text
stringlengths
335
364k
‘ఒక్కేసి పువ్వేసి చందమామ.., రామ రామనే ఊయాలో..’ అంటూ మహిళల ఆటపాటల మధ్య జిల్లాలో బతుకమ్మ సంబురాలు కొన సాగుతున్నాయి. టీయూలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ప్రొఫెసర్లు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 జిల్లాలో ఆటపాటలతో కొనసాగుతున్న బొడ్డెమ్మ సంబురాలు రెండో రోజు ఘనంగా అటుకుల బతుకమ్మ వేడుకలు నిజామాబాద్‌ కల్చరల్‌, సెప్టెంబరు 26: ‘ఒక్కేసి పువ్వేసి చందమామ.., రామ రామనే ఊయాలో..’ అంటూ మహిళల ఆటపాటల మధ్య జిల్లాలో బతుకమ్మ సంబురాలు కొన సాగుతున్నాయి. మహిళల ఆటపాటలతో రెండో రోజు సోమవారం అటుకుల బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగాయి. జిల్లావ్యాప్తంగా బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. రెండవ రోజు బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని మహిళలు బతుకమ్మను రెండు అంతరాలలో పేర్చి అందులో గౌరమ్మను ఉంచి పూజలు చేశారు. గ్రామా ల్లో మొదలుకొని పట్టణాల వరకు మహిళలు ఒక్కో ఇంటి ముందు తమ బతుకమ్మలను ఉంచి బతుకమ్మ పాటలతో బతుకమ్మ ఆడారు. అనంతరం తోటి మహిళలతో కలిసివెళ్లి బతుకమ్మను నిమజ్జనం చేశారు. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ బతుకమ్మ సంబురాల్లో భాగంగా మూడో రోజు మంగళ వారం మహిళలు బతుకమ్మకు ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు. బతుకమ్మను మూడు అంతరాలుగా తయారుచేసి ముద్దపప్పు పాలు, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. బతుకమ్మ సంబరాల్లో ఏడో బెటాలియన్‌ డిచ్‌పల్లి: బతుకమ్మ సంబరాల్లో భాగంగా తెలంగాణ ఏడో పోలీస్‌ బెటాలియన్‌ లో వివిధ ప్రాంతాల మహిళలు, యువతులతో ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌ సతీమని వివే క వర్ధిని మహిళలతో కలిసి పూల బతుకమ్మ ను అత్యంత వైభోపేతంగా పేర్చి ఆడిపాడారు. అలాగే, తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహిళ విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను సోమవారం సాయంత్రం టీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ గుప్తా ముఖ్య అతిఽథిగా హాజరై బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు.
ముక్కు కు ఆక్సిజన్, చేతికి సెలైన్ తో హాస్పిటల్ బెడ్ మీద పాటలు వింటూ కనిపించిన యువతి చివరకు కరోనా కు బలైపోయింది. గతవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఎంతో మంది గుండెల్లో స్ఫూర్తిని నింపిన ఆమె గుండె కరోనా ముందు ఓడిపోవాల్సి వచ్చింది. ఢిల్లీకి చెందిన డాక్టర్ మౌనిక తన ట్విట్టర్ ఖాతాలో ఆమె వీడియో పోస్ట్ చేసింది. కరోనా సోకిన వ్యక్తికి ఐసీయూ బెడ్ దొరకకపోవడం తో కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. సాధారణంగా అలాంటి ఆరోగ్య పరిస్థితిలో ఎవరైనా భయపడతారు మరియు కుంగిపోతారు కానీ ఆ అమ్మాయి మాత్రం ఎంతో ధైర్యం గా కనిపించింది. పాటలు వినాలనిపిస్తుందని డాక్టర్ ను అడిగితె అందుకు ఒప్పుకున్నారు. బెడ్ పై ఫోన్ లో “లవ్ యు జిందగీ” పాట వింటూ చిరునవ్వులు చిందించన ఆమె వీడియోను డాక్టర్ మౌనిక ట్విటర్లో పోస్ట్ చేయగా ఇటీవల ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. We Will Win This! ❤️🔥 Courtesy : @drmonika_langeh pic.twitter.com/BxXMYn5NQ5 — Stay Home, Stay Safe.😷 🙏🏻 (@RVCJ_FB) May 12, 2021 4 రోజుల క్రితం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఐసియు లో మార్చారు. ఈ విషయాన్ని డాక్టర్ మౌనిక తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ” ఈ ధైర్యమైన యువత కోసం అందరూ ప్రార్థించండి, కొన్నిసార్లు మనం చాలా నిస్సహాయుల అవుతాము మన చేతిలో ఏమీ ఉండదు అంతా భగవంతుడి చేతుల్లో ఉంటుందని” అవేదం వ్యక్తం చేసింది. అయితే ప్రార్థనలు ఏమీ ఫలించాలా ఆమె చివరకు చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయింది. “చాలా బాధాకరం ఒక ధైర్యమైన గుండెను కోల్పోయామని” డాక్టర్ మౌనిక నిన్న ట్విట్టర్ ద్వారా యువతి మరణవార్త తెలియజేశారు. ఈ ట్వీట్ చూసి నెటిజన్లు దిగ్బ్రాంతి కి గురయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతున్నారు.
వ్యాయామంలో స్విమ్మింగే బెస్ట్‌ అంటున్న ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్స్‌ | Fitness Experts About Swimming - 10TVNEWSTELUGU హీరో నాని కొడుకుని చూడండి. | Nani Son Singing Song | Nani Son |Leo Entertainment #nani #nanison ... - YOUTUBE కేరళ అమ్మాయిలు మతం మారి తీవ్రవాదులయ్యారా?| The Kerala Story, Adah Sharma | The Razakar Files - IDREAMMOVIES నా తల్లి మీద దాడి చేస్తారా | BJ MP Arvind Fire MLC Kavitha | Telangana Politics | CM KCR | TV5 News - TV5NEWS Bandi Sanjay Emotional Words Over BL Santhosh | Telangana @Sakshi TV - SAKSHITV ... talk - YOUTUBE Watch Heroine Meenakshi at HIT2 - YOUTUBE Tamannaah Bhatia Latest Super CUTE Expressions @ Vogue Forces Of Fashion Red Carpet #tamannaah #tamannaahbhatia ... - YOUTUBE Gadwal TRS MLA Krishna Mohan Reddy Attacks Regional Coordinator | V6 Teenmaar - V6NEWSTELUGU TOP 25 NEWS | Sakshi Speed News | Top 25 Headlines@ 7:30 AM | 21-11-2022 | Sakshi TV - SAKSHITV INSIDE : ఆదిలాబాద్‌ టీఆర్ఎస్‌లో దుమారం..ఆశావహుల్లో చిచ్చురేపిన కేసీఆర్‌ కామెంట్స్‌ | ABN Telugu - ABNTELUGUTV
మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తరువాత నేల నుంచి నింగి వరకు అన్నీ ప్రయివేటీకరణ చేస్తున్నదని, కార్పొరేట్‌ శక్తులకు అప్పనంగా దోచిపెడుతున్నదని సీఐటీయూ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ ఎలమారం కరీం విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్లు లూటీ చేస్తున్నారనీ, అందుకునుగుణంగా ప్రభుత్వం విధానాల రూపకల్పన చేస్తున్నదని ఆరోపించారు. దేశాన్ని లూటీ చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లు, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ అండ్‌ ఇంజనీర్స్‌ (ఎన్‌సీసీఓఈఈఈ) ఆధ్వర్యంలో బుధవారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌ వద్ద విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్లు పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ మార్చ్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్లు కదంతొక్కారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని నినాదాలు హోరెత్తించారు. న్యూఢిల్లీ : 'విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి. ప్రయివేటీకరణ ప్రక్రియను ఉపసంహరించుకోవాలి. పవర్‌ కార్పొరేషన్ల ఏకీకరణ చేయాలి. కేరళలోని కేఎస్‌ఈబీ లిమిటెడ్‌, హిమాచల్‌లోని హెచ్‌పీఎస్‌ఈబీ లిమిటెడ్‌లానే అన్ని రాష్ట్రాల్లో ఎస్‌ఈబీ లిమిటెడ్‌ను పునరుద్ధరించాలి. విద్యుత్‌ ఉద్యోగులందరికీ పాత పెన్షన్‌ పునరుద్ధరించాలి. తెలంగాణ, పంజాబ్‌లో చేసినట్టు అన్ని రాష్ట్రాల్లో ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు విద్యుత్‌ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలి. రెగ్యులర్‌ పోస్టులపై రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ చేయాలి. విద్యుత్తు ప్రాథమిక హక్కుగా ప్రకటించాలి' అని విద్యుత్తు ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ మార్చ్‌లో ఆల్‌ ఇండియా పవర్‌ ఇంజనీర్స్‌ ఫెడరేషన్‌, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆల్‌ ఇండియా పవర్‌ డిప్లొమా ఇంజనీర్స్‌ ఫెడరేషన్‌, ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌, ఇండియన్‌ నేషనల్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, వివిధ రాష్ట్రాలలోని అనేక ఇతర స్వతంత్ర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలోని విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్లతో చర్చించకుండా పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టారనీ, దీనికి వ్యతిరేకంగా 27 లక్షల విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్లు దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తామన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. విద్యుత్‌ వినియోగదారుల, విద్యుత్‌ వ్యవస్థ ప్రయోజనాల కోసం అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకించాలని ఎన్‌సీసీఓఈఈఈ కోరింది. ఈ సందర్భంగా ఎలమరం కరీం మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం 1948లో విద్యుత్‌ సరఫరా చట్టాన్ని తీసుకొచ్చారనీ, దీనివల్ల రెండు కోట్ల పంపుసెట్లకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారనీ, అది తక్కువ ధరలతో వ్యవసాయ అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు. దేశంలో ఐదు లక్షల గ్రామాల్లో 25 కోట్ల ఇండ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. 1991 తరువాత ప్రపంచీకరణ విధానాలను ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. అన్ని రంగాలను ప్రయివేటీకరిస్తున్నదనీ, అందులో భాగంగానే విద్యుత్‌ రంగాన్నీ ప్రయివేటీకరణ చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటి ప్రయివేటు శక్తుల చేతుల్లో పెడుతున్నారనీ, బహుళజాతి కంపెనీలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రయివేటీకరణను వ్యతిరేకించిందనీ, 1998లో అధికారంలోకి వచ్చిన వాజ్‌పేరు ప్రభుత్వం 2003లో విద్యుత్‌ సవరణ బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. విద్యుత్‌ బోర్డలపై భారాలు, విద్యుత్‌ రంగ ప్రయివేటీకరణ వంటి అంశాలు బిల్లులో ప్రతిపాదించారని తెలిపారు. అప్పుడు ఒరిస్సా, మహారాష్ట్రతో పాటు కొన్ని రాష్ట్రాలు విద్యుత్‌ ప్రయివేటీకరణ విధానాన్ని అమలు చేశాయనీ, ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో స్పష్టమవుతున్నదని అన్నారు. కానీ మెజార్టీ రాష్ట్రాల్లో విద్యుత్‌ ప్రభుత్వ రంగంలోనే ఉందనీ, కేరళలో విద్యుత్‌ బోర్డును ప్రభుత్వమే ఒక కంపెనీగా నిర్వహిస్తోందని తెలిపారు. 2019లో మళ్లీ ప్రభుత్వం విద్యుత్‌ సవరణ బిల్లును తీసుకొచ్చిందని, చాలా ప్రమాదకర అంశాలు అందులో ఇమిడి ఉన్నాయని అన్నారు. అందుకే అందరమీ ఐక్యంగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడాలని పిలుపు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌ రంగ ప్రయివేటీకరణను అక్కడి ఉద్యోగులు, కార్మికులు, ఇంజనీర్లు పోరాడి తిప్పికొట్టారని గుర్తు చేశారు. ఇటీవల జమ్మూకాశ్మీర్‌, పుదుచ్చేరి, చండీగఢ్‌లో కేంద్ర ప్రభుత్వం అక్కడి విద్యుత్‌ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయాలని చూస్తే, కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు ఐక్యంగా పోరాడి విజయం సాధించారని తెలిపారు. గతంలో ఆయిల్‌, గ్యాస్‌ ధరలను కేంద్ర మంత్రివర్గం నిర్ణయించేదనీ, ఇప్పుడు అన్ని రంగాలను ప్రయివేటీకరణ చేయడం వల్ల ఆయిల్‌, గ్యాస్‌ ధరలను అంబానీ, అదానీలు నిర్ణయిస్తున్నారని విమర్శించారు. విద్యుత్‌నూ ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తే, విద్యుత్‌ ధరలను వారే నిర్ణయిస్తారన్నారు. పార్లమెంట్‌లో తాము విద్యుత్‌ బిల్లును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లు అప్రజాస్వామికమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని అన్నారు. ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా మాట్లాడుతూ విద్యుత్‌ సవరణ బిల్లు రైతులకూ వ్యతిరేకమైనదనీ, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఎస్‌కేఎం ప్రధాన డిమాండ్లలో విద్యుత్‌ బిల్లు ఉపసంహరణ కూడా ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌, వైసీపీ రాజ్యసభ ఎంపి ఆర్‌. కష్ణయ్య, ఆప్‌ నేత గౌరవ్‌ మహేశ్వరీ, కోఆర్డినేషన్‌ కమిటీ నేతలు ప్రశాంత నంది చౌదరి, శైలేంద్ర దూబే, మోహన్‌ శర్మ, ఆర్‌కె త్రివేది, కుల్దీప్‌ కుమార్‌, పి.రత్నాకర్‌ రావు, అభిమన్యు ధంకర్‌, పద్మజిత్‌ సింగ్‌, కె.అశోక్‌ కుమార్‌, సమీర్‌ సిన్హా, ఆర్‌కె శర్మ, సద్రుద్దీన్‌ రాణా, తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్స్‌ సంఘాల నేతలు కె.ఈశ్వరావు, వి.గోవర్థన్‌, టి.రత్నాకర్‌, బీసీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుండెపోటుతో ఎం. చెన్నకేశవులు మృతి విద్యుత్‌ ఉద్యోగుల ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీకి వస్తున్న కడప జిల్లా, పొద్దుటూరు ఈఆర్‌ఓ సీనియర్‌ అసెస్టింట్‌ ఎం. చెన్నకేశవులు మార్గమధ్యలోనే గుండెపోటుతో మరణించారు. రాజస్థాన్‌లోని బయన రైల్వేస్టేషన్‌లో మృతదేహాన్ని దించారు. అక్కడ నుంచి ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Maha Swetha Sudha Murty Alakananda Prachuranalu మహాశ్వేత సుధామూర్తి అలకనంద ప్రచురణలు Literature Novel జగదీశ్వరి సాహిత్యం లిటరేచర్ Saahithyam నవల Novel Navala అనువాదం Anuvadaalu Translation Let your friends know Description Reviews (0) ఎంతో అందంగా ఉండి, విద్యావంతురాలై ఎన్నో ఆశలతో నూతన జీవితంలో అడుగుపెట్టి, ఏమాత్రం హానికరంకాని 'బొల్లి మచ్చల' వ్యాధి వచ్చి, ఆమె ఆశాసౌధాలన్నీ కూలిపోయిన ఒక యువతిగాధ 'మహాశ్వేత'. అవతలి వారి బాధలను చూసి ఆనందించే సమాజాన్ని ఎదుర్కొని తన కాళ్ళపై తాను నిలబడి, తాను అబలకాదు సబల అని నిరూపించిన ఒక యువతి గాధ ఇది. ఒక నవల ఆరేడు భాషల్లోకి అనువాదమైందంటే కథకథనాల్లో వైవిద్యం ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. ఇనోఓ్ఫసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి రాసిన 'మహాశ్వేత', 'డాలర్‌ కోడలు' నవలలు అలాంటివే. - ఈనాడు మనసును మార్చిన రచన. దగా పడినా దిగాలు పడని ఓ థీరజ జీవన పోరాటం. - ఇండియా టుడే బొల్లి సోకిన ఒక అందమైన యువతి జీవితం ఎంతటి విషాదపు మలుపు తీసుకుందో చెబుతూనే దాని నుంచి ఆ యువతి ఆత్మస్థైర్యంతో బయటపడిన వైనాన్ని సుధామూర్తి మహాశ్వేత నవలలో చిత్రించారు. ఇది ఒక రకంగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశం. దానిని సుధామూర్తి హృద్యంగా ఆవిష్కరించారు. - ఆంధ్రజ్యోతి
బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంస ని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం లెహరాయి.ఈ చిత్ర టైటిల్ చాలా ఫేమ‌స్ కావ‌టం విశేషం. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ కు, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది. ఇక సంగీత ద‌ర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌లైన గుప్పెడంత సాంగ్ మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ స‌క్సస్ ని పురస్కరించుకుని లెహ‌రాయి చిత్రం నుండి “అప్సరస అప్సరస” అనే మరో సాంగ్ ను కూడా విడుద‌ల చేశారు మేకర్స్. గేయ రచయిత శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్ ఆల‌పించారు. “తీపితో తేల్చి చెప్పా తొలితీపి నీ పలుకని తారనే పిలిచి చూపా తొలి తారా నీ నవ్వని” లాంటి లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నట్లు, మంచి ఫీల్ వున్న క‌థతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించినట్లు ఇదివరకే ద‌ర్శకుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస” తెలిపారు.ప్రముఖులు న‌టించిన ఈ చిత్రాన్ని నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్నారు. లెహరాయి రిలీజ్ డేట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం. Ali, Gagan Vihari, Jabardast Ramprasad, Ranjith, Rao Ramesh, Satyam Rajesh, Soumya Menon, Sr. Naresh, Telugu70mm, Tollywood, trending
ద్విభాషా శిబిరంలు శిబిరంలను రెండు భాషల్లో నేర్పిస్తారు. విద్యార్థులు అందరూ రోజువారీ ధ్యానం సూచనలను రెండు భాషల్లో వినవచ్చు సాయంత్రం ప్రవచనాలను విడిగా వినవచ్చు. పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం. పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు. అన్ని శిబిరంలు విరాళాల ఆధారంగా మాత్రమే నడుస్తాయి. అన్ని ఖర్చులు శిబిరం పూర్తిచేసిన వాళ్ళు, విపశ్యన యొక్క ప్రయోజనాలు అనుభవించి, అదే అవకాశం ఇతరులకు కూడా అందాలని అనుకుంటున్న వారి విరాళ ద్వారా వచ్చిన ఆదాయంతోనే జరుగుతున్నాయి. ఆచార్యులు, సహాయక ఆచార్యులు కూడా ఆదాయం పొందరు. శిబిరాలలో సేవ చేసే వారు తమ సమయాన్ని ఐచిక్కంగా వెచ్చిస్తున్నారు. అందువలన విపశ్యన వ్యాపారీకరణ చేయకుండా ఉచితంగా నేర్పబడుతుంది. ధ్యాన శిబిరంలు కేంద్రం మరియు కొన్ని కేంద్రం లేని ప్రాంతాలలో కూడా జరుగుతాయి. ధ్యానం కేంద్రాలలో శిబిరంలు ఏడాది పొడవునా క్రమం తప్పకుండా జరగడానికి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయం లో ధ్యాన కేంద్రాలు స్థాపించబడడానికి ముందు, అన్ని శిబిరంలు, మత, విడిది కేంద్రాలు, చర్చిలు మరియు కాంప్ గ్రౌండ్ లు వంటి తాత్కాలిక ప్రాంతాలలో జరిగేవి. నేడు కేంద్రాలు ఏర్పాటు కాని ప్రాంతాల్లో, ఆయా ప్రాంతంలో నివసించే విపశ్యన స్థానిక విద్యార్థులచే 10 రోజుల ధ్యాన శిబిరంలు నిర్వహించబడుతున్నాయి. శిబిర రకము: పాత సాధకుల లఘు శిబిరంలు (1-3 రోజులు) శ్రీ గోయెంకా గారి లేక అతని సహాయక ఆచార్యులతో కానీ 10 రోజుల శిబిరం పూర్తి చేసిన సాధకుల కోసం మాత్రమే. పాత సాధకులు, తమ చివరి శిబిరం చేసి కొంత సమయం గడిచిన వారైనా సరే ఈ శిబిరంలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10-రోజుల శిబిరాలు విపశ్యన ధ్యానము యొక్క పరిచయ శిబిరాలు. ఇక్కడ విపశ్యన ధ్యాన పద్ధతి ప్రతి రోజూ అంచెలంచెలుగా నేర్పించబడుతుంది. ఈ శిబిరాలు సాయంత్రము 2 - 4 గంటల తరువాత నమోదు మరియు వివరణ అయిన పిమ్మట మొదలవుతాయి. ఆ తరువాత 10 రోజుల సంపూర్ణ సాధన. 11వ రోజు ఉదయం 7:30 గంటలకు ముగియబడతాయి. 10-రోజుల ఎగ్జిక్యూటివ్ శిబిరాలు ప్రత్యేకంగా వ్యాపారవేత్తలు మరియు ప్రభుత్వ ఉద్యోగుల కొరకు నిర్వహించబడే విపశ్యన ధ్యాన పరిచయ శిబిరాలు. ఇక్కడ విపశ్యన ధ్యాన పద్ధతి ప్రతి రోజూ అంచెలంచెలుగా నేర్పించబడుతుంది. అధిక సమాచారము కొరకు క్రింది వెబ్ సైట్ చూడండి ఎగ్జిక్యూటివ్ శిబిరం వెబ్ సైట్.ఈ శిబిరాలు సాయంత్రము 2 - 4 గంటల తరువాత నమోదు మరియు వివరణ అయిన పిమ్మట మొదలవుతాయి. ఆ తరువాత 10 రోజుల సంపూర్ణ సాధన.11వ రోజు ఉదయం 7:30 గంటలకు ముగియబడతాయి. పాత సాధకుల కోసం 10 రోజుల శిబిరాలు మామూలు 10 రోజుల శిబిరాల నియమావళి, కాల పట్టికనే కలిగి ఉంటాయి. ఈ శిబిరాలు గంభీర పూర్వ సాధకులు ఎవరైతే కనీసము మూడు 10 రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన శిబిరం పూర్తి చేసి మిగితా ఏ ధ్యానము సాధన చేయకుండా, కనీసము గత 1 సంవత్సరము, విపశ్యన ధ్యానం మాత్రమే ప్రతి దినం సాధన చేస్తూ, దైనందిన జీవితంలో పంచ శీలాలను పాటించడానికి ప్రయత్నిస్తున్న వారి కోసమే ప్రత్యేక 10 రోజుల శిబిరాలు గంభీర పూర్వ సాధకులు ఎవరైతే కనీసము ఐదు 10 రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన శిబిరం, కనీసము ఒక్క 10 రోజుల శిబిరంలో సేవను పూర్తి చేసుకుని మరియు నియమబద్ధంగా కనీసము గత 2 సంవత్సరాలు ఈ ధ్యానము మాత్రమే సాధన చేస్తున్న వారికోసమే The 14-Day Gratitude Course was previously called the Teacher's Self Course. One of the qualities we develop as we meditate is gratitude - gratitude towards one’s teachers, Goenkaji and Mataji, and towards the long tradition of Vipassana teachers, right back to the Buddha. The course is open to old students who are active in giving service. Requirements include 3 x 10day courses plus one Satipaṭṭhāna course, being active in Dhamma service, trying to maintain two-hour daily practice since last 10-Day course, and trying to maintain the five precepts to the best of one's ability. Local teacher’s recommendation is required. The course follows the usual format of 3x group sittings with instructions in the day, but students work more independently and the teaching materials are drawn from the 20-day course. This is a half-way step to help students mature for long courses, and serves to inspire students to work more deeply in Dhamma. 20 రోజుల శిబిరాలు కనీసము ఐదు 10 రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన సుత్త శిబిరం, కనీసము ఒక్క 10 రోజుల శిబిరంలో సేవ చేసి, కనీసము 2 సంవత్సరాలు నియమ బద్ధంగా సాధన చేస్తూ ఈ ధ్యాన పద్ధతికే కట్టుబడి ఉన్న గంభీర సాధకుల కొరకు మాత్రమే . 30-రోజుల శిబిరాలు కనీసము ఆరు 10 రోజుల శిబిరాలు(మొదటి 20 రోజుల శిబిరం తరవాత ఒకటి), ఒక్క 20-రోజుల శిబిరం, ఒక్క సతిపట్ఠాన సుత్త శిబిరం పూర్తి చేసి కనీసము 2 సంవత్సరాలు నియమ బద్ధంగా సాధన చేస్తూ ఈ ధ్యాన పద్ధతికే కట్టుబడి ఉన్న గంభీర సాధకుల కొరకు మాత్రమే. 45-రోజుల శిబిరాలు కనీసము ఏడు 10 రోజుల శిబిరాలు (మొదటి 30 రోజుల శిబిరం తరవాత ఒకటి), రెండు 30-రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన సుత్త శిబిరం చేసి, కనీసము 3 సంవత్సరముల వరకు నియమ బద్ధంగా సాధన చేస్తూ, ధమ్మ సేవలో నిమగ్నమయి ఉన్న వారు లేక సహాయక ఆచార్యుల కొరకు మాత్రమే. 60-రోజుల శిబిరాలు కనీసము రెండు 45 రోజుల శిబిరాలు చేసి, సంవత్సరానికి కనీసము 4 శిబిరాలు నిర్వహించే ఆచార్యులు, సహాయక ఆచార్యుల కొరకు మాత్రమే. పిల్లల శిబిరాలు, 8 నుండి 12 సంవత్సరముల వయస్సు ఉండి ధ్యానము నేర్చుకోవాలన్న కోరిక గలిగిన పిల్లల కొరకు. వాళ్ళ తల్లిదండ్రులు విపశ్యన సాధకులు అగుట ఆవశ్యకము కాదు. పాత సాధకుల కార్యక్రమములు క్రింది వాటిని పోలియుండును సేవా కార్యక్రమములుఇచ్చట కేంద్రము యొక్క వివిధ రకములైన నిర్వహణ, నిర్మాణ, ఆంతరంగిక మరియు తోట పనులలో సేవనందించుటకు సమయము ఉండును. కానీ ఇది సంపూర్ణంగా క్రమబద్ధంగా నిర్వహించబడుతుంది. ఇచ్చట సహాయక ఆచార్యులను కలుసుకోవచ్చును, ఇంకా కమిటీ మరియు ట్రస్టు సమావేశములలొ పాల్గొనే అవకాశము కూడా లభించవచ్చు. అందరు పాత సాధకులు ఈ కార్యక్రమాలకు ఆహ్వానితులే. దైనందిన కార్యక్రమములో మూడు సామూహిక సాధనలతో పాటు ఉదయం, మధ్యాహ్నం సేవా సమయములు ఉంటాయి మరియు సాయంకాలము సత్యనారాయణ గోయెంక గారిచే పాత సాధకులను ఉద్దేశించి ఇచ్చిన ప్రత్యేక ప్రవచనాలు మరియు ఉపన్యాసములు వినిపించబడతాయి. అవగాహన శిబిరాలు - ధ్యాన శిబిరముల మధ్య నిర్వహించబడును. విపశ్యన ధ్యానము గురించి, ధ్యాన కేంద్రముల గురించి అవగాహన పొందడానికి అందరూ ఆహ్వానితులే సతిపట్ఠాన సుత్త శిబిరము 10 రోజుల శిబిరము కాలపట్టిక మరియు నియమావళిని పోలి ఉండును. తేడా ఏమిటంటే సాయంత్రపు ప్రవచనాలలో సతిపట్ఠాన సుత్త జాగ్రత్తగా పరిశీలించబడుతుంది. ఈ సుత్తలో విపశ్యన ధ్యాన విధానము సక్రమముగా వివరించబడింది. ఈ శిబిరములు కనీసము మూడు 10 రోజుల శిబిరములు (సేవ ఇచ్చిన శిబిరములను మినహాయించి) చేసి, చివరి 10 రోజుల శిబిరము తరువాత ఇతర ఏ ధ్యాన పద్ధతినీ అనుసరించకుండా, విపశ్యన ధ్యాన సాధనను గత ఒక్క సంవత్సరము నుండి చేస్తూ, తమ సాధనలో నిరంతరతను నిలుపుకునే ప్రయత్నంలో ఉండి, పంచ శీలాలను తమ నిత్య జీవనంలో పాటిస్తున్న గంభీర పాత సాధకుల కొరకు నిర్దేశించబడినవి. పాత సాధకుల స్వీయ శిబిరము, 10 రోజుల శిబిరము యొక్క కాలపట్టిక మరియు నియమావళిని పోలి ఉండును. తేడా ఏమిటంటే ఇక్కడ ఆచార్యుల ఉపస్థితి ఉండదు. ఈ శిబిరములు కనీసము మూడు పది రోజుల శిబిరములలో సాధన చేసి, క్రిందటి 10 రోజుల శిబిరము తరువాత ఇతర ఏ ధ్యాన పద్ధతినీ అనుసరించకుండా, విపశ్యన ధ్యాన సాధనను గత ఒక్క సంవత్సరము నుండి చేస్తూ, తమ సాధనలో నిరంతరతను నిలుపుకునే ప్రయత్నంలో ఉండి, పంచ శీలాలను తమ నిత్య జీవనంలో పాటిస్తున్నగంభీర పాత సాధకుల కొరకు నిర్దేశించబడినవి. సేవా సమయము వివిధ రకములైన కేంద్ర నిర్వహణ, నిర్మాణ, ఆంతరంగిక మరియు తోట పనుల కొరకు కేటాయించబడినది. పాత సాధకులు అందరూ దీనికి ఆహ్వానితులే. దైనందిన కార్యక్రమములో మూడు సామూహిక సాధనలతో పాటు ఉదయం, మధ్యాహ్నం సేవా సమయములు ఉంటాయి మరియు సాయంకాలము సత్యనారాయణ గోయెంక గారిచే పాత సాధకులను ఉద్దేశించి ఇచ్చిన ప్రత్యేక ప్రవచనాలు మరియు ఉపన్యాసములు వినిపించబడతాయి. కిశోర ఆనాపాన శిబిరములు 13-18 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన వారి కొరకు నిర్దేశించబడినవి. వాళ్ళ తల్లిదండ్రులు విపశ్యన సాధకులు అగుట ఆవశ్యకము కాదు.
“సినిమా వాళ్ళందరూ బలిసి కొట్టుకుంటున్నారన్న” భావనను వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను నల్లపురెడ్డి ఎందుకు చేయవలసి వచ్చిందో వైసీపీ స్పోక్స్ పర్సన్ రవిచంద్ర రెడ్డి ఓ కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. సినిమా ఇండస్ట్రీలో కొందరు కరుడు గట్టిన భావజాలంతో ఉన్నారని, తాను ఇటీవల “పుష్ప” సినిమా చూశానని, ముందుగా ధియేటర్ లో, తాజాగా మరోసారి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా చూశానని, లేటెస్ట్ తాను గమనించింది ఏమిటంటే, ప్రధాన విలన్ కు వెనుకాల ఉన్న విలన్స్ పేర్లన్నీ ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన వారివేనని అభిప్రాయ పడ్డారు. ‘పుష్ప’ సినిమాను నిర్మించింది ఎవరా అని చూస్తే యెర్నేని నవీన్ చౌదరి అని, అంటే ఈ భావజాలం చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండడంతోనే ప్రసన్న కుమార్ రెడ్డి ‘బలిసి కొట్టుకుంటున్నారు’ అని ఉంటారని తాను భావిస్తున్నట్లుగా రవిచంద్ర రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ భావ దారిద్య్రం ఏమిటి? సినిమాలో ఉన్న విలన్ పాత్రలకు ‘రెడ్ల’ పేర్లు ఎందుకు పెడుతున్నారు? ఇలాగే కొనసాగితే మర్యాద దక్కదని మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను. కానీ ‘రెడ్ల’ మీద వ్యతిరేకత పెరగాలని, చంద్రబాబు నాయుడు భావజాలంలో చాలామంది నిర్మాతలు ‘బలిసి కొట్టుకుంటున్నారు,’ వాళ్ళను ఉద్దేశించి అన్న మాటలుగా నేను అన్వయించి చెప్తున్నాను. ప్రతి ఒక్క విలన్ ‘రెడ్డి’ ఎందుకు ఉండాలి, ‘రెడ్లు’ ఏమైనా తేరగా దొరికారా? తమాషా పడుతున్నారా? రెడ్లను అంటే ఎవరు ఏం చేయరని అనుకుంటున్నారా? మర్యాద దక్కదని హెచ్చరిస్తున్నాను అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఈ మీడియా డిబేట్ లో పాల్గొన్న మరో వ్యక్తి ‘అసలు మ్యాటర్ ను డైవర్ట్ చేస్తున్నారు’ అంటూ రవిచంద్ర వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. ఈ షో నిర్వహిస్తున్న రజనీకాంత్ కూడా అది సరికాదని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, రవిచంద్ర రెడ్డి మాత్రం ఎవరి మాటలను వినిపించుకోకుండా ‘రెడ్డి – కమ్మ’ సామాజిక వర్గాల నడుమ విభేదాలు వచ్చే విధంగా వ్యాఖ్యానించారు. అయితే రవిచంద్రరెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, దర్శకుడు క్రియేటివిటీలో భాగంగా పెట్టే పేర్లను ఇలా రాజకీయాలు చేయడం తగదని, మరి ఇంతకుముందు హీరోలకు ‘రెడ్డి’ ట్యాగ్ లు పెట్టినపుడు వీరంతా ఎక్కడ ఉన్నారని నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేసుకుంటూ ప్రశ్నిస్తున్నారు. ‘సమరసింహారెడ్డి, ఆదికేశవ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, అర్జున్ రెడ్డి, సైరా రెడ్డి’ ఇలా ప్రముఖ హీరోలందరూ ‘రెడ్డి’ సామాజిక వర్గపు పాత్రలను చేసారని గుర్తు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే చేసిన పొరపాటు వ్యాఖ్యలను బలపరచడం కోసం ఏదొక ‘కుంటి సాకు’ను వెతుక్కుని, ఇపుడు ‘పుష్ప’ సినిమా నిర్మాతను టార్గెట్ చేయడం తప్ప, ఈ వాదనలో పస లేదన్నది అసలు విషయం. ఇప్పటివరకు ఇలాంటి ఆలోచనలు బహుశా ఏ ఒక్కరూ కూడా చేసి ఉండరని, అయినా చంద్రబాబు నాయుడు – ‘పుష్ప’ ప్రొడ్యూసర్ ఒకే సామాజిక వర్గం అయితే, స్టోరీ చంద్రబాబు చెప్పేస్తారా? క్యారెక్టర్ పేర్లు కూడా చంద్రబాబు పెట్టేస్తారా? అంటూ నెటిజన్లు వేస్తోన్న ప్రశ్నలు కోకొల్లలు. కధను రచించేది డైరెక్టర్, ఆ కధలోని పాత్రలకు ఏ పేరు పెట్టాలనేది నిర్ణయించేది డైరెక్టర్, ‘పుష్ప’ విషయానికి వస్తే ఆ డైరెక్టర్ పేరు బండ్రెడ్డి సుకుమార్, రవిచంద్ర రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. డైరెక్టర్ చెప్పిన కథను నమ్మి పెట్టుబడి పెట్టడం వరకే ప్రొడ్యూసర్ రోల్ ఉంటుందన్న కనీస అవగాహన లేకుండా వితండ వాదనను తెరపైకి తీసుకురావడం సినిమాలో కంటే ‘పెద్ద ట్విస్ట్’గా మారింది. ఒక పొరపాటును కప్పిపుచ్చుకోవడానికి మరికొన్ని పొరపాటు వ్యాఖ్యలు చేయడం అనేది ఓ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా బాధ్యత గల స్థానంలో ఉన్న రవిచంద్ర రెడ్డికి ఏ మాత్రం తగదు. అయినా రెండు సామాజిక వర్గాల నడుమ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం ఎంతవరకు సమంజసమో వైసీపీ వర్గాలే ఆలోచనలు చేయాలి. https://www.mirchi9.com/wp-content/uploads/2022/01/fNaSeBFFd7zYNiyH.mp4 How Much Did Amazon Prime Pay For Pushpa? ట్రింగ్ ట్రింగ్… డేంజర్ బెల్స్ ఫర్ జగన్..? Two Directors Upset With Allu Arjun! Follow Mirchi9 on Google NewsThis Week Releases on OTT – Check ‘Rating’ Filter Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to Jobs@Mirchi9.com The post పుష్ప… రెడ్లు… అందుకే బలిసి కొట్టుకుంటున్నారు..! appeared first on mirchi9.com. Like 0 Thanks! You've already liked this « ఇద్దరు చిన్నారులను బలితీసుకున్న కసాయి తండ్రి » Gandhi Hospital Temporarily Closed Due To High COVID Cases
అంతా మోసం , మాయ మాటలు, మార్కెట్ మాయజాలంతో ఆకర్షణీయమైన లే ఔట్ ఫొటోలతో రియల్ వ్యాపారం బాగా చేయొచ్చు అనుకున్నాడు… అనుమతులు లేకున్నా ఉన్నాయని చెప్పి కొనుగోలుదారులను బురిడీ కొట్టించి ప్లాట్లు అమ్ముకునే ప్రయత్నం… ఒకటి కాదు రెండు కాదు అనుమతులు లేకుండా మూడు వెంచర్ లకు శ్రీకారం చుట్టాడు ఓ అక్రమవెంచర్ ల వీరుడు… ఫామ్ ల్యాండ్, గ్రీన్ ల్యాండ్, ఇన్ఫ్రా ఎస్టేట్ పేరు లతో రియల్ దందా మొదలు పెట్టారు… ఈయనకు తోడు ఇక్కడ నడుస్తున్న అక్రమ రియల్ దందాకు ఓ ఇద్దరు తహశీల్దార్ లు సైతం సహకరిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరూ ఈ రియల్టర్ కు అక్రమ రిజిస్ట్రేషన్ లు చేస్తున్నట్లు తెలిసింది… నాలా కన్వర్షన్ లేదు డిటీసీపీ అనుమతులు అసలే లేవు వర్ధన్నపేట, ఐనవోలు మండలాల్లో ఓ ఫైనాన్షియర్ చేస్తున్న మూడు వెంచర్ లకు అనుమతులు లేవని తెలిసింది సాధారణంగా వెంచర్ చేయాలంటే వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ చేసిన తర్వాత మాత్రమే వెంచర్ చేయాలి కానీ ఈ ఫైనాన్షియర్ అవేమి పట్టించుకోకుండానే డిటీసీపీ అనుమతులు తీసుకోకుండానే మూడు వెంచర్ లు చేసినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు వర్ధన్నపేట, ఐనవోలు మండలాల్లో ఇటీవల ఓ ఫైనాన్షియర్ మూడు అక్రమ వెంచర్ లను ఏర్పాటు చేశాడు. వ్యవసాయ భూములను నాలా కన్వర్షన్ చేయకుండానే ప్లాట్లు గా చేసి గజాల్లో కాకుండా 2 గుంటలకో ప్లాటు చొప్పున అమ్మకాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ వెంచర్ లోని ప్లాట్లను వెంచర్ నిర్వాహకులు ఇచ్చే ముడుపులకు ఆశపడి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వర్ధన్నపేట, ఐనవోలు తహసీల్దార్ లు 2 గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేసి పాస్ బుక్ లు జారీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం డిటీసీపీ అప్రూవల్ అంటూ మోసం వర్ధన్నపేట మండలం ఉప్పరపెళ్లి క్రాస్ రోడ్ కట్రియాల శివారులో ఈ ఫైనాన్షియర్ చేసిన వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేకున్నా డిటీసీపీ అప్రూవల్ లే అవుట్ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం పై న్యూస్-10 ప్రతినిధి డిటీసీపీ అధికారులను సంప్రదించగా ఆ వెంచర్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. డిటీసీపీ అనుమతి తీసుకోకుండానే డిటీసీపీ అప్రూవల్ లే అవుట్ అని బోర్డు ఏర్పాటు చేయడం పై డిటీసీపీ అధికారులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీయబోతున్నట్లు అనౌన్స్ చేయగానే జనాల్లో ఆసక్తి పెరిగిపోయింది. కానీ ఆర్ధిక కారణాల వలన సినిమాను మధ్యలోనే ఆపేశారు. Udayavani Dhuli Hyderabad, First Published Nov 26, 2018, 2:10 PM IST దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీయబోతున్నట్లు అనౌన్స్ చేయగానే జనాల్లో ఆసక్తి పెరిగిపోయింది. కానీ ఆర్ధిక కారణాల వలన సినిమాను మధ్యలోనే ఆపేశారు. రీసెంట్ గా సినిమాను మళ్లీ మొదలుపెట్టారు. ఎన్టీఆర్ జీవితంలో చీకటి కోణాన్ని బయటపెట్టబోతున్నట్లు వెల్లడించాడు వర్మ. ఈ సినిమాకి సంబంధించి లక్ష్మీపార్వత దగ్గర ముందే అనుమతి తీసుకున్నాడు వర్మ. సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ఆమె కూడా హాజరయ్యారు. అయితే ఈ సినిమా తీసే ముందు తనకు స్క్రిప్ట్ మొత్తం ఒకసారి చూపించాలని లక్ష్మీపార్వతి కండీషన్ పెట్టింది. ఈ కండీషన్ గురించి వర్మ దగ్గర ప్రస్తావించగా.. స్క్రిప్ట్ లక్ష్మీపార్వతికి చూపించే ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు. 'నేనొక కథ చెప్పి మరొక కథ తీస్తే పరిస్థితి ఏంటి..? సినిమా అనేది పరస్పర నమ్మకంతో ముందుకు వెళ్లాలి. నన్ను లక్ష్మీపార్వతి నమ్మితే చాలు.. స్క్రిప్ట్ మాత్రం ఆమెకి చూపించే ప్రసక్తే లేదని' అన్నారు. అలానే ఈ సినిమాకి క్రిష్ తెరకెక్కిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధం లేదని అన్నారు. తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన దగ్గర నుండి ఏయే పాత్రలు ఉన్నాయో.. అన్ని పాత్రలు సినిమాలో ఉంటాయని అన్నారు. సినిమాలో అందరూ కొత్త నటీనటులే కనిపిస్తారని కొన్ని పాత్రలకు స్టార్ డం అవసరం లేదని వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.
మొత్తానికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి చిత్రా రామకృష్ణను సీబీఐ అరెస్ట్ చేసింది. 2013-16 కాలంలో ఎన్ఎస్ఈ సీఈవోగా ఉన్న చిత్ర అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆమె వైఖరి వల్ల స్టాక్ ఎక్స్చేంజిలో పెట్టుబడులు పెట్టిన వేలాదిమంది ఇన్వెస్టర్లు వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. సీఈవోగా తనను ఒక అదృశ్య వ్యక్తి, హిమాలాయాల్లో సంచరించే ఒక బాబా నడిపించారనే విచిత్రమైన వాదన చిత్ర వినిపిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల టర్నోవర్, బిజినెస్ జరిగే స్టాక్ ఎక్స్చేంజ్ రోజువారి కార్యక్రమాలను అత్యున్నత స్థాయిలో ఉన్న సీఈవోను ఒక అదృశ్య వ్యక్తో లేదా హిమాలయాల్లో సంచరించే బాబానో నడిపించారంటే ఎవరైనా నమ్ముతారా ? అసలు హిమాలయాల్లో సంచరించే బాబాకు లక్షల కోట్ల రూపాయల వ్యవహారాలతో ముడిపడున్న స్టాక్ ఎక్స్చేంజికి ఏమిటి సంబంధమో చిత్ర చెప్పటంలేదు. జరిగిన విషయాలపై చిత్ర చెబుతున్న విషయాలను విన్న తర్వాత ఆర్థిక రంగ నిపుణులు, స్టాక్ ఎక్స్చేంజ్ నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. చిత్రాను సీబీఐ అదుపులోకి తీసుకుని ఎన్ని రోజులు విచారించినా ఉపయోగం లేకపోయింది. సీబీఐ విచారణకు ఆమె ఏమాత్రం సహకరించలేదు. ఆమెను విచారించే క్రమంలో సీబీఐ కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ సీనియర్ సైకాలజిస్టు సహాయం తీసుకున్నా ఉపయోగం లేకపోయింది. ఏ రకంగా విచారించినా చిత్ర సహకరించలేదు. సీబీఐ అదుపులో ఉన్నపుడే చిత్ర దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. తమ విచారణలో సహకరించని కారణంగా సీబీఐ చిత్రను అరెస్టు చేసింది. ఈమె సీఈవోగా ఉన్న కాలంలో వెనకుండి నడిపించింది గ్రూపు ఆపరేటింగ్ ఆఫీసర్ గా వ్యవహరించిన ఆనంద్ సుబ్రమణియన్ అని దాదాపు తేలిపోయింది. అదృశ్య వ్యక్తి కానీ హిమాలయ బాబా కానీ లేరని ఆనందే బాబా పేరుతో చిత్రను కీలుబొమ్మను చేసి ఆడించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. తమ అనుమానాలకు తగిన ఆధారాలను సీబీఐ ఇఫ్పటికే సేకరించినట్లు సమాచారం. చిత్రతో పాటు ఆనంద్ సుబ్రమణియన్ ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. అయితే ఆనంద్ కూడా సీబీఐకి సహకరించటం లేదు. సరే ఈరోజు కాకపోయినా వీళ్ళద్దరు సీబీఐ విచారణలో మొత్తం గుట్టును విప్పకతప్పదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇదే చిత్ర ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో ప్రముఖంగా చెప్పటం. అంతర్జాతీయ స్ధాయిలో అంత్యంత ప్రభావశీలుర మహిళల జాబితాలో చిత్రకు కూడా ఉన్నారు. పదవుల్లో నుండి దిగిపోయిన తర్వాత ఇలాంటి వాళ్ళంతా వేల కోట్ల రూపాయల కుంభకోణాల్లో కూరుకుపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
October 29, 2020 October 29, 2020 Suma Latha 567 Views abhinandan, Ayaz Sadiq, india, Pakistan Army Chief, Qamar Javed Bajwa, wing commander అభినందన్ ను వదలకపోతే భారత్ యుద్ధం చేస్తుందని బజ్వాకు చెప్పిన ఖురేషీ ‘Army Chief Bajwa Was Shaking, Sweating After India Threatened To Attack ఇస్లామాబాద్‌: వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విషయంలో పాక్ ఆర్మీ చీఫ్‌ బాజ్వాకు వణికిపోయారట. ఈ విషయాన్ని పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ నేత అయాజ్ సాధిక్ వెల్లడించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ ఘటన జరిగింది. భారత్ పై దాడి చేసేందుకు పాక్ యుద్ధ విమానాలు వచ్చిన వెంటనే మన ఫైటర్ జెట్లు వాటిని వెంబడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ గగనతలంలోకి చొచ్చుకుపోయిన అభినందన్ ఒక పాక్ యుద్ధవిమానాన్ని కూల్చేశారు. ఇదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోతున్న తరుణంలో ప్యారాచూట్ ద్వారా పాక్ భూభాగంలో ల్యాండ్ అయ్యారు. ఆ తర్వాత పాక్ సైనికులు ఆయనను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అభినందన్ ను విడుదల చేయకపోతే భారత్ యుద్ధానికి కూడా సిద్ధమయ్యేది. ఇదే విషయం గురించి అయాజ్ సాధిక్ మాట్లాడారు. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో సాధిక్ మాట్లాడుతూ, ఇప్పటికీ తనకు జ్ఞాపకం ఉందని… అభినందన్ ను ఆర్మీ అదుపులోకి తీసుకున్న తర్వాత హైలెవెల్ మీటింగ్ జరిగిందని… ఆ మీటింగ్ కు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాలేదని చెప్పారు. విదేశాంగమంత్రి మహ్మద్ ఖురేషీ మాత్రం హాజరయ్యారని తెలిపారు. ‘దయచేసి అభినందన్ ను వదిలిపెట్టండి. లేకపోతే రాత్రి 9 గంటలకు భారత్ మనపై దాడి చేసే అవకాశం ఉంది’ అని బజ్వాతో ఖురేషీ చెప్పారని… ఆ మాట వినగానే బజ్వా కాళ్లు గజగజ వణికిపోయాయని చెప్పారు. బజ్వాకు ముచ్చెమటలు పట్టాయని తెలిపారు.
-జెడ్పీ చైర్మన్ల కైవసానికి టీఆర్‌ఎస్ కసరత్తు -ఇప్పటికే నాలుగు జెడ్పీల్లో మెజారిటీ -స్వరాష్ట్రంలో సొంత పార్టీకి.. -హంగ్ జిల్లాల్లో కారెక్కుతున్న టీడీపీ, కాంగ్రెస్ జెడ్పీటీసీలు -మున్సిపాలిటీల్లోనూ ఇదే తీరు స్వరాష్ట్రంలో సొంతపార్టీ గూటికే జిల్లా పరిషత్తులు చేరిపోనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జెడ్పీ ఛైర్మన్ ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ను జారీచేసిన నేపథ్యంలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాల మధ్య అధికార పార్టీ వైపే మెజారిటీ జిల్లా ప్రజాపరిషత్‌లు మొగ్గుచూపుతున్నాయి. మొత్తం 9 జడ్పీలలో ఏడింటిపై గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయమైంది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యర్థులను చిత్తు చేసి గణనీయమైన సంఖ్యలో స్థానాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో మూడు జిల్లాల్లో టీఆర్‌ఎస్ స్పష్టమైన మెజార్టీని సాధించింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కారు స్పీడ్‌కు మిగిలిన పార్టీలు ఎదురునిలువలేకపోయాయి. ఇక మెదక్ జిల్లాలో మెజార్టీకి అతి స్వల్ప సంఖ్య తక్కువైనా ఆ వెంటనే కాంగ్రెస్, టీడీపీకి చెందిన జెడ్పీటీసీలు కారెక్కడంతో ఆ జెడ్పీ సైతం గులాబీ దళంలో చేరిపోయింది. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ నాలుగింటిని కైవసం చేసుకున్నైట్లెంది. అదిలాబాద్ జిల్లాలో 52 జెడ్పీటీసీలుండగా టీఆర్‌ఎస్ పార్టీ 38 జెడ్పీటీసీలను గెలుచుకుంది. దీనికి తోడు బీఎస్పీ నుండి గెలిచిన జెడ్పీటీసీ కూడా గులాబీకిందకు చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ముగ్గురు జెడ్పీటీసీలు కూడా టీఆర్‌ఎస్‌వైపు చూస్తున్నారు. దీంతో మొత్తం 52 జెడ్పీటీసీల్లో 42స్థానాలను టీఆర్‌ఎస్ ఖాతాలో ఉన్నాయి. ఇక కరీంనగర్‌లో 57 జేడ్పీటీసీలకుగాను 41 టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ ఇతర పార్టీలకు చెందిన జేడ్పీటీసీలు కూడా వస్తామంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో 36 జేడ్పీటీసీలుండగా కారు పార్టీఖాతాలో 24 ఉన్నాయి. మెదక్‌లో సైతం ఇతర జడ్పీటీసీ మద్దతు లభించింది. దీంతో ఈ నాలుగు జేడ్పీ ఛైర్మన్లను దక్కించుకోవడంలో ఎలాంటి ఇబ్బంది టీఆర్‌ఎస్‌కు లేదు. ఆ మూడు జిల్లాలూ టీఆర్‌ఎస్ వెంటే.. పూర్తిస్థాయి మెజార్టీతో నాలుగు జిల్లాలను దక్కించుకున్న టీఆర్‌ఎస్ పార్టీ మిగిలిన మూడు జిల్లాలు కూడా కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. వరంగల్ జిల్లాలో 50 జేడ్పీటీసీలుండగా టీఆర్‌ఎస్ పార్టీకి 18 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి 10 మంది, ఇండిపెండెంట్ ఒకరు ఇప్పటికే గులాబీ గూటికి చేరారు. దీంతో జేడ్పీ ఛైర్మన్ సీటును దక్కించుకోవడానికి కావాల్సిన 26 మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువ జేడ్పీటీసీలతో టీఆర్‌ఎస్ స్పీడ్ చూపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో కూడా ఎన్నికల ఫలితాల నాటికి హంగ్ పరిస్థితే ఉండేది. జిల్లాలో మొత్తం 33 జేడ్పీటీసీలుండగా టీఆర్‌ఎస్ పార్టీ 12 జేడ్పీటీసీలను కైవసం చేసుకుంది. జేడ్పీని కైవసం చేసుకోవడానికి మేజిక్ ఫిగర్ 17కి మరో 5 జేడ్పీటీసీల అవసరం ఉంది. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తొమ్మిదిమంది జేడ్పీటీసీలున్నారు. ఇందులో ఏడుగురు కారెక్కడానికి సిద్ధమైనట్లు సమాచారం. దీనికి తోడు కాంగ్రెస్ నుండి మరో ముగ్గురు జేడ్పీటీసీలు వచ్చే అవకాశం ఉంది. దీంతో రంగారెడ్డి జేడ్పీని దక్కించుకోవడం టీఆర్‌ఎస్‌కు ఏమాత్రం కష్టం కాదు. మహబూబ్‌నగర్‌లో మొత్తం 64 జేడ్పీటీసీలుండగా మాజిక్ ఫిగర్ 33 జేడ్పీటీసీలు కావాలి. టీఆర్‌ఎస్ పార్టీకి 25 మంది జేడ్పీటీసీలున్నారు. రాష్ట్రంలో మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్, టీడీపీ నుండి భారీ ఎత్తున జేడ్పీటీసీలు కారెక్కడానికి ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో మహబూబ్‌నగర్ జేడ్పీ తామే కైవసం చేసుకుంటామని పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలో 59 జేడ్పీటీసీలకుగాను కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీని సాధించింది. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక కోర్టు వివాదంలో ఉంది. ప్రజల నమ్మకమే పార్టీవైపు నడిపిస్తోంది జడ్పీటీసీ ఎన్నికల నాటి పరిస్థితి ఇపుడు మారిపోవడంతో ఇతర పార్టీల తరపున గెలిచిన జేడ్పీటీసీ, ఎంపీటీలు టీఆర్‌ఎస్ పార్టీ వెంట నడవడానికి ముందుకు వస్తున్నారని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. గులాబీ పార్టీ భారీ విజయాలు సాధించి అధికారం చేపట్టడంతో పాటు రోజురోజుకు ప్రజల్లో విశ్వనీయత పెంచుకోవడం దానికి కారణమంటున్నారు. తెలంగాణ పునర్ణిర్మానంలో భాగస్వామ్యం కావాలంటే గులాబీ నీడనే చేరడమే సరైనదన్న అంచనాకు వారు వచ్చారంటున్నారు. కేసీఆర్ అంటేనే నమ్మకం. అందుకే ప్రజలు ఆయనపై ఉన్న నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. మా పార్టీ కూడా వారి ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తోంది. ఏ రాజకీయ నాయకులైనా ప్రజల కోణంలో నుండే చూస్తారు కనుక వారంతా మా వెంట నడవడానికి సిద్ధం అవుతున్నారు. మెజార్టీ ఎంపీపీలనుకూడా టీఆర్‌ఎస్ పార్టీనే కైవసం చేసుకుంటుంది. ఒకరిద్దరు ఎవరైనా ఇప్పుడు రాకున్నా… భవిష్యత్తులో వారు కూడా మాతోనే కలిసొస్తారు అని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు విశ్లేషించారు. ఏ క్యాంపుల్లో ఉన్నా ఓటు టీఆర్‌ఎస్‌కే.. మేం ఏ పార్టీ నుంచి గెలిచామని కాదు. ఏ పార్టీకి మద్దతు పలికితే మా ప్రాంతానికి మేలు జరుగుతుందన్నదే ముఖ్యం అని కాంగ్రెస్ పార్టీ క్యాంపులో ఉన్న ఒక జడ్పీటీసీ అంతరంగాన్ని బట్టి చూస్తే వారు ఎక్కడున్నా జడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వబోతున్నాడనే విషయం స్పష్టం అవుతుంది. అంతేకాదు మా పరిధి మండలం వరకే కానీ మాకంటే పెద్దవాళ్లు ముందుచూపుతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు వారి కంటే మేం పెద్దవాళ్లం కాదు. ఒక రకంగా సందిగ్ధంలో ఉన్న మాకు మా అనుమానాల్ని నివృత్తి చేసే విధంగా మేం కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకునే విధంగా మాకు దారి చూపారు అంటూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలను ఉటంకించారు. ఇదే పరిస్థితి బల్దియా, నగర పాలక సంస్థల ఎన్నికల్లో సైతం ఉంది. హైదరాబాద్, వరంగల్ నగర పాలక సంస్థలు మినహా మెజారిటీ మున్సిపల్, నగర పాలక సంస్థలు టీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్లనున్నాయి.
ఆరు సంవత్సరాల క్రితం మాతెలుగు మేష్టారు గరికపాటి మల్లావధాని గారి గురించి చెప్పాను, రాశాను. నాకు కాస్తో కూస్తో (కాస్త కాదు, కూస్తోనే సరైనదని ఇన్నేళ్ళ త రువాత తెలిసింది!), తెలుగు సాహిత్యం మీద అభిమానం ఇంకా మిగిలి వుండటానికి మా తెలుగు మేష్టారే కారణం. మాతెలుగు మేష్టారు గరికపాటి మల్లావధాని గారు 1899 లో పుట్టారు. అంటే 1999 లో శతవార్షిక సభ చేసి ఉండాలి. నాకు తెలిసినంతవరకూ అల్లాటి దుర్బుద్ధి ఎవరికీ పుట్టలేదు. కనీసం ఆయన పనిచేసిన కాలేజీ తెలుగు శాఖ భవనంలో ఆయన బొమ్మైనా పెట్టినట్టులేదు. అసలు, ఆయన అక్కడ పనిచేసినట్టు, సుమారు 25 సంవత్సరాల పాటు ఎంతోమంది విద్యార్థులకి మాతృభాషాభిక్ష పెట్టినట్టూ, అక్కడ ఇప్పుడు గద్దెకెక్కిన వారికి తెలిసినట్టు కూడా లేదు. తెలిసిన కొద్దిమందీ కిమ్మనకుండా బెల్లం కొట్టిన రాళ్ళల్లా కూర్చోవడానికి అసలు కారణం ఇప్పుడు చెప్పుకోవలసిన అవసరమూ లేదు. కొవ్వూరు సంస్కృత విద్యాలయంలో మేష్టారి చదువు. తరువాత ప్రఖ్య సీతారామశాస్త్రి, పురిఘళ్ళ సుబ్రహ్మణ్య శాస్త్రి, తాతా సుబ్బరాయశాస్త్రుల శుష్రూషలో సంస్కృత భాష సాహిత్యపు మెరుగులు నేర్చుకోవడం, కల్లూరి వెంకట్రామ శాస్త్రి, వజ్ఝల సీతారామ శాస్త్రుల దగ్గిర తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించడమూ! ఈ పై పండితులెవరికీ ఏ డిగ్రీలూ లేవు; మల్లావధానిగారికి ఏ డిగ్రీ రాలేదు. అప్పట్లో, వేలూరి శివరామశాస్త్రి గారి అష్టావధానాల ఆకర్షణలో పడి, తనూ అవధానాలు చెయ్యడం; ఇవన్నీ, ఆయన జీవితంలో వంతెనకింద పోయిన నీరులా మరుగున పడిపోయాయి. 1921 లో ఆయన చదువు మానుకొని సహాయ నిరాకరణోద్యమంలో చేరి గ్రామ గ్రామానికీ పోయి జాతీయగీతాలు రాసి, పాడి, బ్రిటీషువాడికి వ్యతిరేకంగా ఉపన్యాసాలిచ్చి, జనాన్ని మేలుకొలిపారు! ఆయన అప్పుడు పాడిన జాతీయగీతాలు ఆనాటి కాంగ్రేసు పార్టి అచ్చువేసి అమ్ముకున్నదని వినికిడి. స్వరాజ్యం వచ్చిన తరువాత కూడా, ఆయన ఒక్క పైసా సంపాదించుకో లేదు, రాజకీయబాధితుడి ముసుగు వేసుకొని! అటువంటి స్వఛ్చందసేవకులెంతోమంది కష్టపడ్డారుగనుకనే ఇవ్వాళ, మనం రాజకీయ స్వాతంత్య్రం అనుభవిస్తున్నాం. ఇప్పుడు, మన మంత్రులు, మాజీ బాపతు, తాజా బాపతు మంత్రులందరూ, నిరాఘాటంగా నల్ల బజారు బిలియనీర్లుగా మారిపోతూవుంటే, వెర్రి మొహాలు వేసుకోని చూస్తూ ఉన్నాం! 1930 లో గాంధీ గారి పిలుపు విని ఉప్పు సత్యాగహంలోకి దూకి, శ్రీకృష్ణజన్మస్థానాన్ని దర్శించారు, మా తెలుగు మేష్టారు! ఆయన జైలు కథ మీకు చెప్పితీరాలి. కోర్టువారు ఆయన్ని, ఏలూరులో బ్రిటీషు జిల్లాజడ్జి గారి ముందు విచారణకి బోనెక్కించారు. అప్పుడు, ఆయన ఆశువుగా చెప్పిన పద్యం. లేదుగదయ్య! మా నుడుల లేశమసత్యము సత్య బద్ధమౌ వాదమె దోసమయ్యెడు నభాగ్యమిదే మనకబ్బె నింక నౌ కాదననేల? మీ విహిత కార్యకలాపము దీర్పబూనుడా మీదట దేవుడే గలడు మిమ్మును మమ్ము పరీక్షసేయగన్‌. “మేము చెప్పేది కాస్త కూడా అబద్ధం కాదు. నిజం చెప్పడం అపరాధం అయ్యింది. ఇది మన దురదృష్టం. ఇక అవును, కాదు అనడం ఎందుకు? మీరు చెయ్యవలసిన పని, (అంటే నన్ను జైలులో పెట్టడం) మీరు చెయ్యండి. ఆపైన మిమ్మలినీ, మమ్మలిని పరీక్షచేసేందుకు దేవుడే ఉన్నాడు,” అని ఆయన చెప్పాడు. జైలు కెళ్ళాడు. (జైలులో స్నేహితులని కూడగట్టుకోని, అవధానాలు చెయ్యడం అభ్యసించారని చెపుతారు!) పదేళ్ళ తరువాత, 1940 లో గాంధీ ప్రేరణతో, రెండవ ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా భారతదేశం అంతటా, సత్యాగ్రహోద్యమం మొదలయ్యింది. ఆ సత్యాగ్రహంలో మొట్టమొదటగా దేశద్రోహం అని నేరం ఆపాదించి వినోబా భావేని బ్రిటీషు ప్రభుత్వం జైల్లో పెట్టింది. తరువాత, గోరఖ్‌ పూర్‌ లో నెహ్రూ గారు సత్యాగ్రాహిగా మూడు ఉపన్యాసాలిచ్చారు, యుద్ధానికి వ్యతిరేకంగా! ఆ ఉపన్యాసాలు, “దేశద్రోహకరం,” అని గోరఖ్‌పూర్‌ జిల్లా కోర్టులో బ్రిటీషుప్రభుత్వం నెహ్రూమీద అభియోగం తెచ్చింది. గోరఖ్‌ పూర్‌ లో బ్రిటీషు జడ్జీ ముందు నెహ్రూగారు తనపై తెచ్చిన అభివాదంపై చేసిన ప్రకటన, సారాంశం సరిగ్గా పది సంవత్సరాలకి ముందు మా తెలుగు మేష్టారు ఏలూరు జడ్జీకి చెప్పిన పద్యంలాంటిదే! ఆ ప్రకటన సారాంశం ఇది. నేను మీముందు ఒక వ్యక్తిగా, బ్రిటీషుప్రభుత్వానికి వ్యతిరేకిగా నిలబడి వున్నాను. మీరు (జడ్జీ గారిని ఉద్దేశించి) బ్రిటీషు ప్రభుత్వానికి ఒక ప్రతీక ( symbol ) ప్రస్తుతం నేనూ ఒక ప్రతీకనే. మొత్తం భారతజాతికి, వారి జాతీయతకీ ప్రతీకని. బ్రిటీషు సామ్రాజ్యంతో తెగతెంపులు చేసుకోని, స్వతంత్ర భారతంగా వేరవడానికి నిశ్చయించుకున్న వాడిని. ఇది నా ఒక్కడి కోరికా కాదు. భారతీయులందరూ ఏకగ్రీవంగా ఇదే వాంఛిస్తున్నారు. అంటే, నన్ను దోషిగా నిందించి శిక్ష వెయ్యడం కొన్ని కోట్ల భారతీయులని నిందించి శిక్ష వెయ్యడం అని అర్థం. అది, ఎంతో గొప్పదనుకుంటున్న మీ బ్రిటీషు ప్రభుత్వానికి ఏమంత తేలికైన పని కాదు. నెహ్రూగారు దేవుడి ప్రసక్తి తేలేదు. ప్రజల ప్రసక్తి తెచ్చారు. ప్రపంచన్యాయస్థానం దృష్టిలో బ్రిటీషు ప్రభుత్వమే నేరస్తుడిగా పరిగణించబబడుతుంది సుమా అని తీవ్రంగా హెచ్చరించాడు. ( Incidentally, Nehru’s statement at his trial was and still is one of the best prose pieces ever written in the English language! ) ప్రపంచ ప్రజలు, స్వాతంత్య్రంకోసం ఉవ్విళ్ళూరే ఎన్నో కోట్ల ప్రజలు, బ్రిటీషు ప్రభుత్వాన్ని fascist నిరంకుశ ప్రభుత్వంగా న్యాయవిచారణ చేసే రోజు వస్తుంది సుమా, అని మందలించాడు. నెహ్రూ జైలు కథ, మా తెలుగు మేష్టారి (గరికపాటి మల్లావధాని గారు!) జైలు కథతో జోడించి ఎందుకు చెప్పానంటే, నిస్స్వార్థంగా, ప్రత్యేక కార్యసాధన గురిగా పెట్టుకొని పనిచేసే వాళ్ళందరూ ఒకే రకంగా ఆలోచిస్తారు; ప్రవర్తిస్తారు, అని చెప్పడం కోసం. ఇవాళ భారతదేశంలో, నెహ్రూలూ లేరు; మల్లావధానులూ లేరు. అది మన దురదృష్టం. పి.యస్‌. మల్లావధాని మేష్టారికి శిక్ష వేసిన జడ్జీగారు, శిక్షవేసితరువాత, వారం రోజుల్లో హటాత్తుగా మరణించారు. అప్పట్లో, ఏలూరు ప్రజలు అనుకునే వారట మల్లావధానిగారు జడ్జీ గారిని శపించాడనీ అందుకే ఆయన వారం తిరక్కుండా గుటుక్కుమన్నాడనీ! ఏమో! ఏ పుట్టలో ఏపాముందో ఎవరికి తెలుసు! (నవంబరు 14 నెహ్రూ గారి పుట్టిన రోజు. భారత ప్రభుత్వం ఆ రోజు పిల్లల రోజుగా ప్రత్యేకించింది.)
