణ చారు, చింత పండు చారు – పలుచని చారు – పిక్క చారు, తర్వాని చారు - కలి చారు, నల్లేరుకాడ చారు, నిట్టపప్పు చారు, పచ్చిపులుసు – గొడ్డు పులుసు, పులగాల చారు, మిరియాల చారు, వాము చారు, లక్ష్మీ చారు, పులిసిన గంజి – చారులో వాడుకొనే వస్తువులని బట్టి, తయారు చేసే విధానాన్ని బట్టి చారులు పలు రకాలు. మారే క్రమాన్ని బట్టి వాటి గుణాలు కూడా మారతాయన్నది గమనించాల్సిన విషయం. చారు అంటేనే చింతపండు రసం. చింతకాయల్ని ఉడకబెట్టి కూడా. వీటికన్నా భిన్నంగా కలి – తర్వాని ఉపయోగించి చేసే చారులకి అనుష్ఠాన నేపధ్యం ఉంది. కంద చారులో పచ్చి చింతకాయలను నీటిలో ఉడకబెట్టి చారును పిసికి, కంద ముక్కలను నీటిలో ఉడికించి, తొక్క తీసి, రోట్లో వేసి దంచి, ఈ దంచిన ముద్దను చారులో కలిపి, ఈ చారులో రొయ్యలను వేసి ఉడికించి, తరువాత తాళింపు పెడుతారు. ఉలవపప్పును నీటిలో ఉడికించి, ఆ నీటిని చింతపండు రసంలో కలిపి, ఉప్పు, కారం వేసి మరిగించి, ఒక దాకలో నూనె పోసి, తాళింపు పెట్టి, అందులో మరిగించిన చారును పోసి ఉలవ చారు చేస్తారు. కందిపప్పు చారు కందిపప్పును నీటిలో ఉడికించి, దానిలో ఉప్పు, కారం, చింతపులుసు పోసి మరగనిచ్చి, తాళింపు పెడుతారు. ఒక గుణలో నూనెపోసి అనపకాయ, ములగకాడలు, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, టమాటా, బెల్లం, చింతపండు, కందిపప్పు అన్నింటినీ వేసి వేయించి, నీళ్ళు పోసి మరిగించి, ముక్కలు కొద్దిగా ఉడికిన తరువాత అల్లం వెల్లుల్లి జిలకర కలిపి రుబ్బిన ముద్దను కూడా వేసి, ఒక దాకలో నూనె పోసి తాళింపు పెట్టి, ఈ తాళింపును మరుగుతున్న చారులో పోసి, గుణచారును చేస్తారు. చింతపండును నీటిలో నానబెట్టి, రసం తీసి, ఒక దాకలో నూనె పోసి, అందులో జిలకర, కరివేపాకు, ఎండమిర్చి వేసి తాళింపు పెట్టి, అందులో చింతపండు రసం పోసి, చారును చేస్తారు. తర్వానీ చారు బెండకాయ ముక్కలు, నెల్లికూర, బలుసు కూరలను ఒక దాకలో నీళ్ళలో ఉడికించి, అందులో ఉప్పు, కారం వేసి దించి, మరొక దాకలో నూనె పోసి, తాళింపు పెట్టి, అందులో ఉడికించిన చారు పోసి, మరిగించి దించుతారు. నల్లేరుకాడ చారు గరం మసాలా, ఎండుమిర్చి,అల్లం అన్నింటినీ కలిపి సన్నికల్లుమీద మెత్తగా నూరి, ఒక దాకలో నూనె పోసి తాళింపు పెట్టి అందులో నల్లేరు కాడలు, మసాలా ముద్ద వేసి, చింతపండు పులుసు పోసి, ఉప్పు వేసి మరిగించి దించుతారు. నిట్టపప్పు చారు నిట్ట పప్పును నీటిలో ఉడికించి, ఉప్పు, కారం వేసి మరగబెడుతారు. కొందరు ఈ కూరను మరిగించిన తరువాత తాళింపు పెడుతారు. కొందరు తాళింపు పెట్టకుండానే వండుతారు. పచ్చిపులుసు చింతపండును నానబెట్టి పులుసు చేసి, అందులో అరటిపండు, కాల్చిన వంకాయలను, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను పిసికి కలుపుతారు. పులుసును వేడి చేయరు. కొన్ని చోట్ల తెల్ల వంకాయలను, పచ్చి మిరపకాయలను నిప్పుల మీద కాల్చి, చింతపండు రసంలో పిసికి, ఉప్పు, బెల్లం కలుపుతారు, తాళింపు పెట్టరు. ఇంకా వంకాయ, అరటికాయ, ఉల్లిపాయలను నిప్పులమీద కాల్చి, వాటిని చింతపండు రసంలో వేసి పిసికి చారు చేస్తారు. ఈ చారుకు తాళింపు పెట్టరు. చింతపండును నీటిలో నానబెట్టి, రసం తీసి, ఒక దాకలో నూనె పోసి, అందులో జిలకర, కరివేపాకు, ఎండమిర్చి వేసి తాళింపు పెట్టి, అందులో చింతపండు రసం పోసి, కొద్దిగా నీళ్ళను ఎక్కువగా పోసి, పలుచని చారును చేస్తారు. మిరియాలు, జిలకర, ధనియాలు అన్నింటినీ కలిపి సన్నికల్లు మీద మెత్తగా నూరి, ఒక దాకలో నూనె పోసి, తాళింపు పెట్టి, అందులో నూరిన ముద్దను