text
stringlengths
335
364k
జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా? బీసీల పల్లకి మోస్తున్న జ‌న‌నేత సీఎం వైయ‌స్ జగన్‌ మళ్లీ వైయ‌స్‌ జగన్‌నే గెలిపించుకుందాం You are here హోం » టాప్ స్టోరీస్ » అమిత్‌షాకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అమిత్‌షాకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు 22 Oct 2022 11:04 AM వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌ అమ‌రావ‌తి: దేశ హోం మంత్రి అమిత్ షాకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. హోం మంత్రి శ్రీ.అమిత్ షా జీ తన పుట్టినరోజున. ఆయనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేంకటేశ్వరుడు ఆశీస్సులు అందించాల‌ని ప్రార్థించారు. దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, అమిత్‌షాల నేతృత్వంలో భారతదేశం ఇప్పుడు చాలా సురక్షితంగా ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
ఏడు కప్పుల నీటిని మరిగించి ముందుగా నానపెట్టిన బియ్యాన్ని వేసి ఉడికించాలి. బియ్యం ముప్పావు ఉడికిన తర్వాత నీటిని మొత్తం వార్చేసి వెడల్పాటి చిల్లుల గిన్నెలోకి తిరగపోయాలి. అన్నం ఆరిపోకుండా మూత పెట్టాలి. బాణలి పెట్టి అన్ని మసాలా దినుసులు వేసి రెండు నిముషాలు వేయించాలి. అందులో తరిగి పెట్టుకున్న అన్ని కూరముక్కలు వేయాలి. చిన్న మంటపై కొద్దిసేపు వేగనిచ్చి పెరుగు కలపాలి. కప్పు నీటిని,ఉప్పును కూడా వేసి మూతపెట్టి సన్నమంటపై కూర ముక్కలు ఉడికేంతవరకు ఉంచి దింపేయాలి. ఒక గిన్నెకు నెయ్యి రాసి రెండు మూడు గరిటెల అన్నాన్ని పరవాలి. దానిపై కూరను పరచి దానిపై పుదీనా, కొత్తిమీరతో పాటు కుంకుమ పువ్వు నీటిని కూడా చల్లాలి. ఈ విధంగా పొరలు పొరలుగా అన్నం కూరలను పరచి గిన్నెను అల్యూమినియం ఫాయిల్తో మూసి గట్టిగా మూత పెట్టాలి. పొయ్యిపై ఒక మందపాటి వెడల్పు గిన్నెలో 3 గ్లాసుల నీరు పోసి, అందులో ఈ గిన్నెను ఉంచి చాలా సన్నని మంటపై 30 నుండి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆఖరున డ్రైఫ్రూట్స్ వేసి దించేయాలి. 0 Comments Author నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.
Aug 25, 2021 Black rice, black rice nutrition, black rice recipe, forbidden rice, Health News Telugu, health tips in telugu, telugudunia.in, ఆరోగ్య ప్రయోజనాలు, బ్లాక్ రైస్, బ్లాక్ రైస్ తో ఆరోగ్య ప్రయోజనాలు Please Share It Black Rice : గతంలో నలుపు లేదా ఊదా బియ్యాన్ని ‘నిషేధిత బియ్యం’ గా పరిగణిస్తారు మరియు చైనాలో రాయల్టీ మాత్రమే దీనిని వినియోగించేవారు. బియ్యం ఇప్పుడు విస్తృతంగా సాగు చేయబడుతోంది మరియు సులభంగా లభిస్తుంది మరియు ఇందులో ఉండే పోషకాలు – ఇనుము, విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి. చైనీస్ రాయల్టీ వారి దీర్ఘాయువును మెరుగుపరుస్తుందని భావించారు మరియు అందువల్ల ఇది వారి రాజభవనంలో ప్రధాన ఆహారంగా అందించబడింది. వైట్ రైస్‌తో పోలిస్తే, బ్లాక్ రైస్ ( Black Rice)లేదా పర్పుల్ రైస్‌లో పోషకాల సాంద్రత కూడా ఎక్కువ. నల్ల బియ్యం లోతైన నలుపు లేదా ఊదా రంగులో ఉంటుంది, దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నట్లు సూచిస్తుంది. నల్ల బియ్యంలో ఉండే యాంటీఆక్సిడెంట్ల పరిమాణం బ్లూబెర్రస్‌లో ఉన్నదానికంటే చాలా ఎక్కువగా ఉందని అధ్యయనాలు గమనించాయి. Also Read : మానవ జీవిత కాలాన్ని పెంచుతున్న వాల్‌నట్ ! బ్లాక్ రైస్ తో ఆరోగ్య ప్రయోజనాలు డయాబెటిస్‌ను నివారిస్తుంది : నల్ల బియ్యం ( Black Rice)హైపర్గ్లైసీమియా (రక్తంలో అదనపు గ్లూకోజ్) ఉన్న వ్యక్తులలో రక్తంలో గ్లూకోజ్-తగ్గించే గుణాన్ని ప్రదర్శిస్తుంది. ఇది గ్లూకోజ్ ట్రాన్స్‌పోర్టర్‌ల కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది, ఇది గ్లూకోజ్‌ను రక్తంలో ఉండే బదులు కణాలు మరియు కండరాలలోకి నెడుతుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను బాగా నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం : నల్ల బియ్యం ( Black Rice)క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ధమనులలో అథెరోస్క్లెరోటిక్ ఫలకం ఏర్పడకుండా చేస్తుంది. ఇది ధమనులను స్పష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది, మృదువైన రక్త ప్రవాహాన్ని అనుమతిస్తుంది మరియు స్ట్రోక్ మరియు గుండెపోటును నివారిస్తుంది. మంటతో పోరాడుతుంది : ఆంథోసైనిన్ సమ్మేళనాలు శోథ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉన్నాయని అధ్యయనాలు నివేదించాయి. దీర్ఘకాలిక వాపుతో సంబంధం ఉన్న వ్యాధులను నయం చేయడానికి నల్ల బియ్యానికి అద్భుతమైన సామర్థ్యం ఉందని ఇది సూచిస్తుంది. బరువును తగ్గిస్తుంది : నల్ల బియ్యం ఉన్న ఆహారం ఊబకాయం మరియు దానికి సంబంధించిన జీవక్రియ రుగ్మతల నుండి రక్షణగా ఉంటుంది. బ్లాక్ రైస్ అనేది డైటరీ ఫైబర్ యొక్క గొప్ప మూలం, ఇది మిమ్మల్ని నిండుగా ఉంచుతుంది మరియు ఆకలి బాధలను ఆలస్యం చేస్తుంది. Also Read : ఈ ఆహారాలతో మీ డయాబెటిస్‌ను ఓడించండి ! క్యాన్సర్‌తో పోరాడుతుంది : క్యాన్సర్ చికిత్సలో బ్లాక్ రైస్‌లోని ఆంథోసైనిన్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధకులు అధ్యయనం చేశారు. ఆంథోసైనిన్స్ క్యాన్సర్ కణాల పెరుగుదల మరియు గుణకారం నిరోధిస్తుంది. ఇది శరీరంలోని ఇతర అవయవాలకు క్యాన్సర్ కణాల వ్యాప్తిని మరింత నిరోధిస్తుంది. కణితి దాని పెరుగుదల మరియు వ్యాప్తి కోసం రక్త సరఫరాను నిరోధించడం ద్వారా ఆంథోసైనిన్లు కణితి పెరుగుదలను అణిచివేస్తాయి. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : నల్ల బియ్యం ఆహార ఫైబర్ యొక్క మంచి మూలం, ఇది ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం మరియు ఉబ్బరాన్ని నివారిస్తుంది మరియు జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బ్రెయిన్ ఫంక్షన్ : నల్ల బియ్యంలో ఉండే ఆంథోసైనిన్లు జ్ఞాపకశక్తిని మరియు అభ్యాసాన్ని మెరుగుపరుస్తాయని అధ్యయనాలు నిరూపించాయి. బ్లాక్ రైస్ తినడం వల్ల శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్ స్థితి మెరుగుపడుతుంది. అటువంటి మెరుగుదల మెదడు కణాలను నష్టం మరియు విధ్వంసం నుండి రక్షిస్తుంది.
కొత్త పుస్తకాలూ చేర్చి మీకు ఇక్కడ ఉచిత పుస్తకాల లింక్ లు ఇవ్వడం జరిగింది . ఈ పుస్తకాలకు వేల కట్టలేము .కావాల్సిన పుస్తకం ఎదురుగా లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే పుస్తకం వెంటనే డౌన్లోడ్ అవుతుంది . నాడీ జ్యోతిష్యం : https://templeinformationpics. blogspot.com/2019/11/nadi- astrology-reveal-secrets-of- your.html పుట్టిన తేదీని బట్టి జాతకం : https://templeinformationpics. blogspot.com/2017/08/free- telugu-astrology-pdf-book- download.html చందమామ కథలు : https://templeinformationpics. blogspot.com/2020/01/25-free- download-25-telugu-e-books- pdf.html పూజ విధానం : https://templeinformationpics. blogspot.com/2020/01/25-free- download-25-telugu-e-books- pdf.html భాగవతం : https://templeinformationpics. blogspot.com/2017/08/telugu- bhagavatam-online-potana.html మహాభారతం : https://templeinformationpics. blogspot.com/2017/09/ mahabharatham-telugu-pdf- download.html భగవద్గీత : https://templeinformationpics. blogspot.com/2020/01/25-f 2021 TELUGU CALENDAR FREE DOWNLOAD | 2021 Rasi Phalalu 2021 Telugu Calendar Free Download . Andhra Pradesh Telugu Calendar 2021 PDF. Amavasya & Pournami Dates . Telugu calendar January 2021 Holidays festivals in January 2021 2021 telugu calendar pdf free download 2021 telugu calendar pdf download 2021 telugu calendar download 2021 telugu panchangam pdf venkatrama telugu calendar 2021 nithra telugu calendar 2020 free download nithra telugu calendar 2021 vikram telugu calendar 2021 rasi phalalu 2021 to 2022 in telugu 2021-22 rasi phalalu in telugu rasi phalalu 2021 in telugu monthly telugu rasi phalalu 2020 to 2021 mulugu 2021 to 2022 telugu calendar rasi phalalu 2020-2021 telugu panchangam mithuna rasi 2021 to 2022 telugu telugu panchangam 2021 22 rasi phalalu Chanakyudu-ArdhaSastram Telugu PDF Book Free Download | Devotional Ebooks అర్థశాస్త్రం, చాణక్య నీతి, నీతి శాస్త్రం లాంటి పుస్తకాలపై కౌటిల్యుడు జీవితకాలం మొత్తం వెచ్చించాడు. ఈ చారిత్ర గ్రంథాలు నేటి పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.ఇది చాణక్యుని అర్థశాస్త్రం అర్థశాస్త్రం అంటే ఆర్థికంతో ముడిపడ్డ రాజకీయం. చాణక్యుడు - అర్ధ శాస్త్రం | Chanakyudu-ArdhaSastram Related Books: > పంచతంత్రం-మిత్ర భేదం,మిత్ర ప్రాప్తికం | Panchatantram Telugu PDF Book > పరమానందయ్య శిష్యులు | ParamanandaiahSishyulu Telugu PDF Book > అపూర్వ చింతామణి | ApoorvaChintamani Telugu PDF Book > వేమన పద్యములు | VemanaPadyalu Telugu PDF Book > ధర్మ సందేశాలు | DharmaSandeshalu Telugu PDF Book చాణక్య నీతి సూత్రాలు, చాణక్య నీతి PDF, కౌటిల్యుని అర్థశాస్త్రం, chanakya arthashastra pdf in telugu, kautilya arthashastra (penguin pdf), arthashastra pdf in bengali, arthashastra pdf in tamil, arthashastra pdf malayalam, kautilya arthashastra in hindi, arthashastra summary, Chanakya Chanakya Neeti Sutralu Telugu PDF Book Free Download | Devotional E books చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది.. చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో బోధించేవాడు. సంస్కృతంలో చాణక్యుడు చాణక్య నీతి దర్పణము అనే పుస్తకాన్ని రాశారు. చాణక్య నీతి సూత్రాలు : Chanakya Neeti Sutralu Related Books: > Karthika Puranam Telugu PDF Book Download > Basava Puranam Telugu PDF Book Download > Devi Bhagavatam Telugu PDF Book Download > Vishnu Puranam Telugu PDF Book Download చాణక్య నీతి PDF, చాణిక్యుడు చెప్పిన మాటలు, Telugu neeti sutralu, chanakya neeti pdf, chanakya neeti darpanam in telugu pdf, chanakya neeti sutras pdf, neethi sutralu in telugu, chanakya niti darpan pdf download, chanakya thanthram book pdf, sanakiyan neethi in tamil pdf free download జీవితంలో అత్యుత్తమ స్థాయికి వెళ్ళాలి అంటే ఇలాంటి పొరబాట్లు చేయకండి | Dharma Sandhehalu Telugu జీవితంలో ఇలాంటి పొరబాట్లు చేయకండి .. తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరబాట్లు చాలా సమస్యలకు కారణం అవుతుంది.. ఇది చాదస్తం అనుకునే వారు దయచేసి చడవకండి, హిందూ సంప్రదాయాలను నమ్మే వాళ్ళు మటుకు తెలుసుకుంటే ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు తెలియ చేయడం వరకు నా బాధ్యత..అవి ఏమిటో తెలుసుకుందాము.... Also Read : ఇవి చదివితే మనకు మహిమలు వస్తాయి - లలితా పారాయణ మహిమ 1.పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు, ఆ టైం లో వాకిలి చిమ్ముకో కూడదు ,సూర్యుని మోహన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్ల కూడదు... 2. నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత అసనంగా అక్కడ కూర్చుంటుంది. 3. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలా సేపు కూర్చో కూడదు..తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చో వాలి కానీ చై కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అంటారు.. 4.మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి,బట్టలు అలిచిన నీటిని కాళ్లపైన పోసుకో కూడదు అందులో జేష్ఠ దేవికి ప్రవేశం దొరుకుతుంది. 5. ఇళ్లు ఊడ్చిన చీపురు నిల్చో బెట్టకూడదు. 6. వంట గదిలో వాడిన మసి బట్టలను పొద్దు పోయ
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం బుధవారం ఉదయం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామికి పల్లకీ ఉత్సవం నిర్వహించి 6 నుంచి 9 గంటల మధ్యలో భూవరాహస్వామి ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి, సుదర్శన చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. తర్వాత సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలో భక్తసమూహంగా మునకలు వేయించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రవిరంజన్‌, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఉత్సవర్ల వాహన సేవలో జస్టిన్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ధ్వజావరోహణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఉభయ దేవేరులతో కలసి బంగారు తిరుచ్చిలో స్వామివారు సాయంత్రం 7 గంటలకు తిరువీధుల్లో ఊరేగారు. 9 గంటలకు పూజాదికార్యక్రమాలు నిర్వహించి ధ్వజస్తంభంపై ఉన్న గరుడపటాన్ని శాస్త్రోక్తంగా కిందకు దిం చారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. శ్రీవారి సేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని బుధవారం దర్శించుకున్నారు. మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయన రాత్రి జరిగిన అశ్వవాహనసేవలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం చక్రస్నాన వేడుకలో పాల్గొన్నారు.
1. దేవుగారి యింటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి యిద్దరిని తోడ్కోని పోవుట. 2. హేమాడ్ పంతు ఇంటికి ఫోటో రూపములో పోవుట. ఈ యధ్యాయములో రెండు కథలు చెప్పుదుము. 1. దహనులో బి.వి. దేవుగారింటికి వారి తల్లి యాచరించిన ఉద్యాపనపత్రమునకు బాబా వెళ్ళుట. 2. బాంద్రాలోని హేమాడ్ పంతు ఇంటికి హోళీ పండుగనాడు భోజనమునుకు పోవుట. తొలిపలుకు శ్రీ సాయిసమర్ధుడు, పావనమూర్తి. తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాల నిచ్చి జీవితపరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తులయెడ భేదము లేక నమస్కరించిన వారిని కౌగిలించుకొనువారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రమువలె బాబా భక్తులతో కలసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనినిబట్టి, యెవరయితే భగవద్ భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారికంటెగాని, యంతకంటె యెక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదుము. దేవుగారింట ఉద్యాపనపత్రము దహనులో బి.వి. దేవుగారు మామలతదారుగా నుండెను. వారి తల్లి 25, 90 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి యుండెను. ఈ కార్యములో 100, 200 బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి యుండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాపు సాహెబుజోగ్ గారికి కొక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయ వలయుననియు, వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియు వ్రాసెను. జోగ్ ఆ యుత్తరము చదివి బాబాకు వినిపించెను. మనః పూర్వకమయిన విజ్ఞాపనను విని బాబా యిట్లనియె. “నన్నే గురుతుంచుకొను వారిని నేను మరువను. నాకు బండిగాని, టాంగాగాని, రైలుగాని, విమానముగాని యవసరములేదు. నన్ను ప్రేమతో బిలచువారియొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్ష్యమయ్యెదను. అతనికి సంతోషమయిన జవాబు వ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చెదమని వ్రాయుము.” జోగ్ బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగా రెంతో సంతసించిరి. కాని బాబా రాహాతా, రుయి, నీమగాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియును. బాబాకు అశక్యమైన దేమియు లేదు. వారు సర్వాంతర్యామి యగుటచే హఠాత్తుగా నేరూపమున నయిన వచ్చి, తమ వాగ్ధానమును పాలించ వచ్చు ననుకొనెను. ఉద్యాపనకు కొద్దిరోజులు ముందుగా, బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి యొకడు గోసంరక్షణకయి సేవచేయుచు దహను స్టేషన్ మాస్టరు వద్దకు చందాలు వసూలుచేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు, ఊరి లోనికి పోయి మామలతదారుని కలిసికొని వారి సహాయముతో చందాలు వసూలు చేయుమనెను. అంతలో మామలతదారే యచ్చటికి వచ్చెను. స్టేషను మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయమొనర్చెను. ఇద్దరు ప్లాట్ ఫారమ్ మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు, ఊరిలో నేదో మరొక చందాపట్టి రావుసాహెబు నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే, నింకొకటి యిప్పుడే తయారుచేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి యచటనుండి పోయెను. ఒకనెల పిమ్మట యా సన్యాసి యొక టాంగాలో వచ్చి, 10 గంటలకు దేవుగారి యింటిముందర ఆగెను. చందాల కొరకు వచ్చెనేమోయని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై యుండుట జూచి, తాను చందాలకొరకు రాలేదనియు భోజనమునకై వచ్చితిననియు సన్యాసి చెప్పెను. అందుకు దేవు “మంచిది; చాల మంచిది, మీకు స్వాగతము. ఈ గృహము మీదే” యనెను. అప్పుడు సన్యాసి “ఇద్దరు కుర్రవాళ్ళు నాతో నున్నారు.” యనెను. దేవు: “మంచిదే, వారితో కూడ రండు,” అనెను. ఇంకా రెండుగంటల కాలపరిమితి యుండుటచే, వారికొరకు ఎచ్చటికి పంపవలెనని యడిగెను. సన్యాసి ఎవరిని బంపనవసరము లేదనియు తామే స్వయముగా వచ్చెదమనియు చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తికాగానే దేవుగారు బాపుసాహెబు జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను. జోగు ఉత్తరము తీసికొని బాబావద్దకు వెళ్ళెను. దానిని తెరువక మునుపే బాబా యిట్లనెను. “హా! వాగ్దానము చేసి, దగా చేసితిననుచున్నాడు. ఇద్దరితో కూడ నేను సంతర్పణకు హాజరయితిని, కాని నన్ను పోల్చుకొనలేకపోయెనని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేల? సన్యాసి చందాల కొరకు వచ్చెనని యనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చెదనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి యారగించలేదా? నామాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైన విడిచెదను. నామాటలను నేనెప్పుడు పొల్లు చేయను.” ఈ జవాబు జోగ్ హృదయంలో నానందము కలుగ జేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదువగనే దేవుకు ఆనందబాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటిరాకచే తానెట్లు మోసపోయెనో; సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలసి భోజనమునకు వచ్చెదనను అతని మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట – మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో, వారు తమ భక్తుల యిండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు జూచెదరు అనునది యీ కథవల్ల స్పష్టపడుచున్నది. హేమాడ్ పంతు ఇంట హోళీపండుగ భోజనము ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము. 1917వ సంవత్సరము హోళీ పండుగనాడు వేకువజామున హేమాడ్ పంతు కొక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసివలె బాబా గాన్పించి, నిద్రనుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చెదనని చెప్పెను. ఇట్లు తనను నిద్రనుండి లేపినది కూడ కలలోని భాగమే. నిజముగా లేచి చూచుసరికి సన్యాసిగాని, బాబా గాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు దెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతిమాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబాగారి సహవాసము ఏడు సంవత్సరములనుండి యున్నప్పటికి, బాబా ధ్యానము నెల్లప్పుడు చేయుచున్నప్పటికి, బాబా తన యింటికి వచ్చి భోజనము చేయునని అతడనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్యవద్దకు బోయి ఒకసన్యాసి భోజనమునకు వచ్చును గాన, కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పెను. ఆది హోళీ పండుగదినము. వచ్చువారెవరని, ఎక్కడనుండి వచ్చుచున్నారని యామె యడిగెను. ఆమె ననవసరముగా పెడదారి పట్టించక ఆమె యింకొక విధముగా భావింపకుండునట్లు, జరిగినది జరిగినట్లుగా చెప్ప నెంచి, తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి మంచి పిండివంటలను విడిచి బాబా తనవంటివా రింటికి బాంద్రాకు వచ్చునాయని, యామెకు సంశయము కలిగెను. అందులకు హేమాడ్ పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు, కాని ఎవరినైన బంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనెను. మధ్యాహ్నభోజనమునకై ప్రయత్నము లన్నియు చేసిరి. మిట్టమధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యెను. హోళీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి. ముగ్గులు పెట్టిరి. భోజనమునకు రెండు పంక్తులు తీర్చిరి, రెండింటిమధ్య నొక పీట బాబాకొరకమర్చిరి, గృహములోని వారందరు కొడుకులు, మనుమలు, కొమార్తెలు, అల్లుళ్ళు మొదలగువారందరు వచ్చి వారి వారి స్థలముల నలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరు అతిథికొరకు కనిపెట్టుకొనియుండిరి. 12 గంటలు దాటినప్పటికి ఎవరు రాలేదు. తలుపు వేసి గొండ్లెము పెట్టిరి. అన్నశుద్ధి యయ్యెను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుట కిది యొక గుర్తు; అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరు భోజనము ప్రారంభింపబోవుచుండగా, మేడ మెట్లపై చప్పుడు వినిపించెను. హేమాడ్ పంతు వెంటనే పోయి తలుపుతీయగా ఇద్దరు మనుష్యులచట నుండిరి. 1. అలీమహమ్మద్, 2. మౌలానా ఇస్ముముజాఫర్. ఆ యిరువురు, వడ్డన మంతయు పూర్తియై అందరును భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించుమని కోరియిట్లు చెప్పిరి. “భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకొని వచ్చితివి. తక్కినవారు నీ కొరకు చూచుచున్నారు. కావున, ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు దెలిపెదము.” అట్లనుచు తమ చంకలోనుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబిల్ పైన బెట్టిరి. హేమాడ్ పంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దది యగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరగెను, కండ్లనుండి నీరు కారెను, శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా యీ విధముగా తన లీలచే ఆశీర్వదించెనని యనుకొనెను. గొప్ప యాసక్తితో నీకా పటమెట్లు వచ్చెనని అలీమహమ్మద్ ను అడిగెను. అతడా పటమొక యంగడిలో కొంటిననియు, దానికి సంబంధించిన వివరము లన్నియు తరువాత తెలియజేసెద ననెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకొని యుండుటచే త్వరగా పొమ్మని యనెను. హేమాడ్ పంతు వారికి అభినందనలు తెల్పి భోజనశాలలోనికి బోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపయి బెట్టి వండిన పదార్థములన్నియు వడ్డించి, నైవేద్యము పెట్టినపిమ్మట అందరు భుజించి, సకాలమున పూర్తి చేసిరి. పటములో నున్న బాబా యొక్క చక్కని రూపును జూచి యందరు అమితానందభరితు లయిరి. ఇదంతయు నెట్లు జరిగెనని యాశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నములో జెప్పినమాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా నది అలీమహమ్మదు కెట్లుదొరికెను? అత డెందుకు తెచ్చెను? దానిని హేమాడ్ పంతు కెందు కిచ్చెను? అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకొందుము.
ప్రతి ఆరోగ్య సమస్యా బాధిస్తుంది. ఎయిడ్స్‌ శారీరకంగా బాధపెట్టడమే కాదు... మానసికంగా కూడా కుంగదీస్తుంది. ఆ వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలియగానే చాలామంది కించపరిచేలా మాట్లాడతారు. ఒక్క ఆ వ్యక్తినే కాకుండా... కుటుంబ సభ్యుల్నీ దూరం పెడతారు. ఇవన్నీ బాధితుల్నీ, వారి కుటుంబ సభ్యుల్నీ ఎంత క్షోభ పెడతాయో దగ్గరగా చూసింది తమిళనాడులోని కరూర్‌కి చెందిన ఆస్మా నజీర్‌. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, డిగ్రీ వరకూ చదువుకున్న ఆస్మా అనారోగ్యంతో బాధపడే అలాంటి వారికి ఉపయోగపడే మంచి మాటలూ, వైద్య సలహాలూ అందించాలనుకుంది. తెలిసీతెలియక ఆ వ్యాధి బారిన ఎవరూ పడకుండా నిపుణుల సాయం అందించాలనుకుంది. ఆ వ్యాధితో బాధపడే వారి దుస్థితి ఎలా ఉంటుందో కళ్లకు కట్టాలనుకుంది. కానీ అది తన ఒక్కదాని వల్ల అయ్యే పనేనా? ఇలా ఒకటీ రెండూ కాదు... ఏడేళ్ల పాటు ఆలోచించింది. చివరికి ఓ పత్రిక ప్రారంభించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనుకుంది. అందుకోసం నాలుగు నెలల పాటు గ్రామాల్లో తిరిగి, వైద్యుల్ని కలిసి, బాధితులతో మాట్లాడి... ఓ అవగాహనకు వచ్చింది. అందరూ పత్రిక తీసుకొస్తే మంచిది అన్నారు. హెచ్‌ఐవీకి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. డబ్బులు పెట్టి కొనడానికి మాత్రం ఎవరూ మొగ్గు చూపలేదు. ఇంట్లో వాళ్లూ, తెలిసిన వాళ్లూ 'ఇక ఆ ప్రయత్నం ఆపెయ్‌' అన్నారు. ఆస్మా ఒప్పుకోలేదు. ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయని మంచి ఆలోచనని పక్కన పెట్టేస్తామా అని నిలదీసింది. పత్రికను ఉచితంగానే పంచాలని నిర్ణయించుకుంది. ఆలోచన సరే... కానీ అది ఖర్చుతో కూడుకున్న పని. ఏం చేయాలో పాలుపోలేదు. తమిళనాడులోని ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీని సంప్రదించి తన ఆలోచనను చెప్పింది. 'మంచి పని చేస్తానంటే... మేం మద్దతిస్తాం' అంటూ అక్కడి సభ్యులు ముందుకొచ్చారు. ఆర్నెల్ల పాటు ప్రకటనలు ఇచ్చి సహకరిస్తామని చెప్పారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఆమె స్నేహితులు 'నువ్వేం దిగులుపడకు, నువ్వు నిలదొక్కుకునేదాకా మేం డబ్బు సాయం చేస్తాం' అన్నారు. అలా 2008 డిసెంబర్‌ ఒకటి ఎయిడ్స్‌ డే నాడు 'పాజిటివ్‌+' పక్ష పత్రిక మార్కెట్లోకి వచ్చింది. ఎనిమిది పేజీలు... ఐదు వేల కాపీలు. పేపర్లు అమ్మే వాళ్లతో మాట్లాడి పత్రికను రైళ్లలో పంచమని కోరింది. స్టేషనరీ యజమానులతో మాట్లాడి పుస్తకాలు కొన్నవారికి ఉచితంగా ఇవ్వమని చెప్పింది. రెండు నెలలు గడిచాయి. ఉచితంగా ఇచ్చినా ఎవరూ చదవట్లేదని తెలిసి బాధపడింది. అప్పటికే సుమారు లక్ష రూపాయల దాకా ఖర్చయ్యాయి. ఎక్కడ లోపం ఉందో తెలుసుకునేందుకు చాలామందిని కలిసి మాట్లాడింది. 'ఎయిడ్స్‌ బాధితుల కష్టాలే ఇస్తే ఏం చదువుతాం' అన్న మాటలు ఆలోచనలో పడేశాయి. వెంటనే తగిన మార్పులు చేసుకుంది. హెచ్‌ఐవీ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి... రోగనిరోధక శక్తిని పెంచే ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి... వంటి విషయాలను నిపుణులతో చెప్పించింది. ఎయిడ్స్‌ బారినపడ్డా, పలు రంగాల్లో విజయాలు సాధించిన వారి స్ఫూర్తి కథనాల సంఖ్యను పెంచుతూ వచ్చింది. ఈ ప్రయత్నం ఫలించింది. కాలేజీ విద్యార్థులు బాగా ఆదరించారు. క్రమంగా పాఠకుల సంఖ్య పెరిగింది. అది చూసి, చిన్న షాపుల యజమానులు ప్రకటనలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. మరింత ఉత్సాహంతో సినిమా ప్రముఖులూ, రాజకీయ నాయకుల అభిప్రాయాలనూ దాన్లో చేర్చింది. ఎయిడ్స్‌ బాధితుల కోసం ఉన్న హెల్ప్‌లైన్లూ స్వచ్ఛంద సంస్థలూ, బ్లడ్‌ బ్యాంకుల వివరాలూ, అత్యవసర పరిస్థితుల్లో సేవలందించే ఆసుపత్రులూ కౌన్సెలింగ్‌ కేంద్రాల సమాచారం ఇవ్వడం ప్రారంభించింది. ఇవన్నీ పత్రిక ఆదరణనూ, ప్రకటనల రాబడినీ పెంచాయి. దాంతో ఆస్మా కష్టాలు కొంతవరకూ తీరాయి. తక్కువ ఖర్చుతో పత్రికను తీసుకొచ్చేందుకు ఆస్మా చాలా కష్టపడుతుంది. తనతో పాటూ ఇద్దరు స్నేహితులు బయట తిరిగి సమాచారం సేకరించుకుని వస్తారు. తను ఇంట్లో పనులు చేసుకుంటూనే ఆంగ్లం, తమిళంలో కథనాలు రాసుకుంటుంది. స్వయంగా పేజీలు డిజైన్‌ చేసుకుంటుంది. రోజుకి పదిహేను గంటలు కష్టపడుతూ సర్క్యులేషన్‌ను యాభై వేల కాపీలకు చేర్చిన ఆస్మాను ఎవరయినా ప్రశంసిస్తే 'ఆ సంఖ్యను చూసి నేను ఆనందించడం లేదు. సమాజంలో ఏ కాస్తయినా మార్పు తీసుకురాగలిగానా అనే ఆలోచిస్తున్నా' అంటుంది. 0 Comments Leave a Reply. Author నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఘన విజయాలతో మొదలుపెట్టి... అపజయాల బాట పట్టిన దర్శకులు ఎందరో. కానీ పరీక్షలకు నిలబడి... సవాళ్లకు ఎదురెళ్లి... తిరిగి రేస్‌లో నిలబడేవారు కొందరే. అలాంటి వారిలో ముందుంటారు ప్రముఖ దర్శకుడు తేజ. ఇప్పుడు ‘అహింస’తో మళ్లీ తన మార్కు ‘చిత్రం’ చూపించాలని పట్టుదలగా ఉన్న తేజను ‘నవ్య’ పలుకరించింది... పరిశ్రమలో మీది సుదీర్ఘ ప్రయాణం. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్‌ అయింది. ఓటీటీ రాక సినిమా మేకింగ్‌ను ఎలా ప్రభావితం చేస్తోంది? ఇప్పుడు సినిమా విడుదలకు వేదికలు పెరిగాయి. దీనివల్ల సృజనాత్మకత స్వేచ్ఛ పెరిగింది. నేను మద్రా్‌సలో ఉన్న రోజుల్లో ఒకటీ అరా తప్ప తెలుగు సినిమాలు కేవలం ఆంధ్రాలో మాత్రమే విడుదలయ్యేవి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్నాయి. ఓటీటీ, శాటిలైట్‌, మొబైల్‌.. ఇలా ట్రేడ్‌ పార్ట్‌ బాగా పెరిగింది. పాన్‌ ఇండియా ధోరణితో తెలుగు సినిమా తన మూలాలను వదిలి ఊహా ప్రపంచంలోకి వెళుతోందనే విమర్శ వినిపిస్తోంది కదా? మన మూలాలు మన సంస్కృతిలోనే ఉంటాయి. మనం పెరిగిన ఊరు, సంస్కృతి ప్రభావం మనపైన ఉంటుంది. ఆ కల్చర్‌లో అయితేనే నేను సినిమా తీయగలను. ఐరోపా నేపథ్యంలో సినిమా తీయమంటే నా వల్ల కాదు. అలాగే ఉత్తర భారతం, బిహార్‌ ప్రేక్షకులకు నచ్చేలా తీయమంటే నేను తీయలేను. తెలుగు సంస్కృతికి తగ్గట్లు సినిమా తీసి, అది ఇక్కడివాళ్లకు, బయటివాళ్లకు కూడా నచ్చితే అప్పుడు పాన్‌ ఇండియా అవుతుంది. ఈ విధానంలో తప్పు ఎక్కడ ఉందంటారు? ఇప్పుడు పాన్‌ ఇండియా ట్రెండ్‌లో రెండు రకాలు ఉన్నాయి. ముంబై, తమిళనాడు, ఢిల్లీ సంస్కృతి కనిపించేందుకు ఆయా ప్రాంతాల నుంచి ఒకరొకరు చొప్పున నటీనటులను తీసుకొని పెట్టుకుంటున్నారు. అదే పాన్‌ ఇండియా అనుకుంటున్నారు. కానీ ‘బాహుబలి’ సినిమాను పాన్‌ ఇండియా కోసం అని తీయలేదు. తీసిన తర్వాత అది పాన్‌ ఇండియా సినిమా అయింది. దానికంటే ముందుగా వచ్చిన కమల్‌హాసన్‌ సినిమాలు చాలా పాన్‌ ఇండియానే. ‘షోలే’ ముంబైలో తీసినా తమిళనాడులో ఆడింది. ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’, ‘36 ఛాంబర్‌ ఆఫ్‌ షావోలిన్‌ టెంపుల్‌’ చిత్రాలు పల్లెల్లో కూడా ఆడాయి. జాకీచాన్‌ ఇంటర్నేషనల్‌ స్టార్‌. బ్రూస్లీ అంద రికీ తెలుసు. కారణం వాళ్లని మనం ఓన్‌ చేసుకున్నాం. బ్రూస్లీని తెచ్చి ఇక్కడ సినిమా చేస్తే ఆడదు. అలాగే మనం కూడా వాళ్ల సంస్కృతి నేపథ్యంలో సాగే సినిమాలు చేయకూడదు. ఓటీటీల ప్రభావం దర్శకులు అప్‌డేట్‌ అవ్వాల్సిన అవసరం కల్పించిందా? తెలుగు జనాభా 20 కోట్లు ఉంటుంది. ఇందులో ఓటీటీ చూసేవాళ్లు ఒక 30 లక్షలు ఉంటారు. మళ్లీ ఇందులోనూ సగం మంది అసలు థియేటర్లకు రారు. అంటే ఓ 15 లక్షలమంది వస్తారు. మన ప్రేక్షకులు రెండు,మూడు కోట్లు ఉంటారు. వీళ్లందరూ ఓటీటీ చూడరు. కానీ ఎక్కడయితే మనం వ్యాపారాలు చేస్తున్నామో, సినిమాలు తీస్తున్నామో అక్కడ మనం ఓటీటీలో చూస్తాం. మనం చూస్తున్నాం కాబట్టి అందరూ ఓటీటీ చూస్తున్నారనుకుంటున్నాం. అందరూ మారిపోయారనుకుంటున్నాం. అందరూ మారలేదు. మారరు. మరి దర్శకులు ఎక్కడ విఫలమవుతున్నారు? కొత్త సాంకేతికత, విదేశీ సినిమాల ప్రభావం ప్రేక్షకుల పైన ఉంది. కానీ సినిమాలో భావోద్వేగాలదే పైచేయి. ‘నార్కోస్‌’, ‘షోలే’, ‘జయం’... ఏ సినిమా చూసినా అందులో ఓ ఎమోషన్‌ ఉంది. ప్రేక్షకుడు భావోద్వేగాలతో కనెక్ట్‌ అవుతాడు తప్ప టెక్నాలజీతో కాదు. భారీ గన్స్‌తో ‘కేజీఎఫ్‌’ తీసినా, అసలు గన్స్‌ లేకుండా ‘బాహుబలి’ తీసినా కనెక్ట్‌ అయ్యారు. టెక్నాలజీ సాయంతో వాళ్లు మరింత అనుభూతి చెందేలా చేయాలేతప్ప... టెక్నిక్‌ వచ్చిందని చెప్పి ఎమోషన్‌ని తొక్కేయకూడదు. ఈ కన్‌ఫ్యూజన్‌ ఇప్పుడు ఎదురవుతోంది. టెక్నాలజీని పెట్టి ఎమోషన్‌ని తొక్కేస్తున్నారు. ఎమోషన్‌ ఈజ్‌ ఎమోషన్‌. మా ఆవిడతో హైదరాబాద్‌లో ‘అవేంజర్స్‌’ సినిమా చూశాను. అమెరికాలో ఉంటున్న నా కూతురు శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆ సినిమా చూసింది. మా ఆవిడ నా కూతురుతో మాట్లాడుతూ ‘ఇక్కడ సూపర్‌ హీరో తెరపైన కనిపించ గానే ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు’ అంది. ‘ఇక్కడ కూడా కొట్టారు అమ్మా’ అని నా కూతురు చెప్పింది. మా ఆవిడ ‘ఒక చిన్నపాప కనిపించగానే అందరూ గట్టిగా అరిచారు’ అంది. ‘ఇక్కడ కూడా అరిచారు’ అని నా కూతురు చెప్పింది. ‘ఐరన్‌ మ్యాన్‌ చచ్చిపోతే ఏడ్చారు ఇక్కడ’ అంది. ‘మా దగ్గర కూడా ఏడ్చారు’ అంది నా కూతురు. అంటే కథలో అంతర్లీనంగా ఉండే భావోద్వేగాలు ఎక్కడైనా ఒక్కటే. అవి సరిహద్దులు, సంస్కృతులు, భాషలకు అతీతమైనవి. తల్లి ప్రేమ ఎక్కడైనా తల్లి ప్రేమే. ఈ ఎమోషన్‌ని కరెక్ట్‌గా పట్టుకొని ఏ భాషలో తీసినా, ఓటీటీలో తీసినా కనెక్ట్‌ అవుతారు. కొవిడ్‌ తర్వాత పరిశ్రమలో అపజయాలు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? కొవిడ్‌ వల్ల తెలియకుండానే ఇంటిపట్టున ఉండడం అలవాటైంది. సినిమా అయినా మరేదైనా అవసరం అనిపిస్తేనే బయటకు వెళుతున్నారు. బాగుందని కన్‌ఫర్మ్‌ చేసుకున్నాకే సినిమాకు వెళుతున్నారు. నేను సినిమాకు వెళితే తప్పనిసరిగా పాప్‌కార్న్‌, కూల్‌డ్రింక్‌ కావాలి. ఇప్పుడు వాటిని కొనాలంటే భయంకరమైన రేట్లు. టికెట్‌ ధరలను మించిపోయాయి. టికెట్‌ రూ.150 ఉంటే, పాప్‌కార్న్‌ రూ.400. ప్రపంచంలో ఎక్కడా ఇలా ఉండదు. అదే అమెరికాలో టికెట్‌ 30 డాలర్లు ఉందనుకుంటే, పాప్‌కార్న్‌ 5 డాలర్లే ఉంటుంది. అంటే మీరు వందకోట్లతో తీసిన సినిమా కన్నా కూడా మించిపోయింది. పది రూపాయల పాప్‌కార్న్‌ నాలుగు వందల రూపాయలకు అమ్మడం ఏంటి. వీటన్నింటి ప్రభావం తెలియకుండానే సినిమాపై పడుతోంది. మీరు సినిమాకు వెళితే, పార్కింగ్‌ బాగుండాలి, సీట్లు బాగుండాలి, పాప్‌కార్న్‌ ధర తక్కువ ఉండాలి... ఇదంతా ఒక ప్యాకేజీ. ఎందుకంటే మనం ఒక అడ్వెంచర్‌కి వెళుతున్నాం. ఇందులో ఒకటి సరిగా లేకున్నా ప్రేక్షకుడు అసౌకర్యంగా భావిస్తాడు. మల్టీప్లెక్స్‌లు వచ్చాక ఇలా అయింది. కానీ సింగిల్‌ స్ర్కీన్లలో అయితే ఈ డ్రామాలు ఉండవు. ఇప్పుడు బాంబే ఇండస్ట్రీ పడిపోవడానికి ప్రధాన కారణం మల్టీప్లెక్స్‌ల వ్యవస్థ. వాళ్లు అమాంతంగా పెంచిన టికెట్‌ ధరలు, తినుబండారాల ధరలతో ప్రేక్షకుడు థియేటర్‌కి వెళ్లడం మానేశాడు. సింగిల్‌ స్ర్కీన్లు లేవు. ఇంకెక్కడా చూడలేక జనం సినిమాకు వెళ్లడం మానేశారు. మనదగ్గరా అదే జరుగుతోంది. ఇప్పుడు మల్టీప్లెక్స్‌ల కంటే కూడా సింగిల్‌ స్ర్కీన్ల వసూళ్లు చాలా బెటర్‌గా ఉన్నాయి. కాకపోతే మనం వాణిజ్య నగరాలు, ప్రధాన నగరాల్లో ట్రెండ్స్‌ను మాత్రమే చూస్తాం. బాంబేలో ‘మండీమే హిట్‌ హువాతో హిట్‌ హువా’ అంటారు. మండిలో హిట్‌ అయితే చాలు వాళ్లకి. ‘పుష్ప’ ముంబైలో ఆడింది... వాళ్ల దృష్టిలో దేశం అంతా ఆడినట్లే. ఆంధ్రాలో ఎంత డెఫిషిట్‌ అంటే ఇంకా డబ్బులు తిరిగి కట్టాలి. మాకు తెలిసిన వాళ్ల థియేటర్‌లో ‘పుష్ప’ని రిలీజ్‌ చేశాం. పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ వచ్చింది. దానికంటే ‘రాధేశ్యామ్‌’కి కాస్త మెరుగైన కలెక్షన్స్‌ ఉన్నాయి. ‘ఆచార్య’కు నష్టాలు వచ్చాయి. ట్రైలర్‌ చూసి ప్రేక్షకుడు సినిమా చూడాలో, వద్దో నిర్ణయించుకుంటున్నాడు. ఎందుకంటే పెద్దమొత్తం వెచ్చించాల్సి వస్తోంది. బుక్‌మైషోలో టికెట్‌ రేటుపైన అధికంగా కొంత మొత్తం వసూలు చేస్తాడు. పార్కింగ్‌ రుసుం. ఏమీ తినకుండా సినిమా చూడలేం. థమ్సప్‌ క్యాన్‌ రేటు కంపెనీ ధర రూ.7. బయట షాపుల్లో రూ.20. మల్టీప్లెక్స్‌ల్లో దాన్ని రూ.100కు అమ్ముతున్నారు. మరీ అంత అన్యాయమా? ఒక ఐదు రూపాయల లాభం వేసుకుంటే భరించవచ్చు. రూ.75 లాభమా? ఇదంతా సినిమాకు దెబ్బ అవుతోంది. పిల్లల్ని తీసుకొని సినిమాకు వెళ్లాలంటే ఈ ఖర్చు చూసి భయపడుతున్నారు. కొత్తవాళ్లతో చేయడం కష్టమనిపించదా? కొంతమంది దర్శకులు అయితే కొత్తవాళ్లతో అసలు సినిమాలు చేయరు. నాకు అది మామూలే. కొత్త తరంతో కనెక్ట్‌ అవ్వడం నాకు అంత కష్టంగా అనిపించదు. ఒక్కోసారి వాళ్లపైన కోపం వస్తుంది. కానీ కొంచెం ఆలస్యం అయినా వాళ్ల నుంచి అనుకున్న అవుట్‌పుట్‌ రాబట్టుకుంటాను. దానికోసం ఒక మార్గాన్ని వెతికిపట్టుకునే ప్రక్రియను నేను ఆస్వాదిస్తాను. నా దృష్టిలో జీవితం అంటే, ఎక్కువ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడమే. విఘ్నాలను అధిగమించే శక్తిని ప్రసాదించమని వినాయకుణ్ణి ప్రార్థిస్తాను. ఒంటరితనాన్ని అసలు ఇష్టపడను. ఎప్పుడూ జనంలోనే ఉంటాను. డైరెక్టర్లలో చాలామందికి ఇంట్లో హోమ్‌థియేటర్‌ ఉంటుంది. నేను మాత్రం మా గ్రూప్‌తో ప్రసాద్స్‌కి వెళ్లి చూస్తాను. కష్టకాలంలో మీకు ఓదార్పునిచ్చిన వ్యక్తులు ఎవరు? నాకు ఆదివారాలు, సెలవులు ఉండవు. ఎప్పుడూ పనే లోకం. పనిలో తలమునకలవుతాను. అది అన్నీ మరిపిస్తుంది. ఎంత కష్టం వచ్చినా, బాధ కలిగినా నేను ఎవరితో పంచుకోను. పనిలో పడి జీవితంలో ఏదైనా కోల్పోయాను అనే భావన కలిగిందా? విజయాన్ని గుర్తుచేసుకుంటే పొగరు తలకెక్కుతుంది. ఓటమిని గుర్తుచేసుకుంటే పరాజయభావన వెంటాడుతుంది. అందుకే గతం తాలూకు జ్ఞాపకాలకు నా మనసులో స్థానం లేదు. నా పాత సినిమాను ఎవరైనా ప్రశంసిస్తున్నా చూసి నవ్వుకొని వెళ్లిపోతాను. ఇంట్లో నా ఫొటోలు, షీల్డులు కూడా పెట్టుకోను. ఈ ఇండస్ట్రీ నాది. అందరూ బతకడానికి వస్తే, నేను ఏలడానికి వచ్చాను అనుకుంటాను. దర్శకుడిగా మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? నాలోని ప్రతిభకు తగ్గ సినిమా ఇంకా పడలేదు. సాధించాల్సింది చాలా ఉంది. ఇంకా ఏదో చేయాలని ఉంది. ఆర్పీతో మళ్లీ పనిచేయడం ఎలా ఉంది? చాలా బాగుంది. నేను ఇప్పటిదాకా సినిమా రంగానికి పరిచయం చేసినవాళ్ల సంఖ్య 1163. అందులో ఆర్పీ ఒకరు. ఆరంభం నుంచి కలసి పనిచేశాం. మా ఇద్దరికీ జోడీ బాగా కుదిరింది. తను చెప్పింది వెంటనే అర్థం చేసుకుంటాడు. మాకు ఇంట్లో మనిషిలానే. నాకు సంగీతంపై అంతగా అవగాహన లేదు. నేను కలలో కూడా పాడలేను. కానీ నా సినిమాలు అన్నీ మ్యూజికల్‌ హిట్లు. కారణం ఆర్పీ. ఆయనతో చేసేటప్పుడు మ్యూజిక్‌ పరంగా మేం అప్‌డేట్‌గా ఉన్నామా లేదా అని చెక్‌ చేసుకుంటే సరిపోతుంది. ఒక సినిమా చేయడానికి మీకు ప్రేరణ? ప్రేక్షకులు ఎప్పుడూ స్టార్లు కోసం చూడరు. మంచి సినిమా కావాలనుకుంటారు. మంచి కథలో గాడిదను హీరోగా పెట్టినా సినిమా హిట్టవుతుంది. చెత్త కథలో అమితాబ్‌, ఆమిర్‌, రజనీకాంత్‌ కలసి నటించినా కూడా ఆడదు. ఎమోషన్‌, స్టోరీ బాగుంటేనే హిట్‌. నేను ఆ స్టోరిని నమ్ముకున్నాను. విజయా, సురేష్‌ ప్రొడక్షన్స్‌ కథ ను నమ్మి పెద్ద సంస్థలుగా ఎదిగాయి. కంటెంట్‌ బాగుంది కాబట్టే ఓటీటీలో మనం విదేశీ భాషా చిత్రాలు చూస్తున్నాం. నేను ఎమోషన్‌ని నమ్ముకున్నాను. స్టార్‌ని నమ్ముకుంటే కొత్తగా తీయలేం. ‘నేనే రాజు- నేనే మంత్రి’ సినిమాలో రానాకు బదులు జూనియర్‌ ఎన్టీఆర్‌ని పెడితే అభిమానులు నన్ను కొట్టేవాళ్లు. అభిరామ్‌ని ఎలా చూపించబోతున్నారు? నేను కనికరం చూపని దర్శకుణ్ణి. ‘‘అహింస’ సినిమాలో అతనిపైన అన్ని ట్రిక్స్‌ వాడాను. కావాలనుకున్న అవుట్‌ పుట్‌ ఇచ్చాడా లేదా అనేదే నాకు ముఖ్యం. తను నాయుడుగారి మనవడు, సురేష్‌బాబు గారి అబ్బాయి అనేది పట్టించుకోను. నా సినిమాలో క్యారెక్టర్‌లా బిహేవ్‌ చేయాలి అంతే. మధ్యప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి షూటింగ్‌ చేశాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక ్షన్‌ జరుగుతోంది. అవుట్‌ పుట్‌ బాగుంది. చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉన్నాను. దీపావళికి రిలీజ్‌ చేసే ఆలోచన ఉంది.ఇందులో 25మంది కొత్త నటులు ఉన్నారు. సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌ పాన్‌ ఇండియా ఉధృతి వల్ల మంచే జరుగుతోందా? దీనివల్ల క్రియేటివ్‌ సైడ్‌ కొంత గందరగోళం కూడా ఏర్పడింది. పాన్‌ ఇండియా లక్ష్యంగా తీసే సినిమాలు విఫలమవుతున్నాయి. తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు సినిమా తీస్తే, అది పాన్‌ ఇండియా అయితే మంచిది. కేవలం పాన్‌ ఇండియా కోసమే అని ఒక సినిమా తీస్తే దాన్ని ఏ ప్రేక్షకులూ ఓన్‌ చేసుకోవడం లేదు. ఒక బాణంతో ఐదు లక్ష్యాలను కొట్టలేము. అలాగే ఐదు బాణాలు ఉండి, ఐదు లక్ష్యాలు ఉన్నా కొట్టలేము. ఐదు బాణాలతో ఒకే లక్ష్యాన్నిఛేదించలేం. ఒక బాణం ఒక లక్ష్యం ఉండడమే కరెక్ట్‌. ఒంటరితనాన్ని అసలు ఇష్టపడను. ఎప్పుడూ జనంలోనే ఉంటాను. డైరెక్టర్లలో చాలామందికి ఇంట్లో హోమ్‌థియేటర్‌ ఉంటుంది. నేను మాత్రం మా గ్రూప్‌తో ప్రసాద్స్‌కి వెళ్లి చూస్తాను. కథలో అంతర్లీనంగా ఉండే భావోద్వేగాలు ఎక్కడైనా ఒక్కటే. అవి సరిహద్దులు, సంస్కృతులు, భాషలకు అతీతమైనవి. తల్లి ప్రేమ ఎక్కడైనా తల్లి ప్రేమే. ఈ ఎమోషన్‌ని కరెక్ట్‌గా పట్టుకొని ఏ భాషలో తీసినా, ఓటీటీలో తీసినా జనం కనెక్ట్‌ అవుతారు.