ఆంధ్రా పార్టీగా టీడీపీకి ముద్రవేసిన కేసీఆర్ ఇక ఆ పార్టీ మీద విమర్శలు చేయలేరు. కారణం ప్రాంతీయవాదానికి కాలం చెల్లడంతో జాతీయవాదాన్ని అందుకున్నామని గతించిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన లీడర్లు చెప్పడం గమనార్హం. కులం, మతం, ప్రాంతం చాలా సున్నితమైనవి. వాటికి భావోద్వేగాలను జోడిస్తే ఆలోచనాశక్తి లోపిస్తుంది. ఫలితంగా వ్యక్తిగత లబ్దిపొందొచ్చనే సిద్ధాంతాన్ని కేసీఆర్ ఇప్పటి వరకు నడిపారు. రెండుసార్లు సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం ద్వారా తెలంగాణకు సీఎం అయ్యారు. ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ కు భావోద్వేగాలను జోడించడం ద్వారా అనూహ్య ఫలితాలను అన్ని విధాలుగా ఆయన పొందారు. ఆర్థిక స్వేచ్ఛ అంశంలో ఆకాశానికి ఎదిగిన ఆయన ఇప్పుడు విశాలదృక్పదాన్ని అందుకున్నారు. ఒకప్పుడు ఆంధ్రోళ్లు దోపిడీదారులంటూ తెలంగాణ జనాన్ని రెచ్చగొట్టారు. ప్రాంతీయ విద్వేషాల్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. దశాబ్దాలుగా కలిసున్న తెలుగు వాళ్లను పరస్పర శత్రువుల్లాగా మార్చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిదికాదని ఆనాడు పదేపదే చెప్పిన చంద్రబాబును తెలంగాణ నుంచి తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడు అప్పట్లో చంద్రబాబు చెప్పిన మాటలను అటూఇటూ తిప్పుతూ తెలుగు వాళ్ల `అలయ్ బలయ్` సూత్రాన్ని కేసీఆర్ సూత్రీకరిస్తున్నారు. బీఆర్ఎస్ స్థాపనతో కేసీఆర్ నిజస్వరూపాన్ని చాలా వరకు తెలుసుకున్న తెలంగాణ జనం తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని టాక్‌. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు 1996 నుంచి 2004 వరకు చేసిన పనులను గుర్తు చేసుకుంటున్నారు. ఆనాడు ఆయన వేసిన పునాదులపై నిర్మితమైన సంపన్న తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నారు. ఉమ్మడి ఏపీ రెవెన్యూ మొత్తాన్ని హైదరాబాద్ లోనే కేంద్రీకరించడం ద్వారా ఇప్పుడు సిరుల పంట కురుస్తోంది. పేదోడు కూడా కోట్లకు అధిపతులుగా ఉన్నారంటే ఆనాడు ఉమ్మడి ఏపీ రెవెన్యూను హైదరాబాద్ చుట్టుపక్కల కుమ్మరించడమే. విజన్ 2020 కళ్లకు కట్టినట్టు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు కనిపిస్తోంది. ఇదంతా చంద్రబాబు చలువేనంటూ చెప్పుకోవడం ప్రారంభం అయింది. అందుకే, టీడీపీ పూర్వ వైభవం కోసం తెలంగాణలో కొత్త ఎత్తుగడతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ గురించి చంద్రబాబు చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. అంటే, దాన్లో ఎన్నో రాజకీయ కోణాలను వెదుక్కోవచ్చు. రెండు దశాబ్దాల క్రితమే కేసీఆర్ అంటే ఏమిటో జనానికి బాబు చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు వాస్తవరూపంలోకి వచ్చాయి. బహుశా ఆ చిరునవ్వు అందుకేనేమో! తెలుగు వాళ్ల ఐక్యత, ఆత్మగౌవరం కోసం పోరాడిన పార్టీ టీడీపీ. దాన్ని కాదని వెళ్లిన తెలంగాణ జనం తప్పు తెలుసుకున్నారని అర్థం వచ్చేలా బాబు చిరునవ్వు ఉందేమో! ఇప్పటి వరకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందే చూశారు. ఇక తాను ఇస్తానంటూ సంకేతం వచ్చేలా ఆ చిరునవ్వును తీసుకోవచ్చేమో! ఇలా అనేక భావాలు వచ్చేలా చంద్రబాబు చిరునవ్వు బీఆర్ఎస్ పార్టీ స్థాపనకు అన్వయించుకోవచ్చు. వాస్తవంగా ఉమ్మడి ఏపీలో టీడీపీకి కంచుకోటగా తెలంగాణ ఉండేది. స్వర్గీయ ఎన్టీఆర్ వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడం ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రంలోని పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం ఒక సంచలనం. మహిళలకు ఆస్తిలో సగభాగం ఇస్తూ చట్టాన్ని చేయడం రాజకీయ విప్లవం. కూడు, గుడ్డ, నీడ నినాదంతో ప్రజల్లోకి వచ్చిన ఎన్టీఆర్ ను ఆరాధించిన ప్రాంతాల్లో తెలంగాణది సింహభాగం. ఆంధ్రా, రాయలసీమ కంటే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉండే వాళ్లు. బీసీ ఓటు బ్యాంకు ఇప్పటికీ ఆ పార్టీ సొంతం. కానీ, ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా టీడీపీని వ్యూహాత్మకంగా కేసీఆర్‌ బలహీన పరిచారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత తిరిగి బీసీ లీడర్లు టీడీపీ వైపు చూస్తున్నారని సమాచారం. కేసీఆర్ ఎత్తుగడలకు చెక్ పెడుతూ ఈసారి చంద్రబాబు వ్యూహాత్మకంగా చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కమిటీలను టీడీపీ ఏర్పాటు చేసింది. ఆంధ్రా పార్టీగా ముద్రవేసి టీడీపీని దెబ్బకొట్టడం ద్వారా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బలోపేతం చేశారు. ఆ పార్టీలోని 90శాతం మంది పూర్వపు టీడీపీ లీడర్లే. తెలుగుదేశం పార్టీ బీ టీమ్ గా ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏర్పడిన తరువాత సెంటిమెంట్ కు కాలం చెల్లింది. తిరిగి బడుగు, బలహీనవర్గాలకు చెందిన కురువృద్ధులు టీడీపీ పంచకు రావడానికి సిద్ధం అవుతున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం యువ రక్తాన్ని నింపడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ముందడుగు వేస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ రూపంలో చంద్రబాబుకు తెలంగాణలో రాజమార్గం ఏర్పడింది.
దేశంలో అత్యంత వేగంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తోంది. మాస్క్ లు సక్రమంగా ధరించాలని ముక్కు నోటిపైనే ఉండాలని సూచించింది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఆర్టీ పీసీఆర్ పరీక్షలు పెంచాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టి వైరస్ సోకిన వారిని ఐసోలేషన్ లో ఉంచాలని తెలిపింది. దేశవ్యాప్తంగా 10 జిల్లాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నయాన్న కేంద్ర ఆరోగ్య శాఖ ఇందులో 8 జిల్లాలు మహారాష్ట్రలోనే ఉండటం వైరస్ వ్యాప్తి ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో కళ్లకుకడుతోంది. యాదాద్రి ఆలయంలో ఆర్జితసేవల రద్దు: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కరోనా బారిన పడుతున్న ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా 266 మందికి పరీక్షలు నిర్వహించగా 24 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. వీరిలో 10 మంది ఆలయ సిబ్బంది అర్చకులు ఉన్నారు. దీంతో తాజాగా వైరస్ సోకిన ఉద్యోగులతో కలిపి ఇప్పటివరకు వైరస్ బారినపడిన ఆలయ ఉద్యోగులు అర్చకుల సంఖ్య 83కి చేరింది. యాదగురిగుట్ట మండలంలో కేవలం ఆరు రోజుల్లో 141 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆలయంలో వైరస్ వ్యాప్తి వేగంగా వ్యాపిస్తున్నందున స్వామి వారి ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ఏప్రిల్ 3 వరకు ఆర్జిసేవలు, అన్న ప్రసాదం నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు లఘు దర్శనాన్ని మాత్రమే కల్పిస్తున్నారు. భక్తులు లేకుండానే స్వామివారికి ఏకాంతంగా దైవారాధనలు ఇతర పూజాదికాలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి:మాస్క్ ధరించకుంటే చర్యలు తప్పవు ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సినేషన్: మరోవైపు ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు అర్హులైనవారు కొవిన్ యాప్ లో ముందస్తుగా నమోదు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లేదంటే ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటల తరువాత నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్ళి అక్కడే రిజస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ పొందొచ్చని ఆరోగ్య శాఖ సూచించింది.
మీ చిన్నప్పుడు మీరు పిడుగులు పడినప్పుడు భయపడితే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు అర్జున ఫాల్గుణ అని నామాలు జపించమని చెప్పారా? అవి ఎందుకు జపిస్తారో తెలుసా ? ఇలా జపించడానికి రెండు కారణాలున్నాయి. అవేంటి అంటేమొదటి కారణం ఏంటి అంటే మీరు ఒకవేళ మామూలు సందర్భాల్లో మంత్రం జపిస్తే నరుడు నారాయణుడుని తలచుకుంటున్నట్లు అర్థం. అంటే మానవుడు దేవుడిని జపిస్తున్నట్లు. మనం మామూలుగా దేవుడిని తేల్చుకుంటాం కదా అలాగే ఈ మంత్రాన్ని జపిస్తారు. ఇంకా రెండవ కారణం ఏంటి అంటే సందర్భానుసారం మాత్రం చెప్పడం. వర్షం పడుతున్నప్పుడు ఈ మంత్రం చెప్తే పిడుగులు ఆగిపోతాయి. అంటే ఈ మంత్రం జపిస్తే పిడుగులు రాకుండా రక్షించమని దేవుడిని కోరుకుంటున్నట్లు అర్థం. ఈ రెండవ కారణం వెనకాల ఒక చిన్న కథ ఉంది. ఖాండవ వన దహనం సమయము అప్పుడు అగ్నిహోత్రుడు కృష్ణార్జునలను ఆ వనాన్ని దహిస్తానున అని అడిగారట. ఒక మహారాజు పెద్ద యజ్ఞం చేశాడు అని అందులో నెయ్యి తాగి తాగి అజీర్ణం అయిందని బాగా ఆహారం కావాలి అని అగ్నిహోత్రుడు చెప్పారు. ఈ మాట విన్న కృష్ణార్జునులు ఆశ్చర్యపోయారు.అదేంటి అజీర్ణం అన్నారు కానీ మళ్ళీ ఆహారం కావాలి అంటున్నారు అని అగ్నిహోత్రుడి ని అడిగారు. అజీర్ణం తగ్గాలంటే మందులు కావాలి మందులు కావాలి అంటే ముందు తయారు చేసుకోవాలి ఈ అడవిలో ఎన్నో ఆయుర్వేద మూలికలు ఉన్నాయి కాబట్టి నేను ఈ అడవిని మొత్తం దహిస్తే నా అజీర్ణం తగ్గుతుంది అని చెప్పారు అగ్నిహోత్రుడు.ఈ మాట విన్న కృష్ణార్జునులు తినేయమని. ఇప్పటివరకు తినకుండా ఎందుకు ఆగారు అని అగ్నిహోత్రుడిని అడిగారు. ఆ ప్రశ్నకి అగ్నిహోత్రుడు ” ఇది ఖాండవ వనం. అంటే ఇది ఇంద్రుడి అరణ్యం. నేను ఈ వనాన్ని ముట్టుకుంటే వర్షం కురిపిస్తాడు. అందుకే తినలేక పోతున్నాను” అని సమాధానమిచ్చారు. ఈ మాట విన్న కృష్ణార్జునులు తినేయమని. ఇప్పటివరకు తినకుండా ఎందుకు ఆగారు అని అగ్నిహోత్రుడిని అడిగారు. ఆ ప్రశ్నకి అగ్నిహోత్రుడు ” ఇది ఖాండవ వనం. అంటే ఇది ఇంద్రుడి అరణ్యం. నేను ఈ వనాన్ని ముట్టుకుంటే వర్షం కురిపిస్తాడు. అందుకే తినలేక పోతున్నాను” అని సమాధానమిచ్చారు. అప్పుడు కృష్ణార్జునులు తాము కాపాడతామని చెప్పారు. అగ్నిదేవుడు చెప్పినట్టే తన ముట్టుకోగానే వర్షం మొదలైంది.అప్పుడు అర్జునుడు వర్షం వైపుకి బాణాలు వేశాడు. అలా తన బాణాల వర్షం తో వర్షాన్ని ఆపాడు. అప్పటినుండి అది వరంగా మారింది. పిడుగు కానీ వర్షం కానీ ఉరుములు కానీ వచ్చినప్పుడు అర్జున ఫాల్గుణ బీభత్స కృష్ణ కిరీటి విజయ పార్థ సవ్యసాచి ధనంజయ అన్న 10 నామాలు జపిస్తే ఉరుములు పిడుగులు ఆగుతాయని శాస్త్రం చెబుతోంది. Recent Posts “ఆ హీరోలు చేసిన పొరపాటు రామ్ చరణ్ కూడా చేస్తున్నారా..?” అంటూ… మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్” పై కామెంట్స్..!
త్రిమూర్తులలో ఒకరు పరమశివుడు అయన కైలాస అధిపతి. ఈయనను శంకరుడు, త్రినేత్రుడు, లయకారుడు, అర్ధనాదీశ్వరుడు ఇలా అనేక రకాల పేర్లతో కొలుస్తారు. హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు వినాయకుడు. ఈయనను గణనాయకుడు, గణపతి, గణేశుడు మరియు అన్ని అడ్డంకులు తొలగించు వాడు విఘ్నేశ్వరుడు అంటూ అనేక రకాలుగా కొలుస్తారు. మరి శివుడు వినాయకుడిని ఎందుకు పూజించాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి శివుడు తన గణాలను తీసుకొని ఒక రాక్షసుడిని సంహరించడానికి బయలుదేరుతుండగా అయన వెళ్లే దారిలో అడుగడుగునా అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రతి పనిలోనూ విఘ్నలూ ఏర్పడుతున్నాయి. అయినా సరే శివుడు వాటిని పట్టించుకోకుండా తన వాహనమైన నంది పైన వెళుతుండగా ఒక్కసారిగా నంది కూడా ముందుకు అడుగువేయలేక ఆగిపోయాడు. అప్పడు శివుడు ఇంతకముందు ఎప్పుడు ఇలా అవ్వలేదని తన కన్నులను మూసుకోగా మనోనేత్రంలో బాలగణపతి నవ్వుతు కనపడ్డాడు. అప్పుడు శివుడికి గుర్తుకు వచ్చినది, పూర్వం గజరూపం గల ఒక రాక్షసుడు శివుడి కోసమై ఘోర తపస్సు చేయగా అప్పుడు ఆ రాక్షసుడి భక్తికి మెచ్చిన ఆ పరమశివుడు ప్రత్యేక్షమై ఏ వరం కావాలో అని అడుగగా ఆ రాక్షసుడు దేవా నీవు నా ఉదరం నందు ఎల్లప్పుడూ ఉండాలి అని అడగడంతో తధాస్తు అని చెప్పి శివుడు ఆ రాక్షసుడి ఉదరం నందు ఉండిపోతాడు. ఇది తెలిసిన పార్వతి దేవి దీనికి పరిష్కార మార్గం చూపమంటూ శ్రీమహావిష్ణువు ప్రార్ధించగా అప్పుడు శ్రీమహావిష్ణువు నందిని గంగి రెద్దుల అలంకరించి, దేవతలందరు సంగీత వాయిద్యాలు పట్టుకొని గజాసురిడి దగ్గరికి వెళ్లి ఆ రాక్షసుడి ముందు వాయించగా అది విన్న గజాసురుడు ఆశ్చర్యానికి గురై పరవశించి మీకు ఎం వరం కావాలో చెప్పమని అడుగగా, అప్పుడు మారువేషంలో ఉన్న విష్ణువు, నీ ఉదరంలో ఉన్న శివుడు కావాలంటూ బదులివ్వగా వచ్చినది శ్రీమహావిష్ణువు అని తెలుసుకొని ఇక అంతం తప్పదు అని భావించి నా తలని బ్రహ్మాది దేవతలంతా, త్రిలోకాలు కూడా పూజించేలా చేయాలనీ ప్రార్ధించగా, అప్పుడు గంగి రెద్దు రూపంలో ఉన్న నంది తన కొమ్ములతో గజాసురుడి ఉదరాన్ని చీల్చేస్తుంది. అప్పుడు ఆ మరమశివుడు బయటికి వచ్చి కైలాసానికి బయలుదేరుతాడు. ఇక విషయం తెలిసిన పార్వతీదేవి సంతోషించి అభ్యంగన స్నానం చేయాలనీ తలచి నలుగు పిండితో ఒక బొమ్మని చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి ద్వారానికి కాపలాగా ఉంటూ ఎవరిని కూడా లోపలికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకు అని చెప్పి స్నానం చేయడానికి వెళుతుంది. కైలాసానికి చేరుకున్న శివుడిని లోపలకి రాకుండా ద్వారం వద్ద ఆ శిశువు అడ్డుకొనగా ఆవేశంతో శివుడు తన త్రిశూలంతో ఆ శిశువు తలని ఖండిస్తాడు. ఇలా లోపలికి వెళ్లిన తరువాత కొద్దిసేపటికి శివుడిని చుసిన పార్వతి ద్వారం వద్ద శిశువుని చూసి పట్టరాని దుఃఖంతో విలపించగా, అప్పుడు శివుడూ కలత చెంది గజ సూరిని తలని ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేసాడు. అయితే గణపతికి ఏనుగు తల అతికించి తిరిగి బ్రతికించిన సమయంలో, దేవతలు, ఋషులు, సాధారణ మనుషులు ఏ పూజలు, వ్రతాలు, శుభకార్యాలు చేసిన మొదటి పూజ నీకె, నూతనంగా ఎవరు ఏ పనిని తల పెట్టిన ముందుగా నిన్ను తలచుకొని నీకు పూజ చేయనిదే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి కాదు, అందుకు త్రిమూర్తులమైన మేమూ అతీతులం కాదు అని వరాన్ని ఇస్తాడు. అయితే రాక్షసుడిని సంహరించడానికి బయలుదేరే ముందు శివుడు ఆ తొందరలో గణపతిని కలసి వెళ్లే పని గురించి చెప్పకుండా వెళ్లడంతో దారిలో ఇలాంటి ఆటంకాలు ఎదురయ్యాయని అప్పుడు గ్రహించి తిరిగి వెనక్కు వెళ్లి గణపతిని పూజించి, తనకి ఏ విఘ్నలూ లేకుండా విజయం సాధించేలా చూడమని గణపతికి చెప్పి తిరిగి వచ్చి యుద్ధం చేసి విజయాన్ని సాధిస్తాడు.
ఇటీవల కాలంలో మన తెలుగు సినిమాలు బాలీవుడ్ మార్కెట్ లో మంచి వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. 'పుష్ప' - 'ఆర్.ఆర్.ఆర్' - 'మేజర్' - 'సీతారామం' - 'కార్తికేయ 2' వంటి సినిమాలు హిందీలో కూడా విడుదలై.. నార్త్ సర్క్యూట్స్ లో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ ఉత్తరాది మార్కెట్ మీద దృష్టి సారిస్తున్నారు. దసరా బరిలో నిలిచిన 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుండగా.. ఇప్పుడు 'ది ఘోస్ట్' మూవీ కూడా అదే బాటలో వెళ్తోంది. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ''ది ఘోస్ట్''. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా వచ్చిన రిలీజ్ ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. నాగ్ ను ఒక ఇంటెన్స్ రోల్ లో ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. హై ఆక్టీన్ యాక్షన్ - స్టైలిష్ మేకింగ్ - స్టన్నింగ్ విజువల్స్ తో మెస్మరైజ్ చేసాడు. దీంతో 'ది ఘోస్ట్' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకున్నారు. ఇది కచ్చితంగా నార్త్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందని భావించారు. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటుగా హిందీ - తమిళ భాషల్లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ''విక్రమ్: ది ఘోస్ట్'' అనే టైటిల్ తో గోల్డ్ మైన్స్ టెలీ ఫిలిమ్స్ తో కలిసి మనం ఎంటర్ప్రైజెస్ - శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై హిందీలో రిలీజ్ చేస్తున్నారు. 'మనం ఎంటర్ప్రైజెస్' అనే సంస్థ నాగార్జున కు చెందినదే అనే టాక్ ఉంది. అయితే తెలుగుతో పాటుగా కాకుండా రెండు రోజులు ఆలస్యంగా విడుదల చేస్తుండటం గమనార్హం. 'ది ఘోస్ట్' చిత్రాన్ని తెలుగు - తమిళ భాషల్లో దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తుండగా.. హిందీ వెర్సన్ ''విక్రమ్: ది ఘోస్ట్'' ను మాత్రం అక్టోబర్ 7వ తారీఖున థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హిందీ టీజర్ ను విడుదల చేశారు. దీనికి ఉత్తరాది ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నాగార్జున కు బాలీవుడ్ లో ఎప్పటి నుంచో మంచి క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. 'శివ' సినిమాతో హిందీలో సత్తా చాటిన నాగ్.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. 'మాస్' 'డాన్' వంటి సినిమాలు హిందీలో డబ్ కాబడి టీవీ ఛానల్స్ మరియు యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అందుకే నాగార్జున ను ఫస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ పేర్కొంటుంటారు. చాలా గ్యాప్ తర్వాత ఇటీవల 'బ్రహ్మాస్త్ర' సినిమాతో నాగార్జున మళ్లీ బాలీవుడ్ జనాలు మాట్లాడుకునేలా చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ''విక్రమ్: ది ఘోస్ట్'' సినిమాతో హిందీ మార్కెట్ ను టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో బాలీవుడ్ నటి గుల్ పనాగ్ కీలక పాత్ర పోషించింది. 'పుష్ప' వంటి తెలుగు మూవీతో నార్త్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న గోల్డ్ మైన్స్.. ఇప్పుడు కింగ్ నాగ్ తో కలిసి ఎలాంటి విజయాన్ని సాధిస్తారో చూడాలి. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
గోల్కొండ హైస్కూల్‌తో మంచి పేరు తెచ్చుకున్న సంతోష్ శోభన్ రెండు సినిమాలతో పూర్తి హీరో గా మారాడు. ఈ యువ హీరోకి సరైన హిట్ దొరకలేదు, కాని ఇప్పుడు అతను హీరోగా నటించిన సినిమా “ఏక్ మినీ స్టోరీ” పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 30 న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది, కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ చిత్రం మే 27వ తేదీని విడుదల అవుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు. ఈ అధికారిక వార్తను పంచుకుంటూ, ఈ చిత్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ట్విట్టర్ వేదికగా ఇలా రాశారు. “ఈ సినిమా మే 27 న అమెజాన్ ప్రైమ్ లో రానుంది, మరియు ఈ మూవీ ట్రయిలర్ రేపు వస్తున్నట్లు” ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు మరియు టీజర్ రిలీజ్ అయ్యాయి. ఈ టీజర్ సినిమా పై అంచనాలను పెంచుతుంది. ప్రముఖ దర్శకుడు మెర్లాపాకా గాంధీ ఈ చిత్రాన్ని రాశారు. ఈ సినిమా తో కార్తీక్ రాపోలు దర్శకుడిగా అడుగుపెట్టనున్నాడు. గోకుల్ భారతి ఈ చిత్ర ఛాయాగ్రాహకుడు.ఈ సినిమాకు రవీందర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, ప్రవీణ లక్కరాజు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. యువి క్రియేషన్స్ సోదరి-బ్యానర్ యువి కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం రాత్రి విస్తారంగా వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో 26 మండలాలు, శ్రీసత్యసాయిజిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా రాప్తాడులో 64.6 మి.మీ వర్షపాతం నమోదైంది రుద్రంపేట-ఆలమూరు రోడ్డులో పోలీసుల సాయంతో వంతెన దాటుతున్న ప్రజలు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 రాప్తాడు, కళ్యాణదుర్గంలో 9.20 హెక్టార్లలో దెబ్బతిన్న ద్రాక్ష, టమోటా పంటలు రూ.38 లక్షల పంటనష్టం అంచనా అనంతపురం అర్బన, అక్టోబరు 6: ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం రాత్రి విస్తారంగా వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో 26 మండలాలు, శ్రీసత్యసాయిజిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా రాప్తాడులో 64.6 మి.మీ వర్షపాతం నమోదైంది. పుట్లూరు 46.0, శింగనమల 44.2, అనంతపురం 36.8, బుక్కరాయసముద్రం 36.6, గుంతకల్లు 33.8, పామిడి 26.2, కూడేరు 22.0, నార్పల 21.4, గార్లదిన్నె 19.4, విడపనకల్లు 17.6, వజ్రకరూరు 16.8, రాయదుర్గం 14.4, బ్రహ్మసముద్రం 14.0, గుమ్మఘట్ట 10.4, పెద్దపప్పూరు 10.2, పెద్దవడుగూరు 9.2, ఉరవకొండ, బెళుగుప్ప 8.6, యాడికి 7.0 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో 6.0 మి.మీలోపు వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా బత్తలపల్లిలో 72.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కొత్తచెరువు 51.6, పుట్టపర్తి 50.2, ఓడీ చెరువు 25.4, నంబులపూలకుంట, బుక్కపట్నం 21.2, కదిరి 21.0 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో 13.8 మి.మీలోపు వర్షపాతం నమోదైంది. గురువారం పుట్లూరు, నార్పల, ఎనపీకుంట, ముదిగుబ్బ, గుత్తి, విడపనకల్లు, యల్లనూరు తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అనంతపురం, యాడికి, పుట్లూరు, గార్లదిన్నె, పామిడి, శింగనమల, గుంతకల్లు, కూడేరు, తాడిపత్రి, బొమ్మనహాళ్‌ పెనుకొండ, ఉరవకొండ, తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. రాప్తాడు, కళ్యాణదుర్గంలో 9.20 హెక్టర్లల్లో దెబ్బతిన్న ద్రాక్ష, టమోటా భారీ వర్షానికి రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి, ప్రసన్నాయపల్లిలో 1.20 హెక్టార్లల్లో దాదాపు రూ.30 లక్షల విలువైన ద్రాక్ష పంట దెబ్బతింది. కళ్యాణదుర్గం మండలంలో 8 హెక్టార్లల్లో 8 లక్షల విలువైన టమోటా పంట దెబ్బతింది. మొత్తం 9.20 హెక్టార్లల్లో రూ.38 లక్షల విలువైన ద్రాక్ష,టమోటా పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అనంతపురం రూరల్‌: మండలంలో వర్షం దంచి కొట్టింది. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారు జాము వరకు వర్షం కురవడంతో పలుగ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆలమూరు చెరువు మరువ పారింది. దీంతో రుద్రంపేటలోని పలుకాలనీలు వర్షపు నీటితో మునిగాయి. వికలాంగుల కాలనీలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి నీరు చేరడంతో సామగ్రి మొ త్తం తడిసిపోయింది. యాలేరు, కక్కలపల్లి చెరువులు కూడా నిండి మరువపారాయి. దీంతో రుద్రంపేట నుంచి కట్టకిందపల్లి, ఆలమూరు వెళ్లే ప్రధాన రోడ్డుపై నూతనం గా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిపోయాయి. స్థానికులు వంతె న దాటేందుకు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఆర్డీఓ మధుసూదన, తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తి, సర్పంచు పద్మావతి, పంచాయతీ కార్యదర్శి నరసింహారెడ్డి తదితరులు అక్కడి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు వంతెన దాటేందుకు చర్యలు చేపట్టారు. రాత్రి కురిసిన వర్షానికి కురుగుంట, రాచానపల్లి, ఎ.నారాయణపురం చెక్‌డ్యాంలు నీటితో పొంగిపొర్లాయి. కొడిమి వంకలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్లలో రాకపోకలు బంద్‌ అయ్యాయి. మరువ పారిన చెరువులు ధర్మవరం రూరల్‌: మండలంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఎడతెరపి లేకుండా జోరువాన కురిసింది. ఈ వర్షానికి వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లాయి. గొట్లూరు చెరువు ఉధృతంగా మరువ పారింది. కుణుతూరు వద్ద పెద్దచెక్‌డ్యాం పొంగి పొర్లింది. దర్శినమల గ్రామానికి చెందిన రైతు నారాయణమ్మ, ఆంజనేయులు దంపతులు తమ పొలంలో బోరుబావి కింద సాగుచేసిన వేరుశనగ పంటను గత రెండు రోజుల క్రితం కోత కోశారు. మొత్తం తడిసిపోయింది. 5ఎకరాల్లో వేరుశనగ సాగుచేశామని, రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టామని, ఈ వర్షానికి తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షానికి కూలిన ద్రాక్ష తోట పందిరి ఇద్దరు రైతులకు రూ.30 లక్షలు నష్టం రాప్తాడు: భారీ వర్షానికి చేతికందిన ద్రాక్ష పంట, పందిరి పడిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న ద్రాక్ష తోటలు రాత్రికి రాత్రే నేలవాలాయి. ద్రాక్ష పందిరికి ఉపయోగించిన రాళ్లు కూడా పడిపోయాయి. దీంతో రైతులకు రూ. లక్షల్లో నష్టం వచ్చింది. రాప్తాడు మండంలోని గొందిరెడ్డిపల్లి గ్రామంలో రైతు గంగరాజు 1.5 ఎకరాల్లో ద్రాక్ష సాగు చేశాడు. దాదాపు 30 టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశాడు. రెండు రోజుల్లో ద్రాక్ష పంట కోత కోయాల్సి ఉండగా బుధవారం రాత్రి మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ద్రాక్ష పంట, పందిరి తడవడంతో బరువు ఎక్కువై కుప్పకూలిపోయింది. ప్రసన్నాయపల్లి గ్రామంలో రైతు వెంకటేశ్వరరెడ్డి ఎకరా ద్రాక్ష సాగు చేశాడు. దిగుబడి బాగా వచ్చింది. 20టన్నుల ద్రాక్ష అవుతుందని రైతు అంచనా వేశాడు. కోత కోయాల్సి ఉండగా భారీ వర్షానికి పంట పడిపోయింది. రైతు గంగరాజు రూ. 15లక్షలు, వెంకటేశ్వరరెడ్డి రూ. 10 లక్షలు పైగా నష్ట పోయినట్లు తెలిపారు. పరిశీలించిన ఉద్యాన శాఖ అఽధికారులు ద్రాక్ష పంట, పందిరి పడిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఉద్యాన శాఖ అఽధికారులు పరిశీలించారు. ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు నరసింహరావు, ఉద్యానశాఖ అధికారి రత్నకుమార్‌ గురువారం ఉదయం గొందిరెడ్డిపల్లి, ప్రసన్నాయపల్లి గ్రామాల్లో రైతు గంగరాజు, వెంకటేశ్వరరెడ్డి ద్రాక్ష పంటను పరిశీలించారు. ఇద్దరు రైతులకు దాదాపు రూ. 30లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ సిబ్బంది ప్రియలత, విద్య, రైతులు పాల్గొన్నారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఎం భారీ వర్షాల వల్ల నష్టపోయిన ద్రాక్ష రైతులకు ప్రభు త్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఉదయం గొందిరెడ్డిపల్లి, ప్రసన్నాయపల్లి గ్రామాల్లో వర్షానికి పడిపోయిన గంగరాజు, వెంకటేశ్వరరెడ్డి ద్రాక్ష పంటను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కోతకు వచ్చిన పంట పడిపోవడం వల్ల రైతులు భారీగా నష్టపోయారన్నారు. అధికారులు పంట నష్టం అంచనా వేసి ఉన్నతాధికారులకు పంపి వెంటనే నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌ - 2022లో జీవీఎంసీ జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించడం, స్వచ్ఛతా లీగ్‌లో మొదటి స్థానం సాధించడంతో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గ్రేటర్‌ అధికారులను అభినందించారు. జీవీఎంసీ అధికారులను అభినందిస్తున్న సీఎం అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచన విశాఖపట్నం, అక్టోబరు 7: స్వచ్ఛ సర్వేక్షణ్‌ - 2022లో జీవీఎంసీ జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించడం, స్వచ్ఛతా లీగ్‌లో మొదటి స్థానం సాధించడంతో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గ్రేటర్‌ అధికారులను అభినందించారు. మున్సిపల్‌ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎంఏయూడీ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్‌, పూర్వపు కమిషర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా, ప్రస్తుత కమిషనర్‌ పి.రాజాబాబు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కట్టమూరి సతీష్‌, అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కె.ఎస్‌.ఎల్‌.జి.శాస్ర్తి బృందం శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి జీవీఎంసీకి లభించిన అవార్డును చూపించారు. ఈ సందర్భంగా సీఎం జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్‌, పారిశుధ్య నిర్వహణ, ప్లాస్టిక్‌ నియంత్రణ కొరకు చేస్తున్న కృషికి అధికార్లకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, అన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు, విశాఖ ప్రజలు కలిసి పని చేస్తే వచ్చే సంవత్సరం మొదటి స్థానం దక్కించుకోగలుగుతారని సీఎం దిశానిర్దేశం చేసినట్లు కమిషర్‌ రాజాబాబు తెలిపారు.
యువ హీరో కార్తికేయ గుమ్మకొండ 'ప్రేమతో మీ కార్తీక్' అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత వచ్చిన 'Rx 100' చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం బాగా కష్టపడున్నాడు. హీరోగా మాత్రమే సినిమాలు చేయాలని ఫిక్స్ అవ్వకుండా.. మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు విలన్ గానూ మెప్పిస్తున్నాడు. అయితే Rx100 తర్వాత కార్తికేయకు హీరోగా సరైన సక్సెస్ అందడంలేదు. పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసిన ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. గతేడాది గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కార్తికేయ నటించిన 'చావు కబురు చల్లగా' చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇదే క్రమంలో వచ్చిన 'రాజా విక్రమార్క' సినిమా కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. ఇలా కార్తికేయ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ వస్తున్నాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్తికేయ చేతిలో ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేస్తున్న #Kartikeya8 మూవీ ఒకటి. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అప్పుడెప్పుడో ఓ ఆసక్తికరమైన ప్రయాణం కొనసాగుతోందంటూ ప్రీ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ తర్వాత యూవీ టీమ్ తో కార్తికేయ చేస్తున్న సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రాలేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఇప్పటికే ఈ మూవీ పూర్తయిందని తెలుస్తోంది. సినిమా మాతృ సో సోగా ఉందని.. కాకపోతే హీరో క్యారెక్టరైజేషన్ వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇకపోతే కార్తికేయ ఇటీవల తన 9న సినిమా ''బెదురులంక 2012'' టైటిల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సి. యువరాజ్ సమర్పిస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై 'కలర్ ఫొటో' నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. 'బెదురులంక 2012' అనేది గోదావరి నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా. సొసైటీకి నచ్చినట్లు బతకడం సరైందా? మనసుకు నచ్చినట్టు బతకడం సరైనదా? అనే పాయింట్ మీద ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో కార్తికేయ సరసన 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఇదిలా ఉంటే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో కార్తికేయ హీరోగా అప్పట్లో ఓ చిత్రానికి అధికారిక ప్రకటన వచ్చింది. దీనికి సుకుమార్ నిర్మాతగా వ్యవహరించడమే కాదు.. స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ కూడా అందించనున్నట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి కొత్త అప్డేట్ లేదు. ఇలా కార్తికేయ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుండగా.. మరొకటి ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది తెలియడం లేదు. బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ వస్తున్నాయి కాబట్టి.. యువ హీరో కచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అతని ఆశలన్నీ ముందుగా వచ్చే యూవీ క్రియేషన్స్ సినిమాపైనే ఉన్నాయని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
<big><center><strong>నాణ్యత విషయమై TRANSLATEWIKI.NET ఏ విధమైన గ్యారంటీ ఇవ్వదు</strong></center></big> <big><center><strong>నాణ్యత విషయమై TRANSLATEWIKI.NET ఏ విధమైన గ్యారంటీ ఇవ్వదు</strong></center></big> − translatewiki.net లోని అనువాదాలను మీ రిస్కు పైనే వాడుకోండి. అవి ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశించబడ్డాయి. కానీ translatewiki.net ఇక్కడ లభించే కంటెంటు నాణ్యత విషయమై గ్యారంటీ ఇవ్వజాలదు. + translatewiki.net లోని అనువాదాలను మీ రిస్కు పైనే వాడుకోండి. అవి ఉపయోగకరంగా ఉండాలనే మేం ఉద్దేశించాం. కానీ translatewiki.net ఇక్కడ లభించే కంటెంటు నాణ్యత విషయమై గ్యారంటీ ఇవ్వజాలదు. <div lang="en" dir="ltr" class="mw-content-ltr"> <div lang="en" dir="ltr" class="mw-content-ltr"> Revision as of 12:59, 20 February 2022 నాణ్యత విషయమై TRANSLATEWIKI.NET ఏ విధమైన గ్యారంటీ ఇవ్వదు translatewiki.net లోని అనువాదాలను మీ రిస్కు పైనే వాడుకోండి. అవి ఉపయోగకరంగా ఉండాలనే మేం ఉద్దేశించాం. కానీ translatewiki.net ఇక్కడ లభించే కంటెంటు నాణ్యత విషయమై గ్యారంటీ ఇవ్వజాలదు. Translatewiki.net and its editors do not provide any warranty on the contents whatsoever, whether expressed, implied, or statutory, including, but not limited to, any warranty of merchantability or fitness for a particular purpose or any warranty that the contents will be error-free. Retrieved from "https://translatewiki.net/w/i.php?title=Project:General_disclaimer/te&oldid=10550458"
రుణాలను తిరిగి పొందడానికి సంబంధించి భారతదేశం యొక్క రుణ రంగం నిర్దిష్ట నియమాలు మరియు మార్గదర్శకాలను అనుసరిస్తుంది. ఈ నియమాలు సెక్యూర్డ్ మరియు అన్‍సెక్యూర్డ్ క్రెడిట్లకు భిన్నంగా ఉంటాయి. మరోవైపు, రుణగ్రహీత మరణం తర్వాత పర్సనల్ లోన్‍కు ఏమి జరుగుతుందో అనేక కుటుంబాలు తెలియదు, ఉదాహరణకు. పర్సనల్ లోన్ లాంటి అన్‍సెక్యూర్డ్ క్రెడిట్ రికవరీ ప్రాసెస్‍ను పేర్కొనే అలాంటి నిబంధనలు ఏమీ లేవు. అయితే, ఒక వ్యక్తి అవధి మధ్యలో మరణిస్తే, పర్సనల్ లోన్ కోసం ఏమి చేయాలి అనే దానికి సంబంధించి వివిధ రుణదాతలు వారి నిబంధనలను పర్సనల్ లోన్ డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. వాటి గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది విభాగాలను తనిఖీ చేయండి! రుణగ్రహీత మరణం తర్వాత రుణదాతలు ఒక పర్సనల్ లోన్‌ను ఎలా తిరిగి పొందుతారు? సెక్యూర్డ్ లోన్ల లాగా కాకుండా, బాకీ ఉన్న పర్సనల్ లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి రుణదాతలు మరణించిన రుణగ్రహీత యొక్క చట్టపరమైన వారసులను లేదా ఇతర జీవించి ఉన్న సభ్యులను అడగలేరు. ఈ క్రెడిట్‌లో కొలేటరల్ ఉండనందున, రుణదాతలు భౌతిక ఆస్తిని పొందలేరు మరియు నిధులను తిరిగి పొందడానికి దానిని విక్రయించలేరు. అటువంటి సందర్భాల్లో, రుణదాతలు సాధారణంగా బాకీ ఉన్న బ్యాలెన్స్‌ను వ్రాసి దానిని NPA అకౌంట్‌కు జోడిస్తారు. అదేవిధంగా, ఒక పర్సనల్ రుణం హోల్డర్ మరణించిన దురదృష్టకరమైన సందర్భంలో కుటుంబ సభ్యులు ఏమి చేయాలో కూడా తెలుసుకోవాలి. వేరొక సందర్భంలో, ఒక కో-అప్లికెంట్ లేదా కో-సైనర్ ఒక పర్సనల్ లోన్‍తో ప్రమేయం కలిగి ఉంటే, ప్రాథమిక పర్సనల్ లోన్ రుణగ్రహీత మరణం తర్వాత బకాయి మొత్తాన్ని వ్యక్తి చెల్లించవలసి ఉంటుంది. అయితే, బాకీ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి మరణించిన రుణగ్రహీత యొక్క చట్టపరమైన వారసులను తప్పనిసరి చేసే అటువంటి నియమం ఏదీ లేదు. లేదా అతని/ఆమె ఆస్తి స్వాధీనం చేసుకోండి. రుణగ్రహీత మరణించిన తర్వాత బాకీ ఉన్న పర్సనల్ రుణం తిరిగి చెల్లించే విధానం ఇప్పుడు ఒక అవధి మధ్యలో రుణగ్రహీత మరణించిన తర్వాత ఒక పర్సనల్ లోన్‌కు రుణదాత ఏమి చేస్తారు అనేది స్పష్టంగా ఉంది, రుణగ్రహీత యొక్క కుటుంబం వారు అనుసరించాల్సిన విధానాన్ని కూడా తెలుసుకోవాలి. దీనిలో ఇవి ఉంటాయి- రుణగ్రహీత మరణం గురించి రుణదాతకు తెలియజేయడం బకాయి ఉన్న రుణం మొత్తాన్ని సెటిల్ చేయడానికి రుణదాతను అభ్యర్థించడం ఆ తర్వాత, రుణదాత ఈ క్రింది వాటిని తనిఖీ చేస్తారు: రుణగ్రహీతకు ఒక పర్సనల్ రుణం ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మరియు ఏదైనా కో-అప్లికెంట్ ఉంటే పర్సనల్ రుణం రుణగ్రహీత పేరులో మాత్రమే ఉంటే, రుణదాత NPA ప్రాసెస్‌ను ప్రారంభిస్తారు అందువల్ల, ముందుకు కొనసాగడానికి ముందు ఒక పర్సనల్ లోన్‍కు సంబంధించిన కాగితాలను చదవడం తెలివైనది. బజాజ్ ఫిన్‌సర్వ్100% పారదర్శకతతో పర్సనల్ రుణం అందిస్తుంది. అప్లై చేయడానికి ముందు నిబంధనలు మరియు షరతులను జాగ్రత్తగా చదవండి.
1. మనకొచ్చే దాన్ని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మన జీవితంలోని ఆనందం ఉంటుంది. 2. జీవితంలో కొన్ని తలుపులు మూసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది మీ గర్వం, పొగరు, పనికిరానితనం వల్ల కాదు.. ఆ తలుపులు మిమ్మల్ని ఎక్కడికీ తీసుకెళ్లలేవు కాబట్టి. 3. జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు. పైగా గర్వపడాలి. ప్రతిఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు. కానీ ఆ తప్పుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకునేవారు కొందరే. మన గతమే మనకు అలాంటి పాఠాలు నేర్పుతుంది. 4. మనం కేవలం ఇతరుల కోసమే జీవించలేం. మనకు ఏది సరైనదో అదే చేయాలి. అది అవతలివారికి ఇబ్బంది కలిగిస్తుందన్నా.. వారిని బాధిస్తుందన్నా.. మన కోసం మనం జీవించాల్సిందే. 5. ఒక తెలివైన వ్యక్తి.. ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు. తెలివి లేని వాడు తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు. Life Quotes in Telugu, Best Life Quotes in telugu text, Telugu inspirational Quotes wallpapers, fresh good morning quotes wallpapers messages online free download, trending telugu new life quotes pictures wallpapers for top whatsapp sharing quotes, 6. జీవితం అనేది పది శాతం మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మరో 90 శాతం ఆ పనుల ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది. 7. మనం మనసులో ఎంత వరకూ ఆనందంగా ఉండాలనుకుంటామో.. అంతే ఆనందంగా ఉండగలుగుతాం. 8. జీవితంలో ప్లాన్ A పని చేయకపోతే.. మరో 25 అక్షరాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. తెలుగులో అయితే 56. 9.జీవితంలో ఒక విషయం మంచిగా మారడానికి మనం వేచిచూడకూడదు. ఎందుకంటే అన్ని విషయాలు ముందు నుంచీ మంచివై ఉంటాయి లేదా ముందు నుంచి చెడ్డవై ఉంటాయి.
ఆ రోజుల్లో బౌద్ధ భిక్షువులు కొందరు ఒంటరిగా అడవుల్లో, కొండ గుహల్లో ఉంటూ ఉండేవారు. అలా ఉండేవారిలో కొందరు ఒంటరితనానికి భయపడి, తిరిగి వచ్చేసేవారు. అక్కడ ఉండే ప్రశాంతత, నిశ్శబ్దం కూడా వారిని భయపెట్టేవి. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఆ రోజుల్లో బౌద్ధ భిక్షువులు కొందరు ఒంటరిగా అడవుల్లో, కొండ గుహల్లో ఉంటూ ఉండేవారు. అలా ఉండేవారిలో కొందరు ఒంటరితనానికి భయపడి, తిరిగి వచ్చేసేవారు. అక్కడ ఉండే ప్రశాంతత, నిశ్శబ్దం కూడా వారిని భయపెట్టేవి. ఇంకా రకరకాల భయాలు వారిని వెంటాడేవి. కానీ కొందరు అక్కడ నిర్భయంగా గడిపి, ఎనలేని ప్రశాంతతను పొందివచ్చేవారు. బుద్ధుడు భయరహితుడు. భయం అనేది ఆయన దరిదాపులకు కూడా వచ్చేది కాదు. వందమందిని హతమార్చిన అంగుళీమాలుని దగ్గరకు... ఆ నిర్భయత వల్లనే ఒంటరిగా వెళ్లాడు. బుద్ధుడి నిర్భీతి చూసి అంగుళీమాలుడే భయపడ్డాడు. శ్రావస్తి సమీపంలో అనాథపిండికుడు నిర్మించి, బహూకరించిన జేతవనంలో ఒకసారి బుద్ధుడు ఉన్నాడు. అప్పుడు జానుస్సోణుడు అనే పండితుడు ఆయన దగ్గరకు వచ్చాడు. వారిద్దరూ సంభాషించుకుంటూ ఉండగా... ఒక భిక్షువును తీసుకొని... కొందరు భిక్షువులు బుద్ధుని దగ్గరకు వచ్చారు. ఆ భిక్షువు అడవి నుంచీ భయంతో తిరిగి వచ్చిన విషయం చెప్పి, వారందరూ ఒక పక్కన కూర్చున్నారు. ఇది చూసిన జానుస్సోణుడు ‘‘భగవాన్‌! మీ ధర్మాన్ని విని ఎందరో భిక్షువులుగా మారుతున్నారు. వారిలో కొందరు అరణ్యాలలో ఏకాంతవాసం చేస్తున్నారు. ఒంటరిగా అడవుల్లో ఉండడం చాలా కష్టం కదా! భయపడడం సహజమే కదా! భయపడుతూ ఉన్నవారు సంతోషంగా ఎలా గడపగలరు? సాధన ఎలా సాగించగలరు?’’ అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు ‘‘జానుస్సోణా! కొందరు మాత్రమే భయపడతారు. కొందరు భయపడకుండా ఉంటారు. ఏకాగ్రత సాధిస్తారు’’ అన్నాడు. ‘‘భగవాన్‌! ఎవరు భయపడతారు? ఎవరు భయపడరు? వివరించండి’’ అని ప్రార్థించాడు జానుస్సోణుడు. ‘‘అపరిశుద్ధ కర్మలు ఎవరు చేస్తారో వారు భయపడతారు. చేయనివారు భయపడరు. భయం ఎరుగరు. జానుస్సోణా! లోభి, కామ దురాచారి, ద్రోహి, దుష్ట స్వభావి, సోమరి, స్థిరత్వం లేనివాడు, అశాంతితో గడిపేవాడు, నిశ్చితమైన అభిప్రాయం లేని ద్వైదీభావి, అనుమానపు రోగి, తన గొప్ప తాను చెప్పుకుంటూ... ఇతరుల్ని నిందించేవారు, సత్కార్యాలమీద ఆశ, కీర్తి కండూతి కలవారు, పరిపూర్ణ జ్ఞానం లేనివారు, చపల చిత్తులు, నిగ్రహంలేని కోపధారులు, బుద్ధిహీనులు, గొర్రెలా తోక వెనుకే ఉండిపోయేవారు... వీరంతో ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకసారి భయపడతారు. వీరి జ్ఞానం, జీవన విధానం, ప్రవర్తన... మనో వ్యాకులతను కలిగించి భయపెడతాయి. చివరకు తమను చూసి తామే భయపడతారు. ఇలాంటివారు నిర్భయంగా బతకలేరు. ఏకాగ్రత సాధించలేరు’’ అన్నాడు. అరణ్యంలో క్రూరమృగాలకో, విష జంతువులకో లేదా ప్రకృతి ప్రకోపాలకో భయపడతారని అనుకొనే జానుస్సోణునికి అసలు భయం అనేది మన ప్రవర్తన, మన నడతలోనే ఉందని అర్థమైంది. మెరుగైన జీవన విధానం ఎంత ధైర్యాన్ని ఇస్తుందో కూడా తెలిసింది. కత్తిని చేపట్టిన మహారాజుల కన్నా... కరుణను చేపట్టిన బుద్ధుడు ఎంతటి ధైర్యశాలో కూడా తేటతెల్లం అయింది. బుద్ధుడు ఎప్పుడూ చెప్పే కథనే అక్కడ ఉన్న భిక్షువులకు మరోమారు చెప్పాడు. ఆ కథ ఇది: ఒక తాటి వనంలో ఒక కుందేలు ఉంది. అది ఒక రోజు చాలా భయపడింది. వచ్చి ఓ తాటి చెట్టు కింద పొదలో పడుకుంది. దానికి మాగన్నుగా కునుకు పట్టింది. అంతలో పెద్ద శబ్దం వినపడడంతో, లేచి పరుగులు తీసింది. దారిలో నక్క దాన్ని ఆపి ‘‘ఎందుకు అంత భయంగా పరుగులు తీస్తున్నావు?’’ అని అడిగింది. ‘‘అక్కడ భూమి బద్దలైంది’’ అని చెప్పింది కుందేలు. ‘‘అలాగా’’ అంటూ నక్క పరుగు పెట్టింది. ఆ తరువాత వాటికి దారిలో జింక, ఎద్దు, గుర్రం, ఖడ్గమృగం, ఏనుగు... ఇలా చాలా జంతువులు ఎదురయ్యాయి. ‘భూమి బద్దలైపోయింది’ అనే మాట విని అన్నీ పరుగులు తీశాయి. అడవిలో జంతువులన్నీ అలా భయంతో పరుగు పెట్టడం మృగరాజైన సింహం చూసింది. ఆ జంతువులు అడవి చివర ఉన్న లోయవైపు పోతున్నాయి. అవి లోయలో పడి చనిపోతాయేమోనని... ఆ సింహం పరుగు పరుగున వచ్చి వాటిని ఆపింది. విషయం అడిగింది. ‘‘భూమి బద్దలైపోయిందట’’ అంది ఏనుగు. ‘‘నీవు చూశావా?’’ అని అడిగింది సింహం. ‘‘లేదు. నాకు ఖడ్గమృగం చెప్పింది.’’ ‘‘నాకు గుర్రం చెప్పింది’’ అంది ఖడ్గమృగం. ఇలా... చివరికి కుందేలు వంతు వచ్చింది. ‘‘నాకు నిద్దట్లో పెద్ద శబ్దం వినిపించింది. భూమి బద్దలైందేమో అనుకున్నాను. భయంతో పరుగులు తీశాను’’ అని చెప్పింది కుందేలు. జంతువులన్నిటినీ వెంటబెట్టుకొని, కుందేలు నిద్రపోయిన చెట్టు దగ్గరకు వెళ్ళింది సింహం. అక్కడ చూస్తే... ఎండిపోయిన తాటాకు మీద తాటికాయ రాలి పడింది... అంతే! ‘‘మనో వ్యాకులత ఉండి, సరైన జ్ఞానం, విచక్షణ లేకపోవడం వల్లే ఈ భయం’’ అని చెప్పాడు బుద్ధుడు. ‘భయం’ అనేది మనసులో పుట్టేదే కానీ బయట నుంచి వచ్చిపడేది కాదని ఆ భిక్షువుకు అర్థమైంది. తనను తాను సంస్కరించుకొని, ఈసారి నిర్భీతిగా వెళ్ళి... ఏకాగ్రత సాధించాడు.
ఒక సినిమా తెరకెక్కించాలంటే చాలా మంది దాని కోసం పని చేయాలి. తెర మీద కనిపించే నటీనటులు, తెర వెనకుల కష్టపడే టెక్నికల్ టీంతో పాటు క్రూ అంతా కలిసి సమిష్టిగా పని చేస్తేనే సినిమా పూర్తి అవుతుంది. విజయాన్ని అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో ఏ ఒక్కరు కూడా సపొర్ట్ చేయకపోయినా.. సినిమా ముందుకు కదలదు. ముఖ్యంగా షూటింగ్ సమయాల్లో హీరో, హీరోయిన్లు తప్పకుండా అందుబాటులో ఉండాలి. ఇందులో ఏ ఒక్కరు అయినా అందుబాటులో లేకుంటే.. వాయిదా పడటం గ్యారంటీ. MoreGossips News NBK108 : నటసింహానికి జోడీగా రౌడీ హీరోయిన్ Tamannaah : మరో ఐటెం సాంగ్ లో.. SSMB28 : బాలీవుడ్ కు రీచ్ అయ్యేలా.. ప్రస్తుతం ఇలాంటి సమస్యలనే ఖుషి టీం ఎదుర్కొంటుందని తెలుస్తుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 2022 ఏప్రిల్ లో అధికారికంగా ప్రారంభమైంది. షూటింగ్ ను కూడా కొంత వరకు జరుపుకుంది. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత తాజాగా కొత్త షెడ్యూల్ ను ప్రారంభించడానికి మూవీ టీం సన్నద్ధం అవుతుందని సమాచారం. నవంబర్ మొదటి వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని డైరెక్టర్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త షెడ్యూల్ కు హీరోయిన్ సమంత ఇప్పటి వరకు డేట్స్ ఇవ్వలేదట. కనీసం మూవీ టీంతో కాంటాక్ట్ లోకి కూడా రావడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. దీంతో నవంబర్ తొలి వారంలో షూటింగ్ జరుగుతుందా లేదా అనేది టీం క్లారిటీగా చెప్పకలేకపోతున్నారు. అయితే సామ్ గత కొద్ది రోజుల నుంచి ప్రపంచానికి దూరంగా ఉంటుంది. నెట్టింట్లో యాక్టివ్ గా ఉండే సామ్.. కొంత కాలం మొత్తానికే కనిపించలేదు. ఇటీవల రెండు పోస్టులు మాత్రమే కనిపించాయి. ఇదిలా ఉండగా, సమంత.. పర్సనల్ ఒత్తిడిని జయించడానికి ఈషా ఫౌండేషన్ కు వెళ్లిందని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం లేదు.
అందమైన పేరుతో మాయ చేస్తారు… అలాంటి పేర్లు ఉండకూడదని చెప్పిన ప్రభుత్వం జీవో లు తెచ్చి మరీ చెప్పిన అసలే వినరు ఆ మాటలను పెడచెవిన పెడతారు టెక్నో, ఇంటర్నేషనల్, గ్లోబల్ అంటూ ఏవో మాటలు చెపుతారు… చెప్పే చదువుకు వసూల్ చేసే పిజులకు అసలు పొంతన లేకుండా తోచినకాడికి విద్యార్థుల తల్లిదండ్రులను పీజు కోసం పిండేస్తారు.. ఇంకొందరైతే అసలు అనుమతులే లేకున్నా దర్జాగా పాఠశాలను నడిపిస్తారు… మరికొందరు దివాళా తీసిన పాఠశాలలను కొత్త పేరుతో కొనసాగిస్తారు. ఇది ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న కొన్ని ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల పరిస్థితి.నిజానికి చెప్పాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా నడుస్తోంది నడిపించలేక సరైన ఆర్థిక బలం లేక కరోనా మూలం గా కొన్ని పాపం చిన్న చితక ప్రైవేటు బడులు మూత బడ్డాయి. కానీ నూతనంగా ఏర్పడిన హన్మకొండ జిల్లాలో మాత్రం ప్రస్తుతానికి మొత్తం 12 మండలాల్లో కలిపి ప్రాధమిక, ఉన్నత, రెసిడెన్షియల్ ప్రైవేట్ పాఠశాలు 321గా జిల్లా విద్యాశాఖ గుర్తించింది. ఇది పేర్ల కథ…. విధ్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ప్రయివేటు పాఠశాలలపై పర్యవేక్షించవలసిన విద్యాశాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎలా వ్యవహరించిన చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. జిల్లాలో అనుమతులు లేకున్నా ఐఐటీ ఫౌండేషన్,రెసిడెన్షియల్ పేర అందమైన పేర్లతో బోర్దు లు ఏర్పాటు చేసి విద్యార్థుల నుండి వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ నుండి పూర్తి స్థాయిలో అనుమతులు లేకున్నా… ఉన్నత స్థాయి తరగతులు నిర్వహిస్తూ ఫీజులు వసూలు చేస్తున్నారని. వసతులు లేకున్నా, అర్హత లేని అధ్యాపకులు భోదిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.. తూతుమంత్రంగా పాఠశాలను పర్యవేక్షిస్తూ జిల్లా, మండల విద్యా శాఖ అధికారులు కార్పొరేట్ బడుల యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నారని. కొన్ని ప్రయివేటు పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు గాలికి వదిలి అనుమతులు లేకున్నా రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్ లలో నిర్వహిస్తున్న బడులకు క్రీడా మైదానాలు, అగ్నిమాపక శాఖ నుండి ఫైర్ సేఫ్టీ అనుమతి తప్పనిసరి కానీ అనుమతి లేకున్నా ఆడిగేవారే లేకుండా పోయారట.. ఇలాంటి సమస్యల ను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు మాత్రం కంటి తుడుపు వ్యవహారంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. అనుమతులు ఏవి…? ఇది ఇలా ఉంటే ఇటీవల ఖాజీపేటలో విద్యాశాఖ అనుమతులతో నడిచిన ఓ ప్రయివేటు పాఠశాల కరోన కారణంగా కొద్దీ రోజుల క్రితం మూతపడిన ఆ పాఠశాలను ఓ కార్పొరేట్ యాజమాన్యం లీజుకు తీసుకొని అనుమతులు లేకుండా కొత్త పేరుతో పాఠశాలను స్థాపించింది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ పాఠశాల పేరుతో తాత్కాలిక బోర్డులు ప్రదర్శిస్తూ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ కు ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోవడానికి వెనుకడుతున్నారని సమాచారం. అలాగే ఇలాంటి వ్యవహారమే ఎల్కతుర్తి మండల ని ఓ పాఠశాల యాజమాన్యం కొనసాగిస్తున్నట్లు తెలియవచ్చింది. అధికారులు కదిలేనా….? ఓ వైపు కోవిడ్ కారణంగా విద్యా సంవత్సరం మొత్తం ఒడిదుదుకులుగా కొనసాగుతుంటే ,కరోనా సంక్షోభంతో ప్రజలు ఇబ్బందులు పడుతుటే తమకు తోచిన రీతిలో పీజులు వసూలు చేస్తున్న కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలపై అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అధికారులు ఎక్కడకు కదలకుండా ఫిర్యాదు లు వచ్చిన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి సంబంధం లేని పేర్లతో పాఠశాలలు నిర్వహిస్తూ, అసలు అనుమతులు లేకున్నా పాఠశాలలు నడుపుతున్న వారిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా జిల్లా విద్యాశాఖ అధికారులు ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటారా లేదా చూడాలి.
గదిని అందంగా తీర్చిదిద్దడమే కాదు, ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే మొక్కల వరుస అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్యారిస్ లిల్లీస్, ఐవరీ బీటిల్ నుండి క్రిసాన్తిమం వంటి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే మొక్కలు స్ట్రోక్, క్యాన్సర్ మరియు గుండె జబ్బులు, శ్వాసకోశ రుగ్మతలకు కారణమయ్యే టాక్సిన్స్ నుండి గాలిని శుభ్రపరచడం వంటి ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తాయని ఒక అధ్యయనం పేర్కొంది. ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే మొక్కలు మీ ఇంటిని కూడా అందంగా తీర్చిదిద్దుతాయి ఈ ఆక్సిజన్-ఉత్పత్తి కర్మాగారం "గాలిని శుభ్రపరచడం"తో పాటు, ఇళ్ళు, అపార్ట్‌మెంట్లు, బోర్డింగ్ హౌస్‌లలో కూడా స్వీటెనర్‌గా ఉంటుంది. మీరు ప్యారిస్ లిల్లీస్, ఐవరీ తమలపాకులు లేదా బాగా ప్రాచుర్యం పొందిన అత్తగారి నాలుక మొక్కను ఎంచుకోవచ్చు. అత్తగారి నాలుక అలంకారమైన మొక్కగా ప్రసిద్ధి చెందింది అలాగే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే మొక్క. 1. లిలీ పారిస్ ఆక్సిజన్-ఉత్పత్తి చేసే మొదటి మొక్క పారిస్ లిల్లీ (క్లోరోఫైటమ్ కోమోసమ్) లేదా దీనిని స్పైడర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ అలంకార మొక్క కత్తిలా సన్నగా ఉండే ఆకుపచ్చ ఆకులకు ప్రసిద్ధి చెందింది. ఆకులు అందంగా ఉంటాయి, అంచుల వద్ద తెల్లటి రంగుతో అలంకరించబడి వక్రంగా ఉంటాయి. పారిస్ లిల్లీస్ కోసం శ్రమ కష్టం కాదు. ఈ గది యొక్క అన్ని మూలల్లో ఉంచగల అలంకారమైన మొక్కలు వారానికి 2 సార్లు మాత్రమే నీరు కారిపోతాయి. ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు, వాల్ పెయింట్ మరియు ఫర్నిచర్ నుండి టాక్సిక్ ఫార్మాల్డిహైడ్ మరియు జిలీన్‌లను తొలగించడం పారిస్ లిల్లీస్ యొక్క మరొక ప్రయోజనం. 2. డ్రాకేనా Dracaena ఇతర మొక్కల కంటే గాలిని మరింత ప్రభావవంతంగా శుభ్రం చేయగల ఉత్తమ ఆక్సిజన్-ఉత్పత్తి చేసే మొక్కలలో ఒకటి. ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు, ఈ మొక్క గదిలో తేమ స్థాయిలను నియంత్రించడానికి కూడా పనిచేస్తుంది. డ్రాకేనా తన చుట్టూ ఉన్నవారి మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాలు కూడా పేర్కొన్నాయి. గాలిని శుభ్రపరిచే డ్రాకేనా యొక్క సామర్థ్యం ఫార్మాల్డిహైడ్ వంటి హానికరమైన రసాయనాలకు గురికాకుండా చేస్తుంది, జిలీన్, టోలున్, బెంజీన్, మరియు ట్రైక్లోరెథిలిన్. 3. తమలపాకులు తమలపాకు ఐవరీ లేదా ఎపిప్రెమ్నమ్ ఆరియమ్ అనేది నేల లేదా నీటిని ఉపయోగించి పెరిగే ఒక అలంకారమైన మొక్క. ఆక్సిజన్-ఉత్పత్తి చేసే ఈ మొక్క దాని విలక్షణమైన పసుపు పచ్చని ఆకులతో గది యొక్క ప్రతి మూలను అందంగా మార్చగలదు. గాలిని శుభ్రపరచడానికి తమలపాకు దంతపు సమర్థత ఫార్మాల్డిహైడ్ వంటి విషపదార్ధాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది, జిలీన్, టోలున్, బెంజీన్, మరియు కార్బన్ మోనాక్సైడ్. 4. వెదురు అరచేతి వెదురు పామ్ లేదా చమడోరియా సీఫ్రిజి అనేది ఉష్ణమండలంలో సులభంగా కనిపించే అలంకారమైన మొక్కలలో ఒకటి. ఆక్సిజన్-ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్ ఫార్మాల్డిహైడ్, బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్ మరియు జిలీన్ వంటి వాయు కాలుష్యాలను తొలగించడానికి కూడా పనిచేస్తుంది. 5. క్రిసాన్తిమం తదుపరి ఆక్సిజన్-ఉత్పత్తి చేసే మొక్క క్రిసాన్తిమం లేదా క్రిసాన్తిమం మోరిఫోలియం. గాలిని శుభ్రపరచడం మరియు ఫార్మాల్డిహైడ్ వంటి హానికరమైన పదార్ధాలకు గురికాకుండా చేయడం దీని సామర్థ్యం, జిలీన్, బెంజీన్, మరియు అమ్మోనియా, ఈ మొక్క మీ గది మూలలో అలంకరించేందుకు అత్యంత సిఫార్సు మేకింగ్. గాలిని శుభ్రపరచడం మరియు గదిని అందంగా మార్చడం మాత్రమే కాదు, సప్లిమెంట్ల రూపంలో ఉండే క్రిసాన్తిమం మధుమేహం మరియు ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. 6. ఫికస్ ఎలాస్టికా ఫికస్ ఎలాస్టికా యొక్క సొగసైన ప్రదర్శన ఈ ఆక్సిజన్-ఉత్పత్తి చేసే మొక్కను తరచుగా విలాసవంతంగా అలంకరించబడిన గది మూలలో ఉంచేలా చేస్తుంది. టాక్సిక్ కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరెథైలీన్‌కు గురికాకుండా గాలిని శుభ్రపరచడం దీని ప్రయోజనాలు. 7. శ్రీ జీవనోపాధి శ్రీ జీవనోపాధి (అగ్లోనెమా) లేదా చైనీస్ సెమారా అని కూడా పిలుస్తారు, ఇది ఆక్సిజన్-ఉత్పత్తి చేసే మొక్క, ఇది గదిని అందంగా మార్చడానికి కూడా ఉపయోగించవచ్చు. ఉష్ణమండల ఆసియాలో విస్తృతంగా కనిపించే మొక్కలు గాలిని తటస్థీకరిస్తాయి మరియు బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ మరియు వంటి విష పదార్థాలను తొలగించగలవు. ట్రైక్లోరెథిలిన్. 8. శాంతి కలువ పీస్ లిల్లీ లేదా స్పాతిఫిలమ్ ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి వాయు కాలుష్యాలను తొలగించగల తదుపరి ఆక్సిజన్-ఉత్పత్తి చేసే మొక్క. ట్రైక్లోరెథిలిన్, జిలీన్, అలాగే అమ్మోనియా. 9. అత్తగారి నాలుక తదుపరి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే మొక్క అత్తగారి నాలుక (సాన్సేవిరియా). అత్తగారి నాలుక ఉత్పత్తి చేసే ఆక్సిజన్ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు మరింత ప్రశాంతంగా ఉంటుంది. ఈ మొక్క గాలిని తటస్థీకరిస్తుంది మరియు బెంజీన్ వంటి విషపదార్ధాలను ఫిల్టర్ చేస్తుంది, జిలీన్, ట్రైక్లోరెథిలిన్ మరియు ఫార్మాల్డిహైడ్. [[సంబంధిత కథనం]] ఆక్సిజన్ ఉత్పత్తి చేసే మొక్కల ఆరోగ్య ప్రయోజనాలు పైన ఆక్సిజన్-ఉత్పత్తి చేసే మొక్కల ప్రయోజనాల వరుస నుండి, ఈ మొక్కలు స్ట్రోక్, క్యాన్సర్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే టాక్సిన్స్ మరియు కాలుష్యం యొక్క గాలిని శుభ్రం చేయగలవని నిర్ధారించవచ్చు. అదనంగా, ఆక్సిజన్-ఉత్పత్తి చేసే మొక్కలు కూడా మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి, నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి శ్వాసకోశ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Telugu News » World » Global indians » USA Accident TANA Board Director Whole Family Killed in Accident America USA Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తానా డైరెక్టర్‌ శ్రీనివాస్‌ భార్య, ఇద్దరు కూమార్తెలు మృతి.. USA Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్‌ వాలర్‌ కౌంటీలో జరిగిన యాక్సిడెంట్‌లో తానా బోర్డ్‌ డైరెక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌.. Car Accident Shiva Prajapati | Sep 27, 2022 | 10:20 AM USA Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్‌ వాలర్‌ కౌంటీలో జరిగిన యాక్సిడెంట్‌లో తానా బోర్డ్‌ డైరెక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌(Tana Board Director Kodali Nagendra Srinivas) భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. వివరాల్లోకెళితే.. కృష్ణాజిల్లా కురుమద్దాలికి చెందిన డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్‌.. హోస్టన్‌లో నివాసముంటున్నారు. ఆయన భార్య వాణి ఐటీ ఉద్యోగి. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్దమ్మాయి మెడిసిన్‌ చదువుతోంది. చిన్నమ్మాయి ప్లస్ వన్ చదువుతోంది. అయితే, దసరా పండుగ నేపథ్యంలో పెద్దమ్మాయిని ఇంటికి తీసుకురావడానికి వాణి, ఆమె చిన్న కూతురు కారులో వెళ్లారు. పెద్దమ్మాయిని తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయి షాక్‌లోకి వెళ్లిపోయారు నాగేంద్ర శ్రీనివాస్‌. ఈ ప్రమాదపై తానా సభ్యులతో పాటు, అక్కడి తెలుగువారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. తానా సభ్యులు సహా, అక్కడి తెలుగు సంస్థలు, తెలుగువారు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ప్రమాదంపై తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివారు. అనంతరం ఉన్నత విద్యనభ్యసించేందుకు 1995లో అమెరికాకు వెళ్లారు. పీడియాట్రిక్‌ కార్డియోవాస్క్యులర్‌ అనస్థీషియాలజిస్ట్‌గా గుర్తింపుపొందారు. కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలోని హ్యూస్టన్‌‌ల స్థిరపడ్డారు. 2017 నుంచి తానా బోర్డు సభ్యునిగా సేవలు అందిస్తున్న ఆయన.. డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. తాజా ఘోర ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఇవి కూడా చదవండి Mobile SIM: సిమ్ కార్డుకు ఒక అంచున ఎందుకు కట్ చేస్తారో తెలుసా? అసలు రహస్యం ఇదే.. Diabetic Patient Breakfast: మధుమేహం బాధితులు ఇడ్లీకి బదులుగా వీటినే తింటే ప్రయోజనం.. వైద్యుల సూచనలివే..