వేసి వేయించి, చింతపండు రసం పోసి కలిపి, మిరియాల చారును చేస్తారు. ఒక దాకలో నూనె పోసి, అందులో ఉల్లిపాయలు, నువ్వులు, కారం వేసి తాళింపు పెట్టి, అందులో చింతపండు రసం కలిపి లక్ష్మీ చారును చేస్తారు. ఇంకా గంజి ఒక పాలు, బియ్యం కడుగు నీళ్ళు రెండుపాళ్ళు కలిపి లక్ష్మీ చారును చేస్తారు. పులిసిన గంజిలో చింతపండు లేకుండా పులిసిన గంజిలో ఉల్లిపాయలు, ఉప్పు, కారం, ఎండు రొయ్యలు, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసి, తాళింపు పెడుతారు. పులగాల చారు ఒక దాకలో నూనె పోసి తాళింపు పెట్టి, అందులో మామిడి బద్దలు, రొయ్యలు, మెత్తాల్లు, ఉప్పు, కారం, వర్ర, తర్వాని వేసి, నీళ్ళు పోసి ఉడికించి దించుతారు. కొంత మంది ఒక దాకలో నూనె పోసి తాళింపు పెట్టి, అందులో మామిడి బద్దలు, ఉల్లిపాయలు, వర్ర, ఉప్పు, కారం వేసి, మరిగించి దించుతారు. కంద చారు ఎక్కువగా తింటే అజీర్ణం చేస్తుంది. గుణ చారుని పూర్వం ప్రత్యేకంగా పెళ్లిళ్లకు చేసేవారు. రెండు రోజుల దాకా నిల్వ ఉంటుంది. తర్వాని చారుని బాలింతలకు, పుష్పవతికి పెట్టరు. కాని కొత్త కాపురం పెట్టినపుడు చేస్తారు. నల్లేరు కాడ చారు, మిరియాల చారు పైత్యాన్ని తగ్గిస్తాయి. బెల్లం కలిపి చేసే పచ్చిపులుసుని సేనాపతులు ఎక్కువగా చేసుకుంటారు. లక్ష్మీ చారు ఎక్కువగా తాగితే వేడి చేస్తుంది. ఈ చారుల తయారీలో చింతపండు, చింతకాయలతో పాటు పులిసిన గంజి – తర్వాని - కలి నీళ్లు - కూరాడు కలి వాడుకోవడం కూడా ఉంది. తెలంగాణా లో కూరాడు కుండగా, కోస్తా ప్రాంతంలో తర్వాని గా, నెల్లూరు ప్రాంతంలో కలికుండగా ప్రచారంలో ఉన్న కలి కి ఇందులో ప్రాధాన్యత ఉంది. ఓ కొత్తకుండని తెచ్చి పసుపురాసి బొట్లు పెట్టి నైఋతి మూలకు చుట్టకుదురు వేసి దాని మీద పెడతారు. అన్నం వండినాక వార్చిన గంజిని కొంత అందులో పోస్తారు. రెండో రోజు కొంత గంజి పోస్తారు. మూడోరోజు మరికొంత గంజి పోస్తారు. గంజి పులుస్తుంది. చారు చేసుకొనేటపుడు ఆ పులిసిన గంజిని కొంత కుండలో ఉంచి మిగతాది ఒక దాకలో పోసి, అందులో ఉల్లిపాయలు వంకాయ పచ్చి మిర్చి ఉప్పు కారం బెండకాయలు, ఎండు రొయ్యలు, వేసి పొయ్యి మీద పెట్టి కాచి, తాళింపు పెట్టుకొంటారు. శుక్ర, మంగళ వారాల్లో ఈ కుండని బెడతారు కాని ఆ గంజితో చేసిన చారు ని మాత్రం ఇతరులెవరికీ పోయరు. అలా పోస్తే తమ ఇంట్లోని లక్ష్మి తొలగిపోతుందని భావిస్తారు. ఈ కుండ ఇంటిలో ఉంటే లక్ష్మి గా భావిస్తారు. అయితే ఈ కుండని సంక్రాంతి నెలపట్టు మాసం (ధనుర్మాసం) లో పెట్టరు. ఎందుకంటే ఈ పండగ రోజుల్లో శంకరుడు వచ్చి “పులగాల” కుండలో కూర్చుంటాడని, శంకరున్ని ఇంటిలో బంధించినట్టవుతుందని ఈ నెల రోజులు కుండని తీసేస్తారు. ఈ చారు రుచికి పుల్లగా ఉంటుంది. వర్షకాలంలో పులిసిన గంజి వల్ల రొంప చేస్తుంది. వేసవి కాలంలో చలువదనం కోసం ఈ చారు ఎక్కువగా చేసుకొంటారు. కుండలో మిగిలి ఉన్న పులిసిన గంజిని అన్నం వండే ముందు ఎసట్లో ఒక పాలు పోసి వండితే అది సాయంత్రం దాకా పాడవదు. ఈ లక్ష్మీ చారును కాచేటపుడు పాత రోజుల్లో ఈ పాట పాడేవారు – లచ్చిమి చారమ్మలారా లచ్చిమి చారో, పొంగిపోతే దెంగి లేదు లచ్చిమి చారో, కాకినాడ కరేపాకు లచ్చిమి చారే, బెండకాయ ముక్కలకి లచ్చిమి చారే, ఆగు తాగేత్తాడమ్మాలారా లచ్చిమి చారే, లచ్చిమి చారమ్మాలారా లచ్చిమి చారే, పొంగిపోతే దెంగి లేదు లచ్చిమి చారే, బెజవాడ బెండకాయ లచ్చిమి చారే, ఏలూరి ఎండు రొయ్యలు లచ్చిమి చారే, ఆడు తాగేత్తాడమ్మలారా లచ్చిమి చారు, లచ్చిమి చారమ్మలారా లచ్చిమి చారే, పొంగిపోతే