పర్చూరులోని వైఆర్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో రెండు తెలుగు రాష్ర్టాల స్థాయిలో జరుగుతున్న కళావాణి నాటిక పోటీలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. మంగళవారం రాత్రి కళావాణి నాటిక పోటీలను స్థానిక శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావు జ్యోతి ప్రజ్వలనచేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. పాశం నాటికలోని ఓ సన్నివేశం అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 సందేశాత్మకంగా సాగుతున్న పోటీలు పర్చూరు, మే 18: పర్చూరులోని వైఆర్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో రెండు తెలుగు రాష్ర్టాల స్థాయిలో జరుగుతున్న కళావాణి నాటిక పోటీలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. మంగళవారం రాత్రి కళావాణి నాటిక పోటీలను స్థానిక శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావు జ్యోతి ప్రజ్వలనచేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న పాశం నాటిక విదేశీ మోజులో పడి మాతృభూమిని వదిలి తల్లిదండ్రులను పట్టించుకోని నేటి తరం యవతపై సందేశాత్మకంగా ప్రదర్శించిన కళాంజలి హైదరాబాద్‌ వారి పాశం నాటిక ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తుంటే మన యువత మాత్రం బందాలు, అను బంధాలను వదులుకొని విదేశాలకు పరుగులు పెట్టడం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆలోచింపజేసింది. తల్లిదండ్రులు మాత్రం పిల్లలపై మమకారాన్ని వదులుకోలేక పోతున్న తీరు కళాకారులు తమ కళాప్రదర్శన ద్వారా చూపారు. ఆఖరి చూపు కూడా నోచుకోని అభాగ్య జీవితాలు ఎన్నో ఉన్నాయని రచయిత గోవిందరాజుల నాగేశ్వరరావు వివరించే ప్రయత్నం చేశాడు. జీవన యానం... వృద్ధాప్యంలో ఆత్మీయుల మధ్య దొరికే ఆనందం వృద్ధులకు ఓల్డేజ్‌ హోమ్‌లలో లభించదన్న కఠోర సత్యాన్ని జన చైతన్య ఒంగోలు వారి జీవన యానం నాటిక ద్వారా చూపారు. వృద్ధాప్యంలో ఒంటరి తనం ఎంత భయంకరంగా ఉంటుందో అన్న ఇతివృత్తాన్ని నటీ నటులు చక్కగా ప్రదర్శించారు. ప్రతి మనిషికి వృద్ధాప్యంలో ఓ తోడు కావాలన్నదే ఈ నాటికలో నొక్కి వక్కాణించాడు రచయిత, దర్శకుడు వరికూటి శివప్రసాద్‌, ఎల్‌.శంకర్‌లు. మంచంమీద పెళ్ళి ... పరువు హత్యల విలువలకు దర్పణం పట్టే తల్లిదండ్రులకు కనువిప్పు కావాలని హాస్యాస్పదంగా ప్రదర్శించిన నాటిక మంచంమీద పెళ్ళి. ఓ పిసినారి విందు, వినోద కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తాడు, తన కుంటుంబం విషయంలో కూడా అదే విధంగా ఉండే వైనాన్ని మద్దుకూరి అర్స్‌ క్రియేషన్‌ చిలకలూరిపేట వారు ఈ నాటిక ద్వారా చూపారు. .నాటిక పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలి రావటంతో కళాప్రాంగణం కిక్కిరిసింది. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కళావాణి అధ్యక్షుడు కొల్లా సుభా్‌షబాబు, చాగంటి నాగేశ్వరరావు, కొల్లా నరేంద్రకుమార్‌, పాబోలు ఉదయభాస్కర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మీరు బ్లోవర్‌తో చేయగలిగేవి చాలా ఉన్నాయి, కానీ వాస్తవానికి అలా చేయనవసరం లేదు. శరదృతువు ఆకులు క్లియర్ చేయడానికి ఓపెన్ గ్రౌండ్ మరియు మార్గాలను క్లియర్ చేయడానికి మీరు దీన్ని ఉపయోగించవచ్చు. ఇది శక్తివంతమైన మరియు నమ్మదగిన సాధనం, ఇది బహిరంగ ప్రదేశాలు మరియు గూడులను త్వరగా మరియు వినియోగదారు-స్నేహపూర్వకంగా శుభ్రపరచడానికి వీలు కల్పిస్తుంది. సుదీర్ఘ ఆపరేటింగ్ సమయంతో ముఖ్యంగా శక్తివంతమైన సాధనం అవసరమయ్యే తోట సంరక్షణ నిపుణుల కోసం, మరోవైపు, పెట్రోల్ లీఫ్ బ్లోవర్ ఇష్టపడే ఎంపిక. బ్రష్ కట్టర్ పచ్చికను కత్తిరించేటప్పుడు, గడ్డి యొక్క ఇరుకైన స్ట్రిప్ తరచుగా మిగిలి ఉంటుంది, అది పచ్చిక మొవర్తో చేరుకోవడం కష్టం. ఇక్కడే గడ్డి ట్రిమ్మర్ సహాయపడుతుంది, గడ్డిని అప్రయత్నంగా తరలించడానికి వీలు కల్పిస్తుంది. ఈ సాధనం కలుపు మొక్కలను బే వద్ద ఉంచడానికి సహాయపడుతుంది, అక్కడ అవి మచ్చలను చేరుకోవడం కష్టం. చైన్ సా అటవీ పని నుండి ఇల్లు, తోట, DIY మరియు కట్టెల కోత వరకు ప్రతి అప్లికేషన్‌ను కవర్ చేయడానికి, కాంగ్టన్ ఉత్పత్తి శ్రేణిలో వివిధ గొలుసు రంపాలు ఉంటాయి. అధిక పీడన వాషర్ ధూళిని తొలగించడానికి అధిక పీడనం: కారు, మోటారుసైకిల్ లేదా సైకిల్ శుభ్రం చేయడానికి, విస్తృత ఉపరితలాలను శుభ్రపరచడానికి లేదా వసంత శుభ్రపరిచే తోట ఫర్నిచర్ కోసం; ఈ ఉద్యోగాలు ప్రెజర్ క్లీనర్‌తో త్వరగా మరియు సులభంగా నిర్వహించబడతాయి. ఈ సాధనాలు మీ కారుకు అద్దం ముగింపు ఇవ్వాలనుకుంటున్నారా లేదా తోట మార్గంలో ఉన్న అంతరాల నుండి కలుపు మొక్కలను తొలగించాలా వద్దా అనే దానిపై ఆధారపడి, పిన్‌పాయింట్ ఖచ్చితత్వంతో లేదా విస్తృత ప్రదేశంలో మరియు శాంతముగా లేదా శక్తితో పనిచేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అదే సమయంలో ప్రెజర్ క్లీనర్ కూడా చాలా పర్యావరణ అనుకూల సాధనం, ఎందుకంటే ఇది రసాయన శుభ్రపరిచే ఏజెంట్లను ఉపయోగించకుండా పని చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. లాన్ మొవర్ (ఎలక్ట్రిక్, గ్యాసోలిన్, రోబోటిక్) తక్కువ శబ్దం, తేలికపాటి ఎలక్ట్రిక్ లాన్ మూవర్స్ మరియు కార్డ్‌లెస్ పెట్రోల్ లాన్ మూవర్స్ నుండి, కాంగ్టన్ అవసరం ఏమైనప్పటికీ సరైన మోడల్‌ను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ లాన్ మూవర్స్ యొక్క అతిపెద్ద ప్రయోజనాలు ఏమిటంటే అవి తక్కువ బరువు మరియు చాలా బిగ్గరగా ఉండవు. మరోవైపు, పెట్రోల్ మోడల్ ఎక్కువ దూరం మరియు ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది. పొగమంచు డస్టర్ అణువు, విత్తనం మరియు పొడి లేదా కణిక ఉత్పత్తులను వర్తింపచేయడం, సమయాన్ని ఆదా చేయడం మరియు కోకో, కాఫీ, టీ మరియు చెస్ట్నట్ యొక్క పంటను సులభతరం చేయడానికి దీనిని సమర్థతతో ఉపయోగించవచ్చు. ఈ సామగ్రిని బ్లోవర్‌గా కూడా ఉపయోగించవచ్చు, నిల్వ ప్రాంతాల శుభ్రతకు భరోసా ఇస్తుంది, విత్తనాల నాణ్యతకు దోహదం చేస్తుంది.
Telugu News » Coronavirus » Telangana govt arrange toll free number for financial assistance problems మీ అకౌంట్‌లో రూ.1500 పడలేదా? అయితే ఈ నెంబర్‌కి కాల్ చేయండి! తెల్ల రేషన్ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రూ. 1500 ఆర్థికసాయం వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. అలాగే ఉచిత రేషన్ బియ్యం సరఫరాలో డీలర్లు ఇబ్బందులు పెట్టినా ఈ నెంబర్‌కి సంప్రదించవచ్చని సూచించింది. ఫిర్యాదుల కోసం 1800 425 00333, 1907 నెంబర్లకు.. TV9 Telugu Digital Desk | Edited By: May 06, 2020 | 7:06 PM కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడే ప్రజలకు రూ.15 వందల నగదుతో పాటు ఉచిత బియ్యాన్ని కూడా అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఆ నగదు తమకు బ్యాంకుల్లో పడటం లేదంటూ.. పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం వివరాలు, సమస్యల పరిష్కారం కోసం ఓ టోల్‌ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. తెల్ల రేషన్ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రూ. 1500 ఆర్థికసాయం వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. అలాగే ఉచిత రేషన్ బియ్యం సరఫరాలో డీలర్లు ఇబ్బందులు పెట్టినా ఈ నెంబర్‌కి సంప్రదించవచ్చని సూచించింది. ఫిర్యాదుల కోసం 1800 425 00333, 1907 నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపింది. ఆర్థిక సాయం కోసం 040 23314614 నెంబర్‌కి చేయాలని సూచించింది తెలంగాణ ప్రభుత్వం. కాగా ఈ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవాలంటే.. ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్‌ను కూడా అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా రోజువారీగా పనులకు వెళ్లేవారు మొదలు.. చిరు ఉద్యోగస్థులంతా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదాలందరికీ రూ.15 వందల నగదు అందిస్తోంది.
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు ప్రాశస్త్యం గురించి చెప్పాడు. తేట తేట తెలుగు తీపి గురించి కవులు గానం చేశారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా తెలుగు భాష పేరు గాంచింది. అజంత భాష తెలుగు భాష పలుకు వినసొంపుగా ఉంటుంది. రాతలో దానికో సౌందర్యం ఉంది. మూల ద్రావిడం నుంచి పుట్టిన తెలుగు భాష విశేష జనాదరణ పొందింది. అంతేకాకుండా తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉంది. ఇంత మంది మాట్లాడే భాష తెలుగు ప్రజల మాతృభాష కావడం ఆనందదాయకం. తెలుగు పలుకుబడి, నుడి, నానుడి వినసొంపుగా ఉంటుంది. సామాన్య ప్రజానీకం కూడా కవిత్వానికి తీసిపోని భాషలో మాట్లాడతారంటే అతిశయోక్తి కాదు. తెలుగు భాష ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చెందుతూ వస్తోంది. సాంకేతిక, శాస్త్రియ భాష పదజాలాన్ని కూడా సృష్టించుకుంటోంది. ఇతర భాషా పదజాలాన్ని తనలో జీర్ణం చేసుకోవడం ద్వారా తెలుగు భాష విస్తరిస్తోంది. అనంతమైన పదజాల సృష్టి జరుగుతోంది. తెలుగు భాషా ప్రియులకు ఆ విశాల దృక్పథం ఉంది. తెలుగు భాష అంతరించిపోతుందనే ఆందోళున తెలుగు సమాజంలో గత కొద్ది కాలంగా జరుగుతోంది. అయితే, నిత్య పరిణామశీలమైన తెలుగు భాష ఎప్పటికీ సజీవంగానే ఉఁటుందనే విశ్వాసం దాని విస్తృతిని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలుగు కవిత్వం ఎల్లలు దాటుతోంది. తెలుగు సాహిత్యం, తెలుగు కళలు సరిహద్దులు దాటి విస్తరిస్తున్నాయి. ఈ వెబ్సైట్ లో తెలుగు సాహిత్యానికి, చరిత్రకు సంబంధించిన అనేక విషయాలతో పాటూ, తెలుగు అభివృద్ధికి పాటుపడిన/పాటుపడుతున్న వ్యక్తులు, తెలుగు బ్లాగులు, వార్తలు, సాంస్కృతిక కార్యక్రమాల విశేషాలు ఉంటాయి . అలాగే ముఖ్యంగా ఇంతకూ ముందు ఉండి ఇప్పుడు మూతపడిన, మరుగున పడిన తెలుగు సాహితీ వెబ్సైట్ల నుండి సేకరణలు ఉంటాయి . ఈ వెబ్సైట్ మీకు ఉపయోగపడిన పక్షంలో పదిమందికీ చేరవేయమని విజ్ఞప్తి. దీనికై మీరు మీ మీ బ్లాగులలో, వెబ్ సైట్లలో మద్దతు పలుకండి పేజి ద్వారా బొత్తాం కలుపుకోగలరు. ఈ వెబ్సైట్ లోని అంశాలు చాలా మటుకు ఎక్కడినుంచో సేకరించినవే. వీటిని ఏ వ్యాపార కార్యకలాపాలకోసం వినియోగించడం జరుగదు. అలాగే వీటిని చదివినవారు వీటిని తెలుగు భాష అభివృద్ధి కోసం, ప్రచారం కోసం వినియోగించాలి తప్ప ధన సంపాదన కోసం కాదు . ఈ అంశాలు ఎక్కడి నుండి తీసుకోబడినవో వారికి కృతజ్ఞతలు, వాటి లింకులు ఆయా టపాలవద్దనే ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కోసారి తెలిసో, తెలీకో వారిని విస్మరించడం జరిగింది. దీనికి మీరు నొచ్చుకోకుండా మా దృష్టికి తెచ్చినట్లయితే సవరించడం జరుగుతుంది . మీ కాపీరైట్ కు భంగం కలిగిన అంశాలు ఉన్నట్లయితే మా దృష్టికి తెండి . వాటిని తొలగిస్తాం. చివరిగా – మీరు కూడా మా ఈ కార్యక్రమంలో భాగస్వామి కండి. ఇప్పటికే ప్రచురించబడ్డ వ్యాసాలూ, అంశాల లింకులు పంపితే వాటిని క్లుప్తంగా తెలుపుతూ మీ వెబ్ సైట్ కే లింక్ చేయడం జరుగుతుంది.
హైదరాబాద్ షాన్ చార్మినార్.. అది కులీకుతూబ్ షా జాన్! అవి ఆకాశాన్నంటే నాలుగు స్తంభాలు కావు.. హైదరాబాద్‌లోని హిందూ..ముస్లిం.. సిక్కు.. ఇసాయి ఐక్యతకు చిహ్నాలు! ఈ పాఠాన్ని బాగా ఆకళింపు చేసుకొన్న వ్యక్తి తెలంగాణ తొలిముస్లిం డిప్యూటీ సీఎం మహ్మద్ మహమూద్ అలీ! జీవన సత్యాలను తండ్రి నుంచి.. రాజకీయసత్యాలను కేసీఆర్ నుంచి నేర్చుకున్న అలీసాబ్ నిజాయితీని బాటగా పర్చుకున్నాడు.. ఆ గురువుల దువాతో ముందుకు సాగుతున్నాడు.. అతని ప్రస్థానమే ఈ ఆచార్యదేవోభవ…. మాది హైదరాబాద్ లోకల్. నాన్న (పీర్ మహ్మద్) డెయిరీ ఫామ్ బిజినెస్ చేస్తుండే. తర్వాత మేం కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఆల్‌ఓవర్ సిటీలో మాకు ఏడు బ్రాంచులున్నాయి. ఏడుగురు అన్నదమ్ములు, ఏడుగురు అక్కచెల్లెళ్లు. అందరిలోకి నేనే పెద్ద. నాకు పదేళ్లున్నప్పుడే పాల బిజినెస్‌లోకి అడుగుపెట్టిన. ఒకరకంగా చెప్పాలంటే నాకు తొలి గురువు మా నాన్నే! వ్యాపారానికే కాదు నా జీవనపాఠానికి కూడా. అసలు మా నాన్న డెయిరీ ఫామ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టడమే ఓ విచిత్రం. ఆ రోజుల్లో మా ఫాదర్ జిమ్ పట్ల బగా షౌకీన్. అందుకే బేగంబాజార్‌లోని తాలీంఖానాలో రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌కు వెళ్తుండె. ఆయన గురువుకి పెరుగు షాప్ ఉండె. రోజు అందులో కూర్చోని కూర్చోని ఆ బిజినెస్ గురించి బాగా తెల్సుకున్నడు. అట్ల బాబూ మియా డెయిరీ ఫామ్ పేరుతో పాల బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఆ రోజుల్లో యాదవ్‌లే పాల బిజినెస్ చేసేవాళ్లు. డెయిరీ ఫామ్ పెట్టిన ఫస్ట్ ముస్లిం మా నాన్ననే. బాబూ మియా డెయిరీఫామ్ అంటే ట్విన్ సిటీస్‌లో పేమస్! ఈ పాల బిజినెస్ వల్ల నన్ను మా ఫ్రెండ్స్ అందరూ యాదవ్ సాబ్ అని పిలిచేటోళ్లు. మా ఫాదర్‌కు హిందూముస్లిం ఫీలింగ్ లేకుండే. ఆయనదంతా సెక్యులర్ తత్వం. మా ఇంట్లో కూడా అదే పద్ధతి. అదే అలవాటు మాకూ వచ్చింది. స్కూలింగ్.. ఫిఫ్త్ క్లాస్ దాకా కట్టల్‌గూడ హైస్కూలే! సెవెన్త్ వరకు అజంపురా హైస్కూల్. ఎయిత్ నుంచి చాదర్‌ఘాట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో! సెవెన్త్ దాకా నాది ఉర్దూ మీడియమే! హైస్కూల్లో అజీజ్ సాబ్, కాలేజ్ డేస్‌లో కమాల్ సాబ్, బషీర్ సాబ్ అనే గురువులు నన్ను బాగా ఇష్టపడేవారు. వాళ్ల సాన్నిధ్యంలో పుస్తక పాఠాలే కాదు సమాజంలోని పాఠాలూ నేర్చుకున్న. అలాంటి సత్‌గురువుల అడుగుజాడల్లో నడుస్తూ బికామ్ దాకా చదివిన. తర్వాత తిలక్‌రోడ్‌లోని ఈవినింగ్ లాకాలేజ్‌లో అడ్మిషన్ తీసుకున్న కానీ కంప్లీట్ చేయలే. ఎందుకంటే మా ఫాదర్‌కి అంత సాటిస్‌ఫాక్షన్ లేకుండె. అకౌంట్లు చూసుకోవడం వచ్చేంత చదువుంది కదా చాలు.. బిజినెస్ చూసుకుంటే మంచిది అని అనుకుంటుండె. అందుకే అక్కడికే ఫుల్‌స్టాప్ పెట్టి డెయిరీ ఫామ్ బిజినెస్‌లో బిజీ అయిపోయిన. అప్పటికే అంటే నాకు పదిహేనేళ్లు వచ్చేసరికే డెయిరీ ఫామ్ బిజినెస్ అనుపానలన్నీ తెలిసిపోయినయ్. అసలు నా చైల్డ్ హుడ్ అంతా ఒక్క క్షణం తీరికలేకుండా గడిచిపోయింది. పొద్దున స్కూల్‌కి పోయేదాకా పనిచూసుకోవాలే.. మళ్లీ స్కూల్ నుంచి రాంగానే ఈ పనిలో పడిపోవాలె. నో సండే… నో మండే.. నో స్పోర్ట్స్! బడి, పని అంతే! హాలీడెస్‌లో మాత్రం కొంత ఫ్రీ టైమ్ దొరికేది. అట్ల మొదటి నుంచి ఒక రెస్పాన్స్‌బుల్ లైఫ్‌నే లీడ్ చేసిన. దాన్ని అలవాటు చేసిందీ మా ఫాదరే. కష్టపడి పనిచేయాలనే ఆయన తత్వాన్ని నేనూ ఒంటపట్టించుకున్న. అందుకే మా నాన్న నేర్పిన వ్యాపార మెళకువలను వారసత్వంగా తీసుకున్న కానీ ఆయన సంపాదించిన ఆస్తిలో పైసా కూడా తీసుకోలేదు. పోలీస్ యాక్షన్ కంటే ముందు మా నాన్న దగ్గర చాలా డబ్బుండేది. ఆ తర్వాతా బాగా సంపాదించాడు. అదంతా నా తమ్ముళ్లకు ఇచ్చేసి నేను సొంతంగా నా వ్యాపారాన్ని డెవలప్ చేసుకున్న. అవసరానికి మించిన ఆస్తి సంపాదించుకోవాలనే ఆశ నాకు లేదు. ఆ పెద్దరికం కూడా నాన్న నుంచి నేర్చుకున్నదే! ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. పధ్నాలుగు మంది పిల్లల ఆలనాపాలనతో మా అమ్మానాన్నలు పడ్డ కష్టాలు చూశాను కాబట్టి ఇంటికి పెద్ద కొడుకుగా నేను పరిమిత కుటుంబం అనే నియమాన్ని పాటించిన. నలుగురు పిల్లలతో కుటుంబ నియంత్రణ చేసిన. ఇదే పాలసీని నా తమ్ముళ్లు, చెల్లెళ్లు కూడా పాటించిండ్రు! రాజకీయాల ఆలోచనే లేకుండె కేసీఆర్.. టీఆర్‌ఎస్ పార్టీ పెట్టేదాకా నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలేదు. 69 మూవ్‌మెంట్‌లో స్టూడెంట్స్ అందరితోపాటు జై తెలంగాణ అంటూ ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొన్నాను కానీ అప్పటికి రాజకీయాల పట్ల నాకెలాంటి అభిప్రాయాలూ లేవు. 71,72 టైమ్‌లో నేను అన్వర్ ఉలూం కాలేజ్‌లో డిగ్రీ చదువుతున్నప్పుడు జలీల్‌పాషా అనే లీడర్ తెలంగాణ ప్రజా సమితి తరపున నన్ను తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చాడు కానీ నేనప్పుడు అంత సీరియస్‌గా లేను. ఎప్పుడైతే కేసీఆర్ సాబ్ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి తెలంగాణరాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్‌ను పెట్టిండో.. దానికోసం బహిరంగ ప్రకటన చేసిండో అప్పుడు తెలంగాణ గురించి, రాజకీయాల గురించి సీరియస్‌గా ఆలోచించిన. ఒక నిర్ణయానికి వచ్చి నా అంతట నేనే వెళ్లి కేసీఆర్‌సాబ్‌ని కలిసిన. తెలంగాణ కోసం ఆయనకున్న కమిట్‌మెంట్.. ఆయన అభిప్రాయాలు నన్ను బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసినయ్. ఇన్సిపిరేషన్ ఇచ్చినయ్. అంతే అప్పటికప్పుడు టీఆర్‌ఎస్‌లో జాయిన్ అయిన. అట్లా కేసీఆర్ సాబ్ దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్న. నా పొలిటికల్ గురువు ఆయనే! ఒకరకంగా నేను చాలా అదృష్టవంతుడిని. ఆ దేవుడి దయో… మా పేరెంట్స్ దువా (ఆశీర్వాదం)నో తెల్వదు కానీ కేసీఆర్ సాబ్ నన్ను ఆయన ఫామిలీ మెంబర్‌గా.. సొంత బ్రదర్‌లాగా ట్రీట్ చేస్తడు. నేనూ ఆ అభిమానాన్ని అట్లనే కాపాడుకుంటా! ఆయనెట్ల తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం అనుక్షణం ఆలోచిస్తడో మేమందరం కూడా ఆయన ఆలోచనలకు సరైన రూపమివ్వడానికి అంతే కష్టపడాలనుకుంటున్నం.. కష్టపడుతున్నం… కష్టపడతం కూడా! ఈ రోజు నేను రెవెన్యూ మినిష్టర్‌గా, డిప్యూటీ సీఎంగా పారదర్శక పాలనను అందించాలనుకుంటున్న. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మధ్య ఏజెంట్లు లేకుండా డైరెక్ట్‌గా కలుసుకునే చర్యలు చేపట్టాలనుకుంటున్నాం. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు కరప్టెడ్ డిపార్ట్‌మెంట్ అని పేరుంది. కరప్షన్‌ను గ్రాడ్యువల్‌గా కంట్రోల్ చేస్తాం. క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలనుకుంటున్నం. హెల్ప్‌లైన్లు పెడ్తాం. ఆన్‌లైన్లో పనులయ్యేలా చేస్తాం. కాలాయాపన తగ్గించి ప్రజల పనులు సాధ్యమైనంత త్వరగా, తేలికగా పూర్తయ్యేలా చేస్తాం. రాబోయే రెండేళ్లల్లో మీరే చూస్తారు.. ఎన్ని మంచి మార్పులు వస్తాయో! ఫిల్టర్ వాటర్ నేను మిత భాషిని. రౌడీయిజానికి చాలా దూరం. నామీద ఒక్క పోలీస్ కేస్ కూడా లేదు. ప్లీజింగ్ నేచర్ నాది. ఇదీ నాన్నతో వచ్చిందే! మహమూద్ అలీ సాబ్ అంటే ఫిల్టర్ వాటర్ అంటారు అందరూ! నాకు జన్మనిచ్చిన తండ్రి దగ్గర్నుంచి చదువునేర్పిన గురువులు, రాజకీయాల్లో చేర్చుకున్న కేసీఆర్ వరకూ నాకు అందరూ నేర్పింది ఒక్కటే.. పేదవారికి చేతనైనంత సాయం చెయ్ అని! దాన్నే అమలు చేస్తున్న. నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్‌ని. కష్టం విలువ బాగా తెలుసు. కాబట్టి ప్రజల పట్ల బాధ్యతగా ఉంటాను. చిన్నప్పటి నుంచీ నేనంటే అందరికీ ఇష్టం. నా అదృష్టం కొద్దీ కేసీఆర్ సాబ్ కూడా నన్ను బాగా లైక్ చేస్తడు. నా పనిపట్ల ఆయనకు విశ్వాసం ఉంది. రీసెంట్‌గా నా కొడుకు కూడా టీఆర్‌ఎస్‌లో జాయిన్ అయిండు. నేను పాలిటిక్స్‌లోకి రావాలనుకుంటున్న అని నా కొడుకు నన్ను అడిగిన క్షణమే చెప్పిన.. మనకు పొలిటికల్ లైఫ్ ఇచ్చిన కేసీఆర్‌సాబ్‌కి, మనల్ని యాక్సెప్ట్ చేసిన ప్రజలకు జీవితమంతా లాయల్‌గా ఉండాలె అని! తెలంగాణపట్ల సార్‌కున్న కమిట్‌మెంటే మనకుండాలనీ చెప్త. నిజంగా నా దృష్టిలో కేసీఆర్ మహాత్మా. ఈ విషయాన్నే నేను బయట మీటింగ్స్‌లో చెప్తుంటే కేసీఆర్ నన్ను వారిస్తున్నరు. ఎవరు ఏమనుకున్న అది నా మనసులో మాట బస్ అంతే! అది కేసీఆర్ సాబ్ మీద నాకున్న గౌరవం.. నమ్మకం! తెలంగాణ అని తిరుగుతున్నరు అది వచ్చేదుందా.. పొయ్యేదుందా… అని చాలామంది వెక్కిరిచ్చిండ్రు. వాళ్లందరికీ ఒక్కటే మాట చెప్పిన.. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత సత్యమో.. కేసీఆర్ సాబ్ నాయకత్వంలో తెలంగాణ రావడం కూడా అంతే తథ్యం! అని. మునుపటి హైదరాబాద్.. హైదరాబాద్ సంస్కృతి గంగా జమునా తెహ్‌జీబ్ లాంటిది. నిజానికి ఇక్కడ హిందూముస్లిం అనే భేదం లేదు. అందరిదీ ఒకటే మతం.. మానవత్వం. కానీ కొన్ని కారణాల వల్ల ప్రజల మధ్య అంతరాలు పెరిగినయ్. ఒకప్పుడు రూలర్స్ అయిన ముస్లింలను ఇప్పుడు అణచివేశారు. ఏ హైదరాబాదీనైనా పరాయి ప్రాంతం వాళ్లు నవాబ్ అనే పిలిచేవాళ్లు. నేను బిజినెస్ పనిమీద లక్నో లాంటి చోట్లకు వెళ్లినప్పుడు అరే.. హైదరాబద్‌కే నవాబ్ సాబ్ ఆయే అంటూ ఎంతో మర్యాద చేసేవాళ్లు. అలాంటి ఐడెంటిటీ ఇప్పుడు మళ్లీ మన హైదరాబాదీలకు రావాలి. ఆ సమైక్య సంస్కృతి రావాలి. దానికి ఆశ కేసీఆర్‌సాబే! ఆయనను మించిన సెక్యులర్ లీడర్ లేడు! యే సబ్ నహీ జమ్తా మా నాన్న నాకు మూడు మాటలు చెప్పిండు. ఒకటి… అందరితో ప్రేమగా ఉండు. రెండు.. హలాల్ – ఆడిన మాటకు కట్టుబడి ఉండడం హలాల్! హరామ్ … నమ్మిన వాళ్లను మోసం చేయొద్దు! మూడు సత్యం.. ప్రాణంపోతున్నా అబద్ధం చెప్పొద్దు.. సత్యమే మాట్లాడు అని! ఈ మూడింటిని ఇప్పటికీ పాటిస్తా. పొలిటికల్ లీడర్స్ ఎంతో మంది సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఎన్నో వాగ్దానాలు చేస్తారు. కానీ నేను అలా కాదు. ఒక మాట చెప్పానంటే దానికి కట్టుబడే ఉంటా. ఇది మా నాన్న దగ్గర నేర్చుకున్న విలువైన పాఠం. నేను రాజకీయాల్లోకి వచ్చాక చాలామంది అరే ఆప్‌తో షరీఫ్ ఆద్మీ హై! ఇస్‌మేతో ఝూట్ బోల్నా పడ్తా.. యే సబ్ ఆప్‌కో నహీ జమ్తా అని వారించిన్రు. అయినా నిరుత్సాహపడలేదు.. అట్లాగని నా పద్ధతీ మార్చుకోలేదు. అదే నిజాయితీ నన్ను ఇవ్వాళ నిలబెట్టింది!
మన పురాణాలు, కథల్లో ఆక్టోపస్‌ను గ్రహాంతర జీవిగా చెప్పారు. తర్వాత కాదని తెలిసినా….ఇప్పటికీ దాని గురించి వింతగానే చెప్పుకుంటాము. దానికి కారణం ఆక్టోపస్ శరీరం రూపం వింతగా ఉండటమే! ఏ జీవిలో లేని ఎన్నో వింతలు, విశేషాలు దీనికి ఉన్నాయి. అక్టోపస్ లు వింత జీవులే కాదు, అరుదైన జాతి కూడా. ఎక్కడపడితే అక్కడ అన్నిచోట్లా ఇవి కనిపించవు. మళ్ళీ ఇందులో రెండు రకాలుంటాయి. మామూలుగా చిన్నవిగా ఉండేవి. పెద్దగా ఉండే జెయింట్ ఆక్టోపస్ లు. ఈ జెయింట్ ఆక్టోపస్ లు సహజంగా జపాన్, అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న అలూటియన్ దీవుల్లో జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్‌లు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఆక్టోపస్‌ చుట్టూ కదులుతూ ఉండే 8 చేతులకు ఒక్కో మెదడు ఉంటుంది. కంట్రోల్‌ మూవ్‌మెంట్‌ అంతా మాత్రం మధ్యలో ఉండే ప్రధాన మెదడు నియంత్రిస్తుంది. చేతులన్ని స్వతంత్రంగా పనిచేస్తున్నప్పటికీ ఒకే లక్ష్యంతో కదులుతాయని జీవశాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు. ఇదే కాదు ఆక్టోపస్‌కు ఏకంగా మూడు గుండెలు ఉంటాయి. వీటిలోని రెండు గుండెలు మొప్పలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. వీటికంటే పెద్దగా ఉండే ప్రధాన గుండె మిగతా శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్‌లో కాపర్‌ అధికంగా ఉండే హిమోసైనిన్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది. ఈ ప్రొటీన్‌ చల్లని సముద్రం నీళ్లలో కూడా ఆక్సిజన్‌ సరఫరా చేసే సామర్ధ్యాన్ని ఇస్తుంది. ఈ ఆక్టోపస్‌లో క్రొమటోఫోర్స్‌ అనే ప్రత్యేక ద్రవ్యం ఉంటుంది. దీని సహాయంతో అవసరమైనప్పుడు రంగు, ఆకారాన్ని కూడా మార్చుకోగలవు. ఇతర సముద్ర జీవులు ఆక్టోపస్‌లను వేటాడేటప్పుడు తమని తాము రక్షించుకోవడానికి విషపూరితమైన ద్రవాన్ని వాటిపై చిమ్మి, గందరగోళానికి గురిచేస్తాయి. ఇక ఆక్టోపస్‌ చేతులపై బొడిపెల్లాంటి పిలకలుంటాయి… గమనించారా? ఐతే ఆడ ఆక్టోపస్‌లకు ప్రతి చేతిపై ఇవి 280 ఉంటాయి. మగ ఆక్టోపస్‌లకు మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటాయి. అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే…. ఆడ ఆక్టోపస్‌లు సముద్రం అడుగు భాగంలో గుడ్లు పెట్టి, 7 నెలలు ఆహారం తీసుకోకుండా పొదుగుతాయి. పిల్లలు పుట్టగానే మరణిస్తాయి. అందుకే ఈ ఆక్టోపస్ ల సంతతి పెద్దగా కనిపించవు.
-ఆంధ్రా బాబు తీరుపై అప్రమత్తతతో ఉండాలి -సీమాంధ్ర పాలకుల తప్పులను సరిదిద్దాలె.. – మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం -ప్రజలకు సుపరిపాలన అందిద్దాం.. మన పాలన చూసి దేశం గర్వించాలె -పథకాల అమలులో పూచికపుల్లంత అవినీతి జరుగొద్దు -క్యాంపు కార్యాలయంలో మంత్రులతో భేటీ -ఏపీతో వివాదాంశాలు, స్థానిక ఎన్నికలపై రెండు గంటలపాటు చర్చ -జెడ్పీ చైర్మన్ ఎన్నికల కోసం మంత్రులకు జిల్లాల బాధ్యతలు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా, వేగంగా అమలు జరిగేలా నిరంతరం అప్రమత్తతతో పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. తెలంగాణ ప్రజలకు దేశం గర్వించదగ్గ సుపరిపాలన అందిద్దామని పిలుపునిచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం వివిధ శాఖల మంత్రులతో రెండుగంటలపాటు సమావేశమై పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.కృష్ణా జలాల పంపిణీ, విద్యుత్ ఒప్పందాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న వివాదాస్పద వైఖరి, త్వరలో జరుగనున్న జెడ్పీ చైర్మన్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, మహమూద్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగురామన్న, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన తప్పిదాలను పునః పరిశీలించి తెలంగాణకు జరిగిన అన్యాయాలను సవరించేందుకు మంత్రులు కృషి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా తరుచూ వివాదాలు సష్టిస్తున్న అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ధోరణిని ఎప్పటికప్పుడు అంచనావేస్తూ తెలంగాణకు ఏమాత్రం నష్టం రాకుండా అప్రమత్తతతో మెలగాలని మంత్రులకు సూచించారు. నదీ జలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ తప్పుడు వాదనలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు. అవసరమైతే ఎక్కడైనా తెలంగాణ వాదనను బలంగా వినిపించేందుకు న్యాయవాదులను సిద్ధం చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. సొంత రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తూనే పక్క రాష్ట్రం వ్యవహారాలపై కన్నేసి ఉంచాలని సూచించినట్లు సమాచారం. మంత్రుల పేషీల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో పూచికపుల్లంత అవినీతి కూడా జరుగటానికి వీల్లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. అత్యధిక జెడ్పీ స్థానాలను దక్కించుకోవాలె జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్లు, నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకొనేందుకు కృషి చేయాలని మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. హంగ్ ఏర్పడిన జిల్లాల్లో చైర్మన్ పోస్టులను దక్కించుకొనేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమైనప్పటికీ రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పార్టీ నేతలను సమన్వయం చేసి విజయం సాధించేందుకు పలువురు మంత్రులకు ఆయా జిల్లాల బాధ్యతలు అప్పగించారు.
4జి మొబైల్ సర్వీసులు చేరుకోనటువంటి గ్రామాల కు 26,316 కోట్ల రూపాయల మొత్తం వ్యయం తో ఆ విధమైనసేవల ను సమకూర్చడాని కి లక్షించిన ఒక ప్రాజెక్టు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి Posted On: 27 JUL 2022 5:18PM by PIB Hyderabad ప్రజలు అందరికీ డిజిటల్ సేవల లభ్యం అయ్యేటట్లు చూడడం మరియు సంధానాన్ని సమకూర్చడం అనేవి ప్రభుత్వం యొక్క ‘అంత్యోదయ’ దృష్టికోణం లో ఒక అంతర్భాగం గా ఉన్నాయి. అయిదు రాష్ట్రాల లో 44 ఆకాంక్షభరిత జిల్లాల లో 7,287 గ్రామాల కు- ఏయే గ్రామాలైతే 4జి మొబైల్ సర్వీసుల కు నోచుకోలేదో - అటువంటి గ్రామాల కు ఆ యొక్క సేవల ను అందించడం కోసం ఉద్దేశించిన ఒక ప్రాజెక్టు కు ప్రభుత్వం కిందటి సంవత్సరం లో ఆమోదాన్ని తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021వ సంవత్సరం లో స్వాతంత్య్ర దినం నాడు ఇచ్చిన ప్రసంగం లో, ప్రభుత్వ పథకాలు దేశం లో అందరికీ చేరాలి అంటూ పిలుపును ఇచ్చారు. దేశవ్యాప్తం గా 4జి మొబైల్ సర్వీసులు ఇప్పటికీ చేరని అటువంటి గ్రామాల కు ఆ తరహా సేవల ను అందించడానికని మొత్తం 26,316 కోట్ల రూపాయలు వ్యయం అయ్యే ఒక ప్రాజెక్టు ను కేంద్ర మంత్రిమండలి ఈ రోజు న ఆమోదించింది. ఈ ప్రాజెక్టు సుదూర ప్రాంతాల లో మరియు దుర్గమ ప్రాంతాల లో 24,680 గ్రామాల కు 4జి మొబైల్ సర్వీసుల ను- వేటికయితే ఆ ప్రాంతాలు ఇంత వరకు నోచుకోలేదో- అందుబాటు లోకి తీసుకు రానుంది. పునరావాసం, సరికొత్త ఆవాసాలు, ప్రస్తుత ఆపరేటర్ లు అందిస్తున్న సేవల ఉపసంహరణ అనే కారణాల తో 20 శాతం గ్రామాల ను అదనం గా చేర్చుకొనేందుకు ఈ ప్రాజెక్టు లో వీలు ఉంది. దీనికి అదనం గా, కేవలం 2జి/3జి సంధాన సదుపాయాన్ని కలిగివున్నటువంటి 6,279 గ్రామాల ను 4జి కనెక్టివిటీ కి ఉన్నతీకరించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నుఆత్మనిర్భర్ భారత్ యొక్క 4జి టెక్నాలజీ స్టాక్ ను వినియోగించుకొంటూ బిఎస్ఎన్ఎల్ అమలుపరుస్తుంది. మరి దీనికి అయ్యే డబ్బు ను యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేశన్ ఫండ్ నుంచి వెచ్చించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కు అయ్యే 26,316 కోట్ల రూపాయల వ్యయం లో మూలధనం రూపేణా చేసే ఖర్చు తో పాటు గా 5 సంవత్సరాల పాటు కార్యకలాపాల నిర్వహణ సంబంధిత వ్యయం కూడా కలిసి ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఆత్మనిర్భర్ భారత్ తాలూకు 4జి టెక్నాలజీ స్టాక్ ను రంగం లో మోహరించే ప్రక్రియ లో తలమునకలు గా ఉంది; ఈ 4జి టెక్నాలజీ స్టాక్ నే ఈ ప్రాజెక్టు లో కూడాను మోహరించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల లో మొబైల్ కనెక్టివిటీ ని సమకూర్చాలి అనే ప్రభుత్వ దార్శనికత బాట లో ఈ ప్రాజెక్టు ఒక మహత్వపూర్ణమైనటువంటి అడుగు గా ఉంది అని చెప్పాలి. ఈ ప్రాజెక్టు మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా బ్యాంకింగ్ సేవలు, ఇ-గవర్నెన్స్ సర్వీసులు, టెలి-మెడిసిన్, టెలి-ఎడ్యుకేశన్ మొదలైన సేవల ను అందజేయడం తో పాటు ఉపాధి అవకాశాల ను సృష్టించడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. *** (Release ID: 1845628) Visitor Counter : 63 Read this release in: Bengali , Kannada , Tamil , English , Urdu , Hindi , Marathi , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Malayalam మంత్రిమండలి 4జి మొబైల్ సర్వీసులు చేరుకోనటువంటి గ్రామాల కు 26,316 కోట్ల రూపాయల మొత్తం వ్యయం తో ఆ విధమైనసేవల ను సమకూర్చడాని కి లక్షించిన ఒక ప్రాజెక్టు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి Posted On: 27 JUL 2022 5:18PM by PIB Hyderabad ప్రజలు అందరికీ డిజిటల్ సేవల లభ్యం అయ్యేటట్లు చూడడం మరియు సంధానాన్ని సమకూర్చడం అనేవి ప్రభుత్వం యొక్క ‘అంత్యోదయ’ దృష్టికోణం లో ఒక అంతర్భాగం గా ఉన్నాయి. అయిదు రాష్ట్రాల లో 44 ఆకాంక్షభరిత జిల్లాల లో 7,287 గ్రామాల కు- ఏయే గ్రామాలైతే 4జి మొబైల్ సర్వీసుల కు నోచుకోలేదో - అటువంటి గ్రామాల కు ఆ యొక్క సేవల ను అందించడం కోసం ఉద్దేశించిన ఒక ప్రాజెక్టు కు ప్రభుత్వం కిందటి సంవత్సరం లో ఆమోదాన్ని తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021వ సంవత్సరం లో స్వాతంత్య్ర దినం నాడు ఇచ్చిన ప్రసంగం లో, ప్రభుత్వ పథకాలు దేశం లో అందరికీ చేరాలి అంటూ పిలుపును ఇచ్చారు. దేశవ్యాప్తం గా 4జి మొబైల్ సర్వీసులు ఇప్పటికీ చేరని అటువంటి గ్రామాల కు ఆ తరహా సేవల ను అందించడానికని మొత్తం 26,316 కోట్ల రూపాయలు వ్యయం అయ్యే ఒక ప్రాజెక్టు ను కేంద్ర మంత్రిమండలి ఈ రోజు న ఆమోదించింది. ఈ ప్రాజెక్టు సుదూర ప్రాంతాల లో మరియు దుర్గమ ప్రాంతాల లో 24,680 గ్రామాల కు 4జి మొబైల్ సర్వీసుల ను- వేటికయితే ఆ ప్రాంతాలు ఇంత వరకు నోచుకోలేదో- అందుబాటు లోకి తీసుకు రానుంది. పునరావాసం, సరికొత్త ఆవాసాలు, ప్రస్తుత ఆపరేటర్ లు అందిస్తున్న సేవల ఉపసంహరణ అనే కారణాల తో 20 శాతం గ్రామాల ను అదనం గా చేర్చుకొనేందుకు ఈ ప్రాజెక్టు లో వీలు ఉంది. దీనికి అదనం గా, కేవలం 2జి/3జి సంధాన సదుపాయాన్ని కలిగివున్నటువంటి 6,279 గ్రామాల ను 4జి కనెక్టివిటీ కి ఉన్నతీకరించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నుఆత్మనిర్భర్ భారత్ యొక్క 4జి టెక్నాలజీ స్టాక్ ను వినియోగించుకొంటూ బిఎస్ఎన్ఎల్ అమలుపరుస్తుంది. మరి దీనికి అయ్యే డబ్బు ను యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేశన్ ఫండ్ నుంచి వెచ్చించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కు అయ్యే 26,316 కోట్ల రూపాయల వ్యయం లో మూలధనం రూపేణా చేసే ఖర్చు తో పాటు గా 5 సంవత్సరాల పాటు కార్యకలాపాల నిర్వహణ సంబంధిత వ్యయం కూడా కలిసి ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఆత్మనిర్భర్ భారత్ తాలూకు 4జి టెక్నాలజీ స్టాక్ ను రంగం లో మోహరించే ప్రక్రియ లో తలమునకలు గా ఉంది; ఈ 4జి టెక్నాలజీ స్టాక్ నే ఈ ప్రాజెక్టు లో కూడాను మోహరించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల లో మొబైల్ కనెక్టివిటీ ని సమకూర్చాలి అనే ప్రభుత్వ దార్శనికత బాట లో ఈ ప్రాజెక్టు ఒక మహత్వపూర్ణమైనటువంటి అడుగు గా ఉంది అని చెప్పాలి. ఈ ప్రాజెక్టు మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా బ్యాంకింగ్ సేవలు, ఇ-గవర్నెన్స్ సర్వీసులు, టెలి-మెడిసిన్, టెలి-ఎడ్యుకేశన్ మొదలైన సేవల ను అందజేయడం తో పాటు ఉపాధి అవకాశాల ను సృష్టించడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.