Telugu News » Entertainment » Ott » Nandamuri Balakrishna Speech in Unstoppable Dussehra Celebrations With NBK Unstoppable With NBK 2: ఇంట్లో తనే అన్‌స్టాపబుల్‌.. నా మనవళ్లు నన్ను తాత అనరు.. బాలయ్య ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ ఇప్పుడీ ఫన్‌ను మరింత పెంచేందుకు అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే రెండో సీజన్‌ను ఆడియెన్స్‌ ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా రెండో సీజన్‌కి సంబంధించి విజయవాడలో ప్రి లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించారు. Nandamuri Balakrishna Basha Shek | Oct 05, 2022 | 8:00 AM ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమైన అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే ఛాట్‌ షో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్నిటికీ మించి ఈ టాక్‌షో కు హోస్ట్‌గా వ్యవహరించిన బాలకృష్ణ సెన్సాఫ్‌ హ్యూమర్‌, పలు సెలబ్రిటీలతో ఆయన పంచుకున్న కబుర్లు ఈ షోను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఇప్పుడీ ఫన్‌ను మరింత పెంచేందుకు అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే రెండో సీజన్‌ను ఆడియెన్స్‌ ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా రెండో సీజన్‌కి సంబంధించి విజయవాడలో ప్రి లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించారు. కాగా ఈ ఈవెంట్‌లో బాలయ్య బాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. అవి కాస్తా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈసారి చిరు, వెంకీ, నాగ్‌.. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యుల గురించి చెప్పిన బాలకృష్ణ ‘బయట నేను ఎంత అన్‌స్టాపబుల్‌ అయినా ఇంట్లో మాత్రం నా సతీమణి వసుంధరే అన్‌స్టాపబుల్‌. ఆమె నన్ను భరిస్తోంది. నా కుటుంబాన్ని లీడ్ చేస్తోంది. సినిమాలు, ఆస్పత్రి విషయాల్లో నేను బిజీగా ఉంటే మిగతా విషయాలు తనే చూసుకుంటుంది. అందుకే ఇంట్లో ఆమె అన్‌స్టాపబుల్’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సీజన్‌లో వచ్చే గెస్టులపై స్పందిస్తూ ‘ ఈసారి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ వచ్చే ఛాన్స్‌ ఉందన్నారు. వాళ్ల సమయాన్ని బట్టి వస్తారు. కచ్చితంగా మొదటి సీజన్‌ కంటే రెండో సీజన్‌ భారీ విజయాన్ని అందుకుంటుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు’ అని తెలిపారు బాలయ్య. కాగా చివరిగా యాంకర్ .. ‘మిమ్మల్ని నేను మావయ్యా అని పిలవచ్చా?’ అని అడగ్గా.. ‘మా ఇంట్లో నా మనవళ్లతోనే నేను తాతయ్య అని పిలిపించుకోను. బాలా అని పిలుస్తారు’ అని సరదాగా సమాధానం ఇచ్చారు బాలయ్య.  ఇవి కూడా చదవండి Ananya Nagalla: బడా ప్రొడ్యూసర్‌ కుమారుడితో పెళ్లి పుకార్లు.. స్పందించిన అనన్య.. వారికి చాలా థ్యాంక్స్‌ అంటూ..
అమెరికాలో గ్రీన్ కార్డు పొందే వారి కోసం నిభందనలు పూర్తిగా సడలించారు.హెచ్ -1బి వీసాపై వచ్చి అమెరికాలో ఏడేళ్ళు ఉంటే చాలు వారు గ్రీన్ కార్డ్ పొందేందుకు అర్హులు అయ్యేలా తమ ఇమ్మిగ్రేషన్ చట్టంలో మార్పులు చేశారు. ఇకపై గ్రీన్ కార్డ్ పొందాలంటే ప్రవాసులు ఏళ్ళ తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పిన అమెరికా అందుకు అనుగుణంగా కీలక మార్పులు తలపెట్టింది. వరుసగా ఏడేళ్ల పాటు హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తే గ్రీన్‌కార్డు జారీకి చట్ట సవరణ బిల్లు సెనెట్‌లో ప్రవేశ పెట్టారు. ఇందుకోసం ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌లో సవరణలు చేశారు. ఈ తాజా బిల్లు ప్రకారం ఇకపై అమెరికాలో వరుసగా ఏడేళ్ళు గనుకా పనిచేస్తే వారు గ్రీన్ కార్డ్ పొందడానికి అర్హత సాధించినట్లే.ఈ కీలక బిల్లును అమెరికా సెనేటర్ అలెక్స్ పాడిల్లా ప్రతిపాదించగా, లుజాక్, వారెన్ ,డిక్ దుర్బిన్ అనే మరి ముగ్గురు సెనేటర్లు మద్దతునిచ్చారు. అమెరికా అంటే భారతీయులకు ఎక్కడ లేని మమకారం. ప్రపంచంలో అన్ని దేశాలకన్నా అమెరికా అంటేనే ఎందుకుంటే పలసల దేశం అది. ఉన్నత చదువులు చదివి అర కొర జీతాలతో పుట్టిన దేశంలో బతక లేక బ్రతుకు దెరువు వెదుక్కుంటూ వెళ్లే దేశాల్లో అమెరికా మొదటిది. అమెరికా జనాభాతో పోల్చితే భారతీయుల జనభా కేవలం 1 శాతం మాత్రమే. 1990కి పూర్వం భారతీయ సంతతి జనాభా కేవలం 4.5 లక్షల మంది కాగా, 2018 నాటికి వీరు గణనీయంగా 489 శాతం పెరగడం విశేషం. 2000 స్వత్సరాల అనంతరం వలసలు బాగా పెరిగాయి. అమెరికా జనాభా మొత్తం 327 మిలియన్ల కాగా, వీరిలో విదేశీ సంతతికి చెందినవారు 13.7 శాతం లేదా 44.7 మిలియన్లు. గత కొన్నేళ్లుగా విదేశీ సంతతి జనాభా 0.4 శాతం పెరుగుతూ ఉంది. 2010 నాటికి విదేశీ సంతతి జనాభా 40 మిలియన్లు ఉండగా, 2018 నాటికి ఇది 11.8 శాతం మేర పెరిగింది. సీఐఎస్ నివేదిక ప్రకారం 2018 జులై 1 నాటికి అమెరికాలో భారత సంతతి ప్రజలు 2.5 మిలియన్లుగా ఉన్నట్టు తేలింది. అమెరికాలోని మొత్తం విదేశీ సంతతి జనాభాలో భారతీయులు 5.9 శాతంగా ఉన్నారు. ఇది అమెరికా జనాభాలో 1 శాతం.
తండ్రులు మరియు తల్లులు, విరిగిన పిల్లల పళ్ళు తక్కువగా అంచనా వేయకూడదు. ఈ దంతాలు చివరికి పడిపోతాయి మరియు శాశ్వత దంతాలతో భర్తీ చేయబడినప్పటికీ, దెబ్బతిన్న శిశువు దంతాలు పెద్ద పిల్లలలో కూడా దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. పిల్లలలో దంత క్షయం యొక్క అనేక కారణాలు ఉన్నాయి మరియు వాటిలో చాలా వరకు నివారించవచ్చు. ఇంతలో, పిల్లల దంతాల కావిటీస్, మురికిగా లేదా ముందుగానే రాలిపోయినప్పుడు, వాటిని చికిత్స చేయడానికి తీసుకోవలసిన చర్యలు ఉన్నాయి. పిల్లలలో దంత క్షయం యొక్క కారణాలు మరియు దానిని ఎలా చికిత్స చేయాలి విరిగిన దంతాలు, దంతాలు, తిరోగమన దంతాలు, కావిటీస్, వాపు చిగుళ్ళు మరియు చిగుళ్ళలో గడ్డలు ఇండోనేషియా పిల్లలు అనుభవించే సాధారణ సమస్యలు. దంత క్షయం యొక్క మొదటి సంకేతం గమ్ లైన్ వెంట ఫలకం కనిపించడం. అదనంగా, దంతాల మీద గోధుమ లేదా నలుపు మరకలు ఉంటాయి. తీవ్రమైన దంత క్షయం కావిటీస్ లేదా ఫ్రాక్చర్లకు కారణమవుతుంది. దంత క్షయం కలిగించే అనేక అంశాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ఇక్కడ ఉన్నాయి. 1. పడుకునే ముందు పాలు తాగడం అలవాటు పడుకునే ముందు పాలు తాగడం వల్ల పిల్లల దంతాలు పాడవుతాయి.తరచుగా పిల్లలు బాటిల్ నుండి పాలు పీలుస్తూనే నిద్రపోతారు. ఇది సాధారణమైనప్పటికీ, శిశువుకు దారి తీస్తుంది సీసా దంత క్షయం అకా పళ్ళు. కొరికిన పిల్లలు, ముందు దంతాలు (సాధారణంగా కోత నుండి కుక్కల వరకు) పాడైపోయినట్లు కనిపిస్తాయి, ఎందుకంటే అవి దెబ్బతిన్నాయి మరియు కావిటీస్ కలిగి ఉంటాయి. పిల్లలను దంతాలుగా చూడటమే కాదు, ఈ అలవాటు పిల్లల దంతాలను పెద్ద కుహరం చేస్తుంది. దాన్ని ఎలా పరిష్కరించాలి: పిల్లలలో దంతాలు ఉన్న పళ్ళు, వీలైనంత వరకు తీయకూడదు. ఇప్పటికీ భద్రపరచబడే పాల పళ్ళు, పాల పళ్ళు బాగా దెబ్బతింటే తప్ప సమయం ముగిసే వరకు నిర్వహించాలి. ఇలా దెబ్బతిన్న పసిపిల్లల దంతాలకు ఎలా చికిత్స చేయాలో పూరకాలతో చేయవచ్చు. తీవ్రమైన దంత పరిస్థితులలో, మీ దంతవైద్యుడు రూట్ కెనాల్ చికిత్సను సూచించవచ్చు. బ్రౌన్డ్ దంతాల రూపాన్ని కప్పిపుచ్చడానికి, రూట్ కెనాల్ చికిత్స తర్వాత డాక్టర్ జాకెట్ కిరీటం లేదా దంత కిరీటంని ఇన్స్టాల్ చేయడం ద్వారా దంతాలను కవర్ చేయవచ్చు. 2. తరచుగా బొటనవేలు పీల్చడం బొటనవేలు చప్పరించే అలవాటు వల్ల పిల్లల దంతాలు పాడవుతాయి.చిన్న పిల్లలకు బొటనవేలు చప్పరించే అలవాటు ఉండటం విచిత్రం కాదు. అయితే, ఈ అలవాటును పసిబిడ్డలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో కూడా నిరంతరం కొనసాగిస్తే, ఇది పిల్లల దంతాలు విరిగిపోయేలా చేస్తుంది. తరచుగా వేలు పీల్చడం వల్ల మీ పిల్లల దంతాలు వాటి కంటే మరింత ముందుకు కదిలే ప్రమాదం ఉంది. శిశువు దంతాలు అభివృద్ధి చెందితే, పిల్లల శాశ్వత దంతాల అమరిక విడిపోయే ప్రమాదం ఉంది. దాన్ని ఎలా పరిష్కరించాలి: పిల్లల బొటనవేలు చప్పరించే అలవాటును తొలగించడానికి, తల్లిదండ్రులు ఇవ్వాలని సలహా ఇస్తారు బహుమతులు లేదా చేయండి అనుకూలమైన బలగం. పిల్లవాడు తన బొటనవేలును పీల్చుకోకుండా తనను తాను నియంత్రించుకోగలిగినప్పుడు, మీరు బహుమతి లేదా అభినందనను అందించవచ్చని దీని అర్థం. నగ్గింగ్ మరియు దృఢ నిశ్చయం ఈ అలవాటును విచ్ఛిన్నం చేయడానికి తక్కువ ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే, బొటనవేలు చప్పరించడం అనేది సాధారణంగా పిల్లలు ఒత్తిడి, భయం మరియు ఇతర ప్రతికూల భావోద్వేగాల నుండి తమను తాము రక్షించుకునే మార్గంలో భాగం. మీరు దీని గురించి దంతవైద్యుడిని కూడా సంప్రదించవచ్చు. పిల్లలు ఈ అలవాటును ఆపడానికి వైద్యులు నోటి కుహరంలో ఉంచిన పరికరాన్ని తయారు చేయవచ్చు. ఇంతలో, ఈ అలవాటు కారణంగా దంతాల గజిబిజి అమరికను అధిగమించడానికి, పిల్లలు వారి యుక్తవయస్సులో ప్రవేశించడం ద్వారా జంట కలుపులను ఉపయోగించడం ప్రారంభించవచ్చు. ఇది కూడా చదవండి: ఇంట్లో పిల్లల పంటిని సరైన మరియు సురక్షితమైన మార్గంలో ఎలా తొలగించాలి 3. పళ్ళు సరిగ్గా మరియు సరిగ్గా బ్రష్ చేయకపోవడం పళ్ళు తోముకోవడంలో శ్రద్ధ చూపకపోవడం వల్ల పిల్లల దంతాలు పాడవుతాయి, పిల్లల దంతాలను ఎలా సంరక్షించుకోవాలి, వాటిలో ఒకటి పళ్ళు తోముకోవడం. పిల్లలకు పళ్లు పెరగడానికి ముందు నుండే చిన్నప్పటి నుంచి పళ్లను సరిగ్గా, సరిగ్గా తోముకోవడం అలవాటు చేసుకోవాలి. శిశువుగా, తల్లిదండ్రులు తమ పిల్లల చిగుళ్ళను మరియు నాలుకను ప్రస్తుతం మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రత్యేక గుడ్డతో శుభ్రం చేయాలి. అంటుకునే మిగిలిన పాలు, బ్యాక్టీరియాకు ఆహార క్షేత్రం కావచ్చు కాబట్టి ఇది చేయవలసి ఉంటుంది. అప్పుడు, దంతాలు పెరగడం ప్రారంభించిన తర్వాత, తల్లిదండ్రులు వెంటనే వాటిని టూత్ బ్రషింగ్ కార్యకలాపాలకు పరిచయం చేయాలి. పిల్లల దంతాలు దెబ్బతిన్నాయి మరియు వారు ఎప్పుడూ లేదా అరుదుగా పళ్ళు తోముకుంటే కావిటీస్ ఏర్పడతాయి. అదనంగా, నోటి దుర్వాసన మరియు చిగురువాపు దాడి చేయడం సులభం. దాన్ని ఎలా పరిష్కరించాలి: పిల్లలకు పసితనం నుండే పళ్లు తోముకోవడం అలవాటు చేయాలి. ఇది మీ పసిపిల్లల దెబ్బతిన్న దంతాలను జాగ్రత్తగా చూసుకోవడానికి కూడా ఒక మార్గం. పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌ని ఉపయోగించండి. పళ్ళు తోముకునేటప్పుడు, చిన్న మొత్తంలో టూత్‌పేస్ట్ (1 బియ్యం గింజ) ఉపయోగించండి మరియు శిశువు వయస్సు మరియు దంతాల సంఖ్యకు తగిన బ్రష్‌ను ఎంచుకోండి. 2 సంవత్సరాల వయస్సులో, పిల్లలకు లాలాజలం మరియు పళ్ళు తోముకున్న తర్వాత టూత్‌పేస్ట్ యొక్క అవశేషాలను నేర్పడం ప్రారంభించండి. ఆపై 3 సంవత్సరాల వయస్సు నుండి, అతను తన దంతాలను బ్రష్ చేయడానికి ఒకేసారి బఠానీ పరిమాణంలో ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించగలిగాడు. 4. పళ్లు ముందుగానే రాలిపోవడం అకాలంగా రాలిపోయే దంతాలు పిల్లల దంతాల అమరికకు హాని కలిగిస్తాయి.బిడ్డ దంతాల నష్టం సాధారణంగా వయస్సు-తగిన చక్రాన్ని అనుసరిస్తుంది. ఉదాహరణకు, దిగువ కోతలు వలె, సాధారణంగా పిల్లవాడు 6-7 సంవత్సరాల వయస్సులో ప్రవేశించిన తర్వాత బయటకు వస్తాయి. ఆ తరువాత, శాశ్వత దంతాలు ప్రత్యామ్నాయంగా ఉద్భవించటం ప్రారంభమవుతుంది. పిల్లవాడికి 3 లేదా 4 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి దిగువ కోతలు బయట పడినట్లయితే, ఇది సమస్య కావచ్చు. ఎందుకంటే, పాల దంతాల విధుల్లో ఒకటి శాశ్వత దంతాల పెరుగుదలకు "స్పేస్ కీపర్". వైద్యపరంగా, ఈ పరిస్థితిని సూచిస్తారు అకాల నష్టం. ఖాళీని నిర్వహించకపోతే, దంతాల ద్వారా ఖాళీగా ఉన్న చిగుళ్ళు పక్కన ఉన్న పళ్ళతో నిండిపోతాయి. ఫలితంగా, శాశ్వత దంతాలు పెరగడానికి తగినంత స్థలం లేదు, మరియు దంతాల అమరిక గజిబిజిగా మారుతుంది. చెడ్డ లేదా చిందరవందరగా ఉన్న దంతాలు కలిగి ఉండటం వలన, పిల్లలు కావిటీస్ మరియు చిగుళ్ళ సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, దెబ్బతిన్న పసిపిల్లల దంతాలను ఎలా చూసుకోవాలో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. దాన్ని ఎలా పరిష్కరించాలి: అకాలంగా పడిపోయిన దంతాల ద్వారా మిగిలిపోయిన స్థలాన్ని నిర్వహించడానికి, దంతవైద్యుడు ఒక సాధనాన్ని తయారు చేస్తాడు. స్పేస్ మెయింటెయినర్. అవి తొలగించగల జంట కలుపులను పోలి ఉంటాయి మరియు శాశ్వత దంతాలు పెరగడం ప్రారంభించే వరకు వాటిని ఉంచాలి. 5. శిశువు దంతాలు ఉండాల్సిన దానికంటే ఎక్కువ కాలం ఉండనివ్వండి దంతాల నిలకడ కారణంగా శిశువు దంతాల వెనుక శాశ్వత దంతాలు పెరుగుతాయి, పరిస్థితికి విరుద్ధంగా ఉంటుంది అకాల నష్టం పాల దంతాల నిలకడ. దంతాలు రాలిపోయే సమయం వచ్చినప్పుడు పట్టుదల అనేది ఒక పరిస్థితి, కానీ అది దానంతట అదే రాదు. పట్టుదల యొక్క అనేక సందర్భాల్లో, పాల పళ్ళు చాలా ఆలస్యంగా వస్తాయి, శాశ్వత దంతాల పెరుగుదలకు ముందు ఉంటుంది. ఉదాహరణకి: దిగువ కోతలు 6-7 సంవత్సరాల మధ్య వస్తాయి. అప్పుడు, పిల్లలకి 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నప్పుడు, తక్కువ పాల పళ్ళు ఇంకా బయటకు రాలేదు. అయినప్పటికీ, ఈ వయస్సులో, శాశ్వత దంతాలు పెరగడానికి ఇది సమయం, కాబట్టి అవి పెరుగుతూనే ఉంటాయి, కానీ మనుగడలో ఉన్న పాల దంతాల వెనుక లేదా ముందు పేరుకుపోతాయి. అందువలన, శాశ్వత దంతాల అమరిక గజిబిజిగా ఉంటుంది. దాన్ని ఎలా పరిష్కరించాలి: పెర్సిస్టెంట్ పళ్లను వెంటనే తీయాలి, తద్వారా పెరిగే శాశ్వత దంతాలు అవసరమైన స్థలాన్ని పొందగలవు. అవసరమైతే, శాశ్వత దంతాలు పూర్తిగా విస్ఫోటనం చెందడానికి ముందు వెంటనే నిరంతర దంతాలను తీయవచ్చు. ఇది కూడా చదవండి: వయస్సు ప్రకారం శిశువు యొక్క శిశువు దంతాల పెరుగుదల క్రమం 6. శారీరక గాయం ప్రభావం వంటి శారీరక గాయం పిల్లల దంతాలను కూడా దెబ్బతీస్తుంది. కొన్ని సందర్భాల్లో, పిల్లల దంతాల ప్రభావం విచ్ఛిన్నం మరియు పగుళ్లు మాత్రమే కాదు, భవిష్యత్తులో శాశ్వత దంతాల పెరుగుదలకు కూడా ఆటంకం కలిగిస్తుంది. దాన్ని ఎలా పరిష్కరించాలి: ప్రభావం కారణంగా పిల్లల దంతాలు విరిగిపోయినా లేదా పగులగొట్టబడినా, వైద్యుడు పూరకం చేయవచ్చు. ఇంతలో, మిగిలి ఉన్నదంతా పంటి యొక్క మూలంగా ఉంటే మరియు దంతాలు పడిపోవడానికి ఇంకా సమయం కానట్లయితే, అప్పుడు పిల్లవాడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, దాని తర్వాత జాకెట్ కిరీటం అమర్చవచ్చు. [[సంబంధిత కథనం]] పిల్లలలో దంత క్షయాన్ని ఎలా నివారించాలి మీ పిల్లల దంతాలు కుళ్ళిపోకుండా నిరోధించడానికి మీరు క్రింది దశలను అనుసరించవచ్చు. ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ మరియు మృదువైన బ్రిస్టల్ టూత్ బ్రష్‌ని ఉపయోగించి అల్పాహారం తర్వాత మరియు పడుకునే ముందు రోజుకు రెండుసార్లు మీ పిల్లల పళ్ళను బ్రష్ చేయండి. పిల్లలు చాలా తీపి మరియు అంటుకునే ఆహారాన్ని తినకుండా నిరోధించండి. కనీసం ప్రతి ఆరు నెలలకోసారి దంతవైద్యుని సందర్శించండి. అవసరమైతే, కావిటీస్ నివారించడానికి పిల్లల దంతాలకు ఫ్లోరైడ్ను పూయడం ద్వారా డాక్టర్ అదనపు చికిత్సను అందించవచ్చు. ప్రస్తుతం, వారి పిల్లలలో ఫ్లోరైడ్ వాడకం గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఉండవచ్చు, ఎందుకంటే అది అధికంగా ఉంటుందని వారు భావిస్తారు. అయినప్పటికీ, టూత్‌పేస్ట్‌లోని ఫ్లోరైడ్, ఇప్పటివరకు ఉపయోగించడం సురక్షితం మరియు ఫ్లోరోసిస్‌ను ప్రేరేపించదు (టూత్ ఎనామెల్‌లో మార్పులు). పిల్లలు మరియు పెద్దలలో కావిటీలను నివారించడానికి ఫ్లోరైడ్ చాలా ముఖ్యం. పిల్లల దంతాలు దెబ్బతిన్నాయి మరియు కావిటీస్ ఉంటే, చిగుళ్ళు వాపు నుండి దుర్వాసన వంటి అనేక ఇతర రుగ్మతలు కూడా అతనికి సులభంగా చేరుకుంటాయి. దెబ్బతిన్న పిల్లల పంటిని ఎలా చూసుకోవాలో మరింత చర్చ కోసం, నేరుగా వైద్యుడిని అడగండి SehatQ కుటుంబ ఆరోగ్య యాప్‌లో. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లే.
'''సిరిసిల్ల (గ్రా)''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[రాజన్న సిరిసిల్ల జిల్లా|రాజన్న సిరిసిల్ల జిల్లాకు,]] చెందిన మండలం.<ref name="”మూలం”">http://sircilla.telangana.gov.in/wp-content/uploads/2016/10/228.Rajanna-228.pdf</ref> ఇది మండల కేంద్రమైన సిరిసిల్ల నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. సిరిసిల్ల [[హైదరాబాద్]] నుండి 140 కి.మీ దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 155 ఇళ్లతో, 657 జనాభాతో 2536 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 331, ఆడవారి సంఖ్య 326. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 572450<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 505301. == విద్యా సౌకర్యాలు == గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి [[సిరిసిల్ల|సిరిసిల్లలో]] ఉంది. సమీప బాలబడి [[సిరిసిల్ల|సిరిసిల్లలో]] ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల సిరిసిల్లలోను, ఇంజనీరింగ్ కళాశాల కరీంనగర్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కరీంనగర్లోను, పాలీటెక్నిక్ [[సిరిసిల్ల|సిరిసిల్లలోనూ]] ఉన్నాయి.
Telugu Online News > Entertainment > Upcoming Movies: ఈవారం ప్రేక్షకుల ముందు సందడి చేయనున్న సినిమాలు ఇవే! EntertainmentFeaturedNewsTrending Upcoming Movies: ఈవారం ప్రేక్షకుల ముందు సందడి చేయనున్న సినిమాలు ఇవే! Last updated: 2022/11/14 at 2:50 PM Akashavani Published November 14, 2022 Upcoming Movies: సినీ ప్రియులు ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలు విడుదలవుతాయా అని బాగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి సినిమా అంటే పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రం ప్రతివారం వచ్చే సినిమాలను చూడటానికి ఎగబడుతుంటారు. ఇప్పుడు అటువంటి ప్రేక్షకులకే ఈవారం వచ్చే సినిమాలు లిస్ట్ ఇప్పుడు చూద్దాం. కేవలం థియేటర్లోనే కాకుండా ఓటీటీ లో వచ్చే సినిమాల గురించి కూడా తెలుసుకుందాం. దర్శకుడు సాయికిరణ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా మసూద. ఇక ఈ సినిమాలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ నటించగా ఈ సినిమా 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రాజశేఖర్ రెడ్డి పులి చర్ల దర్శకత్వంలో రూపొందిన సినిమా గాలోడు. ఇక సుడిగాలి సుధీర్ నటించిన ఈ సినిమాకు ఆయన అభిమానులు బాగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరో సినిమా అలిపిరికి అల్లంత దూరంలో. ఈ సినిమాకు ఆనంద్. జె దర్శకత్వం వహించగా ఈ సినిమా కూడా 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీతారామపురం లో ఒక ప్రేమజంట అనే మరో సినిమా కూడా 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ దృశ్యం 2 సినిమా కూడా 18న విడుదల కానుంది. ఓటీటీలో రానున్న మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. రాజ్ తరుణ్ నటించిన అహనా పెళ్ళంట జి ఫైవ్ లో 17న స్ట్రీమింగ్ కానుంది. కార్తి నటించిన సర్దార్ ఆహాలో 18న రానుంది. గాడ్ ఫాదర్ నెట్ ఫ్లిక్స్ లో 19 న స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 16న నెట్ఫ్లిక్స్ లో ది వండర్, 1899 అనే మూవీ, రిటర్న్ టు క్రిస్మస్ క్రీక్ నవంబర్ 17న రానుంది. Upcoming Movies: నవంబర్ 18న ఇలైట్, స్లంబర్ ల్యాండ్ స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో.. నవంబర్ 16 హాస్టల్ డేస్ సీజన్ 3, నవంబర్ 18న ది సెక్స్ లైఫ్ ఆఫ్ కాలేజ్ గర్ల్స్ అనే సీరిస్ లు రానున్నాయి. డిస్నీ హాట్ స్టార్ లో ఇరవతం నవంబర్ 17న, సీతారామన్ నవంబర్ 18న రానుంది. సోనీ లివ్ లో అనల్ మీలే పని తులి నవంబర్ 18న, వండర్ ఉమెన్ నవంబర్ 18న రానుంది.
దేశంలో కరోనా, ఒమిక్రాన్‌ కేసులు వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిష్టితి కలవరం కలిగిస్తున్నది. అక్కడ ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరపడంతో 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్యెల్యేలు కరోనాకు గురయ్యారని ఉపముఖ్యమంత్రి అజిత్ పవర్ తెలిపారు. దానితో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 6 తర్వాత దేశంలో మొదటిసారి కరోనా ఆక్టివ్ కేసుల సంఖ్య లక్షకు దాటింది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కోవిడ్‌ కేసుల సంఖ్య ఏకంగా 22 వేలు దాటాయి. 400కు పైగా మరణాలు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ కేసులు కూడా 1400 దాటాయి. కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించిన వివరాల మేరకు… దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య 1431 కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 200 కేసులు పెరగడం గమనార్హం. ఇప్పటివరకు మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్‌ విస్తరించింది. మరోవైపు ఇప్పటివరకు 488 మంది కొత్త వేరియంట్‌ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 454 మందికి కొత్త వేరియంట్‌ సోకింది. ఢిల్లీలో 351 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడు, గుజరాత్‌, కేరళలోనూ కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య 100 దాటడం ఆందోళనకరం. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో దేశంలో కోవిడ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11.10 లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 22,775 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు కూడా 2 శాతం దాటడం గమనార్హం. ఇదే సమయంలో 8949 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.42 కోట్ల మంది వైరస్‌ను జయించారు. నిన్న ఒక్క రోజే 406 మంది కోవిడ్‌తో మృతి చెందారు. ఇప్పటివరకు 4.81 లక్షల మందిని వైరస్‌ బలితీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,04,781 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.30 శాతానికి పెరిగింది. మరోవంక, కరోనా నివారణకుగాను భారత ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా సాగుతోంది. శుక్రవారం 58.11 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 1.45 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 15-18 ఏళ్ల వారికి టీకా రిజిస్ట్రేషన్లు నేడు ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి కొవిన్‌ యాప్‌లో వీరంతా పేరు నమోదు చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ”పిల్లలు సురక్షితంగా ఉంటేనే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. అర్హులైన పిల్లలందరికీ టీకాలు వేయించండి” అని మంత్రి కోరారు.
Telugu News » Latest news » Men climb boundary wall of school in maharashtra pass chits to students during exam స్కూల్ గోడ దూకి మరీ చిట్టీలు.. ఇవేనా ప్రతిభకు సూచికలు! విద్యార్థుల భవిష్యత్‌కు 10వ తరగతి పరీక్షలు ఎంతో ప్రధానమైనవి. చాలామంది రేపటి గురించి కోటి ఆశలతో ఈ ఎగ్జామ్స్‌ కోసం సన్నద్దం అవుతూ ఉంటారు. అలాంటి పరీక్షలలో స్వశక్తితో ఎగ్జామ్స్ రాయాల్సిన అభ్యర్థులకు.. కొంతమంది స్కూల్ ప్రహరీగోడ దూకి మరీ చిట్టీలు అందించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర.. యావత్మాల్​ జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల వద్ద ఈ దృశ్యాలు కనిపించడంతో కొంతమంది మొబైల్‌లో చిత్రీకరించారు. ఇప్పుడు అవి కాస్తా వైరల్‌గా మారాయి. దీనిపై పరీక్షా కేంద్రం నియంత్రణ […] Ram Naramaneni | Edited By: Mar 05, 2020 | 7:38 PM విద్యార్థుల భవిష్యత్‌కు 10వ తరగతి పరీక్షలు ఎంతో ప్రధానమైనవి. చాలామంది రేపటి గురించి కోటి ఆశలతో ఈ ఎగ్జామ్స్‌ కోసం సన్నద్దం అవుతూ ఉంటారు. అలాంటి పరీక్షలలో స్వశక్తితో ఎగ్జామ్స్ రాయాల్సిన అభ్యర్థులకు.. కొంతమంది స్కూల్ ప్రహరీగోడ దూకి మరీ చిట్టీలు అందించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర.. యావత్మాల్​ జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల వద్ద ఈ దృశ్యాలు కనిపించడంతో కొంతమంది మొబైల్‌లో చిత్రీకరించారు. ఇప్పుడు అవి కాస్తా వైరల్‌గా మారాయి. దీనిపై పరీక్షా కేంద్రం నియంత్రణ అధికారి ఏఎస్​ చౌదరి స్పందించారు. పాఠశాల ప్రహారీ గోడ సక్రమంగా లేకపోవడంతో, ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. దీనిపై పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చామని, ఇంకోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, పరీక్షలు సంక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. #WATCH Maharashtra: People seen climbing the boundary walls and providing chits to students, writing their class X Matriculation examination at Zila Parishad School, Mahagaon in Yavatmal district. (03.03.2020) pic.twitter.com/IqwC4tdhLQ
డబ్బలు కోసం తల్లిదండ్రులను వేధిస్తూ.. తల్లితో అనుచితంగా ప్రవర్తించిన కొడుకును అంతమొందించాలనుకున్నారు తల్లిదండ్రులు. అందుకోసం సుపారీ ఇచ్చి హత్య చేయించారు. SumaBala Bukka First Published Nov 1, 2022, 7:23 AM IST సూర్యాపేట : కుమారుడి వికృత చేష్టలకు విసిగిపోయిన తల్లిదండ్రులు.. ఇలాంటి కొడుకు ఉన్నా లేకున్నా ఒకటే అని భావించారు. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యంపహాడ్ వద్ద అక్టోబర్ 19న మూసీనదిలో గుర్తుతెలియని శవం లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో విస్తుగొలిపే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హుజూర్నగర్ సిఐ రామలింగారెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు. ఖమ్మంకు చెందిన క్షత్రియ రాంసింగ్, రాణిబాయి దంపతులకు కుమారుడు సాయినాథ్(26), కుమార్తె సంతానం. రామ్ సింగ్ సత్తుపల్లిలో రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసిన సాయినాథ్ వ్యసనాలకు బానిస అయ్యాడు. నాలుగేళ్లుగా డబ్బుల కోసం తల్లిదండ్రులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అంతటితో ఆగక ఇటీవల తన తల్లిపట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఇది తల్లిదండ్రులకు మింగుడు పడలేదు. తమ కొడుకు కొరకరాని కొయ్యగా మారాడాని.. సమాజానికి భారం అయ్యాడని భావించారు. దీంతో కొడుకుని అంతమొందించాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నివాసం ఉంటున్న రాణిబాయి తమ్ముడు సత్యనారాయణ సింగ్ కు ఈ విషయం చెప్పారు. దీంతో సింగ్ తనకు తెలిసిన మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాకు చెందిన ఆటోడ్రైవర్ రామావత్ రవిని ఆశ్రయించాడు. అదే తండాకు చెందిన పనుగోతు నాగరాజు, బూరుగు రాంబాబు, త్రిపురారం మండలం రాజేంద్రనగర్ కు చెందిన ధనావత్ సాయితో రూ.8 లక్షలకు హత్య చేసేందుకు రవి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అక్టోబర్ 18న సత్యనారాయణసింగ్, రవి కలిసి నల్గొండ జిల్లా కల్లేపల్లి లోని మైసమ్మ దగ్గర దావత్ చేసుకుందామని సాయినాథ్ ని తీసుకువెళ్లారు. అందరూ కలిసి మద్యం తాగి, సాయినాథ్ మెడకు ఉరి బిగించి చంపేశారు. ఆ తరువాత సాయినాథ్ కారులోనే శవాన్ని తీసుకు వెళ్లి మూసీ నదిలో పడేశారు. మరుసటి రోజు శవం నదిలో తేలడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మీడియా ద్వారా విషయం తెలిసింది అంటూ మూడు రోజులకు తల్లిదండ్రులు వచ్చి శవాన్ని తీసుకు వెళ్లారు. సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించిన పోలీసులు హత్య జరిగిన రోజు శూన్యం పహాడ్ వద్ద కనిపించిన కారు.. మృతుడి తల్లిదండ్రులు తీసుకువచ్చిన కారు ఒకటేనని నిర్ధారించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కొడుకును తామే చంపించినట్లు ఒప్పుకున్నారు. తల్లిదండ్రులు, మేనమామతో పాటు హత్యకు సహకరించిన నలుగురిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు.
నేను ఒకరోజు ఏదో పని మీద సంగారెడ్డి నుండి మెదక్‌ పోవాల్సి ఉండే. నేను ఎదురు చూసిన కొద్దీ సేపటికే పల్లెవెలుగు బస్సు రానే వచ్చింది. ఆ బస్సు అప్పటికే పఠాన్‌.చేరు నుండి వొస్తుంది. చానా మంది ఉన్నారు దాంట్ల బస్సుల ఎక్కంగానే ముందుకు చూసిన డ్రైవర్‌ పక్కన అంటే బస్సు అద్దాల పైన దిక్కు కాలిగా ఉన్న ప్లేస్‌ల ''డ్రైవర్‌ అన్న జెర భద్రం'' అని రాసి ఉంది. నేను కూడా మనసుల ''జెర భద్రమే అన్నా'' అని.. అనుకున్నా అలా పైకి ఎక్కిన పాపం కండక్టర్‌ కష్టం ఇగ జూడ తరం గాదు. ''లోపలకి పోండి.. గంతగనం జాగా ఉండగా గీడనే ఎందుకు పానసరం పడతారు'' అని అందరిని లోపలకి నూకుతానే ఉన్నాడు. అయిన ఎవ్వడు కదులతలే. ఎవ్వరిని జెరుగు అన్న ''నేను గీడనే దిగుతా'' ''గాడనే దిగుతా'' అని చెప్తున్నారు. నేను అప్పుడు ''ఏడ దిగుతేనేమి బస్సు అంతటా ఆపుతాడు గదా లోపలకి పోనికే ఏం రోగం'' అని అనుకున్నా.. ఇగ వీళ్ళు ఇనరు అని వాళ్ళని అందరిని పక్కకు నూకి నేను చివరకి పోయి నిలబడ్డ. ఇగ కండక్టర్‌ గూడా ఆయనకి అయినకాడికి అందరిని లోపలకి నూకిండు. బస్సు కదిలింది దాంట్ల ఇంకా చీమకి గూడ జోర్రనికే జాగా లేదు అయినా గూడ అప్పటి దాకా లేని పొరగాళ్ళు ఉరికి ఒచ్చి ఎక్కింరు బస్సు కదలంగానే. యాడికెళ్లి ఒచ్చిన్రు గింత మంది అనుకున్నా నేను.. అంతే ఇంకా కండక్టర్‌ ఆ పొరగాళ్లని తిడతానే ఉన్నాడు. ''ఫుట్‌ బోర్డ్‌ జెయ్యకుండి కింద పడితే నా మీదకి ఒస్తది'' అని అయినా ఆ పొరగాళ్ళు ఇనలే. ఇంతలో పక్కన సీటులో ముగ్గురు కూసునే దగ్గర ఇంకో అతను వచ్చి జెర జెరుగుండి అని. వాళ్ళు నలుగురు పట్టరు అంటున్న వినకుండా సగం బయటకి సగం లోపలకి కుసున్నడు. ఇంతలో కండక్టర్‌ అతి కష్టం మీద అందరిని నూకి నూకి . ''టిక్కెట్‌.. టిక్కెట్‌.. చెప్పాలమ్మ ఏడికి పోవాలే'' ''జల్దీ చెప్పుండి'' అనుకుంటూ టిక్కెట్టు తీసుకుంటున్నాడు. బస్‌ పాస్‌ ఉన్నోళ్లని పాస్‌ చూయించమని అడుగుతూ ఇంచుమించు అందరి పాస్‌ లు చూస్తూ వస్తున్నాడు. అక్కడ ఒక గమ్మత్తు అయింది ఒక ముసలవ్వ వాళ్ళ మనవడితో కలిసి ఉంది. ''టిక్కెట్‌ టిక్కెట్‌'' అని కండక్టర్‌ అనగానే ''ఒకటి జోగిపేట'' అని దస్తిల ఉన్న పైసలు తీసి ఇచ్చింది. కండక్టర్‌ ''గీ పిల్లగాడు ఎవరూ'' అని అడిగాడు. ''నా మనుమడు'' అన్నది ఆ ముసలవ్వ కొద్దిగా ఆలోచిస్తూనే. మరి ''ఈ పిల్లగాడికి టిక్కెట్టు తీసుకోవా'' అని అన్నాడు. ''చిన్న పొరగాడు ఇంకా నాలుగు ఏళ్ళు గూడ నిండలే'' అన్నది. ''పిల్లగాడు జూస్తే ఏడూ ఎనిమిది ఏళ్ళు ఉన్నట్టు ఉన్నాడు ఇంకా నాలుగు ఏళ్ళు లేవు అంటావ్‌ ఏం అమ్మ హాఫ్‌ టికెట్‌ తీసుకో'' అన్నాడు. ''గంత ఏం ఉండడు నా మనువడు'' అన్నది ముసలవ్వ. ''ఎన్నో క్లాసు ఈ పిల్లగాడు'' అని అడిగాడు వయస్సు తెలుసుకుందాం అని కండక్టర్‌. ''ఆ ముసలవ్వ ఇంకా స్కూల్‌ల వెయ్యలే'' అని టక్కున చెప్పింది. ఇంతలో పక్క నుంచి ''నాయనమ్మ నేను స్కూల్‌ పోతున్న గదనే మూడో క్లాసు నేను'' అని అన్నాడు ఆ పోరడు పక్కనుంచి. ''అయిపాయే'' పాపం ఆ ముసలవ్వ చేసిన యాక్టింగ్‌ అంత వేస్ట్‌ చేసిండు గీ పోరడు అనుకున్న నేను నవ్వుకుంటూ. ఇగ ఆ ముసలవ్వకి టిక్కెట్టు తీసుకోక తప్పింది కాదు. వీళ్ళ లొల్లి చూస్తూ ఉన్న ఇంతట్ల వెనక సీటులో ఉన్న ఒకతను దిగాడు నేను కుసున్న. కుసున్న కాడి నుండి... పక్కన ఉన్న ఒకతను నా మీద ఒరిగి పంటున్నాడు. అతని నిద్ర చెడిపోకుండా చాలా సార్లు అతని నెత్తి అట్లా పక్కకు జేరిపినా అయిన మళ్ళా రెండు నిమిషాల్లో నా మీద పడుతున్నాడు. ఇట్లా బానే సార్లు జేసిన ఏం లాభం లేకపోయింది. ఛీ! ఛీ! అని అనుకోని ఉండగానే. ముందల కూర్చున్న ఒకతను సీటులో కూర్చొని ఫోన్‌ పట్టుకొని ఏదో టెన్షన్‌లో ఉన్నాడు.. ఏమో ఏదైనా అర్జంట్‌ పని ఉందొ లేకపోతే పెళ్ళాం ఫోన్‌ చేసి ఇంటికి తొందరగా రాకపోతే కూడు పెట్టా అన్నదేమో అని అనుకుంటూ ఉన్నాను. ఇంతలో నా ముంగట సీటులకెళ్ళి గట్టిగా ఒకతను అరిచాడు ఎందుకా అని చూస్తే.. అది అరుపు కాదు. అతనెవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. చిన్నగా నవ్వుకుని ఈయనకి ఫోన్‌ ఎందుకు బస్సు ఎక్కి మాట్లాడితే నేరుగా ఏ ఊరు అయిన ఈయన వాయిస్‌కి ఇనవడతది కదా అని అనుకున్న. ఇంతలో ఒక అమ్మాయి బస్సు ఎక్కింది. అక్కడ అప్పటికే బస్సులో చాలా మంది ఆడోళ్ళు ఉన్నారు. పాపం అప్పటికే బస్సు అంత నిండుగా ఉండటం చేత.. ఎవ్వరికీ కూసోనికే జాగా గూడ లేదు. అయిన అక్కడ కొంతమంది మొగోళ్ళు స్త్రీలకి కేటాయించిన సీటులో కూర్చున్నారు. అక్కడ స్త్రీలు నిలబడి ఉన్న వాళ్ళకి సీటు ఇవ్వట్లే.. వీళ్ళకి అస్సలు బుద్ధి లేదు అనుకోని.. నేను ఇద్దాం కూర్చోండి అందాం అంటే.. నేను చివరలో ఉన్న అంత దూరం ఆడవాళ్ళు అందరిని నూకి రాలేరు అని ఉరుకున్నా.. ఆ అమ్మాయి కూడా ఎవరిని ఏం అనకుండా. ఫోన్‌లో పాటలు వింటూ నిలబడే ఉంది. అలా ద ష్టి కొద్దిగా ముందుకు వాల్చ. అక్కడ ప్రేమ జంట అనుకుంటా.. లోకాన్ని మరిచి చూపులతో ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు. అసలు వాళ్ళకి ఈ బస్సులో అయ్యే ఏ ఒక్క విషయం తెలియదు. నా నమ్మకం ఏంటి అంటే అసలు వాళ్ళు బస్సులో ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలిసినట్టు లేదు. అంత మంది ఉన్నప్పటికి వాళ్ళ చూపు మాత్రం పక్కకి పోతలేదు. అలా చూసుకుంటూనే ఉన్నారు. ఎంత గాఢమైనదో మరి వాళ్ళ ప్రేమ. ఇట్లా ఉండగానే వాడేవడో బాంబు పేలినట్టు చైనా ఫోన్‌లో సౌండు పెట్టాడు. గుండె జల్లుమన్నది. వాడేమి చూస్తున్నాడో అని చూస్తే ఏదో కామెడి షో అంత మందిలో కూడా ఎంతో ధైర్యంగా అంత పెద్ద సౌండ్‌తో చూస్తున్నాడు. నాకు అయితే దాంట్లో ఒక్క జోక్‌కి కూడా నవ్వు రాలేదు కానీ వాడు మాత్రం పగలబడి నవ్వుతున్నాడు. ఏందో ఏమో అనుకుంటూ.. కొద్దిగా ముంగటికి చూసిన అక్కడ కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు అనుకుంటా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కుసున్నారు. ఇది బస్సు అనుకుంటున్నారో వాళ్ళ ఇల్లు అనుకుంటున్నారో వాళ్ళ రొమాన్స్‌ చూడలేక చస్తున్నారు అందరూ. అయిన వాళ్ళకి మాత్రం ఎటువంటి పట్టింపు లేదు. ఇలా చూస్తూ ఉన్న ఇంతలో ''రంగంపేట'' వచ్చింది బస్సు ఆగింది. దిగాల్సినోళ్లు దిగిన్రు. ఎక్కేటోళ్లు ఎక్కింరు దాంట్లో ఒక ప్రెగెంట్‌ ఆవిడ బస్సు ఎక్కింది. బస్సు మాత్రం కాళీ లేదు. ఆమె ఎక్కిన తరువాత కూడా అక్కడ స్త్రీల సీటులో కుసున్న వాళ్ళు ఎవ్వరూ లేవలేదు. నాకు అయితే చాలా కోపం వచ్చింది. కానీ ఏం చేయాలి ఏం చేయలేక పోయినా నేను మాత్రం చెప్తే వాళ్ళు వింటారా ఇంతకు ముందు ఒక అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి చెవిలోంచి ఇయర్‌ ఫోన్స్‌ తీసి చాలా కోపంగా ఉంది. ఇంతలో దారిలో భారీ మలుపు వచ్చింది. ఒక్కసారిగా గట్టిగా ''స్త్రీలకు కేటాయించిన సీట్లలో వాళ్లనే కూర్చొనిద్దాం'' అని చాలా గట్టిగా అరిచింది ఆ అమ్మాయి. బస్సు సడెన్‌గా ఆగింది. అందరూ అమ్మాయినే చూస్తున్నారు. కండక్టర్‌ ఆ అమ్మాయిని ''ఏం అయింది అమ్మా'' అని అడిగాడు. ''నాకు ఏం అయింది అక్కడ రాసి ఉన్నది చదివాను'' అన్నది ఎంతో స్పష్టంగా. ''అది అందరికీ తెలుసు కదా అన్నాడు'' కండక్టర్‌. ''ఇక్కడ ఉన్న వాళ్లకు చదువు వచ్చో రాదో అని చదివాను''. అన్నది ఆ అమ్మాయి మళ్ళీ సీటులో కూర్చున్న వాళ్ళని చూస్తూ. డ్రైవర్‌కి కండక్టర్‌ సైగ చేసాడు పోనిరు అని. డ్రైవర్‌ బస్‌ స్టార్ట్‌ చేసి మెల్లిగా తీసుకెళ్తున్నాడు. ''అదేంటి అమ్మాయి అలా అంటున్నావు'' అని అడిగాడు పక్కన ఉన్న ఒకతను. ''లేకపోతే ఏంది నేను ఎక్కినప్పుడు ఎవ్వడు లేవలేదు సరే నాకు ఏం అయింది మంచిగానే ఉన్న కదా అని నిలబడే ఉన్న.. ఆ తరువాత నాలాగా చాలా మంది ఎక్కింరు అయిన స్త్రీల సీటులకెల్లి ఎవ్వడు లేవలేదు. సరే అది పోనీ ఆ తరువాత ఒక ముసలవ్వ ఎక్కింది ఆమెకి కనీసం సీటు కూడా ఇయ్యలే. ఏం పౌరుషం దగ్గరనే మొగతనం చూపిస్తారా.. ఇలాంటి వాటి దగ్గర మొగోళ్ళ మొగతనం ఎక్కడ పోయింది. అది కూడా పోనీ.. ఇగో ఇప్పుడు ఈ అక్క నిండు గర్భంతో బస్సు ఎక్కింది. అయిన కూడా మీకు కనీసం జాలి కలగలేదు. అసలు బాధ్యత అనేది ఉంటే కదా''.. అని అందరి ముఖాలు చూసింది. దాంట్లో చాలా మంది నిస్సహాయంగా చూస్తున్నారు. ''స్త్రీలకు సమాన హక్కులు ఇచ్చినం అని అరవడం కాదు ముందు వాళ్ళకి కేటాయించిన సీటులో వాళ్ళని కూర్చునే విధంగా చూడండి'' అని అన్నది ఆ అమ్మాయి. బస్సు అంతా నిశ్శబ్దం ఎంత నిశ్శబ్దం అంటే బస్సులో తెరిచి ఉన్న కిటికీ నుంచి వచ్చే గాలి శబ్దం తప్ప ఇంకేం వినిపించట్లేదు. ఇంతలో ఒక చంటి పిల్ల ఏడుపు అందరూ మళ్ళీ మాములు అయ్యారు. నాకు ఎందుకో ఆ అమ్మాయిని చూడగానే చాలా ఆనందంగా అనిపించింది. ఇంఫాక్ట్‌ చాలా గర్వంగా కూడా అనిపించింది. అందరూ ఆ అమ్మాయిని చూస్తూనే ఉన్నారు. ఈ దెబ్బతో అక్కడ స్త్రీల సీటులో కూర్చున్న వాళ్ళు లేచి ఆ ప్రెగెంట్‌ ఆవిడకి ఆ ముసలవ్వకి అమ్మాయికి సీటు ఇచ్చి వాళ్ళు నిలబడ్డారు. నేను ఆ అమ్మాయి మాటలకు ముగ్దున్నయ్యి అప్రయత్నంగా చప్పట్లు కొట్టాను. నన్ను చూసి అందరూ చప్పట్లు కొట్టారు. ఆ అమ్మాయి నా వైపు తిరిగి ''ఈ పని మీరు ముందే చేసి ఉండొచ్చు కదా! అలా చేయరు ఎవరైనా చేస్తే నాటకం చూసినట్టు చూస్తారు'' అని అన్నది. నేను మాత్రం అవేమి పట్టించుకోకుండా. ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోయా. అప్పుడే మనసులో ''చెప్తే వినే లోకం ఎప్పుడే చేజారిపోయింది. ఇప్పుడు అంతా అనుభవిస్తేనే తెలుస్తుంది''. ఎవ్వరికి అయిన అనుకుని. లోపల నవ్వుకున్నా. ఇంకా అందరూ దిగే లాస్ట్‌ స్టాప్‌ మెదక్‌ వచ్చింది. అమ్మాయి దిగిపోయి వెళ్లే ముందు అక్కడ సీటులో కూర్చున్న ముసలవ్వ ఆ అమ్మాయికి చెంప పైన ముద్దు పెట్టి ఆ అమ్మాయిని ఆశీర్వదించి.. తన రెండు చేతులను ఆ అమ్మాయి తల చుట్టూ తిప్పి చేతులు విరిచి దిష్టి తీసింది. ఇది చూసి అందరూ ఆనందించారు. అందరితో పాటు నేను కూడా దిగి వెళ్ళిపోయాను. కొన్ని ఏళ్ళ తరువాత నా గ్రహాలు అనుకూలించి నా ప్రయత్నం ఫలించి ఆ అమ్మాయిని వెతికి పట్టుకొని పెళ్ళి చేసుకున్నాను. తనకి ఆ రోజు బస్సులో ఉన్నది నేనె అని తెలియదు. తను చాలా సార్లు అడిగింది నన్ను.. నేను అంటే ఎందుకు అంత ఇష్టం అని. కానీ నేను చెప్పలేదు. అప్పటికి ఏవేవో కారణాలు చెప్తూ ఉండేవాడిని. ఇప్పుడూ కూడా ఈ కథ తనతో కాకుండా అందరితో పంచుకుంటా.. ఏదో ఒకరోజు తనకి చెప్పి నా కూతురిని నీ లాగే పెంచూ అని గర్వంగా చెప్తాను. ఇలా మలుపులో ముడిపడింది మా బంధం. ఇలాంటివి ఎన్నెన్నో మలుపులు. ప్రతీ మలుపుకి ఓ కథ. నా మలుపు కథ ఇది.
దిగ్గ‌జ లెజెండ్రీ స్పిన్న‌ర్ షేన్‌వార్న్ మృతి నుంచి కోలుకోక ముందే క్రికెట్ ఆస్ట్రేలియాకు మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది. మ‌రో స్టార్ క్రికెట‌ర్ రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. క్విన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లే ప్రాంతంలో గత రాత్రి జ‌రిగిన కారు ప్ర‌మాదంలో సైమండ్స్ మృతి చెందాడు. నెల రోజుల వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రు లెజెండ్రీ క్రికెట‌ర్లు మృతి చెంద‌డం ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానుల‌కు తీర‌ని లోటు. సైమండ్స్ తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో కంగారు జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 1998లో జాతీయ జ‌ట్టులోకి వ‌చ్చిన సైమండ్స్ చాలా త‌క్కువ కాలంలోనే స్టార్ క్రికెట‌ర్‌గా ఎదిగాడు. ఆసీస్ గెలిచిన మూడు వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌ల్లో కూడా సైమండ్స్ స‌భ్యుడిగా ఉన్నాడు. 2012లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కి ముగింపు ప‌లికాడు. ఆసీస్ జ‌ట్టు త‌ర‌పున సైమండ్స్ 198 వ‌న్డేలు ఆడిన సైమండ్స్ 5,088 పరుగులు, 133 వికెట్లు పడగొట్టాడు. 26 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1462 ప‌రుగుల‌తో పాటు 26 వికెట్లు తీశాడు. టీ 20ల్లో 14 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించిన సైమండ్స్ 337 పరుగులు, 8 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో డెక్క‌న్ చార్జ‌ర్స్, ముంబై ఇండియ‌న్స్‌కు ఆడాడు. సైమండ్స్ మృతి ప‌ట్ల ప‌లువురుక్రికెట‌ర్లు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. 2008లో సిడ్నీ వేదికగా ఇండియా, ఆసీస్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో సైమండ్స్‌, భార‌త స్పిన్న‌ర్ హ‌ర్జ‌భ‌న్ సింగ్ మ‌ధ్య జ‌రిగిన వివాదం ఎప్ప‌ట‌కీ గుర్తుండి పోతుంది. సైమండ్స్ హ‌ర్భ‌జ‌న్‌ త‌న‌ను కోతి అన్నాడ‌ని ఆరోపిస్తే.. బ‌జ్జీ తాను మా… కీ అన్నాన‌ని చెప్పాడు. చివ‌ర‌కు క్రికెట్ ఆస్ట్రేలియా హర్భజన్‌దే తప్పంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అతనిపై మూడు మ్యాచుల నిషేధం విధించింది. అప్పుడు భారత జ‌ట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే భజ్జీపై విధించిన నిషేధం ఎత్తివేయకపోతే సిరీస్ నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వస్తుందని చెప్పడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వెనక్కి తగ్గింది. భజ్జీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఇలా ఈ వివాదం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది.