దెంగి లేదు లచ్చిమి చారే, ఆడు తందనాలాడతాడు లచ్చిమి చారే, ఇరుగమ్మ పొరుగమ్మ లచ్చిమి చారే, తాగేత్తాడమ్మలారా లచ్చిమి చారే, ఆడు తాగేత్తాడమ్మలారా లచ్చిమి చారే – అంటూ ఒక్కో పాదాన్ని రెండేసి సార్లు పాడతారు (తూర్పు గోదావరి జిల్లా పల్లిపాలెం నుంచి సేకరణ). ఈ పాటని కూడా చేర్చుకొంటే లక్ష్మీ చారు ని ప్రత్యేకంగా చూస్తున్నట్టు అర్థమవుతుంది. ఇందులో 1. వేసవికాలంలో చలువచేస్తుంది, అందుకని తాగుతారు. వర్షాకాలంలో రొంప జేస్తుంది అందుకని తాగరు. అంటే దీని గుణం కాలానుగుణంగా ఉంటుందన్నమాట. 2. పాటలో మగడు తాగేత్తాడని, తాగినపుడు తందనాలాడతాడని చెప్పడం ఆలోచించాల్సి ఉంది. అలాగే తయారు చేసేటపుడు పొంగితే ఆ గుణం (తందనాలాడడం) పోతుందని కూడా పాట చెబుతుంది. 3. ధనుర్మాసంలో ఈ లక్ష్మీకుండను పెట్టరు. అంటే లక్ష్మీచారుకి, మగసిరికి ఏదో అవినానుభావ సంబంధం ఉందన్న విషయం గుర్తించవచ్చు కాని నిర్ధారించడానికి మరికొన్ని ఆధారాలు కావాలి. లక్ష్మీచారుని ఐశ్వర్యానికి ప్రతీకగా (లక్ష్మి అంటేనే ఐశ్వర్యం కదా) పవిత్రంగా చూసుకొంటున్నారు. దానికి తగ్గట్టుగా కథలు, నమ్మకాలు కనబడుతున్నాయి. పాటని, నమ్మకాలని, ఆచారాలని, ఉపయోగాలని కలుపుకొని చూస్తే ఆ ఐశ్వర్యంలో మగసిరిని కూడా కలుపుకొన్నారన్న విషయం అర్థం అవుతుంది. ధనుర్మాసం మొత్తం మగసిరిని నియంత్రించుకోవాలన్న ధ్యాసని ప్రేరేపించేవే కనుక ఈ లక్ష్మీ చారుకు కూడా ఆ గుణం ఉందని ఆంతర ప్రమాణాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకు ధనుర్మాసంలో పెట్టరాదు అన్న ఆంక్ష వెనుక ఈ నమ్మకం బలంగా ఉన్నట్టు గుర్తించగలం. సాహితీ ప్రేమికులు, జానపదవిజ్ఞాన పరిశోధకులు మరిన్ని విషయాలతో స్పందించగలరని ఆశిస్తూ, నాగపట్ల భక్తవత్సల రెడ్డి /తిరుపతి
బాబూ.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేస్తావా..? ఆక్వా రైతులను ఆదుకోండి పార్టీ నేతల సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కీలక ప్రకటన నిషేధిత ప్లాస్టిక్ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత శ్రీ‌నాథ్‌రెడ్డి పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్ సమావేశం ప్రారంభం కాసేపట్లో పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం బడుగు, బలహీనవర్గాలకు వెన్నుపోటే బాబు డీఎన్ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం You are here హోం » టాప్ స్టోరీస్ » తాడేపల్లిగూడెంలో అగ్నిప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి తాడేపల్లిగూడెంలో అగ్నిప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి 11 Nov 2022 10:56 AM బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం క్షతగాత్రులకు ఉత్తమ వైద్యం అందించాలని ఆదేశాలు తాడేప‌ల్లి: తాడేపల్లిగూడెంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా ప్రాంతంలో తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి మంచి వైద్యం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున సహాయం అందించాలని, బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