టాలీవుడ్ లో హీరో హీరోయిన్లుగా రాణిస్తూ, ఆతర్వాత పెళ్లి బంధం తో ఒక్కటై జీవనం సాగిస్తున్న వాళ్ళు టాలీవుడ్ లో చాలామందే వున్నారు. ఇందులో జీవిత, రాజశేఖర్ జంట ఒకటి. కొందరు అందంతో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటే మరికొందరు అభినయంతో స్టార్ గా ఎదుగుతారు. రెండవ కోవకు చెందిన జీవిత పలు సినిమాల్లో హీరోయిన్ గా రాణించింది. దర్శకురాలిగా కూడా పలు చిత్రాలు రూపొందించింది. జీవిత తలంబ్రాలు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ అనేక హిట్ చిత్రాల్లో నటించి., తన స్టామినా ఏమిటో నిరూపించింది. హీరో డాక్టర్ రాజశేఖర్ తో కల్సి పలు చిత్రాలలో నటించిన జీవిత చివరకు ఆయన్నే వివాహం చేసుకుంది. వీరిద్దరికీ శివాని, శివాత్మిక అనే ఇద్దరు కూతుళ్లు వున్నారు. ఇందులో శివాని టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అవుతోంది. నటిగానే కాకుండా దర్శకురాలిగా డాక్టర్ రాజశేఖర్ ని హీరోగా పెట్టి శేషు , మహంకాళి,సత్యమేవ జయతే చిత్రాలు రూపొందించింది. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టిన జీవిత వివిధ కారణాలవలన అక్కడ మాత్రం సక్సెస్ కాలేదు. ఇక జీవిత వ్యక్తిగత విషయానికి వస్తే, ఆమె ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. సొంతూరు శ్రీశైలం. ఈమె అసలు పేరు పద్మ. ఈమె తండ్రి రామనాధం వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ ఇన్ స్పెక్టర్ గా సేవలందించారు. తల్లి శకుంతల కూడా అదే శాఖలో నర్స్ గా పనిచేసింది. జీవితకు ఓ అక్క, ఓ అన్న ఉన్నారు. చైల్డ్ దశనుంచే డేరింగ్ అండ్ డాషింగ్ అమ్మాయిగా గుర్తింపు పొందిన జీవిత సినీ రంగంలో ఫైర్ బ్రాండ్ అయింది. డైరెక్టర్ తేజ, కొరియాగ్రాఫర్ సుచిత్రా చంద్ర బోస్ లు స్కూల్ డేస్ లో జీవితకు క్లాస్ మేట్స్. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ ఈమెకు సీనియర్. ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా వెనుకంజ వేయని మనస్తత్వం జీవిత సొంతం. ఇక జీవిత లేని జీవితాన్ని తాను ఊహించలేనని డాక్టర్ రాజశేఖర్ కూడా ఎన్నో సార్లు చెప్పాడు. అసలు జీవిత సినీ రంగ ప్రవేశం కూడా ఆసక్తి కరమే. మహానటుడు ఎన్టీఆర్ దగ్గర జీవిత గ్రాండ్ ఫాదర్ ఎక్కౌంటెంట్ గా పనిచేసేవారు. ఆ విధంగా చిత్ర పరిశ్రమతో జీవితకు సంబంధం ఏర్పడి, సినీమాల్లో నటించాలనే కోరికను పెంచాయి. పరిశ్రమలో పలువురితో ఏర్పడ్డ పరిచయాల కారణంగా ఆమె మొదట తమిళ చిత్రం తో అరంగేట్రం చేసింది. దాదాపు 20 పైగా తమిళ చిత్రాల్లో నటించిన జీవిత ఆతర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. హీరోయిన్ గానే కాకుండా అనేక క్యారెక్టర్ పాత్రలు వేసి, మెప్పించింది. జీవిత ప్రస్తుతం కూతుళ్ళ కెరీర్ ని ప్లాన్ చేస్తూ బిజీ గా వుంది.
అల్లు అరవింద్ తీసుకువచ్చిన తెలుగు ‘ఆహా’ ఓటిటి ప్లాట్ ఫామ్ రెండు సంవత్సరాల కంటే తక్కువ సమయంలోనే అత్యంత పాపులారిటీని సంపాదించుకుంది. ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్… Kollywood, Latest Film News in Telugu, Tollywood Film News In Telugu January 23, 2022 0Likes 270Views Latest Film News in Telugu, Tollywood Film News In Telugu January 21, 2022 0Comments హోస్ట్ గా మారనున్న వెంకటేష్.. బాలకృష్ణ లాగా మరో సీనియర్ హీరో హోస్ట్ గా మారనున్నారు. అసలు మాట్లాడటానికి ఆ హీరో పెద్దగా ఇష్టపడ్డారు. అలాంటి ఆ హీరోను తెలుగు పోగ్రామ్ షో…
A Romantic Story by Pasupuleti Satya Sreenivas. "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మాకందరికీ క్లారిటీ వచ్చేసింది.." అంది యామిని. "ఆరతీ.. నువ్వు అతన్ని మొదటిసారి ఎప్పుడు చూసావు.." అడిగింది వసుంధర. admin Jul 14, 2022 - 13:18 Updated: Jul 15, 2022 - 16:03 0 49 Facebook Twitter మన్మథుడు పసుపులేటి సత్య శ్రీనివాస్ ఆరతి తన ఫ్రెండ్స్‌తో కాఫీడేలో కూర్చుంది. అంత అందమైన అమ్మాయిలు ఒక్క చోట చేరి కిలకిల లాడుతూ ఉంటే వివిధ వర్ణాల గులాబీతోట విరబూసిందేమో అన్నట్టుగా ఉంది చూడడానికి. ఆమె ఒక గంట నుండీ చాలా లోతుగా చర్చ జరుపుతోంది వాళ్ళతో. అందరి ముఖాలలోనూ కుతూహలం. అందమైన ఆ కనురెప్పల వెనుక కళ్ళల్లో ఎన్నెన్నో భావాలు తొణికిసలాడుతున్నాయి. ఆ ఎన్నెన్నో భావాలమధ్య కూడా వాళ్ళందరికీ స్పష్టంగా కపిపించింది ఒక ప్రత్యేకమైన కుతూహలం. "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మాకందరికీ క్లారిటీ వచ్చేసింది.." అంది యామిని. "ఆరతీ.. నువ్వు అతన్ని మొదటిసారి ఎప్పుడు చూసావు.." అడిగింది వసుంధర. "బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఫ్లైట్‌లో నా పక్క సీటే అన్నానుగా.. అదే మొదటిసారి చూడడం. " 'నిన్న క్రాస్ వరల్డ్ లో బుక్స్ చూస్తుంటే కనిపించాడు మళ్ళీ' అంది ఆరతి. "ఓ.. ఐసీ.. ఫ్లైట్‌లో మాటలమధ్యలో ఆ మర్నాడు ఇనార్బిట్‌మాల్‌కి వెళతానని చెప్పుంటావు.. నీలాంటి బ్యూటీతో మళ్ళీ మాట్లాడాలనుకుంటాడు. వచ్చి కలిసాడు. " అంది వసుంధర. "నిన్ను కావాలని వెంటాడుతున్నాడేమో" అంది పల్లవి కళ్ళు పెద్దవి చేసి. "అబ్బ ఉండవే.. ఇదేమైనా వెంటాడు వేటాడు సినిమా అనుకున్నావా.. ఇప్పుడే మొదలయిన అందమైన ప్రేమకథ" అంది సౌందర్య. "ఊ.. ఊ.. నేనేమీ ప్రేమించెయ్యడంలేదు అతనిని.." అంది ఆరతి ఉడుక్కుంటూ "ఆరతీ.. నువ్వు మన మెడికల్ కాలేజి బ్యూటీవి. అతను నీ వెంట పడటంలో ఆశ్చర్యం ఏవుంది చెప్పు. అయినా అందగాడే కదా" అంది యామిని. "అవును.. మన్మథుడి లా ఉన్నాడు" అంది వసుంధర ఆరతి చేతిలోని మొబైల్ లో అతని ఫొటో చూస్తూ. అది ఫ్లైట్‌లో ఆరతి తీసుకున్న సెల్ఫీ. "అతను అందగాడయితే సరిపోదే.. బుద్ది కూడా అందంగా ఉండాలి కదా.." అంది సౌందర్య. "ఓకే.. దానికంత ఆలోచనెందుకు.. ఏమయింది మన ఆడపిల్లలకి. నీవెంట పడుతున్నందుకు అతనికి చెల్లించక తప్పదు భారీమూల్యం' అంది యామిని. "అంటే ఏంటో క్లియర్ గా చెప్పు" అంది ఆరతి. "అతను నిన్ను పిలిచింది డిన్నర్‌కే కదా.. వెళ్ళి భారీగా బిల్ చేసి అతన్ని టెస్ట్ చెయ్యి.." అంది యామిని సింపుల్ గా. తక్కిన ఆడపిల్లలంతా వత్తాసు పలికారు. "నీ ఒక్కదాని వల్ల కాకపోతే మా ఫ్రెండ్స్ ట్రీట్ అడుగుతున్నారని చెప్పు. మేము కూడా వస్తాం. వేరే టేబుల్ దగ్గర కూర్చుంటాంలే" అంది వసుంధర. "ఓకే. మీరంతా వస్తానంటే నేను ఓకె చెప్తాను. చూస్తాను ఏమంటాడో.. అంది ఆరతి. "మన్మథుడు ఓకే అంటాడు.. నాకు తెలుసు.." అంది యామిని. హోటల్ తాజ్ కష్ణలో ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు ఆరతి ఆమె ఫ్రెండ్స్‌తో సహా హాజరయింది. ఆమె నలుగురి ఫ్రెండ్స్ కి ఒక టేబుల్ రిజర్వ్ చేసి ఉంది, ఆమెకు 'మన్మథుడీకి మరో టేబుల్ రిజర్వ్ చేసి ఉంది. వాళ్ళు వెళ్ళి కూర్చున్న కొద్దిసేపటికి అతను వచ్చాడు. ఆరతి ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్ళే ముందు ఆమె ఫ్రెండ్స్ టేబుల్ దగ్గర ఆగాడు. 'హాయ్ గాళ్శ్ అన్నాడు నవ్వుతూ. అప్పటివరకు అతని పైన బోలెడన్ని జోక్స్ వేసుకున్నా అతను అంత చొరవగా వచ్చి తమను మాట్లాడించేసరికి అమ్మాయిలందరూ సైలంట్ అయిపోయారు. వసుంధర ఒక్కతే కాస్త ముందుగా తేరుకుంది. "మేమంతా రావడం వల్ల మీకు ఇబ్బందనిపిస్తుందేమో.. సారీ.. మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాము" అంది. "నో నో.. మిమ్మల్ని కలవడం నాకు సంతోషంగా ఉంది. వియ్ ఆర్ ఆల్ ఫ్రెండ్స్.. ప్లీజ్ ఎంజాయ్ యువర్ సెల్వెస్" అన్నాడు "అలాగే, థాంక్స్. మీ పేరు" అంది వసుంధర, మన్మథుడి అసలు పేరు ఏమిటా అనుకుంటూ. అ అమ్మాయిలందరూ కలిసి అతనికి 'మన్మథుడ ‘ అనే నిక్ నేం పెట్టారు. అదే బాగుందనుకుని దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. "ప్రద్యుమ్న్.."అన్నాడు నవ్వుతూ. తన ఫ్రెండ్స్ టేబుల్ దగ్గర అంత సేపు ఏం చేస్తున్నాడా అనుకుంటూ చూస్తోంది ఆరతి. అంతలో ఆమె దగ్గరకు వచ్చి "హాయ్.. కొద్దిగా లేటయింది నేను రావడం.." అన్నాడు ప్రద్యుమ్న్. "అదేం ఫరవాలేదు. మా వాళ్ళు ఏమైనా సతాయించారా.." అంది ఆరతి అనుమానంగా. "ఏం లేదు. యు హావ్ నైస్ ఫ్రెండ్స్.." అంటూ కాంప్లిమెంట్ చేసాడు. అతనితో మాట్లాడుతూ ఉంటే టైం తెలియలేదు ఆరతికి. రెండు గంటల తర్వాత వాళ్ళందరిని కాబ్‌లో హాస్టల్‌కి పంపించాడు. రిటర్న్ జర్నీలో అమ్మాయిలందరిదీ ఒకేమాట.. "నీ మన్మధుడికి మేము కూడా ఫిదా.." అంత వెల్ బ్రెడ్ మనిషిని, సినిమా హీరోలకే ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ తెప్పించే లాంటి ఫిజిక్ ఉన్నవాడిని, సంస్కారవంతుడిని అంతవరకూ చూడలేదని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. "అయితే ఆరతి కోసం అతను అంత ఖర్చు పెట్టడం ఎందుకు.. " అతనికి ఆమె పైన ఎంత ఇష్టం ఉన్నా ఎంతటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుందామన్నా వాళ్ళకి అందులో ఏదో అసహజంగా అనిపించింది. ఆ విషయం ఆరతికి చెప్తే ఎలా ఫీలవుతుందో అని కార్ లో తిరిగి వెళ్తున్నప్పుడు ఎవరికి వారు లోలోనే అనుకున్నారు. హాస్టల్‌కెళ్ళాక అందరూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు మాత్రం బయటపడిపోయారు. ఆరతి మనసులోనూ అదే సందేహం కలిగింది. కాని ఆమె బయటికి చెప్పలేదు. "సరే, నాకు మరో రోజు టైం ఇవ్వండే, అతను ఈ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో ఏ మూల దాగి ఉన్నా.. వెతికి పట్టుకువచ్చే బాధ్యత నాది.." అంది పల్లవి, అలనాడు బాణుడి కూతురు ఉషకు అనిరుద్ధుడి చిత్రపటం గీసి ఇస్తానన్న చిత్రలేఖలా వాగ్దానం చేస్తూ. "సరే, ఆ పనిలో ఉండు నువ్వు" అంది యామిని. ఆ మర్నాడు ఆదివారం కావడంతో అందరూ తీరికగా లేచి బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వెళ్తూ పల్లవి కోసం చూస్తే ఆమె నిద్రపోతూ కనిపించింది. ఆమె రూం మేట్ యామిని చెప్పింది "అది రాత్రంతా నిద్రపోకుండా ఆ మన్మథుడి ప్రొఫైల్ కోసం ఇన్‌స్టాగ్రాం, లింక్‌డ్ఇన్, ట్విట్టర్ ల వంటి అన్ని సోషల్ మీడియా నెట్ వర్కులలోను వెతుకుతూనే ఉంది. ఎప్పుడు పడుకుందో కూడా తెలియదు" అంది. వాళ్ళ మాటలకు ముసుగు తీసి చూసింది పల్లవి. రాత్రంతా నిద్రలేకపోవడంవల్ల ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. "ఏమయిందే, నెట్ వేసి సోషల్ మీడియాలలో ఎక్కడ ఉన్నా పడతానన్నావుగా, పట్టావా.."నిలదీసింది యామిని, పల్లవి లేవడం గమనించి. "లేదు తల్లీ, లేదు. రాత్రంతా అన్నీ వెతికాను, కానీ ఫలితం శూన్యం" అంది పల్లవి ఒళ్ళు విరుచుకుంటూ. "అయితే ఇక నువ్వే కనుక్కోవాలి" అంది సౌందర్య ఆరతి వైపు చూస్తూ. సాలోచనగా ఆమె వైపు చూసి తన ఫోన్ నుంచి మెసేజి పంపింది ఆరతి. వెంటనే ప్రద్యుమ్న్ నుంచి రిప్లై వచ్చింది. అది చూసి ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. "ఏమయింది.." అంది యామిని ఆరతి మొఖంలో మార్పులు చూసి. "ఇదేంటే, తనకు ఏ సోషల్ మీడియాలోనూ అకౌంట్ లేదు అంటున్నాడు. ఇదెలా సాధ్యం" అంది ఆరతి. "నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది ఇతని వ్యవహారం. మీరు నేను చెప్పింది సీరియస్ గా తీసుకోవాలి ఇప్పటికైనా. కనీసం ఫేస్‌బుక్ లో అకౌంట్ లేదంటే ఎలానే నమ్మడం. తన వివరాలు మనకు తెలిసిపోతాయని కావాలని అబద్ధం చెపుతున్నట్లున్నాడు. ఆరతీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి.." అంది యామిని సీరియస్‌గా. కొద్ది క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. ఆరతి పైన కొంచెం జాలి కలిగింది వాళ్ళకి. అంత స్మార్ట్‌గా ఉన్నవాడు ఆమెకోసం పడి చస్తున్నాడు అంటే తమకు కూడా కాస్త అసూయ కలిగిన విషయం గుర్తుకి తెచ్చుకున్నారు. "అవునే ఇప్పుడు అందరూ డిజిటల్ ఐడెంటిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అతను తన డిజిటల్ ట్రేస్ దొరక్కుండా ఉంచాలి అనుకుంటున్నాడేమో.. ఎందుకన్నా మంచిది ఒకసారి అతని బాక్ గ్రౌండ్ చెక్ చేసాకే ఏదైనా డెసిషన్ తీసుకో.." అంది పల్లవి. స్నేహితురాళ్ళ సలహాలతో బుర్ర గిర్రున తిరిగింది ఆరతికి ఈ మన్మథుడి వెనక రహస్యం ఏమిటో అర్థం అయి చావడం లేదే అనుకుంది. అతనిలో నిజమెంత.. అబద్ధం ఎంత.. అనేది తేల్చుకోవడానికి తనే ఏదైనా చేయాలి అనుకుంది. స్నేహితురాళ్ళతో తన ఆలోచన చెప్పింది. వాళ్ళు విన్నారు, చాలా ఎక్సైటెడ్ గా. "కానీ ప్రమాదం కదే.." అంది యామిని. "సరేలే రిస్క్ తీసుకుంటేనే కదా నిజం తెలిసేది. అయినా మనమంతా ఉంటాంగా" అంది పల్లవి. వాళ్ళందరూ ఉన్నారన్న ధైర్యంతో గుండెలు చిక్కబట్టుకుని మన్మథుడికి ఫోన్ చేసి మాట్లాడింది ఆరతి. ఆమె కాల్ చేయడం పూర్తి అయ్యేవరకూ ఒక్క శబ్ధం కూడా చేయకుండా ఆమె వైపే చూసారు మిత్రబౄందమంతా! "ఏమన్నాడు" అన్నారు స్నేహితురాళ్ళంతా ఏకకంఠంతో, ఆమె కాల్ ముగించగానే!! "సరే.. అన్నాడు" అంది ఆరతి. ఆమె మొఖంలో అనందం లేదు. ఒక మాదిరి టెన్షన్, మరో రకమైన తెగింపు కనిపించాయి ఆ రోజు రాత్రి ప్రద్యుమ్న్ ఉన్న హోటల్ గది బయట ఎవరో బజర్ నొక్కారు. లాప్ టాప్ ముందు కూచుని ఏదో పని చేసుకుంటున్న ప్రద్యుమ్న్ లేచి వెళ్ళి తలుపు తెరిచాడు. ఒక కాశ్మీరీ షాల్ తో భుజాలు పైన నిండుగా కప్పుకుని అందాల భరిణె లా నుంచుని ఉన్న ఆరతిని చూసి ఆశ్చర్యంతో అతని కనులు పెద్దవయ్యాయి. కానీ వెంటనే సంభాళించుకుని, "కం.. కం.." అంటూ తను లోపలికి వెళ్ళాడు. గది తలుపు దగ్గరగా వేసి అతని వెనక రాయంచలా నడుచుకుంటూ అతని గదిలోకి వెళ్ళింది ఆరతి. అతని గది విశాలంగా, చాలా రిచ్ గా ఫర్నిష్ చేయబడి ఉంది. టివి రన్ అవుతుంది కాని చాలా లో వాల్యూం లో ఉంది. అతని లాప్ టాప్ తెరిచి ఉండటం చూసి, 'మీ పని డిస్టర్బ్ చేసానా.." అంది ఆరతి. "నో.. నో.. అదేమీ లేదు. నువ్వు వచ్చే లోగా ఏదైనా పని చేసుకుందామని అనుకున్నా అంతే.." అన్నాడు పట్టుబడ్డ దొంగలా "ఓ.." అంటూ అతను ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. భుజాల చుట్టూ ఉన్న అందమైన కాశ్మీరీ షాల్‌ను భుజాల మీదుగాజారవిడిచింది. ఆమె నున్నటి భుజాలపైనుంచి, ఆమె చేతులమీదుగా మౄదువుగా అది జారుతూ ఉంటే ఆమెను చూసిన ప్రద్యుమ్న్ కి గుండె జారినట్లయింది. కళ్ళప్పగించి ఆమె బంగారు మేని ఛాయను చూస్తూ ఉండిపోయాడు. ఆమె వేసుకున్న స్లీవ్ లెస్ డ్రె స్ వెనుక వైపు ఆమె నున్నటి వీపు కనిపించి అతని నోరు దాహంతో ఎండిపోయింది. ముందుకి చూస్తే ఒక ముత్యాల హారం ఆమె ఎదలోతులలో ఇరుక్కున్నట్లు కనిపించింది. నల్లటి వెల్వెట్ డ్రెస్ లో ఆమె మరింత అందంగా కనిపించింది. బహుశా ఈ అందం అందరి మతులు పోగొట్టకూడదనే సదుద్దేశంతోనే ఆమె ఆ కాశ్మీరీ షాల్ కప్పుకున్నట్లుంది అనుకున్నాడు. "మరి డిజిటల్ టెక్నాలజీని వాడుతున్నారు గాని సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నారు.." అంది లేచి అతని వైపు నడిచి అతని ముందుకొద్దిగా వంగి అతని కనులలోకి సూటిగా చూస్తూ. అలా ఆమె వంగినప్పుడు ఆమె లోనెక్ డ్రెస్ లో ఆమె అందాలు కనువిందు చేస్తుంటే అతని చూపులు అటు పరిగెత్తాయి. తను కోరుకున్న ఎఫెక్ట్ అతనిలో వచ్చింది అనుకుంది ఆరతి. మనిషికి కామం కలిగితే బుద్ధి నశిస్తుంది. అప్పుడు నటించే శక్తి కోల్పోతాడు. మనసులో ప్రేమ ఉంటే ప్రేమ వస్తుంది, మౄగం ఉంటే అదే బయటకు వస్తుంది. ఒక వేళ మౄగమే గనుక వస్తే తన మిత్రులకు ఒక్క సిగ్నల్ చేస్తే తలుపులు బద్దలు కొట్టుకునైనా వచ్చేస్తారు అనుకుంది ఆరతి. అందుకే తను తలుపులు దగ్గరగా వేసింది గాని లాక్ చేయలేదు. "ఆరతీ.. నెట్ లో మనం ముక్కు మొఖం తెలియని వాళ్ళను మొక్కుబడిగా స్నేహితులుగా భావించడం నాకు ఇష్టం ఉండదు. నాకు నిజంగా పరిచయం అయిన వాళ్ళలో ఎవరితోనైనా అభిరుచులు కలిసినప్పుడు నా స్నేహితులుగా చేసుకుంటాను. నీతో మాట్లాడి నీ వ్యక్తిత్వం నచ్చింది కనుకే నీ స్నేహం కోరుకున్నాను. నీతో జీవితం పంచుకోవడానికి ఆశపడుతున్నాను.." అన్నాడు చూపులు ఆమె పైనుంచి తప్పించి దూరంగా ఉన్న గోడని చూస్తూ. ఫ్రెండ్స్ సందేహపడినట్టు అతను వేరే విధంగా ప్రవర్తించకపోవడం ఆరతికి చాలా ఆనందం కలిగించింది. "స్నేహం అంటే డేటింగ్ లాగానా.. లేక మామూలు స్నేహమేనా.." అలా మాట్లాడడం ఆమె స్వభావం కాదు.. అయినా కాస్త కవ్వించింది. ఎందుకంటే అప్పటికే అతను మంచివాడిలా ఉన్నాడు అని అనుకుంటున్నా.. బాగా వేడి మీద ఉన్నప్పుడే ఒక దెబ్బ వేస్తే బంగారం క్వాలిటీ బయట పడుతుంది అన్నట్లుగా. ఒకసారి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసాడు. అతని చూపులు ఆమె మనసు లోతులలోకి చొచ్చుకుపోయిన అనుభూతి కలిగింది. మనసులో ఏమూలనైనా అతన్ని మభ్యపెట్టాలి, భ్రమింప చేయాలి అన్న ఆలోచన ఉన్నా ఆ చూపుతో అవి ఆవిరి అయిపోయాయి. అతని చూపులను తప్పించుకోవడానికి లేచింది ఆరతి. "నీ పెద్దవాళ్ళతో మాట్లాడి నీకు ఇష్టమైతే నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను.." అన్నాడు. అతని మాటలలోని నిజాయితీకి చలించిపోయింది ఆరతి. ఏమి మాట్లాడాలో తెలియలేదు ఆమెకి. లేచి రెండు అడుగులు టివి వైపు వేసింది. హైహీల్ వేసుకున్న ఆరతి కాలు అనుకోకుండా మడతపడి ఆమె తూలి పడింది. నిజానికి అలా పడటం ఆమె ప్లాన్ లో లేదు. చటుక్కున లేచి ఆమె పడకుండా పట్టుకున్నాడు ప్రద్యుమ్న్. అతని వెచ్చని స్పర్శకు ఆమె దేహమంతా పులకరించింది.. సిగ్గుతో కళ్ళు వాల్చుకుంది.. అంతలో ఆమె చేతిలో ఉన్న కీ చైన్ కిందకు జారింది. ఒక చేత్తో ఆరతి నడుము చుట్టి తనకు దగ్గరగా హత్తుకుని ఉన్న ప్రద్యుమ్న్ మరో చేత్తో దాన్ని కిందపడకుండా పట్టుకుని, అటూ ఇటూ చూస్తూ.. "ఈ బటన్ ఏమిటి.." అన్నాడు. ఆ ప్రశ్న పూర్తి కాకుండానే.. "దాన్ని నొక్కొద్దు.." అంది ఆరతి హడావుడిగా. కానీ అంతలోనే ప్రద్యుమ్న్ దాన్ని నొక్కేసాడు.. సరిగ్గా పది సెకన్లలో కారిడార్ లో కలకలం రేగింది. దగ్గరగా వేసి ఉన్న గది తలుపులు తోసుకుంటూ ఆరతి స్నేహితులు లోపలికి వచ్చేసారు. హఠాత్తుగా అలా వచ్చిన ఆరతి స్నేహితులను చూసి ఆశ్చర్యపోయాడు ప్రద్యుమ్న్. ప్రద్యుమ్న్ చేయి ఆరతి నడుము చుట్టూ, ఆమె చేయి అతని మెడ చుట్టూ ఉండటం చూసి తాము అనుకున్న పరిస్థితికి వ్యతిరేకంగా ఉండటంతో ఆరతి మిత్రబౄందం కూడా షాక్ అయ్యారు. ఆరతి పైన దాడి చేస్తూ ఉంటాడు ఆ మన్మథుడు అనుకున్నారు గాని వాళ్ళిద్దరూ రతీమన్మథులలాగా ఆనందంగా ఒకరినొకరు కౌగలించుకుని ఉంటారని వాళ్ళు ఊహించనేలేదు. అందరినీ చూసి కాస్త ఇబందిగా ఫీలయినా, వెంటనే ఫక్కున నవ్వేసింది ఆరతి. ప్రద్యుమ్న్‌కి కూడా ఆరతి తనను పరీక్షించిందని అర్థం అయిపోయి అతను కూడా గట్టిగా నవ్వాడు. వాళ్ళిద్దరి నవ్వులకు ఆరతి స్నేహితుల కిలకిలారావాలు తోడవడంతో అక్కడ ఆనందం వెల్లి విరిసింది. ఆరతికి మన్మథరహస్యం తెలిసింది. అతనికి తనపైన ఉన్న ప్రేమ నిజమని తెలుసుకుంది. అది అర్ధం చేసుకున్న ఆరతి ఫ్రెండ్స్ కూడా సంతోషంగా వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు చెప్పారు.
ప్రభాస్ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్న సినిమాల్లో సలార్ ఒకటి. ఈ సినిమాపై ఫ్యాన్స్ కు ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త లీక్ అయ్యింది. దాంతో ప్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నారు. Surya Prakash First Published Oct 17, 2022, 7:26 AM IST వరుస పాన్‌ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ ప్రభాస్‌(Prabhas). ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నింటి బడ్జెట్‌ కలిపితే రూ.1000 కోట్లకు అనేది అంచనా. కరోనా కారణంగా షూటింగ్ లు ఆలస్యమయ్యి ఆయా సినిమాల బడ్జెట్‌ కూడా పెరిగిపోయాయి. ముఖ్యంగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'సలార్‌' ది అదే పరిస్దితి అని తెలిస్తోంది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తొలుత అనుకున్న దానికంటే 'సలార్‌' బడ్జెట్‌ కూడా విపరీతంగా పెరిగిపోయినట్లు టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం రూ.250 కోట్లకు పైనే ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నట్లు చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో నడుస్తోంది. ఇందులో అత్యధిక మొత్తం ప్రభాస్‌కే చెల్లించాల్సి ఉండగా, యాక్షన్‌ సీన్స్ కు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. ఈ క్రమంలోనే 'సలార్‌' రెండు భాగాలుగా రెడీ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తేనే ఆ బడ్జెట్‌కు వర్కవుట్‌ అవుతుందని సలహా ఇవ్వటంతో ఆ నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమా రెండు పార్ట్ ల ఓవర్ సీస్ థియేటర్ రైట్స్ ని Phars ఫిల్మ్స్ వారు రికార్డ్ బ్రేకింగ్ రేటుకు తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మొదటి పార్ట్ క్లైమాక్స్...వేరే సినిమా (కేజీఎఫ్) ఫ్రాంచైజ్ తో ఇంటర్ లింక్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఫస్ట్ ఫార్ట్ లోని కొన్ని పాపులర్ క్యారక్టర్స్ ..సెకండ్ పార్ట్ లో కనపించనున్నాయి. మరో ప్రక్క మలయాళీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలకపాత్రలో కనిపిస్తున్నారు. ఆదివారం పృథ్వీరాజ్‌ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రియులకు 'సలార్‌' టీమ్‌ అదిరిపోయే అప్డేట్​ ఇచ్చింది. పృథ్వీరాజ్‌ లుక్‌ని రివీల్‌ చేసింది. ఇందులో ఆయన.. వరదరాజ మన్నార్‌ పాత్రలో యాంగ్రీ లుక్‌లో కనిపించారు. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్‌ రఫ్‌ లుక్‌లో కనిపించనున్నారు. శ్రుతిహాసన్‌, జగపతి బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రం హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోంది. బిగ్గెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'సలార్‌' రూపొందుతోందని చెప్పటానికి ఇంతక మించి రుజువు ఏం కావాలి.
కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదని దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. వ్యాక్సినేషన్‌ తక్కువ, కేసులు ఎక్కువ, మౌలిక వసతులు అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్రాలకు సహాయక బృందాలను పంపాలని, పరిస్థితి మెరుగుపడేందుకు సహకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా దేశంలో కరోనా పరిస్థితులపై ఆయన ఉన్నతాధికార సమీక్ష గతరాత్రి జరిపారు. పర్యవేక్షణ అనంతరం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ తగిన సహాయం అందించాలని కేంద్ర అధికారులను మోదీ ఆదేశించారు. కరోనాపై కేంద్రీకృత, సహకారయుక్త పోరు సాగించాల ని, జిల్లాస్థాయి నుంచి సమీక్షించుకుంటూ ఆరోగ్య వ్యవస్థలను బలపరచాలని ప్రధాని చెప్పారు. రాష్ట్రాల్లో తగినంత ఆక్సిజన్‌ సరఫరా యంత్రాంగం ఉండేలా, అవన్నీ సరిగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య మౌలిక వసతుల గురించి రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. టెలిమెడిసిన్, టెలి కన్సల్టేషన్‌ వంటి ఐటీ సాంకేతికతలను ఉపయోగించుకోవాలని, కేసుల సత్వర గుర్తింపుతో పాటు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని వివరించారు. కాంటాక్ట్‌ ట్రాకింగ్‌ సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారా వ్యాప్తిని అరికట్టే చర్యలపై శ్రద్ధవహించాలని, తక్కువ టీకా రేటు, ఎక్కువ కేసులున్న ప్రాంతాలకు బృందాలను పంపాలని ఆదేశించారు. రాత్రి కర్ఫ్యూ … కేంద్రం మార్గదర్శకాలు దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి వరకు దాదాపు మూడు వందలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు అనేక సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టి సారించాలని, ఒమిక్రాన్ ముప్పు వ్యాపించకముందే ఆంక్షలు అమలు చేయాలని సూచించారు. ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమలులో ఉండేలా చూడాలన్నారు.ముఖ్యంగా రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ కట్టడికి పండగల వేళ రాత్రి కర్ఫూలను అమలు చేయాలని, భారీ సభలు, సమూహాలను నియంత్రించాలని సూచించారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించి, నిబంధనలు అమలు చేయాలని పేర్కొన్నారు. బాధితుల నమూనాలను ఎప్పటికప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలన్నారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని, ఆస్పత్రుల్లో పడకల సామర్ధం, అంబులెన్ను, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. వైరస్ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ మాస్క్‌లు, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించేలా ప్రోత్సహించాలన్నారు. జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్ రేటు ఉన్న జిల్లాల్లో ఇంటింటి టీకా పంపిణీ కార్యక్రమం ముమ్మరం చేయాలని, రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, 100 శాతం టీకా పంపిణీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇలా ఉండగా, మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకూ ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా రానప్పటికీ వైరస్ కట్టడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ గురువారం రాత్రి నుంచే నైట్‌ కర్ఫ్యూ అమలుకు సిద్ధమయ్యారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లారి ఐదు గంటల వరకూ నైట్‌ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన చెప్పారు. అవసరమైతే మరిన్ని ఆంక్షలు పెడతామని చెప్పారు. 60 శాతం మందికి టీకాలు దేశ ప్రజల సహకారం, హెల్త్‌కేర్ వర్కర్ల నిస్వార్థ సేవతో దేశంలో ఇప్పటివరకు అర్హులైన 60 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఇది కాకుండా వయోజనుల్లో 89 శాతం మందికి మొదటి డోసు ఇవ్వడం పూర్తయిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత 24 గంటల్లో 70,17,671 డోసులు పంపిణీ అయ్యాయని, దీంతో దేశం మొత్తం మీద ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 139.70 కోట్లు దాటిందని తెలిపాయి.
కార్టూన్ కళ అందరికీ అబ్బదు. ఆ కళ అబ్బాలంటే శరీర కణాల్లో ప్రత్యేక జన్యు పదార్ధం వుండాలి. ఊన్నా , అది పనిచేయటానికి బ్యాటరీ తప్పనిసరి. కొందరికి ఆ బ్యాటరీ ఇంబిల్ట్ గా వుంటుంది. ఆ కొందరే, ప్రొఫెషనల్ కార్టూనిస్టులు. వాళ్ళ బ్యాటరీలు హై వోల్టేజ్ కరెంట్ పుట్టిస్తాయి. మామూలు రీచార్జబుల్ బ్యాటరీ తెగలో “హాబీ ” కార్టూనిస్టులం వుంటాం. వీళ్ళది మాత్రం చాలా పెద్ద సంఖ్య. మన తెలుగు “హాబీ” కార్టునిస్టుల గుంపు కి మించిన గుంపు దేశంలో మరెక్కడా లేదు. కారణం మన తెలుగు పాఠ కులే. వీళ్ళకి హ్యూమర్ సెన్సు ఎక్కువ. హాస్యరసం గుటకలేసుకు మింగుతారు. అందు చేతనే, తలిసెట్టి వారూ, బాపూ, సత్యమూర్తీలు తెలుగు గడ్డమీద హై వోల్టేజ్ బ్యాటరీలతో కార్టూను దీవిటీలు వెలిగించారు. కార్టూన్ కళాకారులని వందల సంఖ్య లో పుట్టించారు. ఆ వందల మందలో నేనూ ఒకడిని. ఈ పుస్తక రచయిత కమల్ కూడా. నేను, కమల్ కంటే వయసులో పెద్దవాడిని గనక అతడికి అప్పుడెప్పుడో ఒకట్రెండు సలహాలిచ్చాను, నాయనా, కార్టూన్ కి భావం ప్రధానం, వ్యాఖ్య ప్రాణం, బొమ్మ వూపిరి అని. నా సలహాలతో పాటు, తోడి కార్టునిస్ట్ మిత్రుల నుండి పొందిన స్ఫూర్తితో శ్రమించి, కమల్, కొన్ని వందల కార్టూన్లు అవలీలగా సృష్టించి పేరు తెచ్చుకుని స్ధిరపడ్డాడు. ఈ పుస్తకం చూస్తే మీకే అర్ధమౌతుంది, కమల్ స్పార్కున్న కార్టూనిస్టని. నేను ప్రతిసారీ, కార్టున్లు గీస్తున్నప్పుడు అనుకుంటుంటాను, ఈ ఫలానా కార్టూన్, ఇదే ఫస్టు, దీన్ని మరొకరు మార్చి గీయలేరు అని. ఆలాంటి కార్టూను ఒకటి ఏనుగు లక్ష్మణ కవి మీద గీసినది. ఇదేదో నభూతో నభవిష్యతి అనుకోకు మాష్టారూ, మేము కూడా ఒకటి అలవోకగా గీసేయ గలం అంటూ చాలెంజ్ విసిరాడు కమల్! లోపలి పేజీలు తిరగేయండి. ఏనుగు లక్ష్మణ కవి మీకు చిరునవ్వులు చిందిస్తాడు. మా కార్టూనిస్టులకి ఒకే రకం అయిడియాలు తరచూ తడుతుంటాయ్. కానీ, అవి, ఆయా కార్టునిస్టుల స్టాంపులతో వెలికి వచ్చి పాఠకులకి గిలిగింతలు పెడతాయి. కమల్ తన కార్టూన్లతో అది భేషుగ్గా, సాధించాడు. ఈ కార్టూన్లు తిలకించండి. స్లిప్ టెస్ట్, పత్రిక జీర్ణించుకునే పాఠకులు, అంతరిక్షంలో చెంబు, కీ మర్చిపోయిన కీలు గుర్రం వీరుడు, డబుల్ డెక్కర్ టీటీయీలు, పేపర్ స్టాండు వద్ద పేపర్ చదివే పెద్ద మనిషి, మురికి అల్లవుద్దీన్ తివాసీ, చంద్రబాబుతో మాహిష్మతి, బుక్ ఫేర్ లో భేతాళుడు, లిప్స్టిక్ మాస్క్, ఇవి మాత్రం, కమల్ స్పెషల్స్, అని తప్పక చెప్పి…తీరాలి. పుస్తకంలో, తక్కిన కార్టూన్లు అనేక వెరయిటీ సబ్జెక్ట్లకి సంబంధించినవి. కమల్ ఆలోచనా వైవిధ్యాన్ని మనకి విడమర్చి చెబుతాయి. గజేంద్ర మోక్షం, సుమతి శతకం, మానవ పరిణామం, వస్త్రాపహరణం, వేశ్యవాటిక, లావుపాటి ఆంటీ, కంటి డాక్టరు, ఇంకుడు గుంతా, ఒక్కటేమిటీ, అన్నీనూ!! ఈ సంకలనంలో కమల్ ఒక ప్రయోగం చేసాడు. మన తెలుగు వెలుగు గిరీశం మీద కార్టూన్లు అల్లాడు. ముళ్ళపూడి వారి అప్పరావు మీద తెలుగు కార్టూనిస్టులు ఆడుకున్నారు. కానీ, నాకు తెలిసి గురజాడ వారి గిరీశం మీద ఎవరూ సాహసం చేయలేదు. కమల్ తనవంతు ప్రయత్నం ధైర్యంగా చేసాడు. కన్యాశుల్కం బాగా చదివి వంట బట్టించు కుంటే గానీ ఇది సాధ్యం కాదు. కొన్ని కార్టూన్లు ఆలోచింప చేసేవి గా వున్నాయి. ఒపిక తో చదవాలి మరి. కమల్ సాధించిన ఈ అమూల్య సంకలనం పాఠకుల మనసులను రంజింపజేస్తుందన్న గట్టి నమ్మకం నాకుంది. చిరంజీవి కమల్ తన వ్యాసంగం కొనసాగిస్తూ, మరిన్ని కార్టూన్ సంకలనాలని తీసుకురావాలని ఆకాంక్షిస్తాను.
బుల్లితెర లో బిగ్ రియాలిటీ షో గ పేరున్న బిగ్ బాస్.ఎన్నో భారీ అంచనాల మధ్య 21 మంది కంటెస్టెంట్స్ తో మొదలయిపోయింది..అయితే కంటెస్టెంట్స్ అంత తమదయిన శైలి... అస్సలు మీ బాధ ఏంది రా ? .. రాహుల్ తో ఆషు రిలేషన్ పై షాకింగ్ కామెంట్స్..!! Uncategorized Editor - September 8, 2022 బుల్లితెర నటి అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ సమంతగా మంచి పేరు తెచ్చుకున్నఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈమె తన కెరియర్ మొద‌టిలో సోషల్... నేను చచ్చినా బిగ్ బాస్ షో కి వెళ్ళను…వేరే వాళ్ళను కూడా వెళ్లనివ్వను…వైరల్ అవుతున్న సింగర్ స్మిత కామెంట్స్… Latest News Sumanth - September 6, 2022 సింగర్ స్మిత ఒక ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు..అవి ఇపుడు బాగా వైరల్ అవుతున్నాయి..మాములుగా టెలివిషన్ షోస్ ని ఎంకరేజ్ చేసే స్మిత... బిగ్ బాస్ హౌస్ లో అపుడే మొదలయిన రచ్చ…గీత దాటుతున్న గీతు,షాక్ లో ఇనాయ…ఎమోషనల్ అవుతున్న రేవంత్..మాట మారుస్తున్న ఆదిరెడ్డి… Uncategorized Sumanth - September 6, 2022 బిగ్ బాస్ సీజన్6 సెప్టెంబర్ 4 న చాల గ్రాండ్ గ స్టార్ట్ అయింది.కింగ్ నాగార్జున పాట పాడుతూ, అమ్మాయి లతో డాన్స్ లు చేస్తూ హౌస్ టూర్... కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్…ఎంతో తెల్సా??? Uncategorized Sumanth - September 6, 2022 బిగ్ బాస్ సీజన్ 6 ఆల్రెడీ మొదలయింది.నాగార్జున తన జోష్ తో,డాన్స్ తో ,సింగింగ్ తో ఈ సీజన్ స్టార్ట్ చేసారు.కంటెస్టెంట్స్ అందరు ఒకొకరుగా హౌస్ లో కి ఎంటర్ అయ్యారు.వారెవరంటే...