-తక్షణం 500 బస్సులకు రూ.150 కోట్లు -అద్దె బస్సులపై వ్యాట్ తగ్గింపునకు సానుకూలత -హైదరాబాద్‌కు మరో ఈడీ, ఇద్దరు ఆర్‌ఎంలు -బస్సుల రంగు, లోగోల మార్పునకు ఆదేశం -రవాణా, ఆర్టీసీ అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీకి వెయ్యి కొత్త బస్సులను సమకూర్చాలని నిర్ణయించడంతోపాటు తక్షణమే 5 వందల బస్సుల కొనుగోలుకు రూ. 150 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. అద్దె బస్సులపై ప్రస్తుతం ఉన్న 14.5 వ్యాట్ శాతాన్ని తగ్గించే ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా హైదరాబాద్‌లో మరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తోపాటు ఇద్దరు ఆర్‌ఎంలను నియమించేందుకు అంగీకరించారు. ఆర్టీసీలో తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్లకు తగు శిక్షణ ఇచ్చి పర్మినెంట్ చేసే విషయంలోనూ సీఎం సానుకూలంగా స్పందించారు. రవాణావ్యవస్థ పనితీరుపై గురువారం ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.150 కోట్లతో కలిపి ఇప్పటి వరకూ ఆర్టీసీకీ రూ.400 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పటికే 350 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించగా మరో 650 బస్సులను సమకూర్చాలని ఆదేశించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు 4 వందలు, ఇతర ప్రాంతాల కు వంద ఎక్స్‌ప్రెస్, 50 ఇంద్ర, గరుడ వోల్వో బస్సులు కొనుగోలుచేయాలని సమీక్షలో నిర్ణయించారు. వీటితోపాటు వంద అద్దె బస్సులను కూడా అనుమతించాలని, వీటన్నింటినీ మూడు నెలల్లో రోడ్లపైకి తేవాలని నిర్ణయించారు. మార్చి తర్వాత మరో వేయి బస్సులను కొనుగోలు చేసేందుకు సమీక్షలో సీఎం అంగీకరించారు. బస్సులకు అందమైన రంగులతో కొత్త శోభ.. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా ఆర్టీసీ బస్సులకు రంగులు వేయాలని అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి సుమారు వేయి రంగులు, జాతీయ, అంతర్జాతీయ బస్సుల మోడల్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలించి సూచనలిచ్చారు. హైదరాబాద్ నగరంలో నిర్వహణా సామర్థ్యం పెంచేందుకు ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తోపాటు, ఇద్దరు రీజియన్ మేనేజర్ల పోస్టులు మంజూరు చేశారు. ఆర్టీసీని లాభాల బాటకు తెచ్చేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. డిపోలవారీగా పరిస్థితిని అధ్యయనం చేయాలన్నారు. రవాణాశాఖ కమిషనర్, జేటీసీ, డీటీసీలు, ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. సమన్వయపరచాల్సిన బాధ్యతను రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి అప్పగించారు. మూడవ సారి జరిగే సమీక్షా సమావేశంలో ఆర్టీసీ అధికారులతో సమావేశమవుతానని సీఎం చెప్పారు. ఆర్టీసీ ఎండీ, జేఎండీ, ఈడీలు, ఆర్‌ఎంలు, డిపోమేనేజర్లు, డీటీసీ, జాయింట్ కమిషనర్లు, ఆర్‌టీవోలు, ఎంవీఐలతో తాను నేరుగా మాట్లాడి ఆర్టీసీనీ లాభాల బాట పట్టించే అంశంమీద చర్చిస్తానని చెప్పారు. ఓఆర్ పెంచుకోండి.. ప్రతి రోజు 10 వేల బస్సులను తిప్పుతూ 90 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్న తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. కేఎంపీఎల్, ఆక్యుపెన్సీ నిష్పత్తిని పెంచుకోవాలని సూచించారు. ప్రయాణికులను ఆర్టీసీ బస్సులనే ఆదరించేలా ప్రోత్సహించాలని, అందుకోసం లక్కీడీప్ వంటివి చేపట్టాలని సూచించారు. తాను రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అనేక సంస్కరణలు సత్ఫలితాలిచ్చాయని సీఎం గుర్తు చేశారు. ముంబాయి, గుజరాత్, సూరత్, భీవండి, తిరుపతి బస్సులను పునరుద్ధరించాలని సూచించారు. రవాణాశాఖ ఆదాయం రూ.658 కోట్లు.. మొదటి త్రైమాసికం సందర్భంగా వచ్చిన ఆదాయంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు రవాణాశాఖ అధికారులు నివేదిక అందచేశారు. జూన్ 2, 2014 నుంచి సెప్టెంబర్ నెల చివరి వరకు రూ.568 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ. రెండు వేల 2 వందల కోట్ల రూపాయల టార్గెట్‌ను చేరుకోవాలనిసీఎం రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రి పీ మహేందర్‌రెడ్డి, ఎంపీలు బీ వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైల శేఖర్‌రెడ్డి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, కమిషనర్ జగదీశ్, ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్‌రావు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రమణారావు, రవాణాశాఖ జేటీసీ వెంకటేశ్వర్లు, ఈడీలు రవీందర్, గ్రేటర్ హైదరాబాద్ ఈడీ జయరావు తదితరులు పాల్గొన్నారు. టీఎంయూ హర్షం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయాల పట్ల తెలంగాణ మజ్దూర్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. యూనియన్ నేతలు తిరుపతి, అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి ముఖ్యమంత్రికి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
సినిమా స్క్రిప్ట్ & రివ్యూ : 03/17/19 .Header h1 { font: normal normal 90px Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; color: #ffff00; } .Header h1 a { color: #ffff00; } .Header .description { font-size: 130%; } /* Tabs ----------------------------------------------- */ .tabs-inner { margin: 1em 0 0; padding: 0; } .tabs-inner .section { margin: 0; } .tabs-inner .widget ul { padding: 0; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; } .tabs-inner .widget li { border: none; } .tabs-inner .widget li a { display: inline-block; padding: 1em 1.5em; color: #ffffff; font: normal bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; } .tabs-inner .widget li.selected a, .tabs-inner .widget li a:hover { position: relative; z-index: 1; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } /* Headings ----------------------------------------------- */ h2 { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #00ffff; } .main-inner h2.date-header { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #0f0e0c; } .footer-inner .widget h2, .sidebar .widget h2 { padding-bottom: .5em; } /* Main ----------------------------------------------- */ .main-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner .section { margin: 0 20px; } .main-inner .column-right-inner { margin-left: 20px; } .main-inner .fauxcolumn-right-outer .fauxcolumn-inner { margin-left: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner { margin-right: 20px; } .main-inner .fauxcolumn-left-outer .fauxcolumn-inner { margin-right: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner, .main-inner .column-right-inner { padding: 15px 0; } /* Posts ----------------------------------------------- */ h3.post-title { margin-top: 20px; } h3.post-title a { font: italic bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #b02ef1; } h3.post-title a:hover { text-decoration: underline; } .main-inner .column-center-outer { background: #ffffff none repeat scroll top left; _background-image: none; } .post-body { line-height: 1.4; position: relative; } .post-header { margin: 0 0 1em; line-height: 1.6; } .post-footer { margin: .5em 0; line-height: 1.6; } #blog-pager { font-size: 140%; } #comments { background: #cccccc none repeat scroll top center; padding: 15px; } #comments .comment-author { padding-top: 1.5em; } #comments h4, #comments .comment-author a, #comments .comment-timestamp a { color: #b02ef1; } #comments .comment-author:first-child { padding-top: 0; border-top: none; } .avatar-image-container { margin: .2em 0 0; } /* Comments ----------------------------------------------- */ #comments a { color: #b02ef1; } .comments .comments-content .icon.blog-author { background-repeat: no-repeat; background-image: url(); } .comments .comments-content .loadmore a { border-top: 1px solid #b02ef1; border-bottom: 1px solid #b02ef1; } .comments .comment-thread.inline-thread { background: #ffffff; } .comments .continue { border-top: 2px solid #b02ef1; } /* Widgets ----------------------------------------------- */ .sidebar .widget { border-bottom: 2px solid #f1d08f; padding-bottom: 10px; margin: 10px 0; } .sidebar .widget:first-child { margin-top: 0; } .sidebar .widget:last-child { border-bottom: none; margin-bottom: 0; padding-bottom: 0; } .footer-inner .widget, .sidebar .widget { font: normal normal 14px Georgia, Utopia, 'Palatino Linotype', Palatino, serif; color: #ffe599; } .sidebar .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .sidebar .widget a:visited { color: #6ef12e; } .sidebar .widget a:hover { color: #c1c1c1; text-decoration: underline; } .footer-inner .widget a:link { color: #3630f4; text-decoration: none; } .footer-inner .widget a:visited { color: #000000; } .footer-inner .widget a:hover { color: #3630f4; text-decoration: underline; } .widget .zippy { color: #ffffff; } .footer-inner { background: transparent none repeat scroll top center; } /* Mobile ----------------------------------------------- */ body.mobile { background-size: 100% auto; } body.mobile .AdSense { margin: 0 -10px; } .mobile .body-fauxcolumn-outer { background: transparent none repeat scroll top left; } .mobile .footer-inner .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .mobile .footer-inner .widget a:visited { color: #6ef12e; } .mobile-post-outer a { color: #b02ef1; } .mobile-link-button { background-color: #3630f4; } .mobile-link-button a:link, .mobile-link-button a:visited { color: #ffffff; } .mobile-index-contents { color: #444444; } .mobile .tabs-inner .PageList .widget-content { background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } .mobile .tabs-inner .PageList .widget-content .pagelist-arrow { border-left: 1px solid #ffffff; } sikander777 --> సినిమా స్క్రిప్ట్ & రివ్యూ రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు... టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం! Sunday, March 17, 2019 798 : ‘పాలపిట్ట’ తాజా ఆర్టికల్, విస్మృత సినిమాలు - 5 ఒకప్పుడు బెంగాలీ సినిమాలు, సాహిత్యం విరివిగా తెలుగు సినిమాలకి ఆధారమయ్యాయి. 1950 లలో తెలుగు నిర్మాతలు, దర్శకులు ఒక కొత్త ట్రెండ్ ప్రారంభించారు. తెలుగు, ఆంగ్ల, బెంగాలీ భాషల నవలలు, కథలు, నాటకాలూ తెలుగు సినిమాలుగా తెరకెక్కించే కొత్త సృజనాత్మక ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. దీనికి బీజం 1945 లో బిఎన్ రెడ్డి వేశారు. జీన్ ఫిలిప్ రామ్యూ రాసిన 18 వ శతాబ్దపు ‘పిగ్మాలియన్’ అనే ఆంగ్ల నాటకాన్ని భానుమతి - నాగయ్యలతో ‘స్వర్గ సీమ’ గా తీశారు. తర్వాత 1949 లో షేక్స్ పియర్ నాటకం ‘కింగ్ లియర్’ ఆధారంగా శివరావు కస్తూరి, శ్రీరంజని లతో కెవి రెడ్డి ‘గుణసుందరి కథ’ తీశారు. 1950 లలో ఇవి ఒక ఒరవడికి నాంది అయ్యాయి. ఆంగ్ల సాహిత్యంతో పడిన అడుగు తెలుగు, బెంగాలీ సాహిత్యాలకీ బాట వేసింది. ముఖ్యంగా బెంగాలీ సాహిత్యం తెలుగు సినిమాలకి కొత్త వ్యాపార వస్తువుగా దొరికింది. దేవదాసు, అర్ధాంగి, చరణడాసి వంటి విజయవంతమైన సినిమాలుగా తీశారు. ఇదిలా వుండగా, బెంగాలీ సినిమాలని రీమేక్ చేసే ఇంకో ఒరవడి కూడా ప్రారంభించారు. దేవాంతకుడు, చివరకు మిగిలేది, వివాహబంధం మొదలైనవి. ఇలా 1980 ల వరకూ అడపాదడపా బెంగాలీ సినిమాలని రీమేక్ చేస్తూ వచ్చినా ఏదీ విజయం సాధించలేదు – 1977 లో ఎన్టీఆర్, వాణిశ్రీలు నటించిన ‘ఎదురీత’ తప్ప. 1964 లో తీసిన ‘వివాహబంధం’ అపజయం పాలవడానికి కారణం, తెలుగులో కొచ్చేటప్పటికి ఆ కాలానికి కథాకథనాలు పాతవై పోవడం కావొచ్చు. 1960 లనుంచి తెలుగు సినిమాల్లో కమర్షియల్ విలువలతో వ్యాపార యుగం ప్రారంభమయ్యింది. నటనలు, పాటలు, కథాకథనాలూ వేగం పుంజుకున్నాయి. 1964 లో ‘వివాహబంధం’ విడుదలయ్యే నాటికి గుండమ్మ కథ, రాముడు -భీముడు, మూగమనసులు, మంచి మనసులు, ఆరాధన, దాగుడు మూతలు, మంచి మనిషి వంటి కమర్షియల్ వినోదాత్మక సాంఘికాలెన్నో ప్రేక్షకులకి కొత్త రుచులు పంచి పెట్టాయి. ఇలాంటప్పుడు చివరకు మిగిలేది, మనసే మందిరం, వివాహబంధం లాంటి విషాదగాథలు ఎందరికి నచ్చుతాయి. ఇంత మాత్రాన ‘వివాహబంధం’ మంచి సినిమా కాదా అంటే మంచి సినిమానే. లేకపోతే భానుమతి ఎందుకు నటించి, నిర్మిస్తారు. బెంగాలీలో హిట్టయిన ‘సాత్ పాకే బంధా’ కి రీమేక్. ఆశుతోష్ ముఖోపధ్యాయ్ రాసిన నవల ఆధారం. ఈయన ఇంకో నవల ఆధారంగా బెంగాలీలో తయారైన ‘దీప్ జ్వెలే జాయ్’ ని తెలుగులో ‘చివరకు మిగిలేది’ గా రీమేక్ చేశారు. తెలుగులో ‘వివాహబంధం’ గా రీమేక్ చేసిన ‘సాత్ పాకే బంధా’, 1974 లో హిందీలో విజయానంద్, జయాబాధురీలతో ‘కోరాకాగజ్’ గా రీమేక్ చేశారు. ఇది పెద్ద హిట్టయ్యింది. ‘వివాహబంధం’ ని భరణీ పిక్చర్స్ బ్యానర్ పై పిఎస్ రామకృష్ణ నిర్మించి దర్శకత్వం వహించారు. ఎన్టీ రామారావు, భానుమతీ రామకృష్ణ, చిత్తూరు వి నాగయ్య, సూర్యకాంతం, ప్రభాకర రెడ్డి, పద్మనాభం, హేమలత, వాసంతి తదితరులు నటించారు. ఎంబి శ్రీనివాసన్ సంగీతం సమకూర్చారు. ఛాయాగ్రహణం అన్నయ్య, మాటలు అట్లూరి పిచ్చేశ్వర్రావు, పాటలు సి నారాయణ రెడ్డి. పెళ్ళంటూ చేసుకున్నాక ఏవో వెలుపలి కారణాలు చీలికలు తెస్తే చిట్లి పోయేంత బలహీనమైనదా ఆ బంధం? మరెందుకు విడిపోతారు ? దీనికి జవాబులు వెతుకుదాం... చంద్రశేఖర్ (ఎన్టీ రామారావు) ఓ మూడొందల జీతంతో లెక్చరర్. అదే కాలేజీలో అప్పారావు (చిత్తూరు వి నాగయ్య) ప్రిన్సిపాల్. చంద్రశేఖర్ కి చిన్నప్పట్నుంచీ పెంచిన పిన్ని (హేమలత) వుంటుంది. మధ్యతరగతి జీవితం. అప్పారావుకి మాణిక్యాంబ (సూర్యకాంతం) అనే భార్య, భారతి (భానుమతి), అరుణ (వాసంతి) అనే ఇద్దరు కుమార్తెలు, రఘు (ప్రభాకర రెడ్డి) అనే కుమారుడూ వుంటారు. సోదరుడి కుమారుడు కాంతారావు (పద్మనాభం) పడి వేలాడుతూ వుంటాడు. అప్పారావుది సంపన్న కుటుంబం. కానీ డొక్కు కారు వుంటుంది. ఓ రోజు ఆ కారెక్కకుండా బస్సులో వస్తూంటే చంద్రశేఖర్ పరిచయమవుతాడు భారతికి. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అప్పారావుకి తెలిసి సంతోషిస్తాడు. భార్యకి చెప్తే ఆమె ఇంతెత్తున లేస్తుంది. అతడి అంతస్తేమిటని ప్రశ్నిస్తుంది. తమ హోదాకి తగ్గ సంబంధమే చేయాలంటుంది. వినకుండా పెళ్లి చేసేస్తాడు అప్పారావు. ఇది మనసులో పెట్టుకుంటుంది మాణిక్యాంబ. చంద్రశేఖర్ భార్యగా సామాన్య ఇంట్లోకి ప్రవేశిస్తుంది భారతి. పిన్నితో కూడా కలిసిపోయి సుఖంగా వుంటుంది. యాత్రలకి వెళ్ళొస్తారు. వస్తూ చాలా బహుమతులు తెస్తారు. దీంతో మండిపడుతుంది మాణిక్యాంబ. మూడొందల జీతగాడు అల్లుడు ఇవన్నీ తెచ్చి పంచడం భరించలేక పోతుంది. కించపరుస్తూనే మెత్తగా పొదుపు గురించి బోధిస్తుంది. “ఇవన్నీ ఎందుకు? చేతిలో డబ్బుంటే మంచి నీళ్ళలా ఖర్చు పెట్టేస్తుంది. నువ్వైనా పట్టించుకోక పోతే ఎలా? ఆదాయాన్ని బట్టి ఖర్చుపెట్టుకోవాలి” అంటుంది. “ఆదాయం తక్కువైనంత మాత్రానా ఆప్యాయతలు తగ్గుతాయా?” అంటాడు. “ఎందుకు తగ్గుతాయి, ఇల్లుమాత్రం గుల్లవుతుంది” అంటుంది. సీరియస్ అయిపోయి లేచి వెళ్ళిపోతాడు. ఇలా ఆమెకెంత ఆత్మాభిమానమో, అతడికీ అంతే ఆత్మాభిమానం. దీంతో ఆమె అంటే ఇక కూల్చలేని అడ్డుగోడ కట్టుకుని, నత్త గుల్లలా ముడుచుకు పోతాడు. ఆమె ఏం చేసినా పుండు మీద కారం జల్లినట్టే వుంటుంది. ఏదో వొక వంకతో అతన్నీ, కూతుర్నీ పిలిపించుకుంటూ వుంటుంది. ఒకసారి ఢిల్లీ నుంచి బంధు వులొచ్చారని పిలిస్తే వెళ్తాడు భారతిని తీసుకుని. ఆ బంధువు - ఇంగ్లాండ్ ఎప్పుడు వెళ్తున్నారు? మీరు రాసిన పుస్తకానికి పతకం వచ్చిందటగా? ప్రమోషన్ కూడా వచ్చిందట? – అంటూంటే చంద్రశేఖర్ కి తర్వాత అర్ధమవుతుంది, అత్తగారే ప్రతిష్ట కోసం అల్లుణ్ణి ఇలా గొప్పగా చిత్రించుకుందని. దీంతో మరింత అవమానం ఫీలయ్యి వెళ్ళిపోతాడు. ఎంత సేపూ తనది దిగువ స్థాయి అనుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న ఆమె తీరుని నిరసించడం మొదలెడతాడు. ఆమె వూరుకోదు. కూతురితో ఫోన్లో మాట్లాడుకోవాలని ఇంటి ముందు టెలిఫోన్ స్థంభం పెట్టించి కనెక్షన్ ఇప్పిస్తుంది. దీంతో చంద్రశేఖర్ ఆగ్రహం పతాక స్థాయికి చేరుతుంది. భారతీనే నానా మాటలంటాడు. భారతి తల్లిని నానా మాటలంటుంది. మాణిక్యాంబ ఇంకింత రెచ్చిపోయి – “ముష్టి మూడొందల జీతానికే మురిసిపోతే అయిపోయిందా? నూతిలో కప్పలా ఎంత కాలం బతుకుతాడు? శ్రమపడాలి, పైకి రావాలి!” అని క్లాసు పీకేస్తుంది. ఇంకోసారి అల్లుడితోనే నేరుగా అనేస్తుంది – “ఫలానా వారి అల్లుడు అన్పించుకోవడం కాదు గొప్ప. ఫలానా వారి అత్తగారు వస్తే నేను గర్వ పడేలా వుండాలి నీ హోదా, అదీ గొప్పంటే!” అని. ఇలా పరిస్థితి ఎక్కడికో వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరి మధ్యా నలిగిపోతూంటుంది భారతి. అత్తాఅల్లుళ్ళ ఆత్మాభిమానాల సమస్య కాస్తా, భార్యా భర్తల మధ్య సూటిపోటి మాటల వాగ్యుద్ధంగా మారిపోయి విడిపోతారు. ఎవరి కథ? నందమూరి తారక రామారావు కొత్త గెటప్ లో కనిపిస్తారు. ఈ గెటప్ తో పాత్ర వయసుకి మించిన రూపంలో కన్పిస్తారు. ధోవతీ కుర్తా వేసుకుని, కళ్ళద్దాలు పెట్టుకుని, బరువు కూడా పెరిగి పెద్ద మనిషిలా వుంటారు. యూత్ అప్పీల్ లేని ఈ గెటప్ మనకి ఇబ్బందిగానే వుంటుంది. ఇది బెంగాలీ ఒరిజినల్ లోని బెంగాలీ బాబు గెటప్పే. పదేళ్ళ తర్వాత తీసిన హిందీ ‘కోరా కాగజ్’ లో లెక్చరర్ పాత్ర ప్రొఫెసర్ పాత్రగా మారి, ఆధునిక దుస్తుల్లో యూత్ అప్పీల్ తో వుంటాడు విజయానంద్. ఎన్టీఆర్ పాత్ర స్వభావం నెగెటివ్ గానే వుంటుంది. ఇలాటి మనుషులుంటారు. నిజానికి ఆత్మాభిమానం నెగెటివ్ లక్షణం కాదు. కానీ పాత్ర స్వభావం పైన చూస్తే ఆత్మాభిమానం, లోన చూస్తే సంకుచితత్వం అన్నట్టుంటుంది. ఆయన సూర్యకాంతంతో రియాక్ట్ అయ్యేది ఫక్తు ఆత్మాభిమానంతోనే. కానీ జీవించేది మాత్రం ఆత్మాభిమానంతో కాదు. సంకుచితత్వంతో, మార్పు కోరని అదే నూతిలో కప్ప జీవితం. ఈ నూతిలో కప్ప జీవితపు ఛాయలు ఆయన మోహంలో ప్రకటిస్తూంటారు. ఆ మోహంలో సంతోషం వుండదు, సుఖం వుండదు. ఆశలుండవు, ఆశయాలుండవు. బెంగాలీ రచయిత భలే పాత్రని సృష్టించాడు. మాటంటే ఆత్మాభిమానం తన్నుకొస్తుంది, చూస్తే ఆ ఆత్మాభిమానంతో మానసికంగా, ఆర్ధికంగా ఎదిగేది లేదు. సూర్యకాంతం గయ్యాళి అత్తేంకాదు, ఆర్ధికం నేర్చిన వ్యవహార్త. ఎదుటి వాళ్ళు కూడా పైకి రావాలనే ఆమె గొడవ. అయితే నోటి దూలవల్ల చెడగొట్టుకుంటుంది. “నా ఇల్లు బంగారం గానూ” అనేది ఆమె ఊతపదం. చివరికి విసిగిపోయిన కూతురు, “నీ ఇల్లు బంగారం కాదు. అంతస్తుల్ని గురించి, అభిమానాల్ని గురించీ నీ అభిప్రాయాలు మారనంత వరకూ నీ ఇల్లు బంగారం కాదు!” అని అరుపులు అరిస్తేగానీ కళ్ళు తెరవదు. సూర్యకాంతం ఓ విధంగా ‘విలన్’ పాత్రే అయినా విలన్ పాత్రలా అన్పించదు. ఆమెతో ఈ పాత్రలో మంచితనమే కన్పిస్తుంది. ఈ పాత్రని ఎంజాయ్ చేయగలమే తప్ప ద్వేషించలేం. ఆమె డైలాగ్ డెలివరీ గానీ, ఆ డైలాగ్ డెలివరీలో సెలయేటి ప్రవాహంలా సాగిపోయే భాష గానీ ఇప్పటి సినిమాల్లో చూడం. ఇక తల్లికీ భర్తకీ మధ్య నలిగిపోయే పాత్రలో భానుమతి రానురాను పాత్ర డెప్త్ పెరుగుతున్నకొద్దీ దృష్టిని తన మీదికి తిప్పుకుంటుంది. సెంట్రల్ పాత్ర తనదే అయిపోవడం వల్ల. నిజానికి ఒరిజినల్ బెంగాలీ గానీ, హిందీ రిమేక్ గానీ, హీరో కథగా వుండవు. హీరోయిన్ కథగానే వుంటాయి. కథా ప్రారంభం కూడా హీరోయిన్ తోనే వుంటుంది. బెంగాలీలో సుచిత్రా సేన్ గానీ, హిందీలో జయబాధురీ గానీ గతాన్ని తలచుకోవడంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అంటే భర్త నుంచి విడిపోయి దూరంగా టీచర్ గా జీవిస్తున్నప్పుడు, గతం గుర్తు కొచ్చి ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. అప్పుడు మొదట్నుంచీ కథ. తెలుగులో భానుమతితో ఇలా వుండదు. నేరుగా బస్సు ప్రయాణంలో ఎన్టీఅర్ పరిచయంతో వర్తమానంలో ప్రేమ కథగా మొదలవుతుంది. ఇందుకే తెలుగు రీమేక్ లో ప్రధాన పాత్ర ఇటు భానుమతి కాకుండా, అటు ఎన్టీఆర్ కాకుండా అయోమయంగా వుంటుంది కథని ఫాలో అవడానికి. సినిమా కథ అనేది ప్రధాన పాత్రకి సంబంధించినదై వుండి, ఆ ప్రధాన పాత్ర దృష్టి కోణం (పాయింటాఫ్ వ్యూ) లో సాగడం ఆనవాయితీ. ఆ దృష్టికోణంలోనే ప్రేక్షకులు కథని చూసి ఆ ప్రధాన పాత్రని పట్టుకుని ప్రయాణించగల్గుతారు. ప్రయాణించడానికి ప్రధాన పాత్ర ఆధారంగా లేనప్పుడు, ఎంత కథ చెప్పినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఆవకాశమే లేదు. బెంగాలీ వొరిజినల్ ని హీరోయిన్ కథగానే తీశారు, హీరో కథ కాదు. దీన్ని మార్చకుండా హిందీ లోనూ హీరోయిన్ కథగానే తీశారు. హీరోయిన్ కథ కాబట్టి బెంగాలీలో అప్పటి పాపులర్ హీరోయిన్ సుచిత్రా సేన్ ని ఈ పాత్రకి ఎన్నుకున్నారు. హీరో పాత్రలో చిన్న హీరోని పెట్టుకున్నారు. హిందీలో కూడా అప్పటికి పాపులరైన జయబాధురీని హీరోయిన్ గా తీసుకున్నారు. హీరోగా అంతగా తెలియని విజయానంద్ ని తీసుకున్నారు. ఇలా పాత్రల్ని బట్టి, కథని బట్టి, ఆర్టిస్టుల్ని బ్యాలెన్స్ చేశారు. తెలుగులో ఇలా చేయలేదు. ఎన్టీఆర్, భానుమతి హేమాహేమీల కాంబినేషన్ గా చేశారు. చేసినప్పుడు కథ ప్రకారం భానుమతిని ప్రధాన పాత్ర చేయలేక, ఎన్టీఆర్ ని ప్రధాన పాత్రగా చేయడానికి కథని మార్చలేక రెండు పాత్రల కథ అన్నట్టు చేశారు. దీంతో ఓ ప్రధాన పాత్ర, అది ఎదుర్కొనే సమస్య, దాని దృష్టి కోణం, ఆ దృష్టి కోణంలో ఫ్లాష్ బ్యాక్ తో కథా ప్రారంభమూ అనే అర్ధవంతమైన కథా ప్రక్రియ చెదిరిపోయింది. హిందీ, బెంగాలీల్లో ప్రధాన పాత్రగా హీరోయిన్ ని ప్రవేశ పెడుతూ చాలా సస్పెన్స్ ని క్రియేట్ చేశారు. ఆమె తోనే కనీసం పదిహేను నిముషాలు టీచర్ అని పరిచయం చేసి దృశ్యాలు నడిపించారు. ఈ దృశ్యాల్లో ఈమె ఎవరు? ఎందుకు వొంటరిగా వచ్చి ఈ వూళ్ళో వుంటోంది? ఏం జరిగిందీమెకి? అన్న ప్రశ్నలెన్నో మనల్ని వేధించేట్టు చేసి, ఆసక్తిని పెంచారు. ఐతే భానుమతి ఈ పాత్ర ప్రయాణంలో ఆయా ఘట్టాల్ని అర్ధవంతంగా నటించింది. భర్తకి ఎదురుతిరిగే సన్నివేశం, తర్వాత తల్లికి ఎదురు తిరిగే సన్నివేశం, చివరికి ఆత్మత్యాగం చేసుకోబోయే సన్నివేశం - కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా - ఆమె నటనని ఆకాశానికంటించింది. తండ్రి పాత్రలో నాగయ్యకి భార్యని కాదని కూతురి పెళ్ళిచేయడం వరకే ప్రాధాన్యం. ఆ తర్వాత ఎందులోనూ జోక్యం చేసుకోడు, కష్టాల్లో వున్న కూతురికి సానుభూతి వ్యక్తం చేస్తూ వుండడం తప్ప. కొడుకు పాత్రలో ప్రభాకర రెడ్డికి తల్లికిలాగే అహం ఎక్కువ. చెల్లెలి చేత విడాకుల పత్రాలమీద సంతకం చేయించుకుంటాడు. కానీ ఆ తర్వాత ఆ ప్రయత్నాలు చెయ్యడు. కుటుంబంలో ఆడపిల్లకి సమస్య వస్తే మగవాళ్ళయిన తండ్రీ కొడుకులు ఇలా వుండడం కాస్త ఇబ్బందిగానే వుంటుంది మనకి. ఏ వైఖరీ తీసుకోలేక కిమ్మనకుండా వుంటారు. ‘మాతం - గి మణిపూర్’ అని మొట్టమొదటి మణిపురీ సినిమా వుంది. ఇందులో ఉమ్మడి కుటుంబంలో పెద్ద కొడుకు వల్ల కోడలికి విషమ సమస్య వస్తే, ఇంటిల్లి పాదీ ఆ సమస్యని పరిష్కరించడానికి ఒకటవుతారు. ఎవర్నీ దూషించరు, కనీసం సమస్యకి కారణమైన పెద్ద కొడుకు ప్రియురాలితో కూడా. ఎవరి తోనూ సంఘర్షించరు. దీనికి జాతీయ అవార్డు లభించింది. ‘తీర్థ్ జాతర’ అనే నాటకం ఆధారంగా 1972 లో తీశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఇప్పటికీ నిలబెట్టుకుంటున్న మణిపురి ప్రజలు, కలహం వస్తే కలహాలతో పరిష్కరించుకోవాలనుకోరు. ‘వివాహబంధం’ లోనే కాదు, చాలా కుటుంబ సినిమాల్లో కలహం వస్తే తలా వొకరుగా విడిపోయి కలహించుకోవడం ఒక ఫార్ములాగా వుంటూ వస్తోంది. ఇందులో పద్మనాభం కామెడీ కూడా ఆర్ధిక పరమైనదే. డబ్బు సంపాదించడానికి పూటకో ఆలోచన చేస్తాడు, ఏదీ అమలు చేయక పక్క పాత్రకి నరకం చూపిస్తూంటాడు. “ఈ రోజుల్లో లక్ష అంటే ఎంత? ఆఫ్టరాల్ రెండక్షరాలు” వంటి డైలాగులు పేలుస్తూంటాడు. భానుమతి పాత్రకే బలం, స్పష్టత ఈ వివాహబంధపు కథ పూర్తిగా ఆర్ధికం మీద ఆధారపడింది. ఆర్ధిక ఎదుగుదల కోసం అల్లుణ్ణి అత్త వేధించడమే ఈ డబ్బు చుట్టూ సంబంధాల కథ. అయితే ఒక అనుమానం రాకమానదు. అన్ని గొప్పలు పోయే సంపన్నురాలైన, ఆత్మాభిమానం గల అత్తగారు, కట్నం ఏమీ ఇవ్వలేదా? అల్లుడు తీసుకోలేదా? సంబంధం అనుకున్నాక వెంటనే పెళ్లి సీను చూపించేశారు తప్ప కట్నం, పెట్టిపోతలు వగైరా ఆ సంబంధమైన వ్యవహారమేమీ మాట్లాడుకున్నట్టు సీను వేయలేదు. బెంగాలీ, హిందీల్లో కూడా ఇలాగే వుంటుంది. ఈ స్పష్టత లేకపోవడం వల్ల పెళ్లి తర్వాత పాత్రల ప్రవర్తన ఒక పజిల్ లా వుంటుంది. సూర్యకాంతంకి కూతుర్ని సామాన్యుడి కివ్వడం అస్సలు ఇష్టం లేదు. “నేనూ ఒకప్పుడు లెక్చరర్నే కదా, ఏం తక్కువైంది?” అని నాగయ్య అంటే, “ఏం తక్కువైందో నాకు తెల్సు. ఈ సంసారాన్ని ఈది ఈ కుటుంబాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి నేను పడ్డ పాట్లు నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెల్సు. నా బిడ్డకి కూడా ఎందుకు కష్టాలూ?” అంటుంది సూర్యకాంతం. అలాటిది కూతుర్ని వైభవంగా అత్తారింటికి పంపినట్టు కన్పించదు. పంపాక కూతురు సుఖపడాలని సౌకర్యాలు కల్పించే పనిలో పడుతుంది. హిందీలో ఫ్రిజ్ కూడా పంపిస్తుంది అత్తగారు. సూర్యకాంతం అల్లుడికి పుండు మీద కారం జల్లుతున్నట్టు వాయిదాల పద్ధతిలో ఒకటొకటీ సౌకర్యాలు కల్పిస్తుంది. “నేను ఆదర్శ వివాహం చేసుకున్నాక ఇవన్నీ ఎందుకు?” అని అల్లుడు అనడానికి అలాటి వివాహం చేసుకున్నాడన్న స్పష్టత నివ్వలేదు కథకుడు. కథలో పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యగా పాత్రల మధ్య ఒక సమస్యని ఏర్పాటు చేసినప్పుడు, ఆ పాత్రల మధ్య పూర్వం ఏం జరిగిందో తెలియజేయకపోతే కథని ఫాలో అవడం కష్టమవుతుంది. ఇలా ఎన్టీఆర్, సూర్యకాంతం పాత్రల విషయంలో ఒక స్పష్టత లేని విషయం అలా వుంచితే, భానుమతి పాత్ర ఎదురయిన సమస్యతో ఒక స్పష్టతతో, బలంగా వుంటుంది. ముందు ఆమె తల్లితో సమస్యలు వస్తున్నాయని అస్సలు అనుకోదు. తల్లిది సానుకూల దృక్పథమే అనుకుంటుంది. అందుకని, ఒక బంధువు ముందు భర్త గురించి తల్లి లేనిపోని గొప్పలు చెప్పి భర్త మనోభావాలు దెబ్బ తీసినప్పుడు - “మీ అమ్మగారు నిన్ను నాలాంటి సామాన్యుడి కిచ్చి పెళ్లి చేశారా అని ఆలోచిస్తున్నాను” అని అతనంటే - “మీకన్నీ రావాలనీ, మీరలా వుండాలనీ ఆవిడ ఉద్దేశం” అని నచ్చజెప్తుంది. “నా లాంటి వాడు అల్లుడు కావడం ఆవిడ గారికి నామర్దాగా వుంది, నువ్వు నన్ను చేసుకోవడం ఆవిడకిష్టం లేదు” అని మళ్ళీ అంటే – “మీరొట్టి శాడిస్టు మనిషి!” అని నవ్వేస్తుంది . కానీ టెలిఫోన్ పెట్టిస్తున్నప్పుడు తల్లి ఇంటికొచ్చి గోడకి తగిలించిన సామాగ్రిని చూసి, “ఈ తట్ట బుట్ట పెట్టే చోటు ఇదా? తీసి అవతల పడెయ్యి!” అని భర్త ముందు కసురుకున్నప్పుడు నిర్ఘాంత పోతుంది. “తీయడానికి వీల్లేదు!” అని భర్త అరిచినప్పుడు ప్రత్యక్ష సమరం మొదలైపోతుంది. అలాఅలా తన సంసారం మీద తల్లిగారి పెత్తనం బాగా పెరిగిపోతూంటే, ఇద్దరికీ నచ్చ చెప్పలేక నలిగిపోతున్న ఆమె, ఒకానొక దశలో సహనం కోల్పోయి భర్తతో అనేస్తుంది –“మగవారు మీరుండగా ఇవన్నీ ఆవిడ ఎందుకు చేయించాలని మీకు బాధగా వుంది కదూ? పెళ్లి చేసుకున్నంత మాత్రాన పుట్టింటిని పూర్తిగా మర్చిపోవాలనుందా ఏమిటీ? ఇక నా మంచీ చెడూ అమ్మా నాన్నా ఏం చూడనే కూడదా?” అని. ఇలా భర్తకీ తల్లికీ మధ్య వ్యక్తిత్వాల గొడవలు తనకీ భర్తకీ మధ్య వ్యక్తిత్వాల గొడవగా మారిపోతుంది. ఇక ఆమె అన్నకి ఫోన్ చేసి, చెల్లెల్ని తీసికెళ్ళి పొమ్మంటాడు. ఏమనాలో అర్ధంగాక పుట్టింటికి చేరుతుంది భారతి. మనసుని మళ్ళించుకోవడానికి ఎమ్మే చదవడం మొదలెడుతుంది. చదువుకుని ఉద్యోగం చేస్తానంటుంది. అన్న మందలిస్తాడు. “స్త్రీ జీవితానికి అర్ధం, లక్ష్యం ఉద్యోగం చేయడం కాదు. వివాహం చేసుకోవడం” అంటాడు. అప్పటికే విడాకుల కాగితాల మీద సంతకం తీసుకున్న అతను, చెల్లెలి పెళ్లి ప్రస్తావన తెచ్చి, అక్క వుండగా చెల్లెలి పెళ్లి కష్టమని, అందుకని మళ్ళీ పెళ్లి చేసుకోమంటాడు. తల్లి కూడా సమర్ధిస్తుంది. దీంతో విరుచుకు పడుతుంది భారతి, “ మీరింత వరకూ నా మంచి కోసం చేసింది చాలు...నువ్వు మంచి అనుకున్నదే లోకం మంచి అనుకోవాలని ఎక్కడుందమ్మా? కాలం మారుతోంది. అంతస్తులు మారుతున్నాయి. అనుభావాలు మారుతున్నాయి. కానీ నీలాటి అమ్మలు మాత్రం మారడం లేదు!” అనేసి వెళ్ళిపోతుంది. కాలం మారుతోంది అనే మాట అప్పటి ఈ సినిమాలో ఇంకో రెండు సార్లు వస్తుంది. బస్సులో మగవాళ్ళ సీట్లో ఆడవాళ్ళు కూర్చున్నప్పుడు, “కాలం మారిపోతోంది. ఆడవాళ్ళ సీట్లో ఆడవాళ్లే, మగవాళ్ళ ఆడవాళ్లే” అని ఒకసారి, చివర్లో ఎన్టీఆర్ పశ్చాత్తాప పడినప్పుడు మరోసారి. కాలం మారిందనే మాట ఇప్పటికీ వాడుతూనే వుంటారు. కానీ అరవై ఏళ్ల క్రితమే కాలం మారిందని గమనించి సినిమాల్లో వాడేశారు. ఏ కాలంలో వాళ్ళు ఆ కాలం మారిందనే అనుకుంటారు. అయితే ఇప్పుడు చూస్తేనే, అప్పటి కాలం మారలేదనీ, ఇప్పటి కాలమే బ్రహ్మాండంగా మారిందనీ గొప్పలు పోతారు. ఇప్పటి ఈ కాలం ఇంత మారడానికి వెనకటి కాలాలే మారుతూ మెట్లు వేశాయని గుర్తించరు. భారతి ఎమ్మే పాసయి, టీచరుగా ఉద్యోగమొస్తే వేరే వూరు వెళ్ళిపోతుంది. అక్కడ గతాన్ని మరచిపోవాలని చాలా ప్రయత్నిస్తుంది. ఆమెని చూసి ఒక టీచర్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టమే అన్నట్టు సంకేతాలిస్తాడు. నాల్గు దులుపుతుంది. చెల్లెలి పెళ్లి పిలుపు రావడంతో ఇక వెళ్ళక తప్పదు. వైభవంగా జరుగుతున్న ఆ పెళ్ళిలో వధూవరులు ఏడడుగులు వేస్తున్నప్పుడు తట్టుకోలేక పరిగెడుతుంది. పరుగెత్తీ పరుగెత్తీ భర్త ఇల్లు చేరుకుంటుంది. తలుపు కొట్టీ కొట్టీ అలసి పోతుంది. ఒకావిడ తలుపు తీసి “ఎవరు కావాలి?” అంటుంది. భారతికి అర్ధమైపోతుంది. “మీ వారున్నారా, పిలవండి” అంటుంది నిస్సహాయంగా. అప్పుడే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని జీర్ణించుకోలేక. అప్పుడు అతనొస్తాడు. అతడి పేరుకూడా చంద్రశేఖరే. లాయర్. భర్త ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడనీ, తాము ఈ ఇంట్లోకి వచ్చామనీ అతనన్నప్పుడు తేలిక పడుతుంది భారతి. ఈ సస్పెన్స్ డ్రామా గొప్పగా వుంటుంది. అయితే ఇతను ఆమెని నిందిస్తాడు. భర్త పిచ్చి పట్టిన వాడిలా ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదనీ, పిన్ని కూడా ఇవన్నీ చూడలేక చనిపోయిందనీ, దీని కంతటికీ బాధ్యత భారతీదేననీ దూషిస్తాడు. భారతికిక చచ్చిపోవాలన్పిస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక భర్త చంద్రశేఖర్ లాయర్ దగ్గరికొస్తాడు. లాయర్ జరిగింది చెప్తాడు. చంద్రశేఖర్ చలించిపోతాడు. “కాలం మారుతోంది. మనసుకు నచ్చినా నచ్చక పోయినా కట్టుకున్న భర్తే ప్రత్యక్ష దైవమని పూజించే రోజులు పోయాయి. పురుషులతో బాటు స్త్రీలు కూడా వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటున్నారు. విభిన్న వ్యక్తిత్వాలున్నభార్యాభర్తల మనసులు అతకడం కష్టం” అని బాధపడతాడు. “తనలో ఎంత మార్పు వస్తే ఇక్కడి కొచ్చింది...మొదట్లో నేనూ నీలాగే అనుకున్నాను. ఆడవాళ్ళు మగవాళ్ళని నీడలా అనుసరిస్తే చాలనుకున్నాను. మనకిష్టమైన రూపంలో కన్పించడానికి వాళ్ళు మట్టి బొమ్మలూ, లక్క బొమ్మలూ కాదు. మనలాంటి మనుషులే...” అంటూ భారతిని వెతకడానికి పరిగెడతాడు. సుఖాంతమవుతుంది. ఈ మొత్తం కుటుంబ డ్రామాలో నీతి ఏమిటంటే, భార్యాభర్తల మధ్య ఇంకో వ్యక్తి రూపంలో సమస్య వచ్చినప్పుడు, ఆ భార్యాభర్తలు ఒకటై తమ వైవాహిక బంధం కోసం ఆ మూడో వ్యక్తి ప్రమేయాన్నే తిప్పికొట్టాలనీ. ఈ కథలో చంద్రశేఖర్ అత్త ప్రభావానికి లొంగిపోయి భార్య భారతిని బాధపెట్టడం, భారతి చంద్రశేఖర్ ని బాధ పెట్టడం, ఇద్దరూ కలిసి సంసారాన్ని ముక్కలు చేసుకోవడం. అత్తగారు మాత్రం సలక్షణంగా వుండడం. ఈ దృశ్యాన్ని ట్రాన్సాక్షనల్ ఎనాలిసిస్ (టీఏ) ప్రకారం చూస్తే, అత్తగారు పేరెంట్ మెంటాలిటీతో వుంటే, భార్యాభర్తలు చైల్డ్ మెంటాలిటీతో వుండిపోయారు. ఈ రెండు మెంటాలిటీలూ లాభం లేదనీ, మనుషులు అడల్ట్ మెంటాలిటీకి ఎదిగితే సమస్యలు రావనీ టీఏ చెప్తుంది. ఇదీ విషయం. పిఎస్ రామకృష్ణ దర్శకత్వం బెంగాలీ మాతృకలాగా మరీ కళాత్మకంగా లేకపోయినా, సీదా సాదాగా బాగానే వుంటుంది. సన్నివేశాలు నడుస్తున్నప్పుడు ఉన్నట్టుండి పక్క ఆర్టిస్టుల క్లోజప్స్ వేసే చమత్కారం ఎక్కువ కన్పిస్తుంది. గ్లామరస్ గా భానుమతికి చాలా సార్లు వేశారు. మాటలు రాసిన అట్లూరి పిచ్చేశ్వరరావు “చివరకు మిగిలేది” కి రాసిన రచయితే. ఆయన దురదృష్టమేమిటంటే ఈ రెండూ అట్టర్ ఫ్లాపయ్యాయి. పాటలు రెండు సూపర్ హిట్టయ్యాయి- “నీటిలోన నింగిలోన”, “విన్నావా విన్నావా” అనే పాటలు. ―సికిందర్ ‘పాలపిట్ట’ సాహిత్య మాస పత్రిక మార్చి, 2019 సంచిక Posted by సికిందర్ at 6:16:00 AM Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Newer Posts Older Posts Home Subscribe to: Posts (Atom) ఈ కాన్సెప్ట్ కి బాధితురాలి కథ అవసరం! స్క్రీన్ ప్లే సంగతులు...? ఒక దర్శకుడు నుంచి స్క్రీన్ ప్లే టిప్... Search This Blog contact msikander35@gmail.com, whatsapp : 9247347511 Popular Posts 1255 : రివ్యూ! రచన- దర్శకత్వం : శైలేష్ కొలను తారాగణం : అడివి శేష్ , మీనా క్షీ చౌదరి , కోమలీ ప్రసాద్ , రావు రమేష్ , శ్రీకాంత్ అయ్యంగార్ , తనికెళ్ళ భర... 1250 : రివ్యూ! (దేశవిదేశ పాఠకులందరికీ నమస్కారం. సినిమాలు చూస్తూనే వున్నా రాయాలంటే రైటర్స్ బ్లాక్ లాంటిది అడ్డుపడి ఇప్పుడు రిలీజ్ చేసింది. ఇక నుంచి రెగ్యు... 1251 : స్క్రీన్ ప్లే సంగతులు -1 దె య్యాలు ఎలాగైతే మూఢ నమ్మకమో , చేతబడి అలాటి మూఢ నమ్మకమే. దెయ్యాలతో హార్రర్ సినిమాలు తీసి ఎంటర్ టైన్ చేయడం వరకూ ఓకే. చేతబడి వుందంటూ నమ... తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17 స్క్రీ న్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసల... 1256 : రివ్యూ! రచ న -దర్శక త్వం : ఆనంద్ జె తారాగణం: రావణ్ రెడ్డి , శ్రీ ని ఖి త , లహ రీ గుడివాడ , రవీంద్ర బొమ్మకంటి , అమృత వర్షిణి తదిత తరులు సంగీతం: ఫ... 1252 : స్క్రీన్ ప్లే సంగతులు-2 ఇ క కథా నడక నియమాలకి విరుద్ధంగా , ఫస్టాఫ్ లో ముగియాల్సిన బిగినింగ్ విభాగమింకా సెకండాఫ్ లో కంటిన్యూ అవుతూ , కూతుర్ని హాస్పిటల్ కి... 1253 : రివ్యూ! రచన - దర్శక త్వం : ఏఆర్ మోహన్ తారాగణం : అల్లరి నరేష్ , ఆనంది , వెన్నెల కిషోర్ , ప్రవీణ్ , సంపత్ రాజ్ , శ్రీ తేజ్ , రఘుబాబు తదితరులు ... 1257 : రివ్యూ! 2023 లో జరిగే 95 వ ఆస్కార్ అవార్డ్స్ కి మన దేశం తరపున అధికారిక ఎంట్రీ పొందిన గుజరాతీ చలన చిత్రం ‘ చెల్లో షో ’ (చివరి షో) అక్టోబర్... (no title) డా ర్క్ మూవీస్ జానర్ కి 1930 లలో బ్లాక్ అండ్ వైట్ ‘ ఫిలిం నోయర్ ’ సినిమాలు బీజం వేశాయని చెప్పుకున్నాం. వీటి డీఎన్ఏ హార్డ... 1249 : రివ్యూ! రచన - దర్శకత్వం : రాజ్ విరాట్ తారాగణం : నందు విజయ్ కృష్ణ , రష్మీ గౌతమ్ , కిరీటి దామరాజు , రఘు కుంచె తదితరులు సంగీతం : ప్రశాం...
Oct 10, 2022 childhood obesity, childhood obesity diet, childhood obesity exercise, childhood obesity tips, obesity in children Please Share It Obesity in Children : ప్రపంచ జనాభాలో గణనీయమైన విభాగాన్ని ప్రభావితం చేసిన అత్యంత విస్తృతమైన ఆరోగ్య సమస్యలలో ఒకటి ఊబకాయం. ఇది పెద్దలను మాత్రమే ప్రభావితం చేయనందున సమస్య మరింత ఆందోళనకరంగా మారుతుంది; ఇప్పుడు పిల్లలు కూడా బాధితులుగా మారుతున్నారు. ఊబకాయం అనేది ఒకరి జీవితాన్ని నాశనం చేసే భయంకరమైన విషయం మరియు ఈ దేశంలోని పిల్లలలో భయంకరంగా పెరుగుతోంది. ఊబకాయం అనేక దీర్ఘకాలిక రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటుంది మరియు ఒకరి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇది మధుమేహం మరియు గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వంటి ఇతర హృదయ సంబంధ రుగ్మతలతో సహా ఇతర పరిస్థితులకు కారణమవుతుంది. బాల్యంలో ఊబకాయం పెరుగుతున్న దృష్ట్యా, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా యువకులను దాని నుండి రక్షించడం చాలా ముఖ్యం. మీ పిల్లలలో స్థూలకాయాన్ని నిరోధించడానికి ఈ చిట్కాలను అనుసరించండి జీవనశైలి మార్పు: మీ ల్యాప్‌టాప్‌లో చలనచిత్రాలు చూడటం లేదా మీ ఫోన్‌లో వీడియో గేమ్‌లు ఆడటం వంటి నిశ్చలమైన కార్యకలాపాలను చేయడానికి మీ సమయాన్ని తగ్గించండి. టీవీ చూడకుండా తినండి. ఫలితంగా కుటుంబ సమయం తక్కువ విలువైనదిగా మారవచ్చు. Also Read : మీ ఆందోళనను తగ్గించే 5 సమర్థవంతమైన చిట్కాలు ఆరోగ్యకరమైన ఆహారం: పిల్లలు ఎక్కువ కేలరీలు తీసుకోకుండా తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు మరియు చిక్కుళ్ళు ఎక్కువగా తినాలి. బరువు పెరగకుండా ఉండటానికి, ప్రాసెస్ చేసిన, ఆయిల్, ప్యాక్డ్ మరియు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. రెగ్యులర్ వ్యాయామం: పిల్లలు వారి రోజువారీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చడం ద్వారా అదనపు కేలరీలను బర్న్ చేయవచ్చు మరియు బలమైన ఎముకలు మరియు కండరాలను నిర్మించవచ్చు. నడక, స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ వంటి శారీరక కార్యకలాపాలలో పాల్గొనడం కూడా బాల్య ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడుతుంది. స్లీప్ రొటీన్: టైప్ 2 డయాబెటిస్, స్థూలకాయం మరియు ప్రవర్తనా రుగ్మతలతో సహా అనేక రకాల ఆరోగ్య పరిస్థితులను తగినంత నిద్రతో నివారించవచ్చు. అతను లేదా ఆమె నిద్ర లేమి లేదా తగినంత నిద్ర లేనప్పుడు ఒక యువకుడు అనారోగ్య బరువును పెంచుకునే అవకాశం ఉంది. Also Read : జుట్టు రాలడాన్ని నివారించడానికి ఈ 5 ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి మానసిక మద్దతు: మద్దతుగా మరియు ఉల్లాసంగా ఉండండి. కొంతమంది పిల్లలు తమ ఆకర్షణీయత లేదా శారీరక రూపం కారణంగా అసౌకర్యంగా మరియు ఇబ్బందిగా భావిస్తారు. బాల్యంలో ఊబకాయం పిల్లలను మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె మరియు మూత్రపిండాల సమస్యల వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అదనంగా, అధిక బరువు లేదా ఊబకాయం కారణంగా నిరాశ, ఆందోళన, ఒత్తిడి మరియు తక్కువ ఆత్మగౌరవం ఏర్పడవచ్చు.
దురాభిమానుల పైత్యానికి బ‌లైపోతోంది… మీరా చోప్రా. ‘ఎన్టీఆర్ గురించి నాకు తెలీదు’ అన్న పాపానికి… సోష‌ల్ మీడియా సాక్షిగా, ఎన్టీఆర్ దురాభిమానుల చేతుల్లో మీరా ప‌రువు అభాసుపాలైపోతోంది. దీనిపై స్పందించాల‌ని ఎన్టీఆర్‌ని మీరా కోరినా.. ఫ‌లితం లేకుండా పోయింది. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం మీరాకు మ‌ద్ద‌తు అనూహ్యంగా పెరుగుతోంది. నెటిజ‌న్లు.. మీరాకు వెన్నుద‌న్నుగా నిలిచారు. కానీ ఇలాంటి స‌మ‌యంలో మాట్లాడాల్సిన క‌థానాయిక‌లే ఇంకా నోరు మెద‌ప‌డం లేదు. సాధార‌ణంగా మ‌హిళ‌ల‌పై అకృత్యాలు, అన్యాయాలు జ‌రిగిన‌ప్పుడు ట్విట్ట‌ర్లు బెంబేలెత్తేలా, సోష‌ల్ మీడియా.. హ‌డ‌లిపోయేలా పోస్టింగులు చేస్తుంటారు క‌థానాయిక‌లు. మ‌రి.. మీరా చోప్రా విష‌యంలో వాళ్లెందుకు నోరు మెద‌ప‌డం లేదో అర్థం కావ‌డం లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే, ఎన్టీఆర్ తోపెట్టుకున్న‌ట్టే అని భ‌య‌ప‌డుతున్నారా? లేదంటే ‘మా వ‌ర‌కూ రాలేదు క‌దా’ అని లైట్ తీసుకుంటున్నారా? మీరా ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్‌. అదే ఫామ్ లో ఉన్న హీరోయిన్‌ని ఎవ‌రైనా ఏమైనా అంటే… ఈ గ్యాంగ్ అంతా ఊరుకునేదా? ఏదో విధంగా… స‌పోర్ట్ చేసేవారు క‌దా. ఆ మ‌ద్ద‌తే మీరా చోప్రాకి ఇప్పుడు క‌రువైంది. ఇలాంటి విష‌యాల్లో చురుగ్గా స్పందించే స‌మంత లాంటి వాళ్లు కూడా మౌనంగా ఉండ‌డం… ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. మునుముందైనా ఎవ‌రైనా నోరు విప్పుతారేమో చూడాలి.
BMW తన M పనితీరు బ్రాండ్ యొక్క 50 సంవత్సరాల జ్ఞాపకార్థం భారతదేశంలో మరో ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. తాజాది, 530i M స్పోర్ట్-ఆధారిత 50 జహ్రే M ఎడిషన్ ధర రూ. 67.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) – స్టాండర్డ్ M స్పోర్ట్ కంటే దాదాపు రూ. 3 లక్షలు ఎక్కువ. కంపెనీ ఆన్‌లైన్ రిటైల్ ఛానెల్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉంది, జహ్రే ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందించబడుతోంది మరియు ఈ సంవత్సరం భారతదేశంలో ప్రారంభించబోతున్న 10 ప్రత్యేక ఎడిషన్ M మరియు M స్పోర్ట్ మోడళ్లలో ఇది ఒకటి. స్టాండర్డ్ 530i M స్పోర్ట్‌తో పోలిస్తే, జహ్రే ఎడిషన్ గ్రిల్, వీల్స్, ఎగ్జాస్ట్ ఫినిషర్స్ మరియు విండో ట్రిమ్‌లకు బ్లాక్ ఫినిషింగ్‌లతో ముదురు బాహ్య కాస్మెటిక్ ప్యాకేజీని పొందుతుంది. బోనెట్, బూట్ లిడ్ మరియు వీల్ క్యాప్‌లు కొత్త సెలబ్రేటరీ BMW M రౌండల్‌ను ధరిస్తాయి, అయితే బ్రేక్ కాలిపర్‌లు ఇప్పుడు నీలం స్థానంలో ఎరుపు రంగులో ఉన్నాయి. జహ్రే ఎడిషన్ కూడా స్టాండర్డ్‌గా షాడోలైన్ ప్యాకేజీని పొందుతుంది. హెడ్‌ల్యాంప్‌లు అడాప్టివ్ LED ల నుండి 530i M స్పోర్ట్ నుండి BMW యొక్క లేజర్‌లైట్ యూనిట్‌లకు అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. క్యాబిన్ లోపల స్టాండర్డ్ M స్పోర్ట్‌లో ఉన్నట్లే ఉంటుంది, సెంటర్ కన్సోల్ మరియు పియానో ​​బ్లాక్ ట్రిమ్ ఫినిషర్‌లపై వివిధ నియంత్రణల కోసం సిరామిక్ బ్లాక్ సరౌండ్‌లకు కీలకమైన తేడాలు వస్తాయి. ప్రామాణిక 530i M స్పోర్ట్ మూడు అప్హోల్స్టరీ రంగుల ఎంపికను పొందుతుంది, జహ్రే ఎడిషన్ కేవలం నలుపు రంగుకు మాత్రమే పరిమితం చేయబడింది. ఎక్విప్‌మెంట్ పరంగా, లేజర్‌లైట్ హెడ్‌ల్యాంప్‌ల జోడింపు కోసం ఆదా, ఎక్విప్‌మెంట్ లిస్ట్ సాధారణ M స్పోర్ట్ కంటే దాదాపుగా మారలేదు. 530i 50 జహ్రే M ఎడిషన్‌ను శక్తివంతం చేయడం అనేది తెలిసిన 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 248 bhp మరియు 350 Nm. మిల్లు ప్రామాణికంగా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.
Alarm Bed: మీరు ఉద‌యాన్నే నిద్ర లేవాలంటే మీకు చక్క‌ని ప‌రిష్కారం దొరికిందం డోయ్‌..అదే అలారం బెడ్‌తోని. మీరు కూడా అలారం బెడ్‌ను త‌యారు చేయించుకోండి. ఇక స‌మ‌యానికే నిద్ర లేచి ఆఫీసుకు వెళ్లొచ్చు. మ‌నం ప్ర‌తిరోజూ నిద్ర లేవాలంటే కాస్త బ‌ద్ధ‌కిస్తూనే ఉంటాం!. అదీ పిల్ల‌లైతే ఇక వారి గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఉద‌యం సుప్ర‌భాతం పాడిన‌ట్టు ప్ర‌తిరోజూ వారిని నిద్ర లేప‌డానికి అమ్మా, నాన్న‌, లేక ఇత‌ర కుటుంబ స‌భ్యులు ప‌డే ఇబ్బంది అంతా ఇంతా కాదు. నాన్న తెల్లారింది లేమ్మా! అన‌గానే హా! అంటాం…మ‌ళ్లీ నిద్ర‌లోకి జారుకుంటుంటాం!. అలా నిద్ర‌లోకి జారుకోగానే మ‌ళ్లీ పిలుపు వ‌స్తుంది. ఈ సారి మ‌ళ్లీ దుప్ప‌టి త‌న్ని మ‌రీ ప‌డుకుంటాం. ఇలా ఒక‌టి రెండు, రెండుకు మూడు పోయి 10 పిలుపులు వ‌చ్చి చివ‌ర‌కు స‌హ‌నం కోల్పోయిన అమ్మ‌, నాన్న తిట్ల దండ‌కం మొద‌లు పెడితే కానీ అప్పుడు మెలుకువ రాదు. ఇదంతా మ‌న ఇళ్ల‌ల్లో ప్ర‌తిరోజూ జ‌రిగే నిత్యం మొద‌టి కార్య‌క్ర‌మం. అయితే కొంద‌రు మాత్రం ఆఫీసుకు లేటుగా వెళ్ల‌డంతో బాస్‌లు చివాట్లు పెడ‌తారు. ఈ బాధ భ‌రించ‌లేక ఇక అలారం పెట్టుకుంటుంటారు. రేపు ఎలాగైనా 5 గంట‌ల‌కు నిద్ర లేవాల‌ని ప‌డుకునే ముందు అనుకుంటారు. తెల్లారేస‌రికి అలారం మోగితే దానిని నొక్కి ప‌క్క‌న పెడ‌తారు. ఆ త‌ర్వాత హ‌డావుడి చేస్తారు. మ‌ళ్లీ ప్ర‌తిరోజూ లాగానే ఉరుకులు ప‌రుగుల జీవితం. గ‌తంలో అలారం గ‌డియారాలు కొనుకున్నే వారు. ఇప్పుడు చేతిలో యాండ్రాయిడ్ ఫోన్ ఉండ‌టంతో అందులోనే అలారం(Alarm Bed) పెట్టుకుంటున్నారు. కానీ రాత్రి అంతా చాటింగ్‌లు, సోష‌ల్ మీడియాలో స‌మ‌యం గ‌డిపి ప‌డుకునే ముందు ఫోన్‌ను సైలెంట్ పెట్టి నిద్ర‌పోతారు. ఉద‌యాన్నే ఆల‌స్యం కావ‌డంతో ఆ ప‌రుగుల జీవితం మామూలుగా చెప్ప‌న‌క్క‌ర్లేద‌నుకోండి. Alarm Bed: ఎత్తెత్తి ప‌డ‌వేసే అలారం బెడ్‌ అయితే ఉద‌యాన్నే నిద్ర లేవ‌డానికి ఇన్ని పాట్లు ప‌డే వారికి ఒక అద్బుతమైన అవ‌కాశం వ‌చ్చింద‌డోయ్‌. అదే అలారం బెడ్‌. ఎప్పుడూ అలారం చెవి ప‌క్క‌న మోగుతుంటే మ‌న‌కు ఏమీ ప‌ట్ట‌న‌ట్టు బెడ్ మీద హాయిగా నిద్ర‌పోతాం క‌దా!. కానీ ఇప్పుడు ఏకంగా బెడ్‌కు అలారం ఉంటే, ఇక నిద్ర ప‌రార్ అయిన‌ట్టే ఉంటుంది. బెడ్‌కు అలారం ఉంటే మ‌న‌ల్ని ఎత్తెత్తి లేచే వ‌ర‌కు అలానే చేస్తుంది. ఆ ఎత్తి ప‌డేయ‌డంతో మ‌న‌కు నిద్ర పోతుంది. ఇక నిద్ర పోవ‌డానికి ఆ బెడ్ ఏమాత్రం అంగీక‌రించ‌దు. ఈ ఐడియా ఎవ‌ర‌దో కానీ ఇలా త‌యారు చేశారు అలారం బెడ్‌ను. Alarm bed😂 pic.twitter.com/zNFeu2gx3R — Tansu YEĞEN (@TansuYegen) September 8, 2022 ఈ అలారం బెడ్ వీడియో ఒక‌టి నెటింట్లో వైర‌ల్ అవుతుంది. అబ్బ‌..ఈ అలారం బెడ్, నాకు కూడా కావాల‌ని అంటున్నారు జ‌నాలు. ఈ అలారం బెడ్ వీడియోలో పిల్ల‌వాడిని ఎత్తెత్తి ఎగిరి ప‌డేయంతో పిల్ల‌వాడు నిద్ర‌నుండి మేల్కొంటాడు. వీడియో చూస్తే నిజంగా నిద్ర కూడా మాయ‌మైపోయినంత ప‌నైంది. మ‌రి ప్ర‌శాంతంగా నిద్ర ప‌ట్టేవారికి ఈ అలారం బెడ్ (Alarm Bed) పెద్ద స‌వాల్‌గానే మారుతుంది మ‌రీ!.
ఇంటికి తాళం వేసి అందరూ ఫంక్షన్‌కు వెళ్లారు. సరిగ్గా గంటలోనే తిరిగి వచ్చారు. ఈ లోపే ఇల్లును గుల్ల చేశాడో ఘరానా దొంగ. మొత్తం 26 తులాల.. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 26 తులాల బంగారం సహా.. 13.10లక్షల సొత్తు చోరీ చోరీ సొత్తుతో కొత్త ఫోన్‌, వస్త్రాల కొనుగోలు ఘరానా దొంగ అరెస్ట్‌ హైదరాబాద్‌ సిటీ: ఇంటికి తాళం వేసి అందరూ ఫంక్షన్‌కు వెళ్లారు. సరిగ్గా గంటలోనే తిరిగి వచ్చారు. ఈ లోపే ఇల్లును గుల్ల చేశాడో ఘరానా దొంగ. మొత్తం 26 తులాల బంగారం, కొంత నగదు చోరీ చేశాడు. చోరీ సొత్తుతో కొత్త ఫోన్‌, వస్త్రాలు కొనుగోలు చేశాడు. సమాచారం అందుకున్న మీర్‌పేట పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేవలం 4 గంటల్లోనే నిందితుడి ఆటకట్టించారు. చోరీ చేసిన సొత్తును వందశాతం రికవరీ చేశారు. ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, రాచకొండ క్రైమ్స్‌ డీసీపీ యాదగిరి, ఏసీపీలు పురుషోత్తంరెడ్డి, శ్రీధర్‌రెడ్డిలతో కలిసి వివరాలు వెల్లడించారు. బడంగ్‌పేట సత్యనారాయణపురానికి చెందిన కట్టెకోల రత్నకుమార్‌ రిటైర్డ్‌ ఉద్యోగి. అదే కాలనీలో తన బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్‌కు బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. గంటలో ఫంక్షన్‌ ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి తాళం పగులగొట్టిన దొంగలు లోపలికి ప్రవేశించి, ఇంట్లో ఉన్న కాసులపేరు, నెక్లెస్‌, చేతి గాజులు, చైన్‌ సహా మొత్తం 26 తులాల బంగారం, 2.5 తులాల వెండి, కొంత నగదు దోచేశారు. దాంతో వెంటనే బాధితులు మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ద్వారా.. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి అతను పాత నేరస్థుడనే అంచనాకు వచ్చారు. మీర్‌పేట పాత విలేజ్‌కు చెందిన కొడిదెల సుఽధాకర్‌గా పోలీసులు అనుమానించి అతడి కోసం గాలించారు. చోరీచేసిన సొత్తులోని నగదుతో కొత్త సెల్‌ఫోన్‌ కొనుగోలు చేశాడు. వస్త్రాలు కొనేందుకు షాపింగ్‌కు వెళ్లినట్లు గుర్తించి అతన్ని పట్టుకున్నారు. చోరీకి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. చోరీ చేసిన మొత్తం సొత్తును పోలీసులు రికవరీ చేశారు. తల్లిని చంపి జైలుకు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా రేవెళ్ల మండలం గుడిపల్లికి చెందిన సుధాకర్‌ పాతనేరస్థుడు. ఇతనిపై ఇప్పటికే నాగర్‌కర్నూల్‌, మీర్‌పేట, ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పలు కేసులున్నాయి. గతేడాది తల్లిని చంపిన కేసులో జైలుకు వెళ్లాడు. చర్లపల్లి జైల్లో ఉన్న సుధాకర్‌ ఈనెల 7న బెయిల్‌పై విడుదలయ్యాడు. బయటకు వచ్చిన 20 రోజుల్లోనే తాళం వేసిన ఇంటిని గుల్ల చేసి మీర్‌పేట పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న మీర్‌పేట పోలీసులను సీపీ అభినందించినట్లు డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడించారు. సిబ్బందికి రివార్డులు అందజేశారు. చోరీ చేసిన ఘరానా దొంగను కేవలం 4 గంటల్లోనే పట్టుకుని, సొత్తును స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులకు బాధితులు కట్టెకోల రత్నాకర్‌ రావు, ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Tirumala, 05 April 2021: A devotee from Chennai Shri. K Jayaramanan, Chairman of Autotech Industries Pvt. Ltd. has donated Rs.74 lakhs to the SVBC trust. He handed over the cheque for the same amount to TTD Additional EO Sri AV Dharma Reddy at the Ranganayakula Mandapam in Srivari temple on Monday morning. ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.74 ల‌క్ష‌లు విరాళం తిరుమ‌ల‌, 2021 ఏప్రిల్ 05: చెన్నైకి చెందిన ఆటోటెక్ ఇండ‌స్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ త‌ర‌పున ఆ సంస్థ ఛైర్మ‌న్ శ్రీ కె.ఎస్‌.జ‌య‌ర‌మణ‌న్‌ రూ.74 ల‌క్ష‌లు శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌కు విరాళంగా అందించారు. తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో సోమ‌వారం ఉద‌యం ఈ విరాళం చెక్కుల‌ను దాత‌లు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డికి అందచేశారు. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. « ANNAMAIAH SAPTHAGIRI SANKIRTAN GOSTI GANAM ON APRIL 08 _ ఏప్రిల్ 8న తిరుమలలో అన్నమయ్య సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం » BABU JAGJEEVAN RAM JAYANTHI OBSERVED _ డా|| బాబు జగ్జీవన్‌రామ్ అడుగుజాడ‌ల్లో న‌డ‌వాలి : టిటిడి జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి
కళారంగంలో చిత్ర-విచిత్రమైన ప్రయోగాలు, ప్రక్రియలు, ప్రయత్నాలు చేస్తున్నవారి సంఖ్య రాను రాను పెరుగుతుంది. అలాగే ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు, గుర్తించి రికార్డ్స్ ఇచ్చేందుకు చాలా సంస్థలు వచ్చాయి. అందరు కుడి చేత్తో డ్రాయింగ్-పేయింటింగ్ చేస్తే, ఎడమచేత్తో చేసేవాళ్ళు కొందరు, చేతులే లేనివాళ్లు కాళ్ళతో చేస్తారు కొందరూ….. సత్యవోలు రాంబాబు గారు కూడా అదే కోవలోకి వస్తారు. ఈయన పెన్సిల్ ను వాడరు, కుంచెలు వాడరు. చివరకి కనీసం తన చేతులను కూడా ఉపయోగించరు. కానీ చిత్రాలు తయారవుతాయి. అదేలా….? విచిత్రం ఏమిటంటే “ముక్కు”తో పేయింటింగ్ చేయడం. స్కూలుకు వెళ్లే వయసులోనే చిత్రకళపై ఆసక్తి పెంచుకున్నారు. అదే స్కూల్ లోని గురువు గారి ప్రేరణతో మరింత శ్రద్ధ పెరిగింది. పాఠశాల స్థాయిలోనే డ్రాయింగ్ లో లోయర్, హైయ్యర్ పూర్తి చేశారు. కుంచెతో ఎన్నో చిత్రాల్ని వేసారు. రెండు పదుల వయసులోనే రాష్ట్ర, జాతీయ స్థాయి బహుమతులను గెలుచుకున్నారు. ఇంటర్ వరకూ చదువు సాఫీగానే సాగినా, డిగ్రీ చదువు భారమని భావించి, తనకు తెలిసిన కళతోనే జీవన ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. రెండు మూడేళ్లు నెట్టుకొచ్చారు. కూకట్ పల్లిలో వృత్తి మరియు ప్రవృత్తిగా “సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్” పేరుతో ఆర్ట్ స్కూల్ ను ప్రారంభించి ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ, ఆగిపోయిన చదువును పూర్తి చేసారు. రాంబాబు గారికి, చిన్నప్పటి నుండి కళ అంటే ఎంతో ఇష్టంతో డ్రాయింగ్, పేయింటింగ్ నేర్చుకున్నారు. ఈ కళారంగంలోనే టీచింగ్ లో కూడా అభివృద్ధి చేసుకున్నారు. చాలా మందిలా, ఓ కళాకారుడిగా కాకుండా వినూత్నమైన ఆలోచనతో, ఏడేళ్ల పాటు కఠోరమైన పట్టుదలతో “ముక్కు”తో చిత్రాలు గీయడంలో నైపుణ్యం సాధించారు. ఇప్పటి వరకు ముక్కుతో గీసిన పేయింటింగ్స్ ల సంఖ్య వందకు దాటిపోయాయి. రాంబాబు గారి ప్రతిభను గుర్తించిన బీబీసీ వార్తాసంస్థ ఇతని నాసికా చిత్రాలను ప్రసారం చేసింది. దేశవ్యాప్తంగా పలు నగరాలలో ప్రజల సమక్షంలో నాసికా చిత్రాలు గీసిన రాంబాబు గారు, విజయవాడ లో ప్రముఖ కార్టూనిస్టు జయదేవ్ గారి సమక్షంలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం బొమ్మను చిత్రించి ఔరా అనిపించుకున్నారు. ఆ తర్వాత సినీ నటుడు చిరంజీవి గారి ముఖ చిత్రాన్ని ముక్కుతో చిత్రించి, ఆ చిత్రాన్ని చిరంజీవి గారికే బహుకరించారు సత్యవోలు రాంబాబు. ఏ కళైనా సామాజిక సందేశానికి దోహదపడాలే తప్ప కాసులు దండుకునేది కాకూడదు అనే రాంబాబు ముక్కుతో చిత్రాలు గీయడంమామూలు విషయంకాదంటున్నాడు. ఇలాంటి ప్రక్రియలో శారీర శ్రమ అధికమని, రెండు కళ్లు ముక్కు చివరి అంచుపైనే కేంద్రీకరించాలి. ఈ ప్రయత్నంలో కళ్లు బరువెక్కుతాయి.అప్పుడప్పుడు పార్శ్వనొప్పి వస్తుంటుంది. అంతేకాదు ముక్కు పై చర్మం కోతకు గురవుతుంది. అని ఇబ్బందుల్ని వివరించారు. కానీ ఈ కష్టపడటంలో ఆనందముంటుందనీ, గీసిన చిత్రాలు చూసుకున్నాక మనసులో అంతులేని సంతృప్తి కలుగుతుందనీ మెరిసే కళ్లతో చెబుతారు. అలాగే నా ముఖచిత్రం కూడా ముక్కుతో బ్లాక్ రంగుతో అప్పటికప్పుడు చిత్రించారు రాంబాబు గారు. సోలో ఎగ్జిబిషన్స్ దాదాపుగా ఇరవైకు పైగా ఏర్పాటు చేసారు. వర్క్ షాపులు కూడా 15-20 దాకా ఏర్పాటు చేసారు. మనకు నచ్చిన రంగంలో రాణించడంలోను, ఎంత మందికి వీలయితే అంత మందికి కళాసేవ చేయ్యాలని వుందంటారు రాంబాబు గారు. ఇప్పటి వరకు తన దగ్గర ముప్పై వేలకు పైగానే శిక్షణ తీసుకున్నారు. ఇంకా వేల సంఖ్యలో చిత్రకళతోపాటు, బి.ఆర్క్., నేషనల్ ఇనిస్టిట్యూట్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, డ్రాయింగ్ మరియు క్రాఫ్ట్ టీచర్ ట్రయినింగ్ మొదలగు కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. చివరిగా ‘ఏ రంగంలోనైనా యువత చాలా ముందడుగులో వుంటున్నారు. వివిధ రంగాలతోపాటు ఫైనార్ట్స్, ఫ్యాషన్, ఆర్కిటెక్ట్, యానిమేషన్ మొదలగు రంగాలలో పిల్లలకు తల్లి, తండ్రులు ప్రోత్సహించితే తప్పకుండ రాణిస్తారని’ వివరించారు చిత్రకారుడు రాంబాబు.