1881లో పుట్టి పంథొమ్మిదేళ్ల చిన్నవయసులోనే (1899లో) మరణించిన వేమూరి శారదాంబ పదహారేళ్ళ వయసులో చెప్పిన ప్రబంధం నాగ్నజితీ పరిణయం. శారదాంబ సంగీత సాహిత్య వేత్త, సాంఘికన్యాయాన్ని ఆకాంక్షించిన సంస్కర్త, న్యాయవాది అయిన దాసు శ్రీరాములుగారి కూతురు. ఆరుగురన్నల చెల్లెలు. స్త్రీవిద్యాభిమాని అయిన శ్రీరాములుగారు బిడ్డకు సంస్కృత తెలుగు సాహిత్యాలు చెప్పించటమే కాక, సంగీతంలోనూ శిక్షణ ఇప్పించారు. తొమ్మిదేళ్లకే సంగీత కచేరీలు ఇవ్వగలిగిన స్థాయికి చేరింది. పదునాలుగేళ్లకే పద్యరచన ప్రారంభించింది. మాధవ శతకం ఆమె మహిళాభ్యుదయ దృక్పథానికి సంబంధించిన రచన కాగా నాగ్నజితీ పరిణయం ఆమె ప్రాచీన సాహిత్య పాండిత్య గరిమకు నిలువుటద్దం. శారదాంబ ఇంటి పేరు పెళ్లి వల్ల వేమూరి అయింది. వేమూరి రామచంద్రరావు ఆమె భర్త. 1888లో వాళ్ళ పెళ్లి అయింది. అప్పటికి శారదాంబ వయసు ఏడేళ్లు. మరొక ఐదారేళ్లకు కాపురానికి పోయిందనుకొన్నా ఆమె సంసార జీవితం ఐదారేళ్లను మించదు. కాపురానికి వెళ్లిన కాలం, కవితా వ్యవసాయం ప్రారంభించిన కాలం దాదాపు ఒకటే. తొలి చూలు ఆడపిల్ల దుర్గాంబ. మలి చూలు మగబిడ్డ పార్థసారథి. ఈ ప్రసవంలోనే ఆమె మరణించింది. నాగ్నజితీ పరిణయం కృతి భర్త పార్థసారథి. చెన్నైలోని పార్థసారథి కోవెల దేవుడు ఆయన. భర్తతో మద్రాసులో కాపురమున్న కాలంలో శారదాంబ ఈ కావ్యం రాసి ఉంటుందని భావిస్తున్నారు. కూతురి అకాల మరణాన్ని ప్రస్తావిస్తూ దాసు శ్రీరాములుగారు శ్రీ దేవీ భాగవతములో రాసిన ఒక సీస పద్యాన్ని బట్టి నాగ్నజితీ పరిణయం ఆమె 16వ ఏట రాసినట్లు తెలుస్తున్నది. అంటే అది 1896 కావాలి. మాధవ శతకాన్ని ఆయన ప్రస్తావించలేదు. కనుక దాని రచనాకాలం తెలియదు. 14వ ఏట నుండి ‘ముద్దుముద్దుగా అల్లిబిల్లిగా పద్యమల్లటం’ నేర్చినదని తండ్రి చెప్పిన మాటను బట్టి ఆ అల్లిక శతక పద్య మాలిక అయినట్లు ఊహించవచ్చు. అది ఆమె మరణాంతరం 1901లో శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారి సంపాదకత్వంలో వచ్చిన కళావతి మాసపత్రికలో మూడు భాగాలుగా అచ్చయింది. నాగ్నజితీ పరిణయం అయినా ఆమె జీవించి ఉండగా అచ్చయిందో లేదో తెలియదు. ప్రచురణకాలం, తదితర వివరాలు ముద్రించిన పుటలు లేని ప్రతి మాత్రమే లభ్యమైంది. దాసు శ్రీరాములుగారి వంశవారసులు పూనుకొని మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితిని ఏర్పాటు చేసి ఆయన సాహిత్యంతో పాటు శారదాంబగారి ఈ రెండు రచనలు సేకరించి పునర్ముద్రించారు. స్త్రీల సాహిత్య చరిత్రలో వేమూరి శారదాంబ పేరు జారిపోకుండా ఆంధ్రకవయిత్రులులో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కూర్చిపెడితే, స్త్రీల సాహిత్య అధ్యయనానికి ఈ విధంగా అరుదైన వనరులు సమకూర్చి పెట్టినవారు డాక్టర్ దాసు అచ్యుతరావుగారు. నాగ్నజితీ పరిణయము మూడాశ్వాసాల ప్రబంధం. పద్యాలు, వచనాలు కలిపి 231 ఉన్నాయి ఈ కావ్యంలో. మూడు ఆశ్వాసాల చివర పునరావృతమయ్యే ఒక పద్యంతో కలిపితే ఆ సంఖ్య 232 అవుతుంది. ఆ పద్యం ఇది. భాసురమైన నీ వెడదవక్షమునందున శ్రీ వెలుంగగా దాసుల కే కొఱంత సతతమ్మును సంతస మూరి శోభితా వాసులుగారె విశ్వపరిపాలన సుందరరామ శారదా భ్రాసమకీర్తిపూరిత దిగంతరవైభవచంద్ర మాధవా. మాధవుడిని సంబోధించే స్తుతి రూపకమైన ఉత్పలమాల పద్యం ఇది. నీ వక్షస్థలంపై లక్ష్మి విలసిల్లుతుండగా భక్తులకు ఏ కొరతా లేదు. అంతటా సంతోషమే అని చెప్పటం, విశ్వాన్ని పాలించే సుందర రాముడని, వైభవ చంద్రుడని మాధవుడిని స్తుతించటం ఇందులో విషయాలు. అంతే అయితే ఇది సాధారణ పద్యం. ఇందులో శారదాంబ తన భర్త పేరును నాలుగు పంక్తులలో గర్భితం చేసి చెప్పటం విశేషం. ప్రతి పాదం చివరి రగణంలో మొదటి రెండక్షరాలు శారదాంబ భర్త వేమూరి రామచంద్రరావు పేరులోని (రావు అన్న తుది భాగాన్ని మినహాయించి) భాగాలను వరుసగా సూచిస్తాయి. గౌరవ చిహ్నమైన శ్రీ-తో ప్రారంభించి వె- అన్న అక్షరాన్ని కలుపుకున్న భాగాన్ని మొదటి