అనుకోకుండా జరిగిన పరిచయం, తక్కువ కాలంలోనే స్నేహంగా మారింది. ఇప్పుడింక ఓ మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది. స్వతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్టు కార్యకర్త, పాత్రికేయుడు, రచయితా అయిన పరకాల పట్టాభిరామారావు తన తొంభై మూడో ఏట విజయవాడ లోని తన స్వగృహంలో గతవారం కన్నుమూశారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచీ, ఏపని చేస్తున్నా ఏదో ఒక సమయంలో పట్టాభిరామారావు గుర్తొస్తూనే ఉన్నారు. ఇకపై గుర్తొస్తారు కూడా. ఎందుకంటే, ఆయన్ని మర్చిపోవడం అంత సులువు కాదు. ఓ వేసవి సాయంకాలం విజయవాడ బందరు లాకులు దగ్గర ఉన్న స్వాతంత్ర సమరయోధుల భవనంలో మొదటిసారి కలిశాం ఇద్దరం. మిత్రులెవరో ఆయన్ని పరిచయం చేశారు. సన్నగా, తెల్లగా, చురుగ్గా ఉండే పట్టాభిరామారావు గారితో పరిచయం, స్నేహం వరకూ వెడుతుంది అని అస్సలు అనుకోలేదు నేను. కానీ, ఆయన స్నేహశీలి. ఏవిషయం మీదైనా తన అభిప్రాయాలని సూటిగా చెప్పేవారు. అలాగని ఎవరినీ నొప్పించే వారు కాదు. 'ఇలా ఎలా సాధ్యం?' అన్న ఆలోచన కలిగేది, ఒక శ్రోతగా ఆయన మాటలు వింటున్నప్పుడు. "సిద్ధార్ధ కాలేజీ ఎదురు సందులో కొంచం ముందుకి వస్తే, ఎడమ వైపు ఉంటుంది మా ఇల్లు. వాకిట్లో అరటి చెట్లు ఉంటాయి. అదీ గుర్తు. వీలు చూసుకుని ఒకసారి రండి.." ఈ ఆహ్వానం వచ్చిన కొన్నాళ్ళకి వెళ్ళగలిగాను. అరటి చెట్లే కాదు, ఇంకా చాలా మొక్కలు కూడా కనిపించాయి. చాలా సింపుల్ గా ఉన్న ముందు గదిలో నాలుగు నిలువెత్తు చెక్క బీరువాలు. వాటి నిండా కిక్కిరిసిన పుస్తకాలు. చూపు తిప్పుకోవడం నా వల్ల కాలేదు. "మీరూ చదువుతారు కదూ?" ఆ పుస్తకాలు చూస్తూ వెనుక నుంచి వచ్చిన ప్రశ్న వినగానే సిగ్గనిపించింది ఒక్క క్షణం. ఊహించినట్టుగానే, ఎక్కువగా కమ్యూనిస్టు సాహిత్యం. గురజాడ రచనలతో పాటు, వాటిమీద వచ్చిన సాహిత్యం దాదాపు మొత్తమంతా కనిపించింది. అయితే, గురజాడని గురించి ఆయనతో మాట్లాడడానికి మరికొన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది. నేనింకా పుస్తకాలు చూడడం పూర్తవ్వక ముందే, "మా పక్కింటి ఆయన్ని పరిచయం చేస్తాను, మై గుడ్ నైబర్," అంటూ నవ్వారు. ఇద్దరం పక్క గేటు తీసుకుని లోపలి వెళ్ళేవరకూ, నా ముఖం మీద ప్రశ్నార్ధకం వేళ్ళాడుతూనే ఉంది. రంగు రంగుల పెయింట్ ముగ్గుల లోగిలి. చాలా అభిరుచితో డిజైన్ చేసినట్టు తెలిసి పోతోంది. గృహస్తు వచ్చారు. "వేగుంట మోహన్ ప్రసాద్ గారు.. 'మో' పేరు వినే ఉంటారు.." అంటూ పరిచయం చేసేశారు పట్టాభిరామారావు గారు. శ్రీశ్రీ కవిత్వం.. వాళ్ళిద్దరికీ కూడా చాలా ఇష్టమైన విషయం. నేను కేవలం శ్రోతని.. మధ్య మధ్యలో పృచ్ఛకుడిని కూడా. పట్టాభిరామారావు గారు "మీరు" నుంచి "నువ్వు" లోకి రాడానికి మరికొంత సమయం పట్టింది. అప్పుడు వచ్చింది గురజాడని గురించి సుదీర్ఘమైన చర్చ. మధురవాణి, పూర్ణమ్మ, మెటిల్డా ... వీళ్ళంతా అయ్యాక... "అసలు జాతీయ గీతంగా ఉండాల్సింది వందేమాతరం కాదు..జనగణమన కూడా కాదు..'దేశమంటే మట్టికాదోయ్..' ఈ గేయాన్ని అన్ని భాషల్లోకీ అనువదించాలి. స్కూలు పిల్లల చేత రోజూ పాడించాలి. అప్పుడే వాళ్లకి తెలుస్తుంది దేశం అంటే ఏమిటో. కష్ట పడితే మాత్రమే తిండి దొరుకుతుందని పిల్లలకి చెప్పకపోతే ఎలా?" అనడమే కాదు, ఆవైపు ఆయన కొంత కృషి కూడా చేశారు. నేను స్థావరాన్ని కాక, జంగమాన్ని కావడంతో ఊరు మారిపోయాను. అయితే ఏం, గ్రాహంబెల్ పుణ్యమా అని ఫోన్ ఉంది కదా. "నేనూ.. పట్టాభిరామారావుని మాట్లాడుతున్నాను. పరవాలేదా? మాట్లాడొచ్చా?" అని ప్రశ్నతో మొదలైన సంభాషణలు గింగురుమంటున్నాయి. 'మహిళాభ్యుదయం' ఆయనకి చాలా ఇష్టమైన విషయం. చాలా రీసెర్చ్ చేశారు కూడా. ఎంతటి విషయాన్నైనా వివాదం వరకూ వెళ్ళకుండా సంభాషణ నడపడం ఆయన ప్రత్యేకత. ఆయనలో ఉత్సాహమే తప్ప, నిరుత్సాహాన్ని చూడలేదు నేను. నాలుగు నెలల క్రితం 'నిర్జన వారధి' చదివినప్పుడు ఆ పుస్తకంలో ఆయన ప్రస్తావన చూడగానే మాట్లాడాలి అనిపించి కాల్ చేశాను. నిద్ర పోతున్నారనీ ఆరోగ్యం బాగుండడం లేదనీ చెప్పారు ఇంట్లో వాళ్ళు. "ఓసారి వెళ్లి చూసి రావాలి," అనుకున్నాను. వీలవ్వలేదు. ఇలాంటివి వెంటనే చేసేస్తే, జీవితాంతం వెంటాడే కొన్ని గిల్ట్ లకి దూరం అయిపోతాం కదూ... వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 11:04 PM 7 కామెంట్‌లు: లేబుళ్లు: నివాళి సోమవారం, జనవరి 28, 2013 చందనపు బొమ్మ వర్తమాన తెలుగు కథ అనగానే అయితే అస్థిత్వ, ప్రాంతీయ వాద కథలు, కాకపొతే నాస్టాల్జియా కథలే కనిపిస్తున్న తరుణం ఇది. ఈ ధోరణికి పూర్తి భిన్నంగా వైవిధ్య భరితమైన పది కథలతో వర్ధమాన రచయిత్రి అరుణ పప్పు వెలువరించిన సంకలనం 'చందనపు బొమ్మ.' ఆంధ్రజ్యోతి పత్రికలో ఫీచర్స్ రిపోర్టర్ గా పనిచేస్తున్న అరుణ, 'అరుణిమ' బ్లాగర్ గా బ్లాగు ప్రపంచానికి సుపరిచితులు. జనవరి 2009 నుంచి అక్టోబర్ 2011 వరకూ వివిధ పత్రికల్లో అచ్చైన కథలని (ఎక్కువగా ఆంధ్రజ్యోతి లోనే) దాదాపు రాసిన వరుసలోనే సంకలనం చేశారు కడపకి చెందిన రాష్ట్ర కథానిలయం వారు. వీరి తొలి ప్రచురణ ఇది. ఏకబిగిన కథలన్నీ చదివేసి పుస్తకం పూర్తి చేసేద్దాం అనుకున్న నన్ను, ఆరో కథ 'చందనపు బొమ్మ' ఆపేసింది. చందనపు బొమ్మతో ఆడుకునే ఓ చిన్నపిల్ల కథ. చదవడం పూర్తవ్వగానే ఆలోచన మొదలవ్వడంతో, పుస్తకాన్ని ఎప్పుడు పక్కన పెట్టానో కూడా గమనించ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే కదిలించే కథనం. చైల్డ్ సైకాలజీ ఆధారంగా అల్లిన ఈ కథ ముగింపు ఊహించ గలిగేదే అయినప్పటికీ, కథ నడిపిన తీరు కట్టి పడేసింది. కొంత విరామం తర్వాత మిగిలిన కథలు పూర్తి చేశాను. నిజానికి, ఈ సంకలనం గురించి చెప్పేప్పుడు మొదట ప్రస్తావించాల్సిన కథ 'వర్డ్ కేన్సర్.' పేరులాగే, కథ కూడా వైవిధ్య భరితంగా ఉంది. వాక్యాల ప్రవాహం ఈ కథ. క్రమం తప్పకుండా సాహిత్యం చదివే అలవాటు ఉన్న వాళ్ళని బాగా ఆకట్టుకునే కథ.మళ్ళీ మళ్ళీ చదివిస్తుంది కూడా. పుస్తకాలకి సంబంధించిన మరో కథ 'కరిగిపోయిన సైకత శిల్పం.' పుస్తకాలనీ, వాటిని చదివే వాళ్ళనీ కూడా ఎంతగానో ప్రేమించే ఓ పుస్తకాల షాపు యజమాని కథ ఇది. కథ చదువుతున్నంత సేపూ నాకు తెలిసిన పుస్తకాల షాపుల యజమానులు అందరూ వరుసగా గుర్తొచ్చారు. కథలో ప్రధాన పాత్ర 'ఆచార్య' లో వాళ్ళంతా ఎక్కడో అక్కడ కనిపించారు కూడా. ప్రయాణాలు అంటే నాకు ఉన్న ఇష్టం వల్ల కావొచ్చు, 'భ్రమణ కాంక్ష' కథ బాగా నచ్చేసింది. ప్రదేశాలని కాక, ప్రపంచాన్ని చూడాలని కోరుకునే నవనీత రెడ్డి వెంటాడతాడు పాఠకులని. అంతే కాదు, 'మనసుంటే మార్గం ఉంటుంది' అన్న మాటా గుర్తొస్తుంది. 'ఒక బంధం కావాలి' 'లోపలి ఖాళీలు' కథలు రెండూ మనస్తత్వాన్ని ఆధారం చేసుకున్నవి. మొదటిది మానసికంగా ఎదగని ఓ కుర్రవాడి కారణంగా అతని తండ్రి జీవితంలో వచ్చిన మార్పుని చిత్రిస్తే, రెండోది తలచుకుంటే దేనినైనా సాధించే పట్టుదల ఉన్న విద్యావంతుడికి తన భార్య విషయంలో ఎదురైన సందిగ్ధాన్ని చర్చించింది. పది కథల్లోనూ ఆరు కథలు జర్నలిజం నేపధ్యంతో నడుస్తాయి. పాత్రికేయ కోణం నుంచి ప్రపంచాన్ని చూసే ప్రయత్నంగా చెప్పొచ్చు వీటిని. తొలికథ 'ఎవరికి తెలియని కథలివిలే' లో ప్రధాన కథతో పాటు, తన వృత్తిలో ఇబ్బందులనీ సందర్భానుసారం ప్రస్తావించారు రచయిత్రి. ఓ రచయితకీ, ఓ మహిళా జర్నలిస్ట్ కీ ఏర్పడ్డ స్నేహం 'ఏకాంతంతో చివరిదాకా' కథ. "అనేకమైన వరాలిమ్మని దేవుణ్ణి కోరుకుంటాం. కానీ దేవుడినే కొరుకోం. ఆయనే వచ్చి అకస్మాత్తుగా ఇలాంటి ఆలోచనుందని చెప్పినా తట్టుకోలేం," లాంటి వెంటాడే వాక్యాలు చాలానే ఉన్నాయి ఈ కథల్లో. మూడు నాలుగేళ్ల క్రితం వరుసగా జరిగిన కొన్ని సంఘటనలు ఆధారం చేసుకుని రాసిన 'ఈ కానుక నేనివ్వలేను.' మృత్యువు నేపధ్యంగా సాగే కథ అవ్వడంతో ఆకర్షించింది నన్ను. అయితే, కాలపరీక్షకి ఎంతవరకూ నిలబడుతుంది అన్నది చూడాలి. ఈకథలో సంభాషణలు ఉపన్యాస ధోరణిలో ఉండడం కొరుకుడు పడదు. అలాగే, మొత్తం సంకలనం చదివాక, '24/7 క్రైమ్ ఇప్పుడిదే సుప్రీం' కథని రచయిత్రి ఇంకా చాలా బాగా రాయగలరు అనిపించింది. అంతగా ఆకట్టుకోని కథ ఇది. కథల్లో మొదటగా ఆకర్షించేది రచయిత్రి వాడిన భాష. చక్కని తెలుగు, చదివించే వచనం. కొన్ని కొన్ని వాక్యాలయితే ఆగి, వెనక్కి వెళ్లి మళ్ళీ చదువుకునేలా ఉన్నాయి. రాసిన క్రమంలోనే సంకలనంలో కథలు అచ్చు వేయడం వల్ల, కాలంతో పాటు రచయిత్రి శైలి పదునెక్కడాన్నిగమనించ గలుగుతాం. అయితే, మనస్తత్వ చిత్రణలో రచయిత్రి మరికొంత పట్టు సాధించాల్సి ఉంది. ఉత్తరాంధ్రకి చెందిన రచయిత్రి సంకలనం అనగానే, ఆ మాండలీకంలో ఒక్క కథన్నా ఉంటుందని ఎదురు చూశాను కానీ, కథలన్నీ నగరాల చుట్టూనే తిరిగాయి. ప్రింటింగ్ బాగుంది, అచ్చు తప్పులు తక్కువే. రానున్న రోజుల్లో అరుణ పప్పు నుంచి మంచి కథలని ఆశించ వచ్చు అన్న నమ్మకాన్ని కలిగించిన సంకలనం ఇది. ('చందనపు బొమ్మ,' పేజీలు 104, వెల రూ. 120, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు మరియు కినిగె.కామ్ లో లభ్యం) వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 8:57 PM 6 కామెంట్‌లు: లేబుళ్లు: సాహిత్యం ఆదివారం, జనవరి 27, 2013 స్వాతి కిరణం సరిగమలతో చదరంగమాడగలిగే గాయకుడు అనంతరామ శర్మ. గజారోహణలూ, గండ పెండేర సత్కారాలూ ఆయనకి నిత్య కృత్యాలు. ఆయన తీసిందే రాగం, పాడిందే సంగీతం. ప్రభుత్వం ఇచ్చే అవార్డుని తిరస్కరించే - అహంభావంలాగా అనిపించే - ఆత్మగౌరవం ఆయనకి అలంకారం. అటువంటి సంగీత స్రష్టకి సవాలు విసురుతాడు గంగాధరం. ఓ పల్లెటూళ్ళో పుట్టి పెరుగుతూ, సరదాగా సంగీతం నేర్చుకునే పన్నెండేళ్ళ బాల గాయకుడు. అనంతరామ శర్మలో పేరుకుపోయిన అసూయని ప్రపంచానికి తెలిసేలా చేసి, ఆ విద్వాంసుడు తనని తాను తెలుసుకునేలా చేసిన వాడు. ఇందుకోసం గంగాధరం పణంగా పెట్టింది ఏమిటన్నదే, ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం కళాతపస్వి కె. విశ్వనాథ్ రూపొందించిన 'స్వాతికిరణం' సినిమా. అనంతరామ శర్మ పాత్రకి మళయాళ నటుడు మమ్ముట్టి ప్రాణ ప్రతిష్ఠ చేయగా, ఆయన భార్య శారదగా రాధిక పోటీ పడి నటించింది. గంగాధరం పాత్రని, అప్పటికే చిన్న తెరమీద 'మాల్గుడి డేస్' హీరోగా అందరికీ పరిచయమైన మాస్టర్ మంజునాథ్ అలవోకగా పోషించాడు. కాఫీ హోటల్ నడుపుకునే 'బాబాయ్' దంపతులకి (ధర్మవరపు సుబ్రహ్మణ్యం, డబ్బింగ్ జానకి) లేక లేక పుట్టిన కొడుకు గంగాధరం. కుర్రాడికి సంగీతం మీద ఉన్న ఆసక్తి చూసి, ఊళ్ళో సంగీతం పాఠాలు చెప్పే పక్షితీర్ధం మామ్మగారి (జయంతి) దగ్గర సరిగమలు నేర్పిస్తూ ఉంటారు. బహుశా, జన్మ సంస్కారం వల్ల కావొచ్చు, సంగీతం అలవోకగా అలవడుతుంది గంగాధరానికి. బాల్య చాపల్యాలు ఇంకా పోనప్పటికీ, 'కొండా కోనల్లో.. లోయల్లో...' అతను గొంతు విప్పాడంటే శ్రోతలు పరిసరాలనే కాదు, ఇహాన్నీ మర్చిపోతారు. ఆ ఊరి కోవెల్లో జరిగే ఉత్సవాలకి అనంతరామ శర్మగారిని ఆహ్వానిస్తారు ఆలయం వారు. భార్యా సమేతుడై వచ్చిన ఆయన, పక్షితీర్ధం మామ్మగారి ఇంట్లో బస చేస్తారు. శర్మ గారి సమక్షంలో పాడడం కోసం, పక్షితీర్ధం ఆవిడ ప్రత్యేకంగా నేర్పించిన 'తెలిమంచు కరిగింది...' పాటని గంగాధరం పాడుకుంటూ ఉండగా, ఆ పాట వింటూ స్నానం, అర్చనాదికాలు పూర్తిచేసుకున్న శారదకి మొదటి పరిచయంలోనే గంగాధరం మీద పుత్రవాత్సల్యం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు ఉన్న భర్తా, తరాల పాటు తిన్నా తరగని సంపదా ఉన్నప్పటికీ, పిల్లలు కలగలేదన్న లోటు మిగిలిపోయింది ఆవిడకి. ఆలయంలో అనంతరామ శర్మ మంత్రపుష్పాన్ని రాగవరస మార్చి పాడడం తట్టుకోలేని గంగాధరం, తనూ అదే పని చేస్తాడు ఆయన ఎదట. గంగాధరాన్ని మాత్రమే కాదు, శిష్యుడిని అలా తయారు చేసినందుకు పక్షితీర్ధం ఆవిడనీ చెరిగి వదిలిపెడతారు శర్మగారు. ఎప్పుడూ పల్లెత్తు మాట అనని తండ్రి కూడా తనని తప్పు పట్టేసరికి, క్షమాపణ అడగడానికి శర్మగారి ఊరికి బయలుదేరతాడు గంగాధరం. శారద సలాహా మేరకు సంగీత అకాడమీ స్కాలర్షిప్ కోసం జరిగే పరిక్షకి వెడతాడు కానీ, అక్కడ విద్యార్ధులని ఎంపిక చేసేది అనంతరామ శర్మే కావడంతో స్కాలర్షిప్ దక్కదు గంగాధరానికి. అయితే, శారద ఆర్ధిక సహకారంతో సంగీతం నేర్చుకుని, కచేరీలు మొదలు పెడతాడు. గంగాధరానికి పేరు రావడం మొదలవ్వడంతో, అసహనం మొదలవుతుంది అనంతరామ శర్మలో. 'గురు పౌర్ణమి' సందర్భంగా, శర్మగారి శిష్యులు ఆయనకి ఏర్పాటు చేసిన సన్మాన సభకి హాజరైన గంగాధరం, శర్మగారి 'ఏకలవ్య' శిష్యుడిగా తనని తాను పరిచయం చేసుకుని 'ఆనతినీయరా...' పాటని చిరుకానుకగా సమర్పిస్తాడు. గంగాధరం ఉపయనయం తన ఇంట్లో ఘనంగా జరిపించిన అనంతరామ శర్మ, అతన్ని తన ఇంట్లోనే ఉండిపొమ్మని చెప్పడంతో, ఎంతగానో సంతోషిస్తుంది శారద. అయితే, గంగాధరానికి పెరుగుతున్న పేరు ప్రతిష్టలు అనంతరామ శర్మకి ఏమాత్రం సంతోషం కలిగించక పోగా, అసూయనీ, ద్వేషాన్నీ పెంచుతాయి. వాటిని ఎక్కువ రోజులు దాచుకోలేక పోతాడు కూడా. ఉన్నట్టుండి ఒక రోజున గంగాధరం మీద విరుచుకు పడి, ఆపై స్పృహ తప్పి పడిపోతాడు. అటు భర్త, ఇటు పుత్ర సమానుడు.. ఇద్దరి మధ్యా నలిగిపోతుంది శారద. ఆమె పసుపు కుంకుమలకి లోటు రానివ్వని మాట ఇచ్చిన గంగాధరం, అందుకోసం ఏం చేశాడు అన్నది కదిలించే ముగింపు. కేవలం ఈ ముగింపు కారణంగానే ఈ సినిమా ప్రేక్షకులకి చేరువ కాలేక పోయింది అంటారు. (రిలీజైన మూడో రోజు, నాతో కలిపి ఎనిమిది మంది ఉన్నారు మొత్తం థియేటర్లో). ఈ ముగింపుని ఓ పట్టాన అంగీకరించలేము. ముగింపు మార్చిఉంటే, సినిమా బాగుండేదా అన్న ప్రశ్నకి సరైన సమాధానం దొరకదు. విశ్వనాథ్ కథకి, తన మార్కు సంభాషణలు అందించారు జంధ్యాల. ఎప్పటిలాగే, సినిమా ముగింపు సన్నివేశానికి తను మాత్రమే రాయలగలిగే మాటలతో నిండుతనం తెచ్చారు. ఇది సంగీత ప్రధాన చిత్రం. కథే శాస్త్రీయ సంగీత కళాకారుడి అంతర్మధనం కావడంతో మంచి సంగీతానికీ, సాహిత్యానికీ చక్కని అవకాశం దొరికింది. సహాయకుడు పుహళేంది తో కలిసి వినసొంపైన సగీతం అందించారు కెవి మహదేవన్. (ఇది 'మామ' సంగీతం అందించిన చివరి సినిమా) గాయని వాణీ జయరాం ప్రతిభని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్న సినిమా ఇది. ఒకరకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి 'శంకరాభరణం' ఎలాగో, వాణీ జయరాం కి 'స్వాతి కిరణం' అలాగ. ఎప్పటికీ నిలిచిపోయేవే పాటలన్నీ. 'ఆనతినీయరా...' పాటకి జాతీయ అవార్డు అందుకున్నారు వాణీ జయరాం. నటీనటుల దగ్గరికి వస్తే మొదటగా చెప్పుకోవాల్సింది రాధికని గురించి. భర్తచాటున ఉంటూనే తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే ఇల్లాలిగా శారద పాత్రలో అనితర సాధ్యమైన నటనని ప్రదర్శించింది రాధిక. 'స్వాతిముత్యం' తర్వాత ఆ స్థాయి నటనని ప్రదర్శించే అవకాశం ఉన్న పాత్ర దొరికింది ఆమెకి. భర్త పాండిత్యాన్నీ, పేరు ప్రతిష్టల్నీ చూసి గర్వ పడే ఇల్లాలిగా, గంగాధరంపై పుత్ర వాత్సల్యం చూపుతూ, అతని ప్రతిభా పాండిత్యాలని నిష్కపటంగా అభినందించే తల్లిగానూ, భర్త ఆవేశం బయట పడ్డ క్షణం నుంచీ వాళ్ళిద్దరి మధ్యా నలిగిపోయే సన్నివేశాల్లోనూ చక్కని నటన ప్రదర్శించింది రాధిక. పరభాషా నటుడైనా పదహారణాల అనంతరామ శర్మ పాత్రలో అచ్చంగా ఒదిగిపోయాడు మమ్ముట్టి. ఆ పాత్ర తాలూకు భావోద్వేగాల్ని కేవలం కనుబొమల కదలికల ద్వారా చూపిన తీరుని మర్చిపోలేం. గంగాధరం పాత్రలో మంజునాథ్ ని కాక మరొకరిని ఊహించలేం. విశ్వనాథ్ ఈ సినిమాకి దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా (పేరు వేసుకోలేదు). షూటింగ్ కొంత భాగం రాజమండ్రి దగ్గరా, ఎక్కువ భాగం శ్రీ కాళహస్తి పరిసర ప్రాంతాల్లోనూ జరిగింది. ఇటు గోదారి అందాలనీ, అటు సీమ సౌందర్యాన్నీ ఒకే ఫ్రేములో చూడగలం. తనకి ఇష్టమైన ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలోనే కథ చెప్పారు విశ్వనాథ్. మలయాళ కుర్రహీరోని నడివయసు అనంతరామ శర్మగా మార్చి ఒప్పించేశారు. కొన్ని కాఫీ హోటల్ సన్నివేశాలు కేవలం హాస్యం కోసమే పెట్టినవి. ఎప్పటిలాగానే తెలుగు సినిమాల మీద సెటైర్లు వేయించారు వాటిలో. శాస్త్రీయ సంగీతపు ఔన్నత్యాన్ని చిత్రిస్తూ 'శంకరాభరణం' తీసిన దర్శకుడు, అదే రంగంలో ఉండే ఈర్ష్యాసూయలు కథా వస్తువుగా తీసుకుని సినిమా తీయడంతో సహజంగానే కొంత విమర్శ వచ్చింది. బాహాటంగా ఒప్పుకోకపోయినా, అన్నిరంగాలలోనూ ఉన్నట్టే సంగీత రంగంలోనూ అసూయాద్వేషాలు ఉన్నాయన్నది చాలామంది చెప్పిన మాట. మంచి సినిమాలు ఇష్టపడే వాళ్ళు చూడాల్సిన సినిమా ఇది. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 8:39 PM 14 కామెంట్‌లు: లేబుళ్లు: సినిమాలు శుక్రవారం, జనవరి 25, 2013 పరిమళించిన 'పద్మం' పద్మానికి పరిమళం అబ్బింది. నీలి మేఘాలలో, గాలి కెరటాలతో కలిసిన ఆ పరిమళం పద్మానికి కొత్త గౌరవాన్నీ, సౌరభాన్నీ తెచ్చింది. అభిమాన స్వర రాణి ఎస్. జానకి కి కేంద్ర ప్రభ్వుతం కొంచం ఆలస్యంగానే అయినా 'పద్మభూషణ్' అవార్డుని ప్రకటించింది. గడిచిన యాభై ఐదేళ్లుగా సినీ సంగీతాన్ని అభిమానించే భారతీయులందరినీ తన స్వర మాయాజాలంలో కట్టి పడేసిన ఈ నిరాడంబర గాయనికి ఇన్నాళ్ళుగా పద్మ అవార్డు రాకపోవడం అన్నది, ఆ అవార్డుకే ఒక లోటు. ఇవాల్టితో అది తీరింది. తన పందొమ్మిదో ఏట తమిళ, తెలుగు సినిమాలకి పాటలు పాడడంతో నేపధ్య గాయనిగా కెరీర్ ప్రారంభించిన జానకి వెనుతిరిగి చూసింది లేదు. కేవలం కథా నాయికకి మాత్రమే పాడాలనో, కేవలం ఒక తరహా పాటలు మాత్రమే పాడాలనో ఆమె పరిమితులు విధించుకోలేదు. తనకి వచ్చిన పాటని ఎంతబాగా పాడి మెప్పించ గలను అని మాత్రమే ఆలోచించారు. ఓ పక్క కథా నాయికలకి పాడుతూనే, మరోపక్క వ్యాంప్ పాత్రలకీ పాడారు జానకి. "ఏం? ఈ పాటలు పాడకపోతే భోజనం దొరకదా?" లాంటి ఘాటైన విమర్శలకి లెక్కలేదు. వాటన్నింటికీ, మాటలతో కాక, పాటలతో మాత్రమే జవాబు చెప్పారు జానకి. అన్ని రకాల పాటలనీ పాడగలగడం, అన్ని రసాలనీ తన గొంతు అలవోకగా పలికించ గలగడం జానకికి దొరికిన వరాలు. వీటి ఫలితమే ఇరవై వేలకి పైగా పాటలు, నాలుగు జాతీయ పురస్కారాలు, లెక్కకు మిక్కిలిగా రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచే పది నంది అవార్డులు అందుకున్నారు జానకి. ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ... దక్షిణ భారత సినీ సంగీతంలో ఈ త్రయం చేసిన ప్రయోగాలకి లెక్కలేదు. మరీ ముఖ్యంగా శృంగార రస ప్రధానమైన గీతాలకి బాలూ, జానకిల యుగళం పెట్టింది పేరు. దానికి లయరాజు స్వరాలు తోడైతే ఇక చెప్పేదేముంది.. 'మౌనమేలనోయి?' అన్న ప్రశ్న సర్రున దూసుకు వచ్చేయదూ. క్లిష్టమైన గమకాలని పలికించడమే కాదు, చిన్న చిన్న సంగతులతో పాటకి కొత్త అందం తేవడంలోనూ జానకి అందె వేసిన చేయి. ఆమె పాటలు వినేవాళ్ళకి ఈ విషయం ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు. ఇళయరాజా ఆర్కెస్ట్రాలో ఎక్కువ పాటలు పాడిన రికార్డు జానకిది. అలాగనే ఆమె కేవలం కొందరు స్వరకర్తలకి పాడడానికే పరిమితమై పోలేదు. నాటి చలపతిరావు నుంచి, నేటి రెహ్మాన్ వరకూ ఎందరో సంగీత దర్శకుల స్వరాలకి ఆమె తన గళాన్ని అద్దారు. వర్ధమాన గాయకులకి రిఫరెన్స్ అనదగ్గ పాటలెన్నో జానకి ఖాతాలో ఉన్నాయి. అయితే, జానకిని అనుకరించడమే కాదు, అనుసరించడమూ కష్టమే. ఎందుకటే ఆమెది ఓ ప్రత్యేకమైన బాణీ. అనితర సాధ్యమైన వాణి. టీవీల పుణ్యమా అని గత కొన్నేళ్లుగా గాయనీగాయకులు 'పాడడాన్ని' చూడగలుగు తున్నాం మనం. పాటకు అనుగుణంగా పాదం కదిపేవారూ, పాటతో సంబంధం లేకుండా విన్యాసాలు చేస్తూ పాడే వాళ్ళూ అనేక మందిని చూస్తున్నాం. తన గొంతులో ఎన్నెన్నో హొయలని ఒలికించే జానకి పాడడం చూసినప్పుడు మాత్రం "అసలీమె పెదాలు కదులుతున్నాయా?" అన్న సందేహం కలిగి తీరుతుంది. అలాగని పాడే పాటల్లో 'ఊపు' కి లోటు ఉండదు. అదో ప్రత్యేకమైన విద్య బహుశా. పసిపిల్ల, పండు ముదుసలి, తొలి యవ్వనంలో ఉన్న బొంగురు గొంతు కుర్రవాడు... ఇలా ఎవరి గొంతునైనా ఇట్టే పట్టేసి, తనది చేసుకుని పాడడం జానకికి ఉన్న మరో ప్రత్యేకత. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడాన్ని మాటల్లో చెప్పకుండా, ఆచరణలో చూపడం ఆమె వ్యక్తిత్వానికి సూచిక. జానకి ఇంకా ఎన్నో, ఎన్నెన్నో పాటల్ని పాడాలనీ, అత్యున్నత పురస్కారాల్ని అందుకోవాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ, 'పద్మ' అవార్డు సందర్భంలో ఆమెకి హృదయ పూర్వక అభినందనలు. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 10:50 PM 6 కామెంట్‌లు: లేబుళ్లు: వర్తమానం గురువారం, జనవరి 24, 2013 నాలుగడుగులు... చూస్తుండగానే మరో పుట్టినరోజు వచ్చేసింది. మనం ఏం చేసినా,చెయ్యకపోయినా 'నేనున్నా' అంటూ వచ్చేసే వాటిలో ఇదిగో ఈ పుట్టినరోజు కూడా ఒకటి. అలా వచ్చేసినందుకైనా మనం మన పనులు కాసేపు పక్కన పెట్టి, గడిచిన ఏడాది కాలాన్ని ఓసారి సింహావలోకనం చేసుకోవాలి. తప్పులూ, ఒప్పులూ, లెక్ఖలూ, పత్రాలూ ఓసారి తిరగేసేయాలి. అప్పుడు, ఆ జరిగిపోయిన వాటినుంచి రేపటి కోసం పనికొచ్చేవి ఏమన్నా ఉన్నాయేమో వెతుక్కోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే, 'నెమలికన్ను' కి నాలుగేళ్ళు నిండి ఐదో ఏడు వచ్చేసింది. మొదటి మూడు సంవత్సరాలతో పోల్చినప్పుడు, అతి తక్కువ బ్లాగు పోస్టుల ద్వారా రికార్డు సృష్టించడం జరిగింది ఈ నాలుగో సంవత్సరంలో. సగటున వారానికి ఒక్క పోస్టు కన్నా తక్కువే. ఏ నెలలోనూ కూడా డబల్ డిజిట్ పోస్టులు రికార్డు అవ్వలేదు. ఒకప్పుడు ఉద్ధృతంగా వచ్చి పడిన టపాలు, ఇప్పుడు ఎందుకిలా మందగించాయీ అంటే గబుక్కున జవాబు చెప్పడం కష్టం. 'ఇన్ని టపాలు ఎందుకు రాశావు?' అన్న ప్రశ్నకి ఇదమిద్దమైన సమాధానం ఉండనట్టే, 'ఎందుకు రాయలేదు?' అన్న ప్రశ్నకీ ఉండదు మరి. మొదటినుంచీ 'నెమలికన్ను' ని వెన్నంటి ఉన్న అదృష్టం ఒకటి ఉంది. పాఠకుల ఆదరణ. బ్లాగులో వచ్చిన టపాలు చదివి నిర్మొహమాటంగా అభిప్రాయాలు పంచుకోవడమే కాదు, తప్పులని సున్నితంగా ఎత్తి చూపడం, ఎప్పుడన్నా కొంతకాలం పాటు విరామం వచ్చేస్తే ఏమైందంటూ ఆదరంగా ఆరా తీయడం...ఇవన్నీ బ్లాగు పాఠకుల నుంచి అందుతున్న కానుకలు. కొత్తగా ఈ బ్లాగుని కనుగొన్న వాళ్ళు ఉత్తరాల ద్వారా అభిప్రాయాలు చెబుతున్నారు. అలాగే, చదవదగ్గ పుస్తకాలని గురించీ సమాచారం వస్తోంది. ఈ బ్లాగుకి సంబంధించి గడిచిన సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. వారి వారి పుస్తకాలని గురించి బ్లాగులో వచ్చిన టపాలు చదివిన కొందరు రచయితలు ఉత్తరాల ద్వారా అభినందనలు అందజేశారు. వారి సంస్కారానికి ధన్యవాదాలు. నేను ఎంతగానో ఇష్టపడే రచయిత నుంచి వచ్చిన ఉత్తరమూ వాటిలో ఉంది. కొంచం తరచుగా బ్లాగు రాయాలని మరీ మరీ అనిపించిన సందర్భం అది. పుట్టినరోజుని పురస్కరించుకుని, బ్లాగు మిత్రులతో పంచుకోవాలనిపించిన కబురు ఇది. అలాగే, క్రమం తప్పకుండా బ్లాగు చదివే కొందరు పాఠకులతో కామెంట్ బాక్స్ లో మొదలైన పరిచయం మెయిల్ బాక్స్ కి విస్తరించింది. 'శర్కరి' బ్లాగులో ఎంపిక చేసిన వంద టపాల్లో, 'నెమలికన్ను' కీ చోటిచ్చారు. ధన్యవాదాలు జ్యోతిర్మయి గారూ. చదువు దగ్గరికి వస్తే, గడిచిన సంవత్సరాల కన్నా ఈ ఏడాది పుస్తక పఠనం తక్కువే. కొని, చదవకుండా ఉంచేసిన పుస్తకాలే ఇందుకు సాక్ష్యం. చదివిన కొన్నింటిలో బాగా నచ్చేసినవి ఆత్మకథలు. కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ 'నిర్జన వారధి' మళ్ళీ మళ్ళీ చదివిన పుస్తకం కాగా, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆత్మకథ లాగా అనిపించే నవల 'లోపలి మనిషి' బాగా ఆలోచింపజేసిన పుస్తకం. ఆత్మకథలని చదవడంలో ఉండే రుచిని పెంచిన పుస్తకాలే ఈ రెండూ కూడా. సినిమా రంగం మీద ఆసక్తి వల్ల కాబోలు, రావూరి భరద్వాజ 'పాకుడు రాళ్ళు' ఆపకుండా చదివాను. అయితే, చూసిన సినిమాలు మాత్రం బహు తక్కువ. చూసిన వాటిలో 'మిథునం' పర్వాలేదు అనిపించింది. గతాన్ని నెమరు వేసుకోవడం అయ్యాక, నిజానికి చేయాల్సిన మరోపని భవిష్యత్తు ప్రణాళిక రచించడం. కానీ, బ్లాగింగ్ అన్నదే ప్లానింగ్ లేకుండా చేసే పని. ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళడం ఇక్కడ వీలుకాదు కూడా. గడిచిన నాలుగేళ్ల లోనూ రాయడం అన్నది నాకు మరింత ఇష్టమైన వ్యాపకం అయిపోయింది. అలాగే, చదవడం మీద ఆసక్తి తగ్గిపోకుండా ఉండడంలో బ్లాగు పాత్ర ఉందన్నది ఒప్పుకుని తీరాల్సిన విషయం. ఇందుకు కారకులు ఈ బ్లాగు చదువుతున్న మీరందరూను. 'కృతజ్ఞతలు' అన్నది చిన్న మాటే కానీ, అంతకన్నా ఏం చెప్పగలను నేను? వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 12:03 AM 42 కామెంట్‌లు: లేబుళ్లు: అవీ-ఇవీ మంగళవారం, జనవరి 22, 2013 రత్తాలు-రాంబాబు కొన్ని రచనలు చదువుతున్నప్పుడు నవ్వు ఆపుకోడం మన వల్ల కాదు. మరికొన్ని ఇందుకు భిన్నంగా, చదువుతున్నంత సేపూ ఒకలాంటి విషాదంలో ముంచెత్తుతాయి. ఓ తెలుగు రచన చదువుతున్నంత సేపూ పాఠకులకి నవ్వునీ, దుఃఖాన్నీ ఏకకాలంలో అనుభవంలోకి తెచ్చిందీ అంటే నిస్సందేహంగా అది రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనే అవుతుంది. సాహితీలోకం 'రావిశాస్త్రి' అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ ఉత్తరాంధ్ర ప్లీడరు గారు, జీవితాలని చదివి పుస్తకాలు రాశారు. వేశ్యా వృత్తిని ఇతివృత్తంగా తీసుకుని రావిశాస్త్రి రాసిన నవల 'రత్తాలు-రాంబాబు.' అనగనగా ఓ రత్తాలు. శృంగవరపు కోట పక్కనున్న ఓ పల్లెటూళ్ళో ఉండే పెళ్ళికాని పిల్ల. తల్లీ తండ్రీ చనిపోతే, పెద్దమ్మ జాగ్రత్తగా పెంచుకు వచ్చింది. గురజాడ వారి 'కన్యాశుల్కం' నాటకం లో బుచ్చమ్మ లాగా బొత్తిగా అమాయకురాలు. అందగత్తె రత్తాలు కి ఎన్నో పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి. కారణం చెప్పీ, చెప్పకుండానూ వాటిని తిరగ్గొట్టేస్తూ ఉంటుంది పెద్దమ్మ. తన ఈడు వాళ్ళు అప్పుడే పిల్లలని ఎత్తుతూ ఉండడంతో తనకింక పెళ్లి కాదేమో అన్న బెంగ మొదలవుతుంది రత్తాలుకి. అప్పుడు వస్తాడు, పట్నం నుంచి వాళ్ళ దూరపు బంధువు సింహాచలం. మాంచి నిఖార్సైన పూలరంగడు. రత్తాలుని పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. పెద్దమ్మ ఉలకదు పలకదు. కార్యసాధకుడు సింహాచలం. రత్తాలుతో స్నేహం చేసి, పట్నంలో తనెంత గొప్ప ఉద్యోగం చేస్తున్నాడో, పెళ్ళాం పిల్లల్ని ఎంత బాగా చూసుకోగలడో వర్ణించి చెప్పి, ఓ రాత్రి వేళ రత్తాలుని లేవదీసుకు పోతాడు, అచ్చం గిరీశం లాగానే. అయితే, సింహాచలం గిరీశం అంత మంచివాడు కాదు. అందగత్తె రత్తాలుని పట్నంలో పేరుమోసిన నరసమ్మ కంపెనీకి వెయ్యి రూపాయలకి అమ్మేస్తాడు. తను అమ్ముడుపోయిన విషయం రత్తాలు కి తెలియదు. అది సింహాచలం బంధువుల ఇల్లు అనుకుంటుంది. దానికితోడు, నరసమ్మ కూడా రత్తాలు మీద ఎంతో ఆదరం చూపిస్తుంది. నరసమ్మ కంపెనీలో ఉండే అమ్మాయిల్లో చురుకైనదీ, తెలివైనదీ ముత్యాలు. 'అప్పా' అంటూ మాట కలిపి రత్తాలుకి దగ్గర అవుతుంది. రత్తాలు చెడి నరసమ్మ ఇంటికి రాలేదనీ, మోసపోయి వచ్చిందనీ గ్రహిస్తుంది. 'కన్యాశుల్కం' మధురవాణి లాగానే మంచి మనసు ముత్యాలుది. నరసమ్మకి అనుమానం రాకుండా ఏదో ఒకటి చేసి, రత్తాలుని ఆ రొంపి నుంచి బయటికి పంపాలి అనుకుంటుంది. కానీ అదంత సులువైన పని కాదు. నరసమ్మ ఒకప్పుడు పోలీసుల మనిషి. ఓ ఎస్సై గారి ఇలాకా. ఆ ఎస్సై గారు కాలం చేశాక కూడా పోలీసులతో సంబంధాలు కొనసాగిస్తోంది. 'గంగరాజెడ్డు' (హెడ్ కానిస్టేబుల్ గంగరాజు) కి నరసమ్మ మీద తగని మక్కువ. కౌన్సిలర్లు, ప్లీడర్లు, ఆఫీసర్లు ఇలా అందరితోనూ సత్సంబంధాలు నెరపుతూ కంపెనీని నడుపుకు వస్తూ ఉంటుంది నరసమ్మ. అనగనగా ఓ రాంబాబు. మాంచి తెలివైన వాడు. అతనికి ఉన్నలోపం అల్లా ఒక్కటే, తండ్రి లేకపోవడం. తండ్రి, తల్లిని మోసం చేశాడు. ఆమె గర్భవతి అయ్యాక తెలియదు పొమ్మన్నాడు. ఆవిడ కోర్టుకెక్కి కేసు ఓడిపోయింది. స్కూల్ మేస్టారు ఉద్యోగం చేస్తూ కొడుకుని పెంచి పెద్ద చేసింది. ఎమ్మే పాసైన రాంబాబుకి ఇన్కంటాక్స్ కమిషనర్ గారబ్బాయి కృష్ణతో స్నేహం. ఐఏఎస్ పరీక్షలకి వెడుతున్న కృష్ణ, రాంబాబు చేత కూడా ఆ పరీక్ష రాయిస్తాడు. రాంబాబుకి తనకన్నా ఎక్కువ మార్కులు వస్తాయని నమ్మకం కృష్ణకి. క్లాస్మేట్ వసంతని ప్రేమించిన రాంబాబు, ఆమెని చూడడం కోసం కృష్ణ ఊరు వస్తాడు. ఆ ఊళ్లోనే నరసమ్మ కంపెనీ ఉంది. రత్తాలు ని పట్నం తీసుకు రాక మునుపే, సింహాచలం ఏం చేశాడంటే - బంగారప్ప కంపెనీ నుంచి ఐదొందలు 'అడ్మాన్సు' తీసేసుకుని, జల్సా చేసేశాడు. ఇప్పుడు, తెచ్చిన 'సరుకు' తనది అన్నది బంగారప్ప వాదన. రత్తాలుకి అనారోగ్యం చేస్తే, ఆమెని రిక్షాలో ఆస్పత్రికి తీసుకెడుతుంది ముత్యాలు. బంగారప్ప రౌడీలు దారికాసి, రత్తాలు ని ఎత్తుకు పోబోతూ ఉండగా రాంబాబు ఆమెని రక్షిస్తాడు. రౌడీలని తప్పించుకుని ఆస్పత్రికి వెడతారు రత్తాలు, ముత్యాలు. అదే రాత్రి, 'చిన్మా' నుంచి తిరిగి వస్తున్న ముత్యాలు, రత్తాలు ల కంట పడతాడు రాంబాబు. నడిరోడ్డుమీద జ్వరంతో అపస్మారకంలో పడి ఉంటాడు. అతన్ని కంపెనీకి, అక్కడి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్ళి సేవలు చేస్తారు ముత్యాలు, రత్తాలు. తనకి తెలియకుండానే రాంబాబు తో ప్రేమలో పడిపోతుంది రత్తాలు. గాలి మేడలు కట్టుకోవద్దని అప్పని హెచ్చరిస్తూ ఉంటుంది ముత్యాలు. కోటీశ్వరుడు 'పిచ్చి' జోగులుకి ముత్యాలు అంటే పిచ్చి. ఆమెకి నెలజీతం ఇస్తూ ఉంటాడు. మరోపక్క, యువకుడైన 'రిక్షా' జోగులు ముత్యాలుని ప్రేమిస్తాడు. ఎప్పటికైనా ఆమె నరసమ్మ చెరనుంచి బయటికి రాగలిగితే, ఆమెని పెళ్లి చేసుకోవాలి అన్నది అతని కల. రిక్షా జోగులు అంటే ముత్యాలుకీ ఇష్టమే. వీళ్ళందరి కథలూ ఏ తీరం చేరాయన్నదే 'రత్తాలు-రాంబాబు' అసంపూర్ణ నవల. నిజానికి 554 పేజీల ఈ నవల అసంపూర్ణం అన్నభావన కలగలేదు నాకు. మార్క్సిజాన్ని అమితంగా ఇష్టపడే రావిశాస్త్రి, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన కాలంలో (1975-77) జైలు జీవితం గడుపుతూ రాశారు ఈ నవలని. రావిశాస్త్రి ఎప్పుడూ పేదల పక్షమే. పేదవాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయో చెప్పి ఆగిపోలేదు, అలా ఉండడానికి కారణం ఏమిటో కూడా విశదంగా చెప్పారు ఈ నవలలో. ఉన్నత, పేద, మధ్యతరగతి మనస్తత్వాలని చిత్రించిన ఒక సన్నివేశాన్ని మర్చిపోలేం. తన ఊరికి వెళ్ళిన రాంబాబు, రత్తాలు పట్ల కృతజ్ఞతగా ఆమెని నరసమ్మ చెర నుంచి విడిపించాలి అనుకుంటాడు. ఇది మధ్యతరగతి మనస్తత్వం. వెయ్యి రూపాయలు అప్పు చేసి, ఆ డబ్బుని కృష్ణకి పంపుతాడు. "మందులకి అయిన ఖర్చు అప్పుడే ఇచ్చేశాడు కదా.. మళ్ళీ ఇది ఎందుకు?" అనుకుంటాడు కృష్ణ, కోటీశ్వరుడు. తనకి డబ్బు వద్దనీ, డబ్బుకోసం తను రాంబాబుకి సేవ చేయలేదనీ తిరస్కరిస్తుంది రత్తాలు, కూటికి మాత్రమే పేద. 'కన్యాశుల్కం' లో ఉన్నట్టే, ఇందులోనూ ఒక 'మంచం' సన్నివేశం ఉంది. గంగరాజెడ్డు మంచం మీద నరసమ్మ తో సరసం నెరుపుతూ ఉండగా, మంచం కింద చిక్కుకున్న సింహాచలం పడ్డ పాట్లని చదవాల్సిందే. రష్యన్ రచయిత చెహోవ్ కథ 'మిజరీ' ని తెలుగులోకి అనువదించడం ద్వారా తన పద్దెనిమిదో ఏట రెండో కథ రాసిన రావిశాస్త్రి, చెహోవ్ మరో కథ 'ది కెమీలెయన్' ఆధారంగా రాసిన ఓ సన్నివేశం, పోలీసు వ్యవస్థ పనితీరుని కళ్ళముందు ఉంచుతుంది. ఆయన సమాజాన్ని ఎంతగా పరిశీలించి రచనలు చేస్తారు అన్నది, ఈ నవల చదివిన వాళ్లకి సులువుగా బోధ పడుతుంది.రావిశాస్త్రి రచనలేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. 'మనసు' ఫౌండేషన్ ద్వారా త్వరలో మార్కెట్లోకి రాబోతున్నట్టు భోగట్టా. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 11:20 PM 9 కామెంట్‌లు: లేబుళ్లు: సాహిత్యం సోమవారం, జనవరి 21, 2013 పెళ్లి బేరాలు ఇది నేను హైస్కూల్లో ఏడో, ఎనిమిదో చదువుతున్నప్పుడు జరిగిన సంగతి. ఆడపిల్లల మీద కొంచం ఎక్కువ శ్రద్ధ చూపించే కేవీబీ మేష్టారు హాజరు పట్టీ తీసుకుని ఒక్కో పేరూ చదువుతూ, రాని వాళ్ళు ఎందుకు రాలేదో కనుక్కుంటున్నారు. ఓ అమ్మాయి వంతు వచ్చేసరికి, ఆ ఊరి అమ్మాయిలందరినీ నిలబెట్టి నిలదీయడం మొదలు పెట్టారు. మేష్టారి ప్రశ్నలు తట్టుకోలేక వాళ్ళలో ఓ అమ్మాయి "ఆయమ్మికి పెళ్లి బేరాలండి," అని చెప్పెయ్యగానే, క్షణం ఆలస్యం లేకుండా క్లాసంతా గొల్లుమంది. మేష్టారు కూడా పాఠం పక్కన పెట్టి, పెళ్లి బేరాలని గురించి కొంచం రుచికరమైన ప్రసంగం చేశారు. ఎందుకో తెలియదు కానీ, ఈ 'పెళ్లి బేరాలు' అనే మాట నాకు బాగా గుర్తుండి పోయింది. కించిత్తు జ్ఞానం కలిగాక, "ఎంత చక్కని మాట!! ఏ ముసుగులూ వేయకుండా, ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది కదా ఆ అమ్మాయి" అనుకున్నాను కూడా. ఉన్నట్టుండి ఇది ఎందుకు గుర్తు వచ్చిందీ అంటే, ఆదివారం పూటా నా ఇంట్లో నేను టీవీ చూసుకోడానికీ, పుస్తకం చదువుకోడానికీ, చివరికి ఫోన్ మాట్లాడుకోడానికి కూడా వీలు లేకుండా మా వీధిలో 'వధూ వర పరిచయ వేదిక' ఏర్పాటు చేసేశారు. పేరులో మాత్రమే వధూవరులు కానీ, వచ్చిన వాళ్ళంతా పెద్దలే. తల్లి దండ్రులు, బంధువులు, మధ్యవర్తులు అని ముద్దుగా పిలవబడే 'పెళ్ళిళ్ళ బ్రోకర్లూ'ను. అరుదైన కంఠ స్వరాలు కొన్నే ఉంటాయి. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారి సినిమా ప్రకటనలు చదివే స్త్రీమూర్తి కంఠం అలాంటి వాటిలో ఒకటి. మా అదృష్టం ఏమిటంటే, అచ్చం అదేమాదిరి గొంతు కలిగిన ఓ స్త్రీమూర్తి మైకు అందుకుని వధూ వరుల వివరాలు మైకు అక్కర్లేని విధంగా చదవడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల నాలుగు వీధుల్లో ఏ ఇంట్లోనూ కూడా ఒకరి మాటలు ఒకరికి వినిపించి ఉండవు, ఆ కార్యక్రమం అవుతున్నంత సేపూ. మధ్యమధ్యలో నిర్వాహకులు మైక్ అందుకుని ఆవిడకీ మాకూ కూడా విశ్రాంతి ప్రసాదించారు. సేల్స్ ప్రమోటర్ల మొదలు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ల వరకూ రక రకాల హోదాల్లో, రకరకాల నేపధ్యాలతో, దాదాపు ఒకేలాంటి కోరికలు కోరే వరులు. టీచర్లు, బ్యాంకు ఉద్యోగినులు, అక్కడక్కడా సాఫ్ట్వేర్ నిపుణులూ అయిన వధువులు. దాదాపుగా వరులందరి ఏకైకకోరిక "ఫామిలీ గర్ల్" అయితే, వధువుల కోరికలు "సాఫ్ట్వేర్ ఉద్యోగి అయి ఉండవలెను. నాలుగు సంవత్సరములకి మించి వయోభేదం ఉండరాదు." అదృష్టవ శాత్తూ, తల్లిదండ్రుల కోరికల జాబితా మైకులో చదవలేదు. సాఫ్ట్వేర్ కాక ఇతరత్రా ఉద్యోగాలు చేసే బ్రహ్మచారుల పరిస్థితి ఏమిటా అన్న ఆలోచన కలిగింది కాసేపు. సాఫ్ట్వేర్ రంగం, మిగిలిన మార్కెట్లతో పాటు మేరేజ్ మార్కెట్ మీదా బాగానే ప్రభావాన్ని చూపిస్తోంది అన్నమాట అనుకున్నాను. నిర్బంధపు శ్రోతల యెడల దయ తలచి, యాంకరీ శిరోమణి గారికి బ్రేకు ఇచ్చిన ప్రతిసారీ నిర్వాహకులు చెప్పిన మాట ఒక్కటే. వాళ్ళందరూ చాలా కష్టపడి (మాలాంటి ఎందరినో కష్టపెట్టి) పరిచయ వేదికలు ఏర్పాటు చేస్తున్నా తగినన్ని పెళ్లి సంబంధాలు కుదరడం లేదట. అటు వరులకీ ఇటు వధువులకీ కూడా ఓ పట్టాన సంబంధాలు నచ్చడం లేదట. ఏళ్ళ తరబడి ఆ తల్లిదండ్రులే అన్ని వేదికలలోనూ కనిపిస్తున్నారుట. 