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీల్ చరిత్ర లో మోస్ట్ సక్సెసఫుల్ టీం. అది 2022 ఐపీల్ ముందు వరకు చరిత్ర. నాలుగు సార్లు ఈ ట్రోఫీ ముద్దాడిన చెన్నై జట్టు.. ఆరంభం నుంచి కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ చేతుల్లోనే ఉంది. గతేడాది ఆరంభంలో రవీంద్ర జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినా.. అతను విఫలం అవడంతో మరోసారి ధోనీ చేతికే పగ్గాలు అందించాల్సి వచ్చింది. Video Advertisement అయితే ఐపీఎల్ 2023 తర్వాత ధోని.. ఈ లీగ్‌ నుంచి పూర్తిగా తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్ చేసే అవకాశం కనిపిస్తోంది. దేశవాళీల్లో అతను మహారాష్ట్ర కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రుతురాజ్ కాదు అనుకుంటే కెప్టెన్ కోసం వేలంలో వెతుక్కోక తప్పదు. ఈ క్రమంలో ధోనీ పాత్రకు సరిపోయే ముగ్గురు ఆటగాళ్లు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యం లో.. ధోని తర్వాత చెన్నై ని అంత సమర్ధవంతం గా నడిపించగలిగే ఆటగాళ్లెవరో చూద్దాం.. #1 బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌పై ప్రస్తుతం అన్ని ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. వన్డేలకు ఇటీవలే వీడ్కోలు పలికిన ఈ స్టార్ ప్లేయర్.. టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో ఇంగ్లండ్ తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. జట్టును ముందుండి నడిపించడానికి ఇష్టపడే స్టోక్స్.. ఇంగ్లండ్ టెస్టు జట్టును ఎలా మార్చేశాడో అందరికీ తెలిసిందే. #2 జేసన్ హోల్డర్ అత్యంత చిన్న వయసులోనే వెస్టిండీస్ సారధిగా బాధ్యతలు చేపట్టి.. బడా బడా స్టార్లు లేని జట్టుతో కూడా డీసెంట్ ప్రదర్శన చేసిన కెప్టెన్ జేసన్ హోల్డర్. మైదానంలో ఎంత టెన్షన్ ఉన్నా ప్రశాంతంగా ఉండే అతన్ని చెన్నై సారధిగా నియమించినా ధోనీ పాత్రను పోషించే అవకాశం ఉంది. #3 డ్వేన్ బ్రావో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని టీ20 లీగుల్లో రాణించిన డ్వేన్ బ్రావో.. చాలా ఏళ్లుగా చెన్నైతో కలిసి ఉన్నాడు. ఇతను కూడా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కావడం గమనార్హం. ధోనీకి మంచి స్నేహితుడైన తను కూడా తన చుట్టూ జట్టును నిర్మించగల సమర్థుడే. అయితే 39 ఏళ్ల వయసు ఉండటం బ్రావో మైనస్. కానీ రుతురాజ్‌ను కెప్టెన్‌గా మలిచేందుకు కొంత సమయం కావాలని అనుకుంటే మాత్రం బ్రావోనే బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు. భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించిన మిస్టర్ కూల్ ధోని .. అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోని.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ధోని అనుభవాన్ని టీమిండియా కోసం ఉపయోగించుకోవాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ధోని మెంటార్ లేదా కోచింగ్‌లో బలమైన టీ20 జట్టును తయారు చేయాలని చూస్తోంది. Recent Posts “పోలో టీం” నుండి… లక్షల విలువ చేసే “వాచ్” వరకు… మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్” దగ్గర ఉన్న 9 ఖరీదైన వస్తువులు..!
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా సినిమా విడుదలను మరోమారు వాయిదా వేస్తున్నట్లు ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతలు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉన్న మరో పాన్ ఇండియా ఎపిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ విడుదల కూడా వాయిదా పడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. Learn more ఈ మేరకు సోషల్ మీడియాలో ‘రాధేశ్యామ్’ ట్రెండ్ అవుతోంది కూడా. ‘రాధే శ్యామ్’ విడుదల వాయిదా పడిందని.. ముందుగా ప్రకటించినట్లుగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా Learn more ఈ చిత్రం వెండితెర పైకి రాదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ పరిస్థితులే సినిమా వాయిదా వేయడానికి కారణమని అంటున్నారు. Learn more అయితే… అదే సమయంలో ఈ సినిమా జనవరి 14న థియేటర్లలోకి రానుందని ‘రాధే శ్యామ్’ నిర్మాతలు ధృవీకరిస్తున్నారు. ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా మేకర్స్ మాత్రం సినిమా అనుకున్న తేదీకే ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అంటూ.. Learn more పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేకర్స్ ప్రమోషనల్ ప్రచారాన్ని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. సినిమా విడుదలకు ఇంకా ఎక్కువ లేదు. కేవలం 10 రోజులే ఉంది. Learn more కానీ మేకర్స్ ఏమాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. అయితే… టాలీవుడ్ లోని చిన్న సినిమాలన్నీ ‘రాధేశ్యామ్’ సినిమా విడుదల తేదీన సైతం వరుసగా రిలీజ్ కు సిద్ధమవ్వడం కూడా ఈ రూమర్స్ కు ఒక కారణం అని చెప్పొచ్చు. Learn more మరి ఈ రూమర్స్ కు చెక్ పెట్టే విధంగా మేకర్స్ ఏదన్నా ప్రమోషనల్ కంటెంట్ ను విడుదల చేస్తారా..? లేదంటే సినిమా విడుదలపై క్లారిటీ ఇస్తారా..? అనేది చూడాలి.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏడు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు.. 12 డిమాండ్ల పరిష్కారానికి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్ధులు తేల్చి చెబుతున్నారు. డిమాండ్లపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. గత ఆరేళ్లుగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఉన్న సమస్యలు పరిష్కరించలేదని స్టూడెంట్స్ అంటున్నారు. చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేదని వాపోయారు. చివరికి క్యాంపస్ లో ఉన్న దాదాపు 9 వేల మంది విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. ఇప్పటికే ట్రిపుల్‌ఐటీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మ‌రోవైపు…విద్యార్ధుల డిమాండ్ సానుకూలంగా స్పందించే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సోమ‌వారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి అధికారులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న ఆందోళనలను విరమింపచేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. స‌బితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వైస్ ఛాన్స్‌లర్ నియమాకం కోసం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ వేసే అవకాశం ఉందనే తెలుస్తోంది. ఈ రోజు రాత్రి లోపు ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది. Basara IIITBasara IIIT IssueBasara IIIT Students ProblemsBasara IIIT Sudents Protesteducation departmentminister sabitha indra reddyShare
Sarpanchs protests for Panchayat bills : వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, చెత్త వేరు చేసే షెడ్లు, క్రీడా ప్రాంగణాలు, రైతు వేదికలు! ఇలా పల్లెల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఒత్తిడితో ముందుగా నిధులు రాకపోయినా సర్పంచ్‌లు వాటిని పూర్తి చేశారు. కానీ చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లులు రాక సర్పంచుల గగ్గోలు Sarpanchs protests for Panchayat bills : గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా జనం వెళ్లేది సర్పంచ్ దగ్గరికే. పల్లెల్లో ప్రజల అవసరాలు తీరాలన్నా, ప్రగతి బాటలు వేయాలన్న సర్పంచ్‌లదే కీలక భూమిక. అలాంటి గ్రామ సర్పంచ్‌లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల బిల్లులు చెల్లించాలంటూ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు కొందరు సర్పంచ్‌లు ధర్నా చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు, చెత్తను వేరు చేసే షెడ్లు, డంపింగ్ యార్డులు, హరితహారం, ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. చాలాచోట్ల సర్పంచ్‌లే ముందుండి పనులు పూర్తి చేయించారు. ముందుగా నిధులు రాకపోయినా తప్పకుండా వస్తాయన్న నమ్మకంతో అప్పులు చేసి పనుల్ని పూర్తి చేశారు. కొన్నిచోట్ల సర్పంచ్‌లు రైతు వేదికల నిర్మాణాలను సైతం స్వయంగా చేపట్టారు. వచ్చే నిధుల్ని అంచనా వేసుకుని సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం పూర్తి చేశారు. కానీ ఆయా శాఖల నుంచి బిల్లులు సకాలంలో రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయే తప్ప సర్కారు నుంచి బిల్లులు రావడం లేదని సర్పంచులు వాపోయారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ఇతర పనుల కోసం కేంద్రం, రాష్ట్రం సమానంగా ప్రతి గ్రామానికి జనాభా ప్రాతిపదికన ప్రతి నెలా నిధులు విడుదల చేయాలి. అలాంటి నిధులు కేంద్రం నుంచి 8 నెలలుగా, రాష్ట్రం నుంచి 4 నెలలుగా అందడం లేదని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ నిధుల నుంచి ట్రాక్టర్‌కు నెలసరి వాయిదాలు, మల్టీ పర్పస్‌ కార్మికులకు వేతనాలు, కరెంటు బిల్లులు ఇతర నిర్వహణ ఖర్చుల్ని చెల్లించాల్సి ఉంటుంది. బిల్లులు సకాలంలో రాకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో చేతి నుంచి ఖర్చు చేస్తున్నామని సర్పంచ్‌లు చెబుతున్నారు. మూడేళ్ల వరకు క్రమం తప్పకుండా నిధులు అందేవని.. ప్రస్తుతం నిధుల కొరత కారణంగా నిర్వహణ భారంగా మారిందని వాపోతున్నారు. దీనికి తోడు ఉపాధి హామీ పోర్టల్‌లో మార్పుల కారణంగా గతంలో చేపట్టిన అనేక రకాల పనుల్ని ప్రస్తుతం చేపట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించడంతోపాటు, గ్రామాలకు రావాల్సిన నిధుల్ని సకాలంలో అందేలా చూడాలని సర్పంచ్‌లు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
రాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా కనీస ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్న తరుణంలో ఈ చల్లదనాన్ని ఆశ్రయించి జీవించే ‘స్వైన్‌ఫ్లూ’ పులి రాష్ట్రంపై పంజా విసిరింది. స్వైన్‌ఫ్లూ అనేది ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ కారణంగా వస్తుంది. చలి వాతావరణంలో ఇది ఎక్కువకాలం జీవించగలుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగితే ఈ వైరస్‌ జీవించజాలదు. రోజురోజుకు స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోందని, అనేకమంది దీనికి గురవుతున్నారన్న సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టింది. స్వైన్‌ఫ్లూపై సమరశంఖాన్ని పూరించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వయంగా రంగంలోకి దిగి, ఉన్నతస్థాయి సమావేశం జరిపి ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు, ఇప్పటికే వ్యాధిబారిన పడినవారికి తక్షణ చికిత్స అందించేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి మోదీతోను, ఇతర కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సంప్రదించి, వెనువెంటనే కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించే ఏర్పాటు చేశారు. స్వైన్‌ఫ్లూ మందులు అన్ని జిల్లా ఆస్పత్రులకు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో అందుబాటులోకి తెచ్చారు. దవాఖానాల్లో ప్రత్యేక వార్డులు, సదుపాయాలు, ప్రత్యేక క్యాంపుల ఏర్పాటువంటి చర్యలు చేపట్టారు. కరపత్రాలు, పోస్టర్లద్వారా ప్రజలలో అవగాహన పెంచుతోంది. ప్రతి జిల్లాకు ఓ ఐ.ఏ.ఎస్‌. అధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా నియమించి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సి.ఎం. తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా స్వైన్‌ఫ్లూకి గురైనవారికి ఆరోగ్యశ్రీ పథకంక్రింద ఉచితంగా చికిత్స అందించే ఏర్పాటు చేశారు. స్వైన్‌ఫ్లూ ప్రాణాంతక వైరస్‌కాదని, అయితే నిర్లక్ష్యంచేస్తే ప్రమాదకరమని వైద్య నిపుణులు అంటున్నారు. పిల్లలు, వయోవృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంవల్ల ఈ వైరస్‌ వారిపై తేలికగా దాడి చేస్తుంది. జ్వరం, జలుబు, ముక్కుదిబ్బడ, తలనొప్పి, గొంతు, ఒళ్ళునొప్పులు, దగ్గు తదితర వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీనితోపాటు ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సాధ్యమైనంతవరకూ జన సామర్ధ్యం ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండటం వంటి చర్యల ద్వారా స్వైన్‌ఫ్లూ బారినపడకుండా చూసుకోవచ్చు. ఈ వైరస్‌ కట్టడికి ప్రభుత్వం సమర్థవంతంగా అన్నిచర్యలు చేపట్టినందున ప్రజలు ఆందోళన చెందనవసరంలేదు.అయితే, ఇక్కడ మనం ఓ విషయం గ్రహించాలి. ఏదైనా వ్యాధి సోకినప్పుడో, వైరస్‌ విజృంభించినప్పుడో కాక, ఎల్లప్పుడూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అవసరం. చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పడెయ్యడం, బహిరంగ మూత్ర విసర్జన వంటి చర్యలు అరికట్టడం ఆరోగ్యకర సమాజానికి ఎంతో అవసరం.
సుఖం కోసం ఎన్నో అడ్డదారులు తొక్కి ఎంత ఘోరానికి అయినా పాల్పడుతున్నారు .అక్రమ సంబంధాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు .. ఇద్దరు ప్రియులతో వ్యవహారం సాగినంత కాలం సాగించి అడ్డు వస్తున్నాడని ఇంకో ప్రియుడిని వదిలేంచేందుకు ఒక ప్రియుడితో కలిసి వ్యూహం రచించింది ఒక వగలాడి.. Video Advertisement కడప జిల్లా ముద్దునూరు మండలం బందలకుంట గ్రామవాసి అయినా నాగేష్ భావన నిర్మాణ కార్మికుడు .ఇతనితో పాటు ఎర్రగుంట్ల మండలం చిలమకూరు గ్రామానికి చెందిన వరలక్ష్మి కూడా ఆ భావన నిర్మాణ పనులకు వెళ్ళేది . బెల్దేరి పనులు వీరిద్దరూ కలిసి చేస్తుండేవారు ..ఒకే చోట పనిచేస్తుండడంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది ..ఈ నేపథ్యంలో వీరి వ్యహవరం చాలాకాలం సాగింది . కాగా ఈమధ్య కాలంలో వరలక్ష్మి నాగేష్ ను కొంచెం దూరం పెట్టసాగింది ..దింతో అనుమానం వచ్చిన నాగేష్ వరలక్ష్మిని కొంచెం గట్టిగానే నిలదీసాడు ..నిజానికి నాగేష్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తునే వరలక్ష్మి ముద్దునూరు లోని కొలవలి గ్రామానికి చెందిన గంగాధర్ తో కూడా అక్రమ సంబంధం పెట్టుకొంది. Also Read >>శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగించింది వరలక్ష్మి .ఈ నేపథ్యంలో తనను దూరం పెడుతుండడంతో తరుచు నిలదీసేవాడు నాగేష్ ..ఎప్పటికప్పుడు తనకి సమాధానం చెప్పకుండా వ్యహారాన్ని దాటివేసేది వరలక్ష్మి ..దింతో ఎలాగైనా నాగేష్ అడ్డుతొలగించుకోవాలని గంగాధర్ తో కలిసి పథకం రచించింది వరలక్ష్మి .తనపై కోపం పెంచుకున్న నాగేష్ పై తియ్యటి వల విసిరింది .. మార్చ్ 27 న ..నేను కడపలో ఉంటానని అక్కడ నుండి నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళు అక్కడ ఎంజాయ్ చేద్దాం అని ప్రేమగా చెప్పింది .. కడప వెళ్లిన నాగేష్ ఆమెను బైకుపై ఎక్కించుకొని పెండ్లి మర్రి దగ్గరలోని దాసరిపల్లె మామిడి తోటలోకి తీసుకోని వెళ్ళాడు ..ముందుగా అనుకున్న వ్యూహం ప్రకారం గంగాధర్ వీళ్ళని వెంబడిస్తూ వెళ్ళాడు ఏకాంతంగా ప్రదేశానికి వెళ్ళగానే గంగాధర్ వెనక నుండి వచ్చి టవల్ మెడకు బిగించగా వరలక్ష్మి కూడా దానికి సహాయం చేసి దారుణంగా నాగేష్ ను హత్య చేసింది . అనంతరం అతని వంటిమీద ఉన్న బంగారు గొలుసు ఉంగరాలు తదితర వస్తువులని తీసుకుని ఘటన స్థలం నుండి పరారయ్యారు ..మామిడి తోటలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ముద్దునూరు పోలీసులకు ఇవ్వగా పోలీస్ లు వచ్చి శవాన్ని పోస్ట్ మార్టం నిమ్మితం హాస్పిటల్ కు తరలించారు .. సంఘటన స్థలంలో ఎటువంటి ఆనవాళ్లు లేకపోవడం పైగా శరీరం మీద గాయాలు ఏమిలేకపోవడం వలన అది దారిదోపిడి దొంగల పని అయివుంటుందని మొదటగా అనుకున్నారు పోలీసులు కానీ నాగేష్ వృత్తిరీత్యా ఉన్నావారిని విచారించి వరలక్ష్మిని ఇంట్రగ్రేట్ చెయ్యగా అసలు విషయం చెప్పింది వరలక్ష్మి . నాగేష్ తో గుట్టుగా సాగేది మా సంబంధం కానీ నాగేష్ పై మోజు తీరిపోయాక గంగాధర్ తో సంబంధం పెట్టుకున్నని …అతడి మోజులో పడి నాగేష్ ను హత్య చేసానని ఒప్పుకోవడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రేమండ్ కు తరలించారు .. Also Read >>చైనా-రష్యా బోర్డర్ మూసేసిన “చైనా”..! అసలు కారణం ఇదే Recent Posts ఇటీవల జరిగిన ఒక పార్టీలో… స్టైలిష్ స్టార్ “అల్లు అర్జున్” వేసుకున్న షర్ట్‌ ధర ఎంతో తెలుసా? Mahesh Babu: స్టేజ్ పై అదరగొట్టిన గౌతమ్.. వీడియో వైరల్..! “విలాసవంతమైన బంగ్లా” నుండి… “కోట్ల ఖరీదైన కార్” వరకు.. పవర్ స్టార్ “పవన్ కళ్యాణ్” దగ్గర ఉన్న 10 ఖరీదైన వస్తువులు..!
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతంలో 19 మంది మరణానికి కారణమైన కల్తీసారా, కల్తీమద్యం అంశం సోమవారం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది.ఈ అంశంపై చర్చకు టిడిపి సభ్యులు వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్‌ అనుమతినివ్వలేదు. దీంతో టిడిపి శాసనసభ్యులు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. వాయిదా తీర్మాన కాగితాలను చించి ఆయనపైకి విసిరేసారు. టిడిపి వైఖరిని వైసిపి తప్పుపట్టింది. చర్చ జరపకుండా ప్రతిరోజు టిడిపి సభకు అడ్డుపడుతోందంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టిడిపి సభ్యుల ఆందోళనతో సభ పదే పదే వాయిదా పడింది. దానితో ఐదురుగు సభ్యులను బడ్జెట్ సమావేశాల చివరి వరకు సస్పెండ్ చేశారు. బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయులను సెస్పెన్షన్‌ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్‌ సమావేశాల చివరి వరకూ వీరిపై సస్పెన్షన్‌ విధించారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహరించాలని హితవు చెప్పారు. సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారంపై ఆయన అసెంబ్లీలో స్పందిస్తూ సహజ మరణాలపై టీడీపీ రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. మరోవంక, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాల పరామర్శకు జంగారెడ్డిగూడెం బయలుదేరి వెళ్లారు. ఒకొక్క కుటుంభంకు రూ 1 లక్ష చొప్పున పార్టీ తరపున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం రూ 25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ప్రభుత్వం వచ్చాక అందిస్తామని తెలిపారు. బడ్జెట్‌ సమావేశాల్లో అయిదవ రోజు సోమవారం సభ ప్రారంభంతోనే టిడిపి సభ్యులు నినాదాలు చేస్తూ, వాయిదా తీర్మానంపై చర్చకు డిమాండ్‌ చేశారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారాకు 18 మంది బలయ్యారని ఆరోపిస్తూ చర్చకు పట్టుబట్టి సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్‌ పోడియంను కూడా చుట్టుముట్టడంతో సభను స్పీకర్‌ కాసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టిడిపి ఆందోళన చేపట్టి సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో ప్రశ్నోత్తరాలకు మళ్లీ అంతరాయం ఏర్పడింది. కాగా, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్‌ మద్య నిషేధం అమలు చేస్తే, దానికి తూట్లు పొడిచిన చంద్రబాబు, తన పాలనలో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు పెంచారని ధ్వజమెత్తారు. ఎక్కడపడితే అక్కడ బెల్ట్‌షాప్‌లు ఏర్పాటు చేయించి, మద్యం అమ్మకాలు పెంచి, అంతులేని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇవాళ కూడా ఎల్లో మీడియా, ఈనాడు జంగారెడ్డిగూడెం ఘటనను తప్పుదారి పట్టిస్తూ, ప్రజల్లో అపోహలు కల్పించే విధంగా కథనం రాసిందని ఆరోపించారు. రామోజీరావు ఆ స్థాయికి దిగజారారని, చంద్రబాబు శవ రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న టిడిపి సభ్యులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ… శవ రాజకీయాలకు టిడిపి పేటెంట్‌గా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కించపరచాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. ఇంటింటికీ బెల్ట్‌ షాప్‌లు, పర్మిట్‌ రూమ్‌లు పెట్టి ఆనాడు దారుణంగా మద్యం అమ్మకాలు కొనసాగించారని ఆరోపించారు. నాడు ఎన్టీఆర్‌ మద్య నిషేధం అమలు చేస్తే, అధికారంలోకి రాగానే మద్యం కంపెనీలతో కుమ్మక్కై మద్య నిషేధానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. మున్సిపల్‌ శాఖ మంత్రి బత్స సత్యనారాయణ మాట్లాడుతూ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, సభలో గొడవ చేస్తున్నారని మండిపడ్డారు. చివరకు స్పీకర్‌ పోడియం వద్దకు కూడా దూసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు రోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో జంగారెడ్డిగూడెం మరణాల వార్తలు రాస్తూ, ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని దాన్ని పట్టుకుని టిడిపి శవ రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ సభలో టిడిపి చేస్తోంది ఒక డ్రామా అన్ని చెప్పారు. పక్కా ప్లాన్‌ ప్రకారం వారు ఆ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్దేశం మేరకే సభలో టిడిపి సభ్యులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని నిప్పులు చెరిగారు. సభలో గొడవ చేసి, సస్పెన్షన్‌కు గురై, బయటకు వచ్చి విమర్శలు చేసి, జంగారెడ్డిగూడెం పోవాలని టిడిపి సభ్యులు వ్యూహం పన్నారని ఆరోపించారు AP Assembly Chandrababu Naidu Jangareddygudem deaths T Sitaram TDP members suspension YS Jaganmohan Reddy
హైదరాబాద్, జూలై 8 : రావెళ్ల రాజేశ్వరి.. అలియాస్ తారా చౌదరి. సినిమాల్లో నటించాలని హైదరాబాద్‌కు వచ్చి, కొందరి చేతుల్లో మోసపోయింది. చివరకు సెక్స్‌రాకెట్ నిర్వాహకురాలిగా ఆమె బోనెక్కితే, సూత్రధారులు, లబ్ధిదారులు మాత్రం చల్లగా జారుకున్నారు. ఆ తేలుకుట్టిన దొంగల భరతం పట్టడానికే ఏబీఎన్ స్టూడియోకు వచ్చానంటున్న తారాచౌదరితో.. ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’ విశేషాలు. నమస్కారం తారాచౌదరిగారూ. అసలు తారా చౌదరి అనే పేరు ఎలా వచ్చింది? 2005లో సినీపరిశ్రమ కోసం హైదరాబాద్ వచ్చాను. అప్పుడు పరిశ్రమలో చౌదరీల డామినేషన్ ఉందని విన్నాను. కొందరు దర్శకులు, నిర్మాతలను కలిశాను. వాళ్లు సరదాగా తార-సితార అనేవారు. అలా నాకు తార అనే పేరు స్థిరపడిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో తారాచౌదరి అంటే తెలియనివాళ్లు లేరు. ఏమనిపిస్తోంది? నన్ను కావాలని ఇరికించారు. నాకు సినిమాలు, రాజకీయాలు, సమాజసేవ అంటే ఇష్టం. తర్వాత ఇక్కడకొచ్చాక పరిస్థితులు చూసి నటన మానుకుందాం అనుకున్నాక ఒక కోఆర్డినేటర్ వచ్చి చిన్నికృష్ణ వద్దకు తీసుకెళ్లారు. అది ప్లాన్ అని తర్వాత తెలిసింది. 2007లో చిన్నికృష్ణతో నాకు గొడవలయ్యాయి. అందుకు సూత్రధారి ఏసీపీ శంకర్‌రెడ్డి అని ముందు తెలీదు. తర్వాత తెలిసింది. చిన్నికృష్ణకు నలుగురైదుగురు భార్యలున్నారు. శంకర్‌రెడ్డితో మీకు ఎలా పరిచయం? మొదట్లో నేను మాదాపూర్‌లో ఉండేదాన్ని. అప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్లను మాదాపూర్ పోలీసులు పట్టుకుని, నా వస్తువులు నాకు రికవరీ చేసిచ్చారు. తర్వాత శంకర్‌రెడ్డి (అప్పటికి సీఐ) నాకు ఫోన్ చేసి ‘నువ్వు ఆర్టిస్ట్ అంట గదా, చాన్సులిప్పిస్తా’ అంటూ వల్గర్‌గా మాట్లాడేవాడు. దాంతో నేను ఉన్నతాధికారికి చెబుదామని బంజారాహిల్స్ పీఎస్‌కు ఫోన్ చేస్తే, ఈ శంకర్‌రెడ్డే కలగజేసుకుని నా ఇంటికి పోలీసులను పంపాడు. (అప్పుడే నామీద బ్రోతల్ కేసు పెట్టారు.) దాంతో నేను ఫైరయ్యాను. అసలు చిన్నికృష్ణతో లింక్ ఎలా వచ్చింది? శంకర్‌రెడ్డి నామీద కేసు పెట్టాక, 2007లో చిన్నికృష్ణ సినిమా స్టార్ట్ చేస్తున్నాడని ఒక సినీ కోఆర్డినేటర్ నా దగ్గరకొచ్చాడు. సెకండ్ హీరోయిన్ కేరెక్టర్ ఇస్తామన్నారు. అక్కడే శంకర్‌రెడ్డిని చూశాను. చిన్నీని ప్రశ్నిస్తే మంచి ఫ్రెండని చెప్పాడు. తర్వాత ఇద్దరూ కలిసి రూంలో కూర్చుని నన్ను పిలిచారు. ‘అప్పుడు నేను చెప్పినట్లు వినలేదు, కేసు పెట్టాను. ఇప్పుడు విను, సినిమాచాన్స్ వస్తుంది.. పైకొస్తావు’ అన్నాడు. కొన్నాళ్లకు.. తాము చెప్పినట్లు వినకపోతే చంపేస్తామని నన్ను బెదిరించారు. చిన్నికృష్ణ కూడా వల్గర్‌గా మాట్లాడేవారు. సినిమా వేషాల కోసం వచ్చినవారిని నాయకుల వద్దకు పంపేవారు. దీని గురించి రామానాయుడు గారితో చెప్పాను. నచ్చకపోతే బయటకు వెళ్లిపో అన్నారు. అప్పటివరకు ఎవరితోనూ మీకు శారీరక సంబంధాలు ఏర్పడలేదా? అసలు మా కుటుంబం అలాంటిది కాదు. అతని భార్య చనిపోయిందని గోడమీద ఫొటో చూపించాడు. నన్ను లోబరుచుకోడానికి ప్రయత్నించాడు. కూల్‌డ్రింక్‌లో ఏదో కలిపి ఇచ్చాడు. అది తాగి, వాంతులై పడిపోయాను. తర్వాతిరోజు పొద్దున్న నాకు మెలకువ వచ్చింది. పనిమనిషిని అడిగితే.. చిన్నికృష్ణ, శంకర్‌రెడ్డి కలిసి ఏదో కెమెరానో సెల్‌ఫోనో పట్టుకుని రూంలోకి వచ్చారంది. తర్వాత నేను కస్టడీకి వెళ్లినప్పుడు ‘చిన్నికృష్ణ ఇంట్లో నీ ఫొటోలివిగో’ అని శంకర్‌రెడ్డి చూపిస్తే షాకయ్యాను. మీరు సెక్స్‌రాకెట్ నిర్వహిస్తున్నారని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్‌లు మీ కస్టమర్లని.. వాళ్ల సంభాషణలు, అవీ ఇవీ మీరు వీడియో తీసి బెదిరించారని పోలీసులు చేసిన ప్రధాన ఆరోపణ. అది వాస్తవమా.. కాదా? పచ్చి అబద్ధం. నాకు సినిమాలు, రాజకీయాలంటే ఇష్టం. దాంతో నేను హైదరాబాద్ వచ్చి, రెండు మూడు సినిమాలు చేశాను. నాకు అచ్చిరాదనిపించి శ్రీ తార ఆర్ట్స్ అని ఓ బ్యానర్ రిజిస్టర్ చేసుకున్నాను. దాని మీద చిన్న సినిమా అయినా తీయాలని అనుకున్నాను. నా దగ్గర చిన్న ఎమౌంట్ ఉన్నా ఎవరికైనా సాయం కావాలంటే చేస్తుంటాను. అంటే, పోలీసులు చెప్పింది వాస్తవం కాదా? వాళ్లు చెప్పింది, చేసిందంతా ఫ్రాడ్. శంకర్‌రెడ్డి నా పాలిట యముడిలా దాపురించాడు. లక్ష్మి అనే ఓ అమ్మాయిని పురమాయించాడు. ఓ రోజు ఆ అమ్మాయి ముఖానికి గుడ్డ కట్టుకుని టీవీలో ఏదో చెబుతోంది. దాంతో బంజారాహిల్స్ పీఎస్‌కి వెళ్లాను. అక్కడ కానిస్టేబుళ్లు, సీఐలు నా దగ్గరున్న మూడు సెల్‌ఫోన్లు లాక్కున్నారు. అందులో నా సినిమా ఫ్రెండ్లు, నాకు పరిచయమైన కొందరు నాయకుల నెంబర్లు ఉన్నాయి. వాళ్లను బ్లాక్‌మెయిల్ చేయాలని అనుకున్నారు. నా ఫోన్‌లో ఓ చానల్ రిపోర్టర్ మురళి నెంబర్ ఉంది. ఆయన మొదట్లో అతి మంచితనం ప్రదర్శించి, లైవ్ ఇప్పించి, ఇంటర్వ్యూలు తీసుకున్నారు. తర్వాత చుట్టుపక్కల అందరినీ కట్‌చేసి, నన్ను బ్లేమ్ చేయడానికి సోలోగా ఉన్నవి ప్లేచేశారు. పోలీసులు, మురళీ కుమ్మక్కయ్యారు. మురళి అప్పుడప్పుడు నాకు ఎస్ఎంఎస్‌లు పెట్టేవాడు, కాల్స్ చేసేవాడు. వల్గర్‌గా మాట్లాడేవాడు. మరి అమ్మాయి సంగతేంటి? ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు. మార్చి 1 నుంచి 15 వరకు బంధించారని చెప్పింది. ఆ టైంలో నేను తిరుపతిలో ఉన్నాను. నాయకులెవరినీ బ్లాక్‌మెయిల్ చేయలేదు. వాళ్లే నాకు ఫోన్లుచేసి అనేక రకాలుగా అసభ్యంగా మాట్లాడారు. మీడియాకు కాల్ రికార్డులు చూపించాను. వాళ్లలో ఎమ్మెల్యే, ఎంపీ, డీజీ, ఎస్పీ, అంతా ఉన్నారు. ఆ ఎంపీ ఎవరు.. రాయపాటి సాంబశివరావా? ఆయన రాయపాటా.. ఎవరా అన్నది నేను మొన్న మీడియా చానళ్లన్నింటికీ కాల్‌డేటా చూపించాను. నాతో ఆయనకి పరిచయాలు లేకపోతే, ఆయన గెస్ట్‌హౌస్ నుంచి, ఆయన ఇంటి నుంచి, ఆయన ఢిల్లీ ఆఫీసుల నుంచి, ఆయన పీఏ నుంచి, ఆయన పర్సనల్ మొబైల్ నుంచి.. కాల్స్ ఎలా వస్తాయి? ఎప్పుడెప్పుడు వచ్చాయో బయటపెడతా. అసలు ఏం జరిగిందో చెప్పండి? 2008లో నేను తిరుపతి వెళ్లాలని లెటర్ కోసం ఆయన్ని కలిశాను. తర్వాత ఆ పరిచయంతో.. నాకు మసాజ్‌లు అంటే ఇష్టం, అమ్మాయిలను పంపు అన్నారు. తెలిసినవాళ్ల నెంబర్లు తీసుకుని.. ఆయనకి మసాజ్ కావాలట, మీరు చేస్తారా అని అడిగాను. వాళ్లు చేస్తామన్నారు. అలా చేసినవాళ్లు నా దగ్గరకొచ్చి రెండు రకాలుగా చెప్పారు. ఒకళ్లు, ‘మీరు మసాజ్ అన్నారు, ఆయన ఏదో వల్గర్‌గా ప్రవర్తించారు.. మేం తప్పించుకుని వచ్చాం’ అన్నారు. మరికొందరు.. ‘మీరు మంచి సార్‌ని పరిచయం చేశారు.. మేం ఒకదానికి వెళ్తే, ఆయన మరోలా ఎక్కువ డబ్బు ఇచ్చారు’ అన్నారు. ఎవరిష్టం వాళ్లది. కన్నా లక్ష్మీనారాయణను అప్రతిష్టపాలు చేయడానికి మీకు డబ్బులిచ్చారని కూడా చెప్పారు కదా? ఏం చేయమన్నారు? కన్నా లక్ష్మీనారాయణ నాకు తెలీదు, అమ్మాయిలను అడ్డుపెట్టుకుని ఆయనమీద బురద చల్లాల్సిన అవసరం నాకు లేదని చెబితే సరేనన్నారు. ఆ ఎంపీ సోదరుడి కుమారుడు రాత్రి పూట మూడు నాలుగు గంటలు మాట్లాడేవాడు. మీరంటే ఇష్టం, మంచి ఫ్రెండ్‌లా ఉందామని అనేవాడు. చివరకు లవ్ చేస్తున్నానన్నాడు. నేను దాన్ని పట్టించుకోలేదు. తర్వాత ఎంపీ అసభ్యకరంగా మాట్లాడేవారు. అమ్మాయిలను పంపుతున్నావా లేదా.. నువ్వు గెస్ట్‌హౌస్‌కి వచ్చేసెయ్యి అనేవారు. తర్వాతి కాలంలో నాకు మూడ్ వచ్చేసింది అమ్మాయిని పంపించు అన్నప్పుడు.. రికార్డ్ చేశాను. సమాజం దృష్టిలో మీరు వ్యభిచార వృత్తి నిర్వాహకురాలే కదా? వ్యభిచార వృత్తి నిర్వాహకురాలినని నన్ను కోర్టు నిర్ధారించలేదు. నిజానికి వ్యభిచారులు వాళ్లు. శంకర్‌రెడ్డి.. వీళ్లంతా బ్రోకర్లు. మీ దృష్టిలో ఆ వ్యభిచారులు ఎవరు? ఒకరు రిటైర్డ్ డీజీ. ఆయన పేరు భాస్కరయ్య. నాతో అసభ్యంగా మాట్లాడి, ఏమే.. ఏంటే అన్నారు. అవన్నీ రికార్డుచేశాను. అవన్నీ పోలీసులు తీసుకుని వాళ్లదగ్గర డబ్బులు గుంజుకుని నన్ను బ్లాక్‌మెయిల్ చేశారు. ఈ ఐజీ గానీ, కర్నూలు డీఎస్పీగానీ, ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే గానీ… ఈ డీఎస్పీ, ఎమ్మెల్యే.. వీళ్లంతా ఎవరు? కర్నూలు డీఎస్పీ మనోహరరావును భాస్కరయ్య పరిచయం చేశారు. ఎమ్మెల్యే ఆదిలాబాద్ జిల్లా ఆయన. వీళ్లందరికి సంబంధించిన ఆడియోటేప్‌లు పోలీసులు తీసుకున్నారా? డీజీపీ గారు గానీ, హోం మంత్రి గానీ, కమిషనర్‌గానీ నేను రక్షణ అడిగినప్పుడు స్పందించలేదు. కారణమేంటి? ఎవరో అమ్మాయి వైజాగ్ నుంచి వచ్చానని, ఆమెను నేను బంధించానని చెబితే ఒక గంగాభవాని గారు, ఒక నన్నపనేని రాజకుమారి గారు, ఒక సంధ్య గారు.. వీళ్లంతా ఆ అమ్మాయి బిత్తరచూపులు చూస్తోందని, వాస్తవాలు చెప్పట్లేదని గమనించకుండానే ఆ అమ్మాయికి న్యాయం చేయాలని అడిగారు. లాకప్‌లో శంకర్‌రెడ్డి మీ చీర లాగడానికి ప్రయత్నించాడన్నారు. నిజమేనా? అవును.. శంకర్‌రెడ్డి కస్టడీ పేరుతో నన్ను తీసుకెళ్లి, నా చీర లాగేశాడు. లేడీ కానిస్టేబుళ్లు దేవి, కిరణ్‌కుమారి, ఎస్ఐ సీతారాములు దీనికి ప్రత్యక్ష సాక్షులు. స్టేషన్‌లో తన గదిలో బెడ్‌మీద శంకర్‌రెడ్డి కూర్చుని అసభ్యకరంగా నామీద చేతులేశారు. అదంతా సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించి నాతో బలవంతంగా వేరేలా చెప్పించి రికార్డు చేశారు. కస్టడీ ముగిశాక జడ్జీ వద్ద కూడా నేను ఏడుస్తూ ఇదే చెప్పాను. అంత చెప్పినా డీజీపీగారు ఎందుకు స్పందించలేదు? మిమ్మల్ని రకరకాలుగా ఉపయోగించుకున్న వాళ్లంతా బాగానే ఉన్నారు. మీరు మాత్రం లేడీ విలన్‌గా ముద్రపడిపోయారు. ఎందుకలా? నన్ను బలిపశువును చేసినవాళ్లందరూ వయసులోను, హోదాలోను పండిపోయినవాళ్లు. వాళ్లు తప్పులు చేయని నిజాయితీపరుల్లా బయటకు కనపడుతున్నారు. ప్రభుత్వం నిజాయితీగా స్పందిస్తే.. నన్ను ఇబ్బంది పెట్టినవాళ్లను జైళ్లకు పంపేది. ఎమ్మెల్యే వేణుగోపాలాచారి విషయం ఏంటి? గతంలో టీడీపీలో ఉండి ప్రస్తుతం టీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఒకరున్నారు. ఆయన సీఐతో ఫోన్లు చేయించి మా కుటుంబసభ్యులను బెదిరించారు. రిమాండ్‌లో తోటి ఖైదీలు ఎలా ఉండేవారు? పోలీసుల విషయమేంటి? ఖైదీలు బాగానే ఉండేవారు. ఓ టీవీ చానల్ వాళ్లు, పోలీసులు కుమ్మక్కు అయ్యి లేనిపోనివి సృష్టించారు. నాకు నార్కోటెస్టులు చేసినా నిజం తెలుస్తుంది. అదే శంకర్‌రెడ్డికి, సుదర్శన్‌కి కూడా చేయాలని అడుగుతున్నా. నన్ను ఎంపీ ఇబ్బంది పెట్టినప్పుడు మాజీ సీఎం భార్యను ఆశ్రయించా. ఆమె ఎవరో కాదు.. లక్ష్మీపార్వతి ఆంటీ. నాకు న్యాయం చేస్తానని చెప్పి, ఆ ఎంపీతో దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తిని పిలిపించింది. తర్వాత ఆయన నా తలమీద చెయ్యేసి, ఆ ఎంపీ అంతేనని.. వదిలెయ్యమని చెప్పారు. ఆమె నా దగ్గర ఉన్న సాక్ష్యాలు ఒక సెట్టు ఇవ్వమని చెబితే ఇచ్చాను. తర్వాతి రోజు ఫోన్ చేసి ‘వాళ్ల సంగతి నీకు తెలీదు, ఎత్తుకెళ్లి చంపేస్తారు’ అని విలన్‌లా, రాక్షసిలా బెదిరించింది. ఈ రొచ్చులోంచి బయటికెళ్లి, హైదరాబాద్ వదిలేసి ప్రశాంతంగా బతకాలనుకుంటున్నారా? నేనెందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలి.. ఇక్కడే ఉంటా. నేనేంటో రుజువు చేసుకుంటా. ఈ శంకర్‌రెడ్డి లాంటి వాళ్లను మాత్రం కఠినంగా శిక్షించాలని కోర్టులోను, హెచ్చార్సీలోను ఫిర్యాదుచేస్తా. ఎంత దూరమైనా వెళ్తా. పోలీసులు నా దగ్గర తీసుకున్నవి జిరాక్సులు మాత్రమే. ఒరిజినల్స్ అన్నీ నా మెయిల్ బాక్సులో ఉన్నాయి. వాళ్ల బండారాన్ని బయటపెట్టి దోషులుగా నిరూపిస్తా. నా కుటుంబాన్ని వేధించిన ఎమ్మెల్యే, అర్ధరాత్రి నాకు ఫోన్లు చేసిన ఎంపీ, డీఎస్పీ, డీజీ.. అందరినీ బయటపెడతా.
రెడ్డి బలంగా రెండు, మూడు పోట్లు పొడిచేసి అమ్ము…అబ్బా…ఊ…అంటూ కార్చేసి, అమ్ములూ….అంటూ పెదాలు చీకి తన మొడ్డని అమ్ములు పూకులోంచి బైటకి తీసి అమ్ములు లంగాకి తుడుచుకుని, పేంట్ సరి చేసుకుని కూర్చున్నాడు. అమ్ములు కూడా తన పూకు ని తుడుచుకుని, చీరా, భైజు సరి చేసుకుని, లేచి కూర్చుని, రెడ్డి పెదాలు చీక సాగింది. రెడ్డి ఇవ్వాళ తొందర గా ఆడి ని పడుకోపెట్టి కసిగా దెంగు కుందాం అంది. రెడ్డి నవ్వుతూ అట్టాగేలే, నీ కన్నా నాకు బాగా కసిగా ఉంది. నీ పూకు బాగా నాకి దెంగాలని అన్నాడు. ఇలా వాళ్లు ఇద్దరూ నవ్వు కుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, వీధి తలుపు చప్పుడు కి, అమ్ములు లేచి వెళ్లి చూస్తే, తన మొగుడు చేతి లో బ్యాగ్ తో లోపలకి వస్తున్నాడు. అమ్ములు ఎదురు వెళ్లి ఆ బ్యాగ్ తీసుకుంది. ఇద్దరూ లోపలకి వచ్చారు. ఓబుల్ రెడ్డి అన్నాడు, అబ్బా మం సం ఒక చోట లేక పోతే అట్టా త్రిగి, తిరిగి తీసుకు వచ్చా పెట్టి రెడ్డి నీకు బాగా ఇష్టం అని అంటూ, అమ్ములూ తొందర గా కోడి కూర చెయ్యవే అని పురమాయించి, మగాళ్లు ఇద్దరూ కబుర్లలో పడ్డారు . ఒక అర గంట కి అమ్ములు వంట ఇంట్లోంచి, ఏ మయ్యా ఇట్టా వచ్చి కూర ఎట్టా ఉందో చూడు అంది. ఓబుల్ రెడ్డి, ఇది గో పెద్ది రెడ్డి నువ్వు వెళ్లి కూర అంట ఎట్టా ఉందో చూడు, నువ్వే కదా బాగా ఇష్టం గా తింటావు అన్నాడు. పెద్ది రెడ్డి నవ్వుకుంటూ వంట గది లోకి వెళ్లి, కూర రుచి చూసి, ఒక ముక్క అమ్ములు నోట్లో పెట్టి, చిన్నగా, ఊ…నువ్వు చూడు ఎట్టా ఉందో అంటూ, ఒక సారి అలా ఓబుల్ రెడ్డి ఉన్న గది కేసి చూసి, అమ్ములు బుగ్గలు రెండూ నొక్కి, బాగుంది లే అంటూ నవ్వుతూ వెళ్లి ఓబుల్ రెడ్డి ప్రక్కన కూర్చుని, కూర చాలా బాగుంది రెడ్డి, ఇంక కూర రాంగానే మొదలెడదాం అంటూ సీసా తీసి, రెండు గ్లసుల్లో పోసి, అమ్ములూ నీ కోసమే చూస్తున్నాం అన్నాడు. అమ్ములు ఒక ప్లేటులో కూర పట్టుకు వెళ్లి వాళ్ల మధ్యన పెట్టి తనూ మొగుడు ప్రక్కన కూర్చుంది. ఓబుల్ రెడ్డి మధ్యన కూర్చుంటే , అతని కి చెరో ప్రక్కనా పెద్ది రెడ్డి, అమ్ములూ కూర్చున్నారు. మగాళ్లిద్దరూ మందు పోసుకుని, చీర్స్ చెప్పుకుని తాగడం మొదలెట్టరు. కోడి కూర తింటూ, పెద్ది రెడ్డి కూర నంచుకుంటూ, ఓబుల్ రెడ్డి కోడి కూర అమ్ములు చేస్తే మంచి రుచి గా ఉంటాది రా, మా ఆవిడని చెయ్యవే అంటే, ఎప్పుడూ ఏదో ఒకటి ఎక్కువో, తక్కువో వేసి పాడు చేస్తాది, అమ్ములు ని మా ఇంటికి తీసుకు వెళ్లి మా ఆవిడ కి కూర చెయ్యడం నేర్పించాలి అన్నాడు. ఓబుల్ రెడ్డి అట్టాగే లేరా, ఒక రోజు తీసుకు వెళ్లు, దగ్గర ఉండి వండుతే, తనూ చూస్తాది లే ఇదే మన్నా పెద్ద పనా అన్నాడు తనూ మందు తాగుతూ. ఇలా వాళ్లు మాటల్లో ఉండ గా, ఓబుల్ రెడ్డి కి ఇంకో రౌండ్ మందు పోసి ఇచ్చాడు పెద్ది రెడ్డి. మొగుడు మందు తాగుతూ ఉంటే, అమ్ములు అంది. ఇది గో రేపు ఫోన్ కి కాయితం పెట్టి స్తా అంటన్నడు పెద్ది రెడ్డి, ఒక పది రోజుల్లో ఫోన్ వస్తాది అంటున్నాడు. రేపు తను టౌన్ కి తీసుకు వెళ్లి ఆ పని ఏదో చూస్తా అంటన్నాడు. వెళ్ల మంటావా అంది. ఓబుల్ రెడ్డి మందు తాగుతూ, వెళ్లు పెద్ది రెడ్డి ఏమన్నా పరాయి వాడా, వెళ్లి ఆ పని చూసుకు రండి, నాకు ఫేక్టరీ లో పని కి వెళ్లాలి కదా. ఈ పనులు అన్నీ నాకు ఎట్టా తెలుస్తాయి అన్నాడు. అలా ముగ్గురూ మాటాడుకుంటూ ఉంటే, అమ్ములు వెనక నుంచి చెయ్యి పెట్టి పెద్ది రెడ్డి నడ్డి మీద గిల్లి, కళ్ల తో నే సైగ చేసింది, ఎలా ఉంది నా పధకం అన్నట్టు. పెద్ది రెడ్డి ఏమి తక్కువ తిన్నాడా, తనూ ఓబుల్ రెద్ది వెనక నుంచి చెయ్యి పెట్టి అమ్ములు నడుము మడతని రాస్తూ, చాలా బాగా సమయం చూసి నొక్కేవు లే నాల గా అన్నట్టు గా అమ్ములు నడుము ని నొక్కి వదిలాడు. పెద్ది రెడ్డి తో కబురులు చెపుతూ మొగుడి చేత బాగా మందు తాగించి మొగుడు మత్తు గా ఉండటం తో అమ్ములు అడిగింది. ఇంక అన్నం తింటావా అని. ఓబుల్ రెడ్డి ఆ తింటా అన్నాడు. అమ్ములు కంచం లో అన్నం పెట్టుకు వచ్చి మొగుడు అన్నం తిన్నాకా, పెద్ది రెడ్డి తనూ కలిసి మొగున్ని మంచం మీద పడుకో పెట్టారు. పెద్ది రెడ్డి, తనూ అక్కడే కొంత సేపు కూర్చుని ఏదో మాటాడు కుంటూ ఉంటే, ఓబుల్ రెడ్డి మైకంలో, అమ్ములూ పెద్ది రెడ్డి చాలా మంచోడే, రేపు వెళ్లు, వెళ్లు అంటూ ఏదో మాటాడుతూ నే నిద్ర లోకి జారి పోయాడు. అలా అమ్ములూ, రెడ్డి కొద్ది సేపు అక్కడే కూర్చొని, ఓబుల్ రెడ్డి ని కదిపి చూసి, ఇంక లేవడని, ఇద్ద రూ నవ్వు కుంటూ, అక్కద ఉన్న మందూ, కూర పట్టుకుని ముందు గది లోకి వెళ్లి, చాపా, పరుపూ వేసుకుని దాని మీద కూర్చున్నారు. పెద్ది రెడ్డి మందూ, కూరా ప్రక్కన పెట్టి, అమ్ములు ని తన మీద కి లాక్కొని కసిగా పెదాలు చీ కుతూ, సళ్లు రెండూ పిసికేస్తున్నాడు. అబ్బా అమ్ములూ, నీ లాగే నువ్వు వండిన కూర కూడ మహా రుచి గా ఉందే నీ అమ్మా, మొత్తం కూర అంతా తినెయ్యాలని ఉందే, నిన్ను తిన్నట్టే అన్నాడు. అమ్ములు నవ్వుతూ, ముందు నన్ను తిను, తరవాత ఎట్టాగూ కూర తో అన్నం తింటావు కదా అంది. ఇద్దరూ కసిగా దెంగు కున్నాకా, రెడ్డి ఇంటి కి వెళ్తా వా, ఇక్కడే పడుకుంటావా, నీ ఇష్టం అంది. రెడ్డి అమ్ములు ని కసిగా హత్తుకుని, నిన్ను ఒదలాలని లేదే అమ్ములూ, ఈ రోజుకి ఇక్కడే పడుకుంటాలే , తెల్ల వార గానే లేచి వెళ్లి పోతా అంటూ అమ్ములు ని కసిగా ఇంకో సారి దెంగి ఇద్దరూ హత్తుకుని పడుకుండి పోయారు. తెల్ల వారే కా, అమ్ములు పెద్ది రెడ్డిని సాగ నంపుతూ ఉంటే, 9-00 కల్లా తయారయ్యి మన బస్సు స్టేండ్ కాడ కి వచ్చి ఉండు. నేనూ వచ్చి అక్కడే నిన్ను కలుస్తా అని చెప్పి వెళ్లి పోయాడు పెద్ది రెడ్డి. అమ్ములు తన పనులు చేసుకుని, టీ కొట్టు తీసి బేరాలు వస్తే చూసుకుని, టైము చూసి మొగున్ని లేపి, పని లోకి ప మేటప్పుడు చెప్పింది. టౌన్ కి వెళ్లి ఫోన్ సంత గి చూసి వస్తా అని. ఓబుల్ రెడ్డి సరే నీ ఇష్టం అని వెళ్లి పోయాడు. అను కునా ప్రకారం, అమ్ములూ, పెద్ది రెడ్డి టౌన్ కి వెళ్లారు. పెద్ది రెడ్డి అమ్ములు పేరు మీద పబ్లిక్ ఎస్ టి డి కి కాయితం పెట్టి డబ్బులు కట్టేసి, ఫోన్ ఒక వారం లో వచ్చేలా మాటాడి, ఇద్ద రూ బజార్ లోకి వెళ్లారు. పెద్ది రెడ్డి అమ్ములు కి నాలుగు సిల్క్ చీరలూ, మంచి మంచి బ్రాలూ, ఇం కా కొట్టులోకి సబ్బులూ, పౌడర్లూ, ఇలా చాలా సామాన్లు కొన్నాకా, అమ్ములూ ఇక్కడ రూం తీసుకుని, సాయంత్రానికి ఇంటి కి వెళ్లామె అన్నాడు. అమ్ములు ఒద్దు రెడ్డి నాకు భయం గా ఉంది అంది. పెద్ది రెడ్డి ఏమీ భయం లేదు లె నేను ఉంటాగా, ఇక్కడ బాగుంటాది అంటూ ఒక మంచి వొటెల్ లో రూం తీసుకుని, ఇద్దరూ కసిగా దెంగుకుని, సాయంత్రాని కి ఇల్లు చేరారు. అమ్ములు ఇంటి కి వెళ్లి, శుభ్రం గా స్నానం చేసి, మంచి చీరా, కొత్త బా తో భైజు వేసుకుని, కూర్చుంది. ఓబుల్ రెడ్డి పని చూసుకుని 5-00 కల్లా ఇంటికి వచ్చేసాడు. అమ్ములు నవ్వుతూ, టీ చేసి మొగుడి కి ఇచ్చింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మ్రోగింది..రాష్ట్ర్రంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పోషన్, సిద్దిపేట, నకేరేకల్, అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూర్ మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లు కాగా మిగతా అయిదు మున్సిపాలిటిలకు నోటీఫికేషన్ జారీ చేశారు. కాగా 16న నామినేషన్ల ప్రక్రియ రేపటి అనగా నుండే ప్రారంభం కానుంది. ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనుండగా మే 3 ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి. ఇది షెడ్యూల్… మొత్తం ఎన్నికల ప్రక్రియ పదిహేను రోజుల్లో ముగియనుండగా 18 వతేది మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు గడువు విధించారు. ఇక 19 తేదిన స్క్రూటిని నిర్వహించి.. 20 తేదిన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం అభ్యర్థుల లిస్టును ప్రకటించనున్నారు. 30 వ తేదిన ఎన్నికల నిర్వహించనుండగా.. ఒకవేళ ఎక్కడైన రీపోలింగ్ ఉంటే మే 2 న నిర్వహించనున్నారు. రిజర్వేషన్లు ఖరారు ఈ నేపథ్యంలోనే వరంగంల్ మున్సిపల్ కార్పోరేషన్ తో పాటు ,ఖమ్మం మున్సిపాలిటీలకు కూడ రిజర్వేషన్లను ఖారరు చేస్తూ.. జిల్లా అధికారులు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇందులో ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్‌కు రిజర్వేషన్లు ఖారారు అయ్యాయి. మొత్తం ఆరవై వార్డుల రిజర్వేషన్ ఖారారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అరవై వార్డులకు గాను 14 వార్డులను అన్‌రిజర్వడ్, 16 స్థానాలు జనరల్ మహిళ రిజర్వేషన్ గా మరో 20 వార్డులు బీసీ జనరల్ వార్డులుగాను 7 స్థానాలు ఎస్సీలకు 3 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. ఖమ్మం వార్డుల రిజర్వేషన్స్ కాగా రిజర్వేషన్ ఎస్టీలకు కేటాయించిన వాటిలో 32 వార్డు ఎస్టీ మహిళకు 1 మరియు 8 వార్డులను ఎస్సీ జనరల్‌కు కేటాయించగా,ఏస్సీలకు కేటాయించిన ఏడు వార్డుల్లో 22,42,59 ఎస్సీ మహిళలు, 40,4352, 60 వార్డులను ఎస్సీ జనరల్ కు,బీసీలకు కేటాయించిన 20వార్డుల్లో 28, 29, 30, 33, 34, 38, 46, 47, 48, 57 హిళలకు 2, 7, 14, 16, 19, 24, 25, 31, 44, 51 అభ్యర్డులను బీసీ జనరల్‌కు కేటాయించారు. కాగ 16 స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించిన వాటిలో 5, 9, 10, 11, 12, 15, 17, 18, 20, 21, 37, 53, 54, 55, 56, 58 స్థానాలు కేటాయించగా మిగిలిన 14 స్థానాలు న్‌రిజర్వ్‌డ్ స్థానాలుగా ప్రకటించారు. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌ర‌పాల‌క సంస్థ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో షెడ్యూల్ ప్ర‌కారం ఇవాళ రిజ‌ర్వేష‌న్ల జాబితాను విడుద‌ల చేశారు. వ‌రంగ‌ల్ న‌గ‌ర ప‌రిధిలోని 66 డివిజ‌న్ల‌కు రిజ‌ర్వేష‌న్లు ఖరారు కాగా, 65వ డివిజ‌న్ ఎస్టీ మ‌హిళ‌కు, 2వ డివిజ‌న్ ఎస్టీ జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. 1, 3, 14, 43, 46 డివిజ‌న్లు ఎస్సీ మ‌హిళ‌ల‌కు, 15, 17, 18, 37, 47, 53 డివిజ‌న్ల‌ను ఎస్సీ జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. 9, 16, 23, 25, 32, 33, 36, 38, 42, 54 డివిజ‌న్ల‌ను బీసీ మ‌హిళ‌ల‌కు, 6, 10, 12, 20, 21, 26, 34, 39, 40, 41 డివిజ‌న్లు బీసీ జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. 8, 11, 19, 24, 28, 29, 30, 44, 48, 49, 50, 55, 57, 58, 59, 63 డివిజ‌న్ల‌ను జ‌న‌ర‌ల్ మ‌హిళ‌ల‌కు కేటాయించారు. 878 పోలింగ్‌ స్టేషన్లు 66 డివిజన్లలోని 298 ప్రాంతాల్లో 878 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహి స్తున్న నేపథ్యంలో ప్రతి పోలింగ్‌ స్టేషన్లలో 800 ఓట్లకు మిం చకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరమే పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను ప్రకటించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగకుండా పర్యవేక్షణకు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ బృందాలను ఎన్నికల అధికారి నియమించారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. ప్రతి బృందంలో తహసీల్లార్లు, ఇరిగేషన్‌ అ ధికారులు, పోలీస్‌ అధికారులు, వీడియో గ్రాఫర్‌ ఉంటారు.
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకోవడం మంచిదే. కానీ.. స్టార్డమ్ పూర్తిగా రాకుండానే రేటు పెంచేసే స్ట్రాటజీ వల్ల బోల్తా కొట్టాల్సి వస్తుంది. September 1, 2020 at 10:15 AM in Tollywood Share on FacebookShare on TwitterShare on WhatsApp సోష‌ల్ మీడియా పుణ్యమా అని చాలా మంది లోక‌ల్ బ్యూటీలు చాలా ఈజీగా సినిమాల్లోకి వ‌చ్చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా వీరంతా త‌మలో దాగి ఉన్న యాక్టింగ్ స్కిల్స్ బ‌య‌టపెడుతూ సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్నారు. అయితే ఇలా సోష‌ల్ మీడియా ద్వారా ఇండ‌స్ట్రీలోకి వ‌స్తున్న వారిలో చాలా మంది లోబడ్జెట్ సినిమాల్లోనే క‌నిపిస్తూ ఆ త‌రువాత మెల్లిగా బీ గ్రేడ్ హీరోయిన్లుగా మిగిపోతున్నారు. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్ లో హీరోయిన్‌గా న‌టించిన టిక్ టాక్ స్టార్ మృణాళిని ర‌వికి మాత్రం అది పెద్ద ఆఫ‌ర్ అనే చెప్పాలి. ఈ పాప టిక్ టాక్ లో ఎక్స్ ప్రెష‌న్స్ బాగా ఇస్తూ వీడియోలు చేస్తుంద‌నే కార‌ణంగా హ‌రీశ్ శంకర్ త‌న సినిమాలో అవ‌కాశం ఇచ్చాడు. అయితే ఏమాటకి ఆ మాటే, మృణాళిని ర‌వి- గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్ లో అద‌ర‌గొట్టేసింది. డ్యాన్సులు, స్కిన్ షో, ఎక్స్ ప్రెష‌న్స్ తో బాగానే పేరు తెచ్చుకుంది. అయితే మృణాళిని చేసిన ఒకే ఒక మిస్టేక్ ఈ ఒక్క సినిమాతో తాను స్టార్ అయిపోయాను అని ఫిక్స్ అయిపోవ‌డ‌మే, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్ త‌రువాత ఈ పాప‌కు వ‌చ్చిన ఒక‌టి రెండూ ఆఫ‌ర్లను కూడా ఎక్కువ రెమ్యూనరేష‌న్ అడిగి కాల‌ద‌న్నుకుంది. దీంతో ఈ బ్యూటీని తెలుగు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప‌క్క‌న‌పెట్టేశారు. దీంతో చాలా లేటుగా త‌న మిస్టేక్ తెలుసుకొని, రేటు త‌గ్గించుకొని తాజాగా తెలుగులో మ‌ళ్లీ అవ‌కాశాలు కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింద‌ని అంటున్నారు. మ‌రి ఈ పాపకి ఎవ‌రు అవ‌కాశం ఇస్తున్నారో చూడాలి.