పాదంలో, మూరి- అన్న భాగాన్ని రెండవ పాదంలో, రామ- అన్న భాగాన్ని మూడవ పాదంలో, చివరి పాదంలో చంద్ర- అన్న భాగాన్ని చూడవచ్చు. మాధవ శతకం కూడా ఈ పద్యంతోనే ముగియటం గమనించదగినది. కావ్య పద్ధతి 19వ శతాబ్ది కవయిత్రి వేమూరి శారదాంబ నాగ్నజితీ పరిణయ రచన మధ్య యుగాలలో స్థిరపడిన కావ్యనిర్మాణ పద్దతిలో సాగింది. ప్రథమాశ్వాసంలో మొదటి 10 పద్యాలు కావ్యావతారిక వంటివి. ఇష్టదేవతా స్తుతి, కృతి భర్తను నిర్దేశించుకొనటం ఇందులో ప్రధానం. విష్ణువు, లక్ష్మి, శివుడు, పార్వతి, బ్రహ్మ, సరస్వతి, వినాయకుడు సత్యవాక్కును, భద్రతను ఇచ్చి రక్షించాలని కోరుకొంటుంది. తన కృతిని కన్యగా సంభావించి ‘తిరువలిక్కేణి దివ్యమందిరములోన/ నింతి రుక్మిణితో సుఖియించుచున్న /నంద సుతుడైన సచ్చిదానంద మూర్తి’ని కృతి భర్తగా ఎంచుకున్నది. ఆ తరువాత ఉన్న పద్యం ప్రత్యేకంగా పరిశీలించదగినది. స్త్రీల కావ్యావతారికలలో మాత్రమే అటువంటి పద్యాలు కనబడతాయి. ఎన్నఁగల పొత్తములనేమిఁ గన్నదాన విన్నదాననుఁగాను నే నెన్నఁడైనఁ గన్నవారెల్లఁ గరుణనిందున్నయట్టి యన్ని తప్పుల క్షమియింతురని తలంతు ఏనాడూ చెప్పుకోదగిన పుస్తకాలేమీ చూచినదాన్ని గాను, విన్నదానను గాను, ఈ కావ్యం చూచిన వాళ్ళెవరైనా దయతో ఇందులోని తప్పులన్నీ క్షమిస్తారని తలుస్తాను, అని శారదాంబ వినయంగా పాఠకోత్తములను, పండితులను కోరుకొన్నది ఈ పద్యంలో. ఏ మొల్ల కవితా శైలి అలవడిందని శారదాంబను మెచ్చుకొంటారో ఆ మొల్లనుండి మొదలు పెట్టి ఏ కవయిత్రి అయినా పాఠకోత్తములకు ఈ రకంగానే విన్నపాలు చేసుకొన్నది. మొల్ల తనకు తెలుగు సంస్కృత భాషలు, పద సంపద, వ్యాకరణ ఛందో అలంకార శాస్త్రాలు–ఏవీ తెలియవని, తన కవిత్వంలో తప్పులెంచవద్దని సాటి కవులను కోరింది. తరిగొండ వెంగమాంబ కూడా తాను గురువుల వద్ద చదువుకోలేదని, ఛందస్సు తెలియదని, కావ్య నాటక అలంకార శాస్త్రాల గురించి వినను కూడా లేదని, ఇతిహాసపురాణాలు చదవలేదని పేర్కొనటమే కాదు తనది బాలభాష అంటుంది. ‘నా తప్పొప్పులే రీతిగానైనా గెలిసేయక చిత్తగింపవలయు’నని కోరింది. 16వ శతాబ్ది నుండి మూడువందల ఏళ్ళు ముందుకు వచ్చినా, సాహిత్యరంగంలో మహిళా కవుల మాట వరుస మారలేదంటే సాహిత్య సామాజిక రంగాలు యథాపూర్వకంగా పురుషుల రంగాలుగా ఉండటం వల్లనే. నన్నయ నుండి ఏ పురుష కవి అయినా తమ ప్రతిభా పాండిత్యాల గురించి చెప్పుకొన్నవాళ్ళే గానీ ఇలా తమకేమీ తెలియదని చెప్పుకోలేదు. తప్పులే చేయము అన్న ధిషణాశక్తిపరులు కనుక క్షమించమని కోరే ప్రసక్తే లేదు. ఏ పాండిత్యం లేకుండా కావ్యాలు రాయటం స్త్రీలకు మాత్రం సాధ్యమా అంటే కాదు అనే సమాధానం. వేళ్ళ మీద లెక్కించదగిన సంఖ్యలో మాత్రమే ఉన్న మహిళా కవులు అల్పసంఖ్యాక వర్గంగా పురుషులదైన కావ్య ప్రపంచంలోకి బెదురుబెదురుగా ప్రవేశిస్తున్నారనటానికి, వాళ్ళను ప్రసన్నం చేసుకొనటానికి వాళ్ళకంటే తామెందులోనూ అధికులం కామని నమ్మబలికి వారి దయను పొందటానికి తాపత్రయ పడుతున్నారనటానికి నిదర్శనం. ఇదంతా కవులుగా తమ అస్తితను చాటుకొనే అవకాశాలను కల్పించుకొనటంలో భాగమే. శారదాంబ ఆ వరుసలోని కవయిత్రే. మన ఇతిహాస పురాణ కావ్య ప్రబంధ సాహిత్యరచన అంతా సూతుడు శౌనకాది మహామునులకు చెప్పిన క్రమాన్నో, శుకుడు పరీక్షిత్తునకు చెప్పిన క్రమాన్నో, వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన క్రమాన్నో ప్రస్తావించి ఆ ప్రత్యేక క్రమంలో తాము రాస్తున్నట్లు ఆయా కవులు పేర్కొనటంగా ఉంటుంది. అదొక పద్ధతి. రాసే కవి సర్వానికి తానే కర్తనని అహంకరించకుండా పరంపరాగత మానవానుభవాలను ప్రజలకు