'వీళ్ళ పని ఇలా వేదికలు ఏర్పాటు చేయడం వరకే కదా.. ఈ ఆవేదనలు ఎందుకూ?' అనిపించింది కానీ, వీళ్ళు మైకు వదిలితే ఆవిడ మైకు అందుకుంటారు అని గుర్తొచ్చి వీళ్ళ వేదన వినడమే మంచింది లెమ్మనిపించింది. ఉమ్మడి కుటుంబాలు వర్ధిల్లినంత కాలం ఇలాంటి పెళ్లి సంతల అవసరం లేకపోయింది. వీలైనంత వరకూ ఆడపిల్ల పుట్టగానే ఉయ్యాలలోనే నిశ్చితార్ధం చేసేవాళ్ళు, మేనమామతోనో మేనబావతోనో. కానిపక్షంలో, వేలువిడిచిన బంధువో, కాలు విడిచిన చుట్టమో ఏదో సంబంధం పట్టుకొస్తే, చూసి ముడి పెట్టేసేవారు. ఉమ్మడి కుటుంబాలు నెమ్మదిగా అంతరించడం, మధ్యతరగతి ఆదాయం లోనూ, జీవిత విధానంలోనూ ఒక్కసారిగా మార్పు తోసుకుని రావడం దాదాపు ఒకేసారి జరిగింది. ఫలితమే, పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఏళ్ళ తరబడి తిరగడం. ఈ అవసరాన్ని తీర్చడం కోసం కార్పోరేట్ స్థాయిలో మాట్రిమొనీ సంస్థలు మొలకెత్తి, మొగ్గ తొడిగి పాతుకు పోవడమూను. చూడబోతే భవిష్యత్తు వీళ్ళది లాగే కనిపిస్తోంది. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 10:28 AM 10 కామెంట్‌లు: లేబుళ్లు: అవీ-ఇవీ శనివారం, జనవరి 19, 2013 పొత్తూరి 'ప్రేమలేఖ' ఉషా కిరణ్ మూవీస్ వారి తొలి సినిమా 'శ్రీవారికి ప్రేమలేఖ' చూడని వాళ్ళు అరుదు. చిన్న కథకి చక్కటి హాస్యాన్నీ, ఇంచక్కటి సంగీతాన్నీ జోడించి తీసిన ఈ సినిమా కథని దర్శకుడు జంధ్యాలే రాశాడు అనుకుంటారు చాలామంది. కథ తను రాసుకోకపోవడమే కాదు, పొత్తూరి విజయలక్ష్మి రాసిన 'ప్రేమలేఖ' నవలని యధాతధంగా తీసుకుని, సినిమాకి అవసరమైన అదనపు సన్నివేశాల్నీ, పాటలనీ మాత్రమే జోడించారన్న విషయం అర్ధం కాడానికి, సదరు నవలని చదవాలి. ఆమధ్య ఎప్పుడో పుస్తకాల షాపులో డిస్ప్లే లో కనిపించిన 'ప్రేమలేఖ' నవలని కొని పట్టుకొచ్చి, తెలిసిన కథే కదా చదవొచ్చు లెమ్మని, చదవాల్సిన పుస్తకాల్లో జాగ్రత్త చేశాను. "లైట్ రీడింగ్ కోసం ఏదన్నా పుస్తకం" అనుకున్నప్పుడు, చెయ్యి మొదట వెళ్ళింది ఈ పుస్తకం మీదకే. అందరికీ తెలిసిన కథే అయినా, రెండు లైన్లలో చెప్పుకోవాలి అంటే, స్వర్ణలత అనే ఓ అమ్మాయి మనసు పెట్టి ఓ ప్రేమలేఖ రాసి, సోనీ అని సంతకం చేసి,కొంచం ఆకతాయి తనంగా దానిని చేతికొచ్చిన అడ్రస్ రాసి పోస్టు చేసేస్తుంది. ఆ ఉత్తరం చేతులు మారి మారి ఆనందరావు అనే మోస్ట్ ఎలిజిబుల్ బ్రహ్మచారి చేతిలో పడడమూ, ఉత్తరం చదివి అతగాడు సోనీతో పీకల్లోతు ప్రేమలో పడిపోవడమూ మిగిలిన కథ. ప్రధాన పాత్రలవే కాదు, మిగిలిన ఏ ఒక్క పాత్రకీ కూడా పేరునీ, మేనరిజాన్నీ మార్చలేదు జంధ్యాల. ఆనందరావు తండ్రి పరంధామయ్య ముక్కోపి. తల్లి మాణిక్యాంబ పరమ సాత్వికురాలు. అన్నగారు బాబీగా పిలవబడే భాస్కర రావుకి పేకాట పిచ్చి. అతని భార్య అన్నపూర్ణ కి సినిమాలు చూడడం ఎంత ఇష్టమో, వాటిని శ్రీకారం నుంచి శుభం కార్డువరకూ భర్తకి వర్ణించి వర్ణించి చెప్పడం అంతకన్నా ఇష్టం. ఆనందరావు అక్క కామేశ్వరి, మేనమామ సూర్యంగా పిలవబడే సూర్య నారాయణ మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పుట్టింటి వాళ్ళు తన భర్తకి అల్లుడి మర్యాదలు సరిగ్గా చేయడం లేదన్నది ఆవిడ ఫిర్యాదు. ఇక, కథానాయిక స్వర్ణలత ని వాళ్ళ నాన్నగారు బాగా చదువు చెప్పించి ఇందిరాగాంధీ అంతటి దాన్ని చేద్దాం అనుకుంటారు. కూతుర్ని కనీసం జిల్లా కలక్టర్ గా అయినా చూడాలి అన్నది ఆయన కోరిక. చదువుకోడం అన్నది స్వర్ణ కి బొత్తిగా సరిపడని వ్యవహారం. సినిమాలన్నా, నవలలన్నా ప్రాణం. కాబోయే వాడికోసం కలలు కంటూ ఉంటుంది. "నాన్నారూ, మీరింక సంబంధాలు చూడ్డం మొదలు పెట్టచ్చండీ! నాకు చదువు మీద ఇంట్రస్టు తగ్గిపోయింది" అని చెబుదాం అనుకుంటుంది కానీ, సిగ్గు మొహమాటం అడ్డొస్తాయి. "అసలు దానికి చదువు మీద దృష్టి లేదు. ఎంతసేపూ నవలలు చదవడం, సినిమాలు చూడ్డం, మంచం మీద బోర్లా పడుకుని గాడిదలాగా కబుర్లు చెప్పడం. ఏమన్నా అంటే నోరు పెట్టుకు పడిపోతుంది. వినయం విధేయత బొత్తిగా లేవు," ఇది వాళ్ళమ్మ గారి గోడు. సోనీ ప్రేమలో మునిగితేలుతున్న ఆనందరావు పెళ్ళిచూపులకి వెళ్ళడానికి ఇష్ట పడక పోవడంతో, సూర్యం, కామేశ్వరి, బాబీ, అన్నపూర్ణ కలిసి బయలుదేరతారు, స్వర్ణని చూసి రాడానికి. బాబీని చూసిన స్వర్ణ కి 'అగ్ని పరీక్ష' నవలలో విష్ణు వర్ధన్ గుర్తొస్తాడు. సూర్యాన్ని చూసి 'అపస్వరం' నవలలో శ్యామూ లాగా ఉన్నాడని అనుకుంటుంది. ఇక అన్నపూర్ణకైతే, స్వర్ణ 'శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్' లో జయప్రద లాగా కనిపిస్తుంది. తిరుగు ప్రయాణంలో బాబీకి ఆ సినిమా కథ మొత్తం చెప్పేస్తుంది కూడా. బాబీ స్నేహితులు 'మార్గదర్శి', 'హార్మనీ పెట్టె', 'కళ్ళజోడు' ల పేకాట ప్రహసనం సరేసరి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, కథకి కీలకమైన ప్రేమలేఖ గురించి. సినిమా కోసం వేటూరి 'శ్రీమన్మహారాజ...' అంటూ మొదలు పెట్టి అలవోకగా పాట రాసేస్తే, అచ్చంగా పదహారేళ్ళ కన్నె బంగారు లాగా జానకి పాడేస్తే వినేశాం కదా మనం. నవలలో మాత్రం ఏడున్నర పేజీల ఉత్తరం. లేత గులాబీ రంగులో 'కునేగా' పరిమళాలు వెదజల్లే కాగితాల మీద స్వర్ణ పొందికగా రాసిన లేఖ. పెళ్లి కాని కుర్రాళ్ళని ఊహల్లో తిప్పి తిప్పి అక్కడే నిర్దాక్షిణ్యంగా వదిలేసి వచ్చే ఉత్తరం. 'సినిమా చూసేశాం కదా... ఇంకేం చదువుతాం' అని ఏమాత్రం అనుకోనక్కర్లేని నవల ఇది. (శ్రీ రిషిక పబ్లికేషన్స్ ప్రచురణ. పేజీలు 142, వెల రూ.80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు). వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 5:19 PM 6 కామెంట్‌లు: లేబుళ్లు: సాహిత్యం గురువారం, జనవరి 17, 2013 కాదంబరి సాధారణంగా రచయితలు 'ఏం చెబుతున్నాం?' అన్న దానితో పాటు 'ఎలా చెబుతున్నాం?' అన్నది కూడా దృష్టిలోపెట్టుకుని కథలు, నవలలు రాస్తారు. అయితే, ఈ రెండో అంశాన్ని బొత్తిగా పట్టించుకోకుండా రావూరి భరద్వాజ రాసిన నవల 'కాదంబరి.' ఎంచుకున్న ఇతివృత్తం మంచిదే అయినప్పటికీ, కథ చెప్పే తీరులోనూ, పాత్రలని రూపు దిద్దడంలోనూ ఆయన గందరగోళ పడి, పాఠకులని గందరగోళ పరిచారు అనిపిస్తుంది, ఈ పుస్తకం చదవడం పూర్తి చేయగానే. ముప్ఫై ఐదేళ్ళ క్రితం తొలిసారి ప్రచురితమైన ఈ నవలలో చర్చించిన కొన్ని విషయాలు ఇవాల్టికీ చర్చనీయమే కావడం ఈ నవల విశేషం. ఇది రామకృష్ణయ్య కథ. పేదరికాన్ని భరించలేక చిన్నప్పుడే ఇంట్లోనుంచి పారిపోయిన రామకృష్ణయ్య అనేక రకాల ఉద్యోగాలు చేసి, సినిమా హాల్లో బ్లాక్ టిక్కట్లు అమ్ముతూ కోటీశ్వరుడైన చంద్రశేఖరం దృష్టిలో పడతాడు. దానితో అతని జాతకం పూర్తిగా మారిపోతుంది. జీనియస్ ఎక్కడున్నా ఇట్టే పట్టుకునే చంద్రశేఖరం రామక్రిష్ణయ్యని తన దగ్గర పెట్టుకుని తన వ్యాపారాల మెళకువలు నేర్పడం మాత్రమే కాదు, తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు కూడా. పెళ్ళైన కొన్నాళ్ళకే ఆత్మాభిమానం విషయంలో బొత్తిగా రాజీ పడలేని రామకృష్ణయ్య భార్యతో కలిసి వేరు కాపురం పెట్టి, సొంతంగా కలప వ్యాపారం ప్రారంభిస్తాడు. అంచెలంచెలుగా ఎదిగిన రామకృష్ణయ్య, ఉన్నట్టుండి ఒకరోజు తన వ్యాపారం మొత్తం కొడుక్కి అప్పగించేసి, 'మయూరాక్షి' నది మీద ప్రభుత్వం ఆనకట్ట కట్టాలంటూ పోరాటం మొదలు పెడతాడు. అధికార గణం లో ఎవరితో ఏ పని ఎలా చేయించుకోవాలో బాగా తెలిసిన రామకృష్ణయ్యకి, అన్ని పార్టీల నాయకులూ స్నేహితులే. ఉన్నట్టుండి అతనీ పని ఎందుకు మొదలుపెట్టాడో ఎవరికీ తెలియకపోయినా, అతనితో పనులు ఉన్న వాళ్ళూ, అతను ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తాడనీ నమ్మిన వాళ్ళూ అతనితో చేతులు కలుపుతారు. రామకృష్ణయ్యకి ఉన్న బలహీనత అతని కూతురు కౌముది. కూతురికోసం ఏమైనా చేస్తాడు ఆయన. కొడుకు మీద కూడా ఇష్టం ఉన్నా, మెజారిటీ తండ్రుల్లాగే కూతురంటే కొంచం ఎక్కువ ఇష్టం. తన తల్లితండ్రుల నుంచి తను పొందలేకపోయినది ఏమిటో బాగా తెలిసిన రామకృష్ణయ్య, పిల్లలని మాత్రం కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అంతేకాదు, కొడుకు, కూతురితో కలిసి విస్కీ తాగుతూ, సిగరెట్లు కాలుస్తూ తన సాయంత్రాలని ఆనందంగా గడపడం ఎలాగో బాగా తెలుసు. 'మయూరాక్షి' ప్రాజెక్ట్ కోసం రామకృష్ణయ్య చేస్తున్న ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తుంది కౌముది. అక్షరాలా తండ్రి వెనుక నిలబడుతుంది. అంత గొప్ప వ్యాపారస్తుడూ, పనులన్నీ పక్కన పెట్టి ప్రభుత్వంతో విరోధం తెచ్చుకునే ఉద్యమం ఎందుకు మొదలు పెట్టాడు, ఇందులో కౌముది కి ఉన్న ఆసక్తి ఏమిటి, చివరకి ఆ తండ్రీ కూతురూ సాధించింది ఏమిటి అన్నదే 'కాదంబరి' నవల. "బాణ మహాకవి రచించిన 'కాదంబరి' సంస్కృతంలో వెలసిన తొలి వచన కావ్యం. ఈ మాటకి నానార్ధాలూ ఉన్నాయి. ఒకానొక కావ్య విశేషం, ఆడు కోయిల, గోరువంక, మద్యం, నవల మొదలైనవి. మీ నవల వచన కావ్యంలాగా ఉన్నది. ఇందులోని ప్రతి పాత్రా ఒక్కో రకమైన మాదకతతో జోగిసలాడి పోతూ ఉన్నది. పుస్తకానికి 'కాదంబరి' అన్న శీర్షిక నుంచండి అని సలహా ఇచ్చిన వారు డాక్టర్ రాఘవాచార్య గారు" అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు భరద్వాజ. కథ మొదలైన తీరు చిత్రంగా ఉంటుంది. జగన్నాధం అనే అతను (ఇతని వృత్తి వ్యాపకాలు ఏమిటో నవలలో ఎక్కడా చెప్పలేదు) పేపర్లో వచ్చిన ఒక వార్త చూసి, అడవి మధ్యలో ఉన్న పాడుబడ్డ భవనం చూడడానికి బయలుదేరతాడు. అతని ప్రయాణం సాగుతూ ఉండగా ఉండగా అతనికి అడవి మధ్యలో ఓ పాడుబడిన కోట దగ్గర కౌముది కనిపిస్తుంది. 'ఈ కౌముది మనిషా? ఏదన్నా ఆత్మా?' అన్న సందేహంతో పేజీలు తిరుగుతూ ఉండగా, దగ్గరలోని గెస్టు హవుసులో రామకృష్ణయ్య ఏర్పాటు చేసిన పార్టీకి కౌముది కి అతిధిగా వెడతాడు జగన్నాధం. అప్పుడే పరిచయం అయిన జగన్నాదాన్ని అత్యంత ఆత్మీయుడిగా భావించిన రామకృష్ణయ్య, తన గతం మొత్తం చెప్పేస్తాడు, తను చేసిన తప్పులతో సహా. అటు రామకృష్ణయ్య, ఇటు కౌముది జగన్నాధానికి ఎందుకంత ప్రాముఖ్యం ఇస్తారో అర్ధం కాదు. అంతే కాదు, ఎన్నో ఎదురు దెబ్బలు తిని అటు జీవితంలోనూ, ఇటు వ్యాపారం లోనూ పైకి వచ్చిన రామకృష్ణయ్య ఇతరత్రా ప్రణాళికలు ఏమీ లేకుండానే 'మయూరాక్షి' ఉద్యమం మొదలు పెట్టడం, తన చుట్టూ జరిగే వాటిని ముందుగా ఊహించలేక కుంగిపోతూ, జగన్నాధంతో పంచుకోడవం ఇవన్నీ నాటకీయతని పరాకాష్టకి తీసుకెళ్ళాయి. రామకృష్ణయ్య పాత్రని చిత్రించిన తీరు, భరద్వాజ నవల 'పాకుడు రాళ్ళు' లో నాయిక మంజరి పాత్ర చిత్రణని జ్ఞాపకం చేసింది. (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 164, వెల రూ. 80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు). వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 1:34 PM 3 కామెంట్‌లు: లేబుళ్లు: సాహిత్యం సోమవారం, జనవరి 14, 2013 మా వెంకన్నబాబు... దేవుడి గదిలో బియ్యం పోసుకునే జాడీ పక్కనే ఉన్న ఇత్తడి గంగాళం మీద, గంధం అరగదీసుకునే సాన బరువుగా మూత పెట్టి ఉంది. బలమంతా చేతుల్లోకి తెచ్చుకుని, జాగ్రత్తగా ఆ సానని కిందకి దింపేసి, గంగాళంలో చెయ్యి పెడితే లోపల గరుగ్గా తగులుతూ వడ్లు. ఓ చిన్న పళ్ళెంలోకి వాటిని తీసుకుని, గంగాళం మీద మూతని మళ్ళీ జాగ్రత్తగా పెట్టేసి, ఎందుకన్నా మంచిదని ఓ సారి వంటింటి వైపు చూసేసరికి, అమ్మా, బామ్మా పండగ పిండి వంటల హడావిడిలో మునిగిపోయి ఉన్నారు. ఇద్దరూ కూడా నన్ను చూడనేలేదు. ఆ పళ్ళెం తెచ్చి వీధిలో బూరా ఊదుతున్న తలపాగా అబ్బికి ఇవ్వగానే తను యెంత సంతోషించాడో చెప్పలేను. నేను చూస్తూ ఉండగానే ఆ వడ్లు తనతో తెచ్చుకున్న సంచీలో పోసేసుకున్నాడు. అదేమిటీ? గంగిరెద్దుకి వడ్లు పెడతానని కదా నన్ను అడిగాడూ? "మా ఎంకన్నబాబు ఇప్పుడేవీ తినడు బాబయ్యా. మద్దినాల మేం బోయినం సేసేప్పుడు తవరి పేరు సెప్పి నేను తినిపింతాను సావీ" అని చాలా మర్యాదగా చెప్పాడు పాపం. కూడా వచ్చిన రెండో బూరా అబ్బి అవునవునని తలూపాడు. సర్లే నా పేరు చెప్పి తినిపిస్తాడు కదా... పుణ్యం అంతా నాకే కదా అనుకున్నాను. ఏటా సంక్రాంతి రోజుల్లో వెంకన్నబాబుని తీసుకుని వస్తారు వాళ్ళు. మామూలుగా మన ఊళ్ళో బండి లాగే ఎడ్లు ఉంటాయి చూడూ, వాటికన్నా ఎత్తుగా ఉంటాడు వెంకన్న బాబు. కాళ్ళకీ, మెడ లోనూ, కొమ్ములకీ, పొట్టకీ కూడా మువ్వల పట్టీలు కట్టేస్తారు కదా... తను ఒక్క అడుగు వేసినా ఘల్లు ఘల్లు మని పోతాడు. కొమ్ములకి పట్టు కుచ్చులు, మూపురం వెనుక మడతలు పెట్టిన పాత పట్టు చీరా, చెమ్కీ దండలూ అవీ వేస్తారేమో భలేగా మెరిసిపోతాడు. మన ఎడ్లు అయితే కొరడా కర్రతో కొడితే తప్ప మాట వినవా? అదే వెంకన్న బాబయితే ఏం చెప్పినా ఇట్టే చేసేస్తాడు. అయినా మామూలు ఎడ్లని కొట్టినట్టు వెంకన్నబాబుని కొట్టకూడదు, తను గంగిరెద్దు కదా మరి.. దేవుడితో సమానం. బూరా అబ్బిలు ఇద్దరూ వెంకన్న బాబుతో భలే భలే పనులు చేయిస్తారులే అసలు. "అయ్యగారికీ దండం పెట్టూ" అనగానే అంత పెద్ద వెంకన్న బాబూ ఇంచక్కా దండం పెట్టినట్టు నిలబడి పోతాడు. అది చూడగానే గంగాళంలో ఉన్న వడ్లన్నీ తెచ్చి తన ముందు పెట్టెయ్యాలని అనిపించేస్తుంది.. అలా చేస్తే ఇంకేమన్నా ఉందా? బామ్మ బతకనివ్వకపోవడం అలా ఉంచి, అటుకులు కావాలంటే ఎక్కడినుంచి వస్తాయీ? అందుకని ఒక్క పళ్ళెంతో, అది కూడా బామ్మ చూడకుండా చూడకుండా తెచ్చి ఇచ్చెయ్యాలి. చూసిందంటే మాత్రం "వాళ్ళు చెప్పే వెధవ సినేమా కబుర్ల కోసం, వడ్లన్నీ సంతర్పణ చేసేస్తున్నావా నాయనా..ఇలా అయితే ఇల్లు గుల్లైపోతుంది. సుపుత్రా..కొంప పీకరా అనీ..." అంటూ సాధిస్తుంది. బామ్మ తిట్లు కాదు కానీ, బూరా అబ్బిలు చెప్పే కబుర్లు భలేగా ఉంటాయ్ అసలు. "మొన్నా మజ్జినండీ..ఎన్టీ వోడు కబురెట్టేడు మన ఎంకన్నబాబు కోసం.. కొత్త సినీమా తీత్తన్నారంట.. అట్టాంటిట్టాంటి గంగిరెద్దు పనికిరాదు.. ఎంకన్న బాబైతేనే కరెస్ట్ గా సరిపోతాడు అన్నాడంట. ఆళ్ళ మనిసొచ్చి ఒకిటే బతిమాలేసేడు. మావు ఇనలేదు లెండి.. ఇంకో ఎద్దుని సూసుకోమని సెప్పేసాం.." అయ్యో... ఎందుకలాగా? మన వెంకన్న బాబుని అందరూ చక్కగా సినిమాలో చూసేవాళ్ళు కదా?? అని అడిగామనుకో వెంటనే "సినీమానులో పడితే దిట్టి బాబయ్యా..బాబుకి కల తగ్గిపోద్ది..ఒప్పేసుకో కూడదండి అలాగ..ఆయ్.." అని వివరంగా చెప్పేస్తారు. అదేమిటో పెద్దవాళ్ళు ఎవరూ కూడా వీళ్ళ మాటలు నమ్మరు. "మెడ్రాసులో గంగిరెద్దులకి కరువు మరీ... వీళ్ళని వెతుక్కుంటూ వచ్చారు సినిమా వాళ్ళు" అనేస్తారు. అయినా నిజం అయితే ఏమిటి, కాకపొతే ఏమిటి... వాళ్ళు సరదాగా చెబుతున్నప్పుడు సరదాగా వినొచ్చు కదా. మనం చూస్తూ ఉండగానే బూరా అబ్బిలు ఇద్దర్లోనూ ఒకతను ముగ్గుకి దూరంగా నేలమీద వెల్లకిల్లా పడుకుంటాడా.. వెంకన్న బాబు మెల్ల మెల్లగా అడుగులు వేసుకుంటూ నడిచి వెళ్లి అతని గుండెల మీద కాళ్ళు పెడతాడు. యెంత భయం వేసేస్తుందో. అప్పుడప్పుడూ మన ఎద్దులు కొమ్ము విసిరినట్టు వెంకన్నబాబు కూడా కోపం వచ్చి ఏమన్నా చేస్తే? వాళ్లకి అస్సలు భయం ఉండదేమో.. అలా తొక్కించేసుకుంటారు. అబ్బిలిద్దరూ వీధిలో నిలబడి పోటాపోటీగా బూరలు ఊదుతూ ఉంటే అమ్మో, బామ్మో తప్పకుండా బయటికి వస్తారు కదా. అప్పుడు వెంకన్నబాబు కాస్తా మాలచ్మి అయిపోతుంది. "పండగ పూటా మాలచ్చిమి వచ్చింది తల్లే... నాలుగు పాతగుడ్డలు, పలారం ఎట్టించి పంపండమ్మా... జయం కలుగుతాది మీకు" అని ఆపకుండా ఏవేవో అడుగుతూనే ఉంటారు. మనకేమీ భయం అక్కర్లా... "అబ్బాయ్ గారు ఎంకన్న బాబుకి వడ్లు పెట్టారమ్మా" అని వాళ్ళు చెప్పరు గాక చెప్పరు. ఈలోగా నాన్నో, తాతో కనిపిస్తే "ఆట ఆడించాం బాబయ్యా...సదివింపులు గనంగా సదివించుకొవాలి బాబయ్యా..." అంటూ రూపాయో అర్ధో ఇచ్చే వరకూ వదలరు. గొబ్బిళ్ళు, హరిదాసు, ఆ తర్వాత వెంకన్న బాబూ అందం సంక్రాంతి పండక్కి. మిత్రులందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు!! వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 12:26 PM 10 కామెంట్‌లు: లేబుళ్లు: జ్ఞాపకాలు గురువారం, జనవరి 10, 2013 ఇలా మిగిలేం 'కమ్యూనిస్టు' ఈ మాట వినిపించగానే ఒక్కసారి తిరిగి చూస్తారు ఎవరైనా. వామపక్ష రాజకీయ సిద్ధాంతంతో అభిప్రాయ భేదాలు ఉన్నవాళ్ళు సైతం ఆ పార్టీ క్రమశిక్షణని మెచ్చుకున్న సందర్భాలు అనేకం. అయితే, ఆ క్రమశిక్షణ లోపించిన కారణం గానే కమ్యూనిస్టు పార్టీ చీలికలు పీలికలు అయ్యిందనీ, ప్రజలకి దూరం అవుతూ వస్తోందనీ విశ్లేషించారు చలసాని ప్రసాదరావు. తనకి ఊహ తెలిసిన నాటినుంచీ కమ్యూనిస్టు వాతావరణంలోనే పెరిగిన ప్రసాదరావు తన అనుభవాలనీ, పరిశీలననీ 'ఇలా మిగిలేం' పేరిట అక్షరబద్ధం చేశారు. కథారచయిత, పాత్రికేయుడు, చిత్రకారుడూ అయిన చలసాని ప్రసాదరావు, 'ఈనాడు' లో రాసిన 'కబుర్లు' వీక్లీ కాలమ్ ద్వారా ఆ పత్రిక పాఠకులకి సుపరిచితులు. ఇరవయ్యేళ్ళ క్రితం తొలిసారి ముద్రితమై సంచలనం రేపిన 'ఇలా మిగిలేం' పుస్తకాన్ని, చలసాని పదో వర్ధంతి సందర్భంగా గత సంవత్సరం పునర్ముద్రించింది 'పర్ స్పెక్టివ్స్.' ఫలితంగా, చాలా ఏళ్ళ విరామం తర్వాత ఈ పుస్తకాన్ని మళ్ళీ చదవగలిగాను నేను. పుస్తకం రాసిన నాటికన్నా ఇప్పుడు సామాజిక పరిస్థితుల్లో మార్పు మరింత వేగవంతం కావడం, మొన్నటివరకూ తొమ్మిది పార్టీలుగా ఉన్న వామపక్షాలలో తాజాగా పదో చీలిక రావడం ప్రస్తుత నేపధ్యం. కథలైనా, కబుర్లైనా సూటిగా రాయడం చలసాని శైలి. అదే శైలిని ఆసాంతమూ కొనసాగించిన 'ఇలా మిగిలేం' ని మొత్తం పద్దెనిమిది అధ్యాయాలుగా విభజించారు. సోషలిస్టు సమాజ సాధనని ఆశయంగా ప్రకటించిన నెహ్రూని కమ్యూనిస్టు అగ్రనాయకులు రెండో ఆలోచన లేకుండా నమ్మడం తోనే పార్టీకి శరాఘాతాలు తగలడం మొదలయ్యింది అని చెప్పారు 'కామ్రేడ్ నెహ్రూజీ' అధ్యాయంలో. గజ్జెల మల్లారెడ్డి, కుందుర్తి ఆంజనేయులు వంటి కవులవల్ల పార్టీకి జరిగిన నష్టాన్ని విశదంగా చెప్పారు. అంతే కాదు, 1955 ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య జరిగిన తీవ్రమైన పోటీ ప్రభావం తెలుగు సాహిత్యం మీద ఎలా పడిందో చెబుతూ, దేవరకొండ బాల గంగాధర తిలక్, ఆరుద్రలు పోషించిన పాత్రని తీవ్రంగా విమర్శించారు. శ్రీశ్రీ కవితకి తిలక్ మారుపేరుతో పేరడీ రాశారనీ, ఆరుద్ర పరోక్షంగా కాంగ్రెస్ కి సహకరించారనీ చెబుతూ, తర్వాతి కాలంలో ఆ ఇద్దరు కవుల పుస్తకాలని విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించడాన్ని తప్పు పట్టారు. అంతే కాదు, చివరికి విశ్వనాథ సాహిత్యాన్నీ, క్షుద్ర సాహిత్యాన్నీ అమ్మవలసిన అగత్యం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అదే ఎన్నికల్లో పత్రికా సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావు పోషించిన పాత్రా, తర్వాతి కాలంలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ ద్వారా గురజాడ రచనల పరిష్కారంలో లోపాల పేరిట కమ్యూనిస్టులపై అక్షరాల దాడి జరిపించిన వైనాన్నీ విప్పి చెప్పి, అదే నార్లకి గురజాడ రచనల వ్రాతప్రతులని ఎందుకు అప్పగించారని పార్టీ నాయకులని అడుగుతారు చలసాని. ఒకప్పటి నిబద్ద కమ్యూనిస్టులు తర్వాతి కాలంలో కాంగ్రెస్ వాదులు గానో, దైవ భక్తులు గానో మారిపోడాన్ని సాదోహరణంగా చెప్పి, లోపం ఎక్కడ ఉందని అడిగిన రచయిత, కేపిటలిస్టులు గా ఎదిగిన ఒకప్పటి కమ్యూనిస్టుల గురించి ప్రస్తావించలేదు. వ్యాసాలతో పాటు, వరవరరావు రాసిన ముందుమాట, హరి (సూరపనేని హరి పురుషోత్తమ రావు) రాసిన 'నేపధ్యం' ఈ పుస్తకాన్ని లోతుగా అర్ధం చేసుకోడానికి ఉపకరిస్తాయి. తొలి ప్రచురణ తర్వాత, పుస్తకం పైనా, రచయిత పైనా వచ్చిన విమర్శలని ప్రస్తావిస్తూ వాసిరెడ్డి నవీన్, చలసాని ప్రసాదరావుని చేసిన ఇంటర్యూ ని జత పరిచారు. భారతదేశంలో, మరీముఖ్యంగా ఆంధ్ర దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉత్థానాన్నిగురించీ, చీలికలకి దారి తీసిన పరిణామాల గురించీ తెలుసుకోడానికి ఉపయోగపడే పుస్తకం ఇది. చదువుతున్నంత సేపూ ఈమధ్య చదివిన 'నిర్జన వారధి' 'లోపలి మనిషి' పుస్తకాలు గుర్తొస్తూనే ఉన్నాయి.('పర్ స్పెక్టివ్స్'ప్రచురణ, పేజీలు 205, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు). వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 7:44 PM 6 కామెంట్‌లు: లేబుళ్లు: సాహిత్యం బుధవారం, జనవరి 09, 2013 త్రిలోక సుందరి గోదావరిలో పాపికొండల నడుమ లాంచీ ప్రయాణం.. అదికూడా సాయం సంధ్య వేళ.. అన్నీ సవ్యంగా ఉంటే అంతకన్నా అందమైన, ఆహ్లాదమైన ప్రయాణం మరొకటి ఉండదు. కానీ ఏ చిన్న తేడా వచ్చినా ప్రాణాలతో ప్రపంచాన్ని చూడడం అంత సులువు కాదు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తొంభై ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. వాళ్ళని తీసుకుని ప్రయాణిస్తున్న 'త్రిలోక సుందరి' లాంచీ ఇంజను ఉన్నట్టుండి ప్రయాణం మధ్యలో చెడి పోవడంతో. 'కొండమొదలు' అనే ఏజెన్సీ గ్రామంలో జనానికి వైద్యం చేస్తూ, రోగాల నుంచి వాళ్ళ ప్రాణాలని కాపాడుతున్న డాక్టర్ అవధాని కూడా ఉన్నాడు ప్రయాణికుల్లో. ఆ తొంభై మంది ప్రయాణికులని కాపాడడం కోసం అవధాని చేసిన ప్రయత్నం ఏమయ్యింది, ఆ లాంచీ ఉన్నట్టుండి ఆగిపోడానికి కారణం అయిన వాళ్ళని అవధాని ఎలా శిక్షించాడు అన్నదే బీవీఎస్ రామారావు ఇప్పటికి ముప్ఫై ఏళ్ళ క్రితం రాసిన 'త్రిలోక సుందరి' కథ. అప్పటి 'ఆంధ్రజ్యోతి' వారపత్రికలో తొలి ప్రచురణ పొందిన ఈ కథ, 'గోదావరి కథలు' సంకలనంలోనూ ఉంది. నలభై మంది ప్రయాణికుల కెపాసిటీ ఉన్న లాంచీలో, షావుకారు (లాంచీ ఓనరు) కక్కుర్తి కారణంగా తొంభై మందిని ఎక్కించేశాడు గుమస్తా. ప్రయాణికులతో పాటు, బియ్యం, తౌడు బస్తాలు ఓ యాభై టాపుని ఆక్రమించాయి. సంక్రాంతి రోజులు కావడంతో ఎక్కడ లేని రద్దీ ఉంది లాంచీకి. రోగులకి అవసరమైన మందులు కొనుక్కుని, కూనవరం నుంచి గూడెం వెడుతున్న డాక్టర్ అవధానిని ప్రయాణికులు అందరూ పలకరిస్తున్నారు. కేవలం అవధాని చేతి చలవ మీద నమ్మకంతో, పట్నంలో ఉన్న కూతురిని గూడేనికి పురిటికి తీసుకెడుతున్న భూషయ్య కూడా ఉన్నాడు వాళ్ళలో. పాతకాలం లాంచీ, పైగా ఓవర్ లోడు, గాలివాలుకి ఎదురుగా, సుడిగుండాలు దాటుకుంటూ చేయాల్సిన ప్రయాణం. ఉన్నట్టుండి ఇంజను పనిచేయడం మానేస్తుంది. ఇంజిన్ గదిలోకి వచ్చిన పడుతున్న నీళ్ళు, మరి కాసేపట్లో మొత్తం లాంచీనీ ముంచేస్తాయి. ప్రయాణికులకి ఆ విషయం చెప్పేసి, తన ప్రాణాలు రక్షించుకోడం కోసం గోదాట్లోకి దూకేస్తాడు డ్రైవరు. ఉన్నట్టుండి తెలిసిన కబురుతో మతిపోయి, ప్రాణ భయంతో హాహాకారాలు చేస్తున్న జనాన్ని చూసిన అవధాని, వెంటనే కార్యాచరణ లోకి దిగిపోతాడు. టాపు మీద ఉన్న బస్తాలలో సగం బస్తాలని గోదాట్లోకి విసిరేయమని పురమాయిస్తాడు అవధాని. గుమస్తా ఒప్పుకోకపోతే, అతన్ని బెదిరించి మరీ పని కానిస్తారు జనం. తౌడు బస్తాలు ఇంజిన్ రూములో కూరేసి, లాంచీలో ఉన్న ఓ వడ్రం మేస్త్రీతో చెక్క కొట్టించేయడంతో నీళ్ళు వచ్చి పడే ప్రమాదం తప్పుతుంది. అయితే మాత్రం... దారి పొడవునా సుడి గుండాలు, క్షణ క్షణానికీ మారిపోయే గాలివాలు. ఆడవాళ్ళు, పిల్లల రోదనలు. ఇవి చాలనట్టు భూషయ్య కూతురికి పురిటి నొప్పులు మొదలవుతాయి. ఈ గండాలన్నింటినీ జనం సాయంతో అవధాని ఎలా గట్టెక్కించ గలిగాడు, ఆ తర్వాత ఎదురు పడ్డ షావుకారు కి ఏ శిక్ష విధించాడు అన్నది తర్వాతి కథ. మనుషుల మనస్తత్వాలతో పాటు, గోదావరి తత్వాన్ని కూడా బాగా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే రాయగలిగే కథ ఇది. లాంచీ కొండ అంచున ఎలా ప్రయాణిస్తుంది, చుక్కాని నావని సుడిగుండాలలో ఎలా నడపాలి, ప్రవాహానికి అడ్డంగా కొండ తగిలినప్పుడు నదీగమనం ఎలా ఉంటుంది, సుడి గుండాన్ని చేదించడం ఎలాగ తదితర విషయాల మీద రామారావు గారికి ఉన్న కమాండ్ ఎంతటిదో కథ పూర్తి చేశాక సులభంగానే అర్ధమవుతుంది. నీటిపారుదల శాఖలో, అది కూడా గోదావరి ప్రాంతంలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవం ఆయనది. కథ చదువుతున్నంత సేపూ వంశీ కథలూ, సినిమాలూ గుర్తొస్తాయి. అన్నట్టు, 'మా దిగువ గోదారి కథలు' కి ముందుమాట రాసింది రామారావు గారే. 'పుష్కరాల రేవులో పుల్లట్లు,' 'ఎసరూ-అత్తిసరూ' కథలు ఈ 'గోదావరి కథలు' సంకలనంలోవే. నవోదయ ప్రచురణలు వారి ద్వారా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉందీ సంకలనం. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 4:29 PM 5 కామెంట్‌లు: లేబుళ్లు: కథలు ఆదివారం, జనవరి 06, 2013 నగదు బదిలీ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'ఆధార్' ప్రాజెక్ట్ తాలూకు ఫలితాలను పొందే కార్యక్రమం మొదలయ్యింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రయోజనాలని నేరుగా లబ్దిదారులకే చేర్చే పథకం (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీం) తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి లాంచనంగా ప్రారంభమయ్యింది. తొలిదశలో దేశం మొత్తం ఎంపిక చేసిన యాభై జిల్లాలలో ఎంపిక చేసిన పథకాలని ఆధార్ కి అనుసంధానం చేసి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. వీలైనంత తొందరలో - మరింత స్పష్టంగా చెప్పాలంటే వచ్చే ఏడాది జరగబోయే సాధారణ ఎన్నికలకి ముందుగానే - ఈ స్కీముని దేశవ్యాప్తంగా అమలు చేయడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. దేశంలోని ప్రతి పౌరుడికీ ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డు పంపిణీ చేయడం ఆధార్ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. కార్డు దారుడి ఫోటో, చిరునామా, ఆదాయ వివరాలతో పాటు, రెండు చేతుల వేళ్ళ ముద్రలూ కంప్యూటర్ లో నిక్షిప్తం చేస్తారు. ఫలితంగా ఎలక్ట్రానిక్ వేలిముద్రని సేకరించిన క్షణాల్లోనే సదరు వ్యక్తి గుర్తింపు నిర్ధారణ జరిగిపోతుంది. ఆధార్ కార్డులు పొందిన అనంతరం, ప్రతి కుటుంబమూ ఒక బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ అకౌంట్ నెంబరు ను ఆధార్ వివరాలతో అనుసంధానం చేస్తారు. ప్రభుత్వం నుంచి అందే అన్ని ప్రయోజనాలూ - పెన్షన్లు, స్కాలర్షిప్పులు మొదలు పంట భీమా, ఎరువుల సబ్సిడీ వరకూ ప్రతి ఒక్కటీ - నేరుగా లబ్దిదారుడి బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు. అదే విధంగా, ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రస్తుతం రేషన్ కార్డు ఆధారంగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇకపై, రేషన్ కార్డుతో పాటు ఆధార్ గుర్తింపు సైతం తప్పనిసరి అవుతుంది. రేషన్ షాపుల్లో లబ్దిదారుల ఎలక్ట్రానిక్ వేలిముద్రలు సేకరించి, కార్డు దారులే అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పంపిణీ జరుగుతుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన జిల్లాలో రేషన్ పంపిణీ, పెన్షన్లు, స్కాలర్షిప్పుల, ఉపాధి హామీ వేతనాల పంపిణీని ఆధార్ సమాచారం ఆధారంగా జరపబోతున్నారు. ఈ కొత్త విధానం వల్ల జరగబోయే ప్రయోజనం ఏమిటి? ముందుగా ప్రభుత్వానికి ఒనగూడే ప్రయోజనం గురించి చెప్పుకుందాం. స్కీముని ప్రారంభిస్తూ, టీవీ కెమెరాల సాక్షిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే మొత్తం కుటుంబాల సంఖ్య పన్నెండున్నర లక్షలు కాగా, అధికారులు జారీ చేసిన తెలుపు రంగు రేషన్ కార్డుల పదిహేను లక్షలు. తెలుపురంగు కార్డుల కోసం ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి!! ఇక రాష్ట్రం మొత్తమీద పరిస్థితి ఏమిటన్నది సులువుగానే ఊహించవచ్చు. ఒక్క రూపాయికి కిలో బియ్యంతో సహా అనేక సబ్సిడీలని పొందేందుకు తెల్ల కార్డే ఆధారం. ఈ తెల్ల కార్డుల్లో బోగస్ కార్డులు అధికంగా ఉన్నాయి అన్నది నిర్వివాదం. ఇప్పుడు రేషన్ సరుకులు అందజేసేందుకు లబ్దిదారుడి ఎలక్ట్రానిక్ వేలిముద్ర ఆధారంగా జరిగే నిర్ధారణం తప్పనిసరి. కాబట్టి, బోగస్ కార్డులకు పంపిణీ కుదరదు. ఒక్కో వ్యక్తికీ ఒక్కో ఆధార్ సంఖ్య మాత్రమే ఉంటుంది కాబట్టి, ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉన్నా ఒక్క కార్డు మాత్రమే ఉపయోగించగలరు. (ఇదే విధానాన్ని వంట గ్యాస్ సిలిండర్లకీ ప్రవేశ పెట్టేందుకు కృషి జరుగుతోంది). ఇక, మరణించిన వారి పేరుపై కేన్సిల్ కాకుండా ఉండిపోయిన కార్డులు. లబ్దిదారుడి ఎలక్ట్రానిక్ వేలిముద్ర లేకుండా సరుకుల పంపిణీ సాధ్యం కాదు కాబట్టి, ఈ కార్డులని ఉపయోగించడం ఇకపై కుదరదు. పెన్షన్లు, స్కాలర్షిప్పులు, ఉపాధి హామీ వేతనాల పంపిణీకీ ఇదే విధానం కాబట్టి, బోగస్ చెల్లింపులకి అడ్డుకట్ట పడే వీలుంది. ప్రభుత్వం నుంచి ప్రజలకి అందే ప్రయోజనాలు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలో క్రెడిట్ అవుతాయి కాబట్టి, లబ్దిదారులు ఎవరికీ లంచాలు ఇవ్వనవసరం లేదన్నది ఏలినవారు చెబుతున్న మరో ప్రయోజనం. అయితే, వ్యవస్థలో వేళ్ళూనుకు పోయిన అవినీతి ఇంత సులువుగా రూపు మాసిపోతుందని అనుకోలేం. ఎవరి మార్గాలని వారు ఈ పాటికే వెతుక్కునే ఉంటారు. ప్రస్తుతానికి వస్తే సామాన్య ప్రజలకన్నా, ప్రభుత్వానికి ఈ విధానం వల్ల ఎక్కువ ప్రయోజనం కనిపిస్తోంది. కార్యక్రమం పూర్తిగా అమలులోకి వచ్చాక పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్నది వేచి చూడాల్సిన విషయం. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 7:31 PM 3 కామెంట్‌లు: లేబుళ్లు: వర్తమానం శనివారం, జనవరి 05, 2013 నరుడు-జాజిమల్లి అడివి బాపిరాజు రాసిన రెండు మినీ నవలలు నరుడు, జాజిమల్లి. రెంటినీ కలిపి ఓ సంకలనంగా వెలువరించింది విశాలాంధ్ర ప్రచురణాలయం. బాపిరాజు ఇతర సాంఘిక నవలలు నారాయణరావు, తుపాను, కోనంగి లతో పోల్చినప్పుడు ఈ రెండు నవలల్లోనూ స్పుటంగా కనిపించే భేదం ఒక్కటే. ఆ మూడు నవలల్లోనూ కథానాయకులు ఉన్నతాదాయ వర్గాల నుంచి వచ్చిన వారు కాగా, ఈ రెండు నవలల్లోనూ నాయకులు చాతుర్వర్ణ వ్యవస్థలో చివరి వర్గానికి చెందినవారు. అయినప్పటికీ వారు బాపిరాజు మార్కు కథానాయకులు. నల్లని వారైనా అందచందాల వారు, గుణ సంపన్నులు, అన్నింటినీ మించి గాంధీజీ భక్తులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని జక్కరం గ్రామంలో ప్రారంభమవుతుంది 'నరుడు' కథ. ఆ ఊరి పురోహితుడు సుబ్రహ్మణ్య అవధానులు గారి ఇంట పాలేరు మాదిగ చంద్రయ్య. అతని కొడుకు ఎల్లమంద. సాటివారిలా కొడుకుని పనులకి పంపకుండా, చదువుకి పంపుతాడు చంద్రయ్య. ఎల్లమంద చదువు ఏ ఆటంకాలూ లేకుండా సాగి కాలేజీకి వస్తుంది. అదే సమయంలో మహాత్ముడి హరిజన ఉద్యమం పల్లెల్లోకి కూడా పాకడంతో, ఆ ఊళ్ళో వదాన్యులు కొందరు పూనుకుని ఎల్లమందని కాలేజీలో చదివించడానికి ముందుకు వస్తారు. తన పుట్టుక కారణంగా వివక్ష ఎదుర్కొన్న ఎల్లమంద, ఫుట్ బాల్ ఆటలో తనకున్న ప్రావీణ్యం వల్ల కాలేజీ మొత్తంలో ఓ ప్రత్యేకత సాధించుకుని, మిత్రులని సంపాదించుకుంటాడు. (ఈ ఫుట్ బాల్ టోర్నమెంట్ సన్నివేశం మొత్తం - కించిత్ మార్పు చేర్పులతో - యండమూరి 'ఆనందోబ్రహ్మ' నవలలో కనిపిస్తుంది). ఇంజనీరింగ్ చదివిన ఎల్లమంద, ఎల్లమంద మూర్తి గా మారి ఆనకట్టల నిర్మాణం, జలవిద్యుత్ ఉత్పత్తి ల గురించి ఉన్నత చదువు నిమిత్తం విదేశాలకి వెడతాడు. (నీటి పారుదల, ప్రాజెక్టులు అనే అంశాలని స్పృశించిన తొలి తెలుగు నవల బహుశా ఇదే. ఈ మధ్య కాలంలో ఇదే అంశాన్ని విస్తృత కథా వస్తువుగా తీసుకుని 'దృశ్యాదృశ్యం' అనే చక్కని నవలని రాశారు రచయిత్రి చంద్రలత). చదువు పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన మూర్తికి మహాత్ముడి ఉద్యమంలో పాల్గొనాలా లేక ఉద్యోగంలో చేరాలా అన్న ప్రశ్న మొదలవుతుంది. అదే సమయంలో తన స్నేహితుడి సోదరి, యురేషియన్ జాతి కన్య జెన్నిఫర్ తో మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. వృత్తిరీత్యా వైద్యురాలు జెన్నిఫర్. యురేషియన్ లకి తెల్లని చర్మం ఉన్నా, వాళ్ళ జీవితాలు భారతీయ హరిజనుల కన్నా దారుణంగా ఉన్నాయని తెలుసు ఆమెకి. మూర్తి తన దేశంకోసం, తనవారి కోసం ఏం చేయగలిగాడు, మూర్తి-జెన్నిఫర్ ల ప్రేమకథ ఏ మలుపు తిరిగింది అన్నది ముగింపు. కేవలం తొంభై పేజీల ఈ మినీ నవల ఆసాంతమూ ఆపకుండా చదివిస్తుంది, ఆలోచనల్లో పడేస్తుంది. 'గీతాదేవి' గా మారిన పద్మావతి కథ 'జాజిమల్లి.' పువ్వులని అమితంగా ప్రేమించే పద్మావతికి సంగీతం అన్నా ప్రాణం. భర్త బుచ్చి వెంకటరావు ఎండు చేపలు, రొయ్యపప్పు ఎగుమతి చేస్తూ బాగానే గడిస్తున్నాడు. మద్రాసు నగరంలో వారి నివాసం. పద్మావతి, వెంకట్రావుల స్వస్థలం నెల్లూరు జిల్లా. బెస్త కుటుంబం నుంచి వచ్చారు ఇద్దరూ. చిన్నప్పుడే మొగుడూ పెళ్ళాం అని పేరు పెట్టించేసుకున్న పద్దాలు, బుచ్చి వెంకులు ఒకటి కావడానికి మాత్రం కొంచం ఆలస్యం జరిగింది. ఈలోగా సైన్యంలో పని చేసి, ప్రపంచాన్ని చూసి వచ్చిన బుచ్చి వెంకులు బాగా బతకడం ఎలాగో తెలుసుకుంటాడు. పెళ్లి తర్వాత వారి మకాం కావలికి, అటుపై మదరాసు నగరానికీ మారుతుంది. సంగీతం పట్ల పద్మావతికి ఉన్న ఆసక్తి గమనించిన వెంకటరావు ఆమెకి కర్నాటక సంగీతం నేర్పిస్తాడు. అంతే కాదు, చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యం అని నమ్మి ప్రైవేటుగా తను చదువుకుంటూ, పద్మావతినీ చదివిస్తాడు. సంగీతంలో పద్మావతికి యెంత పేరు వస్తుందంటే 'గీతాదేవి' అన్న బిరుదు అందుకుంటుంది ఆమె. సంగీత ప్రయాణం సాగుతూ ఉండగానే, వైవాహిక జీవితం పట్ల చిన్నగా అసంతృప్తి మొదలవుతుంది పద్మావతికి. వెంకటరావు తనకి తగిన వాడు కాదన్న భావన చిన్నగా మొదలై పెరిగి పెద్దది అవుతుంది. సరిగ్గా అదే సమయంలో సినీ సంగీత దర్శకుడు రాధాకృష్ణ పరిచయం అవుతాడు ఆమెకి. పద్మావతి పాటనీ, అంతకన్నా ఎక్కువగా పద్మావతినీ ఇష్టపడతాడు అతడు. రెండు కుటుంబాల మధ్యా స్నేహం పెరిగాక, రాధాకృష్ణ భార్య సుశీలకి దగ్గరవుతాడు వెంకటరావు. ఆ రెండు జంటల కథా ఏయే మలుపులు తిరిగి ఏ తీరం చేరింది అన్నది నవల ముగింపు. ఎనభై ఏడు పేజీల మినీ నవల ఇది. ఎక్కడా ఆపకుండా చదివిస్తుంది. వెంకటరావు సైతం మహాత్ముడి అభిమాని. వ్యాపారంలో నీతిని పాటించే వాడు. తన కులాన్ని వృద్ధిలోకి తేవాలన్న తపన ఉన్నవాడు. కళా సంస్కృతుల పట్ల రచయిత బాపిరాజుకి ఉన్న మక్కువ రెండు నవలల్లోనూ కనిపిస్తుంది. (విశాలాంధ్ర ప్రచురణ, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు). వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 9:29 AM 2 కామెంట్‌లు: లేబుళ్లు: సాహిత్యం గురువారం, జనవరి 03, 2013 లోపలి మనిషి అతను బాగా చదువుకున్న వాడు. సమాజాన్ని గురించి -మరీ ముఖ్యంగా అసమానతల గురించి - బాగా తెలిసిన వాడు. వాటిని తొలగించడం అతని కల. అతనో స్వాప్నికుడు. స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కలలుకన్న సోషలిస్టు సమాజమే అతని కల కూడా. ఆ కలని నెరవేర్చుకోడం లో ఉన్న అడ్డంకులు అతనికి తెలుసు. అయినప్పటికీ అతనిదగ్గర ఓ స్పష్టమైన మార్గమూ, లక్ష్య సాధనకు అవసరమైన పట్టుదలా, మొండితనమూ ఉన్నాయి. అలాగని అతని మనసులో ఏముందో పొరబాటున కూడా బయట పడనివ్వడు. ఎందుకంటే అతడు అంతర్ముఖుడు. అతడిపేరు ఆనంద్. విదేశీ మారక నిల్వలు మొత్తం హరించుకుపోయి, మన బంగారం నిల్వలు సైతం విదేశీ బ్యాంకుల తనఖాలో ఉండిపోయి దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో పడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు సరైన సమయంలో 'నూతన ఆర్ధిక సంస్కరణలు' ప్రవేశపెట్టే నిర్ణయం తీసుకుని ఇవాల్టి రోజున భారత దేశం అగ్రగామి దేశంగా ఎదగడానికి అవసరమైన ధైర్యాన్ని ఇచ్చిన దార్శనికుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆత్మకథ లాంటి నవల - ఆంగ్ల 'ది ఇన్సైడర్' కి తెలుగు అనువాదం - 'లోపలి మనిషి' లో కథా నాయకుడు ఈ ఆనంద్. ఏడువందల యాభై రెండు పేజీల బరువైన ఈ పుస్తకంలో ఏ కొన్ని పేజీలు తిరగేసినా ఆనంద్ మరెవరో కాదు, పీవీనే అన్న సంగతి సులువుగానే బోధ పడుతుంది. దేశానికి స్వతంత్రం వచ్చినా ఇంకా పరాయి పాలనలో ఉన్న ఆఫ్రోజాబాద్ సంస్థానంలో ఓ చిన్న ఊరు ఆనంద్ ది. భూములు చాలానే ఉన్నా, నీటి వసతి తక్కువ కావడం వల్ల పెద్దగా ఆదాయం లేని కుటుంబం, మధ్య తరగతి నేపధ్యం. చురుకైన విద్యార్ధి ఆనంద్ కళాశాల విద్య పూర్తయ్యే రోజుల్లోనే ఆఫ్రోజాబాద్ విముక్తి కోసం సాయుధ పోరాటం ప్రారంభమవుతుంది. దేశ భక్తుడైన ఆనంద్ స్వయంగా ఆయుధం పట్టి పోరాటంలో పాల్గొనడమే కాదు, రహస్య జీవితాన్నీ గడుపుతాడు. ప్రధాని నెహ్రూ చొరవతో ఆఫ్రోజాబాద్ కి విముక్తి లభించగానే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడతాడు ఆనంద్. ఎమ్మెల్యే గా గెలిచిన ఆనంద్ ముఖ్యమంత్రి మహేంద్రనాథ్, అసమ్మతినేత చౌదరి లతో సమదూరం పాటిస్తాడు. కొన్ని రాజకీయ పరిణామాల అనంతరం చౌదరి ముఖ్యమంత్రి కావడం, ఆనంద్ ని కేబినేట్ లోకి తీసుకుని వివాదాస్పద భూసంస్కరణల శాఖకి మంత్రిగా నియమించడం జరిగిపోతాయి. ప్రధాని నెహ్రూ కలలుకనే సోషలిజం సాధించడానికి భూసంస్కరణలు ఓ చక్కని మార్గంగా భావించిన ఆనంద్, వాటిని అమలు పరచి తీరాలని స్థిర నిర్ణయం తీసుకుంటాడు. అయితే భూస్వామ్య వర్గాల నుంచి వచ్చిన వత్తిడి, పార్టీ నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో అతని కృషి ముందుకు సాగదు. రెండుసార్లు అదే శాఖ మంత్రిగా పని చేసిన ఆనంద్, ఇందిరాగాంధీ నామినేట్ చేయడంతో చౌదరి స్థానంలో ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు కూడా అతడి మొగ్గు భూ సంస్కరణల వైపే. శ్రమదమాదులకి ఓర్చి తన లక్ష్యాన్ని చేరుకున్న ఆనంద్, అందుకు గాను ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాడు అన్నది పుస్తకం ముగింపు. స్వాతంత్రం తర్వాతి నాలుగు దశాబ్దాలలో దేశంలో జరిగిన అనేక పరిణామాలు, రాష్ట్ర రాజకీయాలని కళ్ళ ముందు నిలిపే రచన ఇది.