హాసన్ పర్తి మండలం ఎల్లపూర్ గ్రామంలో రియల్టర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది… ఎం చేసిన అడిగేవారు లేరని అక్కడ రియల్టర్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.వారికి తోడుగా వారు ఏంచేసిన పట్టించుకోకుండా ఇరిగేషన్ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎల్లాపూర్ గ్రామంలోని చెరువు దాదాపు వెయ్యి ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా… ఈ చెరువు ద్వారా పంటపొలాల కు నీటిని అందించే కాలువలను ఇక్కడ రియల్ దందా చేస్తున్న కొందరు వాటిని పూర్తిగా పూడ్చివేసి ఆనవాలు లేకుండా చేసి తమ వెంచర్ వ్యాపారాన్ని ప్రారంభించారు. అనేక ఎకరాల పంట పొలాలకు నీటిని అందించే ఈ కాలువలను మూసి వేయడం మూలంగా నీరు అందక పంటపొలాలు బీళ్లుగా మారాయి. దీంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్న ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం కదలకుండా మొద్దు నిద్ర నటిస్తున్నారు. ఈ విషయంపై ఈనెల 10 న న్యూస్10 ఓ కథనం వెలువరించగా ఎదో కదిలినట్లు నటించిన ఇరిగేషన్ అధికారులు మళ్ళీ ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు. చెరువుకు సంబందించిన కాలువలను మూసివేసి దర్జాగా రియల్ దందా చేస్తున్న రియల్టర్ లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు.పంట కాలువలు మూసివేసి కబ్జా చేసి వెంచర్ సిద్ధం చేసి గజాల చొప్పున భూమిని అమ్మేస్తున్నారు మొర్రో అని రైతులు ఎంతగా తమ గోడు వెళ్లబోసుకున్న అదిమాత్రం ఇరిగేషన్ అధికారులకు ఏమాత్రం వినపడినట్లు లేదు… చెరువు, చెరువుకు సంబందించిన కాలువలు ఎక్కడ పోయిన తమకేం సంబంధం లేనట్లు వారి వ్యవహారశైలి కనపడుతుందని విమర్శలు వస్తున్న అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది. రియల్టర్ లతో కుమ్మక్కు…? పంట కాలువలు పూడ్చివేసి భూమిని కబ్జా చేసి వెంచర్ నిర్వహిస్తున్న ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఉండడానికి కారణం రియల్టర్ లతో వారు పూర్తిగా కుమ్మక్కు కావడమేనని ఇక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు.అనేకసార్లు ఈ విషయంపై తాము పిర్యాదు చేసిన కనీసం ఎంజరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం ఇరిగేషన్ అధికారులు చేయలేదని ఇందుకు కారణం వెంచర్ నిర్వహిస్తున్న రియల్టర్లు ఇరిగేషన్ అధికారులను ప్రసన్నం చేసుకొని కావాల్సింది సమర్పించడం మూలంగానే మౌనం నటిస్తున్నారని రైతులు అంటున్నారు. ఏకంగా చెరువుకు సంబందించిన కాలువలను మూసివేసి వెంచర్ వేసిన తమకేం పట్టనట్లు అధికారులు వ్యవహరించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. రెండేళ్లుగా పొలాలు బీడుగా ఉంచుతున్నా…. కే. కాశిం. బాధిత రైతు ఎల్లపూర్ గ్రామం చెరువు నిండా నీళ్లు ఉన్నా పైన కాలువలు పూడ్చడంతో కిందికి నీళ్లు రాక రెండేళ్లుగా పొలాలు బీడు భూమిగానే ఉంచినం. మీద వెంచర్లు నిర్మించి కాలువలను లెవల్ చేసుకొని అక్రమించిర్రు అడుగబోతే తిడుతూ కొట్టడానికి వస్తాళ్ళు. ఉన్న కొద్దీ భూమిని నీళ్లు లేక బీడు గా ఉంచి వాచ్ మెన్ గా పని చేసుకుంటానా….ఎన్ని సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
Wife kills husband along with boyfriend: వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న వాడిని సైతం వదిలించుకోవడానికి సిద్ధపడుతున్నారు. అడ్డొస్తే చంపడానికి సైతం వెనకాడటం లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా.. క్షణిక సుఖాల కోసం కుటుంబాలను వీధిపాలు చేసుకుంటున్నారు. ప్రియుడితో ఊహల్లో తేలుతున్న భార్య... తమ బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని... భర్తనే కడతేర్చింది ఆ ఇల్లాలు. చున్నితో హత్య చేసి ఆ తర్వాత దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రికరించి చివరకు.. దొరికిపోయింది. Wife kills husband along with boyfriend: ప్రియుడితో కలిసి భర్తను ఇంట్లో హత్య చేసింది ఓ ఇల్లాలు... రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పెద్ద పథకాన్నే రచించింది...చేతిలో మూడున్నరేళ్ల బాలిక...మధ్యలో భర్త మృతదేహం...ద్విచక్రవాహనం నడుపుతున్న ప్రియుడు... ఇలా శవంతో 50 కిలోమీటర్లు ప్రయాణించారు. వంతెన పైనుంచి ద్విచక్ర వాహనంతో సహా మృతదేహాన్ని కిందకు తోసేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. మాటలు సరిగా రాని చిన్నారి.. గిరిజన(లంబాడ)భాషలో ఇచ్చిన వాంగ్మూలం ఈ హత్యోదంతాన్ని వెలుగులోకి తెచ్చింది. భువనగిరి మండలం అనంతారం సమీపంలో ఈ నెల 18న జాతీయ రహదారి వంతెన పైనుంచి కింద పడి మృతిచెందిన లకావత్‌ కొమ్రెల్లి(32)ది హత్యగా పోలీసులు తేల్చారు. నిందితులైన కొమ్రెల్లి భార్య భారతి అలియాస్‌ సుజాత, ఆమె ప్రియుడు బానోత్‌ ప్రవీణ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. తామే హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారని డీసీపీ తెలిపారు. భువనగిరిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం హన్మాంతపురం గ్రామ పరిధిలోని తీటుకుంటతండాకు చెందిన లకావత్‌ కొమ్రెల్లి, భారతికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ఆరేళ్ల క్రితం వీరు సికింద్రాబాద్‌ వచ్చి నామాలగుండులో జీహెచ్‌ఎంసీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు బిడ్డలను జనగామలోని ఎస్టీ వసతి గృహంలో చేర్పించారు. చిన్న కుమార్తెతో కలిసి నామాలగుండులో ఉంటున్నారు. రెండేళ్ల క్రితం బంధువుల వివాహ వేడుకల్లో పరిచయమైన డీజే ఆపరేటర్‌ బానోత్‌ ప్రవీణ్‌(జనగామ జిల్లా అడవికేశవపురం)తో భారతి వివాహేతర సంబంధం పెట్టుకొంది. అనుమానం వచ్చిన భర్త నిలదీశారు. దీంతో అతడిని అంతమొందించాలని భారతి నిర్ణయించుకొంది. మరోపక్క భార్య వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాలనుకున్న కొమ్రెల్లి ఈ నెల 18న సొంతూరి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. భర్త లేకపోవడంతో ప్రియుడిని ఇంటికి రప్పించింది భారతి. కొమ్రెల్లి అదే రోజు రాత్రి ఇంటికి వచ్చారు. తన భార్య ప్రియుడితో కలిసి ఉండటాన్ని చూసి గొడవపడుతుండగా భారతి, ఆమె ప్రియుడు ప్రవీణ్‌ కలిసి కొమ్రెల్లిని చున్నీతో ఉరేసి ఇంట్లోనే అంతమొందించారు. అదే రాత్రి శవాన్ని తీసుకొని భువనగిరి మండలం అనంతారం సమీపంలోకి తీసుకెళ్లి ద్విచక్రవాహనంతో సహా కొమ్రెల్లి మృతదేహాన్ని వంతెన పైనుంచి కిందకు తోసేశారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడికి ఇది హత్య అనే అనుమానం రావడంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేశారు.హత్య సమయంలో భారతి వద్దే ఉన్న మూడున్నరేళ్ల చిన్నారిని విచారించారు. ఇంట్లో గొడవ జరిగిందంటూ.. అమ్మ, మరో వ్యక్తి కలిసి తన తండ్రిని చంపారంటూ ఆ పాప చెప్పిందని డీసీపీ తెలిపారు. నిందితులు బానోత్‌ ప్రవీణ్‌, లకావత్‌ భారతిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
తెలుగులో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి, ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగు పెట్టి వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న స్టార్ తాప్సీ. `మిష‌న్ ఇంపాజిబుల్‌` సినిమాతో తెలుగులో […] Category: సినిమా by Veerni Srinivasa RaoLeave a Comment on తాప్సీ ‘మిష‌న్ ఇంపాజిబుల్‌’ లో హ‌రీశ్ పేర‌డి ఆంధ్ర ప్రదేశ్ 49 mins ago కర్నూల్లో హైకోర్టు..కరవు సీమకు ‘న్యాయం’-బుగ్గన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో కర్నూలు జిల్లాలోని జగన్నాథ గట్టుపై హైకోర్టు కట్టబోతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన...
కొడాలి నాని నోటికి ఎంతొస్తే అంతే. పెద్దా చిన్నా తెలియదు.. మట్టూ మర్యాదా అసలే తెలియవు. రాజ్యాంగవ్యవస్థగా కీలక పదవిలో ఉండే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీద కూడా అసహ్యమైన మాటలతో విరుచుకుపడ్డారు. November 18, 2020 at 12:14 PM in Andhra Pradesh, Latest News Share on FacebookShare on TwitterShare on WhatsApp ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 2 కరోనా కేసులున్నప్పుడు ఎన్నికలు నిర్వహించలేని దద్దమ్మ, నేడు ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన విరుచుకుపడ్డారు. 60 ఏళ్లకు పదవీ విరమణ చేయాల్సిన వ్యక్తి చంద్రబాబునాయుడి సంకనాకి ఎన్నికల కమిషనర్ అయ్యాడని, మరో నాలుగు నెలలు పద్దతిగా ఉండి ఇంటికి పోవాలని కొడాలి నాని హితవు పలికారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దంగా లేదని, ఈ విషయం సీఎస్ ఇప్పటికే చెప్పారని ఆయన వెల్లడించారు. నిమ్మగడ్డకు బుద్ది జ్ఞానం లేదా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు బుద్ది జ్ఞానం లేదని మంత్రి కొడాలి ధ్వజమెత్తారు. నాలుగు నెలల తరవాత పదవీ విరమణ చేసి, టీడీపీలో చేరి ఎక్కడైనా పోటీ చేసి నిమ్మగడ్డ గెలవాలని ఆయన సవాల్ విసిరారు. రాజ్యాంగ వ్యవస్థలను నిమ్మగడ్డ భ్రష్టు పట్టించారని కొడాలి తీవ్ర పదజాలంతో దూషించారు. చంద్రబాబునాయుడు చెప్పినట్టు నిమ్మగడ్డ ఆడుతున్నాడని వారి ఆటలు సాగవని కొడాలి హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు వేలల్లో ఉంటే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. Also Read: సెంటిమెంట్ : గుడివాడ నుంచి మంత్రి ఉంటే.. ఆ ప్రభుత్వం కూలినట్టే! గవర్నర్ ను కలసిన నిమ్మగడ్డ ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపామని, ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరించేలా చూడాలని నిమ్మగడ్డ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. తాజాగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, పొరుగు రాష్ట్రం హైదరాబాద్ ఎన్నికలు నిర్వహిస్తోందని నిమ్మగడ్డ గవర్నర్ బిశ్వభూషన్ కు వివరించారని సమాచారం. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించడానికి ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరపడం రాజ్యాంగపరమైన అవసరంగా ఆయన తెలిపారని సమాచారం. ఎన్నికలు వెంటనే నిర్వహించకపోతే 15వ ఆర్థికసంఘం నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ, గవర్నర్ కు వెల్లడించారని తెలుస్తోంది. అయితే దీనిపై గవర్నర్ ఎలా స్పందించారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. కొడాలి నాని పూర్తిగా ఏమన్నారో చూడండి : Tags: Andhra Pradesh PoliticsAP Local body electionsap state election commissionerap state governor biswabushanchandra babu naiduCoronavirus infectionCoronavirus Pandemickodali naninimmagadda ramesh kumarState Election commissionertelugu news
Weight Loss Ayurvedic Tips: ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం అంత సులభం కాదు. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. మొండి కొవ్వును కరిగించుకోవడానికి ఆయుర్వేదంలో చాలా రెమెడీస్ ఉన్నాయి. ఈ సహజ పద్ధతులు బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఆయుర్వేదం ప్రకారం.. బరువును తగ్గించుకునేందుకు ఆహారంలో కొన్ని ఆయుర్వేద మూలికలు, సుగంధ ద్రవ్యాలను చేర్చకోవడం మంచిది. ఈ పద్ధతులు జీవక్రియను పెంచుతాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు పంపుతాయి. వీటిని తిన్న తర్వాత చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. బరువు తగ్గడానికి మీరు ఎలాంటి ఆయుర్వేద చిట్కాలను అనుసరించవచ్చో ఇప్పుడు చూడండి.. మెంతికూర: మెంతులు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మెంతికూర, లేదా మెంతులు తీసుకోవడం ద్వారా మీరు చాలా కాలం పాటు కడుపు నిండిన అనుభూతిని పొందుతారు. ఇవి ఆహార కోరికలను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతికూర శరీరంలో జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. కొన్ని మెంతి గింజలను వేయించి గ్రైండ్ చేసి పౌడర్ చేయండి. ఈ పొడిని ఉదయం ఖాళీ కడుపుతో నీటితో కలిపి తీసుకోవచ్చు. లేదా మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత ఉదయాన్నే ఖాళీ కడుపుతో.. ఈ నీటిని తాగడంతోపాటు విత్తనాలను తినండి. త్రిఫల చూర్ణం: త్రిఫల చూర్ణం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. త్రిఫల చూర్ణం రాత్రి భోజనం తర్వాత కనీసం రెండు గంటల తర్వాత, అల్పాహారానికి అరగంట ముందు వెచ్చని నీటిలో తీసుకోవాలి. పసుపు: పసుపును సాధారణంగా కూరలలో ఉపయోగిస్తారు. పసుపులో బరువు తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి. పసుపును పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. దాల్చిన చెక్క: దాల్చిన చెక్క శరీరంలోని జీవక్రియ రేటును పెంచుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక కప్పు దాల్చిన చెక్క టీని ఉదయాన్నే తీసుకోవడం చాలామంచిది. నల్ల మిరియాలు: నల్ల మిరియాలు పైపెరిన్ మూలకాన్ని కలిగి ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. జీవక్రియను వేగవంతం చేయడం కోసం బ్లాక్ పెప్పర్ టీ తాగడం మంచిది.
వన్ నేషన్ – వన్ రేషన్ కార్డు కార్యక్రమం తెలంగాణలో శుక్రవారం ప్రారంభమైంది. ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న ఎవరైనా ఎక్కడినుంచైనా సరుకులు తీసుకోవచ్చు. రాష్ట్రంలో ఈ విధానాన్ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఎక్కడినుంచైనా ప్రజాపంపిణీ ద్వారా సరుకులు […] TV9 Telugu Digital Desk | Edited By: Aug 09, 2019 | 6:38 PM వన్ నేషన్ – వన్ రేషన్ కార్డు కార్యక్రమం తెలంగాణలో శుక్రవారం ప్రారంభమైంది. ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న ఎవరైనా ఎక్కడినుంచైనా సరుకులు తీసుకోవచ్చు. రాష్ట్రంలో ఈ విధానాన్ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఎక్కడినుంచైనా ప్రజాపంపిణీ ద్వారా సరుకులు తీసుకోవచ్చన్నారు. నేషనల్ పోర్టబులిటీ తెలంగాణ, ఏపీ క్లస్టర్ ద్వారా ఇరు రాష్ట్ర ప్రజలకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన ఎంతోమంది ఏపీకి చెందిన ప్రజలకు వన్ నేషన్ – వన్ రేషన్ కార్డు విధానం ఎంతో లాభం చేకూర్చుతుంది. ఈ విధానం మిగిలిన రాష్ట్రాల్లో కూడా తొందర్లోనే అమల్లోకి రానుంది. నాలుగు రాష్ట్రాల్లో ఈవిధానాన్ని శుక్రవారం ప్రారంభించారు. లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి Follow us on Akun sabarwalInter-state portabilityLaunching the inter-state portability.One Nation One Ration CardPDS rice
Telugu Online News > Entertainment > Tollywood: పూజాకి తగిలిన షాకే రష్మికకి తగిలింది..అయినా తగ్గనటోంది..! EntertainmentNewsTrending Tollywood: పూజాకి తగిలిన షాకే రష్మికకి తగిలింది..అయినా తగ్గనటోంది..! Last updated: 2022/10/16 at 10:28 PM G K Published October 16, 2022 Tollywood: బాలీవుడ్‌లో అంత ఈజీగా మన సౌత్‌లో స్టార్స్‌గా వెలుగుతున్న వారికి సక్సెస్ రాదు. ఈ విషయంలో ఉదాహరణ పూజా హెగ్డేని చెప్పుకోవచ్చు. తెలుగులో రెండు సినిమాలతో పరిచయమైన పూజా ఇక్కడ అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ, టాలీవుడ్‌లో ఆ రెండు సినిమాలతో బాగానే రిజిస్టర్ అయింది. అయితే, అదే సమయంలో బాలీవుడ్ నుంచి ఏకంగా హృతిక్ రోషన్ సరసన నటించే ఛాన్స్ రావడంతో జంప్ అయింది. బెంగుళూరు భామ అయినా ఇటు టాలీవుడ్‌లో అటు బాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకోవడం గ్రేటే. అయితే, హిందీలో పూజా హెగ్డే చేసిన మొదటి సినిమా మొహంజాదారో అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దాంతో అక్కడ బిచాణా ఎత్తేసే పరిస్థితి వచ్చింది. అదృష్టం బావుండి తెలుగులో మళ్ళీ అవకాశాలు రావడం ఇక్కడ సక్సెస్ అయి పాన్ ఇండియా లెవల్ సినిమాలు చేస్తుండటం నంబర్ 1 స్థానానికి చేరుకోవడం అలా అలా జరిగిపోయాయి. ఇక ఛలో వంటి సినిమాతో మొదటి హిట్ అందుకొని చక చకా సినిమాలు చేస్తూ పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కూడా బాలీవుడ్ మీద బాగానే ఫోకస్ పెట్టింది. పూజా హెగ్డేకి పోటీగా అక్కడ తనకంటే ఫాస్ట్‌గా సినిమాలకి సైన్ చేస్తోంది. మొదటి సినిమా అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించింది. గుడ్ బై అంటూ నటించిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. డిఫరెంట్ కాన్సెప్ట్ అయినా ఎందుకో బాలీవుడ్ మేకర్స్‌కి నచ్చలేదు. దాంతో బాలీవుడ్‌లో నటించిన మొదటి సినిమాతో ఫ్లాప్ చూసింది. దాంతో ఇప్పుడు అక్కడ అవకాశాలను ఆచి తూచి ఎంచుకుంటుందట. రష్మిక నటించిన రెండవ సినిమా ఫలితం కూడా తేడా కొడితే హిందీ ఇండస్ట్రీలో అమ్మడు సర్దేసుకోవాల్సిందే అంటున్నారు. బిగ్ బి అమితాబ్ తాప్సీని స్టార్ హీరోయిన్ చేశారు. కానీ, అది రష్మిక విషయంలో వర్కౌట్ కాలేదంటున్నారు.
Telugu News » Telangana » Hyderabad » Covid 19 in telangana telangana health minister etela rajender gives clarity on coronavirus panic in hyderabad Covid 19 in Telangana: వదంతులకు చెక్.. ఆ ఇద్దరికి కరోనా లేదు.. మంత్రి క్లారిటీ తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై నాలుగు రోజులుగా కొనసాగిన ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. ఇద్దరు కరోనా అనుమానితుల నమూనాలను పుణెకు పంపగా.. వైరస్‌ లేదని రిపోర్టుల్లో తేలింది. TV9 Telugu Digital Desk | Edited By: Mar 06, 2020 | 8:01 AM తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై నాలుగు రోజులుగా కొనసాగిన ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. ఇద్దరు కరోనా అనుమానితుల నమూనాలను పుణెకు పంపగా.. వైరస్‌ లేదని రిపోర్టుల్లో తేలింది. ఇటలీ నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ (యువతి), అపోలో ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలి రిపోర్టుల్లో కరోనా నెగిటివ్‌గా వచ్చింది. దీంతో ప్రభుత్వం కాస్త ఊపిరి పీల్చుకుంది. ఈ విషయాన్ని మంత్రి ఈటల రాజేందర్ విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. అయితే ఓ మహిళా టెకీ, అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలికి మొదట ఇక్కడ పరీక్షలు నిర్వహిచారు. ఆ పరీక్షల్లో స్పష్టత కొరవడింది. దీంతో ఆ ఇద్దరికి కరోనా వచ్చినట్లు పుకార్లు ఎక్కువయ్యాయి. దీంతో వారి నమూనాలను పుణెకు పంపారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్టులో నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల మాట్లాడుతూ.. కరోనా విషయంలో అతిగా స్పందించొద్దని సూచించారు. ఇదిలా ఉంటే మరోవైపు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడి ఆరోగ్యం మెరుగవుతోందని వైద్యులు వెల్లడించారు. ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడినా.. 14 రోజుల తరువాతనే డిశ్చార్జ్ చేస్తామని వారు వెల్లడించారు. ఇక గురువారం నాటికి రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు మాత్రమే నమోదు కాగా, మరో 45 నమూనాల ఫలితాలను పరీక్షల నిమిత్తం పంపించారు. కరోనా లక్షణాలతో పరీక్షల కోసం గురువారం గాంధీలో 35 మంది చేరారు. ఇందులో కరోనా బాధితుడి సన్నిహితులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 33 మంది నుంచి శాంపిళ్లు తీసుకొని పరీక్షలకు పంపామని అధికారులు తెలిపారు. కాగా ఇప్పటివరకు గాంధీ ఆసుపత్రికి 169 మంది కరోనా అనుమానితులు వచ్చారు. వారిలో 135 మందిలో వైరస్‌ లేదని తేలింది. మిగిలిన వారి ఫలితాలు రావాల్సి ఉంది.
జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా? బీసీల పల్లకి మోస్తున్న జ‌న‌నేత సీఎం వైయ‌స్ జగన్‌ మళ్లీ వైయ‌స్‌ జగన్‌నే గెలిపించుకుందాం You are here హోం » టాప్ స్టోరీస్ » గ‌డ‌ప గ‌డ‌ప‌లో ఘ‌న స్వాగ‌తం గ‌డ‌ప గ‌డ‌ప‌లో ఘ‌న స్వాగ‌తం 27 Oct 2022 11:41 AM నంద్యాల‌: సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌తో రాష్ట్ర‌వ్యాప్తంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వీరామంగా సాగుతోంది. నంద్యాల జిల్లా శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గం మహానంది మండ‌లం అబ్బీపురంలో ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో ఆయ‌న‌కు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌తి ఇంటి వ‌ద్ద ల‌బ్ధిదారులు ఎదురెళ్లి త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి అందిన సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ..మ‌ళ్లీ జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ‌మే రావాల‌ని ఆశీర్వ‌దించారు. ప్రతి గడప దగ్గర హారతులు, పూలమాలతో ఎమ్మెల్యేకు స్వాగతం ప‌లుకుతున్నారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం నుంచి అందిన పథకాల గురించి వివరిస్తూ.. ప్ర‌జ‌ల సమస్యలను తెలుసుకుంటూ..వాటిని ప‌రిష్క‌రిస్తున్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయంలో వరద నీరు చేరుతోంది. దీంతో గురువారం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడిచిపెట్టారు. Siva Kodati First Published Oct 6, 2022, 7:23 PM IST గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాల దాటికి నగరంలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తింది. ముఖ్యంగా హిమాయత్‌సాగర్‌ నిండు కుండలా మారింది. ఈ నేపథ్యంలో గురువారం హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు అధికారులు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763.5 అడుగులు. అటు వికారాబాద్‌లో భారీ వర్షానికి పొంగిపొర్లుతున్నాయి వాగులు. పెద్దేముల్‌లో పొంగిపొర్లుతోంది ఘాజిపూర్ వాగు. తాండూర్- కోట్‌పల్లి- సంగారెడ్డి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యాలాలలో కాగ్నవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రస్నం, బాగాయిపల్లి, ముదయపేట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగానూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రను అనుకుని పరిసర ప్రాంతాల్లో ఉపరిత ద్రోణి కొనసాగుతుంది. ఉపరితల ద్రోణికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కోస్తాంధ్ర నుంచి ఉత్తరప్రదేశ్‌ వరకు 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల అవర్తనం విస్తరించింది. ద్రోణి, ఉపరిత ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రా జిల్లాల్లో మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ALso REad:ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్.. అతి భారీ వర్షాలు కురిసే చాన్స్.. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వంశధార దేశిబట్టికి రెండుచోట్ల గండిపడి పొలాలు నీటమునిగాయి. జిల్లాలోని పలాస మండలం కేదారిపురం వరహాల గెడ్డలో పడి నిన్న ఇద్దరు గల్లంతయ్యారు. వర్షం కారణంగా పరహాల గెడ్డకు వరద నీరు పోటెత్తడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గల్లైంతన పాడి శంకర్ మృతదేహాన్ని ఈ రోజు ఉదయం వెలికితీశారు. మరోవ్యక్తి కూర్మారావు కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ప్రకాశం, తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు కరుస్తున్నాయి.ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, చీమకుర్తి, పొదిలి, మార్కాపురంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. అనంతపురం జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కల్యాణదుర్గం వర్షానికి పంట పొలాలు నీటమునిగాయి. శ్రీసత్యసాయి జిల్లాలో కూడా వర్షానికి పలుచోట్ల పంటపొలాలు నీటమునిగాయి. విశాఖపట్నంలోనూ భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు రామకృష్ణాపురం ప్రాంతంలో నీరు ఇళ్లలోకి చేరింది. భారీ వర్షాల నేపత్యంలో మత్య్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు.
మార్చి 5, 2022 లో చేసిన తేదీహనీవెల్Tags: హనీవెల్, HUL565 సిరీస్, HUL565 సిరీస్ అల్ట్రా ప్లస్ అల్ట్రాసోనిక్ కూల్ మిస్ట్ హ్యూమిడిఫైయర్, అల్ట్రా ప్లస్ అల్ట్రాసోనిక్ కూల్ మిస్ట్ హ్యూమిడిఫైయర్అభిప్రాయము ఇవ్వగలరు హనీవెల్ HUL565 సిరీస్ అల్ట్రా ప్లస్ అల్ట్రాసోనిక్ కూల్ మిస్ట్ హ్యూమిడిఫైయర్ ఓనర్స్ మాన్యువల్‌లో హనీవెల్ HUL530 సిరీస్ అల్ట్రా గ్లో లైట్ ఛేంజింగ్ హ్యూమిడిఫైయర్ మరియు డిఫ్యూజర్ ఓనర్స్ మాన్యువల్ హనీవెల్ HUL530 సిరీస్ అల్ట్రా గ్లో లైట్ మారే హ్యూమిడిఫైయర్ మరియు డిఫ్యూజర్ ముఖ్యమైన భద్రతా సూచనలను ఈ హ్యూమిడిఫైయర్‌ని ఉపయోగించే ముందు ఈ భద్రతా సూచనలను చదివి, సేవ్ చేయండి. కిందివి: హ్యూమిడిఫైయర్‌ని ఎల్లప్పుడూ ఉంచాలి… పఠనం కొనసాగించు “హనీవెల్ HUL530 సిరీస్ అల్ట్రా గ్లో లైట్ మారుతున్న హ్యూమిడిఫైయర్ మరియు డిఫ్యూజర్ ఓనర్స్ మాన్యువల్” మార్చి 4, 2022 మార్చి 5, 2022 లో చేసిన తేదీహనీవెల్Tags: హనీవెల్, HUL530 సిరీస్, అల్ట్రా గ్లో లైట్ మార్చే హ్యూమిడిఫైయర్ మరియు డిఫ్యూజర్అభిప్రాయము ఇవ్వగలరు హనీవెల్ HUL530 సిరీస్ అల్ట్రా గ్లో లైట్ ఛేంజింగ్ హ్యూమిడిఫైయర్ మరియు డిఫ్యూజర్ ఓనర్స్ మాన్యువల్ హనీవెల్ HFD230 సిరీస్ HFD230BV1 క్వైట్‌క్లీన్ ఓసిలేటింగ్ టవర్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఓనర్స్ మాన్యువల్ QUIETCLEAN® ఆసిలేటింగ్ టవర్ ఎయిర్ ప్యూరిఫైయర్ యజమాని యొక్క మాన్యువల్ HFD230 సిరీస్ ఈ ఉత్పత్తి యొక్క ఆపరేషన్ గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి 1-800-477-0457కి టోల్-ఫ్రీగా మాకు కాల్ చేయండి లేదా మా సందర్శించండి webసైట్ ఇక్కడ: www.HoneywellPluggedIn.com/contact-us ముఖ్యమైన భద్రతా సూచనలను ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌ని ఉపయోగించే ముందు ఈ భద్రతా సూచనలను చదివి, సేవ్ చేయండి. స్థలం… పఠనం కొనసాగించు “హనీవెల్ HFD230 సిరీస్ HFD230BV1 క్వైట్‌క్లీన్ ఓసిలేటింగ్ టవర్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఓనర్స్ మాన్యువల్” మార్చి 2, 2022 మార్చి 4, 2022 లో చేసిన తేదీహనీవెల్Tags: HFD230 సిరీస్, HFD230BV1, హనీవెల్, క్వైట్‌క్లీన్ ఓసిలేటింగ్ టవర్ ఎయిర్ ప్యూరిఫైయర్అభిప్రాయము ఇవ్వగలరు హనీవెల్ HFD230 సిరీస్ HFD230BV1 క్వైట్‌క్లీన్ ఓసిలేటింగ్ టవర్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఓనర్స్ మాన్యువల్ హనీవెల్ HPA030 సిరీస్ HPA030B హెపా ఎయిర్ ప్యూరిఫైయర్ ఓనర్స్ మాన్యువల్ HEPA ఎయిర్ ప్యూరిఫైయర్ యజమాని యొక్క మాన్యువల్ HPA030 సిరీస్ ఈ ఉత్పత్తి యొక్క ఆపరేషన్ గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి 1-800-477-0457కు టోల్-ఫ్రీగా మాకు కాల్ చేయండి లేదా మాని సందర్శించండి webసైట్ వద్ద: www.HoneywellPluggedIn.com/contact-us ముఖ్యమైన భద్రతా సూచనలను ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌ని ఉపయోగించే ముందు ఈ భద్రతా సూచనలను చదివి, సేవ్ చేయండి, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఉపయోగిస్తున్నప్పుడు, ప్రాథమిక జాగ్రత్తలు ఎల్లప్పుడూ పాటించాలి. పఠనం కొనసాగించు “హనీవెల్ HPA030 సిరీస్ HPA030B హెపా ఎయిర్ ప్యూరిఫైయర్ ఓనర్స్ మాన్యువల్” మార్చి 2, 2022 మార్చి 3, 2022 లో చేసిన తేదీహనీవెల్Tags: హెపా ఎయిర్ ప్యూరిఫైయర్, హనీవెల్, HPA030 సిరీస్, HPA030Bఅభిప్రాయము ఇవ్వగలరు హనీవెల్ HPA030 సిరీస్ HPA030B హెపా ఎయిర్ ప్యూరిఫైయర్ ఓనర్స్ మాన్యువల్‌లో హనీవెల్ HPA020 సిరీస్ హెపా ఎయిర్ ప్యూరిఫైయర్ ఓనర్స్ మాన్యువల్ HPA020 సిరీస్ హేపా ఎయిర్ ప్యూరిఫైయర్ యజమాని యొక్క మాన్యువల్ ఈ ఉత్పత్తి యొక్క ఆపరేషన్ గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి 1-800-477-0457కు టోల్-ఫ్రీగా మాకు కాల్ చేయండి లేదా మా సందర్శించండి webసైట్ వద్ద: www.HoneywellPluggedIn.com/contact-us ముఖ్యమైన భద్రతా సూచనలను ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌ని ఉపయోగించే ముందు ఈ భద్రతా సూచనలను చదివి, సేవ్ చేయండి, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఉపయోగిస్తున్నప్పుడు, ప్రాథమిక జాగ్రత్తలు ఎల్లప్పుడూ పాటించాలి. పఠనం కొనసాగించు “హనీవెల్ HPA020 సిరీస్ హెపా ఎయిర్ ప్యూరిఫైయర్ ఓనర్స్ మాన్యువల్” ఫిబ్రవరి 28, 2022 మార్చి 4, 2022 లో చేసిన తేదీహనీవెల్Tags: హనీవెల్, HPA020, HPA020 సిరీస్ హెపా ఎయిర్ ప్యూరిఫైయర్, సిరీస్ హెపా ఎయిర్ ప్యూరిఫైయర్అభిప్రాయము ఇవ్వగలరు హనీవెల్ HPA020 సిరీస్ హెపా ఎయిర్ ప్యూరిఫైయర్ ఓనర్స్ మాన్యువల్‌లో హనీవెల్ HWC775 సిరీస్ డ్యూయల్ కంఫర్ట్ కూల్+వార్మ్ మిస్ట్ హ్యూమిడిఫైయర్ ఓనర్స్ మాన్యువల్ డ్యూయల్ కంఫర్ట్ కూల్ + వార్మ్ మిస్ట్ హ్యూమిడిఫైయర్ ఓనర్ మాన్యువల్ ఈ ఉత్పత్తి యొక్క ఆపరేషన్ గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మాకు టోల్-ఫ్రీ 1-800-477-0457కి కాల్ చేయండి, మాకు ఈ-మెయిల్ చేయండి [ఇమెయిల్ రక్షించబడింది], లేదా మా సందర్శించండి webసైట్ వద్ద: www.HoneywellPluggedIn.com ముఖ్యమైన భద్రతా సూచనలు ఈ హ్యూమిడైఫైయర్‌ని ఉపయోగించే ముందు ఈ భద్రతా సూచనలను చదివి, సేవ్ చేయండి విద్యుత్ ఉపకరణాలు, ప్రాథమిక జాగ్రత్తలు … పఠనం కొనసాగించు “హనీవెల్ HWC775 సిరీస్ డ్యూయల్ కంఫర్ట్ కూల్+వార్మ్ మిస్ట్ హ్యూమిడిఫైయర్ ఓనర్స్ మాన్యువల్” ఫిబ్రవరి 24, 2022 ఫిబ్రవరి 26, 2022 లో చేసిన తేదీహనీవెల్Tags: హనీవెల్, HWC775, HWC778, సిరీస్ డ్యూయల్ కంఫర్ట్ కూల్ వార్మ్ మిస్ట్ హ్యూమిడిఫైయర్అభిప్రాయము ఇవ్వగలరు హనీవెల్ HWC775 సిరీస్ డ్యూయల్ కంఫర్ట్ కూల్+వార్మ్ మిస్ట్ హ్యూమిడిఫైయర్ ఓనర్స్ మాన్యువల్‌లో హనీవెల్ HFD280 సిరీస్ ఎయిర్ జీనియస్ కాంపాక్ట్ టవర్ ఎయిర్ ప్యూరిఫైయర్-వాసన తగ్గించే యజమాని యొక్క మాన్యువల్ AIR GENIUS 4 కాంపాక్ట్ టవర్ ఎయిర్ ప్యూరిఫైయర్/సువాసన తగ్గించే యజమాని యొక్క మాన్యువల్ HFD280 సిరీస్ ఈ ఉత్పత్తి యొక్క ఆపరేషన్ గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి: 1-800-477-0457 www.HoneywellPluggedIn.com/contact-మాకు ముఖ్యమైన సమాచారం మరియు ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌ని ఉపయోగించే ముందు ఈ భద్రతా సూచనలను సేవ్ చేయండి ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఉపయోగిస్తున్నప్పుడు, వాటిని తగ్గించడానికి ప్రాథమిక జాగ్రత్తలు ఎల్లప్పుడూ అనుసరించాలి… పఠనం కొనసాగించు “హనీవెల్ HFD280 సిరీస్ ఎయిర్ జీనియస్ కాంపాక్ట్ టవర్ ఎయిర్ ప్యూరిఫైయర్-వాసన తగ్గించే ఓనర్స్ మాన్యువల్” ఫిబ్రవరి 22, 2022 ఫిబ్రవరి 24, 2022 లో చేసిన తేదీహనీవెల్Tags: ఎయిర్ జీనియస్ కాంపాక్ట్ టవర్ ఎయిర్ ప్యూరిఫైయర్-వాసన తగ్గించేది, HFD280 సిరీస్, హనీవెల్అభిప్రాయము ఇవ్వగలరు హనీవెల్ HFD280 సిరీస్ ఎయిర్ జీనియస్ కాంపాక్ట్ టవర్ ఎయిర్ ప్యూరిఫైయర్-వాసన తగ్గించే యజమాని యొక్క మాన్యువల్ హనీవెల్ స్కాన్‌పాల్ సిరీస్ EDA52-1 మొబైల్ కంప్యూటర్స్ యూజర్ గైడ్ ScanPal™ Series ScanPal™ Series Mobile Computers EDA52-1 EDA52-0 Quick Start Guide EDA52-EN-QS Rev A Apr/06/2021 BOXలో మీ షిప్పింగ్ బాక్స్‌లో ఈ అంశాలు ఉన్నాయని నిర్ధారించుకోండి: ScanPal™ Mobile Computers (Model EDA52 -1 లేదా EDA52 -0); ప్రధాన బ్యాటరీ (3.8V, లిథియం అయాన్ బ్యాటరీ); 10-వాట్ పవర్ అడాప్టర్; మార్చగల అడాప్టర్ ప్లగ్స్; USB ఛార్జింగ్… పఠనం కొనసాగించు “హనీవెల్ స్కాన్‌పాల్ సిరీస్ EDA52-1 మొబైల్ కంప్యూటర్స్ యూజర్ గైడ్” ఫిబ్రవరి 20, 2022 ఫిబ్రవరి 26, 2022 లో చేసిన తేదీహనీవెల్Tags: EDA52-0, EDA520, HD5-EDA520, HD5EDA520, హనీవెల్, మొబైల్ కంప్యూటర్లు, స్కాన్‌పాల్ సిరీస్ EDA52-1 మొబైల్ కంప్యూటర్‌లుఅభిప్రాయము ఇవ్వగలరు హనీవెల్ స్కాన్‌పాల్ సిరీస్ EDA52-1 మొబైల్ కంప్యూటర్స్ యూజర్ గైడ్‌లో హనీవెల్ MFP9720029 హార్నెస్ మరియు బాడీ బెల్ట్ యూజర్ మాన్యువల్ యూజర్ మాన్యువల్ హార్నెస్‌లు మరియు బాడీ బెల్ట్‌ల ఉపయోగం కోసం వ్యక్తిగత రక్షణ పరికరాలు పూర్తి-బాడీ హార్నెసెస్ మరియు బాడీ బెల్ట్‌లు [ఈ వినియోగదారు సూచన మాన్యువల్ అన్ని మిల్లర్ మరియు మిల్లర్ టైటాన్ ఫుల్-బాడీ హార్నెస్‌లను కవర్ చేస్తుంది, అలాగే బాడీ బెల్ట్‌లకు కృతజ్ఞతలు) (మీకు ధన్యవాదాలు. హనీవెల్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ద్వారా తయారు చేయబడిన హనీవెల్ మిల్లర్ ఫాల్ ప్రొటెక్షన్ పరికరాలను మీ కొనుగోలు చేయండి. అందరినీ హెచ్చరిస్తోంది… పఠనం కొనసాగించు “హనీవెల్ MFP9720029 హార్నెస్ మరియు బాడీ బెల్ట్ యూజర్ మాన్యువల్” ఫిబ్రవరి 16, 2022 ఫిబ్రవరి 17, 2022 లో చేసిన తేదీహనీవెల్Tags: హార్నెస్‌లు మరియు బాడీ బెల్ట్‌లు, హనీవెల్, MFP9720029అభిప్రాయము ఇవ్వగలరు హనీవెల్ MFP9720029 హార్నెస్‌లు మరియు బాడీ బెల్ట్‌ల వినియోగదారు మాన్యువల్‌లో హనీవెల్ T87F యూనివర్సల్ థర్మోస్టాట్ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ హనీవెల్ T87F యూనివర్సల్ థర్మోస్టాట్ ఇన్‌స్ట్రక్షన్ అప్లికేషన్ T87F యూనివర్సల్ థర్మోస్టాట్ 24 నుండి 30 Vac రెసిడెన్షియల్ హీటింగ్, కూలింగ్ లేదా హీటింగ్-కూలింగ్ సిస్టమ్‌లకు ఉష్ణోగ్రత నియంత్రణను అందిస్తుంది. తాపన వ్యవస్థల కోసం, అందించిన వాల్‌ప్లేట్‌పై T87F మౌంట్. శీతలీకరణ కోసం మాత్రమే, లేదా హీటింగ్-కూలింగ్ కోసం, 137421A (198170A టెక్స్‌చర్డ్ డిజైనర్ మోడల్ అయితే) రిమోట్ స్విచింగ్‌తో కూడిన హీటింగ్-కూలింగ్ వాల్‌ప్లేట్ లేదా Q539 … పఠనం కొనసాగించు “హనీవెల్ T87F యూనివర్సల్ థర్మోస్టాట్ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్” ఫిబ్రవరి 12, 2022 ఫిబ్రవరి 13, 2022 లో చేసిన తేదీహనీవెల్Tags: హనీవెల్, T87F, T87F యూనివర్సల్ థర్మోస్టాట్, యూనివర్సల్ థర్మోస్టాట్అభిప్రాయము ఇవ్వగలరు హనీవెల్ T87F యూనివర్సల్ థర్మోస్టాట్ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్‌లో పోస్ట్ పేజీకి సంబంధించిన లింకులు 1 2 3 ... 68 పాత పోస్ట్లు <span style="font-family: Mandali; ">శోధన</span> దాని కోసం వెతుకు: ఇటీవలి పోస్ట్లు AGPTEK SY-ZY 2101002 సోలార్ మోషన్ సెన్సార్ గ్యారేజ్ లైట్ యూజర్ మాన్యువల్ BLAUPUNKT CJS601 సిట్రస్ జ్యూసర్ యూజర్ మాన్యువల్ మైక్రోసెన్స్ MS660102 స్మార్ట్ లైటింగ్ కంట్రోలర్ యూజర్ గైడ్‌ని కమీషన్ చేస్తోంది SOUL SB51 బ్లేడ్-అడ్వాన్స్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ యూజర్ గైడ్ Shenzhenshi Youguangxin Keji Kaifa Youxian Gongsi F02 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ సూచనలు ఇటీవలి వ్యాఖ్యలు బి-రైస్ on సిల్వర్‌క్రెస్ట్ HG08181B-US ట్రూ వైర్‌లెస్ బ్లూటూత్ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ STSK 2 E5 ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్
చంద్రుని గురించి విన్నాం కానీ అసలు అంతరిక్షం ఎలా ఉంటుందో తెలుసా. అక్కడ వాతావరణం, రంగు, రుచి, వాసనలాంటివి ఉంటాయో లేదో ఎప్పుడైనా ఆలోచించారా. అసలు భూమిమీద మనం అనుభవిస్తున్నవి స్పేస్ లో ఉంటాయో లేదో తెలుసుకుందాం రండి. భూమ్మీద ఏ చోటకు వెళ్ళినా అక్కడి వాతావరణం బట్టి రంగు, రుచి, వాసన, శబ్దాలు మనకు తెలుస్తుంటాయి. వెళ్ళిన ప్రతీచోటా మనం ఏదోక అనుభూతిని పొందుతూనే ఉంటాం. అలాగే అంతరిక్షంలో కూడా అలాంటి అనుభూతులు ఉంటాయా అంటే….అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. అక్కడ కూడా పైవన్నీ మనం తెలుసుకోవచ్చని చెబుతున్నారు. మామూలుగా వాతావరణం లేని చోట ధ్వని ప్రయాణించదని థియరీ. అలా అయితే స్పేస్ శూన్యం కాబట్టి అక్కడ ఎటువంటి ధ్వనీ ఉండదు….అంతే అనుకుంటున్నారా. కానీ లేదండీ అక్కడ కూడా ధ్వని ఉంటుంది అంట. అయితే భూమ్మీద ఉండేంత ఉండదు. స్పేస్ లో వేలకొద్దీ నక్షత్రాలు, గెలాక్సీ క్లస్టర్లు అన్నీ ఫుల్ గ్యాస్ తో నిండి ఉంటాయిట. వాటిలో ధ్వని ప్రయాణిస్తుంది అని చెబుతున్నారు. 2003లో బ్లాక్ హోల్ నుంచి వచ్చిన శబ్దాలను గుర్తించామని గుర్తుచేస్తున్నారు. అయితే అక్కడ వినిపించిన ధ్వని మనకు సాధారణంగా వినపబే స్థాయిలో ఉండదు కాబట్టి దాన్ని ఫ్రీక్వెన్సీ పెంచి మనకు వినిపించారు. అలాగే స్పేస్ లోకి వెళ్ళిన అస్ట్రోనాట్స్ వాసనలను కూడా పసిగట్టారుట. స్పేస్ వాక్ చేసి తిరిగి వచ్చిన ప్రతీసారీ తమకు ఏదో కాలిన వాసన వస్తుందని చెప్తారుట. మాసం కానీ, ఇనుము కాలిన వాసలా కానీ ఉంటుందని అంటారుట వాళ్ళు. స్పేస్ లో చాలా ఎక్కువగా రేడియేషన్ ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు ఆస్ట్రోనాట్స్ దానికి లోనవుతారు. అప్పడు వాళ్ళు వేసుకునే స్పేస్ సూట్స్, ఇంకా ఇతర పరికాలు హైఎనర్జీ వైబ్రేషన్ కు గురవుతాయిట. అప్పడు విడుదల అయ్యే పార్టికల్స్ నుంచే వచ్చే వాసనే కాలిన వాసనలా ఉంటుందని తేల్చారు శాస్త్రవేత్తలు. ఇక స్పర్శ విషయానికి వస్తే దీనిలో ఎలాంటి మార్పులు లేదని అంటున్నారు. భూమి మీద ఎలా ఉంటుందో స్పేస్ లో కూడా అలాగే ఉంటుందని అంటున్నారు. అయితే అక్కడకు వెళ్ళొచ్చాక చర్మం మరింత మృదువుగా మాత్రం అవుతుందని చెబుతున్నారు. అలాగే రుచి విషయానికి వస్తే అక్కడ కూడా చాలా రకాల రసాయనాలు ఉన్నాయని వాటివల్ల రకరకాల రుచులు ఉంటాయని అంటున్నారు. ఈథైల్ ఫార్మేట్ రసాయనం వల్ల రాస్ బెర్రీ పళ్ళ రుచి, ఇంకా చేదు, వగరు, పులుపు లాంటి రుచులు కూడా ఉంటాయని చెబుతున్నారు. అదీ సంగతి…అక్కడ కూడా మనం అన్ని రకాల అనుభూతులను పొందవచ్చు. అయితే భూమ్మీద ఉండేంద మాత్రం ఎక్సెపెక్ట్ చేయకూడదు అంతే. రాను రాను టెక్నాలజీ మరింత అభివృద్ధి చెంది దానికి కూడా ఏదో రెమిడీ కనిపెట్టేస్తారు అనుకోండి…కానీ అప్పటివరకు మాత్రం ఓపికా వెయిట్ చేయాలి అంతే.
thesakshi.com : వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి డిజైన్‌, ఆ స్థలంలో జరుగుతున్న పనుల్లో జాప్యంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా శనివారం ఆస్పత్రి స్థలం ప్రాంగణంలో ఆస్పత్రి డిజైన్‌, ప్రతిపాదిత పనుల ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వీ ప్రశాంత్ రెడ్డి డిజైన్ నమూనాలు, ప్రతిపాదించిన పనులపై ముఖ్యమంత్రికి వివరించారు. అయితే, డిజైన్ మరియు పని పురోగతిలో జాప్యంపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, 24 అంతస్తుల ఆసుపత్రికి ప్రతి అంతస్తుకు వేర్వేరు నమూనాలు ఎలా ఉంటాయని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా 24 అంతస్తుల్లో ఆసుపత్రిని నిర్మిస్తోందని, అయితే డిజైన్ నమూనాలో మార్పు వచ్చిందని చెప్పారు. పీజీ హాస్టల్‌తోపాటు ఆస్పత్రిలో రోగుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, వాల్యుయేషన్‌, నిర్మాణ పనుల్లో ఎలాంటి రాజీ పడకూడదని ఆదేశించారు. దసరా తర్వాత ప్రగతి భవన్‌లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించి, ఆసుపత్రి పనులు డిజైన్ ప్రకారం పూర్తి చేసి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆయన అన్నారు. Tags: #CM KCR#Harish Rao#KCR#telangana news#telugu newsTelangana State GovernmentV Prashanth ReddyWarangal Super Specialty Hospital
పిల్లలు మరియు ఊహ వేరు చేయలేని రెండు విషయాలు. పిల్లల ఊహకు వ్యాయామం చేయడం వల్ల వారి మెదడు అభివృద్ధికి ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? దిగువ పూర్తి కథనాన్ని చూడండి. పిల్లల ఊహ గురించి శీఘ్ర ప్రశ్న మీ చిన్నారి తమ బొమ్మలతో ఆనందించడం మీరు తరచుగా చూస్తున్నారా? అంటే అక్కడ పిల్లల ఊహలు ఆడుతున్నాయి. పెద్దలతో పోలిస్తే పిల్లల ఊహ సాధారణంగా చాలా పరిమితంగా ఉంటుంది. కాలక్రమేణా, కల్పన మాట్లాడే సామర్థ్యానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది మరియు పర్యావరణంలో పరిస్థితులు మరియు ఉనికిని అర్థం చేసుకోవడానికి పిల్లలకు ఒక సాధనంగా మారుతుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) తల్లిదండ్రులు వారి ఊహ మరియు సృజనాత్మకతను మెరుగుపరుచుకోవడానికి పిల్లలతో తరచుగా రోల్ ప్లే చేయాలని సిఫార్సు చేస్తున్నారు. అలా చేయడానికి, వాస్తవానికి, తల్లిదండ్రుల నుండి మద్దతు అవసరం. ఊహ యొక్క ప్రాముఖ్యత ఏమిటి మరియు దానిని ఎలా సాధన చేయాలి? దాని కోసం, పిల్లల ఊహల గురించి మీరు అర్థం చేసుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి: పిల్లల ఊహకు వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? పిల్లల ఊహ పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధికి సంబంధించినది. డాక్టర్ ప్రకారం. పిల్లల ఎదుగుదల మరియు అభివృద్ధి బాహ్య మరియు అంతర్గత అనే రెండు విషయాల ద్వారా ప్రభావితమవుతుందని పీడియాట్రిక్ న్యూరాలజీలో నిపుణుడు హెర్బోవో సోటోమెంగోలో చెప్పారు. బాహ్య అంశాలలో పోషణ, వ్యాధి, పర్యావరణం మరియు ఉద్దీపన లేదా ఉద్దీపన ఉన్నాయి. బాగా, ఊహ లేదా ఊహను సాధన చేయడం అనేది ఉద్దీపన యొక్క ఒక రూపం. కొన్ని రకాల ఉద్దీపనలలో కథ చెప్పడం మరియు డ్రాయింగ్ ఉన్నాయి. “కథ చెప్పేటప్పుడు, మెదడు చురుకుగా ఉంటుంది మరియు పిల్లలు వినడమే కాకుండా ఊహలను సృష్టిస్తారు. కథకులు, శ్రోతల మెదడు కార్యకలాపాలు ఒకేలా ఉంటాయి. పిల్లలు చెప్పేది అనుభూతి చెందుతారు మరియు ఊహించుకుంటారు," అని డాక్టర్ వివరించారు. హెర్బోవో దక్షిణ జకార్తాలోని సెనాయన్ ప్రాంతంలో కలుసుకున్నప్పుడు (13/11). కథ చెప్పడం అనేది ఫాంటసీ మరియు మెదడు పనితీరుతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. అంతే కాదు, డైస్లెక్సియాతో బాధపడుతున్న పిల్లలకు ఊహ లేదా ఊహాశక్తిని వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఇది వారి మెదడు సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఊహాశక్తిని సాధన చేయడం వల్ల పిల్లలు సమస్యలను పరిష్కరించడం లేదా సమస్యలను పరిష్కరించడం నేర్చుకోవచ్చు సమస్య పరిష్కారం . “కథలు వింటున్నప్పుడు, కథలు విన్నప్పుడు సమస్యలను పరిష్కరిస్తాడు. దీని తర్వాత ఇది ఇలా ఉంటుంది, ఆపై. నేర్చుకో సమస్య పరిష్కారం ఇది పిల్లల తెలివితేటలకు కూడా సంబంధించినది’’ అన్నారాయన. ఏ వయస్సులో పిల్లలు తమ ఊహకు శిక్షణ ఇవ్వాలి? బాల్యం అనేది కల్పనా శక్తి చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయం. ఇది మంచి సంకేతం ఎందుకంటే ఊహ మెదడు పనితీరుకు సంబంధించినది. అయితే, ఏ వయస్సులో పిల్లల ఊహ శిక్షణ పొందడం ప్రారంభించాలి? డా. పిల్లల ఊహకు శిక్షణ ఇవ్వడానికి వయోపరిమితి లేదని హెర్బోవో వివరించారు. సాధారణంగా, మీరు శిశువుగా ఉన్నందున, మీరు మీ పిల్లల ఊహకు శిక్షణ ఇవ్వవచ్చు. "నవజాత శిశువు నుండి కిండర్ గార్టెన్ వయస్సు వరకు, కథలు చెప్పడం లేదా కథలు చెప్పడం ద్వారా ఊహకు శిక్షణ ఇవ్వవచ్చు," అని ఆయన వివరించారు. పిల్లలలో ఊహను ఎలా శిక్షణ ఇవ్వాలి? 1. కథ చెప్పడం మీ చిన్నారి ఊహకు శిక్షణ ఇవ్వడానికి ఇది చాలా సులభమైన మార్గం. పిల్లలు కథలు వింటే మెదడు బాగా పనిచేస్తుందని హెర్బోవో చెప్పారు. అంతే కాదు, కథలు చెప్పడం అనేది పిల్లల పఠనం మరియు మాట్లాడే సామర్థ్యాలకు సంబంధించినది. "ఈ పిల్లల ప్రసంగం మరియు భాషా నైపుణ్యాలు IQకి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి" అని ఆయన వివరించారు. 2. డ్రా పేరెంటింగ్ నుండి ప్రారంభించడం, డ్రాయింగ్ క్రేయాన్స్ లేదా రంగు పెన్సిల్‌లను పట్టుకోవడం ద్వారా పిల్లల ఊహ మరియు చక్కటి మోటారు నైపుణ్యాలను శిక్షణనిస్తుంది. మీ పిల్లల ఊహను పెంచడానికి, మీరు అతనిని సూర్యుడిని గీయమని అడగవచ్చు కానీ పసుపు రంగును ఉపయోగించకూడదు. ఇది మీ చిన్న పిల్లల ఊహను పెంచుతుంది మరియు అతను సృజనాత్మకంగా ఉండనివ్వండి. 3. స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే వివిధ గమనికలతో కూడా ఊహ శక్తిని మెరుగుపరుచుకునే మార్గం. డాక్టర్ హెర్బోవో వివరించారు స్క్రీన్ ప్లే పిల్లవాడు తెరపై ఏమి ఉందో ఊహించుకోవడంలో పాల్గొంటే ఊహకు శిక్షణ ఇచ్చే ప్రదేశంగా ఉపయోగించవచ్చు. "కానీ ఆచరణలో ఇది ప్రభావవంతంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే పిల్లలు వారి ఊహలను ఊహించుకోవడం కంటే వారి గాడ్జెట్‌లతో ఆడుకోవడంలో ఎక్కువ బిజీగా ఉన్నారు" అని డాక్టర్ వివరించారు. హెర్బోవో. మీరు ధరించాలనుకున్నప్పుడు గాడ్జెట్లు ఊహకు మెరుగులు దిద్దే సాధనంగా, వీడియోలను చూసేటప్పుడు మీరు మీ పిల్లలతో పాటు ఉండేలా చూసుకోండి. అదనంగా, మీరు మీ పిల్లలను అతను చూసే వీడియోల గురించి కూడా అడగవచ్చు, తద్వారా రెండు-మార్గం పరస్పర చర్య ఉంటుంది.
"అలవాటు లేకపోవడం ఏమిటండీ బాబు... ప్రగతిమైదాన్ ఎగ్జిబిషన్ కి ఏ టైములో వెళ్ళినా ఇదే సంగీతం. రేడియోలో ఇదే... టీవీలో ఇదే... అదేమిటో కొందరు శుభమా అంటూ పెళ్ళి చేసుకుంటూ కూడా ఇదే సంగీతం పెడతారు". "అవగాహన లోపం-అంతే... పోనీ లెండి. బిస్మిల్లా, వి.జి.జోగ్ షెహనాయ్- వైలిన్ జుగల్ బందీ రికార్డు పెడతాను వినండి". "ఆహా... ఇది మరీ బావుంది... ఒకరికిద్దరు ఏడుస్తున్నారన్న మాట. ఆ ఏడిచేదేదో ఒక్కరే ఏడవచ్చు గదండీ. డ్యూయెట్ గా ఏడవడం దేనికి?.... ఓహో... ఏం పోటీగా ఏడుస్తున్నారండీ... కాసేపు విడివిడిగా, కాసేపు జమిలిగా, కాసేపు నెమ్మదిగా, కాసేపు స్పీడుగా... అబ్బ... ఏడవడంలో కూడా ఎంత పాండిత్యమండీ...." "అన్నప్రాశన నాడే ఆవకాయా అన్నట్టు అవగాహన లేని మీలాంటి వారికి ఆగ్రా ఘరానా ఫయ్యాజ్ ఖాన్ ఆలాప్ తో ప్రారంభిస్తే హడలెత్తి పారిపోతారనే ఉద్దేశ్యంతో సున్నితంగా, మధురంగా ఉండే బిస్మిల్లా షెహనాయితో మొదలు పెట్టాను. కాని షెహనాయి మీకు పడినట్టు లేదు. పోనీ పండిత్ రామ్ నారాయణ్ గారి సారంగి వినిపిస్తాను వినండి". "అయ్యో రామ... సారంగి అంటే ఇదా.. ఇది తెలియక పోవడం ఏమిటి? రాష్ట్రపతి, ప్రధాని మొదలైనవారు దివంగతులైనప్పుడు రేడియోలో వినిపించేది ఇదే గదండీ... ఆహా... మన వాళ్ళు ఎంత స్పెషలైజేషన్ ఏర్పాటు చేశారండీ. చావు సంగీతం కోసం ప్రత్యేకంగా ఒక వాయిద్యాన్నే కేటాయించారు! అవునూ... ఆయన వాయించేది మృత్యురాగమా అండీ?" "మృత్యురాగం అంటూ ఒకటి ప్రత్యేకంగా లేదండీ". "అహ... ఏం లేదు. ఇందాక మీరు విషాద రాగం, కరుణ రాగం, శృంగార రాగం అంటేనూ... అలాగే మృత్యురాగం కూడా ఉందేమోనని....". "ఇది బైరాగి భైరవ్ రాగం". "అంటే శ్మశానంలో బైరాగులు పాడుకునే సంగీతం అన్నమాట. లేకపోతే శ్మశానవైరాగ్య రాగం. మొత్తం మీద కాస్త అటూ యిటూగా నా ఊహ కరక్టే. ఇంతకీ ఈ రామనారాయణం గారు చావు సంగీతంలో నిష్ణాతుడా అండీ?" "ఛ... అదేమిటండీ అలా అంటారు?" "మృత్యు సంగీత సమ్రాట్, మరణ సంగీత మార్తాండ వగైరా బిరుదులేవైనా ఉన్నాయా ఈయనకి?" "అవేవీ లేవుగాన మీరు మాట్లాడడం మానేసి ఒక్క నిముషం మౌనంగా విని చెప్పండి ఎలా ఉందో" "మీరు చెప్పినట్టు ఒక్క నిముషం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించాను. ఇంక చాలండి బాబు... దుఃఖం ముంచుకొచ్చేస్తోంది" "మీరు ఈ సంగీతాన్ని చాలా శ్రద్ధగా వినాలి. అలా లైట్ గా తీసుకోకూడదు". "దుఃఖ భారంతో ఇంత హెవీగా ఉంటే లైట్ గా ఎలా తీసుకుంటామండీ..." "మీకు డోసు హెవీ అయినట్టుంది. కొంచెం లైట్ గా తేలిగ్గా జీర్ణమయ్యే ఫారెక్స్ లాంటి సితార్ సంగీతం వినిపిస్తానాగండి... ఇదుగో... ఇది విశ్వవిఖ్యాత సితార్ విద్వాంసుడు, పద్మవిభూషణ్, దేశికోత్తమ పండిత్ రవిశంకర్ గారి రికార్డు. వీరిది ఎల్లలెరుగని విశ్వజనీన సంగీతం. ఆ బాలగోపాలాన్ని ఉర్రూత లూగించిన సంగీతం. విని చెప్పండి ఎలా ఉందో". "ఏదో బాగానే ఉందనుకోండి...." "హమ్మయ్య... మొత్తానికి మీ చేత బాగానే ఉందనిపించాను. ఎంత చెప్పినా రవి శంకర్ రవిశంకరే". "భలే వారండీ... సుతారంగా సితారు టింగు టింగు మంటుంటే బావుండక ఛస్తుందా? కానీ... ఎంతసేపని వింటాం? ఆయన ఎందుకు వాయిస్తున్నాడో, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఏమీ తెలిసిచావడం లేదు. ఇప్పటికి మూడు నిముషాలయ్యింది. ఇంత వరకు పాట మొదలు పెట్టలేదు". "ఇందులో పాట ఉండదండీ. ఇది వాద్య సంగీతం కదా?" "అయితే... పాటా, కీర్తనా, భజనా పాడూ ఏమీ లేకుండా ఊరికే ఎంత సేపయినా అలా టింగు టింగు మని తీగలు మీటుతూ ఉంటాడన్న మాట. రికార్డు ఇంకా మొదట్లోనే ఉంది. చులాగ్గా ఇంకో ఇరవై నిముషాలు లాగించేట్టున్నాడు". "ఇరవై నిముషాలేమిటండీ... కచేరీలో అయితే ఆలాప్, జోడ్, ఝాలా, విలంబిత్ గత్, మధ్యలయ్ గత్, ధ్రుత్ గత్, అతిధ్రుత్ గత్ రెండు గంటల సేపు వాయించి అదరగొట్టి పారేస్తారు. మీరు విని తీరాలి". "ఇంకా నయం... ఏదో ఫ్రీగా వినిపిస్తున్నారు కాబట్టి, వద్దంటే తీసేస్తారు కాబట్టి వింటున్నాగాని, డబ్బిచ్చి కచేరీకి వెళ్ళి గంటల తరబడి ఈ సుత్తెక్కడ భరించగలనండి బాబు? శుభ్రంగా సినిమా పాటలైతే కవిత్వం, భావాలు, అర్ధాలు మొదలైనవి ఉంటాయి. కొన్ని పాటల్లో అయితే శ్లేష కవిత్వం కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్క మాటకీ రెండేసి అర్థాలన్నమాట. పోనీ అవేవీ వద్దు. భక్తీ ముక్తీ మున్నగునవి కావాలనుకుంటే త్యాగయ్య గారి కీర్తనలున్నాయి. రామా... బ్రోవవా... కావవా, మొరాలకింపవా, కడతేర్చవా అంటూ మొత్తుకుంటాడు ఆయన. త్యాగయ్య భక్తి, సుందర్రామూర్తి రక్తి లేకుండా ఇదేం సంగీతమండీ బాబు? అసలీ రవిశంకర్ గారికి ఇంత పేరు ఎలా వచ్చిందండీ?" "అర్థమయ్యింది... మీకు కావాల్సింది గాత్ర సంగీతం. మామూలుగా అందరికీ వాద్య సంగీతం తొందరగా నచ్చుతుంది. గాత్ర సంగీతం ఓ పట్టాన బుర్రకెక్కదు. మీరు అందరిలాంటి వారు కారు. గాత్ర సంగీతం వినిపిస్తాను ఆగండి. ఇందులో అయితే మీక్కావాల్సిన సాహిత్యం కూడా ఉంటుంది. ఇంక వినండి శ్రద్ధగా" "ఇద్దరు పాడుతున్నట్టుందే...." "అవును... డాగర్ బ్రదర్స్" "మీకు కోపం వస్తుందేమోనని నోరు మూసుకు వింటున్నాను. నాలుగు నిముషాలయ్యింది. ఒక్క అంగుళం ముందుకు కదల్లేదు. ఇంకా ఆ... ఈ... అంటూ సాగదీస్తున్నారు-ఏకులోంచి నూలు లాగినట్లుంది. ఏదో సాహిత్యం అన్నారు. దాని జాడ ఇంతవరకు కనిపించలేదు". "ఆలాప్ అలాగే స్లోగా ఉంటుంది. కాస్త ముందుకు జరిపి పెడతాను ఆగండి....." "మీరు ముందుకు జరిపి పెట్టినా వాళ్ళ సంగీతం ఇంకా అక్కడే ఉంది. కీర్తనా లేదు. పాడూ లేదు. ఇదేం సంగీతమండీ?" "దీన్ని ధ్రుపద్ సంగీతం అంటారు. దీని టెక్నిక్కే అంత. ముందు మధ్యసప్తక్ తో ప్రారంభిస్తారు. అక్కణ్ణించి మంద్రసప్తక్ కి, అతి మంద్ర సప్తక్ కి వెళ్ళి, క్రమంగా మళ్ళీ మధ్య సప్తక్ కి తిరిగి వచ్చి, స్లోగా తారసప్తక్ కి వెడతారు. ఒక సప్తక్ కి పూర్తిగా మధిస్తేగాని మరో సప్తక్ లోకి అడుగు పెట్టరు. అలా ఆలాప్ పూర్తి చేశాక 'నొంతొం' అందుకుంటారు. అది కూడా ఇలాగే ఎలాబరేట్ గా పాడతారు. ఆ తర్వాత ధ్రుపద్ బందిష్- అంటే సాహిత్య రచన-అందుకుంటారు. దీని అసలు పేరు 'ధ్రువపద'. క్రమంగా అదే ధ్రుపద్ గా మారింది". "పేరు మాత్రం అతికినట్టుగా సరిపోయిందండీ. 'ధ్రువ' అంటే ఉత్తరధ్రువం, దక్షిణ ధ్రువంలాగా కదలకుండా స్థిరంగా ఉండేది అని అర్థం. 'పద' అంటే పాదం అని అర్థం. అంటే పాదం ముందుకి కదపకుండా ఎక్కడున్నది అక్కడే పడి ఉండే సంగీతం అని అర్థం. అంతే కదండీ?" "మీకు ఇలా లాంగ్ ప్లే రికార్డు వినిపించడం నాదే తప్పు. మూడు నిముషాల్లో ఫినిష్ అయిపోయే 78 ఆర్.పి.ఎం. రికార్డు వినిపిస్తానుండండి. అందులోనూ మాంఛి రమ్జుగా ఉండే బడేగులాం ఆలీఖాన్ గుజరీ తోడి ఖయాల్ రికార్డు పెడతాను వినండి. బందిష్ కూడా ఆయన సొంతం". "ఇదేవిటండీ... ఈయన సాహిత్యాన్ని అలా నరికి పోగులు పెడుతున్నాడు. ఒక్క ముక్క అర్థమై చావడం లేదు" "భాష తెలియకపోవడం వల్ల మీకు అర్థం కావడం లేదు. ఆయన హిందీలో పాడుతున్నాడు". "భలేవారండీ నాకు హిందీ క్షుణ్ణంగా వచ్చు. విశారద దాకా చదివాను. ఆయన ఉరుముతున్నట్లు, గర్జిస్తున్నట్లు, మీదికి లంఘిస్తున్నట్లు పాడతాడేం? చక్కగా తలత్ మహమూద్ లా సాఫ్టుగా పాడకూడదూ?" "ఆయన గమకాలు వేసి పాడుతున్నాడు. క్లాసికల్ సంగీతానికి పుష్టినిచ్చేవి ఆ గమకాలే. వాటిల్లో ఎన్నో రకాలున్నాయి. 'ధర్తీకా ధడ్కన్' అని ఒక రకం ఉంది. ఆ గమకం పాడుతుంటే భూకంపంలా అదిరిపోతూ ఉంటుంది. 'మేఘ్ గర్జన్' అని ఇంకోటి ఉంది. అది మీరిందాక చెప్పినట్లు మేఘాల ఉరుముతున్నట్టు ఉంటుంది". "సింహగర్జన్ లేదా?" "అబ్బే అది లేదు?" "బతికి పోయాం. అది కూడా ఉంటే ఈ పాటికి ఆయన సింహావతరాంలా మీదికి లంఘించి చీల్చి చెండాడి ఉండేవాడు. అయితే గురూగారూ.. ఈ క్లాసికల్ సంగీతం అంతా ఇహ ఇంతేనా?" "అంతా ఇలాగే ఎందు కుంటుంది? క్లాసికల్ లో ఎన్నో రకాలున్నాయి. వాటిల్లో హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం ప్రధానమైనవి. ఇవికాక పర్షియన్, అరేబియన్, ఈజిప్షియన్, చైనీస్ సంగీతాలున్నాయి. ఒక్కొక్క దాని స్టయిల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది". "హిందుస్థానీ అంటే ఎలా ఉంటుందండీ?" "ఇప్పటి దాకా మీరు విన్నది హిందుస్థానీ సంగీతమే". "అయితే... ఒక్క వాక్యంలో చెప్పాలంటే... ఈసురో మంటున్నట్టు, ఈగలుదోలుకుంటున్నట్లు ప్రారంభమై, తొడగొట్టి సవాలు చేస్తున్నట్టు, గుడ్లురుముతున్నట్టు, మీద పడి కరుస్తున్నట్టు అంతమయ్యేది హిందుస్థానీ సంగీతమన్న మాట". "పరిచయం లేనివారికి మొదట్లో అలాగే అనిపిస్తుంది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. భయపడి పారిపోకుండా ధైర్యంగా ఎదుర్కోండి. అప్పుడప్పుడూ వచ్చి కొద్ది కొద్దిగా వినిపోతూ ఉఁడండి. క్రమక్రమంగా అది మచ్చికవుతుంది. దానిపై ఆసక్తి, అనురక్తి కలుగుతాయి. ఒకసారి దాని రుచి తెలిసిందంటే ఇంక వదిలి పెట్టరు. స్పిక్ మాకే వారి సోదాహరణ ప్రసంగకార్యక్రమాలకి హాజరవుతూ ఉండండి. మీ అవగాహన పెరుగుతుంది". "స్పిక్ మాకే ఏమిటండీ?" "SPIC MACAY అంటే SOCIETY FOR PROMOTION OF INDIAN CLASICAL MUSIC AND CULTURE AMONG YOUTH. యువతరం వారిలో శాస్త్రీయ సంగీతం పట్ల అభిరుచి, అవగాహన పెంచడానికి కృషి చేస్తున్న సంస్థ అది. విశ్వవిద్యాలయాలలోనూ, కళాశాలల్లోనూ గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల చేత సోదాహరణ ఉపన్యాసాలు ఇప్పిస్తూ ఉంటారు. విద్యార్థుల సందేహాలకి విద్వాంసులు ఉదాహరణ పూర్వకంగా సమాధానాలిస్తుంటారు. చొప్పదంటు ప్రశ్నలకి కూడా విసుక్కోకుండా చాలా ఓపికగా జవాబులిస్తుంటారు. ఆ కార్యక్రమాలు ప్రత్యేకంగా మీలాంటి వారి కోసమే". "ఏమో గురూ గారూ... ఈ క్లాసికల్ మ్యూజిక్కు నాకు అర్థమైచావదు". "తెలుసుకోవాలన్న కోరికంటూ ఉండాలే గానీ తప్పక అర్థమవుతుంది. గ్రానైట్ రాయిని కూడా అద్దంలా మెరిసేట్టు పాలిష్ పెట్టవచ్చు. రెగ్యులర్ గా వినండి. మీ అవగాహన పాలిష్ట్ గ్రానైట్ లా మెరుస్తుంది. సంగీతం పాడాలంటే పూర్వ జన్మ వాసన అవసరం గాని విని ఆనందించడానికేముంది? శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గాన రసం ఫణిః అన్నారు పెద్దలు". "అన్యాపదేశంగా భలే దెబ్బ కొట్టారు గురూగారూ...! ఇంతకీ నేను శిశువుననా, పశువుననా మీ ఉద్దేశ్యం?". నండూరి పార్థసారథి (1991లో రచన సచిత్ర మాస పత్రికలో ప్రచురితమయింది) Previous Post Next Post Random Article I'm Feeling Lucky! Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works
కరోనా.. మొన్నటి వరకు ప్రపంచంలోని కొన్ని దేశాలనే వణికించిన ఈ వైరస్.. ఇప్పుడు మన దేశాన్ని కూడా వణికిస్తోంది. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయన్న వార్తలు.. TV9 Telugu Digital Desk | Edited By: Mar 04, 2020 | 9:02 PM కరోనా.. మొన్నటి వరకు ప్రపంచంలోని కొన్ని దేశాలనే వణికించిన ఈ వైరస్.. ఇప్పుడు మన దేశాన్ని కూడా వణికిస్తోంది. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయన్న వార్తలు.. ప్రజల్ని భయకంపితుల్ని చేస్తోంది. అయితే ఈ కరోనా బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే.. ఎంతో మంచిది. కరోనా లక్షణాలు.. కరోనా వ్యాధి బారిన పడితే.. ప్రాణాలు దక్కడమనేది.. చాలా అరుదు. ఎందుకంటే ఇప్పటి వరకు మూడు వేలమందికి పైగా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం. ఈ కరోనా వైరస్ బారిన పడిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది. అంతేకాదు గొంతు కాస్త మంటగా ఉంటుంది. ఆ తర్వాత క్రమేపీ తలనొప్పి, జ్వరం, దగ్గు మొదలవుతాయి. క్రమక్రమంగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అయితే ఇలాంటి లక్షణాలు అనిపిస్తే.. వెంటనే స్థానిక ఆస్పత్రికి వెళ్లి.. పరీక్షలు చేయించుకోవాలి. ఈ కరోనా వ్యాప్తి చెందేది ఎలా..? ఈ కరోనా వైరస్.. ప్రస్తుతం మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాపిస్తోంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి.. తుమ్మినా, దగ్గినా.. పక్కన ఉన్న వ్యక్తులకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ వైరస్ బారిన పడిన వ్యక్తిని టచ్ చేసినా.. కరచలనం చేసినా.. ఇతరులకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు.. ఈ వైరస్ బారిన పడ్డ వ్యక్తులు ముట్టుకున్న వస్తువుల్ని మరేదైనా కానీ ముట్టుకుంటే.. అక్కడి నుంచి వైరస్ క్రమంగా ఇతరుల శరీరంపై ఎటాక్ చేస్తుంది. అంతేకాదు.. క్రమంగా అవి నోట్లోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. దీంతో ఈ వైరస్ వ్యాపించినట్లే అవుతుంది. ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. వైరస్ రాకుండా టిప్స్.. ప్రస్తుతం ఈ కరోనా వైరస్‌కు మందు లేదు. ఈ వ్యాధి రాకుండా నివారణ ఒక్కటే మార్గం. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే.. క్రమంతప్పకుండా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని చేతులతో టచ్ చేయకూడదు. అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా కరోనా అనుమానితులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక దగ్గు, జ్వరం లాంటివి వస్తే.. బయట తిరగడం మానేయాలి. ఎక్కువ నీరు తాగుతూ.. రెండు రోజుల పాటు గమనించాలి. అప్పటికీ జ్వరం, దగ్గు తగ్గకపోతే.. ఎవర్నీ దగ్గరకు రానీయకుండా.. వైద్యుడిని సంప్రదించాలి.