అనుస్యూతంగా అందించే సాంస్కృతిక రాయబారిగా తనను తాను వ్యక్తీకరించుకొనటం ఈ పద్దతిలోని ఒక అందం. ఆ వరుసలోనే శారదాంబ తాను ఒనర్పం బూనిన నాగ్నజితీ పరిణయము కథా క్రమం ‘శుక మహర్షి పరీక్షిన్నరేంద్రున కెరింగించిన తెఱంగు’ అని చెప్పుకొన్నది. నాగ్నజితి శ్రీకృష్ణుడి అష్టభార్యలలో ఒకతె. నగ్నజిత్తుడి కూతురు కనుక ఆమె నాగ్నజితి. శ్రీకృషుడితో ఆమె వివాహమైన తీరు ‘నాగ్నజితీ పరిణయము’ కావ్య కథా విషయం. వేమూరి శారదాంబ కంటే పూర్వం ఈ ఇతివృత్తంతో కావ్యాలు రాసిన వాళ్ళు ముగ్గురు. రాజవోలు సుబ్బారాయుడు, వల్లూరి నరసింహ కవి, వెలిదండ్ల అళగిరి. శారదాంబ సమకాలికులు ముగ్గురు. మాడభూషి నరసింహాచార్యులు, శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి, శ్రీనివాసాచార్యులు. శారదాంబతో కలిసి ఏడుగురు. ఒకే విషయాన్ని ఏడుగురు ఎట్లా కవిత్వం చేశారు? కావ్యాలల్లారు? పోల్చి చూచి గుణగణాలను అంచనా వేయటం అది వేరే సంగతి. వీళ్ళ ఎవరికైనా మూల కథావనరు భాగవతమే. భాగవతం పురాణం. పురాణేతిహాస కథలను ప్రబంధాలుగా పెంచి రాసే పద్ధతి మను, వసు చరిత్రల కాలానిది. ఆ మార్గంలోనే వేమూరి శారదాంబ భాగవత పురాణంలోని నాగ్నజితీ పరిణయ కథను పెంచి ప్రబంధం చేసింది. భాగవతం దశమస్కంధం ఉత్తరభాగంలో 126 నుండి 144 వరకు 19 గద్యపద్యాలలో ఉన్న కథ ఇది. శ్రీకృష్ణుడి ఎనిమిదిమంది భార్యలలో ఆరవ ఆమె నాగ్నజితి. ఆమె అసలు పేరు సుదంత. శ్రీకృష్ణుడి పెళ్లిళ్లు దశమస్కంధం పూర్వభాగం చివర రుక్మిణీ కల్యాణంతో ప్రారంభమై ఉత్తర భాగంలో కొనసాగుతాయి. రుక్మిణీ కళ్యాణం తరువాత వివరంగా చెప్పబడిన పెళ్లికథలలో లక్షణా పరిణయం తరువాతది నాగ్నజితీ పరిణయం. స్వయంవరానికి వీరత్వ నిరూపణ షరతుగా ఉండటం, శ్రీకృష్ణుడి విజయం, వైభవోపేతంగా వివాహం, భారీగా కట్నకానుకల చెల్లింపు రెండు పెళ్ళిళ్ళలోనూ సామాన్యమే. అయితే శారదాంబను ఆకర్షించిన అంశం ఏమిటోగానీ నాగ్నజితీ పరిణయ గాథను కావ్యరచనా విషయంగా స్వీకరించింది. ఆధునిక యుగపు ఆలోచనలకు తీసిన తెర కోసలపుర రాజైన నగ్నజిత్తు, ఆయన భార్య మోహనాంగి సంతానం లేదని బాధపడుతూ, నారదుడి బోధతో సంతానగౌరీ వ్రతం చేసి ఒక కొడుకును, ఒక కూతురిని కనటం, పెరిగి పెద్దదయిన కూతురు సుదంతకు తగిన మగడి కోసం వెతుకుతుండగా నారదుడు వచ్చి శ్రీకృష్ణుడే ఆమెకు తగిన భర్త అని చెప్పి కొన్నిరోజులలో నగరానికి వచ్చి తోటలూ దొడ్లూ పాడుచేసే ఏడు వృషభాలను పట్టి కట్టిన ధీరునకు కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వేస్తే కృష్ణుడు వచ్చి ఆ పని సాధించి సుదంతను పెళ్లాడతాడని చెప్పి వెళ్ళటం శారదాంబ కావ్యకథా నిర్మాణంలో మొదటి అంతస్తు. నగరానికి వచ్చిన శ్రీకృష్ణుడిని చూచి భాగవత సుదంత మాధవుడిని తనకారాధ్యుడైన నాథుడుగా కోరుకొన్నదన్న మాటను పట్టుకొని తండ్రి దగ్గర నారదుడు కృష్ణుడి గురించి చెప్పిన విషయాలు విని నాగ్నజితి మనసు కృష్ణుడిపై లగ్నమైనట్లు, ఆమె విరహ వ్యధ చూడలేక సుదంత చెలికత్తె ఇందుమతి యోగి వేషంలో ద్వారకకు వెళ్లి ఆ వార్త శ్రీకృష్ణుడికి చేరవేసినట్లు శారదాంబ దానిపై పెద్ద అల్లికపని చేసింది. కృష్ణుడు కొమ్ములు వంచి పట్టితెచ్చి స్తంభాలకు కట్టివేసిన ఏడు ఎద్దులు పరమశివుడి శాపం పొందిన కుబేర అనుచరులన్న కల్పన కూడా అదనమే. అస్థిపంజరం వంటి భాగవత కథను మాంసలం చేసి జీవవంతం చేసింది శారదాంబ. ఈ క్రమంలో కావ్య లక్షణాలుగా దండి చెప్పిన అష్టాదశ వర్ణనలలో నగర వర్ణన, ఉద్యానవన వర్ణన, సూర్యాస్తమయ వర్ణన, ఋతు వర్ణన, విరహ వర్ణన, వివాహ వర్ణన, కుమారోదయ వర్ణన, నాయకాభ్యుదయం