నెహ్రూ స్వప్నాలు దార్శనికత, ప్రజాభిమానం, పంచశీల సిద్ధాంతం, చైనా యుద్ధం (1962), నెహ్రూ అస్తమయం (1964), పాకిస్తాన్ యుద్ధం (1965), తాష్కెంట్ ఒప్పందం, లాల్ బహదూర్ శాస్త్రి మరణం (1966), ఇందిరా గాంధీ ప్రధాని కావడం, బంగ్లాదేశ్ అవతరణ (1971) లాంటి పరిణామాలని తనదైన కోణంలో వివరించారు పీవీ. అంతే కాదు, రాజకీయ క్రీడ వికృత రూపం దాల్చడం, అవినీతి వేరు పురుగులాగా వ్యవస్థలొకి జొరబడడం, ఎగువ సభలకి జరిగే ఎన్నికలు డబ్బుమయం గా మారడం, రాష్ట్రంలో అసమ్మతి రాజకీయాలు, పైచేయి కోసం వర్గాల మధ్య పోరాటం...ఇలా ఏ ఒక్క విషయాన్నీ విడిచిపెట్టకుండా నిశితంగా చిత్రించారు. రాష్ట్రం పేరునీ, నాయకుల పేరునీ మార్చిన రచయిత, కేంద్రంలో ముఖ్య నాయకులని మాత్రం వారి పేర్లతోనే పరిచయం చేశారు పాఠకులకి. రాష్ట్ర రాజకీయాలు తెలిసిన వారికి, సదరు రాష్ట్ర నేతలని పోల్చుకోవడం ఏమంత కష్టం కాదు. ఓ మహిళా నాయకురాలితో తనకి గల సాన్నిహిత్యాన్ని గురించి వినిపించిన రకరకాల కథనాలని దాచే ప్రయత్నం చేయలేదు రచయిత. అరుణ పాత్ర ద్వారా విశదంగానే చెప్పారు. ఓ భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన అరుణ, ఓ ఉన్నతోద్యోగి భార్య. వైవాహిక జీవితం సంతృప్తిగా లేకపోవడంతో రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యే అవుతుంది. అప్పుడే ఆనంద్ కూడా ఎమ్మెల్యే కావడంతో, పార్టీ ఆఫీసులో జరిగిన వారి పరిచయం అసెంబ్లీలో పెరిగి పెద్దదవుతుంది. తన వైవాహిక జీవితం పట్ల అసంతృప్తి తో ఉన్న ఆనంద్, అరుణకి దగ్గర అవుతాడు. వారి సాన్నిహిత్యం, తర్వాతి కాలంలో ఆనంద్ మీద అతని ప్రత్యర్ధులు (సొంత పార్టీ వారే) బురద జల్లడానికి మంచి అవకాశంగా మారుతుంది. ఎన్ని జరిగినా ఆనంద్-అరుణ ల మధ్య బంధం బలపడిందే తప్ప, తెగిపోలేదు. పీవీ నరసింహా రావు లోతైన ఆలోచనలకి అక్షరరూపం ఈ పుస్తకం. జరుగుతున్న ప్రతి పరిణామాన్నీ లోతుగా విశ్లేషించడం ఆనంద్ అలవాటు. తనపై కుట్రలు జరిపే వారితో ముఖాముఖి తలపడే మనిషి కాదు..కానీ తానేమిటో చేతల్లో చూపిస్తాడు. ఆనంద్ కి మంత్రివర్గంలో చోటిస్తూ, చౌదరి అతనికి పెట్టిన ముద్దుపేరు 'బృహస్పతి.' అతడు నిజంగానే బుద్ధికి బృహస్పతి అని నిరూపితమయ్యే సన్నివేశాలు బోలెడు. స్వతంత్రానంతర పరిణామాలు, దేశ, రాష్ట్ర రాజకీయాలపై అవగాహనా, ఆసక్తి ఉన్నవారిని ఏక బిగిన చదివించే పుస్తకం ఇది. ఓ అంతర్ముఖుడి ఆలోచనా స్రవంతి. నెహ్రూని దైవ స్వరూపుడి గానూ, ఇందిర ను శక్తి స్వరూపిణి గానూ చిత్రించారు రచయిత. ఇందిర హత్య, రాజీవ్ ప్రధాని కావడం, రాజీవ్ హత్యానంతర పరిణామాల్లో ఆనంద్ ప్రధాన మంత్రి పదవీ బాధ్యతలని తన భుజాలకి ఎత్తుకున్నాడన్నపేరాతో పుస్తకం ముగిసిపోవడం కించిత్ నిరాశని మిగిల్చింది. (ఎమెస్కో ప్రచురణ, వెల రూ. 350, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు). (బ్లాగ్మిత్రులు ఉమాశంకర్ గారికి కృతజ్ఞతలు) వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 7:04 PM 4 కామెంట్‌లు: లేబుళ్లు: సాహిత్యం బుధవారం, జనవరి 02, 2013 నమ్మకం మనుషుల్లో నమ్మకం తగ్గిపోతూ ఉండడం అన్నది మొదటినుంచీ ఉన్నదేనా లేక ఈమధ్య కాలంలో వేగంగా జరుగుతున్న పరిణామమా అన్నది నన్ను చాలా రోజులుగా వెంటాడుతున్న సందేహం. సాటి మనిషి మీద నమ్మకం - ఆ మనిషి కుటుంబ సభ్యుడు, స్నేహితుడు, పరిచయస్తుడు... ఇలా ఎవరైనప్పటికీ - బలహీన పడింది అనో, మొత్తానికి పోయింది అన్నదో ఈమధ్యన తరచూ వినిపిస్తున్న మాట. అలాగే "ఫలానా వాళ్ళు నన్ను నమ్మడం లేదు" అన్న ఫిర్యాదు కూడా. ఇచ్చిపుచ్చుకోవడం అన్నది నమ్మకానికీ వర్తిస్తుంది కాబట్టి, ఈ ఫిర్యాదు సహజమే. ఇదివరకటి రోజుల్లో కుటుంబం మొత్తం ఇంటిపెద్ద చెప్పుచేతల్లో ఉండేది. ఆ పెద్ద ఏం చెబితే అదే చేసేవారు ఇంటిళ్ళపాదీ. ఆపూట చేయాల్సిన వంట మొదలు, ఆస్తుల కొనుగోళ్ళు, అమ్మకాలు, పిల్లల చదువులు, ఉద్యోగాలు...ఇలా ఏ విషయమైనా ఒక్క మాట మీద జరిగిపోయేవి. 'పెద్ద వాళ్ళు మన మంచికోసమే ఆలోచిస్తారు' అన్న నమ్మకం బలంగా ఉన్న రోజులు అవి. ఒకవేళ, ఇంటిపెద్ద నిర్ణయం ఎవరికైనా నచ్చకపోయినా వెనుక మరొకరితో ఆ మాట చెప్పుకోవాల్సిందే కానీ, ముఖాముఖీ ఎదిరించడం అన్నది అరుదు. వెనుకటి తరంలో వచ్చిన సాహిత్యం ఇప్పుడు చదువుతూ ఉంటే కొన్ని కొన్ని సంఘటనలు భలే ఆశ్చర్యంగా అనిపిస్తాయి. నాకు బాగా నచ్చిన పుస్తకం 'కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయచరిత్ర' చదువుతుంటే ఆశ్చర్యమే కాదు, చాలా చోట్ల 'ఇది నిజమేనా?' ని కించిత్ అపనమ్మకం కలిగింది కూడా. ముఖ్యంగా శాస్త్రి గారు తన ఉద్యోగానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలన్నీ తన గురువులకే వదిలేసి నిశ్చింతగా ఉండడం.. "ఈరోజుల్లో అయితే ఇది సాధ్యమేనా?" అని చాలాసార్లే అనిపిస్తూ ఉంటుంది. ఈ నమ్మకం అనేది ఎందుకు తగ్గిపోతోంది? స్వార్ధం పెరిగిపోవడం, బతుకు పరుగు పందెం లో ముందు ఉండాలనో, వెనకబడిపోకూడదు అనో, ఎవరెలా పొతే మనకేమి అనే ధోరణి పెరిగిపోవడం, మనంతటి వాళ్ళం మనం..మన విషయాల్లో మరొకరి జోక్యం ఏమిటి అనో... ఇలా అనేకానేక కారణాలు కనిపిస్తాయి. వ్యక్తీ స్థాయిలో మొదలైన ఆలోచన ప్రభావం కుటుంబం మీద కనిపించడం, కుటుంబ బంధాల్లో వచ్చిన మార్పుల ప్రభావం సమాజం మీద ఉండడం అన్నది అనివార్యం. కుటుంబాలు అన్నీ కలిస్తేనే కదా సమాజం. "మనుషుల మధ్య దూరం పెరిగిపోడంలో ప్రపంచీకరణ పాత్ర చాలా ఉంది" అంటారు మిత్రులొకరు. కలిసికట్టుగా ఉండే మనుషుల మధ్యన పోటీ మొదలయ్యిందనీ, ఈ పోటీ కారణంగానే మనుషులలో నమ్మకం తగ్గిపోతోందనీ తన వాదన. ఒకప్పుడు పల్లెటూళ్ళకి ఎవరన్నా కొత్తవాళ్ళు వెళ్ళినా చక్కని ఆతిధ్యం దొరికేదనీ, ఇప్పుడు మంచినీళ్ళు పుట్టడం కూడా కష్టం అయిపోతోందనీ చెప్పుకొచ్చారు. ఆలోచిస్తే కొంత నిజం లేకపోలేదు అనిపించింది. మనుషుల్లో నమ్మకం అన్నది బొత్తిగా తగ్గిపోతే వైట్ కాలర్ నేరాలు ఇంతగా ఎందుకు పెరుగుతాయి? నమ్మితేనే కదా మోసం జరిగేది. నకిలీ బంగారం, మనీ సర్క్యులేషన్ స్కీములు, రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసే చిట్టీ కంపెనీలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు చేసే ఏజన్సీలు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉండడానికి కారణం జనంలో మిగిలిఉన్న నమ్మకమా లేక పెరుగుతున్న అత్యాశా? ఆలోచించాల్సిన విషయమే. ...మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎందరిని మనం మనస్పూర్తిగా నమ్మగలం? ఇది కొంచం కలవరపెట్టేప్రశ్న, హిపోక్రసీ కి తావులేకుండా మనకి మనమే సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేసి చూద్దామా!! వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 6:18 PM 6 కామెంట్‌లు: లేబుళ్లు: అవీ-ఇవీ మంగళవారం, జనవరి 01, 2013 ప్రవీణ్ గెలిచాడు... మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 'పాడుతా తీయగా' సిరీస్ 'గ్రాండ్ ఫినాలే' చూస్తూ రెండువేల పన్నెండుకి వీడ్కోలు పలికి, రెండువేల పదమూడుకి స్వాగతం పలికాం మేము. సెమి-ఫైనల్స్ దశ నుంచీ ఊహిస్తున్నట్టే నెల్లూరుకి చెందిన యువ గాయకుడు ప్రవీణ్ కుమార్ ప్రధమ స్థానంలో నిలిచి మూడు లక్షల రూపాయల నగదు బహుమతి అందుకోగా, విజయవాడ అమ్మాయి చారుమతీ పల్లవి రెండో స్థానంలో నిలబడి లక్షరూపాయల బహుమానం అందుకుంది ఈటీవీ వారి నుంచి. ఫైనల్స్ వరకూ ప్రవీణ్ కి గట్టి పోటీ ఇచ్చిన శరత్ సంతోష్ (హైదరాబాద్) మూడోస్థానం లోనూ, క్వార్టర్ ఫైనల్స్ నుంచీ తన ప్రతిభకి మెరుగు పెట్టుకుంటూ వచ్చిన విజయవాడ గాయకుడు సూర్య కార్తీక్ నాలుగో స్థానంలోనూ నిలబడ్డారు. గడిచిన సిరీస్ లతో పోల్చినప్పుడు, ఈ సిరీస్ చాలా ఆహ్లాదంగా సాగిందనే చెప్పాలి. ముఖ్యంగా అతిధులందరూ సంగీతానికీ పాట కీ సంబంధించిన వాళ్ళే కావడం వల్ల, సాంతమూ సంగీత ప్రధానంగానే సాగింది. ఇతరత్రా విషయాల ప్రస్తావన బహు తక్కువగా ప్రస్తావనకి వచ్చాయి. అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు పై చేసిన కార్యక్రమం ఈ సిరీస్ కి హైలైట్ గా చెప్పాలి. అలాగే కార్తీక్, కల్పన లాంటి పరభాషా గాయకులూ అతిధులుగా హాజరయ్యారు. గాయనీ గాయకులు ఎంచుకున్న పాటలు సైతం వైవిధ్య భరితంగా ఉన్నాయి ఈసారి. మరీ ముఖ్యంగా క్వార్టర్ ఫైనల్స్ నుంచీ ప్రతి ఎపిసోడ్ లోనూ కనీసం రెండు మూడు పాటలన్నా అంతగా ప్రాముఖ్యం పొందని మంచి పాటలు వినిపించాయి. ఇది ఆహ్వానించాల్సిన పరిణామం. అలాగే, బాలూ-అతిథుల పరస్పర పొగడ్తలు ఉన్నప్పటికీ, పాటలు పాడిన వారికి ఉపయోగ పడే తగుమాత్రం సూచనలూ ఉన్నాయీసారి. ప్రాధమిక దశ ఎంపిక ఈసారి కూడా ఆశ్చర్యం కలిగించింది. తొలి ఎపిసోడ్స్ లో నిష్క్రమించేది ఎవరో సులువుగానే అర్ధమైపోయింది. గత కొద్ది సిరీస్ ల నుంచీ ఇలా జరుగుతోంది ఈ కార్యక్రమంలో. అలాగని ఆంద్ర దేశంలో అవుత్సాహిక గాయకులు తగ్గిపోతున్నారని అనుకోలేం కదా. ఫైనల్స్ కి మిగిలిన నలుగురు గాయకుల్లో, శరత్ సంతోష్ బాల గాయకుడిగా జీ టీవీ వారి సంగీత కార్యక్రమం లో పాల్గొని ఫైనల్స్ వరకూ వచ్చాడు. ఆ అనుభవం అతనికి చాలా సార్లే ఉపయోగ పడింది. ఓ దశలో ప్రవీణ్ కి గట్టి పోటీ ఇచ్చిన శరత్, ఫైనల్స్ కి వచ్చేసరికి అనూహ్యంగా వెనుక బడ్డాడు. శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉన్న ప్రవీణ్ లో చూడగానే ఆకట్టుకునేది పాట పట్ల అతని శ్రద్ధ. పాటలో లీనమై పాడే తీరు. అతను పాడుతున్నప్పుడు, పాటలో భావానికి అనుగుణంగా మారిపోయే శరీర భాష తెచ్చిపెట్టుకున్నది కాదనే చెప్పాలి. గ్రాండ్ ఫినాలే లో "ఈగ ఈగ ఈగ..." పాటని పాడిన తీరు అధ్బుతం అంతే. చారుమతీ పల్లవి ప్రత్యేకత ఆమె గొంతు. శాస్త్రీయ సంగీతమైనా, పాశ్చాత్య ధోరణి లో సాగే పాట అయినా ఆమె గొంతులో చక్కగా ఒదిగిపోతుంది. గ్రాండ్ ఫైనలే కి అతిధులుగా సంగీత దర్శకుడు ఉపద్రష్ట విద్యాసాగర్, 'డ్రమ్స్' శివమణి హాజరయ్యారు. వచ్చే సోమవారం నుంచి బాల గాయనీ గాయకులతో కొత్త సిరీస్.. ఎలా ఉంటుందో చూడాలి.. వీరిచే పోస్ట్ చేయబడింది మురళి వద్ద 12:53 PM 4 కామెంట్‌లు: లేబుళ్లు: అవీ-ఇవీ కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్ దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom) తలంపు వైద్య విద్య 'రక్షించాల్సింది ఉక్రెయిన్ లో చిక్కుబడ్డ విద్యార్థులనే కాదు, ఇక్కడ చదువు కొనలేక అక్కడికి వెళ్లేలా చేసిన మన విద్యా వ్యవస్థని కూడా' గ...
ఎన్నికలకు చాలా దూరం ఉంది. అయితే రాజకీయ నేతలకు ముందు చూపు ఎక్కువ కదా. ముందే బెర్త్ కన్ ఫర్మ్ చేసుకుంటే ఫ్యూచర్ కి ఎలాంటి ఢోకా ఉండదని భావించే బాపతు అంతా ఇపుడు సీట్ల వేటలో తెగ బిజీ అవుతున్నారు. ఈ విధంగా ఆలోచించేవారిలో ఆవేశపడో అత్యాశపడో టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వారే ఎక్కువ మంది ఉండడం విశేషం. ఉన్న పార్టీలో విలువ లేదు. ఇలాగే ఉంటే అసలు ఉనికే లేకుండా పోతుంది అన్న ఆవేదనతో ఉన్న వారు అంతా వేరే రూటు చూసుకుంటున్నారు. అలా రాయలసీమలో కీలక జిల్లాగా ఉన్న కర్నూల్ లో మాజీ ఎంపీ బుట్టా రేణుక తట్టా బుట్టా సర్దుకునే పనిలో పడ్డారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. నిజానికి ఆమెను రాజకీయాల్లొకి తెచ్చి ఫస్ట్ టైమ్ ఎంపీని చేసింది వైసీపీనే. 2014 ఎన్నికల్లో కర్నూల్ నుంచి లోక్ సభకు రేణుకకు టికెట్ ఇచ్చి జగన్ గెలిపించుకున్నారు. అయితే గెలిచిన మూడేళ్ళకే ఆమె టీడీపీలోకి వెళ్లిపోయారు. అంతకు ముందే ఆమె భర్త టీడీపీతో మంతనాలు ఆడి అంతా సిద్ధం చేసి ఉంచారని అంటారు. ఇక టీడీపీలో ఆమె బ్రైట్ ఫ్యూచర్ ని ఆశించారు. కానీ అక్కడ కూడా సీన్ రివర్స్ అయింది. కర్నూల్ ఎంపీ టికెట్ ని కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన సీనియర్ నేత కోట్ల సూర్య ప్రకాశరెడ్డికి చంద్రబాబు ఇచ్చారు. అలాగే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కలేదు. దాంతో ఆమె ఫ్లేట్ ఫిరాయించి మళ్లీ వైసీపీ గూటికి చేరుకున్నారు. కానీ జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ టైమ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మరి కొద్ది నెలల్లో మూడేళ్ళు నిండిపోతాయి. అయినా కూడా రేణుక ఆశిచిన పదవులు ఏవీ వైసీపీలో దక్కలేదు. ఆమె రాజ్యసభ కోరుకున్నారు. ఇక ఎమ్మెల్సీ అయినా ఇస్తారని భావించారు. ఈ మేరకు జగన్ని పలుమార్లు కలిశారు కూడా. ఇదిలా ఉంటే ఒకసారి పార్టీని కాదని చెప్పి బయటకు వెళ్లి వచ్చిన వారికి జగన్ పదవులు ఇవ్వరని పార్టీలో ఒక అగ్ర నేత నుంచి ఆమెకు సమాచారం లీక్ అవడంతో ఇక వైసీపీలో ఉండడం వేస్ట్ అని భావిస్తున్నారుట. దీంతో టీడీపీతో రాయబేరాలు కూడా నడిచాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ టికెట్ ని రేణుక ఆశిస్తున్నారు. సీనియర్ మోస్ట్ అయిన కోట్ల సూర్య ప్రకాశరెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వకూడదని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది అంటున్నారు. దాంతో బుట్టా రేణుకకు లైన్ క్లియర్ అంటున్నారు. ఒకవేళ ఈ కారణం చేత అయినా ఎంపీ టికెట్ రాకపోయినా ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఖాయం అంటున్నారు. కర్నూల్ జిల్లాలో బలమైన చేనేత సామాజికవర్గానికి చెందిన రేణుకకు టికెట్ ఇస్తే బీసీలు అంతా తమ వెంట ఉంటారని టీడీపీ కూడా అంచనా వేసుకుంటోందిట. మొత్తానికి అటూ ఇటూ కూడా అంతా ఒకేగా ఉన్న పరిస్థితి ఉంది అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఏ సమయంలో అయినా తట్టా బుట్టా సర్దుకుని ఈ మహిళా నేత వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేయడం ఖాయమనే జిల్లాలో టాక్ గట్టిగా వినిపిస్తోంది.
సిని పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కె.వి.ఆనంద్ గారు గుండెపోటుతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరిన ఆయన శుక్రవారం తెల్లవారుజామున 3: 30 నిమిషాలకు చనిపోయారు. ఆయన వయసు 54 సంవత్సరాలు ఆయన చనిపోవడంతో తమిళ చిత్ర పరిశ్రమ నటులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చెన్నై లో పుట్టి పెరిగిన కె.వి.ఆనంద్ ఫోటో జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభించారు. కల్కి, ఇండియా టుడే దిన పత్రికలో పని చేసి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన పి.సి.శ్రీరామ్ వద్ద సినిమాటోగ్రఫీ లో శిక్షణ పొందారు. తెన్మావిన్ కొంబాత్ అనే మలయాళ చిత్రంలో సినిమాటోగ్రాఫర్గా 1994లో కె.వి.ఆనంద్ కెరీర్ ను ప్రారంభించారు. తమిళం, తెలుగు, మలయాళం మరియు బాలీవుడ్ చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆ తర్వాత “కనా కందెన్” సినిమాతో దర్శకుడిగా మారదు. జీవా తో రంగం, సూర్య తో బ్రదర్స్, వీడొక్కడే లేటెస్ట్ గా బందోబస్తు వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. చివరిగా ఆయన సూర్యతో బందోబస్త్ సినిమా చేశారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన తెన్మావిన్ కొంబాత్ చిత్రానికి గాను 1994లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా గా జాతీయ అవార్డును అందుకున్నారు. సినిమాటోగ్రాఫర్ గా తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడం విశేషం. కె.వి.ఆనంద్ హఠాత్ మరణం పై తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. KV Anand sudden death You May Also Like Corona Updates, Latest Film News in Telugu, Tollywood Film News In Telugu May 6, 2021 2Likes ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్ కరోనా ప్రోటోకాల్స్ పై ఒక వీడియోను విడుదల చేసింది..! – Latest Film News In Telugu
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ Compare Bible Prev Next 1. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో నున్న తన తల్లి సహోదరులయొద్దకుపోయి వారి తోను తన తల్లి పితరుల కుటుంబికులందరితోను 2. మీరు దయచేసి షెకెము యజమానులందరు వినునట్లు వారితో మాటలాడి మీకేది మంచిది? యెరుబ్బయలుయొక్క కుమారులైన డెబ్బదిమంది మనుష్యులందరు మిమ్మును ఏలుటమంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుటమంచిదా? నేను మీ రక్తసంబంధినని జ్ఞాపకముచేసికొనుడి అని పలుకుడనెను. 3. అతని తల్లి సహోదరులు అతనిగూర్చి షెకెము యజమా నులు వినునట్లు ఆ మాటలన్నియు చెప్పగా వారుఇతడు మన సహోదరుడనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి; 4. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలోనుండి డెబ్బది తులముల వెండి తెచ్చి అతనికియ్యగా వాటితో అబీమెలెకు అల్లరిజనమును కూలికి పెట్టుకొనెను, వారు అతని వశమున నుండిరి. 5. తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి యింటికి పోయి యెరుబ్బయలు కుమారు లును తన సహోదరులునైన ఆ డెబ్బదిమంది మనుష్యులను ఒక్క రాతిమీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను. 6. తరువాత షెకెము యజమానులందరును మిల్లో ఇంటివారందరును కూడివచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షముక్రింద దండు పాళెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. 7. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండకొప్పున నిలిచి యెలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెనుషెకెము యజమానులారా, మీరు నా మాట వినిన యెడల దేవుడు మీ మాట వినును. 8. చెట్లు తమమీద రాజును ఒకనిని అభిషేకించు కొనవలెనను మనస్సుకలిగి బయలుదేరి 9. మమ్మును ఏలుమని ఒలీవచెట్టు నడుగగా ఒలీవచెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యకమాని చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను. 10. అప్పుడు చెట్లునీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా 11. అంజూ రపు చెట్టుచెట్ల మీద రాజునైయుండి యిటు అటు ఊగు టకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా? అని వాటితో అనెను. 12. అటుతరువాత చెట్లునీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా ద్రాక్షావల్లి 13. దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్లమీద రాజునై యుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను. 14. అప్పుడు చెట్లన్నియు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్లపొదయొద్ద మనవిచేయగా 15. ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియ మించుకొన గోరినయెడల రండి నా నీడను ఆశ్రయించుడి; లేదా అగ్ని నాలోనుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను. 16. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించెను. 17. అయితే మీరు నా తండ్రి కుటుంబముమీదికి లేచి, యొక రాతిమీద అతని కుమారులైన డెబ్బదిమంది మనుష్యులను చంపి, అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు మీ సహో దరుడైనందున షెకెము వారిమీద అతనిని రాజుగా నియమించి యున్నారు. యెరుబ్బయలు ఎడలను అతని యింటి వారియెడలను మీరు ఉపకారము చేయకయు 18. అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలె కును రాజుగా నియమించుకొనిన విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన యెడల 19. నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని యింటివారి యెడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన యెడల, అబీమెలెకునందు సంతోషించుడి అతడు మీ యందు సంతోషించునుగాక. 20. లేనియెడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెమువారిని మిల్లో యింటి వారిని కాల్చివేయునుగాక, షెకె మువారిలోనుండియు మిల్లో యింటినుండియు అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి 21. తన సహోదరుడైన అబీ మెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించెను. 22. అబీమెలెకు మూడు సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికయై యుండెను. 23. అప్పుడు యెరుబ్బయలు డెబ్బదిమంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకను వారి సహోదరుని మీదికిని, 24. అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్యవారి మీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకున కును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచించిరి. 25. ఎట్లనగా షెకెము యజ మానులు కొండ శిఖరములమీద అతని కొరకు మాటు గాండ్లను ఉంచి, ఆ మార్గమున తమకు సమీపించినవారి నందరిని దోచుకొనిరి; అది అబీమెలెకునకు తెలుపబడెను. 26. ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్ర యించిరి. 27. వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా 28. ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనెను అబీమెలెకు ఏపాటివాడు? షెకెము ఏపాటివాడు? మనము అతనికెందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబులు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రియైన హమోరు వారికి దాసులమగుదము గాని మనము అతని కెందుకు దాసులము కావలెను? 29. ఈ జనము నా చేతిలో ఉండిన యెడల ఆహా నేను అబీమెలెకును తొలగింతును గదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను. 30. ఆ పట్టణ ప్రధానియైన జెబులు ఎబెదు కుమారుడైన గాలుమాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను. 31. అప్పుడతడు అబీమెలెకు నొద్దకు రహస్యముగా దూతలను పంపిఇదిగో ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును షెకెముకు వచ్చి యున్నారు, వారు నీమీదికి ఈ పట్టణమును రేపు చున్నారు. 32. కావున రాత్రి నీవును నీతోనున్న జనులును లేచి పొలములో మాటుగా నుండుడి, 33. ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణముమీద పడ వలెను. అప్పుడు అతడును అతనితోనున్న జనులును నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారియెడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేసెను. 34. అబీమెలెకును అతనితోనున్న జనులందరును రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షెకెముమీద పడుటకు పొంచి యుండిరి. 35. ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్ట ణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితో నున్న జనులును పొంచియుండుట చాలించి లేచిరి. 36. గాలు ఆ జనులను చూచి జెబులుతోఇదిగో జనులు కొండశిఖరముల మీదనుండి దిగివచ్చుచున్నారనగా, జెబులుకొండల చాయలు మనుష్యులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను. 37. గాలుచూడుము, దేశపు ఎత్తయినప్థల మునుండి జనులు దిగి వచ్చుచున్నారు; ఒక దండు శకునగాండ్ల మస్తకివృక్షపు త్రోవను వచ్చు చున్నదనెను. 38. జెబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడనిన నీమాట యేమా యెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా 39. గాలు షెకెము యజ మానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను. 40. అబీమెలెకు అతని తరుమగా అతడు అతని యెదుట నిలువలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి. 41. అప్పుడు అబీ మెలెకు అరూమాలో దిగెను, గాలును అతని బంధువులును షెకెములో నివసింపకుండ జెబులు వారిని తోలివేసెను. 42. మరునాడు జనులు పొలములలోనికి బయలువెళ్లిరి. 43. అది అబీమెలెకునకు తెలియబడగా అతడు తన జనులను తీసికొని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి; అప్పుడతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారిమీద పడి వారిని హతముచేసెను. 44. అబీమెలెకును అతనితో నున్న తెగలును ఇంకసాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పరుగెత్తి పొలముల లోనున్న వారందరి మీదపడి వారిని హతముచేసిరి. 45. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధముచేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను. 46. షెకెము గోపుర యజమానులందరు ఆ వార్త విని ఏల్‌ బెరీతు గుడియొక్క కోటలోనికి చొరబడిరి. 47. షెకెము గోపుర యజమానులందరు కూడియున్న సంగతి అబీ మెలెకునకు తెలుపబడినప్పుడు 48. అబీమెలెకును అతనితో నున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్లనుండి పెద్ద కొమ్మను నరికి యెత్తి భుజముమీద పెట్టుకొనినేను దేనిచేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను. 49. అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటివలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు, అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యిమంది చచ్చిరి. 50. తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దిగి దాని పట్టుకొనెను. 51. ఆ పట్టణమునడుమ ఒక బల మైన గోపురముండగా స్త్రీ పురుషులును పట్టణపు యజ మానులును అక్కడికి పారిపోయి తలుపులు వేసికొని గోపుర శిఖరము మీదికెక్కిరి. 52. అబీమెలెకు ఆ గోపురము నొద్దకు వచ్చి దానిమీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాని కాల్చుటకు గోపురద్వారమునొద్దకు రాగా 53. ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. 54. అప్పుడతడు తన ఆయుధము లను మోయుబంటును త్వరగా పిలిచిఒక స్త్రీ అతని చంపెనని నన్నుగూర్చి యెవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడువగా అతడు చచ్చెను. 55. అబీమెలెకు చనిపోయెనని ఇశ్రాయేలీయులు తెలిసికొనినప్పుడు ఎవరిచోటికి వారు పోయిరి. 56. అట్లు అబీమెలెకు తన డెబ్బదిమంది సహోదరు లను చంపుటవలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతనిమీదికి రప్పించెను. 57. షెకెమువారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలలమీదికి మరల రాజే సెను; యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారిమీదికి వచ్చెను. Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియ బుధవారం పట్టాలెక్కింది. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య తొలి హెల్త్‌కార్డును ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్‌కు అందజేశారు. సచివాలయంలోని డీబ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగుల హర్షధ్వానాల మధ్య రాజయ్య హెల్త్‌కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. -టీఎన్జీవో నేత దేవీప్రసాద్‌కు తొలికార్డు అందజేత -మొత్తం 59 మందికి కార్డులు జారీ -నవంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో ప్రక్రియ -సీఎం కేసీఆర్ కలలను సాకారం చేయాలి: డిప్యూటీ సీఎం రాజయ్య -ఉద్యోగుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది: దేవీప్రసాద్ -కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు: శ్రీనివాస్‌గౌడ్ తొలిరోజు మొత్తం 59 మంది ఉద్యోగులకు కార్డులు పంపణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతూ.. ఎటువంటి ఆంక్షలు లేకుండా హెల్త్‌కార్డుల జారీకి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, ప్రీమియం చెల్లిస్తామని ఉద్యోగులు ముందుకొచ్చినా.. సున్నితంగా తిరస్కరించి, మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చెప్పారని గుర్తుచేశారు. ఉద్యోగులకు ఇది దీపావళి కానుక అని ప్రకటించారు. నవంబర్ 1 నుంచి ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని తెలిపారు. ఉద్యోగులందరూ బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేసి, ముఖ్యమంత్రి కేసీఆర్ కలల సాకారానికి కృషి చేయాలని కోరారు. ఉద్యోగులు మరింత ఎక్కువ పనిచేసి ప్రభుత్వ ఖజానాను పెంచాలని సూచించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ మాట్లాడుతూ హెల్త్‌కార్డుల విషయంలో తెలంగాణ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించిందన్నారు. ఉద్యోగులు ఎవ్వరూ ఊహించని రీతిలో ఆంక్షలు, ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా హెల్త్‌కార్డులు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాలు కార్డులు ఇవ్వడంలో విఫలమయ్యాయని, కేసీఆర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లిన 15 నిమిషాల్లో అంగీకరించారని సభికుల హర్షధ్వనాల మధ్య చెప్పారు. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం అంత సులువు కాదని, కానీ కేసీఆర్ మాత్రం ఉద్యోగులు ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండా, ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం సంతోషకరమన్నారు. టీజీవో వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఇప్పటివరకు హెల్త్‌కార్డుల విషయంలో 42 సమావేశాలు జరిగాయని గుర్తుచేశారు. 2008లో అప్పటి సీఎం వైఎస్ హెల్త్‌కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ తర్వాత ఒక్కోసారి ఒక్కోరకంగా మాటలు మార్చి, చివరికి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పజెప్పి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే, దీనికి ఆమోదం లభించిందన్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదన్న సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాటను వెంటనే నెరవేర్చారని అభినందించారు. ఉద్యోగులందరూ కలిసికట్టుగా పనిచేసి, రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఎన్‌జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, వివిధ ఉద్యోగసంఘాల నేతలు విఠల్, మమత, మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, హరిబాబు, కే వెంకటేశ్వర్లు, బీ రేచల్, విజయలక్ష్మి, ముజీబ్, మన్నెబోయిన కృష్ణయాదవ్, సత్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పీ వెంకటరెడ్డి, మునగాల మణిపాల్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, భుజంగరావు, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
కృష్ణా, గోదవరి నదుల నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వెంటనే వాటిని అడ్డుకోవాలని ఆయా నదుల అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ లేఖలు పోలవరంపై ఎత్తిపోతల వద్దని విజ్ఞప్తి శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ ప్రాజెక్టులూ ప్రస్తావన హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదవరి నదుల నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వెంటనే వాటిని అడ్డుకోవాలని ఆయా నదుల యాజమాన్య బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసింది. గోదావరిలో నీటి లభ్యత లేదని వాదిస్తూ, మరోవైపు పోలవరం ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని తరలించేలా అక్రమంగా ఎత్తిపోతల పథకాన్ని ఏపీ నిర్మిస్తోందని, గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) చైర్మన్‌కు రాసిన లేఖలో తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు పేర్కొన్నారు. గోదావరిలో నీటి లభ్యత లేనందువల్ల తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతినివ్వరాదంటూ, తమ ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ఏపీ పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని, మరి పోలవరం డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని తరలించేలా ఎత్తిపోతల పథకాలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. వీటి వల్ల వర్షాల్లేని కాలంలో ప్రధానంగా దిగువ ప్రాంతాలకు, గోదావరి డెల్టా సిస్టమ్‌(జీడీఎస్‌) పై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు. అలాగే, కృష్ణా నుంచి ఇతర బేసిన్లకు భారీగా నీటిని తరలించడానికి వీలుగా ఏపీ అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తోందని, ఆ పనులను అడ్డుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) చైర్మన్‌కు రాసిన లేఖలో తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలోని నాగార్జునసాగర్‌, శ్రీశైలం పరిధిలోని కృష్ణా బేసిన్‌ ప్రాంతాలకు నీటికి ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు. వన్యప్రాణులు,పర్యావరణ వ్యవస్థపైనా ప్రభావం ఉంటుందన్నారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి 34 టీఎంసీలకు మించి తరలించకుండా కట్టడి చేయాలని కోరారు.