నవ మాసాలు మోసి బిడ్డను కంటారు అందరూ. గర్బం దాల్చినపుడు సదరు తల్లి పడే బాధలు అన్ని ఇన్నీ కావు. కానీ ఇవేమీ తెలియకుండా ఓ మహిళ తల్లి అయింది. సాధారణంగా మహిళలు గర్భంతో ఉన్న విషయం మూడో నెలలో తెలుస్తుంది. మొత్తమ్మీద నవమాసాలు మోసి మహిళలు మాతృత్వపు మధురిమలు చవిచూస్తారు. అయితే బ్రిటన్ లో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఓ యువతి తాను గర్భవతినని తెలుసుకున్న మరుసటి రోజే బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతకీ ఆమె గర్భవతినని తెలుసుకున్నది 39 వారాల తర్వాత! ఆమె పేరు మోలీ గిల్బర్ట్. 25 ఏళ్ల మోలీ నాటింగ్ హామ్ షైర్ లోని ట్రోవెల్ ప్రాంతంలో నివసిస్తుంటుంది. ఆమె సెప్టెంబరు 7న పండంటి మగ బిడ్డను ప్రసవించింది. విస్మయం కలిగించే విషయం ఏమిటంటే... తాను గర్భవతినని ఆమెకు తెలిసింది కాన్పుకు ముందురోజేనట. సహజంగా గర్భం దాల్చినప్పుడు స్త్రీలలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, వికారంగా ఉండడం, నీరసం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే బ్రిటన్ యువతి మోలీ గిల్బర్ట్ లో ఈ లక్షణాలేవీ లేకపోవడంతో తాను గర్భం దాల్చిన విషయాన్ని ఇన్నాళ్ల పాటు ఆమె తెలుసుకోలేకపోయింది. కొంత బరువు పెరగడం తప్ప ఇతర మార్పులేవీ కనిపించలేదు. ఆమె ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం కొంతకాలంగా ఆసుపత్రికి వెళుతున్నా గానీ, ఆమె గర్భం సంగతి ఆసుపత్రి సిబ్బంది కూడా గుర్తించలేకపోయారు. తనకు బిడ్డ పుట్టడంపై మోలీ గిల్బర్ట్ స్పందిస్తూ ఆర్నెల్ల కిందటే సహజీవన భాగస్వామితో విడిపోయానని, గర్భం వచ్చే అవకాశాలే లేవని భావించానని పేర్కొంది. తన మాజీ భాగస్వామికి ఈ విషయం చెబితే అతడు నమ్మలేకపోయాడని వివరించింది. SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com Categories National International Business Sports Health Education Science Technology Foods Entertainment Lifestyle
`వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా` కేసీఆర్` కేసీఆర్ అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ మండిప‌డ్డాడు. దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశాడు. చైనా సైన్యానికి అనుకూలంగా మాట్లాడిన తెలంగాణ సీఎం రాజీనామా చేయాల‌ని కోరాడు. దేశ భ‌క్తిలేని మూర్ఖుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యాడు. నాలుక‌లు కోసే ద‌మ్ము దైర్యం ఉందా? అంటూ నిల‌దీశాడు. By CS Rao Updated On - 05:42 PM, Mon - 8 November 21 `వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా` కేసీఆర్` కేసీఆర్ అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ మండిప‌డ్డాడు. దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశాడు. చైనా సైన్యానికి అనుకూలంగా మాట్లాడిన తెలంగాణ సీఎం రాజీనామా చేయాల‌ని కోరాడు. దేశ భ‌క్తిలేని మూర్ఖుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యాడు. నాలుక‌లు కోసే ద‌మ్ము దైర్యం ఉందా? అంటూ నిల‌దీశాడు. సీబీఐ విచార‌ణ‌ను ఎదుర్కొంటోన్న తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ దుయ్య‌బ‌ట్టాడు. పార్ల‌మెంట్లో రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఎక్క‌డున్నాడో చెప్పాల‌ని కోరాడు. మందుకు ఇచ్చినంత విలువ తెలంగాణ‌కు ఇవ్వ‌న‌టువంటి ప‌చ్చి ద‌గాకోరుగా కేసీఆర్ ను అభివ‌ర్ణించాడు. కేసీఆర్ చెప్పిన అబ‌ద్దాల‌పై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ ఫైర్ అయ్యాడు. తెలంగాణ ద్రోహి కేసీఆర్ ఆంటూ చిట్టాను విప్పాడు. వ‌రి పంట విష‌యంలో కేంద్రం కొనుగోలు చేయ‌డానికి అనుమ‌తిస్తూ జారీ చేసిన ఆర్డ‌ర్ కాపీని బ‌య‌ట‌పెట్టాడు. ఉప్పుడు బియ్యం మాత్ర‌మే కొనుగోలు చేయ‌మ‌ని కేంద్రం చెప్పింద‌ని, వ‌రి పంట‌ను కొనుగోలు చేయ‌మ‌ని ఎక్క‌డ చెప్పారో తేల్చాల‌ని నిల‌దీశాడు. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రానికి ప్ర‌తి ఏడాదిదికి ఎంత నిధుల‌ను ఇచ్చారో బండి బ‌య‌ట‌పెట్టాడు. డీజిల్‌, పెట్రోలుపై వ్యాట్ ను 2015లో పెంచుతూ జారీ చేసిన జీవోను బండి విడుద‌ల చేశాడు. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్టాడు. కృష్ణా న‌ది జ‌లాల‌పై కేసీఆర్ చేసిన మోసాన్ని బండి వివ‌రించాడు. Also Read : కేసీఆర్ జైలు..బండి నాలుక కోత‌..తెలంగాణలో పొలిటిక‌ల్ హీట్ తెలంగాణ‌కు రావాల్సిన వాటాను రాబట్టుకోకుండా కేవ‌లం 299టీఎంసీల నీటి వాటాకు అంగీక‌రిస్తూ కేసీఆర్ చేసిన సంత‌కంపై మండ‌ప‌డ్డాడు. రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల సీమ‌గా మార్చుతానంటూ హామీ ఇచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అన్నీ అబ‌ద్దాలు చెబుతున్నాడని మండిపడ్డాడు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్టాడు. రైతుల‌ను మోసం చేయ‌కుండా వ‌రి పంట‌ను కొనుగోలు చేయాల‌ని కేసీఆర్ కు హిత‌వు ప‌లికాడు. తెలంగాణ కోసం చేసిన దొంగ‌దీక్ష గురించి బండి ప్ర‌స్తావించాడు. ఆనాడు లిక్విడ్ ప్లూయిడ్ ను తీసుకున్న తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ ధ్వ‌జం మెత్తాడు.
సౌమిత్ర కేవలం సినీరంగంపై మాత్రమే కాదు, నాటకరంగం మీద కూడా తన ముద్ర వేశారు. ‘ఎక్కోన్’ అనే సాహిత్య పత్రికకు సహసంపాదకుడిగా 18ఏళ్ళు పని చేశారు. కవిగా పన్నెండు కవితా సంకలనాలు వెలువరించారు. అనేక మంచి పెయింటింగ్‌లు వేశారు. ప్రగతిశీల భావాలతో సమాంతర రాజకీయాలపై ప్రతిస్పందించారు. ప్రజా ఉద్యమాలకు సంఘీభావం తెలిపారు. ‘మనమంతా బతకడానికి డబ్బు సంపాదిస్తాం, కానీ శ్వాసకూ జీవితానికీ అవతలి వైపు కూడా ఆలోచించాలి. లేకుంటే మన ఉనికి ఆత్మలేనిది అవుతుంది’ అన్న మాటలపై విశ్వాసం ఉన్న గొప్ప నటుడు సౌమిత్ర చటర్జీ. భారతీయ కళాత్మక సినిమాలకు మహావృక్షం లాంటి సత్యజిత్ రే నుంచి ఎదిగిన ఒక శాఖ ఆయన. 1959లో రే ‘అపూర్ సంసార్’ సినిమాతో ఆరంభమయిన సౌమిత్ర చటర్జీ ప్రయాణం ఆయనతో 14 ఫీచర్ సినిమాలు, ఒక షార్ట్ ఫిలిం దాకా సాగింది. అందుకే సౌమిత్ర చటర్జీ అనగానే మరుక్షణం సత్యజిత్ రే గుర్తుకొస్తారు. ‘అపూర్ సంసార్’, ‘చారులత’ సినిమాలు మన ముందు కదలాడతాయి. పాత్ర ఎంత సులభమైనదయినా ఎంత సంక్లిష్టమైనదయినా ఆ పాత్రలోకి రూపాంతరం చెందడం సౌమిత్ర చటర్జీ మౌలిక లక్షణం. అంతేకాదు, తన పాత్ర పోషణలో సరైన టైమింగ్‌ను పాటించడంలో, ఆయా పాత్రల మనోభావాల్ని పలికించడంలో ఆయనది విలక్షణమైన సరళి. రచయిత రూపొందించిన పాత్రకు దర్శకుడు ఆశించిన రీతిలో వ్యక్తీకరణలను ప్రకటించడం, అందుకు తగ్గ స్వర మాడ్యులేషన్‌ని పలికించడంలో చటర్జీ ప్రతిభ సహజంగా ఉండి ఎలాంటి మెలోడ్రామాకు తావు లేకుండా ఉంటుంది. అది ఆయన విశిష్టత. ‘సౌమిత్ర చటర్జీ అంగసౌష్టవం యవ్వనంలో ఉన్నప్పటి రవీంద్రనాథ్ టాగోర్‌ను పోలిఉండడంతో సత్యజిత్ రే ఆయనను అన్ని సినిమాల్లోకి తీసుకున్నాడని’ సుప్రసిద్ధ సినీ విమర్శకుడు చిదానంద దాస్ గుప్తా తన ‘టాకింగ్ అబౌట్ ఫిలిం’ పుస్తకంలో వ్యాఖ్యానించారు. అంతే కాదు, అమాయకత్వాన్ని ప్రతిబింబించే ముఖంతో పాటు పెద్దరికాన్ని గాంభీర్యాన్నీ ఏకబిగిన పలికించగలిగిన కళ్ళు, పాత్రకు తగ్గట్టుగా సులభంగా మలుచుకోగలిగిన శరీర లక్షణం నటుడిగా ఆయన గొప్ప విజయం సాధించడానికి దోహదపడ్డాయి. 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సౌమిత్ర సత్యజిత్ రే దర్శకత్వం వహించిన ‘జల్ సాగర్’ చిత్రం సెట్స్‌కి వెళ్ళాడు. అతణ్ణి చూసిన రే తన తర్వాతి సినిమాలో ఇతడే ప్రధాన పాత్రధారి అని ప్రకటించడంతో సౌమిత్ర చటర్జీతో సహా అంతా ఆశ్చర్యపోయారు. అట్లా మొదలయిన ఆయన నటజీవితం మొన్నటివరకు అవిశ్రాంతంగా సాగింది. సౌమిత్ర చటర్జీ బాల్యం కృష్ణానగర్‌లో గడిచింది. అనంతరం సౌమిత్ర తండ్రి కలకత్తా హైకోర్ట్‌లో న్యాయవాద వృత్తిలో ఉండడంతో కలకత్తా చేరు కున్న సౌమిత్ర బెంగాలి సాహిత్యంలో పీజీ కోర్సులో చేరారు. అక్కడే నాటక రంగ ప్రముఖుడు అహింద్ర చౌధురి వద్ద నట మెళకువల్ని నేర్చుకున్నారు. ఆ కాలంలోనే రే సౌమిత్రలో ఉన్న ప్రతిభను కనిపెట్టారు. ఆ తర్వాతి కాలంలో చటర్జీ పోషించిన పాత్రలు ఉత్తమ సినిమాలను ఆదరించే ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కెరీర్ తొలి రోజుల్లోనే అపు, అమూల్య (‘సమాప్తి’), నర్సింగ్ (‘అభిజాన్’) పాత్రల్ని తనలో అంతర్లీనం చేసుకున్న తీరు అబ్బురపరుస్తుంది. ఇక రే క్లాసిక్ ‘చారులత’ సినిమాతో ఆయన బెంగాలీ చేతి రాతనే మార్చేశారు. తన 27 ఏళ్ల వయసులో ఆరు నెలలు కష్టపడి టాగోర్‌కు ముందుకాలం నాటి బెంగాలీ అక్షరాల తీరును అభ్యసించి నటించారు ఆ సినిమాలో. రే సినిమాలు ‘హిరక్ రాజర్ దేశాయ్’, ‘ఘరె భైరే’, ‘ఘన శత్రు’, ‘శాఖ ప్రశాఖ’ సినిమాల్లో సౌమిత్ర చటర్జీ నటన రే ఆలోచనలకు ప్రతిరూపంగా నిలిచిపోతుంది. సౌమిత్ర చటర్జీ రే తో పాటు మృణాల్‌సేన్ తో ‘ఆకాష్ కుసుం’, తపన్‌సిన్హాతో ‘జిందర్ బండి’, ‘లాంరి’ సినిమాల్లో నటించారు. ఇక రాజ మిత్ర లాంటి యువ దర్శకుడితో ‘ఎక్తీ జుబాన్’లో నటించారు. గౌతం ఘోష్ రూపొందించిన ‘దేఖా’ సినిమాలో ఓ మేధావి పాత్రను పోషించారు. ఆయన నటించిన ఇతర సినిమాల విషయానికి వస్తే ‘కాపురుష్’, ‘ఆకాష్ కుసుమ’, ‘అరణఎర్ దిన్ రాత్రి’, ‘ఆశని సంకేత్’, ‘గణ దేవత’, ‘కొని’, ‘మహా పృథ్వీ’ లాంటి ఎన్నో గొప్ప చిత్రాలున్నాయి. 80ల తర్వాత సౌమిత్ర అపర్ణ సేన్, అంజన్ దాస్, రితుపర్ణ ఘోష్ లాంటి యువ దర్శకులతో ఆయన పని చేశారు. సత్యజిత్ రే, సౌమిత్ర చటర్జీ ద్వయం భారతీయ సినిమాను ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలిపింది. సౌమిత్ర కేవలం సినీరంగంలో మాత్రమే కాదు, నాటక రంగం, కవిత్వం, ఆర్ట్, ప్రచురణ రంగాల్లో కూడా తన విశిష్టతను చాటుకున్నారు. ఎక్కోన్ అనే సాహిత్య పత్రికకు సహసంపాదకుడిగా 18 ఏళ్ళు పని చేశారు. కవిగా పన్నెండు కవితా సంకలనాలు వెలువరించారు. అనేక మంచి పెయింటింగ్‌లు వేశారు. పగతిశీల భావాలతో సమాంతర రాజకీయాలపై ప్రతిస్పందించారు. ప్రజా ఉద్యమాలకు సంఘీభావం తెలిపారు. ఆయనకు పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో పాటు అనేక జాతీయ అవార్డులు లభించాయి. ఆయన మరణం బెంగాలీ సినిమాకే కాదు మొత్తం భారతీయ సినిమాకే పూడ్చలేని లోటు.
గత కొన్ని వారాల క్రితం హైదరాబాదులో భారీవర్షం కారణంగా వరద భీభత్సంలో కొందరు చిక్కుకొనిపోయారు. వేగవంతమైన నీటితో కొట్టుకోనిపోతూ కొన్ని గంటలు చిక్కుకొని, చివరకు సహాయ సిబ్బంధీచే విడుదల పొందిన నా స్నేహితుడు తన ముఖమంతా నవ్వుతో నింపుకొని ఇలా ప్రకటించాడు - “నా జీవితంలో ఇవే చివరి ఘడియలు అని అనుకున్న నాకు, మరొకసారి బ్రదికాను అనిపించింది. నా జీవితమంతటికన్నా నాకిప్పుడు మరీయెక్కువగా సజీవముగా ఉన్నట్లనిపిస్తుంది”. వాస్తవానికి, స్వేచ్ఛగా ఉండడముకన్నా, విడుదల పొందటము మరింత ఆనందకరముగా అనిపిస్తుంది. దానికి కారణాలను అర్ధం చేసుకోవడం కష్టం. అనుదినము స్వేచ్ఛను అనుభవించేవారికి మనమెంత దీవించబడినవారమో అన్న విషయాన్ని ఎంత తేలికగా మరచిపోతామో జ్ఞాపకానికి తీసుకొని రావడానికి నా స్నేహితునికి కలిగిన సంఘటన ఒక ఉదాహరణ. ఆధ్యాత్మికంతా కూడా ఇది వాస్తవమైనది. మనలో చాలాకాలంగా క్రైస్తవులుగా ఉన్నవారము; అయితే పాపములో బందీలుగా ఉండడమంటే ఏమిటో తరచూ మర్చిపోతుంటాము. ఆ బానిసత్వం నుండి విదిపించబడిన మన జీవితంతో తృప్తిచెందుతూ ఉన్నప్పుడు కృతఘ్నులముగా తాయారుచేయబడుతాము. ఒక నూతన విశ్వాసిగా చేయబడిన మన జీవిత సాక్ష్యాన్ని దేవుడు మనకు తరచూ గుర్తుచేస్తుంటాడు. ఆ సందర్భంలో “క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను” (రోమా 8:2) అపో.పౌలు వాలే మరొకసారి ఈ మాటలు చెప్పగలిగితే మనదైన అందాన్ని మరలా చవిచూస్తాము. ఈ స్వేచ్ఛను కొన్ని సార్లు మనం గ్రహించము లేదా అనవసరమైన వాటిపై ద్రుష్టిసారించి జీవితాన్ని ఏదోలా గడిపేస్తుంటాము, అప్పుడు మనం ఎదో కష్టం వంటి మహా సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. స్నేహితుడా! ఒకసారి ఆలోచించు: నీవు ఇకపై పాపానికి దాసుడు కాకుండుట మాత్రమే కాదు, నీవు పరిశుద్దుడవుగా ఉంటూ క్రీస్తు యేసుతో నిత్యజీవాన్ని అశ్వాదించడానికి కూడా విడిపింపబడ్డావు “అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము” రోమా 6:22. యేసు క్రీస్తుచే రక్షించబడి విమోచింపబడిన ఆయన సేవకునిగా నీవు స్వేచ్ఛగా చేయగలుగుతున్న ప్రతి విషయమై దేవునికి కృతఙ్ఞతలు చెల్లించి క్రీస్తులో నీకున్న స్వాతంత్ర్యాన్ని వేడుక చేసుకో! ఆమెన్. Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
ఆశ్వయుజ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణలో ప్రతి ఊరు, ప్రతి వాడలో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. అచ్చ తెలంగాణ ఆడపడచు ప్రతి ఏడూ పుట్టింటికి వెళ్లి చేసుకునే పండగే బతుకమ్మ. దసరాకు తొమ్మిది రోజుల ముందే బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. Video Advertisement అత్తింటి నుంచి పుట్టింటికి చేరుకున్న ఆడపిల్లలు రకరకాల పూలను త్రికోణాకారం లో పేర్చి బతుకమ్మను ఆహ్వానిస్తారు. ఆ బతుకమ్మను ఆడపిల్లలంతా ఓ చోట పేర్చి.. దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ.. ఆటలు ఆడుతూ ఉంటారు. “బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో” అంటూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాట పాడుతారు. ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలుపెట్టి దసరా కి ముందు చేసే సద్దుల బతుకమ్మ వరకు ప్రతి ఇంట్లోనూ సంబరమే నెలకొని ఉంటుంది. మగవాళ్లేమో తంగేడు, గూనుగ వంటి రకరకాల పూలను ఉత్సాహంతో సేకరిస్తారు. ఆడపిల్లలు తాము అందం గా అలంకరించుకుని.. ఈ పూలను కూడా బతుకమ్మకు అలంకరించి ముస్తాబు చేస్తారు. ఈ బతుకమ్మను మధ్యలో పెట్టి.. చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు.. ఆటలు ఆడుతారు. ఆ తరువాత ఈ బతుకమ్మను తీసుకెళ్లి నీటిలో వదిలివేస్తారు. బతుకమ్మని నీటిలోనే ఎందుకు వదిలేస్తారో తెలుసా? రాబోయే కాలం వర్షాకాలం. ఈ కాలం లో వాగులు, నదులలో నీరు పొంగి ఉంటుంది. బతుకమ్మలో పెట్టె గానుగ, తంగేడు పూలకు నీటిని శుభ్రపరిచే గుణం ఉంటుంది. అందుకే బతుకమ్మను నీటిలో వదిలివేస్తే ఈ పూలు నీటిని శుభ్రపరిచి పర్యావరణాన్ని కాపాడతాయని పెద్దలు అలాంటి ఆనవాయితీ ని పెట్టారు. Recent Posts ‘అరవింద సమేత’ స్టోరీ ని మంచు విష్ణు సినిమా లో అప్పుడే చెప్పారుగా..!! సొంత “దుస్తుల బ్రాండ్” తో పాటు… “మహేష్ బాబు” కి ఉన్న ఈ 5 వ్యాపారాలు ఏంటో తెలుసా..? “తేరి రీమేక్ అయితే కాదుగా.?” అంటూ…“పవన్ కళ్యాణ్” తో “హరీష్ శంకర్” సినిమా గురించి ట్వీట్ పై 10 ట్రోల్స్.!
thesakshi.com : సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఫోటో షూట్స్ మరియు రెగ్యులర్ హాట్ ఫోటో లు వైరల్ అవ్వడం ఈమద్య కాలంలో చాలా కామన్ గా జరుగుతుంది. సెలబ్రెటీ గుర్తింపు ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి మరియు హీరోయిన్ ల ఫోటోలకు మరియు వీడియోలకు ఇన్స్టా లో లక్షల్లో లైక్స్ మరియు వేలల్లో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇన్ని ఫోటోల మద్య లో కొన్ని ఫోటోలు చాలా స్పెషల్ గా అనిపిస్తూ ఉంటాయి. ఔను… దివ్య ఖోస్లా కుమార్ ను తాజాగా ఇలా వైట్ డ్రస్ లో చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా స్పెషల్ గా ఫీల్ అయ్యి ఉంటారు. హిందీ సినిమాలతో పాటు షో లు మరియు నిర్మాతగా దర్శకురాలిగా మంచి గుర్తింపు దక్కించుకున్న దివ్య ఖోస్లా కుమార్ తాజాగా ఇలా తెల్లటి డ్రస్ లో ఏంజిల్ తరహా లో కనిపించి ప్రతి ఒక్కరికి కన్నుల విందు చేసింది. అబ్బుర పడే అందంతో ఈ అమ్మడు ఆకట్టుకుంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందమైన దివ్య ఖోస్లా కుమార్ చెప్పాంటే నటిగా ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న ఈమె నిర్మాతగా మరియు దర్శకురాలిగా కూడా కెరీర్ లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేసి సఫలం అయ్యింది. పలు రంగాల్లో తనదైన ముద్రను వేసిన ఈ అమ్మడు అందం అంటే ఇది అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ దక్కించుకుంది. 2004 సంవత్సరంలో లవ్ టుడే అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత ఎక్కువ ఆఫర్లు వచ్చినా కూడా వచ్చిన ప్రతి ఆఫర్ కు ఓకే చెప్పకుండా మెల్ల మెల్లగా కెరీర్ లో ముందుకు సాగింది. 2014 లో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలు తెరకెక్కించింది. ప్రస్తుతం నిర్మాతగా ఫుల్ స్వింగ్ లో ఉంది. వెబ్ సిరీస్ లు మొదలుకుని పలు రకాల ప్రాజెక్ట్ లను ఈమె నిర్మిస్తుంది.
మీర్జాపురం రాజా 1946లో ఒకవైపు ‘కీలుగుఱ్ఱం’ చిత్రాన్ని నిర్మిస్తూనే భార్య కృష్ణవేణి కోరికపై స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో రాజకీయ దృక్పథాలను అనుసంధానిస్తూ ‘మనదేశం’ పేరుతో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ చిత్రానికి దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. ఆ సినిమాలో పోలీస్ ఇనస్పెక్టర్ పాత్రకోసం కొత్త నటుణ్ణి అన్వేషిస్తూ నందమూరి తారక రామారావుని ఎంపికచేశారు. షూటింగుకు అంతా సిద్ధం అయింది. ఆ సన్నివేశంలో ఆందోళన చేస్తున్న హీరో నారాయణరావును అరెస్టు చేసేందుకు పోలీస్ ఇనస్పెక్టర్ వస్తాడు. హీరో ఎదురు తిరుగుతాడు. పరిస్థితి అదుపు తప్పుతుంది. లాఠీ చార్జి చేయడం అనివార్యమౌతుంది. దర్శకుడు “యాక్షన్” చెప్పారు. ఎన్టీఆర్ తన పాత్రలో జీవించాడు. అతనిచేతిలోని లాఠీకి పూనకంవచ్చింది. అడ్డొచ్చినవాళ్ళను చితకబాదాడు. సెట్లో యేంజరుగుతుందో తెలియని పరిస్థితి. దర్శకుడు “కట్…కట్” అంటూ బిగ్గరగా అరుస్తున్నాడు. “స్టాప్” అంటూ కేకలేశాడు. వాతావరణం చల్లబడింది. రామారావుని దర్శకుడు పిలిచాడు. “నటించవయ్యా అంటే నరమేధం సృష్టించేలా ఉన్నావే. చూడబ్బాయ్. ఇది డ్రామా కాదు. సినిమా. మరీ అంతగా విరుచుకపడి నటించాల్సిన అవసరం లేదు” అంటూ సినిమా సూక్ష్మతను వివరించాడు. అదీ మన తారకరాముడికి పనిమీద వుండే నిబద్ధత, అభినివేశం. “ఇంతవాణ్ణి. ఇంతవాణ్ణయ్యాను” అంటూ పలికిన తొలిడైలాగు నందమూరిని నిజంగానే అంతవాణ్ణిచేసి అత్యున్నత శిఖరాలమీద కూర్చుండబెట్టింది. క్రమశిక్షణే పరమావధిగా, లక్ష్యసాధనే ధ్యేయంగా, సాహసమే ఊపిరిగా నందమూరి వెండితెర జీవితం ఆసాంతం అసాధారణ విజయాలతో కొనసాగింది. 1982లో ప్రజాజీవనంలోకి అడుగిడి “ప్రజలే దేవుళ్ళు. సమాజమే దేవాలయం” అనే సిద్ధాంతంతో ప్రాంతీయ పార్టీని స్థాపించి తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఎన్టీఆర్. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆ తారక రాముడిదే. ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక్క రూపాయిని మాత్రమే జీతంగా స్వీకరించిన తెలుగుజాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రాముడు. తెలుగుజాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన ధీశాలి రామారావు. ఆ అభినవరాముని వర్ధంతి సందర్భంగా ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముని ప్రస్థానం గుర్తుచేసుకుందాం. తొలిరోజుల్లో నందమూరి.. కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో 28 మే 1923న నందమూరి తారక రామారావు జన్మించారు. తండ్రి లక్ష్మయ్య చౌదరి, తల్లి వెంకటరామమ్మ. వారిది సామాన్య రైతు కుటుంబం. ఏడేళ్ళ వయసులోనే రామారావుకు రామాయణం, భారతం వంటి పురాణాలు వంటబట్టాయి. బెజవాడ మునిసిపల్ హైస్కూలులో చదువు పూర్తిచేసి 1940లో స్థానిక ఎస్.ఆర్.ఆర్ కాలేజిలో ఇంటర్మీడియట్ లో చేరారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అప్పట్లో తెలుగు విభాగానికి అధిపతిగా వుండేవారు. ఒకసారి కాలేజీలో ప్రదర్శించిన ‘రాచమల్లు దౌత్యం’ అనే నాటకంలో రామారావు ‘నాయకురాలు నాగమ్మ’ వేషం వేయాల్సి వచ్చింది. అయితే మీసాలు తీయనని విశ్వనాథ తో చెప్పి మీసాలతోనే ఆ వేషం వేసి రక్తి కట్టించారు తారకరాముడు. అప్పుడే 1942లో అంటే 19వ యేటనే రామారావుకు మేనకోడలు బసవరామ తారకంతో పెళ్లి జరిగింది. 1943లో గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరి నాటకాల్లో చురుకైన పాత్ర పోషించారు. నేషనల్ ఆర్ట్స్ అనే నాటక సమాజాన్ని స్థాపించి సహ విద్యార్థులు కొంగర జగ్గయ్య, కె.వి.ఎస్. శర్మ, కాలేజి లాబ్ అసిస్టెంటు వల్లభజోస్యుల శివరామ్ తదితరులతో ‘బలిదానం’, ‘మల్లమ్మ ఉసురు’, ’ఆలీ, ది కాబులర్’ వంటి యెన్నో నాటకప్రదర్శనలు ఇచ్చారు. నవజ్యోతి, నాట్యసమితి వంటి స్థానిక నాటక సమాజాలతో కలిసి బృందనాటకాలు ప్రదర్శించారు. ఆరోజుల్లో ముక్కామల కృష్ణమూర్తి ఈ నాటక బృందాలకు మార్గదర్శకునిగా వుండేవారు. 1947లో బి.ఎ. పట్టా పుచ్చుకున్న తరవాత ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. పోలీసు శాఖలో సబ్ ఇనస్పెక్టర్ వుద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారింది. డెహ్రాడూన్ లో షార్ట్ సర్వీస్ కమీషన్డ్ ఆఫీసరు వుద్యోగానికి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది. కానీ తండ్రి వద్దనడంతో రామారావు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. బెజవాడలో వుండగా సారథి స్టూడియో వారు నిర్మించబోయే ‘శ్రీమతి’ అనే చిత్రంకోసం కొత్త ఆర్టిస్టుల వేట ప్రారంభమైంది. పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. ఈ విషయమై ఎల్.వి. ప్రసాద్ విజయవాడ వచ్చారు. అప్పుడు రామారావును సుబ్రహ్మణ్యం అనే శ్రేయోభిలాషి దుర్గా కళామందిరంలో ‘రైతుబిడ్డ’ సినిమా చూస్తున్న ఎల్.వి. ప్రసాద్ వద్దకు తీసుకెళ్ళాడు. రామారావును చూడగానే ప్రసాద్ కు ఆయన బాగానచ్చారు. తను రాజమండ్రి వెళుతున్నానని, మద్రాసుకు వెళ్ళగానే కబురు పంపుతానని, స్క్రీన్ టెస్టుకు రావలసివుంటుందని చెప్పివెళ్ళారు. కొద్దిరోజుల్లోనే మద్రాసు నుంచి రామారావుకు కబురొచ్చింది. మద్రాసులో అడుగుపెట్టి… రామారావు మద్రాసు వెళ్లి శోభనాచల స్టూడియోలో ఎల్.వి. ప్రసాద్ ని కలుసుకున్నారు. అక్కడ ‘ద్రోహి’ చిత్రం షూటింగు జరుగుతోంది. దర్శకుడు ప్రసాద్ మేకప్ మ్యాన్ మంగయ్య చేత రామారావు కు మేకప్ చేయించి టెస్ట్ చేసి, కొన్ని స్టిల్స్ తీసి, చిన్న సన్నివేశాన్ని చిత్రీకరించి వాటిని పరిశీలించిన తరవాత కబురు చేస్తానని చెప్పడంతో రామారావు బెజవాడ వచ్చి ‘ఎన్.ఎ.టి’ సంస్థ తరఫున నాటకాలు ప్రదర్శించసాగారు. తమ్ముడు త్రివిక్రమరావు, అట్లూరి పండరీకాక్షయ్య నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. తరవాత రామారావు మద్రాసు సర్వీస్ కమీషన్ పరీక్ష రాసి సబ్-రిజిస్ట్రారు వుద్యోగం సంపాదించాడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వుద్యోగం చేస్తుండగా ఎల్.వి. ప్రసాద్ నుంచి వుత్తరం వచ్చింది. ‘శ్రీమతి’ చిత్ర నిర్మాణం ఆగిపోయిందని, మీర్జాపురం రాజా నిర్మిస్తున్న ‘మనదేశం’ చిత్రంలో మంచి పాత్రవుందని మద్రాసు రమ్మని రాశారు. చేస్తున్న ఉద్యోగాన్ని వదలి రామారావు మద్రాసు వెళ్ళారు. అప్పట్లో దర్శకనిర్మాత బి.ఎ. సుబ్బారావు శోభనాచల స్టూడియోలో దర్శకత్వ విభాగంలో సహాయకుడిగా పనిచేస్తూ వుండేవారు. ఎన్టీఆర్ మేకప్ స్టిల్స్ ఆయన కంటపడ్డాయి. ఆయన మీర్జాపురం రాజా సహకారంతో సొంతంగా ‘పల్లెటూరిపిల్ల’ సినిమా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. రామారావుని అందులో హీరోగా తీసుకుంటానని ఎల్.వి. ప్రసాద్ తో చెప్పారు. కానీ ప్రసాద్ బి.ఎ. సుబ్బారావు ను వారిస్తూ, “అసలే నీకు నిర్మాతగా, దర్శకునిగా అది మొదటి సినిమా. కొత్త హీరోని తీసుకుంటే రిస్కు కావచ్చు. ఇప్పుడు నిర్మిస్తున్న శోభనాచల వారి ‘మనదేశం’ సినిమాలో అతనికి చిన్న వేషం ఇచ్చి చూద్దాం. అన్నీ బాగుంటే అప్పుడు రామారావుని హీరోగా తీసుకుందువు గాని” అని సలహా ఇచ్చారు. ‘మనదేశం’లో పోలీస్ ఇనస్పెక్టర్ వేషంలో రామారావు మెప్పించారు. ఆ చిత్రం 1949 నవంబరులో విడుదలైంది. వేషం చిన్నదైనా ప్రేక్షకులను రామారావు ఆకట్టుకున్నారు. తరవాత బి.ఎ. సుబ్బారావు శోభనాచల సంస్థతో జాయింటు ప్రొడక్షన్ గా ‘పల్లెటూరిపిల్ల’ సినిమా నిర్మాణం ప్రారంభింఛి జంటహీరోలుగా నాగేశ్వరరావు, ఎన్.టి. రామారావును తీసుకున్నారు. సినిమా బాగా ఆడింది. తరవాత విజయా సంస్థ ‘షావుకారు’ (1950) చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఎల్.వి. ప్రసాద్ కు రావడంతో రామారావుని అందులో హీరోగా నటింపజేశారు. ఆ రెండు సినిమాలూ విజయవంత మయ్యాయి. అలా ఈ రెండు సినిమాల్లో రామారావుకు అవకాశాలు రావడానికి ఎల్.వి. ప్రసాద్ దోహదపడ్డారు. నందమూరి నటజైత్రయాత్ర… 1950 లో రామారావు నటజైత్రయాత్ర ప్రారంభమైంది. ఆ యాత్ర నిర్విఘ్నంగా 35 సంవత్సరాలు కొనసాగింది. ఆ సంవత్సరం టి.ఆర్. సుందరం నిర్మించిన ‘మాయారంభ’లో రామారావు నలకూబరుడు వేషం కట్టారు. అంజలీదేవి కళావతి గా నటించింది. అదే సంవత్సరం సాధనా సంస్థ అధిపతి సి.వి. రంగనాథదాసు అక్కినేని, ఎన్టీఆర్ జంట హీరోలుగా ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో ‘సంసారం’ సినిమా నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక 1951 లో రెండు అద్భుత సినిమాల్లో రామారావు నటించారు. అవి విజయా వారి ‘పాతాళభైరవి’, వాహినీ వారి ‘మల్లీశ్వరి’. పాతాళభైరవి చిత్రం అఖండ విజయాన్ని సాధించి 10 కేంద్రాల్లో శతదినోత్సవం, నాలుగు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది. అంతే కాకుండా 200 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. మల్లీశ్వరి చిత్రం గొప్ప కళాఖండంగా పేరుతెచ్చుకొని దేశవిదేశాల్లో క్లాసిక్ గా అందరి ప్రశంసలు అందుకుంది. విజయా సంస్థ ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో ‘పెళ్లిచేసిచూడు’ (1952) అనే హాస్యభరిత సినిమాని తెలుగు, తమిళభాషల్లో నిర్మించింది. అందులో ఎన్టీఆర్, జి.వరలక్ష్మి నటించగా ఆ చిత్రం రజతోత్సవం జరుపుకుంది. బెజవాడ దుర్గాకళా మందిర్ లో 182 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. రామారావుకు స్టార్డం పెరిగింది. అప్పుడే రాయలసీమ కరవు నివారణకోసం తోటినటీనటులను కలుపుకొని 24 రోజులపాటు ఆంధ్రరాష్ట్రం మొత్తం పర్యటించి లక్ష రూపాయల నిధులు వసూలుచేసి ప్రభుత్వానికి అందజేశారు. అంతేకాదు 1962లో చైనా దురాక్రమణ జరిగినప్పుడు ప్రధాని పిలుపు మేరకు మరలా జోలె పట్టి పదిలక్షల విరాళాలు సమీకరించి ప్రధానికి అందజేశారు. ఉద్యోగనిర్వహణలో వికలాంగులైన పోలీసు కుటుంబాలకోసం 1965లో ప్రజలనుండి నిధులు వసూలుచేసి అందించిన రామారావు సేవాగుణాన్ని పలువురు మెచ్చుకున్నారు. అదే సంవత్సరం మనదేశం మీద పాకిస్తాన్ దురాక్రమణ జరిపినప్పుడు కూడా పది లక్షల రూపాయలు విరాళాలు పోగుచేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ సమయంలోనే యోగానంద్ మొదటిసారి దర్శకత్వం వహించిన ‘అమ్మలక్కలు’, భానుమతి రామకృష్ణ మూడు భాషల్లో నిర్మించిన ‘చండీరాణి’(1953) చిత్రాలతోబాటు ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలోమూడు తమిళ చిత్రాల్లో రామారావు నటించారు. సొంత నిర్మాణ సంస్థ ఆరంభం… 1952లో రామారావు ‘నేషనల్ ఆర్ట్స్’ పేరిట సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి మొదటి ప్రయత్నంగా తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ‘పిచ్చి పుల్లయ్య’ (1953) చిత్రాన్ని నిర్మించారు. సినిమా గొప్పగా ఆడలేదు. 1954 లో యోగానంద్ దర్శకత్వంలో నేషనల్ ఆర్ట్ థియేటర్ బ్యానర్ మీద మరో సొంత చిత్రం ‘తోడుదొంగలు’ నిర్మించారు. జాతీయ స్థాయిలో ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయచిత్ర బహుమతి లభించింది. అయితే ఈ సినిమా కూడా ఆర్ధిక విజయాన్ని సాధించలేకపోయింది. అదే సమయంలో వై.ఆర్. స్వామి దర్శకత్వంలో ‘వద్దంటే డబ్బు’ (1954) ద్విభాషా చిత్రం లోనూ, కమలాకర కామేశ్వరరావు తొలిసారి దర్శకత్వం వహించిన విజయావారి చిత్రం ‘చంద్రహారం’ (1954) లోను రామారావు నటించారు. ఇవి కూడా పరాజయం పాలయ్యాయి. బి.ఎ. సుబ్బారావు నిర్మించిన ‘రాజూ-పేద’ (1954) సినిమాకు ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ బహుమతి లభించింది. ‘ఇద్దరుపెళ్ళాలు’ (1954) చిత్రంలో తొలిసారి రామారావు కృష్ణుడి వేషంలో కనిపించారు. పి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ‘రేచుక్క’(1955)సినిమా బాగా ఆడింది. విజయా సంస్థ పూర్తి వినోదభరితంగా ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన ‘మిస్సమ్మ’(1955) చిత్రం సూపర్ హిట్ గా నిలిచి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎస్.ఎమ్. శ్రీరాములు నాయుడు నిర్మించిన ‘అగ్గిరాముడు’ జానపదచిత్రం రామారావుకు మంచిపేరు తెచ్చిపెట్టింది. పి.పుల్లయ్య నిర్మించిన ‘కన్యాశుల్కము’ (1955) లో రామారావు నెగటివ్ షెడ్ వున్న గిరీశం పాత్రను పోషించి రంజింపజేశారు. సొంత బ్యానర్ మీద నిర్మించిన రెండు సాంఘిక చిత్రాలు ఆర్ధిక విజయాన్ని సాధించకపోవడంతో ఈసారి ‘జయసింహ’ (1955) పేరుతో తొలి జానపద చిత్రాన్ని నిర్మించారు. సినిమా అద్భుత విజయాన్ని నమోదుచేసి రామారావు కు సొంతబ్యానర్ మీద చిత్రాలు నిర్మించేందుకు అవసరమైన ధైర్యాన్ని ఇచ్చింది. తరవాత నిర్మించిన ‘పాండురంగ మహాత్మ్యం’ (1957) సినిమా అద్భుత విజయాన్ని నమోదుచేసింది. ఇక ‘సీతారామ కల్యాణం’, ‘గులేబకావళి’ సినిమాల విజయాలగురించి చెప్పనవసరమే లేదు. అటు రాముడుగా, ఇటు రావణాబ్రహ్మగా కూడా రామారావు తన నటపాటవాన్ని అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు చూరగొన్నారు. సీతారామకల్యాణం సినిమాకు రామారావే దర్శకత్వం వహించడం విశేషం. అయితే రామారావు టైటిల్స్ లో తనపేరు వేసుకోలేదు. కృష్ణుడిగా, రాముడుగా నిలిపిన చిత్రాలు… ఘంటసాల నిర్మించిన ‘సొంతవూరు’ (1956) లో కృష్ణుడుగా రామారావు గెటప్ ప్రేక్షకులకు రుచించలేదు. ‘చరణదాసి’ (1956) చిత్రంలో రాముడి గెటప్ లో కనిపిస్తే తదనంతర కాలంలో లలితాశివజ్యోతి పిక్చర్స్ నిర్మాత శంకరరెడ్డి నిర్మించిన ‘లవకుశ’ చిత్రంలో రామారావు శ్రీరాముడిగా నటించేందుకు ప్రేరణ అయింది. విజయా వారు నిర్మించిన ‘మాయాబజార్’ (1957)లో రామారావుకు గెటప్ మార్చి తీర్చిదిద్దిన కృష్ణుడి పాత్ర యెంత గొప్పగా అమరిందంటే, ఆరోజుల్లో రామారావు చిత్రపటంతోవున్న ఐదు లక్షల క్యాలండర్ లకు ప్రజలు ఫ్రేములు కట్టించి తమ పూజా గదుల్లో పెట్టి పూజలు చేశారు. అగ్రశ్రేణి తారాగణంతో, భారీ పెట్టుబడితో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మాయాబజార్ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా నేటికీ విశేష ప్రజాదరణ పొందుతూ వస్తోంది. అంతేకాదు, తరవాతి కాలంలో రామారావు కృష్ణుడి పాత్రలు పోషించేందుకు ప్రేరణగా నిలిచింది. రాముడుగా నటించిన ‘లవకుశ’ రంగుల చిత్రం 26 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. పి.పుల్లయ్య సొంత చిత్రం ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ (1960)లో వేంకటేశ్వరునిగా రామారావు అద్భుతంగా నటించారు. ఆరోజుల్లో ఈ సినిమా ప్రదర్శించే సినిమాహాళ్ళు ఆలయ శోభను సంతరించుకున్నాయి. 1962 నాటికి రామారావు వంద చిత్రాల్లో నటించారు. బి.ఎ. సుబ్బారావు ‘భీష్మ’, విజయావారి ‘గుండమ్మకథ’, పుండరీకాక్షయ్య చిత్రం ‘మహామంత్రి తిమ్మరుసు’, సుందర్లాల్ నహతా వారి ‘రక్తసంబంధం’ వంటి సినిమాలు విడుదలై ప్రజాదరణ పొందాయి. చేతికి అందివచ్చిన పెద్దకుమారుడు 1962లో అకాలమరణం చెందడం రామారావు ను మానసికంగా కుంగదీసింది. 1963లో రామారావు 14 సినిమాలలోను, 1964లో 16 సినిమాల్లోనూ నటించారు. వాటిలో ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు-భీముడు’, ‘అగ్గిపిడుగు’ సినిమాలు కూడా వున్నాయి. ఈ రెండు సంవత్సరాలలో విడుదలైన అధికశాతం సినిమాలు విజయాన్ని సాధించాయి. అలా రామారావు నట ప్రస్థానం అప్రతిహతంగా సాగిపోయింది. 1968 లో రామారావు, నాగేశ్వరరావు ఇద్దరికీ ఒకే సారి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. హైదరాబాదులో ఎన్.టి.ఆర్ ఎస్టేటు, రామకృష్ణ 70 ఎం.ఎం, 35 ఎం.ఎం జంట థియేటర్ల నిర్మాణం జరిగింది. దీంతో రామారావు కు హైదరాబాదుతో అనుబంధం పెరిగింది. ‘దానవీరశూర కర్ణ’ (1977)లో మూడు పాత్రలు (కర్ణుడు, సుయోధనుడు, కృష్ణుడు), శ్రీమద్ విరాటపర్వం చిత్రంలో 5 పాత్రలు పోషించి సత్తా చాటారు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ (1991), ‘సామ్రాట్ అశోక’ (1992) వంటి చిత్రాలు నిర్మింఛి, తనను ఎంతగానో అభిమానించే మొహన్ బాబు నిర్మించిన ‘మేజర్ చంద్రకాంత్’ (1993) చిత్రంతో నటనకు స్వస్తి చెప్పారు. రాజకీయంలో రాణించి… రామారావు జీవితంలో మలిప్రస్థానం రాజకీయ నాయకుడిగా విశిష్ట పాత్ర పోషణ. ‘ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం’ అనే నినాదంతో రామారావు మార్చి 29, 1982 న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 40 రోజులపాటు రాష్ట్రమంతా అవిశ్రాంతంగా పర్యటించి 1983 ఎన్నికల్లో పోటీచేసి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు. ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు లేవదీసిన రాజకీయ సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని, సెప్టెంబరు 16 న మరలా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బర్తరఫ్ అయిన నెలరోజుల్లోనే తిరిగి పీఠాన్ని నిలుపుకోవడం భారత రాజకీయ చరిత్రలో రామారావు ఒక్కడికే దక్కింది. భార్య బసవరామ తారకం ఈ సంక్షోభ సమయంలోనే క్యాన్సర్ మహమ్మారి తో మరణించింది. ఒక ప్రాంతీయ పార్టీ గా ఆవిర్భవించిన పార్టీ పార్లమెంటులో 30 సీట్లను గెలుచుకోవడం ఒక రికార్డుగా నిలిచింది. 1989 లో కాంగ్రెసేతర పార్టీలను ఒక్క తాటిమీదకు తెచ్చి నేషనల్ ఫ్రంటు ఏర్పరచి, దానికి చైర్మన్ గా వ్యవహరించి రామారావు కేంద్రంలో చక్రం తిప్పారు. పుట్టినదగ్గరనుంచి తుదిశ్వాస విడిచేవరకు అలుపెరుగని ఆ మహాయోధుడు 1996 జనవరి 18 న మహాభినిష్క్రమణ చేశారు. ఆయన మరణంతో రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ మరణం ఒక యుగపురుషుని జీవిత ప్రస్థానానికి ముగింపు పలికింది. మరిన్ని విశేషాలు… పాతాళభైరవి చిత్రంలో తన సహచరుడుగా నటించిన బాలకృష్ణ మద్యానికి బానిసై షూటింగులకు ఆలస్యంగా రావడంతో అతణ్ణి తనచిత్రం నుంచి తప్పించాలని ఒక ప్రముఖ నిర్మాత ప్రయత్నిస్తే, దానివలన అతని కుటుంబానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురౌతాయని ఆ ప్రయత్నాన్ని వారించి, బాలకృష్ణ ను ఇంటికి పిలిచి రామారావు మందలించారు. ఆ తరవాత బాలకృష్ణ ఏనాడూ షూటింగుకి ఆలస్యంగారాలేదు. అలా మానవత్వ విలువల్ని కాపాడే వ్యక్తిత్వం మూర్తీభవించిన మనీషి ఈ తారకరాముడు. సినిమాల్లో మారువేషాలు వేయడం రామారావు కి ఇష్టం. అది జానపదమైనా, సాంఘికమైనా ఒకటి లేక రెండు మారువేషాలు ఉండేలా స్క్రిప్టు తయారు చెయ్యమని రచయితలకు ప్రత్యేకంగా చెప్పేవారు. విజయవాడలోని దుర్గా కళామందిర్ కి రామారావు కు అవినాభావ సంబంధం వుంది. రామారావు తొలి చిత్రం ‘మనదేశం’ చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’ ఈ చిత్రశాలలోనే ఆడాయి. అంతేకాదు, రామారావు నటించిన అధికశాతం సినిమాలు(63) ఆడింది ఈ సినిమా హాలులోనే కావడం విశేషం. రామారావుది క్రమశిక్షణ గల జీవితం. ఉదయం నాలుగు గంటలకే లేచి వ్యాయామం, యోగాసనాలు వేసి, కాలకృత్యాలు తీర్చుకొని, ఉదయం ఆరు గంటలకే భోజనం చేసిమేకప్ చేసుకొని ఆరున్నరకే తయారై కూర్చొని, తన సొంత సినిమాల విషయాలు చూసుకునేవారు. షూటింగుకి ఏనాడూ ఆలస్యంగా వెళ్ళలేదు. నిర్మాతకు ఏనాడూ తనవలన ఇబ్బంది కలిగే అవకాశం ఇవ్వలేదు. స్టూడియోలో షూటింగులకు రామారావుకు సొంత కుర్చీ తెచ్చుకోవడం అలవాటు. ఆయనకంటే ముందే సెట్ లోకి కుర్చీ వచ్చిందటే రామారావు వస్తున్నట్లే. వెంటనే సెట్లో వాళ్ళంతా అలర్టై లేచి నిలబడేవారు. తన కుర్చీమీద ఎన్.టి.ఆర్ పేరు అందంగా కుట్టివుండేది. కుర్చీతోబాటు ఒక కంచు మరచెంబు నిండా మంచి నీళ్ళు, గ్లాసు, వెండి కంచం వచ్చేవి. అవసరమైతే ఇంటినుంచి మంచినీళ్ళ బిందె కూడా వచ్చేది. మంచినీళ్లలో తేనె కలుపుకొని తాగడం రామారావుకి అలవాటు.