వంటి వాటికి అవకాశం కల్పించుకొన్నది శారదాంబ. నగర వర్ణనలో భౌగోళిక విశేషాలు, జలవనరులు, తోటలు, పంటపొలాలు, పశు సంపద మొదలైన వాటితో పాటు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల వారి వర్ణన సర్వసాధారణం. శారదాంబ ప్రత్యేకత ఆ నగర ఇల్లాళ్లను వర్ణించటం. ఆధునిక స్త్రీ సహజ ఆత్మ చేతన నుండి నగరం అన్న తరువాత మహిళలు ఉండరా? వాళ్ళను ఎందుకు ప్రధాన స్రవంతి జనం నుండి మినహాయించారు? అన్న కొత్త ప్రశ్నలతో సంప్రదాయ నగర వర్ణనకు ఆమె చేసిన కొత్త చేర్పు ఇది. ఆ ఇల్లాళ్లు పతిని దైవంగా పూజించేవాళ్ళు, అత్తమామలయందు అణకువ చూపేవాళ్లు, బంధుమిత్రులను ఆదరించేవాళ్లు, బీదవాళ్ళను ఆదరించేవాళ్లు, పనులకు బద్ధకించనివాళ్ళు అని ఆమె చేసిన వర్ణన సంప్రదాయ స్త్రీ నమూనాకు భిన్నమైందేమీ కాదు. అది వేరే సంగతి. అయినా సంగీత సాహిత్య విద్యలు తెలిసినవాళ్లుగా వాళ్ళను పేర్కొనటం మాత్రం ఆమె ఆధునిక దృష్టిని సూచిస్తుందని చెప్పక తప్పదు. సుదంత పెరిగిన తీరు వివరించే పద్యాలలో అది మరింత స్పష్టంగా రుజువైంది. పురాణ ప్రబంధాలలో బాలికలను వర్ణించే వేళ బొమ్మల పెళ్ళిళ్ళు చేయటం, చిలకలకు పాఠాలు చెప్పటం, పాటలు పాడటం, వీణ వాయించటం, బొమ్మలు గీయటం, తరచు వాళ్ళ కార్యకలాపాలుగా చెప్పబడ్డాయి. నగ్నజిత్తు కూతురైన సుదంత కూడా ఇవి చేస్తూనే పెరిగింది. అంతవరకే చెప్తే శారదాంబ గురించి చెప్పుకోవలసిందేమీ లేదు. అంతకు మించి సుదంత ‘…మృదు కావ్యములన్ బఠియింప నేర్చెగా/ పూని సునీతిమంతములఁ బొత్తములన్ రచియింపనేర్చె…’ నని చెప్తుంది కవయిత్రి. కావ్య పఠనా రచనాదులు శారదాంబ అనుభవ విషయాలు. ఆడపిల్లలు అవి నేరుస్తూ పెరగటాన్ని ఆధునిక సంస్కరణ దృక్పధం నుండే ఆమె సంభావించింది. నాగ్నజితీ పరిణయము కావ్యం ముగింపులో భాగవత మూలానికి భిన్నంగా శారదాంబ చేసిన ఒక మార్పు ప్రత్యేకం పరిశీలించదగినది. శ్రీకృష్ణుడు భార్యలందరి పట్ల సమతాభావంతో మెలిగాడని చెప్పిన భాగవతమే ఆయన ‘సత్యభామా ప్రియకరుడ’ని చెప్తుంది. నాగ్నజితీ పరిణయ కథకు ముగింపుగా ఉన్న ‘ఇట్లు హరి నాగ్నజితిo బెండ్లియాడి యరణముల పుచ్చుకొని, ద్వారకా నగరంబునకు వచ్చి సత్యభామతో గ్రీడించుచుండె’ అన్న వాక్యం అదే సత్యమని, సమత్వం భ్రమ అని స్పష్టం చేయనే చేసింది. నాగ్నజితిని పెళ్ళాడి రావటం ఏమిటి? సత్యభామతో క్రీడించటం ఏమిటి? ఈ అసంబద్దత నాగ్నజితికే కాదు, ఆత్మగౌరవం కల ఏ స్త్రీకి అయినా అవమానకరమైనదే. ఈ స్పృహ మెండుగా ఉండటం వల్లనే శారదాంబ ‘… జగములెల్ల/ నేలుచును దంపతులు సుఖియించి రెలమి’ అని నాగ్నజితీ శ్రీకృష్ణుల దాంపత్య జీవితం గురించే చెప్పి ఈ కావ్యాన్ని ముగించింది. ఆ రకంగా సంప్రదాయ కథలను ఆ చట్రంలోనే అయినా సంస్కరణోద్యమ ప్రభావంతో, సామాన్య లౌకిక స్వీయ జీవితానుభవ జ్ఞానం నుండి, అభివృద్ధిచెందిన ఆధునిక దృష్టి కోణంతో స్త్రీలు మార్చి రాయటానికి చేసిన ప్రారంభ ప్రయత్నాలకు ఈ నాగ్నజితీ పరిణయ కావ్యం ప్రాతినిధ్యం వహిస్తుంది. సరళ సుందరమైన పద్య రచన, కథనరీతి శారదాంబ కావ్యలక్షణం. పందొమ్మిదవ శతాబ్ది చివరి భాగంలో తెలుగు కవితాకాశంలో మెరుపై మెరిసిన శారదాంబ వారసత్వం 20వ శతాబ్దిలోకి ఎంతగా విస్తరించిందో ఇలాంటి కవులను వెలుగులోకి తెచ్చి అధ్యయనం చేసే క్రమంలో అర్ధం అవుతుంది.