Health Tips: ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. చలికాలంలో ఎక్కువగా డయోరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. చలికాలంలో చాలామంది ప్రజలకు ఎక్కువగా దగ్గు, జలుబు వంటి సాధారణమైన చిన్న చిన్న రోగాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో చాలామందికి గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలా జరుగుతుందనే విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. ఈ మధ్యకాలంలో గుండెపోటు సమస్యలు ఎక్కువ అవుతున్నాయని వైద్యులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. దీనికి చాలా కారణాలను వైద్యులు చెబుతున్నారు. వైద్యులు చెప్పిన దాని ప్రకారం ఉష్ణోగ్రతలు తగ్గడం మొదలైనప్పటి నుంచి గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోయినప్పుడు గుండె ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అలాగే రక్తపోటు ఎక్కువగా హెచ్చుతగ్గులు అయినా, గుండె వేగం పెరిగిన, శరీరం చల్లబడిన గుండెపోటు కు దారితీస్తుంది. అందుకోసమే ఎక్కువగా చల్లని ప్రదేశాలలో తిరగడం మంచిది కాదు. శరీరాన్ని చలికాలంలో ఎక్కువగా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల శ్వాసకోశ ఇబ్బందులు మన దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వయసులో పెద్దవారు, గుండె సమస్యలు ఉన్న వారు కూడా మంచులో తిరగకపోవడమే మంచిది. ఇలాంటివారు చల్లని వాతావరణంలో ఉండకపోవడమే మంచిది. ఈ చలికాలంలో చల్లని నీరు అధికంగా తాగడం వల్ల కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. చలికాలంలో శరీరానికి చెమట బయటకు రాదు. కాబట్టి కొన్ని ద్రవాలు ఊపిరితిత్తుల్లోనే ఉండిపోతాయి. దీనివల్ల శ్వాస సమస్యలు పెరిగి చివరికి గుండెపోటుకు దారితీస్తుంది. ఇంకా చెప్పాలంటే చలికాలంలో చాలామందిలో విటమిన్-డి లోపిస్తుంది. దీనికి గల కారణం చలి ఎక్కువగా ఉండటం వల్ల ఎవరు ఇంట్లో నుండి బయటకి రాకుండా ఉండకపోవడమే. అందువల్ల విటమిన్ డి మన శరీరానికి ఎంతో అవసరం గుండెపోటు రాకుండా విటమిన్ డి అడ్డుకుంటుంది. చలికాలంలో ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. చలికాలంలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం అంత మంచిది కాదు. ఇంకా చెప్పాలంటే చలికాలం ఉదయం పూట ఒక 30 నిమిషాలు వాకింగ్ లేదా వ్యాయామం చేయడం మంచిది. అలాగే గుండె సమస్యలు ఉన్నవారు వైద్యులు చెప్పిన దాని ప్రకారం మందులు వాడడం కూడా వారి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కుతగ్గే ప్రసక్తేలేదని కేంద్రప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేసింది. స్టీల్ ప్లాంట్ లో మొత్తం 100 శాతం వాటాను […] Category: Trending News, ఆంధ్ర ప్రదేశ్ by NewsDeskLeave a Comment on స్టీల్ ప్లాంట్ పై ముందుకే: కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ 3 hours ago Paddy Procurement: ధాన్యం సేకరణకు సరికొత్త విధానం: సిఎం జగన్ రైతులకు కనీస మద్దతు ధర కన్నా ఒక్కపైసా కూడా తగ్గకుండా రేటు రావాలనే ఉద్దేశంతో ధాన్యం సేకరణలో సరికొత్త విధానానికి...
బోస్టన్ లో జరిగిన గ్లోబల్ ఇన్నోవేషన్ 2022 Health Care At a Glance సదస్సులో పాల్గొన్న మసాచుసెట్స్ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్ & మంత్రి కేటీఆర్ మసాచుసెట్స్ రాష్ట్రంలో జరుగుతున్న హెల్త్ రికార్డుల డిజిటలికరణ ప్రయోజనాలను వివరించిన రాష్ట్ర గవర్నర్ హైదరాబాద్ నగరంతో కలిసి పని చేసేందుకు అమెరికాలోని బోస్టన్ నగరం ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్ ఈరోజు మంత్రి కే తారకరామారావుతో జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఈమేరకు బోస్టన్ లో జరిగిన గ్లోబల్ ఇన్నోవేషన్ 2022 Health Care At a Glance అనే సదస్సులో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్ కి అమెరికాలోని బోస్టన్ నగరానికి మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని, ముఖ్యంగా హైదరాబాద్ మాదిరి ఇక్కడ సైతం అనేక ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటి రంగాలకు చెందిన అనేక కంపెనీలు పని చేస్తున్నాయని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవకాశాలను పరిశీలించడంతో పాటు లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. తద్వారా ఈ రంగంలో అనేక నూతన పరిశోధనలు ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు. హెల్త్ రికార్డుల డిజిటలీకరణ కొనసాగుతుందని తద్వారా ఇక్కడి సిటిజన్లకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నయన్న విషయాన్ని ఈ సందర్భంగా గవర్నర్ ప్రస్తావించారు. ముఖ్యంగా కరోన సంక్షోభ సమయంలో ఈ డిజిటల్ హెల్త్ రికార్డుల వలన వేగంగా వారికి చికిత్స అందించేందుకు అవకాశం కలిగిందని తెలిపారు. ఇరు నగరాల మధ్య అవగాహన కోసం చేపట్టే కార్యక్రమాల వలన భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా మంత్రి కే. తారకరామారావు తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగానికి మంచి స్పందన లభించింది. తెలంగాణ ప్రభుత్వం సైతం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రెండు జిల్లాలో పౌరుల యొక్క హెల్త్ రికార్డ్ లని డిజిటలైజేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న లైఫ్ సైన్సెస్ రంగంలోని సైంటిస్ట్ ల తో పాటు ఐటి, టెక్ రంగాల డాటా సైంటిస్టుల చేస్తున్న ఉమ్మడి కృషి వలన రానున్న రోజుల్లో అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత వలన సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, ఆయా రంగాలకు ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా బయో, లైఫ్ సైన్సెస్ రంగాల్లో టెక్నాలజీకి పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్న నోవర్టిస్ లాంటి కంపెనీల కార్యకలాపాలను ఉదహరించి, హైదరాబాద్ నగరంలో ఉన్న అవకాశాలను వివరించారు. బోస్టన్ నగరంలో ని నిర్వాణ లైఫ్ కేర్ లో జరిగిన ఈ సమావేశంలో నిర్వాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయెష్ రంజన్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్, నిర్వాణ హెల్త్ కేర్ ఛైర్పర్సన్ జాన్ స్కల్లి, సీఈఓ రవి ఐక, శశి వల్లిపల్లి లు పాల్గొన్నారు. అమెరికాలోని బోస్టన్ నగరంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగంలో చేపడుతున్న కార్యక్రమాలకు అమెరికాలోని వివిధ కంపెనీల ప్రతినిధులు నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అమెరికాలోని బోస్టన్ నగరంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ గా పేరు ఉన్నదని ఈ సందర్భంగా తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలైన ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టిందని, అందులో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు, పాలసీ పరమైన నిర్ణయాలు, ఇన్నోవేషన్ కి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫండ్ ను ఏర్పాటు చేయడం, జీనోమ్ వ్యాలీ లో ప్రత్యేకంగా ఒక ఇంకుబేటర్ ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలను తీసుకున్నదని, వీటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ బయో లైఫ్ సైన్సెస్ ఫార్మా ఉత్పత్తులన రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.
Dhyanam Jiddu Krishna Murthy Pragati Publishers ధ్యానం జె.కృష్ణమూర్తి ప్రగతి పబ్లిషర్స్‌ Health Fitness ఆరోగ్యం హెల్త్ Health Arogyam హెల్త్ కేర్ Health Care ఆసనాలు Vyayamam Aasanalu Exercise యోగా Let your friends know Description Reviews (0) ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో 1895లో జన్మించిన జిడ్డు కృష్ణమూర్తి ప్రపంచమంతా పర్యటించి, వివిధ దేశాల ప్రజల జీవన శైలినీ, ఆలోచనా సరళినీ ప్రభావితం చేసిన అత్యంత ఆధునిక తత్వవేత్త. అశాంతితో, సంఘర్షణతో నిండిన నిత్య జీవితాన్ని ముఖాముఖీగా ఎదుర్కొనే సాహసాన్నీ, నిర్భీతినీ మనలో కృష్ణమూర్తి బోధనలు జ్వలింపజేస్తాయి. ధ్యానం స్వీయ ఆవిష్కరణకు తలుపులు తెరుస్తుంది. మనసునూ, ఆలోచనలనూ అనాసక్తంగా పరిశీలించడంలోనే వాటి నుండి స్వేచ్ఛ లభిస్తుంది. మౌనస్థితిలోనే నిశ్శబ్దలోకపు అనంతాలలో అజ్ఞేయమైన దానిని దర్శించడం జరుగుతుంది. అపూర్వమైన తీరులో అసలైన ధ్యానం అంటే ఏమిటో విశదీకరిస్తూనే చేతనా వర్తపు అంచులను కరిగించి వేస్తారు - జె.కృష్ణమూర్తి.
బిగ్ బాస్ సీజన్ 6 ఎపిసోడ్ 60లో ఒక ఆసక్తికరమైన టాస్క్ జరిగింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మిషన్ పాజిబుల్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇంటి సభ్యులు రెడ్ టీం అండ్ బ్లూ టీం గా పాల్గొంటారు. team telugu First Published Nov 2, 2022, 11:10 PM IST బిగ్ బాస్ సీజన్ 6 ఎపిసోడ్ 60లో ఒక ఆసక్తికరమైన టాస్క్ జరిగింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మిషన్ పాజిబుల్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇంటి సభ్యులు రెడ్ టీం అండ్ బ్లూ టీం గా పాల్గొంటారు. ఈ టాస్క్ లో భాగంగా రెడ్ టీం సభ్యులు, బ్లూ టీం సభ్యులు రెండు వాల్స్ పై నిలబడతారు. వారికి ఇచ్చిన కర్రలు లాంటి ఆయుధాలతో నిబంధనలు పాటిస్తూ పోరాడాల్సి ఉంటుంది. వాల్ నుంచి కింద పడిపోతే వారు అవుట్. చివరికి వాల్ పై ఏ టీం సభ్యులు ఉంటే ఆ టీం విజయం సాధించినట్లు. నేడు నిర్వహించిన రౌండ్ లో రెడ్ టీం విజయం సాధిస్తుంది. రెడ్ టీం నుంచి రేవంత్, ఫైమా , శ్రీహన్ పోటీలో పాల్గొన్నారు. బ్లూ టీం నుంచి మెరీనా, వాసంతి, ఇనయ పాల్గొన్నారు. ఈ గేమ్ లో భాగంగా ఇనయ, శ్రీహాన్ మధ్య చెలరేగిన వివాదం పెద్ద గొడవగా మారింది. నామినేషన్స్ తప్ప కంటెంట్ లేని దానివి నువ్వు కూడా మాట్లాడుతున్నావ్ అంటూ శ్రీహన్ ఇనయని ఉద్దేశించి అంటాడు. దీనితో ఇనయ కూడా నువ్వు ఎవరి బెడ్ పై పడుకుంటున్నావో తెలుసు అంటూ ఘాటు కామెంట్స్ చేసింది. గేమ్ పూర్తయిన తర్వాత ఇనయని శ్రీహాన్ కోపంతో అడుగుతాడు. ఆ మాటల ఉద్దేశం ఏంటి అని ప్రశ్నిస్తాడు. శ్రీహాన్, శ్రీసత్య రిలేషన్ పై ఇనయ పరోక్షంగా ఆ కామెంట్స్ చేసింది. దీనితో శ్రీసత్య కూడా ఇనయపై ఆగ్రహంతో చెలరేగిపోతుంది. ఇనయ నోట్లో అశుద్ధం పెట్టుకుని మాట్లాడుతోంది అంటూ శ్రీహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చివర్లో బిగ్ బాస్ ఆదిరెడ్డిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. ఆదిరెడ్డికి బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. బాత్ రూమ్ ని డర్టీగా మార్చి రెడ్ టీం సభ్యులలో ఒకరిపై నింద వేయాలి. అవసరం అయితే మీ సభ్యుల సాయం తీసుకోవచ్చు. ఈ టాస్క్ అనుమానం రాకుండా విజయవంతంగా చేస్తే మీ టీంలో మరణించిన ఒక సభ్యుడిని బతికించే ఛాన్స్ ఉంటుంది అని చెబుతారు. దీనితో నేటి ఎపిసోడ్ ముగిసింది.
– ఐటీఐఆర్‌తో పుంజుకోనున్న పరిశ్రమ – త్వరలో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు – ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్వరూపం ప్యాకేజీ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుందని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ప్రపంచంలో 550 బిలియన్ డాలర్లు, దేశంలో 24బిలియన్ డాలర్ల వ్యాపారం ప్యాకేజీ ఇండస్ట్రీతో జరుగుతుందని చెప్పారు. నగరంలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో గురువారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ సంస్థ ప్యాకింగ్ ఫర్ టుమారో అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థ తయారుచేసిన వివిధ నమూనాలను పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ప్యాకేజీ రంగంలో మనదేశం ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెద్దఎత్తున హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయని, ఇవి ప్యాకేజీ రంగం అభివృద్ధికి దోహదపడుతాయని చెప్పారు. రాబోయే రోజుల్లో భారతదేశం రిటైల్‌రంగంలో మూడు, నాలుగోస్థానానికి ఎగబాకడం ఖాయమని అన్నారు. స్వీడన్ దేశానికి చెందిన ఐకియా ఫర్నిచర్ కంపెనీ హైదరాబాద్‌లో సంస్థ ఏర్పాటుకు ముందుకురావడం సంతోషకరమని పేర్కొన్నారు. తెలంగాణకు వచ్చే పెట్టుబడులన్నీ రిటైల్‌రంగానికి అనుసంధానమైనవే వస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పాటుతో రిటైల్, ప్యాకేజీ ఇండస్ట్రీ విస్తరణకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. ఐటీసీ సంస్థ త్వరలోనే హైదరాబాద్ సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు మంత్రి తెలిపారు. ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు చెప్పారు. ఐటీసీ యూనిట్‌ను గజ్వేల్ నియోజకవర్గంలో గానీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్‌తో హైదరాబాద్‌లో ప్యాకేజీ ఇండస్ట్రీ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఐటీసీ ఖమ్మం జిల్లా భద్రాచలంలో రూ.3వేల కోట్లతో పేపర్ మిల్ విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ప్యాకేజీ ఇండస్ట్రీకి మాత్రమే దోహదం చేసే వనరులు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా, దేశంలో వాడిన వస్తువుల రీసైక్లింగ్ పద్ధతులపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. రీసైక్లింగ్ పద్ధతులతో వ్యర్థపదార్థాల నుంచి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక బాధ్యతగా, కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వంతో కలిసి రీసైక్లింగ్ చేసేందుకు ముందుకు రావాలని కేటీఆర్ సూచించారు. ప్యాకేజీ రంగానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని తారకరామారావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐపీ డైరెక్టర్ డాక్టర్ ఎన్సీ షా మాట్లాడుతూ నిరంతరం వినూత్నంగా మార్కెట్ అవసరాలకు సరిపడేలా అత్యంత నాణ్యమైన పద్ధతులతో ప్యాకేజింగ్ వ్యాపారాలను ఐఐపీ నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ కే సతీశ్‌రెడ్డి, ఏవీపీఎస్ చక్రవర్తి, సంజీవ్‌జగ్గి పాల్గొన్నారు. హైదరాబాద్‌లో 100శాతం వైఫై సేవలు అందిస్తాం త్వరలో హైదరాబాద్‌లో 100శాతం వైఫై సేవలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే నగరంలో 8కిలోమీటర్ల పరిధిలో వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వైఫై సేవలను అందించేందుకు టెలికాం కంపెనీల మధ్య పోటీ నెలకొందని తెలిపారు. పోటీ ప్రపంచంలో చెప్పడం వేరు-చేయడం వేరని పేర్కొన్న కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నదానికంటే ఎక్కువే చేస్తుందన్నారు. మంచి చేసినా చెప్పుకునే సామర్థ్యం రాజకీయ పార్టీలకు ముఖ్యమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
Oct 29, 2022 laptops, latest business news, latest google news, latest lifestyle news, latest national news, latest technology news today, older Windows PC Spread the News 365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఇండియా, అక్టోబర్ 29,2022:మీరు పాత Windows ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌ని ఉపయోగిస్తుంటే, మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. Google కొన్ని పాత Windows ల్యాప్‌టాప్‌ల నుండి Chrome మద్దతును తొలగిస్తోంది. 2023 ప్రారంభంలో Windows 7,Windows 8.1 కోసం Chrome మద్దతును నిలిపివేస్తుందని Google నివేదించింది. ఫిబ్రవరి 2023లో విడుదల చేయబడుతుందని ఊహించబడిన Google Chrome 110, వీటికి అనుకూలమైన చివరి వెర్షన్ అని దాని అధికారిక మద్దతు పేజీలో భాగస్వామ్యం చేయబడిన ఒక గమనిక పేర్కొంది. . Microsoft Windows , రెండు మునుపటి సంస్కరణలు. జనవరి 10, 2023న Windows 7 ఎక్స్‌టెండెడ్ సపోర్ట్ అప్‌డేట్ ,Windows 8.1 ఎక్స్‌టెండెడ్ సపోర్ట్‌కు మద్దతును నిలిపివేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకున్నట్లు Google పేర్కొంది. Google, సపోర్ట్ పేజీ ఇలా చెబుతోంది: “మేము Windows 7,Windows 8/8.1కి మద్దతును నిలిపివేస్తున్నాము. Chrome 110 (తాత్కాలికంగా ఫిబ్రవరి 7, 2023న విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది) ఈ Windows సంస్కరణల్లో పని చేసే Chrome ,చివరి వెర్షన్. అయినప్పటికీ, Chrome ఇప్పటికీ Windows 7 , Windows 8.1లో పని చేస్తుంది, కానీ అవి భవిష్యత్తులో అప్‌గ్రేడ్ వెర్షన్‌లకు అర్హత పొందవు. ప్రకటన ఇలా చెబుతోంది, “మీరు ప్రస్తుతం Windows 7 లేదా Windows 8.1లో ఉన్నట్లయితే, మీరు తాజా భద్రతా నవీకరణలు, Chrome ఫీచర్‌లను అందుకోవడం కొనసాగిస్తున్నారని నిర్ధారించుకోవడానికి ఆ తేదీలోపు మద్దతు ఉన్న Windows వెర్షన్‌కు వెళ్లాలని మేము సిఫార్సు చేస్తున్నాము.” ఇదిలా ఉండగా, Windows 7 ESU (ఎక్స్‌టెండెడ్ సెక్యూరిటీ అప్‌డేట్) , Windows 8.1కి జనవరి 10, 2023న మద్దతును నిలిపివేస్తున్నట్లు Microsoft ఇటీవల ప్రకటించింది. కంపెనీ FAQ పేజీ ప్రకారం, Windows 8.1లో నడుస్తున్న పరికరాలు పని చేస్తూనే ఉంటాయి కానీ ఇకపై సాంకేతిక మద్దతు పొందవు. Windows 8.1 వినియోగదారులు కొత్త OSకి అప్‌గ్రేడ్ చేయవచ్చు కానీ ఏ ESUని పొందలేరు. తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేయకుండా విండోస్ 8.1 నడుస్తున్న కంప్యూటర్ మాల్వేర్, వైరస్‌ల బారిన పడుతుందని కూడా ఇది చెబుతోంది. అందువల్ల, Windows క్రొత్త సంస్కరణకు మారడం మంచిది.
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6లో ఆదివారం రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా కంటెంట్ కింగ్ గా పేరుగాంచిన గీతూ రాయల్ ఎలిమినేట్ అయింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6లో ఆదివారం రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా కంటెంట్ కింగ్ గా పేరుగాంచిన గీతూ రాయల్ ఎలిమినేట్ అయింది. ఆమె ఎలిమినేషన్ అనూహ్యం అనే చెప్పాలి. తొలి రోజు నుంచి ఎలిమినేట్ అయ్యే వరకు ఆమె ఎనెర్జీ లెవల్స్ పీక్స్ అనే చెప్పాలి. గీతూ తాను చెప్పినట్లుగా ఎక్కడా తగ్గలేదు. తొలి రోజు నుంచే గీతూ ఇతర కంటెస్టెంట్స్ తో హార్ష్ గా ఉండడం మొదలు పెట్టింది. బాగా ఎంతెర్తైనింగ్ గా ఉండడంతో ప్రేక్షకులు కూడా ఆమెకి ఫిదా అయ్యారు. కానీ ఎపిసోడ్స్ గడిచే కొద్దీ గీతూ బిహేవియర్ పట్ల నెగిటివిటి పెరిగిపోయింది. ఏ ఆటలో అయినా నిబంధనలు కాకుండా క్రీడా స్ఫూర్తి అనేది ఒకటి ఉంటుంది. కొన్ని సార్లు రూల్స్ ప్రకారం చేసేది కరెక్ట్ కావచ్చు. కానీ క్రీడా స్ఫూర్తిని మరువకూడదు. తాను హౌస్ లోకి వచ్చింది మైండ్ గేమ్ ఆడేందుకే అని గీతూ ఆల్రెడీ చెప్పింది. కానీ ఆ క్రమంలో ఇతరుల ఎమోషన్స్ ని దెబ్బతీసి పైచేయి సాధించాలనుకుంది. గీతూకి హౌస్ లో ఇదే మొదటి బిగ్ మైనస్. ఆట పరంగా ఆమె చేసేది కరెక్ట్ కావచ్చు. కానీ చూసే ప్రేక్షకులకు ఆమె పట్ల నెగిటివిటీ పెరిగింది. గీతూ ఫిజికల్ గేమ్స్ లో అంతగా పెర్ఫామ్ చేయలేదు. గీతూ కన్నా ఫిజికల్ గేమ్స్ లో బద్దకంగా ఉండేవారు హౌస్ లో ఉన్నారు. తాను ఫిజికల్ ఆడడం లేదు కాబట్టి ఎలాగైనా మైండ్ గేమ్ తో ఇతరులపై పైచేయి సాధించాలి అని గీతూ అనుకుంది. ఆమె ఎలిమినేషన్ కి ఇది కూడా ఒక కారణం. అలాగే గత రెండు వారాల్లో గీతూ ఆదిరెడ్డి, బాలాదిత్యతో ప్రవర్తించిన విధానం కూడా ఒక మైనస్ గా మారింది. గీతూతో సమానంగా హౌస్ లో రచ్చ చేసే రేవంత్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు. కానీ గీతూ మాత్రం మైండ్ గేమ్ మాయలో పడి తన ప్రవర్తన మార్చుకోలేదు. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 6లో గీతూ బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. గీతూ ఎలా ఆడినా బిగ్ బాస్ గేమ్ కోసమే ఆడింది. నాగార్జున కూడా ఆమెకి ఫిదా అయ్యారు. మొత్తంగా మైండ్ గేమ్ తో ఫైనల్ వరకు వెళ్లాలనుకున్న గీతూ ప్రయాణం మధ్యలోనే ముగిసింది. Follow Us: Download App: RELATED STORIES అక్షయ్ కుమార్ పై సంచలన ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్, ముదురుతున్న రిచా వ్యవహారం ప్రభాస్ రాజా డీలక్స్ కోసం మూడో హీరోయిన్ ఫిక్స్, యంగ్ రెబల్ స్టార్ జంటగా రాధేశ్యామ్ బ్యూటీ ఎట్టకేలకు సాధించిన ఇనయా, బిగ్ బాస్ హౌస్ చివరి కెప్టెన్ గా గెలుపు, సెమీ ఫైనల్స్ కు ఫస్ట్ కంటెస్టెంట్ ఎట్టకేలక
80′ s Reunion: 80s రీయూనియన్‌ ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా నటీనటుల ఆత్మీయ సమ్మేళనం చాలా వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈసారి జాకీ ష్రాఫ్‌ ముంబయిలోని తన నివాసంలో ఏర్పాటు చేశారు. Video Advertisement తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన ఒకటి వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఒకప్పటి అగ్రకథానాయిక రాధ చేసిన డ్యాన్స్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ఫిదా అయ్యారు. ఈ రీయూనియన్‌లో 80ల్లో వెండితెరపై సందడి చేసిన దక్షిణాది, ఉత్తరాది నటీ నటులందరూ కలిశారు. నటీనటులందరూ ఒకప్పటి హిట్‌ సాంగ్స్‌కు డ్యాన్స్‌లు చేసారు. అయితే రాధ సైతం ‘సంజ హై ముజె’ అనే హిందీ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఆ పాటకు అనుగుణంగా. హావభావాలు పలికిస్తూ చేసిన డ్యాన్స్‌కు అక్కడ ఉన్న అందరూ ఫిదా అయ్యారు. నటీనటులందరూ ‘వావ్‌ సూపర్‌’ అంటూ చప్పట్లు కొట్టి మరి ఆమెను ఉత్సాహపరిచారు. ఈ డ్యాన్స్‌ పూర్తయ్యేటప్పటికి వెంకటేశ్‌ ఓ పూలమాలను తీసుకువెళ్లి రాధ మెడలో వేయగా, మెగాస్టార్‌ వెళ్ళి హాగ్ చేసుకుని మెచ్చుకున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ ‘‘80 రీయూనియన్‌కు సంబంధించిన ఓ మధుర జ్ఞాపకం. నాకెంతో ఇష్టమైన పాటకు డ్యాన్స్‌ చేసినందుకు సంతోషంగా ఉంది. దీనికంటే సంతోషకరమైన విషయం నా స్నేహితులు చిరు, వెంకటేశ్‌,పూనమ్‌, జాకీ ష్రాఫ్‌, సరిత అక్క,స్వప్నతో పాటు అందరూ నాపై చూపించిన ప్రేమ’’ అని రాసుకొచ్చారు.ఈ రీయూనియన్‌కు జాకీ ష్రాఫ్‌ ఆతిథ్యమివ్వగా చిరంజీవి, వెంకటేశ్‌, రమ్యకృష్ణ,నదియా,సుహాసిని,విద్యాబాలన్‌, శోభన, జయప్రద, రాధ, భానుచందర్‌,శరత్‌కుమార్‌,అనుపమ్‌ ఖేర్‌, నరేశ్‌, అర్జున్‌, అనిల్‌ కపూర్‌ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. watch video : Throwback to the 80’s reunion. Felt so happy to dance to the steps to one of my favourite songs. More than that I loved the support & love my dear colleagues Chiranjeevi, Venkatesh , Jackie Shroff, Poonam Dhillion, Swapna , Saritha akka & all others have showered on me 🥰🥰 pic.twitter.com/6e5ZbikEfN
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 పాంగోలియన్‌ మీద పొలుసులుంటాయి. వీటిని బట్టి సులువుగా పాంగోలియన్లను గుర్తు పట్టొచ్చు. సహారా ఎడారిలో ఎక్కువ ఉంటాయివి. 30 సెం.మీ. నుంచి 100 సెం.మీ పొడవు ఉంటాయి. ఆడ పాంగోలియన్ల కంటే మగ పాంగోలియన్లు 40 శాతం పెద్దవిగా ఉంటాయి. దీనిమీద ఉండే పొలుసుల నిర్మాణం కెరోటిన్‌తో తయారవుతుంది. మన గోర్లు కూడా కెరోటిన్‌ నిర్మాణమే. పాంగోలియన్ల పొలుసులు గట్టిగా ఉంటాయి. దీని తోక పొడవుగా ఉంటుంది. యాక్టివ్‌గా ఉంటుందిది. చెట్టుమీద వేగంగా తిరుగుతుంది. ఇవి స్వతహాగానే నీళ్లలో అద్భుతంగా ఈదుతాయి. ఇవి రాత్రిపూట తిరుగుతాయి. పగలంతా నిద్రపోతాయి. అప్పుడే ఉండచుట్టుకుని నిద్రపోతాయి. వీటి నోరు జిడ్డుగా ఉంటుంది. చీమలు, పురుగుల్ని తన పొడవైన నాలుకతో తింటుంది. వాసన చూసే గుణం బావుంటుంది. అయితే వీటిని చూపు చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని కొందరు తినటంతో పాటు ట్రెడిషనల్‌ మెడిసిన్‌లో ఉపయోగిస్తారు. అందుకే వీటిని దొంగతీసుకెళ్లటం, అమ్మటం చేస్తుంటారు. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో మాత్రమే ఇవి ఉంటాయి. వీటి సంఖ్య గణనీయంగా పెరుగటం విశేషం. శతృవులు వస్తే ఉండలా చుట్టుకుని తనకు తాను రక్షించుకోగల సామర్థ్యం వీటికి ఉంది.
బాటిల్ ఫ్రంట్ II ప్రీ-ఆర్డర్ ప్రోత్సాహకం రే మరియు కైలో రెన్ వద్ద ఒక పీక్‌ను అందిస్తుంది, అవి స్టార్ వార్స్‌లో కనిపిస్తాయి: ది లాస్ట్ జెడి రెడ్డిట్ బాటిల్ ఫ్రంట్ II కోసం ప్రీ-ఆర్డర్ ప్రోత్సాహకాన్ని వెలికితీసింది, ఇది రే మరియు కైలో రెన్ వద్ద స్టార్ వార్స్: ది లాస్ట్ జెడిలో కనిపిస్తుంది. కింగ్స్‌గ్లైవ్‌లో ఆరోన్ పాల్ మరియు సీన్ బీన్ స్టార్: ఫైనల్ ఫాంటసీ XV ట్రైలర్, ఆగస్టులో హిట్ థియేటర్స్ కారణంగా సీన్ బీన్, ఆరోన్ పాల్ మరియు లీనా హేడీ సిజి మూవీ కింగ్స్‌గ్లైవ్: ఫైనల్ ఫాంటసీ ఎక్స్‌వి కోసం తాజా ట్రైలర్‌లో భారీ ఫాంటసీ యుద్ధంలో చిక్కుకున్నారు. రెసిడెంట్ ఈవిల్ విలేజ్ టాల్ లేడీ టేక్స్ ఆన్ కాంగ్ అండ్ గాడ్జిల్లా ఇన్ అద్భుత ఫ్యాన్ ఆర్ట్ వన్ రెసిడెంట్ ఈవిల్ విలేజ్ అభిమాని ఆట యొక్క ప్రతినాయక లేడీ డిమిట్రెస్కును కాంగ్ మరియు గాడ్జిల్లాపై భవనం-పరిమాణ రాక్షసుడిగా imag హించాడు. ర్యాన్ రేనాల్డ్స్ దాదాపు రెండు వేర్వేరు సందర్భాలలో ఫ్లాష్‌ను ప్లే చేశాడు అతను గ్రీన్ లాంతర్న్ వలె సరిపోయే ముందు, ర్యాన్ రేనాల్డ్స్ దాదాపుగా ది ఫ్లాష్, మరియు ఒకటి కంటే ఎక్కువ సందర్భాలలో - ఒక చలనచిత్ర మరియు వీడియో గేమ్ రెండింటిలోనూ ఆడాడు. థానోస్ టేక్స్ ఆన్ గాడ్ ఆఫ్ వార్ యొక్క క్రాటోస్ ఇన్ అద్భుతం ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ ఆర్ట్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అపెక్స్‌ఫార్మ్ మార్వెల్ బాడ్డీ థానోస్ మరియు గాడ్ ఆఫ్ వార్ యొక్క క్రటోస్ మధ్య గొడవ ఎలా ఉంటుందో ined హించాడు. సోనిక్ హెడ్జ్హాగ్ అభిమానులు బెన్ స్క్వార్ట్జ్ పాత్రను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు దీర్ఘకాల సోనిక్ ది హెడ్జ్హాగ్ వాయిస్ నటుడు రోజర్ క్రెయిగ్ స్మిత్ పదవీవిరమణ చేసిన వార్తల తరువాత, అభిమానుల మనస్సులో ఇప్పటికే ఒక ప్రత్యామ్నాయం ఉంది. DC బాట్మాన్ డే 2020 కోసం ప్రణాళికలను వెల్లడించింది సెప్టెంబర్ 19 న బాట్మాన్ డే 2020 కోసం అన్ని ప్రత్యేక కార్యక్రమాలను డిసి ప్రకటించింది మరియు మేము కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తాము. సినిమా ఎప్పుడూ ఎందుకు జరగలేదని దర్శకుడు వివరించాడు క్లాసిక్ గేమ్ యొక్క ప్రణాళికాబద్ధమైన మూవీ వెర్షన్ ఎందుకు విడిపోయిందో ది లాస్ట్ ఆఫ్ మా దర్శకుడు నీల్ డ్రక్మాన్ వివరించాడు. సోనీ బంగీ ఐపీల నుండి సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తోంది 'సోనిక్ ది హెడ్జ్‌హాగ్ 2' స్టార్ బెన్ స్క్వార్ట్జ్ ఇడ్రిస్ ఎల్బా నకిల్స్‌గా 'అద్భుతం' అని చెప్పారు ‘ఇట్ టేక్స్ టూ’ గేమ్ డెవలపర్‌లు టీవీ/ఫిల్మ్ కోసం గేమ్‌ను స్వీకరించడానికి చర్చలు జరుపుతున్నారు #BlackoutStarWarsEclipse ట్రెండ్‌లు మళ్లీ ప్రారంభమయ్యాయి, అభిమానులు లుకాస్‌ఫిల్మ్ క్వాంటిక్ డ్రీమ్‌తో సంబంధాలను తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
ఇన్నాళ్లు ఆదరించిన కాంగ్రెస్ పార్టీని వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక అసెంబ్లీ లో అడుగు పెట్టడని ..పాండవులను వీడిన కర్ణుడిలా రాజగోపాల్ రెడ్డి కౌరవులు పంచన చేరుతున్నారు అంటూ ఆసక్తికర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. టాప్ 10 వార్తలు HCU Prof Ravi Ranjan Suspend: థాయ్‌లాండ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం .. HCU ప్రొఫెసర్ రవిరంజన్ సస్పెండ్ Man Killed Woman : ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన వ్యక్తి Gold Coins Found : పొలంలో పైపులైన్ తవ్వుతుండగా.. పురాతనకాలం నాటి బంగారు నాణాలు లభ్యం RamCharan : ఫ్యూచర్ అఫ్ యంగ్ ఇండియా అవార్డు అందుకున్న రామ్ చరణ్ South Africa ‘Phala Phala farmgate’Scam : ‘తేలుకుట్టిన దొంగలా’ తయారైన దేశాధ్యక్షుడు పరిస్థితి..కుంభకోణంతో కూడబెట్టిన సొమ్మును దోచేసిన దొంగలు.. Chiranjeevi : చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ రక్తదానం.. మెగాస్టార్ అభిమానులు ఉన్న ప్రతిచోట బ్లడ్ బ్యాంక్ ఉన్నట్టే.. Sundar Pichai Padma Bhushan Award : గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు పద్మభూషణ్ అవార్డు.. అమెరికాలో ప్రదానం చేసిన భారత రాయబారి RRR : రాజమౌళికి మరో హాలీవుడ్ అవార్డు.. Assam : హిందువులు వివాహేతర సంబంధాలు పెట్టుకుని పెళ్లి ఆలస్యంగా చేసుకుంటారు..అందుకే వారికి పిల్లలు తక్కువ ఉంటారు : అసోం ఎంపీ బద్రుద్దీన్ Unstoppable : సమంత గురించి ఈ స్టార్ ప్రొడ్యూసర్స్ ఏమన్నారో తెలుసా?? ట్రెండింగ్ వార్తలు SpiceJet Plane Emergency Landing : స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం.. కొచ్చి ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ HIV Vaccine Clinical Trials : హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌లో అభివృద్ధిలో ముందడుగు.. తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ సక్సెస్ Heart Attack Driver Died : బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు.. స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచారు
CM disbursed Input Subsidy వ్యవసాయంలో నష్టంవచ్చి రైతన్న ఇబ్బందిపడితే మొత్తంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ రోడ్డున పడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు సమస్యలు ఎలా ఉత్పన్నమవుతున్నాయి, వాటిని […] Category: Trending News, ఆంధ్ర ప్రదేశ్ by NewsDeskLeave a Comment on ఇదో సరికొత్త సంప్రదాయం: సిఎం జగన్ September 28, 2021 పారదర్శకంగా నష్టం అంచనా: కన్నబాబు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులకు సూచించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో శాస్త్రవేత్తల , అధికారులు పర్యటించాలని ఆదేశించారు. జిల్లాల […] Category: Trending News, ఆంధ్ర ప్రదేశ్ by NewsDeskLeave a Comment on పారదర్శకంగా నష్టం అంచనా: కన్నబాబు September 27, 2021 బాధితులకు అండగా ఉండండి: సిఎం ఆదేశం గులాబ్‌ తుఫాను తీవ్రతపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఈ […] Category: Trending News, ఆంధ్ర ప్రదేశ్ by NewsDeskLeave a Comment on బాధితులకు అండగా ఉండండి: సిఎం ఆదేశం ఆంధ్ర ప్రదేశ్ 2 hours ago Constitution: రాష్ట్రంలో రాజ్యంగ స్ఫూర్తి లేదు: బాబు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా పరిపాలన సాగుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అధికారంలో ఉన్నాం కాబట్టి తామే...
మంచి రచయిత అయినప్పటికీ అనూహ్యంగా డైరెక్షన్ విభాగంలో అడుగుపెట్టి, వరుస హిట్స్ తో టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకునిగా పేరుతెచ్చుకున్న కొరటాల శివ గురించి సినీ జనాలకు బానే తెల్సు. మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజీ, లేటెస్ట్ గా భరత్ అను నేను చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎగబాకిన శివ, హిట్స్ కి కేరాఫ్ గా నిలిచారు. బిటెక్ చదివి టాలీవుడ్ గడప లోకి అడుగుపెట్టిన కొరటాల శివ లో మంచి రచయిత వున్నాడు. కథే సక్సెస్ కి కారణమని నమ్మే కొరటాల,రచయితలకన్నా డైరెక్టర్లెకు ఎక్కువ గుర్తింపు ఉంటుందని నమ్మి, ఆదిశగా అడుగు వేసి, తన సత్తా చాటుతున్నాడు. అందుకే ఆయనవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ . వరుసగా నాలుగు హిట్స్ కొట్టిన దర్శకునిగా ఈ మధ్య కాలంలో కొరటాల మరో రికార్డ్ సృష్టించారు. ఇక్కడ అతని విజయం వెనుక అయన భార్య వుంది. అవును ప్రతి పురుషుని వెనుకా, ఓ స్త్రీ ఉంటుంది కదా. అలాగే శివ వెనుక ఉన్న స్త్రీ మూర్తి ఆయన భార్య అరవింద. ఆమె చాలా సింపుల్ సిటీ గా వుంటారు. ఆమె లండన్ లో ఉన్నత విద్య చదువుకున్నారు. కొరటాల శివ నిజాయితీ ఆమెను కట్టి పడేయడంతో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ అన్నీ సమకూర్చిన ఆ దేవుడు ఈ దంపతులకు పిల్లలను మాత్రం ఇవ్వలేదు. అయితే సమాజంలో గల చిన్నవాళ్లంతా తమ పిల్లలనే భావనగల ఆమె ఆదిశగా కొరటాలను కూడా ఆమె ప్రోత్సహించింది.ఇద్దరు బతకాలంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉంటె చాలన్నది అరవింద్ ఫిలాసఫీ. పైగా ఆమె రామకృష్ణ పరమహంస భక్తురాలు. రామకృష్ణుని బోధనలతో విశేషంగా ప్రభావితం అయింది. ప్రతి ఆదివారం ఆమె రామకృష్ణ మఠానికి వెళ్లి సేవలు అందిస్తుంది. ఇక శ్రీమంతుడు కాన్సెప్ట్ ఆమె ఫిలాసఫీ నుంచి వచ్చిందేనట. అందుకే కోట్లు సంపాదించినా నేటికీ చిన్న అపార్ట్ మెంట్ లోనే ఉంటున్నారు. ఎంత సంపాదించినా అవసరానికి మించి ఉండకూడదని, తినడానికి,బతకడానికి అవసరమైనది ఉంచుకుని మిగిలింది తిరిగి సమాజానికి తిరిగి ఇచ్చేయాలని ఆమె సిద్ధాంతం. అందుకే సంపాదనలో అధికభాగం సమాజ సేవకే వినియోగిస్తూ ఆత్మతృప్తి పొందుతున్నారు. అందులోంచి శ్రీమంతుడు సినిమా కథ పుట్టింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది. షూటింగ్ అయిపోయి ఇంటికొచ్చాక శివ, అరవింద ఇద్దరూ ఫోన్ ల స్విచ్ ఆఫ్ చేసేసి, ఒకరికొకరు టైం స్పెండ్ చేస్తూ ఉల్లాసంగా గడిపేస్తారట. డైరెక్టర్ లైఫ్ కన్నా ఓ భర్తగా జీవితం చాలా బావుంటుందని కొరటాల ఇప్పటికే చాలా సార్లు చెప్పాడంటే ఆ క్రెడిట్ నిజంగా అరవింద కే చెందుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం తనను తరచూ అవమానాలకు గురిచేస్తున్నదని , ప్రోటోకాల్ పాటించడం లేదని ఢిల్లీ వెళ్లి తీవ్రమైన ఆరోపణలు చేసి, ప్రధాని, కేంద్ర హోమ్ మంత్రిలకు ఫిర్యాదు చేసిన గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ పట్ల రాష్ట్ర మంత్రి కెటి రామారావు తీవ్రంగా స్పందించారు. గవర్నర్ తో తమకు ఎలాంటి పంచాయతీ లేదంటూనే గవర్నర్.. గవర్నర్‌గా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాం. గవర్నర్ వ్యవస్థతో మాకెందుకు పంచాయితీ ఉంటుంది?’ అంటూ నర్మగర్భంగా వాఖ్యలు చేశారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ తాము ఎక్కడ కూడా గవర్నర్ పదవికి భంగం కలిగే విధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. గవర్నర్ అలా ఎందుకు ఊహించుకుంటున్నారో? ఎందుకు స్పందిస్తున్నారో? అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. ‘గవర్నర్‌కు ఎక్కడ అవమానం జరిగింది? ఎవరు ఎవర్నీ అవమానించారు?’ అంటూ ఎదురు ప్రశ్న వేశారు. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో అభ్యంతర పెట్టినందుకు అవమానిస్తారా .? అని గవర్నర్ చెప్పినట్లు విన్నానని పేర్కొంటూ కౌశిక్‌రెడ్డి ఎంఎల్‌సి అయ్యేందుకు రాజకీయ నేపథ్యం అడ్డు వచ్చిందా? అంటి కేటీఆర్ ప్రశ్నించారు. తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు గవర్నర్ అయ్యేందుకు రాజకీయ నేపథ్యం అడ్డురాలేదా ? అని నిలదీశారు. గవర్నర్ మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని హితవు చెప్పారు. గవర్నర్ ఎందుకు ఆ విధంగా ఊహించుకుంటున్నారు? అని అడిగారు. నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు తమకు ఎలాంటి పంచాయితీ లేదని గుర్తు చేశారు. గవర్నర్ విషయంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. శాసనసభ సంవత్సరంలో మొదటి సమావేశం అయితే గవర్నర్ ప్రసంగం ఉండాలని రాజ్యాంగంలో రాసి ఉందని గుర్తు చేశారు. కానీ అది తొలి సమావేశం కాదు కాబట్టి పిలవలేదని వివరణ ఇచ్చారు. సమావేశం ప్రొరోగ్ కాలేదు.. అందుకే గవర్నర్ ప్రసంగం లేదని చెబుతూ దీనినే గవర్నర్ అవమానంగా తీసుకుంటే తాము చేయగలిగిందేమి లేదని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.
Dhulipalla Narendra arrest: అవినీతి ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్.. చింతలపూడిలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారలు అదుపులోకి తీసుకున్నారు. Tdp Leader Dhulipalla Narendra Kumar Arrest Balaraju Goud | Apr 23, 2021 | 9:43 AM TDP leader Dhulipalla Narendra Arrest: తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారలు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద ఈ తెల్లవారుజామునే భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం నరేంద్రను అక్కడి నుంచి తమ వాహనంలో తీసుకెళ్లారు. ధూళిపాళ్ల ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, సీఆర్‌పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసి, నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు నోటీస్ లో పేర్కొన్నారు ఏసీబీ అధికారులు. Acb On Narendra Arrest ఇదిలావుంటే, తెలుగు దేశం పార్టీలో క్రియాశీలక నేతగా ఎదిగిన ధూళిపాళ్ల నరేంద్ర.. టీడీపీ పార్టీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పొన్నూరు నియోజకవర్గం నుంచి 1994 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతల కిలారి వెంకట రోశయ్య చేతిలో ఆయన ఓడిపోయారు. 1112 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అంతేకాదు 2010 నుంచి సంగం డెయిరీకి ఛైర్మన్‌గా ఉన్నారు ధూళిపాళ్ల నరేంద్ర. Read Also… PM Modi: దేశాన్ని కబళిస్తన్న కరోనా మహమ్మారి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ 3 కీలక సమావేశాలు.. రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమీక్ష
న్యూఢిల్లీ : దేశంలో గోరక్షణపై ప్రసంగాలిచ్చే బీజేపీ.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. గోవుల సంరక్షణపై మాట్లాడే హక్కు తమకే ఉన్నదని చెప్పుకేనే ఆ పార్టీ.. తాము పరిపాలించే రాష్ట్రాల్లో మాత్రం ఈ అంశాన్ని గాలికొదిలేస్తున్నది. ఇందుకు ప్రధాని మోడీ సొంత రాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్‌ ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ బడ్జెట్‌లో గోశాలలకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయటం లేదు. దీంతో ఆ గోశాలలను నడుపుతున్న చారిటబుల్‌ ట్రస్టులు గుజరాత్‌ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. వేల సంఖ్యలో ఆవులను రోడ్లపైకి స్వేచ్ఛగా వదిలేసి తమ నిరసనను తెలిపాయి. ఇటు బీజేపీని, రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్రను చేపడతామని హెచ్చరించాయి. రాష్ట్రంలో వీధి పశులు దాడులు తీవ్ర సమస్యగా పరిణమించింది. గతనెలలో మెహ్సానా జిల్లా కడి పట్టణంలో నిర్వహించిన బీజేపీ తిరంగా యాత్రలో గుజరాత్‌ మాజీ డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌పై ఆవు దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకే రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులపై వీధి ఆవులు దాడి చేయటం గమనార్హం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. దాదాపు 1750 గోశాలలను చారిటబుల్‌ ట్రస్టులు నిర్వహిస్తున్నాయి. 4.5 లక్షలకు పైగా పశువులకు ఇవి ఆశ్రయం కల్పిస్తున్నాయి. అయితే, నిధులను విడుదల చేయక మీనమేషాలు లెక్కిస్తున్న గుజరాత్‌ ప్రభుత్వ తీరుపై చారిటబుల్‌ ట్రస్టులు ఆగ్రహంతో ఉన్నాయి. దీంతో నిరసనల్లో పాల్గొన్నాయి. అలాగే, రాబోయే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని చారిటబుల్‌ ట్రస్టులు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఆవులు.. సోషల్‌ మీడియాలో వైరల్‌ చారిటబుల్‌ ట్రస్టులు ఆవులను స్వేచ్ఛగా విడిచి పెట్టటంతో అవి ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశిస్తున్నాయి. కోర్టులు, సబ్‌డివిజనల్‌ వంటి ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఆవులు వచ్చిన దృశ్యాలను పలువురు ట్విట్టర్‌ వినియోగదారులు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయటంతో అవి వైరల్‌గా మారాయి. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చారిటబుల్‌ ట్రస్టులు దాదాపు పదివేల ఆవులను రోడ్ల మీదకు విడిచిపెట్టాయని తెలిసింది. ఆవుల విడుదలతో ఇటు ఉత్తర గుజరాత్‌ రహదారులపై ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. కాగా, నిరసనల్లో పాల్గొన్నవారిలో దాదాపు 70 మందిని బనాస్‌కాంతా, పటాన్‌, కుచ్‌ జిల్లాల నుంచి నిర్బంధంలోకి తీసుకున్నారని గుజరాత్‌ గో సేవా సంఫ్‌ు తెలిపింది. ఇలాంటి ఆందోళనలే సౌరాష్ట్ర, మధ్య గుజరాత్‌ జిల్లాల్లో చోటు చేసుకొనే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా గో అధికార్‌ యాత్ర గోశాలలు, వయసుమీరిన పశువుల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి గో మాతా పోషణ్‌ యోజన కింద గుజరాత్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 500 కోట్లను కేటాయించింది. '' మేము మోసపోయినట్టుగా భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ, ముఖ్యమంత్రి, అనేక మంది మంత్రులు వాగ్దానాలు చేసినప్పటికీ.. ఇప్పటి వరకు ఒక్క రూపాయీ విడుదల కాలేదు. మరోపక్క, విరాళాలు తగ్గాయి. ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించినందున తామెందుకు ఇవ్వాలని దాతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీనీ అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని మేము ఇప్పటికే చెప్పాం. ఈనెల 30 నాటికి రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా గో అధికార్‌ యాత్రను చేపడతాం'' అని గుజరాత్‌ గో సేవా సంఫ్‌ు జనరల్‌ సెక్రెటరీ విపుల్‌ మాలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బనాస్‌కాంతాలోని థరాడ్‌ నుంచి అక్టోబరు 1న యాత్రను ప్రారంభిస్తామని సంఘ్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ యాత్రలో వందలాది మంది మత నాయకులు, గోభక్తులు పాల్గొంటారని చెప్పింది. '' ఈ యాత్ర ఐదు జోన్‌లుగా ఉంటుంది. ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రజలు ప్రతిజ్ఞ చేయబోయే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ ఈ యాత్ర తాకుతుంది. నిధుల విడుదల జరిగే వరకూ మహంత్‌లతో నిరసన యాత్ర జరుగుతుంది'' అని సంఫ్‌ు తెలిపింది. ఇటు వీధి పశువుల నియంత్రణ, రోడ్ల పరిస్థితిని మెరుగుపర్చటంలో విఫలమైనందున రాష్ట్ర ప్రభుత్వం ధిక్కార పిటిషన్‌ను ఎదుర్కొంటున్నది. కాగా, ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించటానికి బనాస్‌కాంత్‌ నుంచి కొంత మంది బీజేపీ నాయకులు గాంధీనగర్‌కు చేరుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర వ్యవసాయ మంత్రి రాఘవ్‌జీ పటేల్‌ మాట్లాడుతూ.. '' ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం దొరకాలని సీఎం నిజాయితీగా కోరుకుంటున్నారు. పాలనాపరమైన సమస్యల కారణంగా నిధులను విడుదల చేయలేకపోయాం'' అని చెప్పారు. దాదాపు ఆరువేల పశువులు మృత్యువాత కాగా, పట్టణ ప్రాంతాల్లో పశువుల తరలింపులకు లైసెన్స్‌, నియంత్రణ, నిషేధం కోసం ప్రతిపాదించిన బిల్లును సైతం గుజరాత్‌ సర్కారు ఇప్పటికే వెనక్కి తీసుకున్నది. మాల్దారి (పశువుల పెంపకందారుడు) సంఘం బిల్లులో విధించిన పశువులను స్వాధీనం చేసుకునే పద్ధతి, భారీ జరిమానాపై నిరసన వ్యక్తం చేయటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. పశువులలో గడ్డలు ఏర్పడే చర్మ వ్యాధి (లంపి స్కిన్‌ డిసీజ్‌) ఆందోళనకరంగా మారింది. ఈ కారణంగా గోశాలల యజమానుల నుంచి నిరసనలు వచ్చాయి. ఈ విషయంలో దేశంలోనే గుజరాత్‌ అత్యంత దారుణ పరిస్థితిలో ఉన్నది. రాష్ట్రంలో 1.69 లక్షల పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయి. 5,800కు పైగా పశువులు మృత్యువాత పడటం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతున్నది. గోరక్షణపై బీజేపీ నాయకులు చేసేవి ఎన్నికల స్టంట్‌లు మాత్రమేననీ, హిందువుల ఓట్లను పొందటానికే వారు ఇలాంటి ప్రకటనలు చేస్తారని పలువురు చారిటబుల్‌ ట్రస్టు నిర్వాహకులు చెప్పారు.
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ Compare Bible Prev Next 1. సిరియనులును ఇశ్రాయేలువారును మూడు సంవత్సర ములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 2. మూడవ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలురాజునొద్దకు రాగా 3. ఇశ్రాయేలురాజు తన సేవకులను పిలిపించిరామోత్గిలాదు మనదని మీరెరుగుదురు; అయితే మనము సిరియా రాజు చేతిలోనుండి దాని తీసికొనక ఊరకున్నామని చెప్పి 4. యుద్ధము చేయుటకు నాతోకూడ నీవు రామోత్గిలాదునకు వచ్చెదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతునేను నీవాడనే; నా జనులు నీ జనులే నా గుఱ్ఱములును నీ గుఱ్ఱములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను. 5. పిమ్మట యెహోషాపాతునేడు యెహోవా యొద్ద విచారణచేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా 6. ఇశ్రాయేలురాజు దాదాపు నాలుగు వందలమంది ప్రవక్తలను పిలిపించియుద్ధము చేయుటకు రామోత్గిలాదుమీదికి పోదునా పోకుందునా అని వారి నడిగెను. అందుకుయెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక 7. పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతువిచారణ చేయుటకై వీరు తప్పయెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను. 8. అందుకు ఇశ్రాయేలురాజుఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు; అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణ చేయవచ్చును గాని, అతడు నన్నుగూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతనియందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతురాజైన మీరు ఆలా గనవద్దనెను. 9. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఒకనిని పిలిచిఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను. 10. ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని, షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెలమీద ఆసీనులై యుండి, ప్రవక్తలందరును వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా 11. కెనయనా కుమారుడైన సిద్కియా యినుప కొమ్ములు చేయించుకొని వచ్చివీటిచేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చు చున్నాడని చెప్పెను. 12. ప్రవక్తలందరును ఆ చొప్పుననే ప్రకటన చేయుచుయెహోవా రామోత్గిలాదును రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి. 13. మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా 14. మీకాయాయెహోవా నాకు సెల విచ్చునదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలు కుదుననెను. 15. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజుమీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదికి పోదుమా పోకుందుమా అని యడుగగా అతడుయెహోవా దానిని రాజవైన నీ చేతికి నప్ప గించును గనుక నీవు దానిమీదికిపోయి జయమొందుదువని రాజుతో అనెను. 16. అందుకు రాజునీచేత ప్రమాణము చేయించి యెహోవా నామమునుబట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవియ్యగా 17. అతడుఇశ్రాయేలీయు లందరును కాపరిలేని గొఱ్ఱెలవలెనే కొండలమీద చెదరి యుండుట నేను చూచితిని వారికి యజమానుడు లేడు; ఎవరి యింటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను. మత్తయి 9:36, మార్కు 6:34 18. అప్పుడు ఇశ్రా యేలురాజు యెహోషాపాతును చూచిఇతడు నన్ను గూర్చి మేలుపలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా 19. మీకాయా యిట్లనెనుయెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని ప్రకటన గ్రంథం 4:2, ప్రకటన గ్రంథం 4:9-10, ప్రకటన గ్రంథం 5:1-7-13, ప్రకటన గ్రంథం 6:16, ప్రకటన గ్రంథం 7:10, ప్రకటన గ్రంథం 7:15, ప్రకటన గ్రంథం 19:4, ప్రకటన గ్రంథం 21:5 20. అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. 21. అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడినేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవాఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను. 22. అందుకతడునేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయననీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను. 23. యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు. 24. మీకాయా యిట్లనగా, కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చినీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏవైపుగా పోయెనని చెప్పి మీకాయాను చెంపమీద కొట్టెను. 25. అందుకు మీకాయా దాగుకొనుటకై నీవు ఆ యా గదులలోనికి చొరబడు నాడు అది నీకు తెలియ వచ్చునని అతనితో చెప్పెను. 26. అప్పుడు ఇశ్రాయేలు రాజుమీకాయాను పట్టుకొని తీసికొని పోయి పట్టణపు అధికారియైన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషు నకును అప్పగించి హెబ్రీయులకు 11:36 27. బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగివచ్చువరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను. హెబ్రీయులకు 11:36 28. అప్పుడు మీకాయా ఈలాగు చెప్పెను సకలజనులారా, నా మాట ఆలకించు డని చెప్పెనురాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నాచేత పలుకలేదు. 29. ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషా పాతును రామోత్గిలాదు మీదికి పోవుచుండగా 30. ఇశ్రా యేలురాజునేను మారువేషము వేసికొని యుద్ధములో ప్రవేశించెదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవే శించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసికొని యుద్ధమందు ప్రవేశించెను. 31. సరియారాజు తన రథ ములమీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలి పించి అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడవద్దు; ఇశ్రాయేలురాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చియుండగా 32. రథాధిపతులు యెహోషాపాతును చూచియితడే ఇశ్రాయేలు రాజనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలువేయగా 33. రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజు కానట్టు గురుతుపట్టి అతని తరుముట మానివేసిరి. 34. పమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపుకీలు మధ్యను తగిలెను గనుక అతడునాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసికొని పొమ్మని తన సారధితో చెప్పెను. 35. నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల యెదుట అతని రథముమీద నిలువ బెట్టిరి; అస్తమయమందు అతడు మరణమాయెను; తగిలిన గాయములోనుండి అతని రక్తము కారి రథములో మడుగు గట్టెను. 36. సూర్యాస్తమయ సమయమందు దండువారందరు తమ తమ పట్టణములకును దేశములకును వెళ్లి పోవచ్చు నని ప్రచురమాయెను. 37. ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను. 38. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. 39. అహాబు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానంతటినిగూర్చియు, అతడు కట్టించిన దంతపు ఇంటినిగూర్చియు, అతడు కట్టించిన పట్టణములను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడియున్నది. 40. అహాబు తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను. 41. ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. 42. యెహోషాపాతు ఏల నారంభించినప్పుడు అతడు ముప్పది యయిదేండ్లవాడై యెరూషలేములో యిరువది యైదేండ్లు ఏలెను; అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీకుమార్తెయై యుండెను. 43. అతడు తన తండ్రియైన ఆసాయొక్క మార్గములన్నిటి ననుసరించి, యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచు వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు; ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పిం చుచు ధూపము వేయుచు నుండిరి. 44. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధిచేసెను. 45. యెహోషాపాతు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు కనుపరచిన బలమునుగూర్చియు, అతడు యుద్థముచేసిన విధమును గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. 46. తన తండ్రియైన ఆసాదినములలో శేషించియుండిన పురుషగాములను అతడు దేశములోనుండి వెళ్లగొట్టెను. 47. ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను; ప్రధానియైన యొకడు రాజ్యపాలనము చేయుచుండెను. 48. యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరుదేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలై పోయెను. 49. అహాబు కుమారుడైన అహజ్యానా సేవకులను నీ సేవకులతో కూడ ఓడలమీద పోనిమ్మని యెహోషా పాతు నడుగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు. 50. పమ్మట యెహోషా పాతు తన పితరులతోకూడ నిద్రించి, తన పితరుడైన దావీదుపురమందు తన పితరులతోకూడ పాతిపెట్ట బడెను; అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజాయెను. 51. అహాబు కుమారుడైన అహజ్యా యూదారాజైన యెహోషాపాతు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి రెండు సంవ త్సరములు ఇశ్రాయేలును ఏలెను. 52. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి,తన తలిదండ్రు లిద్దరి ప్రవర్త నను, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను. 53. అతడు బయలు దేవతను పూజిం చుచు, వానికి నమస్కారము చేయుచు, తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
సంక్షేమానికి మారుపేరుగా నిలిచిన వైయస్‌ జగన్‌ ప్రభుత్వం మళ్లీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని, దానికి తగ్గట్టు కార్యాచరణ జరుగుతుంది. ఎవ్వరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని క్లీన్‌స్వీప్‌ చేస్తామని బొత్స ఎధీమా వ్యక్తపరిచారు. విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. పది సీట్లు పోయినా పర్వాలేదని ఏ రాజకీయ పార్టీ ఆలోచించదని, అలా ఆలోచన చేస్తే త‌న‌ దృష్టిలో అది రాజకీయ పార్టీయే కాదన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ 175 సీట్లకు 175 గెలవాలని టార్గెట్‌ పెట్టుకున్నారని, తప్పకుండా గెలిస్తామన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా.. తండ్రి ఒక అడుగు వేస్తే తాను రెండు అడుగులు వేస్తానని చెప్పిన మాట ప్రకారం సీఎం వైయస్‌ జగన్‌.. గత మూడు సంవత్సరాలుగా మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో నూటికి 97 శాతం నెరవేర్చారన్నారు. సంక్షేమానికి సంబంధించి నూటికి నూరు శాతం హామీలు అమలు చేశామని చెప్పారు. ఒక పక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com Categories National International Business Sports Health Education Science Technology Foods Entertainment Lifestyle
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం 587.30అడుగుల వద్ద ఉంది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కుడి గట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 53,846 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదలచేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 587.30 అడుగులు (305.6838టీఎంసీలు)గా ఉంది. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 నాగార్జునసాగర్‌, నవంబరు 18: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం 587.30అడుగుల వద్ద ఉంది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కుడి గట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 53,846 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదలచేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 587.30 అడుగులు (305.6838టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వకు 10,120 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 6,325 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 4,101 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1200 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 400క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 22,146 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, ఎగువ నుంచి 53,846 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది. సుందర కట్టడం బుద్ధవనం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం సుందర కట్టడమని ఢిల్లీ రాష్ట్ర మాజీ మంత్రి రాజేంద్రపాల్‌ గౌతమ్‌ అన్నారు. బుద్ధవనాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. ఇక్కడి విశేషాలను ఆయనకు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. ఆయన వెంట దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జాతీయ అధ్యక్షుడు రవికుమార్‌ ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలలో ట్విటర్ అత్యంత ప్రభావంతమైనది, భారత్ తో సహా కొన్ని వర్ధమాన దేశాలలో సామాన్యులలో ఫేస్‌బుక్ ప్రాచుర్యం పొందినా రాజకీయ, సామాజిక, ఆర్ధిక వర్గాలకు చెందిన ప్రముఖులలో అత్యధికులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ట్విటర్ ను వినియోగించడానికే ఇష్టపడతారు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలలో ట్విటర్ అత్యంత ప్రభావంతమైనది, భారత్ తో సహా కొన్ని వర్ధమాన దేశాలలో సామాన్యులలో ఫేస్‌బుక్ ప్రాచుర్యం పొందినా రాజకీయ, సామాజిక, ఆర్ధిక వర్గాలకు చెందిన ప్రముఖులలో అత్యధికులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ట్విటర్ ను వినియోగించడానికే ఇష్టపడతారు. సామాజిక మాధ్యమాల వాడకంపై విశేష అభిరుచి చూపుతున్న భారత్, ట్విటర్ కు ప్రపంచంలో మూడవ పెద్ద మార్కెట్ గా ప్రసిద్ధి కెక్కింది. కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు అన్నీ విధిగా ట్విటర్ ను వినియోగించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ ప్రొత్సహిస్తూ వస్తోంది. తత్ఫలితంగానే కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలోని మంత్రిత్వ శాఖలు అన్నీ ఇప్పుడు తమ సమాచారాన్ని ట్విటర్ ద్వారానే వెల్లడిస్తున్నాయి. ఢిల్లీలో మోదీ, రాష్ట్రాలలో కెటీఆర్, రేవంత్ రెడ్డి, నారా లోకేశ్, విజయసాయిరెడ్డి మొదలైనవారి ట్వీట్ల ఆధారితంగా వార్తలు పెరిగిపోతున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం చేసిన పోరాటంలో ట్విటర్ ఒకింత నిర్మాణాత్మక పాత్ర వహించింది. దీంతో కేంద్రం ఆ సామాజిక మాధ్యమాన్ని కట్టడి చేసే యత్నాలు చేసి సఫలమయింది. తమ రాజకీయ, సైద్ధాంతిక విధానాలకు భిన్నంగా ఉన్న వారెవరు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించకుండా తన అధికార పలుకుబడిని వినియోగించి ట్విటర్ ను నియంత్రిస్తుందన్న ఆరోపణలు మోదీ సర్కార్ పై ప్రబలంగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ ప్రచారం చేయడంలో ప్రత్యర్ధులకు అందనంత ఎత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎలాగైతేనేం ట్విట్టర్ ను తన గుప్పిటలోకి తీసుకోగలిగింది. ఒక్క మన దేశమే కాదు, నైజీరియా, టర్కీ మొదలైన దేశాల ఒత్తిడికి కూడా ట్విటర్ తలవంచిన విషయాన్ని విస్మరించరాదు. సమాచార వ్యవహారాలపై నియంత్రణతో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండే గల్ఫ్ దేశాలు కొన్నింటికి ట్విటర్ సంస్ధలో భారీ పెట్టుబడులు ఉన్నాయనే విషయాన్ని కూడ గుర్తుంచుకోవాలి. గల్ఫ్ దేశాల పెట్టుబడులపై సాక్షాత్తు అమెరికా అధ్యక్ష శ్వేత భవనమే సందేహాలు వ్యక్తం చేసిన విషయాన్ని గమనించాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ అసత్య ప్రచారాలకు ట్విటర్ ను ఏ విధంగా దుర్వినియోగం చేసి అభాసుపాలయ్యారనే విషయాన్ని కూడ మరిచిపోరాదు. ఇక రాజకీయ విభేదాలు రచ్చకెక్కి వ్యక్తిగత నిందలు, తిట్ల వరకు కూడ ట్విటర్ వేదికగా మారి అసహ్యం, జుగుప్సాకర స్ధితికి చేరుకున్న విషయాన్ని తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ఎంపీల (ముఖ్యంగా రాజ్యసభ సభ్యుల) సందేశాలను గమనిస్తే తెలుస్తుంది. హైద్రాబాద్ నుంచి వాషింగ్టన్ దాకా, యువ సామాజిక కార్యకర్తలు ఎందరో ట్విటర్ ను సామాజిక సంక్షేమ చర్యల కొరకు సమర్ధంగా సద్వినియోగం చేసుకొంటోన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా సమాచార మార్పిడి, అభిప్రాయాల వ్యక్తీకరణకు ట్విటర్ ఒక అనువైన వేదికగా ఉందనే విషయాన్ని అందరూ ఆంగీకరించి తీరాలి. ఒక ప్రైవేటు సంస్ధ యాజమాన్యం మారడం అనేది పూర్తిగా అంతర్గత వ్యవహారమే. అయినా ఐక్య రాజ్యసమితి మానవ హక్కుల సంఘం దీనిపై స్పందించిందంటే ట్విటర్ ప్రాధాన్యం అవగతమవుతుంది. ఈ నేపథ్యంలో విభిన్న వ్యాపారాలు చేసే కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ ను కైవసం చేసుకోవడం పై దుమారం రేగుతోంది. భావ ప్రకటన స్వేచ్ఛకు గట్టి మద్దతుదారుడినని చెప్పుకునే మస్క్ ట్విటర్ ను కైవసం చేసుకున్న వెంటనే పక్షికి స్వేచ్ఛ లభించిందని పోస్ట్ చేసిన వ్యాఖ్య అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. మానవతా వాదానికి మద్దతుగా తాను ట్విటర్ ను కొనుగోలు చేసానని కూడ ఆయన చెప్పుకొచ్చాడు. స్వేచ్ఛాయుత రాజకీయ అలోచనలు, ద్వేషపూరితమైన ప్రకటనలు పరస్పర వైరుధ్యాలు. ఒక వ్యాపారవేత్తగా విభిన్న వ్యాపారాలు చేసే మస్క్ అంతర్జాతీయంగా వివిధ దేశాలలో ట్విటర్ ను ఎంత వరకు స్వేచ్ఛగా ఎగరినిస్తాడనేది అనుమానమే. ట్విటర్ లో ఇక అన్నీ ఉచితం కాదని మస్క్ చెప్పడం గమనార్హం. ఒక వ్యాపారవేత్త అయిన మస్క్ ట్విటర్ లో వాణిజ్య ప్రకటనల కంటే వినియోగదారుల నుంచి కొన్ని సేవలకు రుసుం వసూలు చేయడానికి ప్రాధాన్యమిస్తానని చెప్పడం కూడా అయోమయాన్ని సృష్టించింది. నిర్ణీత రుసుం చెల్లించడం ద్వారా విద్వేషాన్ని, అసత్యాలను, విభజన వాదాలను ఇక స్వేచ్ఛాయుతంగా ప్రచారం చేసుకోవడానికి కూడ ట్విటర్ మరింత బలమైన వేదికగా మారే అవకాశం ఉంది. ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల సంఘం అధినేత వోకర్ టుర్క్ ఇదే విషయమై మస్క్ కు లేఖ రాస్తూ తన ఆందోళనను తెలియజేసారు. ద్వేషం, హింసా నియంత్రణతో పాటుగా ఆంగ్లేతర భాషలలోని ట్విటర్ సారాంశాల పై దృష్టి సారించవల్సిన అవశ్యకతను కూడ ఆయన ఎత్తి చూపాడు. ట్విటర్ రుసుం ప్రతిపాదన పై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నా మస్క్ పట్టించుకోవడం లేదు, తనను దినమంతా దూషించినా దానికి డబ్బు చెల్లించవల్సిందేనంటూ మస్క్ ఖండితంగా చెప్పాడు. వాస్తవ మూల్యం కంటే అధికంగా 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ట్విటర్ ను మానవతా పూరిత సహాయానికి, భావ ప్రకటన స్వేచ్ఛ కు వేదికగా మారుస్తానని మస్క్ చెబుతున్నా ఆయన అసలు ఉద్దేశమేమిటో మున్ముందు గానీ తెలియదు. భావ ప్రకటన స్వేచ్ఛ పూర్తిగా ఒక వ్యాపార సంస్ధ ఏకాధిపత్యంలోకి వెళ్ళడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. సమాచార, భావ వ్యక్తీకరణ రంగాలలోకి రాజకీయ ప్రొత్సాహంతో బడా వ్యాపార సంస్ధలు ప్రవేశిస్తే సమాజం ఎదుర్కొనే దుష్ప్రభావాలు అసంఖ్యాకం.
“రక్తం.... రక్తం.... రక్తంధారలు కనిపిస్తోంది నాకు. నా పుట్ట వున్న గుట్ట మొదట్లో రక్తం కాలువలు కడుతున్నట్లు అనిపిస్తోంది. రండిరోయ్ రండి... అందరూ రండి... త్వరగా రండి. ఆ లలితమ్మ ఎక్కడ వున్నదో చూసి వెంటనే నా దగ్గిరికి తీసుకురండి” ఉన్నట్లుండి లేచి నిలబడుతూ గొంతు చినిగిపోయే శృతిలో కేకలుపెట్టడం మొదలుపెట్టింది గణాచారి. ఊరి మధ్యలో ఉన్న సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఎదుట పెద్ద పందిరివేసి, హరికథలు చెప్పిస్తున్నారు గ్రామ పెద్దలు. రాత్రి ఎనిమిదింటికి మొదలు అయింది ఆ రోజు కథ... సుభద్రా పరిణయంలో అర్జునుడు సుభద్రను తీసుకుని ద్వారకా నగరంలో నుంచి పారిపోయి వచ్చే ఘట్టాన్ని రమ్యంగా చెపుతున్నాడు హరికథలు చెప్పటాన్ని నేర్చుకొచ్చిన ఆలయ పూజారి మనువడు. “దీనిదుంపతెగ... కురుక్షేత్ర యుద్ధం కథ చెప్పేటప్పుడు నెత్తురు కనిపిస్తోందని కేకలు పెట్టటంలో అర్థం వుంటుంది. సుభద్రా కల్యాణంలో నెత్తురు నెత్తురంటూ లేచి నిలబడింది. దీనికి పట్టింది పూనకం కాదు. పిచ్చి... ఇది పూనకాల పిచ్చే. సందేహంలేదు” సన్నటి కంఠంతో తన పక్కన వున్న పెద్దాయనతో అన్నాడు ఒక పౌరుడు. “ఎవడ్రా? ఎవడ్రా నన్ను వెక్కిరిస్తోంది? ఎవడ్రా అది?” కళ్ళను పెద్దవిచేసి కోరగా చూస్తూ చెవులు చిల్లులుపడే స్థాయిలో అతి బిగ్గరగా అరిచింది గణాచారి. చటుక్కున నోటిని మూసుకుని తలక్రిందికి వంచేసుకున్నాడు ఆ పౌరుడు. పక్కనవున్న పెద్దాయన వెక్కిరింపుగా నవ్వినా ఏమాత్రం పట్టించుకోలేదు. “లలితమ్మ... లలితమ్మను పిలవండిరా అంటే మూగమొద్దులమాదిరి అలా నిలబడిపోతారేమిటిరా? పిలవండిరా... వెంటనే నా దగ్గిరికి రమ్మని చెప్పండి” జుట్టు విరబోసుకుని తాచుపాము ఊగినట్లుగా ముందుకీ వెనక్కీ ఊగుతూ రెట్టించి అరిచింది గణాచారి.
IT Raids at TRS Minister Mallareddy House : మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై సోదాలు పూర్తి కావడంతో తదుపరి ప్రక్రియకు ఆదాయపన్ను శాఖ శ్రీకారం చుట్టింది. మంత్రి మల్లారెడ్డి, కుటుంబసభ్యులు, బంధువులకు సమన్లు ఇచ్చింది. ఆయా సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్ననగదు, బంగారంపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 28, 29 తేదీల్లో తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై చోరీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆదాయ పన్నుశాఖ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయిన్‌పల్లి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. మరోవైపు.. తప్పుడు నివేదికపై తన సోదరుడితో బలవంతంగా సంతకం చేయించేందుకు ప్రయత్నించారంటూ మంత్రి తనయుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదాయ పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పైనా కేసు నమోదైంది. ఓ దశలో ఆవేశానికి గురైన మంత్రి.. ఐటీ అధికారి చేయి పట్టుకొని తన కారులోనే ఠాణాకు తీసుకెళ్లడం కలకలం రేపింది. మల్లారెడ్డితో పాటు కుటుంబసభ్యులు, బంధువులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, సంస్థల్లో ఆదాయపన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో ఇలాంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ... మంగళవారం తెల్లవారుజాము నుంచే సోదాలు ఆరంభం కాగా.. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సినీఫక్కీలో ఈ తరహా హైడ్రామా నెలకొంది. తెల్లవారుజాము వరకు హడావుడి కొనసాగింది. గురువారంతో సోదాలు ముగించిన ఐటీ అధికారులు.. మల్లారెడ్డి సహా 16 మంది విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఐటీ సోదాలు కొనసాగుతుండగానే.. మంత్రి మల్లారెడ్డి ఇంటి నుంచి హడావుడిగా బయటకు వెళ్లారు. గన్‌మెన్‌ లేకుండానే కారులో బయలుదేరిన ఆయన నేరుగా సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రికి చేరుకుని.. చికిత్స పొందుతున్న కుమారుడు మహేందర్‌రెడ్డి వద్దకు వెళ్లారు. మేనేజ్‌మెంట్‌ కోటాలో ఇంజినీరింగ్‌, మెడికల్‌ సీట్ల డొనేషన్లకు సంబంధించి రూపొందించిన నివేదికలో మహేందర్‌రెడ్డితో ఐటీ అధికారులు బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారని తెలియడంతోనే మంత్రి హడావుడిగా వెళ్లారనే ప్రచారం జరిగింది. మహేందర్‌రెడ్డి ఇంట్లో తనిఖీలకు సంబంధించిన పత్రాలపై ఆయనతో సంతకాలు చేయించేందుకు ఆసుపత్రిలో వేచి ఉన్న ఆదాయ పన్నుశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రత్నాకర్‌కు, మంత్రికి ఈ సందర్భంగా వాగ్వాదం జరిగినట్లు సమాచారం. రత్నాకర్‌ నుంచి సెల్‌ఫోన్‌, సెర్చ్‌ వారంట్‌, ల్యాప్‌టాప్‌ను మంత్రి లాక్కున్నారని అభియోగం. సోదాలు చేస్తున్న మిగిలిన అధికారుల వద్ద ఈ విషయాన్ని తేల్చుకుందామంటూ మంత్రి రత్నాకర్‌ను తన కారులోనే వెంటబెట్టుకుని బోయిన్‌పల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే ఐటీ అధికారులంతా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆయన రత్నాకర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి.. రత్నాకర్‌ చేయి పట్టుకొని ఒకరకంగా బలవంతంగా లాక్కెళ్లిన దృశ్యాలు కనిపించాయి. రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో మంత్రి పోలీస్‌ స్టేషన్‌కు వస్తున్నట్లు బోయిన్‌పల్లి సీఐ రవికుమార్‌కు మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఫోన్‌ చేశారు. కాసేపటికి మల్లారెడ్డి తన చిన్న కుమారుడు భద్రారెడ్డి, ఐటీ అధికారి రత్నాకర్‌తో కలిసి ఠాణాకు వచ్చారు. ఆదాయ పన్ను దాడులు నకిలీవిగా కనిపిస్తున్నాయని.. అధికారులు దాడి చేయడంతోనే తన సోదరుడు మహేందర్‌రెడ్డి ఆసుపత్రి పాలయ్యారని.. సెర్చ్‌ ప్రొసీడింగ్స్‌పై ఆయనతో బలవంతంగా సంతకాలు తీసుకునేందుకు ప్రయత్నించారని భద్రారెడ్డి ఫిర్యాదు చేయడంతో ఐటీ అధికారి రత్నాకర్‌పై పోలీసులు ఐపీసీ 384 (దోపిడీ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. .... రాత్రి 2 గంటలు.. రంగంలోకి సీఆర్పీఎఫ్‌ బలగాలు..: పోలీస్‌స్టేషన్‌ నుంచి మంత్రి తన కారులోనే రత్నాకర్‌ను తీసుకెళ్లారు. రాత్రి 1.50 గంటల సమయంలో రత్నాకర్‌ మళ్లీ ఒంటరిగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. కాసేపటికే పదుల సంఖ్యలో సీఆర్పీఎఫ్‌ బలగాలు అక్కడికొచ్చి.. ఠాణాను తమ అధీనంలోకి తీసుకున్నంత పని చేశారు. లోపలికి ఎవరినీ రానీయొద్దంటూ వారు సూచించడంతో బోయిన్‌పల్లి పోలీసులు స్టేషన్‌ గేటుకు తాళం వేశారు. తర్వాత మంత్రిపై రత్నాకర్‌ ఫిర్యాదు చేశారు. ‘విధి నిర్వహణలో భాగంగా ఆసుపత్రికి వెళ్లి సెర్చ్‌ ప్రొసీడింగ్స్‌ సిద్ధం చేస్తుండగా.. మంత్రి తన అనుచరులతో వచ్చి ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. నా నుంచి సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, వారంట్లను లాక్కున్నారు. వాటిని చించేసే ప్రయత్నం చేశారు. నా విధుల్ని అడ్డుకున్నారు’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మల్లారెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 379 (చోరీ), 342 (బలవంతంగా నిర్బంధించడం), 353 (దాడి), 201 (నేర ఆధారాల్ని మాయం చేయడం), 203 (నేరానికి సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 రెడ్‌విత్‌ 34 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలో సీఐకి మంత్రి నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఫోన్‌కాల్‌ను సీఆర్పీఎఫ్‌ బలగాలు మాట్లాడనీయలేదని సమాచారం. ... ల్యాప్‌టాప్‌తో మంత్రి అనుచరుడి ప్రత్యక్షం..: సీఆర్పీఎఫ్‌ బలగాలు ఠాణాలో ఉండగానే మంత్రి అనుచరుడొకరు ల్యాప్‌టాప్‌తో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దాన్ని సీఐకి ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ల్యాప్‌టాప్‌ చోరీపై ఫిర్యాదు ఉండటంతో సీఐ దాన్ని తీసుకోకుండా.. అతడిని వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆ వ్యక్తి ల్యాప్‌టాప్‌ను మెయిన్‌గేట్‌ వద్ద దిమ్మెపై ఉంచి వెళ్లిపోయాడు. రత్నాకర్‌ దాన్ని తీసుకునేందుకు నిరాకరించడంతో సీఐ పంచనామా నిర్వహించి.. దాన్ని ఠాణాలో భద్రపరిచారు. ఇదంతా జరిగే సరికి తెల్లవారుజాము 3.50 గంటలైంది. తర్వాత ఆ ల్యాప్‌టాప్‌ తనది కాదని పోలీసులతో ఐటీ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. జీరో ఎఫ్‌ఐఆర్‌.. దుండిగల్‌ ఠాణాకు బదిలీ..: ఇరువర్గాల ఫిర్యాదులపై బోయిన్‌పల్లి పోలీసులు రెండు జీరో ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతం దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనిది కావడంతో అక్కడికి బదిలీ చేశారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో దుండిగల్‌ సీఐ రమణారెడ్డి బోయిన్‌పల్లి ఠాణాకు వచ్చి సీల్డ్‌కవర్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ పత్రాల్ని తీసుకెళ్లారు. రాత్రి బోయిన్‌పల్లి ఠాణా వద్ద హడావుడి నెలకొనడంతో రాత్రి విధుల్లో ఉన్న సౌత్‌జోన్‌ అదనపు డీసీపీ ఆనంద్‌, గోపాలపురం ఏసీపీ సుధీర్‌ ఠాణాకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. సోమవారం నుంచి విచారణ..: మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన సంస్థల్లో ఐటీ సోదాలు గురువారం ముగిశాయి. భారీ మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్న అధికారులు.. దాని మూలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మల్లారెడ్డి సహా 16 మందికి నోటీసులు జారీ చేశారు. ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, వ్యాపార భాగస్వాములు, కళాశాలల ప్రతినిధులు ఈ జాబితాలో ఉన్నారు. వచ్చే సోమవారం నుంచి వీరు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
తెలుగు సాహిత్యాన్ని మొబైల్ యాప్ ద్వారా శ్రవణ రూపంలో అందించే దాసుభాషితం సంస్థ, తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి విద్యార్థులకు, ప్రతీ సంవత్సరం నవంబరు నెలలో శ్రీ C P బ్రౌన్ జయంతిని పురస్కరించుకుని తెలుగు పోటీని నిర్వహించి ‘దాసుభాషితం CPB బహుమతి’ పేరిట, ₹ 1 లక్ష నగదు బహుమతి అందిస్తూంది. సెప్టెంబర్ లో దివంగతులైన శ్రీ S P బాలసుబ్రమణ్యం గౌరవార్ధం, ఈ సంవత్సరం నుంచి ఆ పోటీని, ‘CPB-SPB తెలుగు పోటీ’ గా నామకరణం చేసి, అదనంగా ఇంకొక లక్ష రూపాయలతో ‘దాసుభాషితం SPB బహుమతి’ ని ప్రకటించింది దాసుభాషితం సంస్థ. ఈ మార్పును దాసుభాషితం వ్యవస్థాపకులు శ్రీ కొండూరు తులసీదాస్ ఇలా వివరించారు. “గత సంవత్సరం నిర్వహించిన తెలుగు పోటీకి బాలు గారు ఒక వీడియో సందేశం ద్వారా, విద్యార్థులను, తెలుగు ఉపాధ్యాయులను ఉత్సాహపరిచారు. ఈ సారి బహుమతిని ఆయన చేతుల మీదుగా అందజేద్దామనుకున్నాము. కానీ అది సాధ్యపడదు. పిల్లల పోటీ నిర్వహిస్తున్నప్పుడు, పెద్దలు కూడా పోటీపై ఆసక్తి కనబరిచారు. ఈ పోటీని అందరికీ విస్తరించి, ఆయన పేరు మీద ఒక బహుమతి ద్వారా తెలుగు భాషపై స్పృహను పెంచడం, తెలుగు తల్లి ముద్దు బిడ్డయిన బాలు గారికి మేము ఇవ్వగల సరైన నివాళి అనిపించింది.” పోటీలో తెలుగు భాష, సాహిత్యం, సమాజం పై 30 ప్రశ్నలుంటాయని, 2018, 2019 లో నిర్వహించిన పోటీల అనుభవంతో, నిపుణుల సహకారంతో ఈ సంవత్సరం ఇంకా ఆసక్తికరంగా పోటీని రూపొందిస్తున్నామని దాసుభాషితం CEO శ్రీ కొండూరు కిరణ్ కుమార్ అన్నారు. పోటీ డిసెంబర్ 13, 2020 ఆదివారం పూర్తిగా ఆన్‌లైన్ లో నిర్వహింపబడుతుంది. ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఫలితాలను డిసెంబర్ 20, 2020 ఆదివారం ప్రకటిస్తారు. పోటీకి నమోదుకు ఆఖరు తేదీ డిసెంబర్ 10, 2020. ‘Telugu Potee’ అని 99520 29498 కు WhatsApp సందేశం పంపి గాని, www.dasubhashitam.com దర్శించి గాని పోటీకి నమోదు చేసుకోవచ్చు.
NBK107 : నందమూరి నటసింహం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. X NBK107 : నందమూరి నటసింహం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇందులో బాలయ్య గెటప్ సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ముందునుండిగా హీరోయిన్‌‌గా శృతిహసన్ పేరు వినిపిస్తోంది. తాజాగా దీపావళి సందర్భంగా మేకర్స్ ఆఫీషియల్‌‌గా అనౌన్స్ చేశారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉన్నట్టుగా సమాచారం. కాగా క్రాక్, వకీల్ సాబ్ చిత్రాల స‌క్సెస్‌తో ఫుల్ జోష్ మీదుంది శృతిహాస‌న్‌. ప్రస్తుతం ప్రభాస్ సరసన సాలార్ మూవీ చేస్తోంది. ఇప్పుడు బాలయ్య సినిమాలో మేరవనుంది. అటు అఖండ సినిమా షూటింగ్‌‌లో బాలయ్య బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకొంది. Team #NBK107 welcomes the highly talented and gorgeous @shrutihaasan on board to play the leading lady opposite #NandamuriBalakrishna Garu 😎#HappyDiwali 💥@megopichand @MusicThaman ❤️‍🔥 pic.twitter.com/kjodDXaePk
ఆర్బీఐ నిబంధనలు పాటించని లోన్ యాప్‌లపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి వనిత అధికారులకు ఆదేశించారు. ఆన్ లైన్ లోన్ పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని హోంమంత్రి హెచ్చరించారు. Taneti Vanitha Shaik Madarsaheb | Oct 07, 2022 | 9:50 PM ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లోన్ యాప్స్, మైక్రో ఫైనాన్స్ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారి వేధింపులు తాళలేక, చేసేదేంలేక ఇప్పటికే చాలామంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. లోన్ యాప్స్ వేధింపులతో ఇటీవల పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. కాగా.. ఈ వరుస ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. రాష్ట్రంలో లోన్ యాప్ సంఘటనల గురించి హోంమంత్రి తానేటి వనిత శుక్రవారం ఆరా తీశారు. పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి హోం మినిస్టర్ వనిత వివరాలు తెలుసుకున్నారు. లోన్ యాప్ మరణాలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను హోంమంత్రి ఆదేశించారు. లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులను ఆదేశించారు. ఆర్బీఐ నిబంధనలు పాటించని లోన్ యాప్‌లపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి వనిత అధికారులకు ఆదేశించారు. ఆన్ లైన్ లోన్ పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని హోంమంత్రి హెచ్చరించారు. లోన్ యాప్ నిర్వాహకుల మాయలో పడి మోసపోవొద్దని హోం మినిస్టర్ ప్రజలకు సూచించారు. లోన్ యాప్ నిర్వాహకుల నుంచి బెదిరింపుల కాల్స్ వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని హోంమంత్రి ఈ సందర్భంగా సూచించారు. నిర్వాహకుల వేధింపులకు భయపడి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడొద్దని హోంమంత్రి సూచించారు. ఏపీలో గత కొన్ని రోజుల నుంచి లోన్ యాప్ ఆగడాలు పెరుగుతున్నాయి. వేలల్లో రుణాలు ఇచ్చి.. లక్షల్లో వసూలు చేస్తున్న ఘటనలు, అధికంగా వడ్డీలు తీసుకున్న సైతం వెలుగులోకి వచ్చాయి. ఈ డబ్బు మొత్తం కట్టాల్సిందేనని, లేదంటే న్యూడ్ వీడియోలు పెడతామని బెదిరిస్తుండటంతో చాలామంది గత్యంతరం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం లోన్‌ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం కూడా తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేని లోన్‌ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు సైతం జారీచేసింది. అయినప్పటికీ.. లోన్‌ యాప్స్‌ వేధింపులు పెరిగిపోతుండటం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇవి కూడా చదవండి Heart Attack: గుండెపోటు వచ్చినప్పుడు ఇలా చేస్తే రోగి ప్రాణాన్ని సులభంగా కాపొడొచ్చు.. లైఫ్ సేవింగ్ టిప్స్.. Bay Leaves Water: బిర్యానీ ఆకుల నీటీతో అధిక బరువుకు చెక్.. ఇలా చేస్తే 7 రోజుల్లోనే ఫిట్‌‌గా మారొచ్చు.. ఎలాగో తెలుసుకోండి.. Hair Care Tips: జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారా..? దీనిని ఇలా ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితం.. Honey: ఆ సమస్యలకు అమృతం తేనె.. రోజూ వీటితో తీసుకుంటే ఊబకాయం హాంఫట్.. ఇంకా డబుల్ బెనిఫిట్స్..డబుల్ బెనిఫిట్స్..
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)కు ఇటీవల ‘లైగర్’తో భారీ దెబ్బ పడ్డ విషయం తెలిసిందే. దీంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా క్రేజీ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ‘ఇస్మార్ట్ శంకర్’తో ఫామ్ లోకి వచ్చిన స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు మళ్లీ కష్టకాలం వచ్చింది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - పూరీ కాంబినేషన్ లో వచ్చిన భారీ చిత్రం ‘లైగర్’ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, పూరీ కూడా బాలీవుడ్ లో హవా క్రియేట్ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ థియేటర్లలోకి వచ్చిన ‘లైగర్’కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తూ మతిపోయింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్, ఆడియెన్స్ ను పూరీ జగన్నాథ్ పూర్తిగా నిరాశ పరిచారు. పైగా మొదటి వారానికే థియేటర్ల నుంచి సినిమా వెళ్లిపోవడంతో నిర్మాతగా ఉన్న పూరీ కూడా ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే ‘లైగర్’ తెచ్చి పెట్టిన ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడుతున్నారు. మరోవైపు అసంత్రుప్తిలో ఉన్న అభిమానులను ఖుషీ చేసేందుకు మళ్లీ సంసిద్ధమవుతున్నారు. సినిమాలు ఫ్లాఫ్ అవడం, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం పూరీ జీవితానికి కొత్తేమీ కాదు. కానీ పూరీ కేరీర్ లో ఈ స్థాయిలో డిజాస్టర్ ను అందుకోవడం ఇదే మొదటిసారిగా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం పూరీ జగన్నాథ్ గోవాలో ఉన్నట్టు తెలుస్తోంది. తన నెక్ట్స్ మూవీ కోసం స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈసారి గట్టిగా బౌన్స్ బ్యాక్ ఇచ్చేందుకు కథపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరింత బలమైన స్టోరీతో ప్రేక్షకుల మన్ననలను పొందడంతో పాటు.. ఫ్యాన్స్ ను ఖుషీ చేయాలని ఫిక్స్ అయ్యారంట. అయితే ‘లైగర్’ ఫలితాలతో విజయ్ దేవరకొండతో చేయాల్సిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘జన గణ మణ’ (Jana Gana Mana) ఆగిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ ‘ఖుషి’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత దర్శకుడు సుకుమార్ తోనే సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈక్రమంలో పూరీ నెక్ట్స్ ఫిల్మ్ ఎవరితోనన్నది ప్రశ్నార్థకంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం పూరీని తెలుగు హీరోలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో.. యంగ్ హీరో ఆకాష్ పూరీ (Akash Puri)తోనే సినిమా తీయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అలాగైతే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఎప్పుడు తెరకెక్కిస్తారనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. దీనిపైనా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పూరీ టీమ్ స్క్రిప్ట్ వర్క్ ను స్టార్ట్ చేసినట్టు సమాచారం.
వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ పుట్టిన బిడ్డ ద‌గ్గ‌ర నుంచి పండు ముస‌లి వ‌ర‌కూ ప్రతి ఒక్కరికి ప్ర‌భుత్వం తోడు వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందనలు వైయ‌స్ఆర్‌సీపీ బీసీల పార్టీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణె రాజ్యాంగ స్ఫూర్తితో సీఎం వైయస్‌ జగన్‌ పాలన రాజ్యాంగం అణ‌గారిన వ‌ర్గాల‌కు అండ‌ అంబేడ్క‌ర్ భావ‌జాలంతో అనేక సంస్క‌ర‌ణ‌లు You are here హోం » టాప్ స్టోరీస్ » అయ్యప్ప నాయుడు అందరికీ ఆదర్శం అయ్యప్ప నాయుడు అందరికీ ఆదర్శం 03 Mar 2022 12:02 PM వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి విశాఖ‌: తాను మరణిస్తూ ఏడుగురికి ప్రాణదానం చేసిన తాడేపల్లికి చెందిన వైద్య విద్యార్థి అయ్యప్ప నాయుడు అందరికీ ఆదర్శప్రాయమ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు గురువారం విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన నాయుడి అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సకాలంలో అవయవాలను తరలించిన పోలీసులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