(రాజమండ్రి దామెర్ల ఆర్ట్ గాలరీ నందు నవంబర్ 9 న మంచెం గారి చిత్ర ప్రదర్శన – ‘పైడి రాజు శత జయంతి పురస్కారం ‘ అందుకుంటున్నసందర్భంగా …) స్వచ్చతకు మారుపేరు ముత్యం . మంచెం గారి మనసు కూడా ముత్యమే. అంతే కాదు వారి కుంచెనుండి జాలువారిన చిత్రాలు చూసిన వారెవరైనా మేలైన మంచిముత్యాలు అనడం కూడా తధ్యం. కారణం వారు చిత్రాలకు ఎంచుకున్న విషయం, చిత్రీకరణకు ఆయన ఎంపిక చేసుకున్నవస్తువు, ఆపై వారి చిత్ర రచనా రీతికి ఎంచుకున్న పద్ధతి అన్నీ కూడా ఉత్తమంగా వున్నప్పుడు ఆ కుంచెనుండి జాలువారిన చిత్రాలు ఉత్తమం కాకుండా ఎలా వుంటాయి? అందుకే మంచెం గారి చిత్రాలను మంచి ముత్యాలుగా చెప్తాము. మంచెం గారు చిత్రీకరణకు ఎంచుకున్న రంగులు జలవర్ణాలు, మాధ్యమం వాష్ టెక్నిక్. ఆయన చిత్రీకరణకు వస్తువుగా మామూలు డ్రాయింగ్ షీట్లు లేదా కాన్వాస్ క్లాత్ కాకుండా విన్సర్ న్యూటన్ డ్రాయింగ్ షీట్లనే వాడడానికి ఇష్టపడతారు. రంగులు కూడా ఖరీదైన ఆ విన్సర్ న్యూటన్ నీటిరంగు బిల్లలనే వాడతారు. ఈ విధానంలో చిత్రించ దలచుకున్నఅంశం తాలూకు చిత్రాన్నిసన్నని రేఖామాత్రంగా ముందు డ్రాయింగ్ షీట్ పై చిత్రించి దానిపై ఆ చిత్రము నందలి భావవ్యక్తీకరణకు సరిపడే రంగులలో ప్రాధమికమైన వర్ణాన్ని ముందు పూసిన తర్వాత దాన్నిపూర్తిగా కడిగి తదుపరి వేరొక వర్ణం పూసి మరల కడిగి ఇలా పదేపదే విభిన్న రంగులు వేసి కడగడం ద్వారా చివరగా పూసిన వర్ణాలకు తోడు ముందు పూసిన వర్ణాల తాలూకు చాయలు కూడా సూచాయగా కనిపిస్తూ చిత్రానికి సహజత్వం మరియు ఒక ప్రతేకమైన శోభ వచ్చేలా చేస్తారు. మంచెం గారు చిత్రించిన చిత్రాలన్ని ఈ విధానంలో చేసినవే. ప్రస్తుత కాలంలో ఈ విధానంలో ఒక్క మంచెం గారు తప్ప బహుసా ఎవరూ చేయడంలేదనే చెప్పవచ్చు. ఒకప్పుడు చైనా జపాన్ చిత్రకారులు వాడే ఈ వాష్ టెక్నిక్ ని తర్వాత కాలంలోమనదేశంలో అబ్దుల్ రెహ్మాన్ చుగతాయ్ బెంగాల్ లో నందలాల్ బోస్ తదితరులు బాగా వ్యాప్తిలోకి తీసుకు రాగా తర్వాత మన రాష్ట్రంలో దామెర్ల రామారావు, రాజాజీ, భగీరధి, వరదా వెంకటరత్నం తదితరుల కొంతవరకు కొనసాగించారు. అనంతరం కొండపల్లి శేషగిరి రావు గారు ఆయన శిష్యుడు ఉల్చిల తర్వాత నేడు పూర్తిగా ఈ పద్దతిలో విరివిగా చిత్ర రచన చేస్తూ ముందుకు సాగుతున్న చిత్రకారుడు మంచెం సుబ్రహ్మన్యేశ్వర రావు గారు. ఆయన చిత్రాలలో ఆధునికత పేరుతో నేడు నడుస్తున్న వివిధ పెడధోరణులు కనిపించవు . గజిబిజి రేఖలు జిగిబిగి వర్ణాలు వుండవు. చక్కటి సున్నితమైన మైన రేఖా సౌందర్యం వుంటుంది. ఆ రేఖల మధ్య పారదర్శకంగా పూసే వర్ణ సౌందర్యం వుంటుంది. ఆ వర్ణాలతో రూపొందిన పొందికైన చిత్రాలలో చక్కటి సాంప్రదాయం కనిపిస్తుంది. చరిత్ర వుంటుంది. ఒకవిదమైన ఆధ్యాత్మికత భోదపడుతుంది. తరతరాలుగా మన దేశంలో వర్ధిల్లుతున్నవివిధ వృత్తి పనివాళ్ళు. సామాన్య జనావళి యొక్క జీవన విధానం మనకు దర్శనమిస్తుంది. వీరి చిత్రాలను ప్రధానంగా మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. తరతరాలుగా మన ఆచార సాంప్రదాయంలో ఇమిడిపోయిన దేవుళ్ళు,దేవతల ఊరేగింపులు, సంభరాలు, సమర్పణలు, మొక్కుబడులు, బోనాలపండుగలు. మామిడి తోరణాలు, గరగాటలు, కోలాటాలు, లాంటివి ఒకరకమైతే, గ్రామీణ జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించే తల్లిప్రేమ గొర్రెలకాపరులు, విజిటబుల్ వెండర్స్, జాలరి స్త్రీలు , బాంగిల్ సెల్లర్స్, కుమ్మరి, కమ్మరి, సాలెల జీవనవిధానం, పాట్ పెయింటర్స్, ఇంకా గ్రామీణ కళారూపాలను తయారుచేసే కళాకారులు లాంటి చిత్రాలు ఇంకో రకం. ఇక మూడవ రకంలో చరకుడు, ధన్వంతరి ఇంకా బౌద్ధ జాతక కథలకు సంభందించిన చారిత్రక చిత్రాలు వస్తాయి. ఎన్ని చేసిన ఏమి చేసినా ప్రతి చిత్రాన్నినిదానంగా సన్నని సుకుమారమైన రేఖలమధ్య పారదర్శకంగా పూసే వాష్ టెక్నిక్ లో వర్ణాలు అద్దుతూ వీక్షకుడి కంటికి మనసుకు హాయిగోల్పే రీతిలో చిత్రాన్నితీర్చిదిద్దడం శ్రీ సుబ్రహ్మన్యేశ్వర రావు గారి శైలిగా మనం చెప్పవచ్చు. శ్రీ మంచెం గారు తూర్పు గోదావరి జిల్లానందలి సముద్ర తీర ప్రాంతమైన ఉప్పాడకు సమీపంలోని నేమం అనే గ్రామంలో శ్రీమతి మంచెం అమ్మాజీ, ధర్మా గణపతి రావు అనే దంపతులకు మే 26. 1957 లో జన్మించారు . నిజానికి చిత్రకళ వీరి వృత్తి కాదు. కేవలం ప్రవృత్తి మాత్రమే. వృత్తిరీత్యా ఆయన నిత్యం ఎన్నో ఆర్ధిక లావాదేవీలతో కూడుకున్న ఒక ఉన్నత స్థాయి బ్యాంకు అధికారి. ఆంధ్రాబ్యాంక్ చీఫ్ మేనేజర్ గా చేసి ఇటీవలనే పదవీ విరమణ పొందారు. బాల్యం నుండే చిత్ర కళ పై ఆసక్తిగల వీరు మొదట హై స్కూల్ లో తాడేపల్లి వెంకన్న అనే డ్రాయింగ్ టీచర్ వద్ద చిత్రకళలో మెళకువలు నేర్పారు. ఆపై దామెర్ల ఆర్ట్ స్కూల్ నందలి రామారావు, అడవిబాపిరాజు, అంట్యాకుల పైడిరాజుల చిత్రాలు వారిపై బాగా ప్రభావం చూపాయి. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో అక్కడ చిత్రకళాధ్యాపకులుగా పనిచేస్తున్న ఉల్చి గా ప్రాచుర్యం పొందిన రెడ్డిబోయిన వెంకటేశ్వర్లు గారితో ఏర్పడిన సాన్నిహిత్యంతో అలవడిన ఈ వాష్ టెక్నిక్ విధానం వీరికి బాగా నచ్చడంతో ఆ శైలిలో విరివిగా చిత్ర రచన చేయడం ప్రారంబించారు. చిత్రకారుడిగా ఇప్పటికే హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ గేలరీ, మరియు ICICR ఆర్ట్ గేలరీ తో పాటు ,గుంటూరు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి శ్రీకాకుళం జిల్లనందలి రణస్థలం, తదితర ప్రదేశాలలో వ్యక్తిగత ప్రదర్శనలు చేయడం జరిగింది. సామూహికంగా రాష్ట్రంలోను రాష్ట్రానికి ఆవలకూడా తన చిత్రాలను ప్రదర్శించి కాళిదాస్ సాంస్కృతిక అకాడమి ఉజ్జయిని అవార్డ్, సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ అకాడమి నాగపూర్ వారి అవార్డ్ తో పాటు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏట చిత్రకళకు ఇచ్చే పదివేల రూపాయల నగదు బహుమతిని 2010లో మంచెం గారే గెల్చుకోవడం విశేషం. ఇంకా కోనసీమ చిత్రకళ పరిషద్, అజంతాకళారామం, అడపా చిత్రకళా పరిషద్ , హరివిల్లు ఆర్ట్ అకాడమి, లలితకళా పరిషద్ విశాఖపట్నం, లలితకళా కేంద్రం బాపట్ల మొదలగు వారు నిర్వహించిన పోటీలలో ప్రధమ బహుమతులు మంచెం గారి చిత్రాలు గెల్చుకోవడం గొప్ప విషయం. అంతేగాక 2007లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ తొలిసారిగా ప్రవేశ పెట్టిన గోల్డ్ మెడల్ ని కూడా మంచెం గారే సొంతం చేసుకోవడం ఆయన ప్రతిభకు తార్కాణంగా చెప్పవచ్చు. ఇదంతా ఆయన ప్రవృత్తి పరంగా సాదించిన విజయాలలో కొన్ని మాత్రమే. ఇక వృత్తిపరంగా కూడా తాను పని చేసిన ఆంధ్ర బాంక్ గ్రామీణాభి వృద్ధి సంస్థ రాజమండ్రి శాఖకు దేశంలోనే ఉత్తమ శాఖగా గుర్తింపు తెచ్చి నాటి కేంద్ర గ్రామీణాభివ్రుద్ది శాఖామంత్రి శ్రీ జైరాం రమేష్ చేతులమీదుగా ఉత్తమ అధికారిగా జాతీయ పురస్కారం అందుకుని గొప్ప ఆదర్శ అధికారిగా కూడా పేరు తెచ్చుకోవడం గొప్ప విశేషం. అటు వృత్తి ఇటు ప్రవృత్తి రెండింటా ఉన్నత స్థాయిలో కృషి చేస్తున్నమంచెం సుబ్రహ్మన్యేశ్వర రావు గారు నేడు ఒకనాటి జానపద చిత్రకళకు రారాజైన అంట్యాకుల పైడి రాజు గారి శత జయంతి సందర్భంగా రాజమండ్రి దామెర్ల ఆర్ట్ గాలరీ నందు నవంబర్ 9 న చేస్తున్న వారి చిత్ర ప్రదర్శన తో బాటు రాజమండ్రి చిత్రకళా నికేతన్ వారి నుండి ‘పైడి రాజుగారి పురస్కారం ‘ అందుకుంటున్నసందర్భంగా వారికి ఇవే మా శుభాభినందనలు
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన అంశాలపై దిల్ రాజు స్పందించారు. ఫిలిం చాంబర్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)తో ఒప్పందం కుదుర్చుకున్నామని దిల్ రాజు వెల్లడించారు. సినిమా నిర్మాణ వ్యయాలపై మరో రెండు మూడు రోజుల్లో చర్చించి త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు. ఫిలిం ఫెడరేషన్ తో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటున్నామని అన్నారు. త్వరలోనే సినిమా షూటింగులు మొదలుపెడతామని దిల్ రాజు పేర్కొన్నారు. బాలీవుడ్ కూడా మన ఫిలిం ఇండస్ట్రీని గమనిస్తోందని వెల్లడించారు. టాలీవుడ్ వాళ్లు షూటింగులు ఆపేసి ఏం చేస్తున్నారని బాలీవుడ్ వాళ్లు ఆరా తీస్తున్నారని వివరించారు. అటు, దక్షిణాదిలోని ఇతర చిత్ర పరిశ్రమలు మన నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నాయని దిల్ రాజు తెలిపారు. ఇక, 8 వారాల తర్వాతే సినిమాలను ఓటీటీకి ఇవ్వాలని నిర్మాతలు నిర్ణయించారని వెల్లడించారు. మల్టీప్లెక్స్ ల విషయంలో ధరలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ లో టికెట్ ధరలు, వీపీఎఫ్ చార్జీలపై రేపు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. Dil Raju Tollywood Shootings Bollywood Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?..... We are here for YOU: Team ap7am.com
మీరిచ్చిన స‌హ‌కారం, మ‌నోధైర్యంతో ముఖ్యమంత్రిగా మీ ముందున్నా.. సీబీఆర్ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ‘జయహో బీసీ మహాసభ’ను విజయవంతం చేయండి నాగ‌ళ్ల‌వ‌ల‌స మీదుగా చీపురుపల్లికి ఆర్టీసీ బ‌స్సు సీబీఆర్‌లో సీఎం వైయస్‌ జగన్‌ బోటింగ్‌ పెనుమాకలో తాగునీటి స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం `పార్నపల్లి` చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌ చంద్రబాబూ ...నీకు ఇదేం కర్మ అని ప్రజలు అంటున్నారు న‌వ‌ర‌త్నాల‌తో పేద కుటుంబాల్లో వెలుగులు పోలవరం వద్ద రక్తికట్టని చంద్రబాబు డ్రామా You are here హోం » టాప్ స్టోరీస్ » ఏపీలో కోస్తా తీరానికి కోత ముప్పు ఏపీలో కోస్తా తీరానికి కోత ముప్పు 03 Aug 2022 5:12 PM రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబు న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కోత ముప్పు ఎదుర్కొంటున్న తీర ప్రాంతం 20 శాతం పైనే ఉన్నట్లుగా ఇంకాయిస్‌ (ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సర్వీసెస్‌) అధ్యయనంలో తేలినట్లు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. రాష్ట్రంలోని 43.35 శాతం తీరానికి అతి తక్కువగాను, 33.27 శాతం తీరానికి ఓ మోస్తరు కోత ముప్పు ఉన్నట్లుగా ఇన్‌కాయిస్‌ అధ్యయనం పేర్కొనట్లు తెలిపారు. కోత ముప్పు అతి తీవ్రస్థాయిలో ఉన్న ప్రాంతం 0.55 శాతం ఉన్నట్లు కేంద్ర‌మంత్రి చెప్పారు. సముద్రమట్టం పెరగకుండా నియంత్రించే చర్యల కోసం జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్డీఎంఎఫ్)కి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర‌మంత్రి తెలిపారు. దీనికి అదనంగా తీరప్రాంత కోత వలన నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించేందుకు జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరో వేయి కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. జాతీయ స్థాయిలో నేషనల్ డిసాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ సంస్థను నెలకొల్పి 2021-22 నుంచి 2025-26 కాలానికి ఈ సంస్థకు 68 వేల 463 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర‌మంత్రి తెలిపారు. ఈ నిధిని ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఎంఎఫ్‌ సంస్థలకు 80-20 నిష్పత్తిలో విభజించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో ఎన్‌డీఎంఎఫ్‌ను నెలకొల్పింది. ఇలాంటి సంస్థలనే ఎస్‌డీఎంఎఫ్‌ పేరిట ఏర్పాటు చేయవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన సలహా మేరకు ఇప్పటికి 21 రాష్ట్రాలు ఎస్‌డీఎంఎఫ్‌లను ఏర్పాటు చేశాయని కేంద్ర‌మంత్రి వివరించారు. సముద్ర కోతల వలన తీర ప్రాంతాలకు ఎదురవుతున్న ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు అందిస్తూ సాంకేతికపరమైన పరిష్కార మార్గాలను సూచిస్తున్నాయని కేంద్ర‌మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ చెప్పారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు చిత్రావ‌తి బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బోటింగ్ - ఫొటో గ్యాల‌రీ చిత్రావ‌తి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ - ఫొటో గ్యాల‌రీ మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
అధికారులంతా అప్రమత్తంగా ఉండండి మ‌రోసారి గొప్ప‌ మ‌న‌సు చాటుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా? You are here హోం » టాప్ స్టోరీస్ » డేటా లీక్ ద్వారా టీడీపీ బుద్ధి బయటపడితే..పెగాసస్‌తో బాబు మోసం బట్టబయలు డేటా లీక్ ద్వారా టీడీపీ బుద్ధి బయటపడితే..పెగాసస్‌తో బాబు మోసం బట్టబయలు 20 Mar 2022 5:31 PM వైయస్‌ఆర్‌సీపీ దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పెగాసస్‌ స్పై వేర్‌తో ఎవరి ఫోన్‌నైనా టాప్‌ చేయవచ్చు. ఫోన్‌లో డేటాను చూడొచ్చు గతంలో మా ఫోన్లను చంద్రబాబు హ్యాక్‌ చేయిస్తున్నారని గ్రహించాం అధికార దాహంతోనే ఎలాంటి కుట్రకైనా పాల్పడే వ్యక్తి చంద్రబాబు 2019లో చంద్రబాబుతో జతకట్టిన మమతా బెనర్జీనే పెగాసస్‌ విషయాన్ని వెల్లడి చేశారు ఇప్పటికైనా పెగాసస్‌ స్పై సాఫ్ట్‌వేర్‌ విషయంలో చంద్రబాబు నోరు విప్పాలి ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పింది నిజమో, అబద్ధమో చంద్రబాబే చెప్పాలి ప్రత్యర్థి పార్టీలపై నిఘాకై పెగాసస్‌ను చంద్రబాబు కొన్నారు పెగాసస్‌ స్పై సాఫ్ట్‌వేర్‌ విషయంలో దర్యాప్తుకు వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్ ఏలూరు: డేటా లీక్ ద్వారా టీడీపీ బుద్ధి బయటపడితే..పెగాసస్‌తో బాబు మోసం బట్టబయలైంద‌ని వైయస్‌ఆర్‌సీపీ దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వ్యాఖ్యానించారు. టెక్నాలజీ అంటే తనేనని చంద్రబాబే ఎప్పుడూ చెప్పుకుంటారు. ఆయన వాడిన టెక్నాలజీ పేరు పెగాసస్ అని ఇప్పుడు అందరికీ అర్థమైపోయింద‌న్నారు. పెగాసస్ నిఘా టెక్నాలజీ ఆయన వాడారు. ఐటీ ప్రపంచాన్ని దేశానికి తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు చేసిన నిర్వాకం పెగాసస్‌ స్పై సాఫ్ట్‌వేర్‌. పెగాసస్‌ స్పై సాఫ్ట్‌వేర్‌తో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. అధికార దాహంతోనే ప్రత్యర్థి పార్టీల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే పెగాసస్‌ చంద్రంబాబు కొన్నారు. 2019లో చంద్రబాబుతో రాజకీయంగా జతకట్టిన మమతా బెనర్జీనే బాబు చేసిన పెగాసస్‌ నిర్వాకంపై చెప్పారని తెలిపారు. శ‌నివారం ఏలూరులో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గతంలో ఓటుకు నోటు కేసులో నా ఫోన్‌ ఎలా ట్యాప్‌ చేస్తారని ఆనాడు చంద్రబాబు అన్నాడు. అప్పట్లో సెక్షన్‌ 8 అన్న చంద్రబాబు.. ఆంధ్రాకి రాగానే ఏ సెక్షన్ ప్రకారం పెగాసస్‌ వాడారు. ఆరోజున ప్రతిపక్షాలను టార్గెట్‌ చేశారు. 2018లో జీఓ నెంబర్ 184 చంద్రబాబు ఇచ్చారా? లేదా? ఆ జీఓ ప్రకారం రాష్ట్రంలోని టెలిఫోన్లు, మొబైల్స్, ఇంటర్నెట్‌ సర్వీస్ ప్రొవైడర్లను (ISP) ట్యాపింగ్‌ చేసే అధికారాన్ని ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగానికి చంద్రబాబు కట్టబెట్టారు. దీని ప్రకారం.. ఇంటెలిజెన్స్‌కు చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్ స్థాయి అధికారులు ట్యాపింగ్ చేయవచ్చన్నారు. పెగాసస్‌ స్పైవేర్‌ విషయంలో ప్రత్యర్థులుగా మేమేమీ విమర్శలు చేయటం లేదు. 2019లో మోడీ ఉంటే ప్రమాదమని స్పెషల్ ఫ్లైట్‌లు వేసుకొని మమతా బెనర్జీతో కలిసి అన్ని రాష్ట్రాలు తిరిగారు. ఆ మమతా బెనర్జీనే పెగాసస్‌ స్పై సాఫ్ట్‌వేర్‌ చంద్రబాబు కొన్నారని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇప్పుడు మమతా బెనర్జీ మాటలు దేశమంతా చర్చనీయాంశం అయ్యాయి. అధికారంలో ఉండాలని చంద్రబాబు చేసే ప్రలోభాలు రాష్ట్ర ప్రజానీకానికి బాగా తెల్సు. కానీ ఇప్పుడు దేశ ప్రజానీకానికి కూడా చంద్రబాబు ఏంటో తెల్సిపోయింది. ఏమనుకుంటున్నారో తెలుస్తోందని, వైయస్ఆర్‌సీపీ, బీజేపీ ఓటర్ల లిస్టు డిలీజ్ చేస్తున్నామని మమతా బెనర్జీకి చంద్రబాబు చెప్పారంట. పెగాసస్‌ స్పై సాఫ్ట్‌వేర్‌ విషయంలో మమతా బెనర్జీ స్పందించిన మరుక్షణం టీడీపీ నేతలు అంతా స్పందిస్తున్నారు. మమతా బెనర్జీకి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని లోకేశ్ అన్నారు. దొంగ ఎవరంటే భుజాలు తడుముకునే పరిస్థితి. మమతా లేవనెత్తిన అంశంపై చంద్రబాబు, లోకేశ్‌లు సమాధానం చెప్పాలని అబ్బయ్య చౌదరి డిమాండ్ చేశారు. తప్పు చేయకపోతే.. పరువు నష్టం కేసులు వేస్తామని చంద్రబాబు, లోకేశ్‌ అంటుంటారు. మరి, మమతా బెనర్జీ చెప్పింది తప్పు అని ఇంతవరకు చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. అంటే, రాష్ట్ర ప్రజలతో పాటు.. రాజకీయ నాయకులు, జడ్జీల వరకు అందరిపైనా నిఘా వేయెచ్చు. అందుకే చంద్రబాబు ఏపీలో ఉండకుండా హైదరాబాద్‌లో ఉండి ఈ సాఫ్ట్‌వేర్‌ వాడుతున్నారేమో అని అబ్బయ్య చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. గతంలో 3.50 కోట్ల మంది డేటాను చంద్రబాబు దగ్గర పెట్టుకొని ప్రజల్ని మోసం చేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్‌కృష్ణ ఆకాశ్‌ అడ్వాన్స్‌ సిస్టమ్స్‌ ద్వారా ఇజ్రాయిల్‌కు చెందిన కంపెనీ ద్వారా రూ.25 కోట్లతో స్పై సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా? ఆ స్పై సాఫ్ట్‌వేర్‌ కొన్నది నిజమా? కాదా? ఈ స్పై సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉన్న ఇజ్రాయిల్‌ వెళ్లారా? లేదా? ఆ స్పై పరికరాలను ఎంతో రహస్యంగా రాష్ట్రానికి తీసుకొచ్చారు. వీటన్నింటిపై గతంలో హైదరాబాద్‌ పోలీసులకు వైయస్ఆర్‌సీపీ కంప్లైంట్ చేసింది. ఐటీ గ్రిడ్స్‌ కంపెనీలో రాష్ట్ర ప్రజల డేటా బయటపడింది. ఐటీ గ్రిడ్స్‌ చెందిన రెండు కార్యాలయాల్లో ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు, కీలక పత్రాలు, డేటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది అబద్ధమని చంద్రబాబు, లోకేశ్ చెప్పగలరా? దీనికి చంద్రబాబు, లోకేశ్ బాధ్యత వహించాలి. పెగాసస్ స్పై సాఫ్ట్‌వేర్‌ను ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ (NSO) గ్రూపు తయారు చేసింది. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా టెర్రరిస్టులు, సంఘవిద్రోహశక్తులను పట్టుకోవటానికి తయారు చేశారు. పెగాసస్‌ను ప్రపంచదేశాలకు అమ్మే ప్రయత్నం చేశారు. ఈ పెగాసస్‌ స్పై సాఫ్ట్‌వేర్‌ విషయంలో మెక్సికో, ఫ్రాన్స్‌, ఈజిప్టు, సౌతాఫ్రికా అధ్యక్షులు స్పందించారు. ఈ పెగాసస్‌ స్పై సాప్ట్‌వేర్‌ ద్వారా ఫోన్‌కు మిస్డ్‌ కాల్ ఇచ్చి ఫోన్‌లోకి పంపిస్తారు. ఆతర్వాత మన ఫోన్‌లోకి వచ్చే మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, డేటా అంతా దూరంగా ఉండి గమనిస్తారు. ఆ సాఫ్ట్‌వేర్‌ మన ఫోన్‌లో ఉంటే.. మనం గదిలో ఉన్నా.. మైక్రోఫోన్‌ ద్వారా ఆటోమ్యాటిక్‌గా రికార్డ్ చేస్తుంది. దూరంగా ఉండి మొత్తం వినొచ్చు. చూడొచ్చు. ఇది భయంకరమైన విషయం. పెగాసస్‌ స్పై సాఫ్ట్‌వేర్ వల్ల మనం మన కుటుంబ సభ్యులతో మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేం. పెగాసస్‌ స్పై సాఫ్ట్‌వేర్‌ను మన దేశంలో కొన్నారని 2017లోనే న్యూయార్క్ టైమ్స్‌ కథనం వెల్లడించింది. తర్వాత దీనిపై పార్లమెంట్‌లోనూ చర్చించారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా ప్రొఫెసర్ చౌదరీ, ప్రొఫెసర్‌ ప్రభాహరణ్‌, అనిల్‌ గుమస్తే అనే ముగ్గురు సభ్యులతో కమిటీని వేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మా ఫోన్లు హ్యాక్‌ చేశారు. ఆరోజే కుట్ర జరగబోతోందని మేం అనుమానించాం. టెక్నాలజీ అంటే చంద్రబాబు కాదు.. పెగాసస్‌ స్పై సాఫ్ట్‌వేర్‌. ఆ స్పై సాఫ్ట్‌వేర్‌ తెచ్చి రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు మోసం చేస్తున్నారనే విషయాన్ని మేం ఆరోజు గ్రహించలేకపోయాం. గతంలో మా పార్టీ సీనియర్‌ నాయకుడు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ట్యాప్‌ చేసిన సంగతిని అబ్బయ్య చౌదరి గుర్తు చేశారు. ఎస్పీ భాస్కర్ భూషణ్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ చేయమని లేఖ రాశారు. చంద్రబాబు బాగోతాన్ని పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ బయటపెట్టారు. కాబట్టి.. తక్షణం ఈ పెగాసస్‌ స్పై సాఫ్ట్‌వేర్‌ విషయంలో సమగ్ర విచారణ జరిపించాలని అబ్బయ్య చౌదరి డిమాండ్‌ చేశారు. ఈ పెగాసస్‌ దేశభద్రతతో ముడిపడి ఉంది. ఈ స్పై సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేయాలంటే కేంద్ర రక్షణ, విదేశీ వ్యవహారాల అనుమతి తీసుకొని ఉండాలి. కేంద్ర అనుమతి లేకుండా పెగాసస్‌ స్పై సాఫ్ట్‌వేర్‌ కొంటే చంద్రబాబు, లోకేశ్‌లు నేరస్తులు. ఈ అంశంలో పూర్తి దర్యాప్తు జరిగే వరకు వైయస్‌ఆర్‌సీపీ వదిలిపెట్టేది లేదని అబ్బయ్య చౌదరి అన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
azərbaycanAfrikaansBahasa IndonesiaMelayucatalàčeštinadanskDeutscheestiEnglishespañolfrançaisGaeilgehrvatskiitalianoKiswahililatviešulietuviųmagyarNederlandsnorsk bokmålo‘zbekFilipinopolskiPortuguês (Brasil)Português (Portugal)românăshqipslovenčinaslovenščinasuomisvenskaTiếng ViệtTürkçeΕλληνικάбългарскиқазақ тілімакедонскирусскийсрпскиукраїнськаעבריתالعربيةفارسیاردوবাংলাहिन्दीગુજરાતીಕನ್ನಡमराठीਪੰਜਾਬੀதமிழ்తెలుగుമലയാളംไทย简体中文繁體中文(台灣)繁體中文(香港)日本語한국어 WhatsAppలో చేరండి ప్రపంచంలో ఎవరితోనైనా మాట్లాడేందుకు WhatsApp ఒక వేగవంతమైన, సరళమైన మరియు విశ్వసనీయమైన మార్గం. 180 కన్నా ఎక్కువ దేశాల్లో 200 కోట్ల మందికి పైగా ప్రజలు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా ఎక్కడైనా సన్నిహితంగా ఉండేందుకు WhatsAppను ఉపయోగిస్తున్నారు. WhatsApp ఉచితంగా లభించడం మాత్రమే కాకుండా, పలు మొబైల్ పరికరాల్లో మరియు తక్కువ కనెక్టివిటీ ఉండే ప్రదేశాల్లో కూడా అందుబాటులో ఉంటుంది – తద్వారా మీరు ఎక్కడ ఉన్నా, ఇది మీకు అందుబాటులో ఉంటుంది, విశ్వసనీయమైనది. మీకు ఇష్టమైన క్షణాలను షేర్ చేసేందుకు, ముఖ్యమైన సమాచారాన్ని పంపేందుకు లేదా ఒక స్నేహితునితో సరదాగా మాట్లాడేందుకు ఇది ఒక సరళమైన మరియు సురక్షితమైన మార్గం. ప్రపంచంలో వ్యక్తులు ఎక్కడెక్కడో ఉన్నా కూడా వారందరూ కనెక్ట్ అయ్యేలా, షేర్ చేసుకునేలా WhatsApp సహాయపడుతుంది. WhatsApp తన సంస్థలోని ఉద్యోగ అవకాశాలలో సమానత్వాన్ని అమలు చేస్తూ, వివక్షకు గురైన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తోందని సగర్వంగా ప్రకటిస్తున్నాము. జాతి, మతం, రంగు, జాతీయ మూలం, లింగం (ప్రెగ్నెన్సీ, పిల్లల పుట్టుక, పునరుత్పత్తి ఆరోగ్య నిర్ణయాలు లేదా సంబంధిత ఆరోగ్య సమస్యలతో సహా), లైంగిక ధోరణి, జెండర్ గుర్తింపు, జెండర్ ఎక్స్‌ప్రెషన్, వయస్సు, ఆర్మీ వెటరన్ స్టేటస్, దివ్యాంగులయిన వ్యక్తి స్టేటస్, జన్యు సంబంధ సమాచారం, రాజకీయ దృక్పథాలు లేదా కార్యకలాపాలు, లేదా చట్టపరంగా సంరక్షించబడే ఇతర ప్రత్యేక లక్షణాల ఆధారంగా మేము ఎటువంటి వివక్షనూ చూపము. ఉద్యోగ అవకాశాలలో మేము అమలు చేసే సమానత్వాన్ని ప్రకటించే మా నోటీసును మీరు ఇక్కడ చూడవచ్చు. వర్తించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, స్థానిక చట్టాలకు అనుగుణంగా, నేర చరిత్ర గల వ్యక్తులెవరైనా మాకు కావాల్సిన అర్హతలను కలిగి ఉన్నట్లయితే వారిని కూడా మేము పరిగణిస్తాము. చట్టం అనుమతించిన మేరకు, అలాగే చట్టపరమైన ఆవశ్యకతలకు అనుగుణంగా Facebook యొక్క అలాగే దాని ఉద్యోగుల యొక్క సురక్షతను, భద్రతను కాపాడేందుకు మీరు సమర్పించే సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు. Facebook యొక్క వేతనాలలో పారదర్శకత అనే విధానాన్ని మరియు ఉద్యోగ అవకాశాలలో సమానత్వం అనేది ఒక చట్టం అనే నోటీసును వాటి సంబంధిత లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా మీరు చూడవచ్చు. అంతే కాక, కొన్ని లొకేషన్లలో వర్తించే చట్టపరమైన ఆవశ్యకతలకు అనుగుణంగా ఇ-వెరిఫై ప్రోగ్రామ్‌లో కూడా WhatsApp పాల్గొంటుంది. మా ఎంపిక ప్రక్రియలో పాల్గొనే దివ్యాంగులైన అభ్యర్థులకు సహేతుకమైన స్థాయిలో సౌకర్యాలను అందించడానికి WhatsApp కట్టుబడి ఉంది. ఏదైనా అంగవైకల్యం వల్ల మీకు ఏమైనా సహాయం లేదా అదనపు సౌకర్యాల అవసరం ఉంటే, దయచేసి accommodations-ext@fb.com ఈమెయిల్ అడ్రస్ వద్ద మాకు తెలియజేయండి.
Telugu News » Andhra pradesh » Visakhapatnam » Covid 19 ap govt to impose seven hour night curfew police implementation in visakhapatnam AP Night Curfew: కరోనా కల్లోలానికి స్తంభించిన జనజీవనం.. విశాఖ జిల్లాలో కొనసాగిన రాత్రిపూట కర్ఫ్యూ.. డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ మళ్లి కర్ఫ్యూతో బందీ అయింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విశాఖ జిల్లాలో కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. Vizag Night Curfew Balaraju Goud | Apr 25, 2021 | 7:40 AM AP Govt To Impose Night Curfew: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ మళ్లి కర్ఫ్యూతో బందీ అయింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విశాఖ జిల్లాలో కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. పోలీసుల సూచనలతో విశాఖ నగరంలోని ప్రధాన వర్తక సముదాయాలు, షాపింగ్ మాల్స్ కర్ఫ్యూ ప్రారంభానికి గంట ముందుగానే మూతపడ్డాయి. రాత్రి 9 గంటలకే నగరంలోని చాలా చోట్ల జనసంచారం తగ్గి, రోడ్లు నిర్మానుష్యంగా మారి పోయాయి. నగరంలోని పలుచోట్ల డ్రోన్ కెమెరా ద్వారా జనసంచారంపై నిఘా పెట్టారు పోలీసులు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు తో విశాఖ జిల్లాలో స్వచ్ఛంద పాక్షిక లాక్ డౌన్ లను ఎక్కడికక్కడ స్థానిక వర్తకులు కొనసాగిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుండి రాత్రి పూట కర్ఫ్యూ నీ అమలులోకి తెచ్చింది. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ కర్ఫ్యూ ప్రభావం ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ లో మొదటిరోజు స్పష్టంగానే కనిపించింది. నగరంలోని జగదాంబ సెంటర్, సిరిపురం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, గాజువాక ,మధురవాడ వంటి ప్రాంతాల్లో కర్ఫ్యూ ప్రారంభానికి గంట ముందు నుంచే ప్రధాన వర్తక సముదాయాలు ,షాపింగ్ మాల్స్ ను నిర్వాహకులు మూసివేశారు. అటు, రాత్రి 9గంటల సమయానికే నగరంలోని చాలా ప్రాంతాల్లో జన సంచారం తగ్గి, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. కర్ఫ్యూ ప్రారంభానికి కొన్ని గంటల ముందే పోలీసులు రోడ్లపైకి వచ్చి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని ప్రజలు తమ కార్యకలాపాలు ముగించుకొని త్వరగా ఇళ్లకు చేరాలంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. విశాఖ నగరంలో అమలు కోసం 23 పోలీస్ సబ్ కంట్రోల్ పాయింట్స్ తో పాటు నైట్ పెట్రోలింగ్ టీములను ఏర్పాటు చేశారు. నగరంలోని బీచ్ రోడ్ తోపాటు, పలు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరా ల ద్వారా జనసంచారంపై నిఘా పెట్టారు పోలీసులు. కర్ఫ్యూ కారణంగా సెంట్రల్ పార్క్ వద్ద ఉన్న నైట్ ఫుడ్ కోర్టు సైతం 10 గంటలకే మూతపడింది. దీంతో ఆహార ప్రియులు డిన్నర్ కోసం అవస్థలు పడ్డారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వ విధించిన కర్ఫ్యూ తర్వాత ఎక్కడ పూర్తిస్థాయి లాక్ డౌన్ కు దారితీస్తుందో అన్న భయంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు వలస కూలీలు నెల్లూరు నుంచి స్వస్థలాలకు బయలుదేరారు. అలా వచ్చిన వలస కూలీలు అంతా కర్ఫ్యూ కారణంగా విశాఖలో ఇరుక్కుపోయారు. విశాఖ వరకు చేరుకున్న వీరు శ్రీకాకుళం వెళ్లేందుకు వేరే మార్గం లేక రాత్రంతా విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే జాగారం చేశారు. నగరంలోనే కాదు విశాఖ జిల్లాలోని అటు రూరల్ ,ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం రాత్రి అంతా కర్ఫ్యూ అమలైంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరుకు తోపాటు ఏజెన్సీలోని పాడేరు, చింతపల్లి ప్రాంతాలలో సైతం అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని అడ్డుకున్నారు పోలీసులు. అత్యవసరాల నిమిత్తం తిరిగే వాహనాలకు వెసులుబాటు ఇచ్చిన పోలీసులు, అనవసరంగా బయట తిరిగేవారికి మొదటి రోజు కావడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి సరిపెట్టారు. ఇకపై మాత్రం రాత్రిపూట అనవసరంగా రోడ్లపై తిరిగితే వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. Read Also… Iraq Covid hospital fire: బాగ్దాద్ కోవిడ్ హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన ఆక్సిజన్ ట్యాంక్.. 23 మంది మృతి
Telugu News » National » Central minister nitin gadkari announced that 6 airbags rule is must from 2023 october 1st Telugu Business News Nitin Gadkari: కార్లలో ఎయిర్‌ బ్యాగుల విషయమై కేంద్రం కీలక నిర్ణయం.. ట్వీట్‌ చేసిన మంత్రి.. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా దేశంలో తయారయ్యే అన్ని కార్లలో కచ్చితంగా ఆరు ఎయిర్‌ బ్యాగులు ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపై మార్కెట్లోకి వచ్చే ప్రతీ కారులో ఆరు ఎయిర్‌ బ్యాగులు కేంద్రం తప్పనిసరి చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఏడాది... Air Bags Narender Vaitla | Sep 29, 2022 | 3:55 PM ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా దేశంలో తయారయ్యే అన్ని కార్లలో కచ్చితంగా ఆరు ఎయిర్‌ బ్యాగులు ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపై మార్కెట్లోకి వచ్చే ప్రతీ కారులో ఆరు ఎయిర్‌ బ్యాగులు కేంద్రం తప్పనిసరి చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఈ నిబంధన తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే అక్టోబర్‌ నుంచి ఈ నిబంధనను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు కూడా చేసింది. కానీ తాజాగా ఈ నిర్ణయంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగుల నిబంధనను ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి కాకుండా వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. అంటే 2023 అక్టోబర్‌ 1 నుంచి ఈ కొత్త నిబంధనను అమలు చేయనున్నారు. ఈ విషయమై కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ‘సరఫరాలో పరిమితులతో ఆటో ఇండస్ట్రీ ఎదుర్కొంటొన్న ఇబ్బందులు, స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రయాణికుల కార్లలో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను 2023 అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా ఎయిర్‌బ్యాగులను అమలు చేయాలి. ప్రయాణికుల భద్రతే ప్రథమ లక్ష్యం’ అని రాసుకొచ్చారు. Safety of all passengers travelling in motor vehicles irrespective of their cost and variants is the foremost priority. — Nitin Gadkari (@nitin_gadkari) September 29, 2022 ఇదిలా ఉంటే దేశీయ కార్ల కంపెనీల్లో చాలా వరకు విదేశాలకు ఎగుమతి చేసే వాటిలో ఆరు ఎయిర్‌ బ్యాగ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. కానీ దేశీయంగా మాత్రం ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. దీంతో ఈ విషయంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాహనతయారీ సంస్థలు ప్రజల ప్రాణాలను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదంటూ గతంలో వ్యాఖ్యానించారు.
SXJ స్టేపుల్ కంపెనీ బాడింగ్ యోంగ్వీ గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ, మా కంపెనీ ఉత్పత్తి యొక్క సేకరణ, వన్-స్టాప్ సేవల అమ్మకాలు. యోంగ్వీ ఇండస్ట్రియల్ గ్రూప్‌లో ఎనిమిది ఉప ప్లాంట్లు ఉన్నాయి, ఉత్పత్తి మరియు తయారీ, ఒకటి అమ్మకాలు, డజన్ల కొద్దీ లోహ ఉత్పత్తులతో సహా ఉత్పత్తులు, కానీ స్వదేశీ మరియు విదేశాలలో ఉన్న వినియోగదారులకు గొప్ప సౌలభ్యాన్ని అందించడానికి. ఈ కర్మాగారం 1990 లో స్థాపించబడింది, ఒక చిన్న వర్క్‌షాప్ నుండి ప్రారంభమైంది, ఒక యంత్రం, ఇద్దరు కార్మికులు, క్రమంగా 1000 చదరపు మీటర్ల వర్క్‌షాప్, 10 యంత్రాలు, 20 కార్మికులుగా అభివృద్ధి చెందారు, ఇప్పటివరకు 8 మంది 400mu, 800 యంత్రాల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నారు, దాదాపుగా వెయ్యి మంది కార్మికులు, అధునాతన భావన యొక్క స్థాపకుడు మరియు ఉత్పత్తి నిర్వాహకులపై ఆధారపడటం మరియు కష్టాలకు భయపడకూడదనే ఆత్మ, స్థిరమైన అభివృద్ధి. ఫ్యాక్టరీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది, నిజాయితీ నిర్వహణ, నాణ్యత-ఆధారిత, ఉత్పత్తి భద్రత ఉత్పత్తి మరియు నిర్వహణ భావన! 1990 లో, వ్యవస్థాపకుడు కర్మాగారాన్ని స్థాపించాడు మరియు మొదటి హార్డ్‌వేర్‌ను ఉత్పత్తి చేశాడు. దేశీయ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 1998 లో, మొదటి 1000 చదరపు మీటర్ల ఉత్పత్తి వర్క్‌షాప్ నిర్మించబడింది, ఇది భవిష్యత్తులో మరిన్ని కర్మాగారాల నిర్మాణానికి బలమైన పునాది వేసింది. 2000 లో, మేము మా ఉత్పత్తులను ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు అమ్మడం ప్రారంభించాము, అధిక-నాణ్యత ఉత్పత్తులు, సున్నా ఫిర్యాదు నాణ్యత, స్వదేశీ మరియు విదేశాలలో వినియోగదారుల నుండి మంచి ఆదరణ పొందాయి. 2008 లో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క గొప్ప మాంద్యం, మేము అధిక-నాణ్యత గల కస్టమర్లను సంవత్సరాలుగా ఆదా చేశాము, ఆర్థిక మాంద్యం మాత్రమే కాదు, పెద్ద అడుగు కూడా ఉంది. ఇది మాకు కస్టమర్ యొక్క గుర్తింపు, ఇది మా స్వంత ఉత్పత్తి నాణ్యత క్లియరెన్స్, ఉత్తమ రాబడి యొక్క నాణ్యమైన సేవ. 2013 లో, అలంకరణ కోసం గోర్లు తయారు చేయడానికి మేము ఒక కర్మాగారాన్ని సృష్టించాము. తుపాకీ గోర్లు, స్ట్రెయిట్ గోర్లు, కోడ్ గోర్లు, అలంకరణ గోర్లు, ఫర్నిచర్ గోర్లు మరియు వరుస గోరు ఉత్పత్తులతో సహా ప్రస్తుతం చైనాలో అతిపెద్ద తయారీదారులలో మేము ఒకరు. 2016 లో, మేము ప్రపంచానికి, దక్షిణ అమెరికా, యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా మరియు ఇతర దేశాలకు గోర్లు ఉత్పత్తి చేసాము. 2018 లో, కస్టమర్లకు మెరుగైన సేవలందించడానికి, కస్టమర్లు ఫ్యాక్టరీకి మరింత సౌకర్యవంతంగా మరియు సౌకర్యవంతంగా రావనివ్వండి, మేము మా కొత్త కార్యాలయ భవనాన్ని నిర్మించడం ప్రారంభించాము. కొత్త కార్యాలయ భవనం పూర్తయింది 2020 లో మరియు అన్ని ప్రాంతీయ ప్రణాళికలు పూర్తయ్యాయి, తద్వారా మేము ఉత్పత్తిపై బాగా దృష్టి పెట్టవచ్చు మరియు వినియోగదారులకు సేవ చేయవచ్చు.
గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా, టైప్-2 మధుమేహం, గుండె జబ్బుల రిస్క్ తగ్గించుకోవచ్చు. గ్లైసిమిక్ ఇండెక్స్ అన్నది తిన్న వెంటనే ఎంత మేర బ్లడ్ గ్లూకోజ్ పెరిగేందుకు కారణమవుతుందన్ని తెలియజేస్తుంది. జీఐ 55 అంతకంటే తక్కువ ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. జీఐ 56-69 మధ్య ఉంటే మధ్యస్థంగాను, 70 కంటే ఎక్కువ ఉంటే దాన్ని అధిక జీఐ గాను పరిగణిస్తారు. కనుక జీఐ 55 కంటే తక్కువగా ఉన్న ఆహారం మంచిది. జీఐ తక్కువ ఉండే వాటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలో గ్లూకోజ్ పెద్దగా పెరగకుండా చూసుకోవచ్చు. కనుక డయాబెటిస్ ఉన్న వారికి మంచి పరిష్కారం. రక్తంలో గ్లూకోజ్ పెరగకపోవడం వల్ల కొలెస్ట్రాల్, బరువు అదుపులో ఉంటాయి. దీనివల్ల గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది. కేన్సర్ రిస్క్ ను కూడా తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక జీఐ తక్కువగా ఉంటే వాటిని తీసుకుంటే పొట్టలో కొవ్వు పేరుకు పోకుండా ఉంటుంది. బంగాళాదుంపలను తీసుకోవద్దు. దీనికి బదులు చిలగడదుంపలు తినొచ్చు. పొటాటో కంటే స్వీట్ పొటాటోలో జీఐ తక్కువగా ఉంటుంది. క్వినోవా, అమర్ నాథ్ వంటి సిరీయుల్స్ మంచివి. వైట్ బ్రెడ్ కు బదులు హోల్ వీట్ బ్రెడ్ తీసుకోవాలి. దీనివల్ల అధిక పోషకాలు అందుతాయి. జీఐ కూడా తక్కువ ఉంటుంది. ఇన్ స్టంట్ ఓట్స్ కు బదులు స్టీల్ కట్ ఓట్స్ తీసుకోవాలి. ప్యాకేజ్డ్ కార్న్ ఫ్లేక్స్ కు బదులు, స్టీల్ కట్ ఓట్స్ తినాలి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా ప్రాసెస్ చేసినవి. వాటిల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రోల్డ్ ఓట్స్ తింటే జీఐ చాలా తక్కువ. వైట్ రైస్ తినే వారు దానికి బదులు బ్రౌన్ రైస్ తినాలి. దీనివల్ల మరింత ఫైబర్ అందుతుంది. బిస్కెట్లు, కుకీలకు బదులు తాజా పండ్లు, నట్స్, సీడ్స్ ను తినాలి. గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు మంచివి. అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారంతో కొలెస్ట్రాల్, ఇన్ ఫ్లమేషన్ పెరిగి గుండెకు ముప్పు ఏర్పడుతుంది. కనుక జీఐ తక్కువగా ఉండేవి మంచి పరిష్కారం
ఒక ఆలోచన రావడం చాలా తేలిక కానీ వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెట్టడమే చాల కష్టం , కానీ బెంగాల్ వాళ్ళు వారికీ వచ్చిన ఆలోచనలకూ రూపం ఇస్తూ ఒక అద్భుతమైన టైర్ పార్క్ ని రూపొందించారు. మన దేశంలో చాల గ్యారేజ్ లలో టైర్ల కుప్పలు రోజురోజు పేరుకు పోతూనే ఉంటాయి. వాటిని ఏంచేయాలో కూడా తెలీని పరిస్థితిలో వాటిని కాల్చుతూ ఉంటారు. కానీ కలకత్తా కి చెందిన కొంతమంది యువకులు కలిసి ఈ టైర్ పార్క్ ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. పశ్చిమ బెంగాల్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (WBTC) లో ఈ పార్క్ ని రూపొందించారు. ఇలాంటి పార్క్ ఇంతవరకు ఎక్కడ లేదనే చెప్పాలి. ఈ పార్క్ యొక్క ముఖ్య ఉందేశం ఏంటంటే ఈ భూమి పై తయారైన ఏ వస్తువు వృధాకాదు ఐ చెప్పడానికి ఇలా చేశామని తెలిపారు.
thesakshi.com : థియేట్రికల్ విడుదలైన నాలుగు నెలల తర్వాత కూడా, SS రాజమౌళి యొక్క RRR దాని రికార్డ్ బ్రేకింగ్ పరంపరను కొనసాగిస్తుంది. OTT అరేనాలో అసాధారణమైన SS రాజమౌళితో సహా అంతర్జాతీయ ప్రేక్షకుల నుండి ఈ చిత్రానికి ఇంత అపూర్వమైన స్పందన లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. ట్విట్టర్‌లో, ఒక పాశ్చాత్య వినియోగదారు SS రాజమౌళి యొక్క ఎపిక్ యాక్షన్ అద్భుతమైన RRR నుండి క్లిప్‌ను పంచుకున్నారు. అతను క్లిప్‌కి క్యాప్షన్ ఇచ్చాడు, “నేను 29 MCU సినిమాలు చూశాను. RRR (నెట్‌ఫ్లిక్స్‌లో)లో ఈ ట్రక్/యానిమల్ షాట్ వంటి హాస్యాస్పదమైన మరియు నమ్మశక్యం కాని షాట్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పటి వరకు ఏ భారతీయ వీడియో ట్విట్టర్‌లో ఇంత సంచలనం సృష్టించలేదు. ఈ వీడియో సంచలనాత్మకంగా ఒక రోజులో 10M వీక్షణలను దాటింది మరియు ఇప్పుడు 12M వీక్షణలను సాధించింది. ఆ క్లిప్‌లో ఇంటర్వెల్‌కు ముందు, బ్రిటీష్‌పై జంతువులను ఎన్టీఆర్ విప్పుతున్నట్లు చూపినందున ఎన్టీఆర్ అనుచరులు ఈ ఘనత గురించి థ్రిల్‌గా ఉన్నారు. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ చిత్రానికి ఇప్పటికే సానుకూలంగా స్పందించారు మరియు ఇది రోజురోజుకు కొత్త సోషల్ మీడియా విశేషాలను కలిగిస్తుంది. RRR క్రేజ్ గురించి మళ్లీ మళ్లీ చెప్పాల్సిన పని లేదు. Jr NTR, రామ్ చరణ్ మరియు SS రాజమౌళి ముగ్గురి అద్భుతమైన పనిని చూసి ప్రపంచం మొత్తం విస్మయం చెందుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రం OTT అరంగేట్రం తర్వాత, ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది సినీ ప్రేమికులకు చేరువైంది మరియు ప్రముఖుల నుండి కూడా మంచి సమీక్షలను అందుకుంది. I’ve watched 29 MCU movies. I’ve never seen a shot as ridiculous and incredible as this truck/animal shot in RRR (on Netflix) pic.twitter.com/JTheyZIYB7 — Nate Offord (@NateOfford) July 17, 2022 ఇప్పుడు, జూనియర్ ఎన్టీఆర్ మరియు అడవి జంతువులతో కూడిన RRR యొక్క విరామ సన్నివేశం గురించి ఒక విదేశీయుడు చేసిన సాధారణ ట్వీట్ ట్విట్టర్‌లో తిరుగులేని రికార్డును సృష్టించింది. వినియోగదారు జంతువుల పోరాట సన్నివేశాన్ని పోస్ట్ చేసారు మరియు ఈ కథనాన్ని వ్రాసే సమయానికి 11.3 మిలియన్ల కంటే ఎక్కువ వీక్షణలను సంపాదించడం ద్వారా ఇది ఇంటర్నెట్‌ను కదిలించింది. సోషల్ మీడియాలో ఈ రకమైన విపరీతమైన స్పందనను సాధించిన మొట్టమొదటి తెలుగు వీడియో ఇదే మరియు ఇది తారక్ అభిమానుల కారణంగా జరిగింది. RRR నుండి వారి నటుడి క్లిప్ సోషల్ మీడియాలో తరంగాలను సృష్టిస్తున్నందున తారక్ యొక్క డైహార్డ్ అభిమానులు క్లౌడ్ నైన్‌లో ఉన్నారు. మరోవైపు, ప్రపంచంలోని నలుమూలల నుండి RRRకి వస్తున్న స్పందనతో TFI అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. DVV దానయ్య నిర్మించిన RRR, అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. MM కీరవాణి సంగీతం ఈ టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ యొక్క ఆస్తులలో ఒకటి.
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 జాతిపితకు పూలమాలల వేసిన ఎమ్మెల్యేలు పలు చోట్ల సేవా కార్యక్రమాలు గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 2 : భారతదేశ చరిత్రలో మహాత్మగాంధీ స్థానం సుస్థిరమని ఎమ్మెల్యే అన్నా.రాంబాబు అన్నారు. గాంధీ జయంతి సందర్భం గా ఆదివారం పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అహింస మార్గంలో సత్యాగ్రహమే ఆయుధంగా పోరాడి బ్రిటీష్‌ పాలకులను తరిమికొట్టి దేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ప్రసాదించాడన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రామకృష్ణయ్య, కౌన్సిలర్లు గడ్డం భాస్కర్‌రెడ్డి, లొక్కు రమేష్‌, మానం బాలిరెడ్డి, పెద్దభాషా, దమ్మాల జనార్థన్‌, షేక్‌ మస్తాన్‌వలి, డాక్టర్‌ భూమానరసింహారెడ్డి, డాక్టర్‌ జీకే.మోహన్‌రెడ్డి, పెండేల కిరణ్‌, దేమా శ్రీరాములు పాల్గొన్నారు. బలిజ సంఘం ఆధ్వర్యంలో నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు యగటీల రంగసుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి పుసుపులేటి శ్రీను, యగటీల రవిప్రకాశ్‌, ముద్దర్ల శ్రీను పాల్గొన్నారు. అమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సభ్యులు సుధాకర్‌, విజయరామరాజు, రాజు, శివమణి, బాదుల్లా, భరత్‌, కమతం రమేష్‌ పాల్గొన్నారు. కంచుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలోనలుగురు పారిశుధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటరాజమ్మ, కార్యదర్శి జమాల్‌, పాల్గొన్నారు. యశ్వంత్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో బాలింతలకు పండ్లు, రొట్టేలు పంపిణీ చేశారు. మొర్రి తిరుపతమ్మ, యశ్వంత్‌ సుమన్‌, తదితరులు పాల్గొన్నారు. త్రిపురాంతకం : త్రిపురాంతకంలోని వాసవీకన్యకా పరమేశ్వరీ అమ్మవారిశాలలోని మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘం మండల ప్రతినిధులు కాసుల సత్యనారాయణ, సీహెచ్‌.హనుమంతరావు, జి.చిన్నసుబ్బారావు, కె.ప్రసాద్‌, పి.మల్లిఖార్జునరావు, కె.పూర్ణనాగేశ్వరరావు పాల్గొన్నారు. తహసీల్దారు కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. టీడీపీ మండల కన్వీనర్‌ వలరాజు ఆద్వర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు. 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గాంధీ విగ్రహానికి అందజేశారు. మార్కాపురం(వన్‌టౌన్‌) : దేశంకోసం ప్రాణాలు లెక్కచేయకుండా తెల్లదొరలపై పోరాడిన భరతమాత ముద్దుబిడ్డ మహాత్మాగాంధీ అని ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి అన్నారు. గాంధీజయంతి పురస్కరించుకొని స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, వైస్‌ చైర్మన్‌ ఇస్మాయిల్‌, మున్సిపల్‌ కమీషనర్‌ గిరికుమార్‌, డిఈ సుభానీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నాయబ్‌ రసూల్‌ తదితరులు పాల్గొన్నారు. బేస్తవారపేట(కంభం) : కంభం లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో ఆదివారం స్థానిక ఎల్‌ఐసీ సేవాకేంద్రం వద్ద మహత్మగాంధీ, లాల్‌బహుదూర్‌శాస్ర్తిల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలల వేసి నివాళులు అర్పించా రు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు సయ్యద్‌ జాకీర్‌ హుస్సేన్‌ పులి శ్రీనివాసప్రసాద్‌,మొగల్‌ మహబుబ్‌ బేగ్‌,ఎన్‌.కేశవ, సీహెచ్‌.గంగాధర్‌,జె.తులసి ప్రసాద్‌,వి.శ్రీనివాసులు పాల్గొన్నారు. రాచర్ల : మండలంలోని చినగానిపల్లె గ్రామంలో జడ్పీటీసీ సభ్యురాలు పగడాల దేవి, పగడాల శ్రీరంగంలు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సచివాలయంలో సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్‌ నివాళులు అర్పించారు. పెద్ద దోర్నాల : పంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ గుమ్మా పద్మజ, సర్పంచి చిత్తూరి హారిక, గ్రామ కార్యదర్శి గాంధీజి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో నటరాజ్‌ కూడలిలో ఉన్న గాంధీ విగ్రహానికి టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతిపిత మహాత్మ గాంధీజి దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ యా కార్యక్రమాల్లో ప్రధానోపాధ్యాయులు కిరణ్‌ కిశోర్‌కుమార్‌, టీడీపీ నాయకులు బట్టు సుధాకర్‌ రెడ్డి, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంటి, షేక్‌ సమ్మద్‌భాష, యలకపాటి చంచయ్య, కే.చెన్నారెడ్డి, కే.శ్రీనివాస్‌యాదవ్‌, షేక్‌ మౌలాలి, వైసీపీ నాయకులు జోగి వెంకట నారాయణ, కె శ్రీనివాసులు పాల్గొన్నారు. తర్లుపాడు : జిల్లా పరిషత్‌ పాఠశాలలోని గాంధీ విగ్రహానికి నెహ్రూ యూత్‌, మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపిపి సూరెడ్డి భూలక్ష్మీ మాట్లాడుతూ..,ప్రతి ఒక్కరూ మహాత్మాగాంధీ ఆశయాలను కొనసాగించాలన్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు కశ్శెట్టి జగన్‌బాబు, నెహ్రూ యూత్‌ అధ్యక్షు డు బి.పుల్లయ్య, వాసవీ క్లబ్‌ సభ్యులు కె.రంగరత్నమ్మ, కృష్ణవేణి, జి.జనార్ధన్‌, ఎస్‌.రామసుబ్బారెడ్డి, కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ అక్బర్‌వలి తదితరులు పాల్గొన్నారు.
బాబూ.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేస్తావా..? ఆక్వా రైతులను ఆదుకోండి పార్టీ నేతల సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కీలక ప్రకటన నిషేధిత ప్లాస్టిక్ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత శ్రీ‌నాథ్‌రెడ్డి పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్ సమావేశం ప్రారంభం కాసేపట్లో పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం బడుగు, బలహీనవర్గాలకు వెన్నుపోటే బాబు డీఎన్ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం You are here హోం » టాప్ స్టోరీస్ » మూలధన వ్యయం కింద ఏపీకి రూ. 1,189 కోట్లు సాయం మూలధన వ్యయం కింద ఏపీకి రూ. 1,189 కోట్లు సాయం 29 Mar 2022 4:34 PM న్యూఢిల్లీ : రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద ప్రత్యేక ఆర్థిక సహాయం చేసే పథకం కింద 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌కు 1,189.79 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి మంగళవారం రాజ్యసభకు తెలిపారు. వైయస్ఆర్‌సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ కోవిడ్‌ మహమ్మారి వలన రాష్ట్రాలు తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద సాయం చేయడానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ విధంగా రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద కేంద్రం అందించే నిధుల 50 ఏళ్ళపాటు వడ్డీ లేని రుణాలుగా పరిగణించడం జరుగుతుందని చెప్పారు. మూలధన వ్యయం గుణాత్మకమైన ప్రభావం చూపుతుంది. ఆర్థిక వ్యవస్థ భవిష్యత్‌ ఉత్పాదన సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఫలితంగా ఆర్థిక ప్రగతి ఉన్నతంగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఏపీలో 12 సాగరమాల ప్రాజెక్ట్‌లు సాగరమాల పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, విశాఖపట్నం పోర్టు ట్రస్టు చేసిన 12 ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలను చేపట్టినట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి శర్బానంద్‌ సోనోవాల్‌ తెలిపారు. రాజ్యసభలో మంగళవారం వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆయన ఈ విషయం వెల్లడించారు. సాగరమాల పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 412 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. ఈ నిధులను సాగరమాల ప్రాజెక్ట్‌లు చేపట్టే మేజర్‌ పోర్టులు, నాన్‌-మేజర్‌ పోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర మారిటైమ్‌ బోర్డులు ఇతర ప్రభుత్వ సంస్థలకు ఆర్థిక సాయం కింద కేటాయించడం జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్ట్‌ పురోగతిని బట్టి మూడు విడతలుగా నిధుల విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సాగరమాల పథకం కింద చేపట్టిన ప్రాజెక్ట్‌లలో ఇప్పటి వరకు అయిదు ప్రాజెక్ట్‌లు పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. విజయవాడ భవానీ ద్వీపంలో పాసింజర్‌ జెట్టీ నిర్మాణ పనులు, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనులు, కోస్తా జిల్లాల స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ రెండో దశ పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. కాకినాడ యాంకరేజ్‌ పోర్ట్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, కాకినాడలో ప్రస్తుతం ఉన్న జెట్టీని మెరుగుపరచి సీ ప్లేన్‌ జెట్టీ అభివృద్ధి చేయడం, భీమునిపట్నంలో పాసింజర్‌ జెట్టీ నిర్మాణం, కళింగపట్నంలో పాసింజర్‌ జెట్టీ నిర్మాణం పనులను ఆయా నిర్మాణ సంస్థలకు అప్పగించిన రెండేళ్ళలోగా పూర్తవుతాయని మంత్రి చెప్పారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
పూలకున్న రంగులన్నీ తెలంగాణ పల్లెలలై పరుచుకునే సంబరమే బతుకమ్మ వేడుక.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ సంబరాలు నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలకు తెలంగాణ ఆడపడుచులంతా సిద్ధమయ్యారు. Bathukamma Festival Surya Kala | Sep 25, 2022 | 3:23 PM Bathukamma: పూలను కొలిచే పుణ్యమైన బతుకు పండుగ ప్రారంభమైంది. వికసించిన పూలన్నీ అందంగా సింగారించుకుని.. తొమ్మిదొద్దులు సంబురంగా ఆడబిడ్డల ఆటపాటలతో కనువిందు చేసే వేడుకలు సిద్దమయ్యాయి. పుడమి తల్లి పచ్చగా మెరిసే క్షణాల్లో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా భావిస్తున్న పూల పండుగ బతుకమ్మ.. నేటి నుండి ప్రారంభమైంది. తెలంగాణ పూల సింగిడి బతుకమ్మ సంబరాలు ఆరంభమయ్యాయి. పూలతో దేవుడిని కొలిచే ఇలలో.. ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మను తెలంగాణ వ్యాప్తంగా ఆడబిడ్డలు షురూ చేశారు. గత రెండేళ్లు కోవిడ్ తో భయం భయంగా ఉత్సవాలు జరుపుకున్న అతివలు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో బతుకమ్మ ఉత్సవాలు జరుపు కుంటున్నారు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బతుకమ్మ పండగ సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలకు ఆదిలాబాద్ అడవులక్షేత్రం వేదికైంది. ప్రతి ఏటా పెత్తర అమవాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. ఆడపడుచులు తీరొక్క పూలతో, నూటొక్క పిండి వంటలతో గౌరీదేవిని పూజించడం ఆనవాయితీ. ఈ ఏడాది సైతం తొలి రోజులో భాగంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకున్నారు ఆదిలాబాద్ ఆడబిడ్డలు. ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలకు ఓరుగల్లు ఆడపడుచులంతా సిద్ధమయ్యారు. తీరొక్కపూల తో బతుకమ్మను తయారు చేసి అబురాన్నంటే విదంగా సంబరాలు జరుపుకుంటున్నారు. చూడమూచ్చటైన అలంకరణతో కొత్త వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పాటలు స్తుతిస్తూ బతుకమ్మను సిద్ధం చేస్తున్నారు. సృష్టిలో ఎక్కడైనా పూలతో దైవాన్ని పూజిస్తాం.. కానీ పూలనే దైవంగా భావించి గోపురంలా పేర్చి ఆరదించడమే ఈ బతుకమ్మ ప్రత్యేకత.. https://images.tv9telugu.com/wp-content/uploads/2022/09/batukamm-festival.mp4 బతుకమ్మను పేర్చడానికి గునుగు పూలు,, తంగేడు పూలు, కట్లపూలు, బంతి, చామంతి, సీత జడ పూలు, ఇలా తీరొక్క పువ్వులతో బతుకమ్మలను సిద్ధం చేస్తున్నారు.. పూల వరసలు పేర్చిన అనంతరం గౌరమ్మను సిద్ధంచేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెలంగాణ లో మాత్రమే కనిపించే ఈ ఆచార సాంప్రదాయాలను ముత్తైదులంతా బతుకమ్మ విశిష్టతను చిన్నారులకు వివరించడం ఆకట్టుకుంటోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటు తున్నాయి.. కోవిడ్ ఎఫెక్ట్ తో గత రెండేళ్లు బతుకమ్మ సంబరాలు నిరాడంబరంగా జరుపుకున్న మహిళలు ఈసారి నూతన ఉత్సాహంతో వేడుకలు జరుపుకుంటున్నారు.. వరంగల్ ఆడపడుచుల్లో బతుకమ్మ ఉత్సాహం ఉరకలేస్తుంది… చిన్ననాటి క్లాస్ మేట్స్, గృహిణిలు, స్నేహితురాళ్లు సామూహికంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ ఫుల్ జోష్ వేడుకలు నిర్వహించుకుంటు న్నారు… ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలకు ఓరుగల్లు మహిళలు ఎలా సన్నద్ధమవుతుమన్నారు. అడుపడుచులు ఫుల్ జోష్ తో బతుకమ్మ సంబరాలకు సిద్ధమైపోయారు.. మరోవైపు ఉత్సవాల నిర్వహణకు అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.. మొదటి రోజు హనుమకొండ లోని వేయి స్తంభాల దేవాలయంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు.. చెరువులు, కుంటల దగ్గర బతుకమ్మ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవి కూడా చదవండి Navaratri 2022: బాసర సరస్వతి ఆలయంలో దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం.. మధుకరం దీక్ష చేపట్టే భక్తులు భారీగా వస్తారని అంచనా.. Chanakya Niti: పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే స్త్రీలు ప్రేమలో పడడం ఖాయం అంటోన్న చాణక్య.. అందులో మీరున్నారా..
కొత్త పుస్తకాలూ చేర్చి మీకు ఇక్కడ ఉచిత పుస్తకాల లింక్ లు ఇవ్వడం జరిగింది . ఈ పుస్తకాలకు వేల కట్టలేము .కావాల్సిన పుస్తకం ఎదురుగా లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే పుస్తకం వెంటనే డౌన్లోడ్ అవుతుంది . నాడీ జ్యోతిష్యం : https://templeinformationpics. blogspot.com/2019/11/nadi- astrology-reveal-secrets-of- your.html పుట్టిన తేదీని బట్టి జాతకం : https://templeinformationpics. blogspot.com/2017/08/free- telugu-astrology-pdf-book- download.html చందమామ కథలు : https://templeinformationpics. blogspot.com/2020/01/25-free- download-25-telugu-e-books- pdf.html పూజ విధానం : https://templeinformationpics. blogspot.com/2020/01/25-free- download-25-telugu-e-books- pdf.html భాగవతం : https://templeinformationpics. blogspot.com/2017/08/telugu- bhagavatam-online-potana.html మహాభారతం : https://templeinformationpics. blogspot.com/2017/09/ mahabharatham-telugu-pdf- download.html భగవద్గీత : https://templeinformationpics. blogspot.com/2020/01/25-f 2021 TELUGU CALENDAR FREE DOWNLOAD | 2021 Rasi Phalalu 2021 Telugu Calendar Free Download . Andhra Pradesh Telugu Calendar 2021 PDF. Amavasya & Pournami Dates . Telugu calendar January 2021 Holidays festivals in January 2021 2021 telugu calendar pdf free download 2021 telugu calendar pdf download 2021 telugu calendar download 2021 telugu panchangam pdf venkatrama telugu calendar 2021 nithra telugu calendar 2020 free download nithra telugu calendar 2021 vikram telugu calendar 2021 rasi phalalu 2021 to 2022 in telugu 2021-22 rasi phalalu in telugu rasi phalalu 2021 in telugu monthly telugu rasi phalalu 2020 to 2021 mulugu 2021 to 2022 telugu calendar rasi phalalu 2020-2021 telugu panchangam mithuna rasi 2021 to 2022 telugu telugu panchangam 2021 22 rasi phalalu Chanakyudu-ArdhaSastram Telugu PDF Book Free Download | Devotional Ebooks అర్థశాస్త్రం, చాణక్య నీతి, నీతి శాస్త్రం లాంటి పుస్తకాలపై కౌటిల్యుడు జీవితకాలం మొత్తం వెచ్చించాడు. ఈ చారిత్ర గ్రంథాలు నేటి పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.ఇది చాణక్యుని అర్థశాస్త్రం అర్థశాస్త్రం అంటే ఆర్థికంతో ముడిపడ్డ రాజకీయం. చాణక్యుడు - అర్ధ శాస్త్రం | Chanakyudu-ArdhaSastram Related Books: > పంచతంత్రం-మిత్ర భేదం,మిత్ర ప్రాప్తికం | Panchatantram Telugu PDF Book > పరమానందయ్య శిష్యులు | ParamanandaiahSishyulu Telugu PDF Book > అపూర్వ చింతామణి | ApoorvaChintamani Telugu PDF Book > వేమన పద్యములు | VemanaPadyalu Telugu PDF Book > ధర్మ సందేశాలు | DharmaSandeshalu Telugu PDF Book చాణక్య నీతి సూత్రాలు, చాణక్య నీతి PDF, కౌటిల్యుని అర్థశాస్త్రం, chanakya arthashastra pdf in telugu, kautilya arthashastra (penguin pdf), arthashastra pdf in bengali, arthashastra pdf in tamil, arthashastra pdf malayalam, kautilya arthashastra in hindi, arthashastra summary, Chanakya Chanakya Neeti Sutralu Telugu PDF Book Free Download | Devotional E books చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది.. చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో బోధించేవాడు. సంస్కృతంలో చాణక్యుడు చాణక్య నీతి దర్పణము అనే పుస్తకాన్ని రాశారు. చాణక్య నీతి సూత్రాలు : Chanakya Neeti Sutralu Related Books: > Karthika Puranam Telugu PDF Book Download > Basava Puranam Telugu PDF Book Download > Devi Bhagavatam Telugu PDF Book Download > Vishnu Puranam Telugu PDF Book Download చాణక్య నీతి PDF, చాణిక్యుడు చెప్పిన మాటలు, Telugu neeti sutralu, chanakya neeti pdf, chanakya neeti darpanam in telugu pdf, chanakya neeti sutras pdf, neethi sutralu in telugu, chanakya niti darpan pdf download, chanakya thanthram book pdf, sanakiyan neethi in tamil pdf free download జీవితంలో అత్యుత్తమ స్థాయికి వెళ్ళాలి అంటే ఇలాంటి పొరబాట్లు చేయకండి | Dharma Sandhehalu Telugu జీవితంలో ఇలాంటి పొరబాట్లు చేయకండి .. తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరబాట్లు చాలా సమస్యలకు కారణం అవుతుంది.. ఇది చాదస్తం అనుకునే వారు దయచేసి చడవకండి, హిందూ సంప్రదాయాలను నమ్మే వాళ్ళు మటుకు తెలుసుకుంటే ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు తెలియ చేయడం వరకు నా బాధ్యత..అవి ఏమిటో తెలుసుకుందాము.... Also Read : ఇవి చదివితే మనకు మహిమలు వస్తాయి - లలితా పారాయణ మహిమ 1.పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు, ఆ టైం లో వాకిలి చిమ్ముకో కూడదు ,సూర్యుని మోహన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్ల కూడదు... 2. నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత అసనంగా అక్కడ కూర్చుంటుంది. 3. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలా సేపు కూర్చో కూడదు..తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చో వాలి కానీ చై కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అంటారు.. 4.మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి,బట్టలు అలిచిన నీటిని కాళ్లపైన పోసుకో కూడదు అందులో జేష్ఠ దేవికి ప్రవేశం దొరుకుతుంది. 5. ఇళ్లు ఊడ్చిన చీపురు నిల్చో బెట్టకూడదు. 6. వంట గదిలో వాడిన మసి బట్టలను పొద్దు పోయ
వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తి అయినా అన్నింటా విఫలమైందని, ముఖ్యంగా నిత్యావసర వ స్తువులపై ధరలను బాదుతూ బాదుడు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జ గన తయారయ్యారని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. గౌరవసభలో మాట్లాడుతున్న పరిటాలసునీత అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 - ఆకాశాన్ని అంటుతున్న ధరలు - గ్రామాల్లో చిచ్చురేపుతున్న నాయకులు - గౌరవసభలో మాజీమంత్రి పరిటాల సునీత రామగిరి, జనవరి 2: వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తి అయినా అన్నింటా విఫలమైందని, ముఖ్యంగా నిత్యావసర వ స్తువులపై ధరలను బాదుతూ బాదుడు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జ గన తయారయ్యారని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని గంతిమర్రి, కుంటిమద్ది పంచాయతీ కేంద్రాలలో ఆ దివారం గౌరవసభ - ప్రజా సమస్యల చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... అసెంబ్లీలో ఎమ్మెల్యే, మం త్రులు ఓ మహిళను కించపరచేలా మాట్లాడుతుంటే వెకిలినవ్వులు నవుతున్న సీఎంజగనకు భార్య, పిల్లలు లేరా అన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు జరిగిన అన్యాయమన్నారు. రైతు ప్రభు త్వమని చెప్పుకుంటున్న పాలకులు రైతులకు చేసిందేమిటో చెప్పా లన్నారు. గ్రామాలలో ప్రజలకు మనశ్శాంతి లేకుండా చిచ్చులు రే పుతూ... సచివాలయాల పేరుతో 40 ఏళ్లగా అనుభవంలో ఉన్న భూ ములను తీసుకుని వాటి భవనాలను నిర్మించారన్నారు. అమ్మఒడి పేరుతో చెప్పింది ఒకటి... చేసిందొకటన్నారు. టీడీపీ హయాంలో రై తులకు ఇనపుట్‌ సబ్సిడీ, 90శాతం సబ్సిడీతో వ్యవసాయ పరిక రాలను అందించామన్నారు. కుంటిమద్దిలో చెరువులకు నీళ్లిచ్చి పై లానను ఏర్పా టుచేస్తే దాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అన్నారు. వైసీపీ నాయకులకు చేతనైతే టీడీపీ కన్నా మరింత అ భివృద్ధి చేసి మరో పైలానను ఏర్పాటుచేసుకోవచ్చన్నారు. కొందరు పోలీసులు ఏకపక్షంగా.... అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. వైఎస్‌జగన డబ్బు వ సూళ్ల కోసం ఓటీఎస్‌ పేరుతో ప్రజలపై భారం మోపడం దారుణ మన్నారు. ఓటీఎస్‌కి ఎవరూ డబ్బులు చెల్లించవద్దని, టీడీపీ అధికా రంలోకి వస్తే ఇళ్ల ఉచితంగా రిజిసే్ట్రషన చేస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎంపీపీలు రంగయ్య, పరందామయాదవ్‌, మాజీ జడ్పీటీసీ రామ్మూర్తినాయుడు, కన్వీనర్‌ సుబ్బరాయుడు, నాయకు లు మారుతీప్రసాద్‌, మహిళానాయకురాళ్లు వెంకటసుబ్బమ్మ, సుకన్య, స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు. బుక్కరాయసముద్రం: రాష్ట్ర శాసనసభను సీఎం జగన కౌరవ సభలా మా ర్చేశారని , తిరిగి గౌవరసభగా మారాలంటే జగన దిగి పోవాల్సిందేనని టీడీపీ శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చెన్నంపల్లిలో ఆదివారం గౌరవసభ - ప్రజా సమస్యల చర్చావేదిక నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా ద్విసభ్య కమిటీ స భ్యులతో పాటు మాజీ జడ్పీటీసీ రామ లింగారెడ్డి, మండల కన్వీనర్‌ అశోక్‌ హాజరై మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా వెన కబడిందన్నారు. జగన పూర్తి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నా రన్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలను వైసీపీ నేతలు, కార్యకర్తలకే ఇచ్చి, మరో వైపు సామాన్యులపై పన్నుల భారం రెట్టింపు చే స్తున్నా రని విమర్శించారు. ప్రజలు త్వరలోనే వైసీపీకి తగిన గుణ పాఠం చెబుతారన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతి రేక విధానాలను వివరించి, కరపత్రాలను పంపిణీ చేశారు. టీ డీపీ నాయకులు కేశన్న, పొడరాళ్ల రవీంర్ర, మల్లిఖార్జునరెడ్డి, స ర్పంచ మల్లి, లక్ష్మీనారాయణ, శ్రీకాంతరెడ్డి, గుర్రప్ప, మాజీ ఎంపీ టీసీ నారాయణస్వామి, నరసప్ప, కుళ్లాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.