Telugu News » Business » Debts Rules father debts rules is any son has responsibility to pay father debts check here all details Father Debts Rules: తండ్రి చనిపోయిన తర్వాత అప్పులను కొడుకు తీర్చాల్సిందేనా? అత్యంత కీలకమైన సమాచారం మీకోసం.. Father Debts Rules: ఒక వ్యక్తి మరణిస్తే వారి మరణానంతరం, కుటుంబంలో ఆస్తి విషయంలో చాలా గొడవలు జరుగుతాయి. అలాగే ఆ వ్యక్తి తీసుకున్న.. Loans Shiva Prajapati | Aug 14, 2022 | 1:54 PM Father Debts Rules: ఒక వ్యక్తి మరణిస్తే వారి మరణానంతరం, కుటుంబంలో ఆస్తి విషయంలో చాలా గొడవలు జరుగుతాయి. అలాగే ఆ వ్యక్తి తీసుకున్న రుణాల గురించి కూడా చాలాసార్లు గొడవలు జరుగుతాయి. ఆస్తి పొందే విషయంలో చాలా మంది ముందుకు వచ్చినా.. రుణం చెల్లించే విషయంలో మాత్రం అందరూ వెనక్కి తగ్గుతారు. అయితే తండ్రి చనిపోయిన తర్వాత అతను చెల్లించాల్సిన రుణాన్ని కొడుకు తీర్చాలని ఎప్పుడైనా ఆలోచించారు. ఇంతకీ ఈ విషయంలో చట్టాలు ఏం చెబుతున్నాయి. రుణం తీర్చాలా? తీర్చొద్దా? అనే వివరాలు ప్రతీ ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. చట్టం ఏం చెబుతోంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 52, 53 ప్రకారం.. తండ్రి చేసిన బ్యాంకు రుణాన్ని, ఆ తండ్రి ఆస్తికి వారుసుడుగా ఉన్న వ్యక్తే చెల్లించాలి. అయితే, ఈ విషయంలో అనేక షరుతులు కూడా ఉన్నాయి. ఈ షరతుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు మరణించిన వ్యక్తి ఏదైనా సంపద, ఆస్తిని కలిని ఉన్నాడా? అనేది కీలకం. అదే సమయంంలో పిల్లల ఆస్తి వారి స్వంతంగా సంపాదించినది అయితే, పరిస్థితి భిన్నంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి అయితే పరిస్థితి మరోలా ఉంటుంది. మరణించిన వ్యక్తి చేసిన అప్పులు ఎంత, అతని ఆస్తులకు వారసులు ఎంతమంది? అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమగ్ర వివరాలను పరిగణనలోకి తీసుకుని, చట్టం ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతంది. అలాగే, తీసుకున్న బ్యాంకు రుణాల రకాలపైనా చెల్లించే విషయం ఆధారపడి ఉంటుంది. రుణాల రకాలు, చెల్లించే విధానాలు.. 1. గృహ రుణం విషయంలో వారసుడు ఆస్తిపై హక్కును పొందుతాడు. ఈ సందర్భంలో వారసుడే రుణాన్ని చెల్లించాల్సి వస్తుంది. 2. కారు లోన్ విషయంలో చూసినట్లయితే, కారును అమ్మి డబ్బు పొందవచ్చు. 3. వ్యక్తిగత రుణం విషయంలోకి వస్తే.. అది బ్యాంక్ నామినీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. బీమా ఉంటే అది వేరేలా ఉంటుంది. 4. బిజినెస్ లోన్ విషయంలో ఆస్తి ఆధారంగా రుణాలను వసూలు చేయడం జరుగుతుంది. 5. క్రెడిట్ కార్డులలో కూడా ఆస్తుల ఆధారంగా డబ్బు వసూలు చేస్తారు.
దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాలో లాక్ డౌన్ ను జూన్ 7 వరకూ పొడిగించారు. తొలి దశతో పోలిస్తే రెండవ దశలో గోవాలో కరోనా కేసులు కలకలం రేపాయి. అంతే కాకుండా పాజిటివిటి రేటు కూడా అత్యధికంగా ఉండటంతో గత కొన్ని రోజులుగా పలు చర్యలు చేపట్టారు. ఈ చర్యలు ఫలితాన్ని ఇస్తుండటంతో లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గోవాలో పాజిటివిటి రేటు 48 శాతం నుంచి 21 శాతానికి తగ్గింది. దీన్ని మరింత తగ్గించేందుకే లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. దేశంలో పాజిటివిటి రేటు పది శాతం పైన ఉంటే లాక్ డౌన్ విధించాలని గతంలోనే సూచించింది. గత 24 గంటల్లో గోవాలో కొత్తగా 1055 కేసులు నమోదు అయ్యాయి. Goa Lockdown Extended June7th Covid positivity rate High Latest travel news గోవా లాక్ డౌన్ జూన్ 7 వరకూ పొడిగింపు Similar Posts Recent Posts International HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog.