text
stringlengths
335
364k
స్పీకర్ కోడెల వైఖరికి నిరసనగా రెండో రోజూ అసెంబ్లీని బహిష్కరించి నిరసన తెలిపిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలసి పరిస్థితిని వివరించిన విపక్ష నేత వైఎస్ జగన్ 26 నుంచి పార్టీ ఎమ్మెల్యేలతో కలసి జగన్ బస్సుయాత్ర పోలవరం నుంచి పోతిరెడ్డిపాడు వరకు కొనసాగనున్న యాత్ర నేడు ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహణ సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు నియంత్రించడం, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఆందోళన బాట పట్టింది. సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ శాసనసభా పక్షం సమావేశమై తాజా పరిస్థితులను సమీక్షించి తదుపరి కార్యాచరణను ఖరారు చేసింది. ఆ మేరకు స్పీకర్ కోడెల చర్యలను నిరసిస్తూ శాసనసభ ఆవరణలోని మహాత్మగాంధీ విగ్రహం ముందు ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. వరుసగా రెండో రోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన ఎమ్మెల్యేలు అంతకుముందు ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ చౌక్‌కు చేరుకుని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి అసెంబ్లీ ఆవరణకు పాదయాత్రగా చేరుకున్నారు. దారి పొడవునా స్పీకర్ వైఖరిని నిరసిస్తూ, చంద్రబాబు విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేల ఆందోళన ఓ వైపు సాగుతూ ఉండగా ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలసి తాజా పరిస్థితులను మరోసారి వివరించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి గల కారణాలను వివరించారు. శాసనసభలో ఏకైక ప్రతిపక్షంగా చేపడుతున్న నిరసన కార్యక్రమాలను ఆయన గవర్నర్‌కు తెలిపారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ నెల 19న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్‌పై ప్రసంగిస్తూ రైతుల సమస్యలను ప్రస్తావిస్తుండగా ‘మాట్లాడొద్దని’ మైక్ కట్ చేయడంతో సమావేశాలను జగన్‌తో సహా ఎమ్మెల్యేలంతా బహిష్కరించారు. ప్రతిపక్ష వాణి వినిపించకుండా స్పీకర్ తమ గొంతు నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలు ఆయనపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జగన్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన ఎమ్మెల్యేలు ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియంతత్వ పోకడలు, నిరంకుశ వైఖరిపై బడ్టెట్ సమావేశాలు ముగిసే వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా నిర్ణయించారు. శాసనసభ ఆవరణలో మంగళవారం ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించాలని, 26 నుంచి ప్రాజెక్టుల వద్దకు బస్సుయాత్రగా వెళ్లాలని నిర్ణయించారు. బస్సు యాత్రలో జగన్, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. పోలవరం నుంచి పోతిరెడ్డి వరకు.. జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి చేసే బస్సుయాత్ర పోలవరం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు వరకు సాగుతుందన్నారు. 26న పోలవరం వెళ్లి అటునుంచి పట్టిసీమ, ప్రకాశం బ్యారేజి, ఆ తరువాత పోతిరెడ్డిపాడు వెళతారని శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ వివరించారు. శాసనసభా పక్ష సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో జరుగుతున్న వ్యవహారాల గురించి ఎండగట్టడానికి శాసనసభ ఆవరణలోనే మంగళవారం ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహిస్తామని చెప్పారు. ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అసెంబ్లీలో అధికారపక్షం, స్పీకర్ కలసి ప్రతిపక్షం గొంతు నొక్కుతుండటాన్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారని, ప్రజల్లోకి వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించాలని శాసనసభాపక్షం భావించినందువల్లనే ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. తాము చేపట్టే కార్యక్రమాలు స్పీకర్‌కు, అధికారపక్షానికి కనువిప్పు కలిగిస్తాయని భావిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడాదిలోపే విశ్వాసం కోల్పోయారు అయ్యదేవర కాళేశ్వరరావు, బి.వి.సుబ్బారెడ్డి, శ్రీపాదరావు, నారాయణరావు వంటి మహానుభావులు శాసనసభలో నిష్పాక్షికంగా వ్యవహరించి స్పీకర్ పదవికే వన్నె తేవడమేగాక మంచి సంప్రదాయాలను నెలకొల్పారని, అలాంటిది ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఏడాది గడవకముందే ప్రధాన ప్రతిపక్షం విశ్వాసం కోల్పోవడం దారుణమని చెప్పారు. అధికారపక్షం కనుసన్నల్లో స్పీకర్ వ్యవహరిస్తున్నారని, మూడు శాసనసభా సమావేశాల నిర్వహణతోనే ఆయన నైజం బయటపడిందని పేర్కొన్నారు. అందుకే తాము అవిశ్వాసం ప్రతిపాదించామని, అది గెలిచినా, ఓడినా తాము మాత్రం ఆయన తీరును ఎండగడతామని చెప్పారు. బడ్జెట్‌పై చర్చలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రైతు సమస్యల గురించి ప్రస్తావించగానే ‘మాట్లాడ్డానికి వీల్లేదు’ అంటూ నిర్ద్వంద్వంగా తిరస్కరించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని జ్యోతుల నెహ్రూ అన్నారు. రాష్ట్రానికే వరప్రసాదమైన పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకే చంద్రబాబు పట్టిసీమను తెరమీదకు తెచ్చారని, దీనిద్వారా జరిగే అన్యాయాన్ని తాము ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బీఏసీ సమావేశాల్లో, శాసనసభలో జరిగిన అంశాలను స్పీకర్ మీడియాకు ఎలా చెబుతారని ప్రశ్నించారు. గుంటూరులో స్పీకర్ మాట్లాడుతూ ప్రజావసరాలకు భిన్నమైనవాటిని సహించనని చెప్పారని, అసలు అలా చెప్పడానికి ఆయన ఎవరని నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ని ఎన్నుకున్నట్లే ప్రజలు తమను కూడా ఎన్నుకున్నారని, తమకు ప్రతిపక్షపాత్ర ఇచ్చారని గుర్తుచేశారు. అసెంబ్లీలో సమగ్రంగా చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుని తమపై ఏకపక్షంగా రుద్దుతుంటే తాము ప్రతిఘటిస్తున్నామన్నారు. తమవి ప్రజా వ్యతిరేక చర్యలని స్పీకర్ ఎలా అంటారు? ఆయనకు ఆ అధికారం ఎక్కడిది? అని నెహ్రూ ప్రశ్నించారు. బీఏసీలో ఏమీ జరగడంలేదని, హాజరుకాగానే తమతో సంతకాలు చేయించుకుని మీ అంశాలేమిటని అడిగి తెలుసుకుని నిష్ర్కమిస్తుంటారని, అందులో ఒక నోట్ కూడా ఉండదని చెప్పారు. సభా సమయం లేదని రోజూ చెప్పే అధికారపక్షం అసెంబ్లీ సమావేశాల వ్యవధిని ఎందుకు పొడిగించదని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ వరకు పాదయాత్ర, ఆపై ధర్నా అధ్యక్షా.. మీరెవరి పక్షం? ప్రభుత్వ పక్షమా? ప్రజల పక్షమా?.. అని ప్రతిపక్ష సభ్యులు శాసనసభాపతిని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వంతో పాటు, స్పీకర్ వైఖరికి నిరసనగా విపక్ష ఎమ్మెల్యేలు సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టి గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ‘ఉయ్ వాంట్ జస్టిస్’ అన్న నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. పట్టిసీమ దొంగ.. బాబు దొంగ.. రైతు వ్యతిరేకి.. మహిళా వ్యతిరేకి చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ‘ప్రజా వాణే ప్రతిపక్ష వాణి..’, ప్రతిపక్షం లేకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షం గొంతు నొక్కేస్తారా..?, ప్రతిపక్షంపై ఎదురుదాడి బాబు ప్రభుత్వ సమాధానమా..! అని నిలదీశారు. ప్రభుత్వ దుశ్చర్యలకు స్పీకర్ వంతపాడుతున్నారని మండిపడ్డారు. ఆందోళన కార్యక్రమానికి ముగింపుగా శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీ ప్రణాళికబద్ధమైన విధానాలతో ముందుకు పోతుందని చెప్పారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పాదయాత్ర, ధర్నాలో ఉపనేత ఉప్పులేటి కల్పన, వంతల రాజేశ్వరి, పాముల పుష్పశ్రీవాణి, గిడ్డి ఈశ్వరి, గౌరు చరితారెడ్డి, విశ్వాసరాయి కళావతి, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి, కొడాలి నాని, సుజయ్‌కృష్ణ రంగారావు, కిడారు సర్వేశ్వర్‌రావు, కంబాల జోగులు, మణి గాంధీ, వరుపుల సుబ్బారావు, పి.అనిల్‌కుమార్‌యాదవ్, గొట్టిపాటి రవికుమార్, పోతులరామారావు, కిలివేటి సంజీవయ్య, కళత్తూరు నారాయణస్వామి, పాశం సునీల్‌కుమార్, ఆదిమూలపు సురేష్, తిరువీధి జయరామయ్య, ఐజయ్య, పాలపర్తి డేవిడ్‌రాజు, మేకా ప్రతాప అప్పారావు, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, జంకె వెంకటరెడ్డి, కలమట వెంకటరమణ, బూడి ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, ముస్తఫా, అత్తారు చాంద్‌బాషా, షేక్ బేపారి అంజాద్‌బాషా, ముత్తుముల అశోక్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, కోన రఘుపతి, కాకాని గోవర్థన్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రముఖ నటుడు, నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అల్లు ఫ్యామిలీ పలు కార్యక్రమాలను నిర్వహించింది. అందులో భాగంగా శనివారం జరిగిన శతజయంతి వేడుకలకి రామ్‌ చరణ్‌, ఆయన సతీమణి ఉపాసన, చిరంజీవి సతీమణి సురేఖ (అల్లు రామలింగయ్య కుమార్తె), అలాగే అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, అల్లు బాబీ, సాయి ధరమ్‌ తేజ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లు రామలింగయ్యపై రాసిన పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించి, తొలి ప్రతిని చిరంజీవికి అందించారు. ఈ వేడుకలో బ్రహ్మానందం మాట్లాడుతూ,'అల్లు రామలింగయ్యకి బతుకు విలువ, మెతుకు విలువ తెలుసు కాబట్టి ఆ కష్టం ఏంటో, ఆ బాధ ఏంటో ఆయనకి తెలుసు. అల్లు అరవింద్‌ లాంటి బిడ్డను కన్నందుకు ఆయన ఎంతగానో ఆనందిస్తారు. ఆయన ఎప్పటికి మన మధ్యలోనే ఉంటారు' అని అన్నారు. 'అల్లు రామలింగయ్యకి సినీపరిశ్రమలో అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి క తజ్ఞతలు. ఆయనకు అల్లుడుగా వచ్చి ఆయన స్థాయిని ఎన్నో రేట్లు పెంచిన చిరంజీవికి ప్రత్యేక క తజ్ఞతలు. అలానే పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి, పుస్తకాన్ని రాసిన వారికి ధన్యవాదాలు' అని అల్లు అర్జున్‌ చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ, 'అల్లు రామలింగయ్యతో నాకు ఉన్న అనుబంధం ఇంకెవరితోను లేదు. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన్ని మొదటి సారి చూసిన సమయంలోనే ఆయన తీరును చూసి ఆశ్చర్యపోయాను. షూటింగ్‌ సమయంలో చాలా మంది ఉండగా ఆయన నా వైపే పదే పదే చూస్తూ నన్ను గమనించడం చేసేవారు. ఆ సమయంలో నాకు ఆయన ఎందుకు అలా చూస్తున్నారో అర్థం కాలేదు. ఆయన కూతురు సురేఖని ఇచ్చి నాకు పెళ్ళి చేయబోతున్నారని ఆ తర్వాత అర్థమైంది. ఆయనొక నిరంతర విద్యార్థి, చిరస్మరణీయుడు. ఆయన మరణించలేదు మన మధ్యే ఉన్నారు' అని తెలిపారు. 'అల్లు రామలింగయ్య పుస్తకావిష్కరణలో పాల్గోవడం మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆయన పిల్లందరికి నా ఆశీర్వచనాలు, ఆయనకు నా నివాళులు. సినిమాలలో ఉన్నత విలువలు, కొన్ని సంప్రదాయాలు నిలబెట్టిన వాళ్లలో అల్లు రామలింగయ్య అగ్రఘన్యుడు. ఏ విధమైన అసభ్యత లేకుండా, కేవలం తన హావభావాలతో నవ్వించగల నటులు అల్లు రామలింగయ్య' అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ,'అల్లు రామలింగయ్య వారసత్వం ఎక్కడి వరకు ఉంటుంది అనేది ఊహించడం కూడా వ ధా, వారి వారసత్వం రాబోయే తరాలు నిలిచి పోతుంది. రాబోయే తరాలు కూడా ఆయన గొప్పతనాన్ని నిలుపుతాయి. అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌తో పాటు చిరంజీవి ఇంకా ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌ అందరికి కూడా ఆయన ఒక మార్గ నిర్దేశం చేసి వెళ్లారు. ఇప్పుడు ఆ మార్గంలో అద్భుతమైన జర్నీని వారు కొనసాగించడం అభినందనీయం' అని అన్నారు. ఇదే వేడుకలో అల్లురామలింగయ్య స్మారక పురస్కారాలను బ్రహ్మానందం, కోటశ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సునీల్‌, ఎల్‌.బి.శ్రీరామ్‌, రావురమేష్‌, పృథ్వీరాజ్‌, వెన్నెల కిషోర్‌కి అందజేశారు. ఈ వేడుకలో సాయిధరమ్‌తేజ్‌, రామ్‌చరణ్‌, అల్లుఅరవింద్‌, అల్లు శిరీష్‌ తదితరులు పాల్గొన్నారు.
పోలీసుశాఖ పటిష్ఠానికి మొదటినుంచి ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తాజాగా ఆ శాఖపై వరాలజల్లు కురిపించారు. అమరవీరుల సంస్మరణదినం సందర్భంగా పోలీసుశాఖ న్యాయమైన కోరికలను సీఎం నెరవేర్చారు. విధి నిర్వహణలో ప్రాణాలొదిలిన అమరవీరుల కుటుంబాలకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాను భారీగా పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. -అమరుల కుటుంబాలకిచ్చే ఎక్స్‌గ్రేషియా భారీగా పెంపు -వచ్చే ఏడాది నుంచే తెలంగాణ పోలీసు మెడల్స్ -ఎస్‌ఐ అధికారికి గెజిటెడ్ హోదా -కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు సీయూజీ సిమ్‌కార్డ్స్ -రోజువారీ బందోబస్తు భత్యం రూ.90 నుంచి రూ.250కి పెంపు కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ హోదా వరకు ఉన్న సిబ్బంది విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి ఇప్పటివరకు ఇస్తున్న పరిహారాన్ని రూ.25 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఎస్‌ఐ హోదా ఉన్న అధికారి చనిపోతే ఇస్తున్న పరిహారాన్ని రూ.25 లక్షల నుంచి రూ.45 లక్షలకు.. సీఐ, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ హోదాగల అధికారులు మృతిచెందితే ఇస్తున్న మొత్తాన్ని రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలకు.. ఎస్పీస్థాయి లేదా ఐపీఎస్ అధికారి మృతి చెందితే ఇచ్చే పరిహారాన్ని రూ.50 లక్షల నుంచి రూ. కోటికి పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. అమరవీరుల కుటుంబాల్లోని పిల్లల చదువులు, ఆ కుటుంబాలకు ఇంటినిర్మాణం ప్రభుత్వమే చూసుకుంటుందని హామీఇచ్చారు. చనిపోయినవారి రిటైర్మెంట్ వయసు వరకు ఆయా కుటుంబాలకు పూర్తి జీతం చెల్లిస్తామని.. వారికి రావాల్సిన ప్రయోజనాలను రెండు వారాల్లో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ పోలీస్ మెడల్స్ పోలీస్‌శాఖలోని అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన అధికారులు, సిబ్బందికి తెలంగాణ పోలీస్ మెడల్స్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రిటైర్డ్ డీజీపీల నుంచి కానిస్టేబుళ్ల వరకు చప్పట్ల మోత మోగించారు. మొత్తం 20 మందికి తెలంగాణ పోలీస్ మెడల్స్ ఇస్తామని, అందులో మూడో వంతు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు ఉంటారని సీఎం ప్రకటించారు. మెడల్స్‌తోపాటు వన్‌టైమ్ బెనిఫిట్‌గా రూ.5 లక్షల నగదు పురస్కారం కూడా అందిస్తామని తెలిపారు. ఎస్‌ఐలకు గెజిటెడ్ హోదా గెజిటెడ్ హోదా కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ల కల ఎట్టకేలకు నెరవేరనున్నది. ఎస్‌ఐలకు త్వరలోనే గెజిటెడ్ హోదా కల్పిస్తామని సీఎం ప్రకటించారు. మండలస్థాయిలో శాంతిభద్రతలను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్న ఎస్‌ఐలకు త్వరితగతిన గెజిటెడ్ హోదా వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీయూజీ సిమ్‌కార్డులు.. ఇంటర్నెట్ సౌకర్యం పోలీస్‌శాఖ సమాచారవ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతిఒక్కరికీ ఇంటర్నెట్ సౌకర్యంతో సీయూజీ సిమ్‌కార్డులు ఇస్తామని సీఎం ప్రకటించారు. అంతర్గత విభాగాలను పటిష్ఠం చేసుకునేందుకు వీటిని వినియోగించాలని సీఎం సూచించారు. రోజువారీ భత్యం పెంపు అసెంబ్లీ, పండుగలు, ఇతర కార్యక్రమాలు జరిగే సమయంలో వేల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తులో నిమగ్నం చేస్తారు. అలాంటి సిబ్బందికి ఇప్పటివరకూ ఇస్తున్న రూ.90 భత్యాన్ని రూ.250కి పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. బందోబస్తు సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఆరోగ్య భద్రత సీలింగ్ పెంపు పోలీస్‌శాఖలో అమలవుతున్న ఆరోగ్య భద్రత పథకాన్ని సీఎం మరింత బలోపేతం చేశారు. ఇప్పటివరకు కిందిస్థాయి సిబ్బందికున్న రూ.లక్ష సీలింగ్‌ను రూ.5 లక్షలకు పెంచారు. పైస్థాయి అధికారుల సీలింగ్‌ను రూ.2.5 లక్షల నుంచి రూ.7.5 లక్షలకు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. 40 ఏండ్లకు పైబడిన అధికారులకు ప్రతి ఆరు నెలలకోసారి పూర్తిస్థాయి ఉచిత వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. వాస్తవానికి ప్రతి రెండేండ్లకు ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించాలని కోరినా.. సీఎం ఆరు నెలలకోసారని చెప్పడంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలో పోలీస్‌శాఖకు ఉన్న 15 క్యాంటీన్లలో కొనుగోలు చేస్తున్న వస్తువులపై వ్యాట్‌ను మినహాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. హామీలు కాదు ఆచరణలోనూ.. పోలీస్ సంస్మరణదినం సందర్భంగా ప్రకటించిన హామీలను అమలుచేసే దిశగా వెంటనే సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు. ఇచ్చిన హామీల్లో సిమ్‌కార్డు విషయం తప్ప మిగతా అన్ని ప్రతిపాదనలు సాయంత్రానికి హోంశాఖకు పంపించాలని డీజీపీ అనురాగ్‌శర్మను సీఎం ఆదేశించారు. ఈ మేరకు అన్ని ప్రతిపాదనలను హోంశాఖకు పంపించినట్లు డీజీపీ టీ మీడియాకు తెలిపారు. డ్రాఫ్ట్ జీవోకు సంబంధించిన అంశాలను కూడా సిద్ధం చేశామన్నారు. జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటాం -పోలీసు అధికారుల సంఘం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రకటించిన హామీలపై పోలీస్ అధికారుల సంఘం హర్షం వ్యక్తంచేసింది. ఉమ్మడిరాష్ట్రంలో పోలీస్‌శాఖను ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వాలకు సీఎం కేసీఆర్ దీటైన సమాధానం చెప్పేలా పథకాలు ప్రకటించారని సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి అన్నారు. ఎస్‌ఐలకు గెజిటెడ్ హోదాను అమరవీరుల సంస్మరణదినం సందర్భంగా సీఎం ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు. ప్రతి ఆరునెలలకు ఉచిత వైద్యపరీక్షలు, సీయూజీ సిమ్‌కార్డులు తదితర హామీలను ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదన్నారు. తెలంగాణ పోలీస్ సిబ్బంది సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటుందన్నారు.
ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మంచి ప్రకృతి ప్రేమికురాలు. ఖాళీ సమయం దొరికితే నేచురల్ అందాల్లో మమేకమైపోతుంది. నేచుర్ పై పరిశోధన సైతం ఎంతో ఇష్టం అంటుంది. ఇక సాహస యాత్రలంటే ఇంకా ఇష్టం. ఒంటరిగా బేర్ గ్రిల్స్ లాంటి సాహసాలు చేయాలని ఉంటుంది. కానీ తాను నటి అయింది కాబట్టి ఆ స్కోప్ లేదు. అవును ఈ విషయాన్ని రకుల్ ఓ పాత ఇంటర్వ్యూ సందర్భంలో వెల్లడించింది. అప్పుడప్పుడు తన కోర్కెల్ని సినిమా లో తన పాత్రల రూపంలో దక్కితే ఎంతో సంతోష పడుతుంది. మరెంతో ఇష్టంగా నటించడానికి రెడీగా ఉంటుంది. కొండపొలం లాంటి సినిమాతో పచ్చనైన ప్రకృతి అందాల్ని ఎంతగా ఆస్వాదించిందో ఆ సినిమా ప్రమోషన్ టైమ్ లో చెప్పుకొచ్చింది. తాజాగా అమ్ముడు అడ్వెంచర్ ట్రిప్ కి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. అందులో రకుల్ ఆరెంజ్ కలర్ టీషర్ట్ పై బ్లూ కలర్ లైప్ జాకెట్ ధరించి కనిపిస్తుంది. క్యాజువల్ చుక్కల ప్యాంట్ లో కనిపిస్తుంది. అలాగే ఎండ తీవ్రతని తట్టుకునేలా కళ్లకి కూలింగ్ గ్లాసెస్…తలకి టోపీ పెట్టుకుని స్పాట్ నుంచి కొన్ని ఫోటోల్ని లిక్ చేసింది. మరి ఈ లొకేషన్ ఎక్కడ? అన్నది తెలియదు గానీ…రకుల్ మాత్రం అడ్వెంచర్ ట్రిప్ ని బాగా ఆస్వాదిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద పెద్ద బండరాయి కొండలా కనిపిస్తుంది. మరి ఆ కొండ మీద నుంచి కిందకి దూకి ఇలా ఫోజిచ్చిందా? ఏంటో? మరి. ఏదేమైనా రకుల్ కొత్త ఫోటో ఫాలోవర్లకి బ్రేకిచ్చినట్లు అయింది. వరుసగా హాట్ ఫోటోలు చూసి బోర్ కొట్టిన జనాలకి ఇది విరామం లాంటి పిక్. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా కనిపిస్తున్న ఫోటో కావడంతో రకుల్ సాహస యాత్ర కోసం ఎక్కడికి వెళ్లిందంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఆ సంగేతంటి? అన్నది రకుల్ రివీల్ చేస్తే గాని క్లారిటీ రాదు. ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో నటిగా బిజీగా ఉంది. `డాక్టర్ జీ` అనే సినిమాలో నటిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే `ఛత్రవాలీ` అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇది షూటింగ్ దశలో ఉంది. `ఎటాక్`..`రన్ వే`..`థాంక్ గాడ్`..`మిషన్ సిండ్రాల్లా నటిస్తోంది`. వీటిలో కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఇక కోలీవుడ్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఇండియన్ -2`లో నటిస్తోంది. ఈ సినిమాపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. తెలుగులో `31 అక్టోబర్ లేడీస నైట్` లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు..తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు.
ఉందని, ప్రధానంగా మహిళా, శిశు సంక్షేమంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని రాష్ట్ర మున్సిపల్‌, ఐ.టి. శాఖా మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక పురస్కారాలను కే.టీ.రామారావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్‌లు అందచేశారు. వివిధ పత్రికా, ప్రసార మాధ్యమాల్లో పనిచేస్తున్న దాదాపు 80 మందికి పైగా మహిళా జర్నలిస్టులకు బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్‌ లో ప్రత్యేక పురస్కారాలు అందచేశారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్‌ అర్వింద్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి కే.టీ.రామారావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ ఎనిమిదేళ్లలో మహిళాభ్యుదయం, శిశు సంక్షేమ రంగంలో గణనీయమైన ఫలితాలు వచ్చాయని అన్నారు. ముఖ్యంగా శిశు మరణాలు, నియో నాటల్‌ మరణాలు, మెటర్నల్‌ మరణాలు గణనీయంగా తగ్గాయని, దీనికి నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యతేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే ఈ విజయాలకు సాక్ష్యమని తెలియచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రికలైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో రాష్ట్రం లో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయని మంత్రి గుర్తుచేశారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందచేశామని, కేసీఆర్‌ కిట్‌, ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాలతో రాష్ట్రంలో ఆసుపత్రులలో ప్రసవాలసంఖ్య పెరిగిందని అన్నారు. ఒక్క, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే నెలకు 300 లకు పైగా డెలివరీలు జరుగుతున్నాయని ఉదహరించారు. దీనితో, గతంలో మాదిరిగా, సీజేరియన్‌ ఆపరేషన్లు జరగడంలేదని, రాష్ట్రంలో 17 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహారాన్ని అందచేశామని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 300 అమ్మఒడి వాహనాలను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. పాశ్చాత్య దేశాలతో పోల్చితే మన దేశంలోని మహిళలు బహుముఖ విధులను నిర్వహిస్తారని, ముఖ్యంగా మీడియా రంగంలోని మహిళలు మరింత కఠినతరమైన విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతీ ఒక్క రంగంలోని వారు తమసేవలకు గుర్తింపు కోరుకుంటారని, ఈ క్రమంలోనే వీరి సేవలకు గుర్తింపుగా మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి చిరు సత్కారం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలతో అభివృద్ధి, సంక్షేమ రంగంలో వచ్చిన మార్పులను ప్రజలను చైతన్యం చేసే విధంగా వార్తా కథనాలను రాయాలని కేటీఆర్‌ కోరారు. రాష్ట్రంలో 18000 పోలీసు ఉద్యోగాల నియామకం జరిగితే దానిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారని, విద్యుత్‌ శాఖలో 9644 ఉద్యోగ నియామకాలు జరిగితే దీనిలోనూ 50 శాతం మహిళలే ఉన్నారని వెల్లడిరచారు. కేవలం మగవాళ్ళు మాత్రమే చేస్తారనే పేరున్న లైన్‌మెన్‌ ఉద్యోగాలలోనూ 217 మంది మహిళలను నియమించామని, ఇలాంటి వాటిపై విజయ గాథలు ప్రత్యేక కథనాలు రాసి మహిళలకు స్ఫూర్తి నింపాలని జర్నలిస్టులకు సూచించారు. ఈ సందర్బంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తర్వాత మహిళాభ్యుదయాన్ని చూడాలని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల మహిళల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్బంగా అవి స్వీకరించే అమ్మాయిల కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రావడం చూస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్‌ మాట్లాడుతూ, రాష్ట్ర బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞత లు తెలిపారు. రాష్ట్రంలో షీ- టీమ్‌లు ప్రవేశపెట్టిన తర్వాత మహిళలు తమ ఉద్యోగ విధులనుండి అర్ధ రాత్రిళ్ళలో నైనా క్షేమంగా ఇంటికి చేరుకుంటామని ధైర్యం ఏర్పడిరదని గుర్తు చేశారు. ఆంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొట్ట మొదటి సారిగా రాష్ట్రం లోని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, ఫ్రీలాన్సర్‌ రంగాల్లోని మహిళా జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళా జర్నలిస్టులు హాజరయ్యారు.
2ఫోర్డ్ షోరూమ్లను భువనేశ్వర్ లో గుర్తించండి. కార్ దేఖో మీ చిరునామా మరియు సంపూర్ణ సంప్రదింపు సమాచారంతో భువనేశ్వర్ షోరూమ్లు మరియు డీలర్స్ భువనేశ్వర్ తో మీకు అనుసంధానిస్తుంది. ఫోర్డ్ కార్స్ ధర, ఆఫర్స్, EMI ఎంపికలు మరియు టెస్ట్ డ్రైవ్ గురించి మరింత సమాచారం కోసం క్రింద పేర్కొన్న డీలర్లను భువనేశ్వర్ లో సంప్రదించండి. సర్టిఫైడ్ ఫోర్డ్ సర్వీస్ సెంటర్స్ కొరకు భువనేశ్వర్ ఇక్కడ నొక్కండి ఫోర్డ్ డీలర్స్ భువనేశ్వర్ లో డీలర్ నామ చిరునామా trupti ఫోర్డ్ 99, నేషనల్ highway - 16, patrapada, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర, భువనేశ్వర్, 751010 కాపిటల్ ఫోర్డ్ మంచేశ్వర్ ఇండస్రియల్ ఎస్టేట్ ఎస్టేట్ (sbi chhak), no. 3/26, 27, 28, 29, భువనేశ్వర్, 751010
దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతక క్షేత్రంలోని బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో ఆదివారం వైభవంగా జరిగాయి. గిద్దలూరులో సామూహిక అక్షరాభ్యాసం అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 త్రిపురాంతకం, అక్టోబరు 2: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతక క్షేత్రంలోని బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో ఆదివారం వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహించా రు. అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి మంగళవాయిద్యాలు, అభిషేకాలు, గోపూజ, ప్రాతఃకాలపూజ, బాలబోగం, సప్తశతి పారా యణం, బాలపూజ, ప్రదోష కాలపూజ నిర్వహించారు. మూలానక్షత్రం కావడంతో చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దూపాటి పాలంక ప్రసాదుశర్మ, ఫణీంద్రకుమార్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర మాజీ మంత్రి సిద్దా రాఘవరావు దంపతులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చనలు నిర్వహించారు. వాస వీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా పూజలు నిర్వహించారు. వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు శ్రీసరస్వతీదేవిగాదర్శనమిచ్చారు. గిద్దలూరు, అక్టోబరు 2 : శరన్నవరాత్రులలో భాగంగా పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు సరస్వతిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం మూలానక్షత్రం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లల చేత అమ్మవారికి పూజలు చేయించారు. 102 మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీపీ నవోదయ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు చీతిరాల ప్రసాద్‌ దేవస్థాన కమిటీ అధ్యక్షుడు జి.సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు శివపురం ఆంజనేయులు, వాడకట్టు రంగసత్యనారాయణ, కార్యదర్శి తుమ్మలపెంట సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా షరాఫ్‌ బజారులోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారు పరశురామ అలంకారంలో దర్శనమిచ్చారు.
బాబా మతగ్రంథములను తాకి పవిత్రముచేసి వానిని తన భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి యీ ఆధ్యాయములో చెప్పుకొందుము. ప్రస్తావన మానవుడు సముద్రములో మునుగగానే, అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానముచేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందముల నాశ్రయింపగనే, త్రిమూర్తులకు (బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు) నమస్కరించిన ఫలముతోపాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితముకూడ లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు, జ్ఞానమునకు సముద్రము, మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగ జేయునట్టి శ్రీ సాయిమహారాజునకు జయమగు గాక. ఓ సాయీ! నీ కథలందు మాకు శ్రద్ధను కలుగజేయుము. చాతకపక్షి మేఘజలము త్రాగి యెట్లు సంతసించునో, అటులనే నీకథలను చదువువారును, వినువారును, మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు విను నప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్వికభావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించగాక; వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక; వారి ప్రాణములు స్థిరపడుగాక; వారి మనస్సులు ఏకాగ్రమగుగాక; వారికి గగుర్పాటు కలుగుగాక; వారు వెక్కుచు ఏడ్చి వణకెదరుగాక; వారిలోగల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో, గురువుగారి కటాక్షము వారి పైన ప్రసరించినదను కొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు, గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధములనుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకశరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయయనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే యాపని చేయగలరు. సర్వజీవకోటియందును భగవంతుని చూచునట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రముచేసి కానుకగా నిచ్చుట ముందుటి అధ్యాయములో బాబా బోధలొనర్చు తీరులను జూచితిమి. అందులో నొక్కదానినే యీ అధ్యాయములో జూచెదము. కొందరు భక్తులు మతగ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసినపిమ్మట వానిని పుచ్చుకొనెడివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో నున్నటుల భావించెడివారు. ఒకనాడు కాకామహాజని ఏకనాథ భాగవతమును దీసికొని షిరిడీకి వచ్చెను. శ్యామా యా పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు బోయెను. అచ్చట బాబా దానిని దీసికొని చేతితో తాకి, కొన్ని పుటలను త్రిప్పి, శ్యామాకిచ్చి దానిని తనవద్ద నుంచుకొమ్మనెను. అది కాకా పుస్తకమనియు, నందుచే దానినాతని కిచ్చివేయవలెననియు శ్యామా చెప్పెను. కాని బాబా "దానిని నేను నీకిచ్చితిని. దానిని జాగ్రత్తగా నీవద్ద నుంచుము. అది నీకు పనికివచ్చు" ననిరి. ఈ ప్రకారముగ బాబా అనేక పుస్తకములు శ్యామావద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబా కిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమనెను. అది యాతనికి మేలు చేయుననిరి. కాకా సాష్టాంగనమస్కారముతో స్వీకరించెను. శ్యామా విష్ణుసహస్రనామముల పుస్తకము శ్యామా బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా యతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణుసహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు రామదాసి (రామదాసు భక్తుడు) షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ నుండెను. ప్రతి రోజు ఉదయమే లేచి, ముఖము కడుగుకొని, స్నానము చేసి, పట్టుబట్టలు ధరించి విభూతి పూసికొని, విష్ణుసహస్రనామమును (భగవద్గీతకు తరువాత ముఖ్యమైనది), ఆధ్యాత్మరామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అత డీ గ్రంథముల ననేకసారులు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చేయ నిశ్చయించి, విష్ణుసహస్రనామ పారాయణము చేయింపదలచెను. కావున రామదాసిని బిలచి తమకు కడుపు నొప్పిగా నున్నదనియు సోనాముఖి తీసికొననిదే నొప్పి తగ్గదనియు, కనుక బజారుకు పోయి యా మందును తీసికొని రమ్మనియు కోరెను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణుసహస్రనామ పుస్తకమును దీసికొనెను. తమ స్థలమునకు తిరిగివచ్చి యిట్లనెను. "ఓ శ్యామా! యీ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది, కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధ పడితిని, నా హృదయము కొట్టుకొనెను. నా జీవిత మపాయములో నుండెను. అట్టి సందిగ్థస్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామా! అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసెనని యనుకొంటిని. అందుచే దీనిని నీ కిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజున కొక నామము చదివినను మేలు కలుగజేయును." శ్యామా తన కాపుస్తక మక్కరలేదనెను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు. మొండివాడు, కోపిష్ఠి కావున వానితో కయ్యము వచ్చుననెను. మరియు తాను అనాగరికు డగుటచే దేవనాగరి అక్షరములు చదువలేననెను. తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేయు చున్నాడని శ్యామా యనుకొనెనే గాని బాబా తనకు మేలు కలుగ జేయనున్నాడని యనుకొనలేదు. బాబా యా సహస్రనామమనే మాలను శ్యామా మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరకుడయినప్పిటికి బాబాకు ముఖ్యభక్తుడు. బాబా ఈ ప్రకార మతనిని ప్రపంచబాధలనుండి తప్పించగోరెను. భగవన్నామఫలిత మందరికి విశదమే. సకలపాపములనుండి దురాలోచనలనుండి, చావుపుట్టుకలనుండి అది మనలను తప్పించును. దీనికంటె సులభమయిన సాధన మింకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దాని కెట్టి తంతు కూడ అవసరము లేదు. దానికి నియమము లేమియు లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామాకు ఇష్టము లేనప్పటికి వానిచేదాని నభ్యసింప చేయవలెనని బాబాకు దయకలిగెను. కనుక దానిని బాబా వానిపయి బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారముగనే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణుసహస్రనామమునొక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను. విష్ణుసహస్రనామ పారాయణము చిత్తశుద్ధి కొక విశాలమయిన చక్కటి మార్గము. కాన దానిని బాబా శ్యామాకు బలవంతముగా ఇచ్చెను. రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. అన్నా చించణీకర్ యక్కడనే యుండెను. నారదునివలె నటించి జరిగిన దంతయు వానికి జెప్పెను. రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. కోపముతో శ్యామాపయి బడి, శ్యామాయే కడుపునొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసికొనెనని యనెను. శ్యామాను తిట్టనారంభించెను. పుస్తకము ఈయనిచో తల పగులగొట్టుకొందుననెను. శ్యామా నెమ్మదిగా జవాబిచ్చెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో నిట్లు పలికెను. "ఓ రామదాసీ! యేమి సమాచారము? ఎందులకు చీకాకుపడుచున్నావు? శ్యామా మనవాడు కాడా? అనవసరముగా వాని నేల తిట్టెదవు? ఎందుకు జగడ మాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయచుంటివి గాని, యింకను నీ మనస్సు నపవిత్రముగాను, అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీ వెట్టి రామదాసివయ్యా? సమస్తవిషయములందు నీవు నిర్మముడవుగా నుండవలెను. నీ వాపుస్తకమును అంతగా నభిలషించుట వింతగా నున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత యుండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామాతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకము లనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకము విలువ యెంత? శ్యామాకు దానితో నెట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసికొని వాని కిచ్చితిని. నీ కది కంఠపాఠముగా వచ్చును కదా! కావున శ్యామా దానిని చదివి మేలు పొందు ననుకొంటిని. అందుచే దాని నతని కిచ్చితిని." బాబా పలుకులెంత మధురముగా, మెత్తగా, కోమలముగా అమృత తుల్యముగా నున్నవి! వాని ప్రభావము విచిత్రమయినది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్నగీత యను గ్రంథమును శ్యామా వద్ద తీసికొనెదననెను. శ్యామా మిక్కిలి సంతసించెను. "ఒక్కటేల? పది పుస్తకముల నిచ్చెద" ననెను. ఈ విధముగా బాబా వారి తగవును తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమన రామదాసి పంచరత్నగీత నేల కోరెను? అతడు లోనున్న భగవంతుని తెలిసికొనుట కెన్నడు యత్నించి యుండలేదు. ప్రతినిత్యము మతగ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు, శ్యామాతో బాబా యెదుట ఏల జగడమాడెను? మనము ఎవరిని నిందించవలెనో, యెవరిని తప్పుపట్టవలెనో పోల్చుకొనలేము. ఈ కథ నీ విధముగా నడిపించకపోయినచో ఈ విషయముయొక్క ప్రాముఖ్యము, భగవన్నామ స్మరణఫలితము, విష్ణుసహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామాకు తెలిసియుండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమముగ శ్యామా చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీ మాన్ బుట్టీ అల్లుడగు జి. జి. నార్కేకు బోధించ గలిగెను. ఈ నార్కే పూనా యింజనీరింగు కాలేజి ప్రిన్సిపాలుగా నుండెను. గీతా రహస్యము బ్రహ్మవిద్య నధ్యయనము చేయువారిని బాబా యెల్లప్పుడు ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచట దానికొక యుదాహరణమిచ్చెదము. ఒకనాడు బాపుసాహెబుజోగ్ కు ఒక పార్సెలు వచ్చెను. అందులో తిలక్ వ్రాసిన గీతారహస్య ముండెను. అతడా పార్సిలును తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగనమస్కారము చేయునప్పు డది క్రిందపడెను. అదేమని బాబా యడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకము నుంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను ద్రిప్పి తన జేబులోనుండి ఒక రూపాయి తీసి పుస్తకముపై బెట్టి దక్షిణతో గూడ పుస్తకమును జోగున కందించుచు "దీనిని పూర్తిగ చదువుము, నీకు మేలు కలుగును." అనెను. ఖాపర్డే దంపతులు ఖాపర్డే వృత్తాంతముతో నీ యధ్యాయమును ముగించెదము. ఒకప్పుడు ఖాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదా సాహెబు ఖాపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధి కెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడు, మిక్కిలి తెలివయినవాడు, గొప్పవక్త. కాని బాబా ముందర నెప్పుడు నోరు తెరవలేదు. అనేకమంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడిరి, వాదించిరి. కాని ముగ్గురు మాత్రము ఖాపర్డే, నూల్కర్, బుట్టీ - నిశ్శబ్దముగా కూర్చుండువారు, వారు వినయవిధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన ఖాపర్డే బాబా ముందర మసీదులో కూర్చొనునప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు, నిజముగా మానవుడెంత చదివినవాడైనను, వేదపారాయణ చేసినవాడైనను, బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తకజ్ఞానము, బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. దాదా సాహెబు ఖాపర్డే 4 మాసములుండెను. కాని, యతని భార్య 7 మాసము లుండెను. ఇద్దరును షిరిడీలో నుండుటచే సంతసించిరి. ఖాపర్డే గారి భార్య బాబాయందు భక్తిశ్రద్ధలు గలిగి యుండెడిది. ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను. ప్రతి రోజు 12 గంటలకు బాబాకొరకు నైవేద్యము స్వయముగా దెచ్చుచుండెను. దానిని బాబా యామోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చలభక్తిని బాబా యితరులకు బోధించనెంచెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజనసమయమున ఒక పళ్ళెములో సాంజా, పూరీ, అన్నము, వులుసు, వరమాన్నము మొదలగునవి మసీదుకు దెచ్చెను. గంటల కొలది యూరకనే యుండు బాబా యానాడు వెంటనే లేచి, భోజన స్థలములో గూర్చుండి, యామెతెచ్చిన పళ్ళెము పయి యాకు దీసి త్వరగా తిన నారంభించెను. శ్యామా యిట్లడిగెను. "ఎందు కీ పక్షపాతము? ఇతరుల పళ్ళెముల నెట్టివైచెదవు. వాని వైపు చూడనయిన చూడవు కాని, దానిని నీ దగ్గర కీడ్చుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజన మెందు కంత రుచికరము? ఇది మాకు సమస్యగా నున్నది". బాబా యిట్లు బోధించెను. "ఈ భోజనము యథార్థముగా మిక్కిలి యమూల్యమయినది. గత జన్మలో నీమె ఒక వర్తకుని యావు. అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చటనుండి నిష్క్రమించి, ఒక తోటమాలి యింటిలో జన్మించెను. తదుపరి యొక క్షత్రియుని యింటిలో జన్మించి యొక వర్తకుని వివాహమాడెను. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించెను. చాలకాలము పిమ్మట ఆమెను నేను జూచితిని కావున ఆమె పళ్ళెము నుండి యింకను కొన్ని ప్రేమయుతమగు ముద్దలను దీసికొననిండు." ఇట్లనుచు బాబా యామె పళ్ళెము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుగుకొని త్రేన్పులు తీయుచు, తిరిగి తన గద్దెపయి కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను, బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా యామెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్ళను తోముచున్న యామెచేతులను బాబా తోముటకు ప్రారంభించెను. గురుశిష్యులు బండొరులు సేవచేసికొనుట జూచి శ్యామా యిటులనెను. "చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును, భక్తురాలును ఒకరికొకరు సేవ చేసికొనుట మిగుల వింతగా నున్నది." ఆమె యథార్థమయిన ప్రేమకు సంతసించి, బాబా మెల్లగా, మృదువయిన యాకర్షించు కంఠముతో 'రాజారామ్' యను మంత్రమును ఎల్లప్పుడు జపించు మనుచు నిట్లనియెను. "నీవిట్లు చేసినచో, నీ జీవతాశయమును పొందెదవు. నీ మసస్సు శాంతించును. నీకు మేలగును." ఆధ్యాత్మికము తెలియనివారికి, ఇది సామాన్యవిషయమువలె గాన్పించును. కాని యది యట్లుగాదు. అది శక్తిపాతము. అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబాయొక్క మాటలెంత బలమయినవి! ఎంత ఫలవంతమయినవి! ఒకక్షణములో నవి యామెహృదయమును ప్రవేశించి, స్థిరపడెను. ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించు చున్నది. ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసికొనవలెను. వారిద్దరికి మధ్య భేదము లేదు. ఇద్ద రొకటే. ఒకరు లేనిదే మరియొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద బెట్టుట, బాహ్యదృశ్యమేగాని, యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య బేధము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును.
దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఓ కథను చెప్పడానికి రెండు భాగాలుగా సరిపోవని చిత్రబృందం మొదటి నుండి చెబుతూనే ఉంది. Udayavani Dhuli Hyderabad, First Published Jan 13, 2019, 11:39 AM IST దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఓ కథను చెప్పడానికి రెండు భాగాలుగా సరిపోవని చిత్రబృందం మొదటి నుండి చెబుతూనే ఉంది. ఇప్పుడు మూడో భాగం కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా క్రిష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బాలకృష్ణ కోరితే, అవసరం ఉందనిపిస్తే కచ్చితంగా పార్ట్ 3 కూడా తెరకెక్కిస్తానని అంటున్నాడు క్రిష్. రెండో భాగం ఎక్కడ ముగుస్తుందనే విషయాన్ని నాకు నేను చెప్పకూడదని నిర్మాత అనుమతి ఉండాలని చెప్పిన క్రిష్.. నిర్మాత బాలకృష్ణ అడిగితే ఎన్టీఆర్ బయోపిక్ పై మూడో భాగం కూడా వస్తుందని అందులో ఎలాంటి సందేహం లేదని క్లారిటీ ఇచ్చాడు. రెండో భాగంలో లక్షీపార్వతి ఉంటుందా..? ఉండదా..? అనే విషయంపై స్పందించడానికి క్రిష్ నిరాకరించాడు. ఇక ఎన్టీఆర్ కథానాయకుడులో ఎన్టీఆర్ మొండితనం, ఆవేశం చూపించామని.. రెండో భాగం 'మహానాయకుడు'లో మొండితనం, ఆవేశంతో పాటు నిర్ణయాలు ఎంత ఫాస్ట్ గా తీసుకుంటారనే విషయాన్ని చూపించబోతున్నామని చెప్పారు.
బాబూ.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేస్తావా..? ఆక్వా రైతులను ఆదుకోండి పార్టీ నేతల సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కీలక ప్రకటన నిషేధిత ప్లాస్టిక్ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత శ్రీ‌నాథ్‌రెడ్డి పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్ సమావేశం ప్రారంభం కాసేపట్లో పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం బడుగు, బలహీనవర్గాలకు వెన్నుపోటే బాబు డీఎన్ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం You are here హోం » టాప్ స్టోరీస్ » రైతుల ముసుగులో కిరాయి ఉద్య‌మం రైతుల ముసుగులో కిరాయి ఉద్య‌మం 06 Oct 2022 9:34 AM వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ విశాఖప‌ట్నం: అమరావతి రైతుల ముసుగులో చేసేది కిరాయి ఉద్యమం అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం చేసేదే అమరావతి ఉద్యమం అని, డబ్బులిచ్చి పచ్చకండవా లేసి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని, విశాఖ పరిపాలన రాజధానిగా వస్తే ఉత్తరాంధ్రాలో వెనుకుబాటుతనం పోతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారని, విశాఖ పరిపాలన రాజధాని అయితే వలసలు తగ్గి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు తథ్యమన్న ఎంపీ సత్యనారాయణ.. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అయితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. త్వరలోనే విశాఖపట్నం పరిపాలన రాజధాని అవుతుందన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో అభివృద్దిని గాలికొదలి ప్రజల్ని ‎ కులం, మతం, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటూన్నారని ‎ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఐటీడీపీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాలన చేతకానివాడే కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సమర్ధ నాయకుడు అభివృద్ది చేస్తాడని, అయితే వైసీపీ వాళ్లు తనకు కులం అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. . ఉమ్మడి రాష్ట్రంలో హైదాబాద్ ఐటి నగరంగా అభివృద్ది చేశా. అక్కడ తన కులం వాళ్లున్నారని అభివృద్ది చేశానా? అని ప్రశ్నించారు. తనకు కులం లేదు, మతం లేదని అంటూ తన కులం, మతం తెలుగు జాతే. తెలుగు వారంతా తన కుటుంబ సభ్యులే అని ప్రశ్నించారు. తెలుగు జాతిని ప్రపంచలో నెం.1 గా చేయాలన్నదే తన తపన అని తెలిపారు. భవిష్యత్తు టెక్నాలజీదే అన్న భావనతో నాడే ఐటీకి శ్రీకారం చుట్టానని చెబుతూ ఐటీ అంటే దేశంలో మొదట గుర్తొచ్చేది హైదరాబాదే అని స్పష్టం చేశారు. హైటెక్ సిటీని 14 నెలల్లో పూర్తి చేశాం. ప్రపంచమంతా తిరిగి ఐటి కంపెనీలు తీసుకొచ్చాం. బిల్ గేట్ ను రాష్ట్రానికి తీసుకొచ్చి కంపెనీలు పెట్టించామని గుర్తు చేశారు. దాని ఫలితంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊరిలో ఐటి ఉద్యోగులున్నారని పేర్కొన్నారు. 25 ఇంజనీరింగ్ కాలేజీలను 250 కాలేజీలుగా చేశామని అంటూ నాడు ఐటిని ప్రోత్సహించటం వల్లే నేడు ఎక్కువ మంది యువత ఐటి రంగంలో స్ధిరపడ్డారని తెలిపారు. నేడు పోన్ అనే ఆయుధం ద్వారా టెక్నాలజీని ఉపయోగించి మన ఆలోచనల్ని ప్రపంచంతో పంచుకోవటం నిమిషం పని అని పేర్కొంటూ టెక్నాలజిని ఉపయోగించుకుని ఐటీడీపీ కార్యకర్తలు వైసీపీ పాలన వైఫల్యాలు, వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టాలని చంద్రబాబు సూచించారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని మీడియా చానళ్లు లాలూచీ పడి ప్రసారం చేయలేదని విస్మయం వ్యక్తం చేశారు. అయినా ప్రజలకు తెలియకుండా ఆగిందా? ‎ఐటీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా జగన్ రెడ్డికి కోర్టు పెట్టిన చివాట్లు ప్రజల్లోకి తీసుకెళ్లలేదా?‎ అని ప్రశ్నించారు. కొంతమంది మీడియాను వ్యాపారంగా మర్చారని విమర్శించారు. రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడినా టీడీపీ హయాంలో ‎ ప్రజలకు ఏ లోటు లోకుండా పాలన చేశామని, పెట్టుబడులు, పరిశ్రమలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది చేశాముని పేర్కొన్నారు. పోలవరాన్ని సోమవరంగా మార్చి 72 శాతం పనులు పూర్తి చేశామని, మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 జూన్ నాటికి పూర్తయ్యేదని మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. పోలవరంలో అవినీతి జరిగిందని జగన్ రెడ్డి, బ్లూ మీడియా, పేటీఎం బ్యాచ్ ‎ తప్పుడు ప్రచారం చేశారని చెబుతూ కానీ పైసా అవినీతిని నిరూపించారా? అని ప్రశ్నించారు. “సొంత బాబాయిని చంపి మొదట గుండెపోటన్నారు, తర్వాత నాపై, టీడీపీ పై తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు బాబాయిని చంపిందెవరో బయటపటంతో ఏకంగా సీబీఐపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో రూ. 40 కోట్లు సుపారీ ఇచ్చేంత డబ్బు ఎవరి దగ్గర ఉందో రాష్ట్ర ప్రజలకు తెలియదా?. సొంత బాబాయిని క్రూరంగా చంపుకున్నారంటే వాళ్లను ఏమనాలి? బాబాయిని చంపిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారా?” అంటూ ప్రశ్నించారు. వైసీపీ అంటేనే అబద్దాల పుట్ట, అవినీతికి అడ్డా అని ధ్వజమెత్తుతూ గత ఎన్నికల్లో జగన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ తో తప్పుడు ప్రచారం చేయించి గెలిచారని ఆరోపించారు. ఐటీడీపీ కార్యకర్తలు వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపిచ్చారు. జగన్ రెడ్డి….విద్యార్ధులు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు అన్ని వర్గాల ప్రజల్ని దగా చేశారని, వ్యవ్యస్ధలన్నింటిని ధ్వంసం చేశారని విమర్శించారు. టీడీపీ హయాంలో తప్పు చేయాలంటేనే భయపడేవారని, కానీ నేడు వ్యవస్ధలన్నింటిని విధ్వంసం చేశారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలపై, కార్యకర్తలపై, ఐటీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని అంటూ వారు ఏం తప్పు చేశారని కేసులు పెట్టారు? ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించకూడదా? అని ప్రశ్నించారు. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. అధికారులు చట్టాన్ని కాపాడితే అండగా ఉంటాం, కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి ఉంది. వైసీపీ వైఫల్యాల్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెబుతూ అక్రమ కేసులకు భయపడొద్దని చెప్పారు. అధికారంలోకి రాగానే అక్రమ కేసులు ఎత్తేస్తామని భరోసా ఇచ్చారు.
కడప : జిల్లా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ జెడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లను ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికలు నిర్వహించనున్నారు. జెడ్పీటీసీల రిజర్వేషన్లు షెడ్యూలు తెగలు : చిట్వేలు (మహిళ) షెడ్యూలు కులాలు : కోడూరు (మహిళ), వేముల (జనరల్), .దువ్వూరు (మహిళ) పెండ్లిమర్రి (జనరల్), సంబేపల్లె (మహిళ), రామాపురం (జనరల్), పెద్దముడియం (మహిళ), ఎర్రగుంట్ల (జనరల్), ముద్దనూరు (మహిళ) వెనుకబడిన తరగతులు : పుల్లంపేట (మహిళ), లక్కిరెడ్డిపల్లె (మహిళ), సింహాద్రిపురం (మహిళ), టి.సుండుపల్లె ( జనరల్), పులివెందుల (మహిళ), కలసపాడు (జనర ల్), చెన్నూరు (మహిళ), వేంపల్లె (జనరల్), పోరుమామిళ్ల (మహిళ), శ్రీ అవధూతేంద్ర కాశినాయన ( జనరల్), రాజుపాలెం (మహిళ), తొండూరు ( జనరల్), కమలాపురం (మహిళ) ఇతర కులాలు (అన్ రిజర్వుడు): ఖాజీపేట (మహిళ), వల్లూరు (జనరల్), సీకేదిన్నె (మహిళ), వీరపునాయునిపల్లె (జనరల్), రాయచోటి ( మహిళ), వీరబల్లె (జనరల్), చిన్నమండెం ( మహిళ), బి.కోడూరు (జనరల్), సిద్దవటం ( మహిళ), ఒంటిమిట్ట (జనరల్), బ్రహ్మంగారిమఠం(మహిళ), జమ్మలమడుగు ( జనరల్), మైదుకూరు (మహిళ), చాపాడు (జనరల్), ఓబులవారిపల్లె ( మహిళ), కొండాపురం ( జనరల్), బద్వేలు ( మహిళ), మైలవరం (జనరల్), గోపవరం (మహిళ), చక్రాయపేట (జనరల్), అట్లూరు ( మహిళ), రాజంపేట (జనరల్), ప్రొద్దుటూరు ( మహిళ), పెనగలూరు ( జనరల్), గాలివీడు (మహిళ), నందలూరు ( జనరల్), లింగాల ( మహిళ) మండల పరిషత్ రిజర్వేషన్లు షెడ్యూలు తెగలు : సంబేపల్లె షెడ్యూలు కులాలు : వల్లూరు (మహిళ), చెన్నూరు ( జనరల్), రాజంపేట (మహిళ), శ్రీ అవధూతేంద్ర కాశినాయన ( జనరల్), కమలాపురం ( మహిళ), మైదుకూరు ( జనరల్), చిట్వేలు ( జనరల్), వీరబల్లె ( జనరల్), జమ్మలమడుగు (మహిళ), వెనుకబడిన కులాలు : ఖాజీపేట (మహిళ), రామాపురం ( జనరల్), కోడూరు ( మహిళ), రాయచోటి (జనరల్), పెనగలూరు (మహిళ), వేంపల్లె ( జనరల్), ఒంటిమిట్ట ( మహిళ), అట్లూరు (జనరల్), చాపాడు ( మహిళ), బి.మఠం (జనరల్), సీకేదిన్నె ( మహిళ), ముద్దనూరు ( జనరల్), వేముల ( మహిళ) ఇతర కులాలు (అన్ రిజర్వుడు) : బద్వేలు (మహిళ), బికోడూరు (జనరల్), చక్రాయపేట (మహిళ), చిన్నమండెం (జనరల్), కొండాపురం (మహిళ), దువ్వూరు (జనరల్), ఎల్‌ఆర్‌పల్లె (మహిళ), గాలివీడు (జనరల్), లింగాల (మహిళ), గోపవరం (జనరల్), మైలవరం ( మహిళ), కలసపాడు (జనరల్), నందలూరు (మహిళ), ఓబులవారిపల్లె (జనరల్), పెద్దముడియం (మహిళ), పెండ్లిమర్రి (జనరల్), పోరుమామిళ్ల (మహిళ), పులి వెందుల (జనరల్); ప్రొద్దుటూరు (మహిళ), పుల్లంపే ట (జనరల్), సిద్దవటం (మహిళ), సింహాద్రిపురం ( జ నరల్), వేంపల్లె (మహిళ), టి.సుండుపల్లె ( జనరల్), రాజుపాలెం (మహిళ), ఎర్రగుంట్ల (జనరల్), తొండూరు (మహిళ)
స్వాతి వారపత్రిక పూర్వపు మేనేజింగ్ ఎడిటర్ అయిన మణిచందన ముఖచిత్రంతో గత వారం స్వాతి వీక్లీ వెలువడింది. మణిచందన స్మృతి సంచికగా రూపొందిన ఇందులో ఆమె గురించి కొన్ని వ్యాసాలు ప్రచురించారు. తన కుమారుడు, కూతురు స్మృతి గా ‘అనిల్ మణి ‘ అవార్డు ను నెలకొల్పనున్నట్లు ఎడిటర్ బలరాం ప్రకటించారు. మనకు తెలియని ‘మణి ‘ చందన దేశభాషా పత్రికల్లో స్వాతికి వున్న స్థానం ప్రత్యేకమైనది. తెలుగు పాఠకులు ‘స్వాతి’కి అగ్ర సింహాసనం వేయగా, తెలుగు పాఠకులు అందించిన గుర్తింపును కేంద్ర ప్రభుత్వం గ్రహించి, మరేఇతర దేశ భాషాపత్రికకు ఇవ్వనిగౌరవం ‘స్వాతి’కి అందించింది. దేశ ప్రముఖుల విదేశీ పర్యటనలలో ‘స్వాతి’కి భాగం కల్పించింది. ‘స్వాతి‘ సంపాదకులకు తొలిగా దక్కిన ఆ విశేషగౌరవాన్ని వారి వారసురాలిగా నాటి అసోసియేట్ ఎడిటర్, ఆ తర్వాతికాలంలో మేనేజింగ్ ఎడిటర్ అయిన మణిచందన అందుకుంది. అంతేకాదు విదేశీ ప్రభుత్వాలు అక్కడ జరిగిన, జరుగుతున్న ఘటనలు, కార్యక్రమాలను తిలకించి తెలుగు పాఠకులకు పంచమని ‘స్వాతి’ మణిచందనను ఆహ్వానించిన సందర్భాలున్నాయి. నాటి అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలతో పాటుగా, మలేషియా, సింగపూర్‌కు ప్రత్యేక ఆహ్వానితురాలిగా వెళ్ళింది. ప్రపంచంలోని కీలక రాజ్యాలు దర్శించటం, ఆయా దేశాలు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు కుదుర్చుకునే ఒప్పందాలకు సాక్షిగా ‘స్వాతి’ తరఫున నిలబడిన అదృష్టం మణిచందనది. సెప్టెంబర్ 11, 2001 అమెరికా చరిత్రలో అత్యంత విషాదకర దినం. అమెరికన్లు గర్వంగా చెప్పుకునే వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలను ఇస్లామిక్ ఉగ్ర వాదులు, హైజాక్ చేసిన విమానాలను ఆయుధాలుగా చేసుకుని కూల్చివేసిన ఆ ఘటన ప్రపంచం ఎన్నడూ మరువలేనిది. టెలివిజన్‌ తెరలమీద ప్రత్యక్షంగా చూసిన అమెరికన్లు నివ్వెరపోయారు. వారి రక్షణ వ్యవస్థకు కీలకమైన పెంటగన్ భవనం మీద దాడికి విఫలయత్నం జరిగింది. ఒకదేశం పరోక్ష యుద్ద దాడికి గురైనపుడు ఎలా స్పందించాలో అమెరికాను చూసి నేర్చుకోవాలి. తమదేశంమీద ఉగ్రవాదదాడి జరిపిన వారిని వెంటాడి పట్టుకోవటమో లేక సంహరించటమో చేశారు. అందుకు ఎంతకాలం పట్టినా దానిని పకడ్బందీగా నడిపించారు. అదే సమయంలో దాడిలో మరణించిన అమెరికన్ల పట్ల బాధ్యతతో వ్యవహరించారు. ఆ 9/11 ఘోర సంఘటన జరిగి సంవత్సరం అయిన సందర్భంగా తమ దేశ పరిస్థితి గురించి ప్రపంచ దేశాలకు తెలియచెప్పే ఉద్దేశ్యంతో వివిధ భాషా పత్రికలవారిని ఆహ్వానించారు. అందులో తెలుగువారి ప్రతినిధి మణిచందన. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ఆకాశ హర్మ్యాలను ఫోటోలలో చూసిన వారున్నారు. కాని ఆ బిల్డింగ్ విధ్వంసానికి ముందుగా దర్శించిన మీడియా మిత్రులు బహుతక్కువ. సరిగ్గా ఆ విధ్వంసానికి సంవత్సరం ముందు మణిచందన తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాని సందర్శించింది. ఆ సమయంలో వరల్డ్ ట్రేడ్ బిల్డింగ్ 104 అంతస్తులను ఒక నిమిషంలో తీసుకువెళ్ళే వేగవంతమైనలిస్ట్ లో ప్రయాణంచేసిన అనుభవం, ఆనందం మణిచందనది. ఆ బిల్డింగ్ పైనుండి న్యూయార్క్ నగరం దర్శించిన జ్ఞాపకాలు ఆమె దొంతరలో వున్నాయి. సరిగా సంవత్సరం తర్వాత అక్కడలకాశ హార్మ్యం లేదు. పడిపోయిన ఆ బిల్డింగ్ నుండి లక్షకు పైగా ట్రక్కుల శిధిలాలు తొలగించారు. దాదాపు 2 లక్షల టన్నుల స్టీల్‌ని బయటకు తీశారు. ఆ రోజు మొత్తం 2823మంది ఆ బిల్డింగ్ కూల్చివేతలో మరణించారు. ఇప్పుడు అక్కడ భవనంలేదు. దాని తాలూకు చిహ్నంగా ఒక భారీ గొయ్యి వుంది. దానికి అమెరికన్లు పెట్టుకున్న పేరు ‘గ్రౌండ్ జీరో’ ఒకనాటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ వైభవాన్ని, ఇప్పుడు విషాదపు ముసుగులో మునిగి వున్న గ్రౌండ్ జీరోని దగ్గరగాగమనించే అవకాశం మణిచందనకు దక్కింది. మణిచందన పత్రికారంగంలోకి, పత్రికానిర్వహణలోకి చేపపిల్ల నీటిలో ఈదుకుంటూ వచ్చినంత సహజంగా వచ్చింది. ఒక పత్రికా ప్రతినిధికి వుండాల్సిన నిశిత పరిశీలన, సమగ్ర పరిజ్ఞానం, జరుగుతున్నవాటి నేపథ్యం, వాటి ప్రభావాలను అంచనా వేయగల చురుకుతనం ఆమెకున్నాయి. అమెరికా పర్యటనలో తాను గమనించిన అమెరికా ప్రభుత్వ, ప్రజల స్పందనను మణిచందన రెండు వాక్యాలలో అద్భుతంగా చెప్పటం నాడు ఆ వ్యాసం చదివిన తెలుగు వారందరికి గుర్తుంటుంది.“యూనిటీగా వుండటమే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా” అంటూ ఆమె కితాబు ఇచ్చింది.. “సంవత్సర కాలంలో అమెరికా ప్రజలలో మార్పు స్పష్టంగా కనిపించింది. వారిలో ఆందోళనలేదు. పక్కవారిని అనుమానంగా చూడటంలేదు. జరిగిన సంఘటనను సంయమనంతో ఎదుర్కొని, కలిసివుంటే కలదు సుఖం అన్నట్టుగా అందరూ ఒక్కటై ఉగ్రవా దాన్ని సమూలంగా రూపుమాపుదామని సమైక్యగీతం ఆలపిస్తున్న దృఢవిశ్వాసాన్ని వారు మనోఫలకాల పై గమనించాను” అన్నది మణిచందన మాట. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వెంట రష్యా వెళ్ళి చారిత్రాత్మక ఆరు ఒప్పందాలకు సాక్షిగా నిలిచిన స్వాతి ప్రతినిధి ఆమె. “రష్యా ఒకప్పటి సోవియట్ యూనియన్. కమ్యూనిస్టు పార్టీ నియంతృత్వ పాలనలో వుండి భావ ప్రకటన స్వేచ్చకు దూరమైంది. నేడు కమ్యూనిస్టు పాలన అంతమై ప్రజాస్వామ్య విధానం అమలులోకి వచ్చినా రష్యన్లు తమ మాటల్ని గొంతులోనే అణిచి పెట్టేసుకునేందుకు అలవాటుపడి పోయారు. బహుశ అదే అలవాటులోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోవటం జరుగుతోంది. ఆ ధోరణి నుండి రష్యన్లు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు” అనే మణిచందన మాటలు మొత్తం రష్యా రాజకీయ సామాజిక పరిస్థితులకు ఆద్యం పట్టింది. . తక్కువ పదాలతో, గొప్ప విషయాన్ని వివరించ గలిగిన ‘క్లుప్త కలం’ మణిచందనది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే వుందన్న నాటి విషయాన్ని “రష్యాది క్యాష్ డ్రివెన్ ఎకానమీ… నల్లధనం ఎక్కువ”అనే రెండు వాక్యాలతో తేల్చిచెప్పటం ఆమె పరిశీలన గొప్పతనం. మహిళా ప్రతినిధిగా రష్యన్ మహిళలను గమనించింది.. వారి పనితీరు, వారుఅనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రాలు మెండుగా వుండటం మణిచందన మెచ్చిన అంశం. సంతానం కనటంతో మహిళలకు వున్న స్వేచ్చ, నేటి పిల్లలే రేపటి దేశ సంపద అనే మహిళా భావన రెండింటిని ఆమె తన వ్యాసాలలో హైలెట్ చేసింది. కళ్ళ ఎదుట కనిపించిన మంచిని మెచ్చుకున్నట్టే, కనిపించిన వ్యతిరేక అంశాలలోనూ కన్నెర్ర చేయటం మణిచందన చేసింది. రాజకీయ ప్రముఖుల వెంట ఆహ్వానాలే కాదు స్వాతి ప్రతినిధిగా మణిచందన విదేశాలలో వున్న తెలుగు సాంస్కృతిక, భాషా సంఘాలవారి ఆహ్వానాలను అందుకుని వెళ్ళింది.. మలేషియాలోని తెలుగు సంఘాలు చురుకుగా వ్యవహరిస్తుంటాయి. భాషాభిమానం మెండు. చాలాకాలం క్రితం, సుదూర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడినా, తమ భాషా, సంస్కృతి మూలాలను మరువని, పెంచి పోషించుకుంటున్న మలేషియా తెలుగు సంఘం సేవల గురించి మణిచందన తన అనుభవాలలో చెప్పింది. వారి తెలుగు పలకరింపులు, తెలుగు వంటకాల వాసనలు నేటికీ నిలిచివున్నాయి. ఒకరకంగా చూసి నప్పుడు తెలుగునాట వుండిపోయిన వారికన్నా విదేశాలకు వెళ్ళి స్థిరపడిన వారిలోనే తెలుగుతనం ఇంకా బాగుందేమో అనిపించిందన్నారు మణిచందన. ఎన్ని పర్యటనలు దేశీ ప్రముఖులతో చేసే అవకాశం వచ్చినా వాటిని ఏనాడు తమకు వ్యక్తిగతంగా లభించినవని ఎడిటర్ బలరామ్ గారు భావించలేదు. మణిచందన వారసత్వంగా ఆ అభిప్రాయాన్నే అంది పుచ్చుకుంది. తన పర్యటన అవకాశం నలభైఆరు లక్షలమంది స్వాతి పాఠకదేవుళ్ళ ప్రతినిధిగా దక్కిన గౌరవంగా భావించిన నిగర్వి మణిచందన. అమెరికా వారి స్వార్థచింతన, స్వప్రయోజనాలకు పెద్దపీట వేసే మనస్తత్వం. రష్యన్లకు భారతదేశం పట్ల వున్న స్నేహభావం, సహకారం అందించే చొరవ, తూర్పు ఆసియా దేశాలలోని తెలుగువారు తమ మాతృదేశంతో ముడివేసుకోవాలనుకుంటున్న భాషా బంధం వాటన్నింటిని తనదైన ప్రత్యేక శైలిలో అందించటం మణిచందనకే చెల్లింది. మరువలేని పత్రికారంగ ప్రతినిధి మణిచందన. తన నేర్పు, కూర్పు మరింతగా ‘స్వాతి’కి అందిస్తుందని ఆశిస్తున్న వేళ కానరాని లోకానికి వెళ్ళిన మణి చందన గతస్మృతులు, ఆమె వ్యాసశైలిలో, సమాచారంలో నిక్షిప్తమై పాఠకుల ముందున్నది.
అరటిపండు తొక్కను తీసివేసి సన్నగా స్లైసుల్లా కట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసులకు పైన పలుచగా వెన్న రాయాలి. ఒక స్లైసు మీద అరటిపండు స్లైసును అమర్చి దానిపైన పంచదార, చాక్లెట్ తురుము చల్లాలి. దానిపైన వెన్న రాసిన మరో స్లైసు పెట్టి అదమాలి. ఇలా అన్నీ చేసుకుని సాండ్‌విచ్ టోస్టర్ లేదా పెనం మీద రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. చాలా తొందరగా పిల్లలు ఇష్టపడేట్టుగా ఈ సాండ్‌విచ్ తయారుచేయొచ్చు. 0 Comments Author నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.
మునుగోడులో ఓడినా బీజేపీకి ప్లస్సే కాబోతుందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా మారబోతుదా? కాంగ్రెస్ కంచుకోటను కదిలించి రెండోస్థానంలో పాగా వేసిందా? మునుగోడు ఫలితాన్ని చూస్తే అవుననే అనిపిస్తుంది. కమల వికాసం మునుగోడులో టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీనిచ్చింది. ఓ దశలో కారు స్పీడ్‌కు బ్రేక్ వేస్తుందేమోనని అంతా అనుకున్నారు.కానీ టీఆర్ఎస్ గెలుపుని కాకుండా మెజారిటీని మాత్రమే తగ్గించగలిగింది. కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు చేసి మునుగోడులో రెండోస్థానంలో నిలిచింది. ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 86.697 ఓట్లు వచ్చాయి. 2018లో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డికి 12,725 ఓట్లు పడ్డాయి. అప్పుడు బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు బీజేపీ రెండోస్థానంలోకి వచ్చింది. గతంతో పోలిస్తే 73.972 ఓట్లు పెరిగాయి. కాంగ్రెస్ కంచుకోట మునుగోడు మొన్నటిదాకా కాంగ్రెస్ కంచుకోట. కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా,తరుణ్ చుగ్ లు కోమటిరెడ్డి తరఫున ప్రచార సభల్లో పాల్గొన్నారు. మునుగోడు కోసం కమిటీలు వేసి ప్రచార సరళిని నేతలు పర్యవేక్షించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మునుగోడులోనే మకాం వేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసం క్యాంపెయిన్ చేశారు. ఇంత చేసినా బీజేపీ చివరకు కారు స్పీడ్‌ని అడ్డులేకపొయింది. కాంగ్రెస్ కంచుకోటను మాత్రం కదిలించింది. ఆ పార్టీకి డిపాజిట్ లేకుండా చేసి బీజేపీ ద్వితీయ స్థానంలోకి వచ్చింది. మొత్తానికి బీజేపీకి ఓట్లు పెరగడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అంచనాల్ని పెంచింది. ఓడినా,గెలిచినా ప్లస్సే… మునుగోడులో గెలిచినా, ఓడినా బీజేపీకే లాభం. రెండు రకాలుగా తమకే అనుకులంగా ఉంటుందని ఆ పార్టీ మొదటి నుంచి అంచనా వేస్తూ వచ్చింది. గెలుపు కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసింది.ఆఖరకు రెండోస్థానంతో సరిపెట్టుకుంది. ఈ కేడర్‌నే ఇలాగే నిలుపుకోవాలని బీజేపీ చూస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది.
భారత నౌకాదళానికి చెందిన ల్యాండింగ్ షిప్‌ ట్యాంక్ (లార్జ్‌) ఐఎన్ఎస్ ఐరావత్, ఇండోనేషియా అభ్యర్థించిన 10 ద్రవరూప వైద్య ఆక్సిజన్‌ (ఎల్‌ఎంఓ) కంటైనర్లను అందించడానికి జకార్తాలోని టాంజుంగ్ ప్రియోక్ పోర్టుకు ఇవాళ చేరుకుంది. మిషన్ సాగర్‌లో భాగంగా భారత్‌ ఇండోనేషియాకు ఈ సాయం అందిస్తోంది. జకార్తాలో వైద్య సామగ్రి దిగడం పూర్తయిన తర్వాత, ఇతర మిత్ర దేశాలకు కూడా వైద్య సామగ్రిని అందించడానికి ఐఎన్ఎస్ ఐరావత్‌ ముందుకు సాగుతుంది. ఉభయచర కార్యకలాపాలను నిర్వహించడం ఐఎన్ఎస్ ఐరావత్ ప్రాథమిక పాత్ర. దీంతోపాటు, హెచ్‌ఏడీఆర్‌ మిషన్లను కూడా నిర్వహిస్తోంది. గతంలో హిందూ మహాసముద్రంలో చేపట్టిన వివిధ సహాయక చర్యల్లో ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ పాలు పంచుకుంది. ఈ ఏడాది జులై 24న కూడా, ఇండోనేషియాకు 5 ద్రవరూప వైద్య ఆక్సిజన్‌ కంటైనర్లు (100 మె.ట.), 300 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఇదే నౌక అందజేసింది. భారత్‌, ఇండోనేషియా ఒక బలమైన సాంస్కృతిక బంధం, భాగస్వామ్యం కలిగిన దేశాలు. సురక్షితమైన ఇండో-పసిఫిక్ కోసం సముద్రంపై కలిసి పనిచేస్తున్నాయి. ద్వైపాక్షిక విన్యాసాలు, సమన్వయ గస్తీ రూపంలో ఈ రెండు నౌకాదళాలు ఎప్పటికప్పుడు ఉమ్మడి నావికా విన్యాసాలను కూడా నిర్వహిస్తున్నాయి. *** (Release ID: 1748495) Visitor Counter : 169 Read this release in: English , Urdu , Marathi , Hindi , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌ మిషన్ సాగర్‌లో భాగంగా, వైద్య సామగ్రిని అందించడానికి జకార్తా చేరుకున్న ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ Posted On: 24 AUG 2021 11:51AM by PIB Hyderabad భారత నౌకాదళానికి చెందిన ల్యాండింగ్ షిప్‌ ట్యాంక్ (లార్జ్‌) ఐఎన్ఎస్ ఐరావత్, ఇండోనేషియా అభ్యర్థించిన 10 ద్రవరూప వైద్య ఆక్సిజన్‌ (ఎల్‌ఎంఓ) కంటైనర్లను అందించడానికి జకార్తాలోని టాంజుంగ్ ప్రియోక్ పోర్టుకు ఇవాళ చేరుకుంది. మిషన్ సాగర్‌లో భాగంగా భారత్‌ ఇండోనేషియాకు ఈ సాయం అందిస్తోంది. జకార్తాలో వైద్య సామగ్రి దిగడం పూర్తయిన తర్వాత, ఇతర మిత్ర దేశాలకు కూడా వైద్య సామగ్రిని అందించడానికి ఐఎన్ఎస్ ఐరావత్‌ ముందుకు సాగుతుంది. ఉభయచర కార్యకలాపాలను నిర్వహించడం ఐఎన్ఎస్ ఐరావత్ ప్రాథమిక పాత్ర. దీంతోపాటు, హెచ్‌ఏడీఆర్‌ మిషన్లను కూడా నిర్వహిస్తోంది. గతంలో హిందూ మహాసముద్రంలో చేపట్టిన వివిధ సహాయక చర్యల్లో ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ పాలు పంచుకుంది. ఈ ఏడాది జులై 24న కూడా, ఇండోనేషియాకు 5 ద్రవరూప వైద్య ఆక్సిజన్‌ కంటైనర్లు (100 మె.ట.), 300 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఇదే నౌక అందజేసింది. భారత్‌, ఇండోనేషియా ఒక బలమైన సాంస్కృతిక బంధం, భాగస్వామ్యం కలిగిన దేశాలు. సురక్షితమైన ఇండో-పసిఫిక్ కోసం సముద్రంపై కలిసి పనిచేస్తున్నాయి. ద్వైపాక్షిక విన్యాసాలు, సమన్వయ గస్తీ రూపంలో ఈ రెండు నౌకాదళాలు ఎప్పటికప్పుడు ఉమ్మడి నావికా విన్యాసాలను కూడా నిర్వహిస్తున్నాయి.
Oct 25, 2022 25 oct 2022 surya grahan, 25 october 2022 solar eclipse, 25 october 2022 surya grahan, 25 october surya grahan 2022, chandra grahan 2022, diwali 2022, facts about srikalahasti temple, Latest 365telugu news, latest Devotional news, lunar eclipse 2022, solar eclipse 2022, srikalahasti temple, surya grahan 2022, surya grahan 2022 date, surya grahan 2022 in india, surya grahan 2022 in india date and time, surya grahan 25 oct 2022, surya grahan 25 october 2022, surya grahanam 2022, surya grahanam eppudu 2022, అక్టోబర్ 25 సూర్యగ్రహణం, సూర్యగ్రహణం Spread the News 365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 25,2022: గ్రహణం సమయంలో సంభవించే అన్ని దుష్ప్రభావాల నుంచి దేవతలను రక్షించడానికి. ఆలయాలలోని సానుకూల శక్తిని తటస్థీకరించకుండా ప్రతికూల శక్తి నిరోధించడానికి ప్రధాన దేవత ఉన్న ఆలయాల గర్భగుడి మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తరువాత, ఆలయాన్ని కడిగి, శుభ్రం చేసి, భక్తులసేవ కోసం తెరుస్తారు. ఆలయాన్ని భక్తుల దర్శనానికి అందుబాటులో ఉంచే ముందు కొన్ని ఆచారాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా గ్రహణ సమయంలో అన్ని ఆలయాలు మూసివేసినా ఒక్క దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. అదే కాళహస్తీశ్వర ఆలయం . ఈ టెంపుల్ ఎందుకు తెరిచి ఉంటుందో తెలుసా..? ఈ ఆలయం ప్రధానంగా రాహు-కేతువులకు సంబంధించిన పూజలు నిర్వహిస్తారు. అందువల్ల ఈ శ్రీకాళహస్తి ఆలయంపై గ్రహణం ప్రభావం ఉండదు. దక్షిణ భారతదేశంలోని కైలాసంగా శ్రీకాళహస్తి ని భావిస్తారు. గ్రహణం రోజున రాహు -కేతువులకు పూజలు కొనసాగించే ఏకైక ఆలయంగా ఇది ప్రసిద్ధి.
తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ ఆగష్టు 6, 1934న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మబ్రహ్మచారి గా జీవించారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని ఉందని తరుచుగా చెప్పిన జయశంకర్ 2011, జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. అభ్యసనం, ఉద్యోగప్రస్థానం: ఆగస్టు 6, 1934 న వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట లో జయశంకర్‌ జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతరావు. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మబ్రహ్మచారి గా మిగిలిపోయారు. బెనారస్‌, అలీగఢ్‌ విశ్వవిద్యాలయాలనుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్‌ ఓయూలో పీహెచ్‌డీ చేశారు. 1975 నుంచి 1979 వరకు వరంగల్‌ సీకేఎం ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1979 నుంచి 1981 వరకు కేయూ రిజిస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్‌ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. ఉద్యమ ప్రస్థానం: 1969 తెలంగాణా ఉద్యమంలో జయశంకర్ చురుగ్గా పాల్గొన్నారు. అంతకుముందు 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్-ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. 1954లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చారు. 2001 నుంచి కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పలు పుస్తకాలు రాశారు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారు. “ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి, తర్వాత మరణించాలి” అని అనేవారు. గుర్తింపులు:తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పేరుమార్చి ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరుపెట్టబడింది. అలాగే 2016 అక్టోభరు 11న తెలంగాణలో కొత్తగా ఏర్పాటుచేసిన 21 జిల్లాలలో ఒక జిల్లాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా నామకరణం చేయబడింది. Book :-Kothapalli Jayashankar : వొడువని ముచ్చట This article taken from Wikipedia Biography In telugujayashankar universityprof jayashankar agricultural universityProfessor JayashankarTelangana Movement
బ్యాంకుల ప్రైవేటీకరణలో భాగంగా మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను అమ్మకానికి ఉంచనున్నట్లు సమాచారం. రెగ్యులైజేషన్స్ యాక్ట్ అండ్ బ్యాంకింగ్ లా యాక్ట్‌కు సవరణలు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నీతిఅయోగ్ ఇప్పటికే రెండు బ్యాంకులను షార్ట్ లిస్ట్ చేసి కేంద్రానికి నివేదిక పంపినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ సమాచారం ప్రకారం.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్‌ సమయంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకుల ప్రైవేటీకరణ ఉంటుందని వివరించారు. బ్యాంకుల ప్రైవేటీకరణ జరిగినప్పటికీ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది. శాలరీలు, పే స్కేల్, పెన్షన్ లాంటి కీలక అంశాలకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ బ్యాంకు ఉద్యోగుల కోసం వీఆర్ఎస్ తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. Tags: News News No comments Subscribe to: Post Comments ( Atom ) Education Info Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health General Info Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health
అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు సుప్రీం తీర్పు తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు గుంటూరు కు బయలు దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌లాస‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యం ప్రారంభం టీడీపీని నడిపేది ఆ రెండు పత్రికలు, టీవీలే మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం నీ మాట‌లు తెలుగువారందరినీ అవమానించినట్టేనయ్యా.. లోకయ్యా! You are here హోం » టాప్ స్టోరీస్ » ఇందిరా దేవి మరణం బాధాకరం ఇందిరా దేవి మరణం బాధాకరం 28 Sep 2022 3:45 PM వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌ తాడేప‌ల్లి: సూపర్‌స్టార్‌ కృష్ణ గారి సతీమణి, మహేశ్‌బాబు మాతృమూర్తి ఇందిరా దేవి గారి అకాల మ‌ర‌ణం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి సంతాపం తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. ఇందిరా దేవి గారి మరణం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఘట్టమనేని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
దసర శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఆలయాల్లో విశేష పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, అలంకరణలు నిర్వహించారు. అద్దంకిలో గుండ్లకమ్మ నుంచి జలాలు తీసుకొస్తున్న భక్తులు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఆకట్టుకుంటున్న అమ్మవారి అలంకరణలు గుండ్లకమ్మ నుంచి జలం తెచ్చి అభిషేకాలు అద్దంకిటౌన్‌, సెప్టెంబరు 26: దసర శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఆలయాల్లో విశేష పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, అలంకరణలు నిర్వహించారు. అద్దంకిలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కోటా శ్రీనివాసకుమార్‌, సభ్యుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం భక్తులు 102 కలశములతో గుండ్లకమ్మ నది నుండి జలాన్ని తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. అమ్మవారిని బాలాత్రిపుర సందరిగా అలంకరించారు. ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రం, వేయ్యి స్తంభాల గుడిలోని అమ్మవారికి అర్చకులు పూజలు నిర్వహిం చారు. వేయ్యి స్తంభాల గుడి నుంచి భక్తులు అధిక సంఖ్యలో గుండ్లకమ్మకు తరలివెళ్లి జలాన్ని తీసుకొచ్చి అ మ్మవారికి అభిషేకము, అర్చన నిర్వహించారు. అమ్మవారికి లక్ష్మి గౌరి అలంకరణ చేశారు. కార్య క్రమా ల్లో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పర్చూరు : దేవీ శరన్నవరాత్రి వేడుకలు సోమ వారంతో ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్ధానిక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో తొలిరోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని శ్రీ స్వర్ణ కవచా లంకృత దుర్గాదేవిగా అలంకరించి పూజాలు చేశారు. వేడుకలు తొలిరోజు ఆలయ కమిటీ ఆధ్యక్షుడు శ్రీరాం వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో ఆలయాన్ని విద్యుత్‌ ద్వీపాలతో తీర్చిదిద్డారు. ఆలయ అర్చ కులు నల్లూరి హర్షవర్ధనాచారి ఆధ్వర్యం లో అమ్మవారికి పూజాకార్యక్రమాలు చేపట్టారు. చినగంజాం : మండల పరిధిలోని పలు దేవాలయాలలో దేవీ శరన్నరాత్రులు సోమ వారం ఘనంగా ప్రారంభమయ్యాయి. చినగంజాం వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు కన్యకాపరమే శ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మందిరంలోని బతుకమ్మ అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోపిరాల గ్రామం లోని శ్రీలలితా పరమేశ్వరి సమేత రామకోటేశ్వరస్వామి వారి దేవస్థానంలోని అమ్మవారిని స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. స్థానిక భూసమేత భావనారాయణస్వామి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలను సోమవారం ఘనంగా ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీవారిని, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమారైలుగా అలంకరించి పూజలు నిర్వహించారు. రాత్రికి అంకురారోపణ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కారంచేడు(పర్చూరు) : కారంచేడులోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలిరోజు అమ్మవారికి మహిళా భక్తులు కళశాలతో గ్రామోత్సవంగా బలయలుదేరి అమ్మవారికి పూజలు చేసి వేడుకలకు స్వాగతం పలికారు. పంగులూరు : మండలంలో గ్రామ గ్రామానదేవి శరన్నవరాత్రి వేడుకలు సోమవారం ప్రారంభమయ్యా యి. విజయదశమి పర్వదినం సందర్భంగా తొమ్మిది రోజుల పాటు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహణ కోసం పలు ఆలయాలు ముస్తాబ య్యాయి. నవరాత్రి ఉత్సవాల ను పురస్కరించుకుని ఆల యాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. పంగులూరు లోని శ్రీ భీమలింగేశ్వరస్వామి ఆలయంలో పార్వతీ అమ్మ వారు సోమవారం బాలత్రిపురసుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భం గా పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పంగులూరు, చందలూరు, ముప్పవరం గ్రామాలలో వేడుకలు ప్రారంభమ య్యాయి. వేటపాలెం(చీరాల) : మండల పరిధిలోని అణు మల్లిపేట మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు వద్ద బతుకమ్మ ఉత్సవాలను సోమవారం నుంచి ప్రారంభ మయ్యాయి. ముందుగా బతకమ్మలను ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. కార్య క్రమంలో మహిళా విభాగం ప్రతినిధులు చుండూరు రాజ్యలక్ష్మి, పత్తి.బాలవెంకట సీతారామఅనంతలక్ష్మి, కోడూరి కోటేశ్వరమ్మ, భారతి, రాజేశ్వరి,, గాయత్రి, కమిటీ అధ్యక్షులు ప్రత్తి వెంకటసుబ్బారావు, కార్యదర్శి చుండూరు నాగాంజనేయులు, వినోద్‌, శ్రీధర్‌, శ్రీనివాసరావు, శ్రీహరి, భక్తులు పాల్గొన్నారు.
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం “సువర్ణసుందరి“. ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ద‌స్‌ప‌ల్లా హోట‌ల్‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు బి.గోపాల్ చేతుల మీదుగా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను ఆవిష్కరించారు. విలేక‌రుల స‌మావేశంలో… - Advertisement - స్టంట్ మాస్ట‌ర్ రామ్ సుంక‌ర‌ మాట్లాడుతూ… ఈ చిత్రం మీ అంద‌రికి రెండు ఏళ్ళ నుంచి ప‌రిచ‌యం. మేమంద‌రం రెండేళ్ళ నుంచి ఈ చిత్రానికి ప‌ని చేశాం. సాక్షిగారితో మా జ‌ర్నీ స్టార్ట్ అయింది. ఈ చిత్రంలో క‌త్తి ఫైట్స్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కొంచం ఎక్కువగా ప్రాక్టీస్ చెయించాల్సి వ‌చ్చింది. ప్రాడ్యూస‌ర్ ల‌క్ష్మీగారు మాకోసం రెండేళ్ళ‌పాటు ఎదురు చూసినందుకు చాలా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. మా డైరెక్ట‌ర్‌గారికి కూడా చాలా కృత‌జ్ఞ‌త‌లు. నాకు ఈ అవ‌కాశం కల్పించిన మీ అంద‌రికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. రైట‌ర్ ప్ర‌దీప్ మాట్లాడుతూ… నేను సూర్య దాదాపు ఎనిమిదేళ్ళ నుంచి మా స్నేహం సాగుతుంది. స‌డెన్‌గా ఒక రోజు నాకు కాల్ చేసి ర‌మ్మ‌న్నారు. నాకు ఈ అవ‌కాశం ఇచ్చినందుకు చాలా కృత‌జ్ఞ‌త‌లు. అన్ని విష‌యాల్లో ద‌గ్గ‌రుండి చాలా జాగ్ర‌త్త‌గా చూసుకున్నారు. డి.ఓ.పి. చాలా బాగా ప‌ని చ‌స్త్రశారు. సాయి కార్తిక్ మ్యూజిక్ కూడా బాగా కుదిరింది. ఈ చిత్ర యూనిట్ అంద‌రికి నా ఆల్ ద బెస్ట్ అన్నారు. డైరెక్ట‌ర్ సాగ‌ర్ మాట్లాడుతూ… ఇది చాలా ఎక్స్‌ట్రాడిన‌రీ చిత్రం. హీరోయిన్స్ చాలా చ‌క్క‌గా చేశారు. మ‌న తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు అంద‌గ‌త్తె జ‌య‌ప్ర‌ద. ఆవిడ కూడా ఈ చిత్రంలో న‌టించారు. ఎంటైర్ టీమ్ కి ఆల్ ద బెస్ట్. షూటింగ్ స్పాట్ల‌న్ని కూడా చాలా మంచి లొకేష‌న్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. సాయికార్తిక్ మ్యూజిక్ బావుంది. మ‌గ‌వారు ఏదైనా ఎటువంటి సాహ‌సాలైనా చెయ్య‌గ‌ల‌రు. కాని ఆడ‌వాడు చెయ్య‌డం గ్రేట్ అన్నారు. హీరోయిన్ సాక్షి మాట్లాడుతూ… ఇది చాలా అద్భుత‌మైన చిత్రం. మంచి పాట‌లు. ఫైట్స్ చాలా బాగా వ‌చ్చాయి. స్టంట్ మాస్ట‌ర్ చాలా కోప‌రేట్ చేశారు. నాకు బాగా హెల్ప్‌చేశారు. ఆయ‌న‌కు నా కృత‌జ్ఞ‌త‌లు. డిఓపిసార్‌కి నా కృత‌జ్ఞ‌త‌లు న‌న్ను అంత అందంగా చూపించినందుకు. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన సూర్య‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు. నా కో స్టార్ ఇంద్ర‌తో న‌టించ‌డం చాలా ఫ‌న్‌గా అనిపించింది. మా టీమ్ అంద‌రికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. హీరో ఇంద్రా మాట్లాడుతూ… నాకు ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం రావ‌డానికి కార‌ణం సూర్యగారు. నేను వంగ‌వీటి చిత్రంలో న‌టిస్తుండ‌గా ఒక‌రోజు ఫోన్ చేసి ర‌మ్మ‌ని నాకు నా పాత్ర గురించి వివ‌రించారు. నాపైన న‌మ్మ‌కం ఉంచి నాకు అంత మంచి పాత్ర‌ను ఇచ్చినందుకు ఆయ‌న‌కు నేను జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. ఈ చిత్రం ఇంత లేటు అయిందేంటి అని ఎవ్వ‌రూ అనుకోవ‌ద్దు. దీని వెనుకున్న కార‌ణం ఈ చిత్రం చాలా బాగా రావాల‌ని డైరెక్ట‌ర్‌గారు ప్ర‌తి చిన్న విష‌యంలో చాలా శ్ర‌ద్ధ తీసుకుని శ్ర‌మ‌ప‌డ్డారు. వీఎఫ్ఎక్స్ ఆయ‌న ప‌డిన క‌ష్టం చాలా గ్రేట్‌. నేను ఈ చిత్రంలో ఒక రొమాంటిక్ సీన్ చేశాను. సాక్షి నా కో ఆర్టిస్ట్‌. పూర్ణ కూడా చాలా బాగా చేశారు. టీమ్ అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు. సాయికార్తిక్ మ్యూజిక్‌, సినిమాటోగ్ర‌ఫీ అన్నీ బాగా కుదిరాయి. పూర్ణ మాట్లాడుతూ… ఒక మ‌నిషికి స‌హ‌నం అంటే అది సూర్య గారినుంచే నేర్చుకోవాలి. ప్ర‌తి ఒక్క‌రికీ చాలా ఓర్పుగా త‌మ త‌మ పాత్ర‌ల గురించి చాలా చ‌క్క‌గా వివ‌రించి ఆయ‌న‌కు ఏమి కావాలో ఆ అవుట్ పుట్ తెప్పించుకున్నారు. సూర్య‌గారు మీకు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. ఫైట్ మాస్ట్‌కి కూడా నా కృత‌జ్ఞ‌త‌లు. హీరో రామ్ కూడా మొద‌ట్లో కొంచం భ‌య‌ప‌డేవారు కాని బాగా న‌టించారు. సాక్షి మ‌నిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే చాలా స‌న్నివేశాలు అన్నీ ఫ‌న్నీగా జ‌రిగిపోయాయి. మా టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అన్నారు. హీరో రామ్ మాట్లాడుతూ… నాకు ఈ చిత్రంలో అవ‌కాశం రావ‌డానికి కార‌ణం సాయి కార్తిక్ నాకు ఎప్ప‌టి నుంచో ఫ్రెండ్ త‌న ద్వారా నాకు ఈ అవ‌కాశం వ‌చ్చింది. ఆయ‌న నాకు సూర్య‌గారిని ప‌రిచ‌యం చేశారు. సూర్య‌గారు అలా గుర్తుపెట్టుకుని నాకు ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం క‌ల్పించారు. ఇది నా మొద‌టి చిత్రం. సూర్య‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. నా ఫ‌స్ట్ సినిమాలోనే పూర్ణ‌లాంటి ఎక్స్‌పీరియ‌న్స్ హీరోయిన్‌తో చేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. డైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ… ఈ సినిమాని చాలా స్పెష‌ల్‌గా చేశాం. ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులంద‌రూ నాకు చాలా స‌హ‌క‌రించారు. ప్ర‌తి ఒక్క‌రికి పేరు పేరునా నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. ప్ర‌తి ఆర్టిస్ట్ చాలా బాగా న‌టించారు. ఈ చిత్రంలో విఎఫెక్స్ విజువ‌ల్స్ ఉండ‌డం వ‌ల్ల లేట్ అయింది. విఎఫ్ఎక్స్ కోసం క‌నీసం ఏడాదిపాటు దాని పై వ‌ర్క్ జ‌రిగింది. లేటు అయినా కూడా ఫ‌లితం చాలా బాగా వ‌చ్చింది. మా యూనిట్ అంద‌రికీ న‌న్ను ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చిన పెద్ద‌లందరికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. త‌మ్మారెడ్డి మాట్లాడుతూ… ఇలాంటి సినిమాలు రావ‌డం ప‌రిశ్ర‌మ‌కి చాలా అవ‌స‌రం ఉంది. దాని వ‌ల్ల కొత్త టెక్నీషియ‌న్స్ ప‌రిచ‌యం అవుతారు. డైరెక్ట‌ర్ క‌థ బాగా రాసుకున్నారు. కంటెంట్ చాలా బావుంది. త‌ప్ప‌ ఒక మంచి సినిమా అవుతుంది అని అన్నారు. బి. గోపాల్ మాట్లాడుతూ… ట్రైల‌ర్ చూశాను చాలా బావుంది. విఎఫెక్స్ వ‌ర్క్ బావుంది. అన్ని షాట్స్ కూడా చాలా బాగా తీశారు. కంటెంట్ బావుంది ఈ సినిమా మంచి స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌,విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, బి.గోపాల్‌, సాగ‌ర్ త‌దిత‌రులు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. న‌టీన‌టులుః జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి, ఇంద్ర‌, రామ్, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు, స‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్ న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ఃఎం.ఎల్‌.ల‌క్ష్మి, మ్యూజిక్‌డైరెక్ట‌ర్ఃసాయికార్తిక్‌, స్టంట్స్ఃరామ్‌సుంక‌ర‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ఃనాగు, డి.ఓ.పి. ఎల్లుమంతిఈశ్వ‌ర్‌, ఎడిట‌ర్ఃప్ర‌వీణ్‌పూడి, స్టోరీఃఎం.ఎస్‌.ఎన్.సూర్య‌, పి.ఆర్‌.ఓ. సాయిస‌తీష్‌, డైరెక్ట‌ర్ఃఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌.
5G మొబైల్ నెట్వర్క్ వల్ల కరోనా వ్యాప్తి చెందదు; బిల్ గేట్స్ దగ్గర ఉన్న పేటెంట్ ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న కరోనాకి సంబంధించిన వాక్సిన్ ది కాదు ఫాక్ట్ చెక్స్వీడియోలుక్విక్ చెక్డైలీ డేటాHelpful LinksFAQ Stories Coronavirus Coronavirus Telugu Fake News Telugu 5G మొబైల్ నెట్వర్క్ వల్ల కరోనా వ్యాప్తి చెందదు; బిల్ గేట్స్ దగ్గర ఉన్న పేటెంట్ ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న కరోనాకి సంబంధించిన వాక్సిన్ ది కాదు By Chaitanya Kumar Gundapu On August 21st, 2020 కోవిడ్ అనేది పెద్ద కార్పొరేట్ సంస్థలు సృష్టించిన ఒక కుట్ర అని చెప్తూ, ఈ వాదనకి మద్దతుగా చైనాలోని వుహన్ లో 5G వల్లే జనాలు చనిపోయారని, బిల్ గేట్స్ కి కరోనా లాంటి ఒక మహమ్మారి రాబోతుందని ముందే తెలుసనీ, బిల్ గేట్స్ దగ్గర కరోనా కి సంబంధించిన వాక్సిన్ ఉందని, ఇంకా ఇలాంటి చాలా క్లెయిమ్స్ చేస్తువున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంతవరకు నిజముందో తెలుసుకుంధాం. ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు క్లెయిమ్: చైనాలోని వుహన్ లో 5G నెట్వర్క్ మొదలు పెట్టడం వల్లే చాలా మంది చనిపోయారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ మరియు హై ఫ్రీక్వెన్సీ 5G కలిసి ‘ఎలక్ట్రోమాగ్నెటిక్ కరోనా ఎఫెక్ట్’ సంభవించింది. ఫాక్ట్(నిజం): 5Gలో మిగతా టెక్నాలజీలో వాడిన ఫ్రీక్వెన్సీ కంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ వాడతారు, సాధారణంగా ఎక్కవ ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ మనిషి శరీరంలోని టిష్యూలోకి తక్కువ చోచ్చుక పోతుంది. SARS-CoV-2 (కోవిడ్-19) మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందుతుంది, ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ వల్ల కాదు. ‘ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్’ చేప్తున్న దాని ప్రకారం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల స్వల్పంగా శరీర వేడి పెరుగుతుంది కాని ఆ వేడి ఊపిరి తిత్తులను తాకదు. WHO కూడా ఇదే చెప్తుంది. కావున పోస్టు ద్వారా చెప్తుంది తప్పు. 5G నెట్వర్క్ వల్ల ఆరోగ్యానికి ప్రమాదమన్న వాదనలు కోవిడ్ కన్నా చాలా ముందునుండే వినిపిస్తున్నాయి. ఐతే కోవిడ్ మొదలైన తరవాత ఇలాంటి వార్తల వ్యాప్తి చాలా పెరిగింది. కాని కోవిడ్ కి ముందు కూడా సెల్ ఫోన్, వైఫై మొదలైన టెక్నాలజీస్ వల్ల కాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వార్తలు కూడా వచ్చాయి. ప్రపంచంలో 5G నెట్వర్క్ కొన్ని ప్రాంతాల్లోనే ప్రారంభించారు అందులో వుహన్ ఒకటి. ఐతే వుహన్ కి సంబంధించిన కేస్ స్టడీస్ ప్రకారం వుహన్ కి వెళ్ళకుండా, వుహన్ లో ఉన్నవారితో కాంటాక్ట్ అయిన వారు కోవిడ్ బారిన పడ్డారు, ఎందుకంటే SARS-CoV-2 (కోవిడ్-19) మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందుతుంది, ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ వల్ల కాదు. దీన్నిబట్టి 5G వల్ల కోవిడ్ వ్యాప్తి చెందితుంది అన్న వాదనలో నిజం లేదని, 5G నెట్వర్క్ లేని ప్రాంతాల్లో కూడా కోవిడ్ వ్యాప్తిచెందుతుందని చెప్పొచ్చు. ‘ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్’ చేప్తున్న దాని ప్రకారం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల స్వల్పంగా శరీర వేడి పెరుగుతుంది కాని ఆ వేడి ఊపిరి తిత్తులను తాకదు. దీన్నిబట్టి 5G మనిషి శరీరంలోని సెల్స్ ని నాశనం చేస్తుంది అన్న వాదనలో నిజం లేదని చెప్పొచ్చు. WHO కూడా ఇదే చెప్తుంది, ఐతే వీరు చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న Radiofrequency exposure levels వల్ల శరీర ఉష్ణోగ్రత నామమాత్రంగానే పెరుగుతుంది, కాని overall exposure అంతర్జాతీయ నియమాలకు లోబడినప్పుడు ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదు. 5Gలో మిగతా టెక్నాలజీలో వాడిన ఫ్రీక్వెన్సీ కంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ వాడతారు, సాధారణంగా ఎక్కవ ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ మనిషి శరీరంలోని టిష్యూలోకి తక్కువ చొచ్చుక పోతుంది. కోవిడ్ కి సంబంధించి వ్యాప్తిలో ఉన్న కొన్ని అపోహలను పోగొట్టడానికి WHO వెబ్సైటు ఉంచిన సమాచారంలో వైరస్ రేడియో వేవ్స్ లేదా మొబైల్ నెట్వర్క్స్ ద్వారా ప్రయానించదని కావున 5G మొబైల్ నెట్వర్క్ వల్ల కోవిడ్ వ్యాప్తి చెందదని స్పష్టంగా చెప్పింది. క్లెయిమ్ 2: బిల్ గేట్స్ కి కరోనా లాంటి ఒక మహమ్మారి సంభవిస్తుందని ముందే తెలుసు. బిల్ గేట్స్ దగ్గర కరోనాకి సంభందించిన వాక్సిన్ పేటెంట్ ఉంది. ఫాక్ట్(నిజం): సాధారణ జలుబు లేక SARS మొదలైన అనేక వైరస్ లను కరోనా వైరస్ అని అంటారు, బిల్ గేట్స్ దగ్గర ఉన్నది ఇలాంటి ఒక వైరస్ కి సంబంధించిన పేటెంట్, ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న కరోనాకి సంభందించిన పేటెంట్ కాదు. కావున పోస్టులో చెప్తుంది తప్పు. కరోనా లాంటి ఒక మహమ్మారి వ్యాప్తించినప్పుడు ఎలా స్పందించాలో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఒక సిములేషన్ ఈవెంట్ (Event201), బిల్ గేట్స్ కరోనాని సృష్టించాడని, కరోనా గురించి బిల్ గేట్స్ కి ముందే తెలుసనీ, బిల్ గేట్స్ కరోనా వాక్సిన్ కి పేటెంట్ తీసుకున్నాడన్న మొదలైన తప్పుడు వార్తలకి దారితీసింది. Event 201కి సంబంధించిన వీడియో ఇక్కడ చూడొచ్చు. బిల్ గేట్స్ దగ్గర కరోనా వైరస్ కి సంబందించిన వాక్సిన్ కి పేటెంట్ ఉందన్న వార్త నిజమైనప్పటికి, ఆ వాక్సిన్ ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్ కి సంబంధించింది కాదు. సాధారణ జలుబు లేక SARS మొదలైన అనేక వైరస్ లను కరోనా వైరస్ అని అంటారు, బిల్ గేట్స్ దగ్గర ఉన్నది ఇలాంటి ఒక వైరస్ కి సంబంధించిన పేటెంట్. చివరగా, తప్పుడు సమాచారాన్ని ఆధారలుగా చూపిస్తూ కరోనా అనేది పెద్ద కార్పొరేట్ సంస్థలు సృష్టించిన ఒక కుట్ర అని చెప్తున్నారు.
Egg Curry : గుడ్డు కూర వంటకాలు: మీరు మీ గుడ్లను ఉడకబెట్టడం, వేయించడం లేదా వేటాడటం వంటి వాటితో అలసిపోతే, ఇక్కడ చాలా బహుముఖ, సరసమైన మరియు రుచికరమైన ఆహార పదార్థాలలో ఒకదాన్ని ఉపయోగించడానికి మరికొన్ని మార్గాలు ఉన్నాయి. చాలా మంది ప్రజలు గుడ్ల కోసం ఒక బలహీనతను చూపిస్తారు, ఇది చాలా సాధారణమైన చిన్నగది స్టేపుల్స్, అలాగే కూరలు, కాబట్టి వారు గుడ్డు కూరను ఇష్టపడటంలో ఆశ్చర్యం లేదు. కొందరు తమ గుడ్డు కూరను సాంప్రదాయకంగా ఉడికించిన గుడ్లతో తయారుచేయటానికి ఇష్టపడతారు, మరికొందరు నూనెతో పాన్లో వేటాడటానికి ఇష్టపడతారు. గుడ్డు కూర, సాధారణంగా కానీ ఎల్లప్పుడూ మాంసం-ఆధారిత మెయిన్‌ల మాదిరిగానే ఉడికించబడదు, దేశవ్యాప్తంగా వంటశాలలలోని ఇతర ప్రోటీన్లకు చివరి నిమిషంలో భర్తీ చేయవచ్చు లేదా కూరగాయల మార్పును విచ్ఛిన్నం చేయడానికి ఇది ఒక ఎంపిక. మీరు ఇంట్లో ప్రయత్నించగల ఐదు ఉత్తమ గుడ్డు కూర వంటకాలు ఇక్కడ ఉన్నాయి: 1.మసాలా గుడ్డు కూర గుడ్డు మసాలా కర్రీని ఉడకబెట్టిన గుడ్లతో కారంగా గ్రేవీలో తయారు చేస్తారు. ఈ రుచికరమైన వంటకాన్ని తయారు చేయడంలో టమోటాలు మరియు సుగంధ ద్రవ్యాలు వాడటం వల్ల అది చిక్కగా ఉంటుంది. Egg Curry Egg Curry Masala మీరు విస్తృతమైన భోజనం సిద్ధం చేయకూడదనుకున్నప్పుడు ఉడికించడం చాలా సులభం. అల్పాహారం నుండి మిగిలిపోయిన గుడ్లను తీసుకొని టమోటాలు మరియు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన కూరలో టాసు చేసి కొద్దిసేపు వేడి చేసి మీ రుచికరమైన గుడ్డు కూర మసాలా సిద్ధంగా ఉంది. 2.షాహి గుడ్డు కూర Egg Curry గుడ్లు చాలా బహుముఖ ఆహారాలలో ఒకటి, పెరుగు మరియు క్రీముతో కూడా ఉడికించాలి. ఈ రెసిపీకి ఉల్లిపాయలు, సుగంధ సుగంధ ద్రవ్యాలు, కసూరి మెథీ మరియు క్రీమ్ మరియు పెరుగు యొక్క సూచనలో మునిగిపోయిన ఉడికించిన / వేసిన గుడ్లు (ప్రాధాన్యతను బట్టి) అవసరం. ఈ వంటకాన్ని రోటీ, పరాతా, బియ్యం, బిర్యానీ లేదా పులావ్‌తో కూడా వడ్డించవచ్చు. 3.గోవా గుడ్డు కూర Spicy Indian Beef Curry with Eggs గోవాన్ వంటకాల యొక్క మూలం తూర్పు మరియు పాశ్చాత్య ప్రభావాల మిశ్రమంగా వర్ణించవచ్చు. మరియు వంటకం లో స్థానిక సుగంధ ఉనికిని పేరు సూచించినట్లుగా, ఈ గుడ్డు కూరలో మూడు ప్రత్యేక పదార్థాలు ఉన్నాయి – కొబ్బరి క్రీమ్, చింతపండు మరియు గసగసాలు. ఇది బియ్యం, పరాతా మరియు రోటీలతో చాలా రుచిగా ఉంటుంది. మీరు గోవా ఆవిరితో చేసిన రొట్టెలతో (సన్నాస్) తో పాటు వడ్డించవచ్చు. 4.చెట్టినాడ్ గుడ్డు కూర Egg Curry దక్షిణ భారతదేశం నుండి వచ్చిన ఈ రెసిపీ, ముఖ్యంగా తమిళనాడులోని చెట్టినాడ్ ప్రాంతం, నిమ్మరసం వాడకానికి నిలుస్తుంది. ఉడికించిన గుడ్లు సుగంధ ద్రవ్యాలు-భారీ కూరలో విసిరి, నిమ్మకాయల చిక్కుతో పదునుపెడతాయి. మీరు దానితో పాటు pick రగాయను కూడా వడ్డించవచ్చు. 5.టమోటా గుడ్డు కూర ఎర్రటి టమోటా గ్రేవీ ఈ కూర యొక్క ఆధారాన్ని ఏర్పరుస్తుంది. టమోటా లేదా ఉల్లిపాయ పేస్ట్ ఉపయోగించబడదు మరియు వీటిని తరిగిన మరియు సుగంధ ద్రవ్యాలతో వేయించాలి. అప్పుడు ఉడికించిన గుడ్లను మరిగే గ్రేవీలో ముంచి కాసేపు వేడి చేస్తారు. దీన్ని ఎలాంటి రొట్టె లేదా బియ్యంతో వడ్డించవచ్చు. Egg Curry ఈ కూరలు మీ వంటగదిలోని ఇతర ప్రోటీన్లకు చివరి నిమిషంలో భర్తీ కావచ్చు లేదా అవి కూరగాయల మార్పును విచ్ఛిన్నం చేయడానికి ఒక ఎంపికగా ఉండవచ్చు. వాటిని ప్రయత్నించండి.
thesakshi.com : వాతావరణ మార్పులతో వచ్చే నష్టం, కలిగే సమస్యలు ఏమిటి, ధనిక దేశాలు ఎందుకు డిమాండ్‌ను ఎందుకు ప్రతిఘటిస్తున్నాయి? ఇప్పటివరకు ఈ విషయంలో ఏ ప్రయత్నాలు జరిగాయి? అనే ప్రధాన ఎడెండాను COP27 సదస్సులో పొందుపర్చింది. వాతావరణ మార్పులపై కొనసాగుతున్న ఈ సదస్సులో ‘నష్టం – సమస్యలు – వాతావరణ చర్చలలో సూచించినట్లుగా – దాని అధికారిక ప్రధాన అజెండాలో మొదటిసారిగా చేర్చడం ఆశాజనకంగా ప్రారంభించింది. నష్టం, ఆ నష్టానికి ప్రేరేపించే అంశాలపై స్పష్టం చేసే చర్య, తరచుగా పెరుగుతున్న తీవ్రమైన వాతావరణ సంఘటనలు, నెమ్మదిగా ప్రారంభమయ్యే సంఘటనల ప్రభావంతో అవసరాలకు ప్రతిస్పందించడానికి సమర్థవంతమైన యంత్రాంగం కోసం స్పందించడానికి ఇది సమయం. ముఖ్యంగా వాతావరణ మార్పు ప్రభావాలకు అత్యంత హాని కలిగించే వారికి చర్య, మద్దతు అవసరాలపై అధికారిక COP27 వెబ్‌సైట్ దాని లక్ష్యాలలో జాబితా చేస్తుంది నష్టం, సమస్య ఏమిటి, సంపన్న దేశాలు దానిని ఎందుకు ప్రతిఘటిస్తున్నాయి, ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? లాంటి వాటిపై చర్చలు సాగనున్నాయి. పర్యావరణాన్ని కలుషితం చేసే పారిశ్రామిక ఉద్గారాలకు ప్రధాన బాధ్యత వహించే ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు, కాలుష్యానికి అతితక్కువ సహకారం అందించిన పేద దేశాలకు చెల్లించాల్సిన ఖర్చులను సూచిస్తుంది పేద దేశాలు దశాబ్దాలుగా వాతావరణ నష్టం ఆర్థిక సహాయాన్ని అడుగుతుండగా, సంపన్న దేశాలు దానిని ప్రతిఘటించాయి. అలాగే, పూర్తిగా వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాన్ని నిర్వచించడం అంచనా వేయడం కష్టం. వాతావరణ విపత్తుల నుండి వచ్చే నష్టానికి పరిహారం కోసం డిమాండ్ అనేది విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన “కాలుష్యం చెల్లింపు” సూత్రం. ఇది కేవలం నివారణ చర్యలకు మాత్రమే కాకుండా బాధితులకు పరిహారం చెల్లించడానికి కూడా కాలుష్యకారుడిని బాధ్యులను చేస్తుంది. వారి చర్యల వల్ల పర్యావరణ నష్టం కలుగుతుంది. UKతో సహా అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలలో మొత్తం ఉద్గారాలలో 50 శాతానికి పైగా ఉన్నాయి. రష్యా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలను చేర్చినట్లయితే, సంయుక్త సహకారం 65 శాతం లేదా దాదాపు మూడింట రెండు వంతుల ఉద్గారాలను దాటిపోతుంది. చారిత్రక బాధ్యత చాలా ముఖ్యమైనది ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్ వందల సంవత్సరాలు వాతావరణంలో ఉంటుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతుంది. భారతదేశం మూడవ అతిపెద్ద ఉద్గారిణి, చారిత్రక ఉద్గారాలలో 3 శాతం మాత్రమే. ఇప్పుడు 15 సంవత్సరాలుగా ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్గారిణిగా ఉన్న చైనా, 1850 నుండి మొత్తం ఉద్గారాలలో 11 శాతం దోహదపడింది. సంపన్న దేశాలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పరిహారం క్లెయిమ్‌లకు వ్యతిరేకంగా అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో అర్థం చేసుకోవడం కష్టం కాదు. నష్టం, డ్యామేజ్ క్లెయిమ్‌లు బిలియన్ల డాలర్లకు లేదా అంతకంటే ఎక్కువగా మారవచ్చు. UN జనరల్ అసెంబ్లీ కోసం తయారు చేసిన UN ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ ఎఫర్ట్స్ (UNOCHA) ఇటీవలి నివేదిక ప్రకారం, వాతావరణ సంబంధిత విపత్తులకు సంబంధించిన వార్షిక నిధుల అభ్యర్థనలు 2019 – 2021 మధ్య మూడు సంవత్సరాల కాలంలో సగటున $15.5 బిలియన్లు. 2020లో భారతదేశం, బంగ్లాదేశ్‌లో అంఫాన్ తుఫాను నుండి ఆర్థిక నష్టం $15 బిలియన్లుగా అంచనా వేయబడింది. దాని ఉద్గారాల కారణంగా యునైటెడ్ స్టేట్స్ ఒక్కటే “ఇతర దేశాలకు $1.9 ట్రిలియన్ల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగించిందని” అంచనా వేయబడింది. జీవన నష్టం, వలసలు, ఆరోగ్య ప్రభావాలు, సాంస్కృతిక వారసత్వానికి నష్టం వంటి ఆర్థికేతర నష్టాలు కూడా ఉన్నాయి. అయితే, కొన్ని దేశాలు నష్టం, డ్యామెజ్ కోసం చిన్న నిధుల కట్టుబాట్లు చేశాయి. వీటిలో డెన్మార్క్, స్కాట్లాండ్, వాలోనియాలోని బెల్జియన్ ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి? COP అధికారిక ఎజెండాలో నష్టం, డ్యామేజ్ ను చేర్చడం – మంచి ప్రారంభం. ఇది మొదటి అడుగు మాత్రమే. పేద దేశాలకు పరిహారంగా డబ్బు రావడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. అలాగే, వాతావరణ మార్పుల ప్రయోజనాల కోసం పట్టికలో ఉంచబడిన డబ్బు పరిమాణం అవసరాలకు అనుగుణంగా ఉండదని గత రికార్డు సూచిస్తుంది.
జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం చేపట్టిన పోలవరం అథారిటీ సీఈఓ దినేష్‌కుమార్ సరిగ్గా నెల రోజుల కిందట.. అంటే ఫిబ్రవరి 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి వచ్చిన అథారిటీ.. ఆ పనులు జరుగుతున్న తీరుపట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ రాసిన లేఖ అది. ఇప్పుడు జరుగుతున్న తరహాలో పనులు జరిగితే.. ప్రాజెక్టు పూర్తిచేయడానికి ప్రతిపాదిత సమయానికన్నా చాలా ఎక్కువ కాలం పడుతుందని.. ప్రాజెక్టుతో పాటు, దాని ప్రయోజనాలు నెరవేరటంలోనూ తీవ్ర జాప్యం జరుగుతందని ఆ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంతో పాటు.. పోలవరం అథారిటీ లేవనెత్తిన మరిన్ని అంశాలను ‘సాక్షి’ మంగళవారం నాడు ప్రచురించిన తన కథనంలో వివరించింది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేపధ్యంలో.. దీని నిర్మాణ బాధ్యతలు కూడా కేంద్రం చేతుల్లోకి వెళతాయని.. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తికాకపోతే ప్రస్తుత కాంట్రాక్టును రద్దు చేసే అవకాశం ఉంటుందని.. కాబట్టి ఈ పనుల బాధ్యత కేంద్రం చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని అధికార వర్గాల ద్వారా అందిన సమాచారాన్ని ‘సాక్షి’ వెల్లడించింది. ‘మినిట్స్’ చూపుతూ చంద్రబాబు ఏం చెప్పారు? ఈ కథనమంతా అసత్యమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు శాసనసభలో మండిపడ్డారు. ఆ క్రమంలో పోలవరం అథారిటీ తొలి సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను సభలో చూపించారు. ‘నిన్ననే.. అంటే మార్చి 16వ తేదీన ఢిల్లీలో పోలవరం అథారిటీ సమావేశం జరిగిందని.. ఆ మినిట్సే మాకు పంపార’ని చెప్పారు. దాని ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత కాంట్రాక్టులను కొనసాగించేందుకు, రాష్ట్ర ప్రభుత్వమే పనులు చేపట్టేందుకు ఆ అథారిటీ అనుమతించిందని, ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే నిధులను తిరిగి ఇచ్చేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ‘సాక్షి’ అసత్యాలు రాస్తోందంటూ నిప్పులు చెరుగుతూ ఈ మాటలు అన్నారు. నెల రోజుల్లోనే సీఈఓ వైఖరి మారిందంటే అర్థమేమిటి? చంద్రబాబు చెప్పిన ఈ మాటలే.. ‘సాక్షి’ చెప్పిందే వాస్తవమని నిరూపిస్తున్నాయి. నెల రోజుల కిందట.. ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరుపై తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసిన పోలవరం అథారిటీ సీఈఓ.. సరిగ్గా నెల రోజుల్లోనే.. ‘ప్రస్తుత కాంట్రాక్టునే కొనసాగించాల’ని ఎందుకన్నారు? దీని వెనుక ఉన్న ఒత్తిడిలు ఏమిటి? వాస్తవానికి నెల రోజుల కిందట పోలవరం అథారిటీ సీఈఓ రాసిన లేఖకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం అథారిటీకి కానీ, కేంద్ర జలవనరుల శాఖకు కానీ ఎటువంటి సమాచారం, సమాధానం ఇచ్చిందీ తెలియదు. ఏం సంప్రదింపులు జరిపిందీ చంద్రబాబు చెప్పలేదు. కానీ.. ప్రాజెక్టు ప్రస్తుత కాంట్రాక్టును కొనసాగించేలా, అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగేలా తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. అందుకే.. సీఈఓ నెల రోజుల్లోనే తన వైఖరిని మార్చుకున్నట్లు అర్థమవుతోంది. సరిగ్గా ‘సాక్షి’ చెప్పిన విషయమిదే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రం చేతుల్లోకి వెళ్లకుండా తన చేతుల్లోనే ఉంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడులు తీసుకొస్తోందనే చెప్పింది. అదే నిజమని.. సీఈఓ వైఖరి నెల రోజుల్లోనే మారిపోవటం స్పష్టం చేస్తోంది. అది నిర్ణయం కాదు.. సీఈఓ సూచన మాత్రమే అంతేకాదు.. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రస్తుత కాంట్రాక్టును కొనసాగించాలన్న మాట.. పోలవరం అథారిటీ తీసుకున్న నిర్ణయం కానే కాదు. అథారిటీ సమావేశంలో ప్రాజెక్టు అమలు విధివిధానాలపై చర్చల సందర్భంగా సీఈఓ చేసిన ఒక సూచన మాత్రమే. అది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సమావేశం మినిట్స్‌లో పేర్కొన్న ‘తీర్మానాలు’లోనూ ఈ అంశం లేదు. అంటే.. ఇది అథారిటీ నిర్ణయమంటూ చంద్రబాబు చెప్పింది పచ్చి అబద్ధం. అథారిటీ భేటీ 16న ఢిల్లీలో జరగలేదు... ఈ పోలవరం అథారిటీ మార్చి 16వ తేదీన ఢిల్లీలో సమావేశమైందని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. ఈ మాటలు విని ఢిల్లీ వర్గాలే విస్తుపోయాయి. ఎందుకంటే.. పోలవరం అథారిటీ సమావేశం ఢిల్లీలో జరగలేదు. ఈ నెల 16వ తేదీనా జరగలేదు. వాస్తవానికి ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లోనే పోలవరం అథారిటీ తొలి సమావేశం జరిగింది. ఆ సమావేశం మినిట్స్‌ను ఈ నెల 16వ తేదీన (సోమవారం నాడు) కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వశాఖకు పంపించారు. అంటే.. ఈ సమావేశం జరిగిన తేదీ, ప్రదేశం పైనా చంద్రబాబు నిందు సభలో చెప్పినవి అసత్యాలే. వ్యయం రీయింబర్స్ తీర్మానానికీ వక్రీకరణ... ఇక.. పోలవరం అథారిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు బదిలీ చేసే విధానంపైనా చర్చలు జరగాలని, అవసరమైతే ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఈ సమావేశంలో ప్రతిపాదించారు. దీనిపై ఎటువంటి చర్చా జరగలేదు. ఈ ప్రతిపాదనను బట్టే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిధులను తమకు బదిలీ చేయాలని కోరుతున్నట్లు స్పష్టమవుతోంది. కానీ.. చంద్రబాబు మరో అంశాన్ని చూపుతూ.. ప్రాజెక్టు నిధులను రాష్ట్రానికి బదిలీ చేయటానికి పోలవరం అథారిటీ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి.. ఈ అథారిటీ ఏర్పడిన తర్వాత ప్రస్తుత సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని ఏపీ సర్కారుకు రీయింబర్స్ చేయాలని మాత్రమే అథారిటీ తీర్మానం చేసింది. ఈ రీయింబర్స్ అంశాన్ని.. పాలక మండలి చైర్మన్ అయిన జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆమోదానికి నివేదించాలని నిర్ణయించింది. కానీ.. ఈ తీర్మానాన్ని చంద్రబాబు వక్రీకరిస్తూ.. మొత్తం ప్రాజెక్టు వ్యయానికి అయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి రీయింబర్స్ చేయటానికి పోలవరం అథారిటీ నిర్ణయం తీసుకుందని అసెంబ్లీలో అసత్యాలు చెప్పుకొచ్చారు. కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకునే అధికారం సీఈఓకు... నిజానికి.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నియంత్రణలపై.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వశాఖతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకునేందుకు పోలవరం అథారిటీ సీఈఓకు అధికారమిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అధారిటీ చేసిన తీర్మానాలను పోలవరం ప్రాజెక్టు అధారిటీ గవర్నింగ్ బాడీ ఆమోదం తెలిపాలి. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో గవర్నింగ్ బాడీ ఉంటుంది. గవర్నింగ్ బాడీ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాలి, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం గానీ, పోలవరం అధారిటీ గానీ ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్కడా అనుమతించలేదు. కానీ.. అనుమతించేసిందని నిండు సభలో బల్ల గుద్ది చెప్పుకోవటం ఒక్క బాబుకే చెల్లింది! -న్యూఢిల్లీ, సాక్షి
చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ కీలక వ్యక్తి ఊహించని విధంగా మృత్యువాత పడ్డారు. అతడు ఎవరో కాదు.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఎన్నో చిత్రాల్లో డూప్ గా పనిచేస్తూ వచ్చిన సాగర్ పాండే. చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ కీలక వ్యక్తి ఊహించని విధంగా మృత్యువాత పడ్డారు. అతడు ఎవరో కాదు.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఎన్నో చిత్రాల్లో డూప్ గా పనిచేస్తూ వచ్చిన సాగర్ పాండే. సాగర్ పాండే కి ఇంకా 50 ఏళ్ల వయసు కూడా పూర్తి కాలేదు. చిన్న వయసులోనే ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. జిమ్ చేస్తుండగా సెప్టెంబర్ 30న సాగర్ కుప్ప కూలినట్లు తెలుస్తోంది. దీనితో అతడిని పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించగా అప్పటికే సాగర్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సాగర్ మరణవార్త తెలియగానే సల్మాన్ ఖాన్ షాక్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. సాగర్ కి నివాళి అర్పిస్తూ సల్మాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'మీరు నాతో ఉన్నన్ని రోజులు నా హృదయం సంతోషానికి అడ్డాగా మారింది. మీ ఆత్మకి శాంతి చేకూరాలి. థాంక్యూ సాగర్ భాయ్' అని సల్మాన్ ఖాన్ పోస్ట్ పోస్ట్ చేశారు. భజరంగి భాయీజాన్ సెట్స్ లో సాగర్ తో దిగిన ఫోటోని సల్మాన్ అభిమానులతో పంచుకున్నారు. దాదాపు 50 చిత్రాలకు పైగా సాగర్.. సల్మాన్ కి బాడీ డబుల్ గా పనిచేశారు. స్టంట్ మ్యాన్ గా కూడా గుర్తింపు పొందారు. అనుపమ్ ఖేర్ లాంటి లెజెండ్రీ సెలెబ్రిటీలు కూడా సాగర్ మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సాగర్ మృతి విషయాన్ని మొదట మీడియాకి తెలియజేసిన వ్యక్తి షారుఖ్ ఖాన్ బాడీ డబుల్ ప్రశాంత్ వాల్డె. ప్రశాంత్ మాట్లాడుతూ.. ఇది జీర్జించుకోలేని విషయం. సాగర్ వయసు 45 నుంచి 50 మధ్యలో ఉంటుంది. చాలా ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటాడు. అలాంటి వ్యక్తికి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు అని విచారం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కూడా ఆగష్టు లో జిమ్ చేస్తూ కుప్పకూలారు. ఆయన చికిత్స పొందుతూ సెప్టెంబర్ లో మరణించారు. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా జిమ్ వర్కౌట్స్ చేస్తూనే గుండెపోటుతో మరణించారు. సెలెబ్రిటీలని జిమ్ కసరత్తులు కలవరపెడుతున్నాయి. జిమ్ చేసే సమయంలో జాగ్రత్తలు అవసరం అంటూ నిపుణులు సూచిస్తున్నారు. Follow Us: Download App: --> RELATED STORIES Bigg Boss 6 Telugu: సీజన్‌ ఫస్ట్ ఫైనలిస్ట్ శ్రీహాన్‌.. ఆనందంలో రేవంత్‌.. ఈ సీజన్‌ బెస్ట్, వరస్ట్ ఎవరంటే?
లోకరక్షకుని జనన కాలంలో దేవుని కృపపొందితి అని దేవదూత ద్వారా కొనియాడబడిన స్త్రీ యేసు తల్లియైన మరియ. (లూకా 1:30) కన్యక గర్భవతియై కుమారుని కనును అతనికి “ఇమ్మానుయేలు” అను పేరు పెట్టబడును అనే ప్రవచనము క్రీస్తుకు పూర్వం దాదాపు 700 సం||ల క్రిందటనే ప్రవచింపబడినది. (యెషయా 7:14) దాని నెరవేర్పు క్రొత్తనిబంధనలో ఈ రీతిగా జరిగింది. గబ్రియేలు దూత ద్వారా దేవుడు తన చిత్తాన్ని గలిలయలోని నజరేతు గ్రామ నివాసియైన 17 సం||ల ప్రాయంలో ఉండి యోసేపు అను పురుషునికి ప్రధానం చేయబడి పవిత్రురాలైన కన్య మరియకు బయలు పరచబడింది. “మరియా, భయపడకుము! దేవుని వలన కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును” (లూకా 1:30,33) ఈ మాట మరియకు భయాన్ని కలిగించగా అవిశ్వాసివలె నేను కన్యను. పురుషుని ఎరుగనిదానను నాకు ఇది ఎలా సంభవము? అని దూతను ప్రశ్నించింది. అందుకు దూత పరిశుద్ధాత్మ వలననే నీవు గర్భం ధరిస్తావని చెప్పి ఇంకనూ ఆమెను ధైర్యపరచడానికి ని బంధువురాలును, వృద్ధురాలునైయున్న గోడ్రాలని పిలువబడే ఎలీసబెతు కూడా గర్భము ధరించియున్నది. అమెకిప్పుడు ఆరవ మాసం అని చెప్పినప్పుడు, విశ్వాస-ముంచుటయందును, ఆయన మాటలు విని లోబడుటయందును ఆసక్తిగల మంచి స్వభావమున్న మరియ భయాన్ని, బిడియాన్ని సంఘబహిష్కరణను లెక్కచేయక ఇదిగో ప్రభువా! నీ దాసురాలను నీ చిత్తం చొప్పున జరుగునుగాక! అని ఆయన మాటకు విధేయత చూపింది. (లూకా 1:38) ప్రభువు తల్లిగా వాడబడుటకు పూర్ణాంగీకారాన్ని తెలియజేసింది, ధన్యురాలైంది. మనం కూడా మన దేహమనే దేవాలయంలో ఆయన్ను చేర్చుకోడానికి అంగీకరిస్తున్నామా? హృదయమనే ద్వారం వద్ద నిలుచుండి ప్రభువు తట్టుచుండగా దానిని తెరచి మరియ వలె ఆయనను మనలో చేర్చుకుంటున్నామా? మన దేహము దేవుని ఆలయమని గ్రహించిననాడే నిజమైన క్రిస్మస్ అని ప్రతివారు గ్రహించాలి. బంధువురాలైన ఎలీసబెతును చూడడానికి యూదా దేశముచేరి, వృద్ధురాలికి అభివాదము చేయుచున్న మరియ స్వరాన్ని విన్న గర్భస్త శిశువు ఆనందంతో గంతులు వేశాడు. ప్రభువు తల్లిని చుచాననే ఆనందాన్ని తల్లి గర్భంలో ఉండగానే ఆయన అనుభవించాడు. క్రైస్తవ బిడ్డలమైన మనం బంధుమిత్రులను, ఇరుగు పొరుగువారిని కలిసినప్పుడు ఇట్టి ఆనందాన్ని పొందుతున్నామా? లేదా? అని ప్రశ్నించు-కుందాం. పశుపాకలో లోకరక్షకుడు జన్మించగానే ప్రకృతి పులకించింది. ప్రకాశ-వంతమైన నక్షత్రం పాకపై వెలసింది. కాపరులు, జ్ఞానులు ఆరాధించి కానుకలర్పించారు. పరలోక సైన్యం పాటలు పాడారు. ఇన్ని జరిగినా మరియ ఈ ఘనతంతా దేవునిదే నేను యిహలోకపు తల్లిని మాత్రమే అనే సత్యాన్ని మరువలేదు. నీతిమంతుడైన యోసేపు, మరియలు ప్రభువును దేవునిదయలోనూ, మనుష్యుల దయలోనూ పెంచారు. మరియ యోసేపుతో సాంసారిక జీవితాన్ని కొనసాగించి యాకోబు, యోసేపు, సీయోను, యూదా అను కుమారులను, కుమార్తెలను కూడా పొందియున్నది. కుటుంబ భారము ఎక్కువగా వరపుత్రుడైన యేసుపైననే మోపబడినట్లు గ్రంధములో వ్రాయబడినది. యోసేపు మరణానంతరం వడ్రంగి పనిచేయుచూ ప్రభువు కుటుంబాన్ని పోషించాడు. 30 యేండ్ల ప్రాయం వచ్చే వరకు కుటుంబ సభ్యులను పోషించిన ప్రభువు తన తండ్రి కార్యములు నెరవేర్చడానికి పూనుకున్నాడు. మరియ కూడా ఆయన శిష్యులతో 31/2ల సం||లు తిరిగింది. (అపో. 1:14) ప్రభువు అందరి స్త్రీలవలెనే ఆమే యెడల కూడా జరిగించాడు కాని ప్రత్యేకించి చూడలేదు. కానా వివాహంలో ద్రక్షారసమై -పోయినప్పుడు తల్లి విజ్ఞప్తి చేయగా “నాతో నీకేమి పని? నా సమయమింకా రాలేదు అన్నాడు” (యోహాను 2:4) మరియొక సందర్భంలో నీ తల్లియు, సహోదరులు వెలుపలనున్నారని చెప్పిన వ్యక్తితో పరలోక-మందున్న నాతండ్రి చిత్తప్రకారం చేయువారే నా తల్లి, సహోదరులు అని చెప్పాడు. (మత్తయి 12:46-50) నవమాసాలు మోసి బాధకోర్చి, కని 30సం||ల వరకు ఒకే చోట జీవించి 3 1/2 సం||లు ఆయనతో పాటు తండ్రి సేవలో తిరిగిన మరియకు తన ప్రియాతి ప్రియమైన కుమారుడు సిలువ మ్రానుపై దారుణహింసలు, బాధలు పొందుచుచూచినా ఆమె హృదయవేదన ఎంతగా ఉన్నదో వర్ణించగలమా! తనకు కలిగే బాధలు, జబ్బులు ఒంటరిగా భరించగలుగుతుంది. గాని బిడ్డలు పడే బాధలు మాతృమూర్తి చూస్తూ సహించలేదు. సుమెయోను ప్రవక్త పసిబాలుని చూచి పలికిన ఆ ఖడ్గము తల్లి హృదయంలోకి దుసుకోనిపోగా ఆమె కన్నీరు మున్నీరుగా సిలువచెంత విలపించింది. Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
Telugu News » Andhra pradesh » It is raining all over Andhra Pradesh due to the effect of low pressure in the Bay of Bengal Telugu news Weather Alert: అల్పపీడనానికి తోడైన ఉపరితర ద్రోణి.. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి... Ap Weather Aler Ganesh Mudavath | Sep 11, 2022 | 3:07 PM బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది కళింగపట్నం, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం వల్ల సముద్రం వైపు ఉన్న తేమ మేఘాల ద్వారా భూమి పైకి విస్తరించాయి. దీంతో భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయని వెల్లడించారు. దీనికి అనుబంధంగా తూర్పు ఆగ్నేయ దిశగా ఏర్పడిన రుతుపవన ద్రోణి ఏర్పడింది. అల్పపీడనం, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి బలహీనపడుతుందని అంచనా వేసినప్పటికీ అది వాయుగుండంగా మారేందుకు అనువైన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల, మిగిలిన కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని గోవిందపురంలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో 8.5, పల్నాడు జిల్లా చాగల్లులో 8.3 సెంటీ మీటర్లు వర్షం కురిసింది. విజయవాడ నగర పరిసరప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని మహేంద్ర తనయ గెడ్డ పొంగి పొర్లుతోంది. ప్రమాదవశాత్తు అందులో పడి విశ్వనాథ్‌ అనే యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. ఇవి కూడా చదవండి Viral Video: ఎస్పీకి కోపం వచ్చింది.. అధికారాన్ని ఉపయోగించి.. ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో వైరల్ KCR NATIONAL POLITICS: ప్రగతి భవన్ కు కుమారస్వామి.. జాతీయ రాజకీయాలపై ఇద్దరు నేతల మధ్య చర్చ..? Amit Shah: రాహుల్ గాంధీపై అమిత్ షా ఫైర్.. మీరు ముందు అది అధ్యయనం చేయాలంటూ సూచన.. Andhra Pradesh: సభలో సస్పెండ్ అవ్వాలని ఎంపీలే కోరుకుంటారు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు..
Telugu News » Health » Stay Healthy And Fit by adding these Best Monsoon Foods In Your Diet Telugu Health News Healthy Diet: వర్షాకాలంలో అజాగ్రత్తగా ఉంటే ఈ వ్యాధుల బారిన పడినట్లే.. నివారించేందుకు వీటిని తప్పనిసరిగా తీసుకోండి.. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండే బెర్రీలు, చెర్రీస్, పియర్స్, ప్లమ్స్, పీచెస్, తాజా ఖర్జూరాలు, దానిమ్మ వంటి వర్షాకాల పండ్లను ఎక్కువగా తినండి. Best Monsoon Foods Sanjay Kasula | Jul 20, 2022 | 2:07 PM వర్షాకాలం వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.. కానీ దానితో పాటు అనేక సీజనల్ వ్యాధులను కూడా తెస్తుంది. జలుబు, ఫ్లూ, టైఫాయిడ్ నుంచి మలేరియా డెంగ్యూ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల వరకు వ్యాధుల ప్రమాదం ఈ సీజన్‌లో ఎక్కువగా ఉంటుంది. డైటీషియన్లు ఇచ్చే సలహా ప్రకారం, ఈ సీజన్‌లో సరైన ఆహారాన్ని ఎంచుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వర్షాకాలంలో ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఈ సీజన్ లో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో మీ సీఫుడ్ తీసుకోవడం పరిమితం చేయండి. వర్షాకాలంలో సముద్రపు నీరు కలుషితమై ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సీజన్‌లో, మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అటువంటి ఆహారాన్ని తినండి. అలాగే వర్షాకాలం వల్ల వచ్చే వ్యాధుల నుండి రక్షించబడుతుంది. మాన్‌సూన్‌లో డైట్‌లో ఏయే ఆహారాలు చేర్చుకోవాలి, ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో నిపుణుల నుండి తెలుసుకుందాం. కాలానుగుణ పండ్లను తినండి: బెర్రీలు, చెర్రీస్, బేరి, రేగు, పీచెస్, తాజా ఖర్జూరాలు, దానిమ్మ వంటి చాలా వర్షాకాల పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వాటిని తినడానికి ఉత్తమ మార్గం వాటిని కత్తిరించి తినడం. ఈ పండ్ల రసాన్ని తాగకుండా ఉండటం మంచిది. ఈ పండ్లన్నీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రంగురంగుల కూరగాయలు తినండి: పొట్లకాయ, చేదు, తిందా, పర్వాల్ వంటి కూరగాయలు వర్షాకాలంలో లభిస్తాయి. ఈ కూరగాయలతో పాటు టమోటా, ఓక్రా, ముల్లంగి, దోసకాయ, వంకాయ వంటి రంగురంగుల కూరగాయలను తినండి. అలాగే, డీప్ ఫ్రై చిప్స్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్‌ను ఆస్వాదించడానికి బదులుగా, కాల్చిన లేదా గాలిలో వేయించిన స్వీట్ పొటాటోలను తినండి. ఈ ఆహారాలు మీ ఆకలి, బరువు రెండింటినీ నియంత్రించడంలో సహాయపడతాయి. కషాయాన్ని సేవించండి: లవంగాలు, పసుపు, నల్ల మిరియాలు, దాల్చినచెక్క, అల్లం, జాజికాయ, ఏలకులు వంటి మూలికలు, సుగంధ ద్రవ్యాల కషాయాన్ని తయారు చేసి త్రాగాలి. కషాయం తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి బలంగా ఉండటంతో పాటు శరీరం కూడా వెచ్చగా ఉంటుంది. తీపి కోసం మీరు ఈ డికాషన్‌లో కొద్దిగా బెల్లం కూడా జోడించవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచే వాటిని తీసుకోండి: మీ ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరిని తీసుకోండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో కూడిన అవిసె గింజలు, బాదం పప్పులు, వాల్‌నట్‌లు వంటి సూపర్‌ఫుడ్‌లను తీసుకుంటే రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోండి: ఈ సీజన్‌లో వర్షాలు కురుస్తాయి. సీజన్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది, దీని కారణంగా దాహం తక్కువగా ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. పేగులో ఉండే బ్యాక్టీరియా వృద్ధిని నిరోధించడానికి, ఎక్కువ నీరు త్రాగాలి. బాగా వండిన ఆహారాన్ని తినండి: ఏదైనా బ్యాక్టీరియా సంక్రమణను నివారించడానికి ఆహార పదార్థాలను సరిగ్గా శుభ్రం చేయడం ముఖ్యం. మీరు ఉడికించిన అన్ని కూరగాయలను సరిగ్గా ఉడికించి తినండి. ఈ సీజన్‌లో పచ్చి కూరగాయల వినియోగాన్ని తగ్గించండి. (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.) ఇవి కూడా చదవండి Diabetes: టైప్-2 షుగర్ ఉన్నవారు ఇన్సులిన్ తీసుకోకుండానే ఇలా తగ్గించుకోవచ్చు.. పూర్తి వివరాలు మీ కోసం.. Health Tips: మీ వయసు 35 ఏళ్లు దాటుతోందా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. Eggs Side Effect: ఒక్క రోజులో ఎన్ని గుడ్లు తినాలి.. ఒక్కటి కంటే ఎక్కవ తీసుకుంటే జరిగే ప్రమాదం ఏంటంటే..
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక ప్రతి నిర్ణయం ఆచి తూచి తీసుకోవాలి. అప్పుడే కెరీర్ పై పైకి ఎదుగుతుంది. ఒక్క హిట్ సినిమా పడడంతో..నువ్వు తోపు..నిన్ను ఆపేవారు లేరు అంటూ ఎవరైన పొగిడేస్తే పొంగిపోయి..మన దగ్గరకు వచ్చిన ప్రతి డైరెక్టర్ చెప్పిన కధను ఊ కొట్టి..సైన్ చేస్తే..ఆ తరువాత కధ వేరేలా ఉంటాది. ఇక ఇలాంటి పనే చేసి ప్రస్తుతం దాని ఫలితాని అనుభవిస్తుంది కీర్తి సురేష్. సినీ ఇండస్ట్రీలోకి నేను శైలజ అనే మూవీ ద్వారా తెలుగు చిత్రపరిశ్రమలో కాళ్లు మోపిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసిన హిట్ టాక్ ను తెచ్చుకోలేకపోయాయి. అయితే ఆ టైంలో అమ్మడుని అదృష్టం వరించి..నాగ్ అశ్విన్ రూపంలో తలుపుతట్టింది. మహనటి సినిమాలో సావిత్రి గారి పాత్రకు select అయ్యింది. సినిమా తెరకెక్కించేటప్పుడు మహానటి మూవి హిట్ అవుతుంది అనుకున్నారు కానీ ..ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేయలేదట మేకర్స్. ముఖ్యంగా ఈసినిమా తరువాత కీర్తి రేంజ్ మారిపోయింది. సావిత్రి పాత్రలో ఆమె పర్ ఫామెన్స్ చూసి ఫిదా అయినా స్టార్ డైరెక్టర్స్ ఆమెకు బంపర్ ఆఫర్లు ఇస్తూ మంచి మంచి కధలను వినిపించారు. కానీ కీర్తి తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ..మంచి స్టోరీ లైన్ ఉన్న సినిమాలను మిస్ చేసుకుంది. ఇక అలా కీర్తి మిస్ చేసుకున్న సినిమాలు మిగత హీరోయిన్స్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కీర్తి ఒప్పుకుని చేసిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దానికి బెస్ట్ ఉదాహరణ.. శ్యామ్ సింగరాయ్. మొదటగా ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర కోసం కీర్తి ని సంప్రదించారట. కానీ ఆమె రజనీకాంత్ తో పెద్దన్న సినిమా కమిట్ అయ్యి ఉండటంతో..నాని సినిమాను రిజెక్ట్ చేసారట. రజనికాంత్ లాంటి లెజండ్ హీరోతో సినిమా చేస్తే తన దశ తిరిగిపోది అనుకునింది పాపం..కానీ సీన్ కట్ చేస్తే..బాక్స్ ఆఫిస్ వద్ద శ్యామ్ సింగరాయ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది..పెద్దన్న అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఆ తరువాత వచ్చిన సఖీ మూవీ కూడా పరమ చెత్త సినిమాగా టాక్ తెచ్చుకుంది. దీంతో ఒక్కసారిగా కీర్తి కెరీర్ మారిపోయింది. మరి చూడాలి అమ్మడు నెక్స్ట్ సినిమాలు అయిన గుడ్ లక్ తెస్తాయో లేదో..?
సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా, దర్శకుడిగా, హీరోయిన్ గా స్థిరపడాలని చాలా మంది అనుకుంటారు. అలా అనుకుని సినిమాల్లోకి వస్తే అవకాశాలు అంత సులువుగా అయితే లభించవు. తమ ప్రతిభను ప్రదర్శించేందుకు చక్కటి అవకాశం అయితే కావాల్సి ఉంటుంది. ఇక నాటకాల నుంచి వచ్చి సినిమాల్లో స్థిరపడ్డ వారున్నారు. sobhan babu shobhan babu అలా ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకున్న వారు చాలా మందే ఉన్నారు. ఎన్టీఆర్, చిరంజీవి, రవితేజ, నాని తదితరులు ఇండస్ట్రీలో ఎటువంటి అండ లేకున్నా తమ ప్రతిభతో తమకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్నారు. ఇక టాలీవుడ్ సీనియర్ హీరోలు..శోభన్ బాబు, కృష్ణ, మురళీ మోహన్ ముగ్గురూ ఒకే ఒక నాటకం ప్రభావం వలన ఇండస్ట్రీకి వచ్చారు. ఆ సంగతులు ఇక్కడ తెలుసుకుందాం. డిగ్రీ చదువుకునే విద్యార్థులు అయిన ముగ్గురు కలిసి ఒక నాటకం వేశారు. ఆ నాటకం పేరు ‘పునర్జన్మ’. కాగా, ఇది సూపర్ హిట్ అయింది. ఇందులో నటించిన వారు తర్వాత స్టార్ హీరోలు అయ్యారు. ఈ నాటకం సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సినిమా హీరోలు కావాలని వారు అనుకున్నారు. వారి కృషి వలన వారు చిత్రసీమ గర్వించే నటులయ్యారు. వారే శోభన్ బాబు, కృష్ణ, మురళీ మోహన్. ఆ ముగ్గురిలో శోభన్ బాబు దివంగతులయ్యారు. కాగా, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. వృద్ధాప్యం వలన కృష్ణ ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. మురళీ మోహన్ పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఒకే ఒక నాటకం ప్రభావం వలన ఈ ముగ్గురు స్టార్ హీరోలు తెలుగు చిత్ర సీమకు ఎంట్రీ ఇచ్చారన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. కానీ, అదే జరిగింది. అలా వీరు చిత్ర సీమలో తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకోవడం విశేషం.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల త్రీ టౌన్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ రామకృష్ణ పోలీస్ స్టేషన్ లోనే ఉరి వేసుకొని ఆత్మ... Breaking: ఏపీ మంత్రి జయరామ్ కు ఐటీ నోటీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరామ్ కు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆస్పరి మండలం చిన్న హోతూరు, పెద్ద హోతూరులో భూముల కొనుగోలుపై ... AP | నెత్తురోడిన రోడ్లు.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి కోడుమూరు, ఓర్వకల్ (ప్రభ న్యూస్‌): కర్నూలు జిల్లాలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చ‌నిపోయారు. విధి చిన్నచూపు చూడటంతో కా... Accident : ఆటో, బైక్ ఢీ.. ఒకరు మృతి రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందిన ఘ‌ట‌న కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం హుసేనాపురంలో చోటు చేసుకుంది. మండ‌ల సమీపాన ఉన్న బుగ్గ రామేశ్వర పాఠశాల... Breaking: కల్వర్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి కారు క‌ల్వ‌ర్టును ఢీకొని ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కోడుమూరు ద‌గ్గ‌ర కారు క‌ల్వ‌ర్టును ఢీక... పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ : ఎన్నికల అబ్జర్వర్ మురళీధర్ రెడ్డి కర్నూల్ : భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎలాంటి పొరపాట్లకు కూడా తావివ్వకుండా పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ చేయాలని ఎన్నికల అబ్జర్వర్ మురళీధ... రాజ్యాంగంలోని చట్టాలే ప్రజలకు రక్షణ కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకులు ఘ‌నంగా నిర్వ‌హించారు. 73వ భారత రాజ్యాంగ దినోత్సవం సంధర్బంగా శనివారం జిల్లా పోల... డీ కోటకొండ గ్రామంలోని సమస్యను పరిష్కరిస్తా : మంత్రి గుమ్మనూరు జయరాం ఆస్పరి: ఆస్పరి మండల పరిధిలోని డీ కోటకొండ గ్రామానికి డ్రైనేజీ సమస్య, రోడ్డు సమస్యకు రూ.10 లక్షలు, బి పత్తికొండ గ్రామానికి రూ.5 లక్షలు, గార్ల... Breaking: పోతిరెడ్డిపాడులో పోలీసుల నిర్లక్ష్యం.. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ లో యువకుడి మృత‌దేహం ఉంది. అయితే రెండు రోజులు... స్కూల్ బిల్డింగ్ నుండి కింద‌ప‌డ్డ విద్యార్థి.. ప‌రిస్థితి విష‌మం.. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని నంద్యాల గుడ్ షపర్డ్ స్కూల్ లో ప్రమాదం జ‌రిగింది. వశీకరన్ అనే విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పై నుండి క్రింద పడ... అవినీతి లేని పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు : అవినీతి లేని పాలన అందించడమే తమ పార్టీ ధ్యేయ‌మ‌ని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఈ సందర్భంగా నియోజ... బద్మాష్ చంద్రబాబూ, నువ్వు 2 లక్షల కోట్లు ఎలా సంపాదించావ్‌: మంత్రి జయరాం క‌ర్నూలు (ప్ర‌భ న్యూస్‌): రాష్ట్రాభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేద‌ని, పైగా రాయలసీమ పర్యటన పేరుతో ప్రజల్ని రెచ్చ‌గొట్టేలా చంద్ర‌బాబు ...
చిన్న పిల్లలతో ప్రయాణం సులభం కాదు. బ్యాగ్‌ని హ్యాండిల్‌ చేయాలో లేదా పిల్లల్ని హ్యాండిల్‌ చేయాలో అర్థం కాదు. మీరు పిల్లలతో ఒంటరిగా ప్రయాణి స్తున్నప్పుడు కష్టం మరింత పెద్దదిగా కనిపిస్తుంది. సాధారణంగా మహిళలు తమ బిడ్డతో ప్రయాణిం చేటప్పుటు చాలా ఇబ్బం దులను ఎదుర్కొంటారు. ఒంటరిగా యాత్రను ఆస్వాదించలేరు. ఒక తల్లిగా మీరు మీ పిల్లలతో ప్రయాణించే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు, తదనుగుణంగా మీ సన్నాహాలు గురించి తెలుసుకుందాం. పరిశోధన అవసరం: మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు అనే దాని గురించి మీ దగ్గర పూర్తి సమాచారం ఉంటే మంచిది. ఉదాహరణకు అక్కడి వాతావరణం, ఆహారం, పానీయాలు, విద్యుత్‌, నీటి వ్యవస్థ, భద్రత, సంస్కృతి మొదలైనవి. దీని కోసం మీరు ఇంటర్నెట్‌, స్నేహితుల సహాయం తీసుకోవచ్చు. పిల్లల స్నేహపూర్వక వాతావరణం గురించి తెలుసుకోండి. దానికి అనుగుణంగా మీ ప్యాకింగ్‌ చేయండి. బ్యాగ్‌లను తేలికగా ఉంచండి: ప్రయాణ సమయంలో మీ వద్ద తక్కువ సామాను ఉంటే ప్రయాణించడం సులభం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు స్మార్ట్‌ ప్యాకింగ్‌ చేయండి. అన్ని ముఖ్యమైన వస్తువులను కలిపి ఉంచడానికి ప్రయత్నించండి. ఓవర్‌ ప్యాకింగ్‌ను నివారించండి. ప్రయాణ సమయంలో పిల్లల కోసం ఒకటి లేదా రెండు అదనపు దుస్తులను తీసుకెళ్లండి. పిల్లల ఆహార పదార్థాలు, బొమ్మలు మొదలైనవాటిని చేతిలో ఉంచండి. స్నేహపూర్వక ప్రదేశం: హోటల్‌ను బుక్‌ చేస్తున్నప్పుడు దాని రివ్యూలను చదవండి. వీలైతే వాటి ఫోటోలను చూడండి. హోటల్‌ లేదా గది పిల్లల స్నేహపూర్వకంగా ఉందో లేదో తనిఖీ చేయండి. బూట్లు సౌకర్యవంతంగా ఉంటాయి: ప్రయాణ సమయంలో మీరు హీల్స్‌ లేదా స్టైలిష్‌ షూలకు బదులుగా స్పోర్ట్స్‌ షూలను ధరిస్తే అది మీకు సౌకర్యంగా ఉంటుంది.
త్రిగున్ బర్త్ డే సందర్బంగా “కిరాయి” ఫస్ట్ లుక్ & టైటిల్ ను లాంచ్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ చీకటి గదిలో చిలక్కొట్టుడు, 24 కిస్సెస్, డియర్ మేఘ, రీసెంట్ గా రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న “కొండ” చిత్రాలలో హీరోగా హీరోగా నటిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు త్రిగున్.తను తాజాగా నటిస్తున్న చిత్రం “కిరాయి”.SAY క్రియేషన్స్, ARK ఆర్ట్స్, సినీ ఫ్యాన్ విజన్, జయ పుత్ర ఫిల్మ్స్ పతాకంపై త్రిగున్ ప్రధాన హీరోగా V . R. K, దర్శకత్వంలో అమూల్య రెడ్డి యలమూరి, నవీన్ రెడ్డి వుయ్యూరు లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “కిరాయి”.గుంటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 1995 2003, 2020 లలో గుంటూరు, పల్నాడు లలో ఎక్కువగా కిరాయి హత్యలు జరిగేవి. ఈ హత్యల నేపథ్యంలో తెరకేక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ రోజు హీరో త్రిగున్ బర్త్ డే సందర్బంగా స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ “కిరాయి” చిత్రంలోని రస్టిక్, రగ్గడ్ గా ఉండే ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఈ సందర్బంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ..త్రిగున్ నాకు చాలా కాలం నుండి తెలుసు. తను చాలా ఎనర్జీటిక్ హీరో గతంలో లవ్, కామెడీ వంటి మంచి మంచి సినిమాలు చేశాడు.ఈ చిత్ర ఫస్ట్ లుక్ చూశాను చాలా బాగుంది. తను మొదటి సారిగా డిఫరెంట్ సబ్జెక్టు అట్టెంప్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. చిత్ర దర్శకుడుV. R. K,(రామకృష్ణ) మాట్లాడుతూ.. గుంటూరు, పల్నాడు లో ఒకప్పుడు ఎక్కువగా హత్యలు జరిగేవి.దాని ఆధారంగా మేము గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీస్తున్నాము. ఇందులో హీరో కిరాయి తీసుకోకుండా కిరాయిహత్య చేయవలసి వస్తుంది.అలా ఎందుకు చేయవలసి వచ్చింది. ఇలా వరుస హత్యలు ఎందుకు చేస్తారు. ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేదే ఈ కథ. ఇందులో హీరోగా నటించిన త్రిగున్ కు మంచి బ్రేక్ వస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా రష్ & ఫస్ట్ లుక్ చూసిన రామ్ గోపాల్ వర్మ గారు చాలా బాగుందని మెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమాకు మంచి టెక్నిసియన్స్ తో పాటు చక్కని ప్యాడింగ్ మంచి రోల్స్ లో నటిస్తున్నారు. ఇది యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా ఎదో రెండు ఫైట్స్ పెట్టి చుట్టేసే సినిమా కాదు. ఇందులో యాక్షన్ మాములుగా ఉండదు. ఒక ట్రాన్స్ఫారం బద్దలయితే ఎలా ఉంటుందో ఆలా హెవీ యాక్షన్ తో ఆడియన్స్ కు థ్రిల్ ఇవ్వ బోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది అన్నారు. చిత్ర నిర్మాత అమూల్య రెడ్డి యలమూరి మాట్లాడుతూ.. ఈ సినిమా కొరకు గుంటూరు సబ్ జైల్లో, చంచల్ గూడ, చర్లపల్లి జైల్లల్లో కిరాయి హత్యలు చేసే వారి గురించి director రీసెర్చ్ చేసిన తర్వాత వీళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు, నష్టాలు, భాధలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయని తెలుసు కొన్నాము. “కిరాయి” టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టైటిల్, పోస్టర్స్ హరీష్ శంకర్ గారికి వర్మ గారికి బాగా నచ్చాయని చెప్పారు. మరో నిర్మాత నవీన్ రెడ్డి వుయ్యూరు మాట్లాడుతూ..హై వోల్టేజ్ యాక్షన్ మూవీ లా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది.మా చిత్ర హీరో త్రిగున్ గారి బర్త్ డే అయినందున ఈరోజు డైరెక్టర్ హరీష్ శంకర్ గారు రస్టిక్, రగ్గడ్ గా ఉండే టైటిల్ ను రిలీజ్ చేశారు. వారికి మా ధన్యవాదాలు అని అన్నారు.
జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా? బీసీల పల్లకి మోస్తున్న జ‌న‌నేత సీఎం వైయ‌స్ జగన్‌ మళ్లీ వైయ‌స్‌ జగన్‌నే గెలిపించుకుందాం You are here హోం » టాప్ స్టోరీస్ » చంద్రబాబు వీధి రౌడీలా మాట్లాడుతున్నారు చంద్రబాబు వీధి రౌడీలా మాట్లాడుతున్నారు 17 Nov 2022 5:48 PM మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు పాఠశాలలు మూసివేశారని తప్పుడు ప్రచారం వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది కోవిడ్‌ సమయంలోనూ కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయి ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారని బాబు అనుకుంటున్నారు 8 రాష్ట్రాల్లో రాజధానిలో కాకుండా హైకోర్టులు వేరే ప్రాంతాల్లో ఉన్నాయి రాయలసీమలో కోర్టు పెడతామంటే వద్దంటున్నారు రాయలసీమకు చంద్రబాబు ఏం మేలు చేశారో చెప్పాలి అప్పులపైనా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు చంద్రబాబుతో పోలిస్తే మేం తక్కువ అప్పులే చేశాం తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు కర్నూలు పర్యటనలో వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. పాఠశాలలు మూసివేశామని, పరిశ్రమలు రాలేదని, ఉద్యోగాలు ఇవ్వడం లేదని, అప్పులు మేం మాత్రమే చేస్తున్నామని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కర్నూలు సభలో చంద్రబాబు చేసిన ఆరోపణలను మంత్రి బుగ్గన తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరిని బెదిరిస్తున్నారు?: కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబుగారి వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యకరం. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు సీఎంగా పని చేశానని తనే చెప్పుకుంటారు. ఈ రెండు రోజుల కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు చెప్పింది ఏమిటంటే, తనను గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటాను అని. మరి ఆయనను 2019లో ఓడించారు కదా? మరి ఇప్పుడు ఆయన ఎవరిని బెదిరిస్తున్నారు? ఏ రాజకీయ నాయకుడు అయినా ఏం చెబుతారు. తాను గతంలో ఏం చేశాను? మళ్లీ గెలిస్తే ఏం చేస్తాను అనేది చెబుతారు. అప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. నన్ను గెలిపిస్తే రాజకీయాల్లో ఉంటాను అంటే, ఎవరికి నష్టం? తులసీతీర్థం పోస్తే నేను బ్రతుకుతా. కాబట్టి మీరంతా తులసీ తీర్థం పోయాలని చెప్పడం. పచ్చి అబద్ధాలు. అసత్య ప్రచారాలు: చంద్రబాబుగారివి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు. 6 వేల స్కూళ్లు మూత. 4 లక్షల పిల్లలు బడి మానేశారని అన్నారు. అవి పచ్చి అబద్ధాలు. 73 ఏళ్ల వయస్సు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి అలా మాట్లాడొచ్చా? అంటే తానేం చెప్పినా ప్రజలు నమ్ముతారన్న అహంకారం. నిజానికి ప్రతి దానికి రికార్డులు ఉంటాయి కదా? నిజానికి 2017లో అప్పటి సీఎం చంద్రబాబుగారు 2906 స్కూళ్లు మూయించారు. అందులో 1759 ప్రైమరీ స్కూళ్లు కాగా, మిగిలినవి హైస్కూళ్లు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 42 లక్షల విద్యార్థులు ఉండగా, 2019 నాటికి ఆ సంఖ్య 37 లక్షలకు పడిపోయింది. 2019లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, విద్యా రంగంపై, ప్రభుత్వ స్కూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య మళ్లీ 42 లక్షలకు పెరిగింది. పారిశ్రామిక రంగం: అదే విధంగా తన హయాంలోనే రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చాయని చంద్రబాబు చెప్పుకుంటారు. కానీ వాస్తవాలు చూస్తే.. చంద్రబాబుగారి గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో భారీ, మధ్యతరహా పారిశ్రామిక రంగంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు మాత్రమే రాగా, కోవిడ్‌ సంక్షోభంలో, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి తలకిందులైన సమయంలో కూడా మా ప్రభుత్వ హయాంలో, పారిశ్రామిక రంగంలో ఏటా సగటున రూ.13,200 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ గణాంకాలన్నీ డిపీఐటీ (డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌) చెప్పినవే. ఇదీ వాస్తవం. ఉద్యోగావకాశాలు: ఇక ఉద్యోగాల గురించి కూడా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఆయన తన హయాంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చి, ఆ 5 ఏళ్లలో వాస్తవంగా ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34 వేలు మాత్రమే. అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి 2.10 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు మరో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వబోతున్నాం. అందులో 6511 పోలీసు శాఖలోనూ, 3673 కోర్టు శాఖలో. ఇవే కాకుండా ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు, వలంటీర్లు, ఆప్కాస్‌ ద్వారా ప్రతి నెలా కచ్చితంగా జీతాల చెల్లింపుతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇచ్చాం. అప్పట్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు వేతనాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కర్నూలు హామీలన్నీ గాలిలోనే..: చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ఆ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని కర్నూలులో నిర్వహించి ఎన్నెన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కోయిలకుంట్లలో సిమెంట్‌ ఉత్పత్తుల హబ్, న్యూక్లియర్‌ ఫ్యుయెల్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ఎఫ్‌సీ), ఆలూరులో జింకల పార్కు, శ్రీశైలంలో పులుల పార్క్, సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్లు, రైల్వే వ్యాగన్ల మరమ్మతుల వర్క్‌షాప్‌.. ఇలా ఎన్నో హామీలు ఇచ్చాడు. వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. అందుకే తెలుగుదేశం పార్టీ వారు, ఇవన్నీ తమ పార్టీ అధినేతను అడగాలి. నిజానికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే పరిశ్రమలు వచ్చాయి. సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్లు వచ్చాయి. అదే విధంగా హైదరాబాద్‌–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ వచ్చింది. మాకు సంస్కారం ఉంది: చంద్రబాబు తన హయాంలో రాయలసీమకు కానీ, కర్నూలుకు కానీ చేసిందేమీ లేదు. మొత్తం అన్యాయం తప్ప. నిజానికి రాయలసీమ వాసులు, కర్నూలు జిల్లా వాసులు సంస్కారవంతులు కాబట్టి, చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం లేదు. ఇది వాస్తవం. శ్రీబాగ్‌ ఒప్పందం తర్వాత, కర్నూలులో రాజధాని ఏర్పాటైంది. ఆ తర్వాత విశాలాంధ్ర ఏర్పాటు తర్వాత రాజధానిని 1956లో హైదరాబాద్‌కు తరలిస్తే, మా దగ్గర ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. అదే ఇవాళ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామంటే చంద్రబాబు వద్దంటున్నారు. ఉత్తరకోస్తా వెనకబడిన ప్రాంతం కాబట్టి, విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తామంటే కూడా విమర్శలు చేస్తున్నారు. దేశంలో చాలా చోట్ల, 8 చోట్ల హైకోర్టులు రాజధానుల్లో లేవు. చంద్రబాబు సిగ్గుపడాలి: శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామంటే కూడా అడ్డగిస్తున్నారు. ఇందుకు చంద్రబాబు సిగ్గుపడాలి. ఆయన రాయలసీమలో పుట్టినా, ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించడం లేదు. మద్యంపైనా అసత్యాలు: మద్యం డిస్టిల్లరీలు జగన్‌గారివా? ఇది కూడా పచ్చి అబద్ధం. నిజానికి చంద్రబాబు హయాంలోనే డిస్టిల్లరీలకు అనుమతి ఇచ్చారు. 20 డిస్టిల్లరీల్లో 14 డిస్టిల్లరీలకు చంద్రబాబే అనుమతి ఇచ్చారు. మిగిలినవి అంతకు ముందు నుంచి ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిల్లరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అయినా మా ప్రభుత్వంపై నిందలు వేస్తూ, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. మీరు ‘పాలనాయుడు’ అవుతారు: డోన్‌ నుంచి నేను అప్పుల మంత్రిని అని పదే పదే విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు. ఏ దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా అప్పులు చేసేది, ఆ ప్రక్రియలో పని చేసేది ఆర్థిక మంత్రి మాత్రమే. దేశంలో ఎవరూ అప్పులు చేయడం లేదా? మీ హయాంలో అప్పులు చేయలేదా? నిజానికి మా ప్రభుత్వ హయాంలో అప్పు ఏటా సగటున 15 శాతం మాత్రమే పెరిగింది. అదే మీ హయాంలో అప్పులు ఏటా సగటున 20 శాతం వంతున పెరిగాయి. మరి యనమల రామకృష్ణుడిని పెద్ద అప్పుల మంత్రి అనాలా? మీ హయాంలో అనేక పరిశ్రమలు మూతబడ్డాయి. మీ హయాంలో ఏపీ డైయిరీని నాశనం చేసి, హెరిటేజ్‌ను అభివృద్ధి చేసుకున్నారు. అప్పు చేసిన వారు ఒకవేల అప్పుల మంత్రి అయితే, మీరు పాలనాయుడు అవుతారు. మీరు లేచింది మొదలు అబద్దాలు చెబుతారు కాబట్టి, మిమ్మల్ని అబద్ధాల నాయుడు అనాలి. మీ వయసుకు తగినట్లు మాట్లాడుతున్నారా? మీకు పాలసీ ఉంటే, దానిపై మాట్లాడండి. ఇవాళ మీరెక్కడ ఉంటున్నారు: చంద్రబాబు ఎవరి ఇంటికో పోతే, మూడు రోజులకు ఆ ఇంటి ప్రహరీ కూలగొట్టామట. కాబట్టి నా ఇంటిని, నా జీవితాన్ని కూలుస్తానని అన్నాడు. చంద్రబాబుగారు ఏమి మాటిలివి? 14 ఏళ్లు సీఎంగా పని చేసిన నీవు, బహిరంగ సభలో అలా మాట్లాడతావా? ఆర్థిక మంత్రి ఇల్లును, నన్ను కూలుస్తానని అన్నావు. అయ్యా చంద్రబాబుగారు మా పూర్వీకులు 100 ఏళ్ల క్రితం, 1923లో మా ముత్తాతగారు కట్టారో, నేను మా ఊళ్లో అదే ఇంట్లో ఉంటున్నాను. అలాగే 100 ఏళ్ల తర్వాత నాకు సొంత ఇల్లు కూడా లేదు. నేను ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాను. అదే మీరు మీ సొంత ఊరు నారావారిపల్లెలో 1923లో మీ ఇల్లు ఎలా ఉంది? మరి ఈరోజు 100 ఏళ్ల తర్వాత మీరు ఎలాంటి భవనంలో ఉంటున్నారు. అంటే మీకు తెలివి ఎక్కువై, అంత సంపాదించుకున్నారా? మీరు మీ సొంత ఊరికి కనీసం ఏడాదికి ఒకసారి అయినా వెళ్తున్నారా? కానీ మేము కుటుంబ సభ్యులు అందరం కలిసే ఉంటున్నాం. అదే 100 ఏళ్ల క్రితం కట్టిన ఇంట్లోనే ఉంటున్నాం. రోడ్డు ఆక్రమిస్తే కూల్చడం తప్పా?: మేము ఎక్కడా ఇళ్లు కూల్చలేదు. డోన్‌లో పట్టణ ప్రణాళిక. 60 అడుగుల రోడ్‌ ఆ ప్రణాళికలో ఉంది. ఆ రోడ్‌లో ఆ లేఅవుట్‌కు సంబంధించిన ఒక ఫిర్యాదు కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)కు వచ్చింది. 2022, సెప్టెంబరు 22న ఫిర్యాదు వచ్చింది. అది ఏమిటంటే, ఆ 60 అడుగుల రోడ్‌ ఉన్న లేఅవుట్‌లో సెంటర్‌లో ఒక గోడ కట్టారని. 30 అడుగుల రోడ్‌తో ప్లాట్లు వేశారని. దీంతో కుడా అధికారులు ఈ ఏడాది అక్టోబరు 17న ఆ ప్రదేశాన్ని తనిఖీ చేసి, రోడ్డు మధ్య కట్టిన గోడ కూలగొట్టాలని. అక్టోబరు 26న నోటీసు ఇచ్చారు. ఆ తర్వాత ఆ నోటీసుకు అక్టోబరు 31న డెవలపర్‌ రిప్లై ఇచ్చారు. పాములు, తేళ్లు వస్తున్నాయి కాబట్టి, గోడ కట్టామని. అయితే అది నిబంధనలకు విరుద్ధం కాబట్టి, గోడ కూల్చాల్సిందే అని కుడా అధికారులు మరోసారి ఈ నెల 11న నోటీసు ఇచ్చారు. అయినా గోడను కూల్చకపోవడంతో, మొన్న 15వ తేదీన కుడా అధికారులు ఆ గోడ కూల్చేశారు. దీని తప్పు పట్టిన చంద్రబాబు, నాపై పిచ్చి విమర్శలు చేశారు. నా ఇల్లు కూలుస్తానని, నా జీవితాన్నే కూల్చేస్తానని అన్నారు. ఏమి మాటలివి? అంటే ఎక్కడ ఆక్రమణలు జరిగినా, చట్ట విరుద్ధంగా ఆక్రమించినా, ఎక్కడ రోడ్లు ఆక్రమించి గోడ కట్టినా, ప్లాట్లు చేసినా ఏమీ అనకూడదు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించినా ఏమీ అనకూడదు. పైగా నీతి సూక్తులు. ఎవరైనా ఇలా మాట్లాడతారా? నీ ఇంటిని కూలుస్తా. నీ జీవితాన్ని కూలుస్తా అంటారా?. జీవితాలు కూల్చడం ఆయనకు అలవాటు: చంద్రబాబుకు జీవితాలు కూల్చడం అలవాటు. తన మామ జీవితాన్ని, బావమరిది హరికృష్ణ జీవితాన్ని కూల్చేశాడు. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి. భాష, పద్ధతి మార్చుకోవాలి. మీ వయసుకు తగ్గట్లు వ్యవహరించండి. ఎప్పుడైనా, ఎక్కడైనా నిజాలు మాట్లాడండి. అబద్దాలు మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మబోరు. ఎంత నిజం ఉంటే అంతే మాట్లాడండి. దాన్నే ప్రజలు చూస్తారు. ఫ్రస్టేషన్‌లో కూరుకుపోయారు: రాజకీయాల్లో హుందాతనం ఉంటుంది. ప్రవర్తన అనేది ఉంటుంది. ఒక పద్ధతి ఉంటుంది. ఆ విధంగా ప్రవర్తించాలి కానీ, 73 ఏళ్ల వయసులో ఏమిటీ మాటలు? నా ఇల్లు కూల్చేస్తానని, నా జీవితాన్ని కూల్చేస్తానని.. ఏమిటా మాటలు? ఆశ్చర్యకరమైన భాష, అంతకు మించి అర్ధం లేని గణాంకాలు.. చంద్రబాబు మాటలు చూస్తుంటే, ఆయన ఫ్రస్టేషన్‌లో కూరుకుపోయినట్లు అనిపిస్తోంది. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
azərbaycanAfrikaansBahasa IndonesiaMelayucatalàčeštinadanskDeutscheestiEnglishespañolfrançaisGaeilgehrvatskiitalianoKiswahililatviešulietuviųmagyarNederlandsnorsk bokmålo‘zbekFilipinopolskiPortuguês (Brasil)Português (Portugal)românăshqipslovenčinaslovenščinasuomisvenskaTiếng ViệtTürkçeΕλληνικάбългарскиқазақ тілімакедонскирусскийсрпскиукраїнськаעבריתالعربيةفارسیاردوবাংলাहिन्दीગુજરાતીಕನ್ನಡमराठीਪੰਜਾਬੀதமிழ்తెలుగుമലയാളംไทย简体中文繁體中文(台灣)繁體中文(香港)日本語한국어 WhatsApp సంప్రదించండి WhatsApp Messenger Support To better assist you, contact us from your phone by opening WhatsApp > Settings > Help > Contact Us. You can also visit our సహాయ కేంద్రం for additional information. Let us know how you use WhatsApp by providing the necessary information below. Then, tap or click "Send Question" to contact us. ఫోన్ నంబర్ మీ WhatsApp అకౌంట్ కోసం మీరు ఉపయోగించే ఫోన్ నంబర్‌ను దయచేసి అందించండి. అంగోలా (+244)అండోరా (+376)అజర్‌బైజాన్ (+994)అమెరికన్ సమోవా (+1)అరుబా (+297)అల్జీరియా (+213)అల్బేనియా (+355)ఆంగ్విల్లా (+1)ఆంటిగ్వా (+1)ఆఫ్గనిస్తాన్ (+93)ఆర్జెంటినా (+54)ఆర్మేనియా (+374)ఆస్ట్రియా (+43)ఆస్ట్రేలియా (+61)ఇండోనేషియా (+62)ఇజ్రాయిల్ (+972)ఇటలీ (+39)ఇథియోపియా (+251)ఇరాక్ (+964)ఇరాన్ (+98)ఈక్వటోరియల్ గునియా (+240)ఈక్వడార్ (+593)ఈజిప్ట్ (+20)ఈస్టోనియా (+372)ఉక్రెయిన్ (+380)ఉగాండా (+256)ఉజ్బెకిస్తాన్ (+998)ఉత్తర కొరియా (+850)ఉత్తర మెరియానా దీవులు (+1)ఉరుగ్వే (+598)ఎరిట్రియా (+291)ఎల్ సాల్వడార్ (+503)ఐర్లాండ్ (+353)ఐల్ ఆఫ్ మాన్ (+44)ఐస్‌ల్యాండ్ (+354)ఓమన్ (+968)కజకిస్తాన్ (+7)కాంబోడియా (+855)కామెరూన్ (+237)కిరిబాతి (+686)కిర్గిస్తాన్ (+996)కుక్ దీవులు (+682)కువైట్ (+965)కెనడా (+1)కెన్యా (+254)కేప్ వర్దె (+238)కేమెన్ దీవులు (+1)కొమొరోస్ (+269)కొలంబియా (+57)కొసొవో (+383)కోట్ డివోయిర్ (+225)కోస్టా రికా (+506)క్యూబా (+53)క్యూరసావ్ (+599)క్రొయేషియా (+385)ఖతార్ (+974)గబాన్ (+241)గయానా (+592)గినియా (+224)గినియా-బిస్సావ్ (+245)గ్రీన్‌ల్యాండ్ (+299)గ్రీస్ (+30)గ్రెనడా (+1)గ్వాటెమాలా (+502)గ్వాడెలోప్ (+590)గ్వామ్ (+1)గ్వేర్నిసీ (+44)ఘనా (+233)చాద్ (+235)చిలీ (+56)చెక్ రిపబ్లిక్ (+420)చైనా (+86)జపాన్ (+81)జమైకా (+1)జర్మనీ (+49)జాంబియా (+260)జార్జియా (+995)జింబాబ్వే (+263)జిబౌటి (+253)జిబ్రాల్టర్ (+350)జెర్సీ (+44)జోర్డాన్ (+962)టర్కీ (+90)టాంజానియ (+255)టిమర్-లెస్టే (+670)టువలు (+688)టొకేలౌ (+690)టోంగా (+676)టోగో (+228)ట్యునీషియా (+216)ట్రినిడాడ్ మరియు టొబాగో (+1)డెన్మార్క్ (+45)డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (+243)డొమినికన్ రిపబ్లిక్ (+1)డొమినికా (+1)తజికిస్తాన్ (+992)తుర్క్‌మెనిస్తాన్ (+993)తుర్క్స్ మరియు కైకోస్ దీవులు (+1)తైవాన్ (+886)థాయ్‌ల్యాండ్ (+66)దక్షిణ కొరియా (+82)దక్షిణ సూడాన్ (+211)దక్షిణాఫ్రికా (+27)ది జాంబియా (+220)ది బహమాస్ (+1)నమీబియా (+264)నార్ఫోక్ దీవి (+672)నార్వే (+47)నికరాగువా (+505)నియూ (+683)నెదర్‌ల్యాండ్స్ (+31)నేపాల్ (+977)నైజర్ (+227)నైజీరియా (+234)నౌరు (+674)న్యూ కాలెడోనియా (+687)న్యూజిల్యాండ్ (+64)పనామా (+507)పపువా న్యూ గినియా (+675)పరాగ్వే (+595)పలావ్ (+680)పశ్చిమ సహారా (+212)పాకిస్తాన్ (+92)పాలస్తీన్ (+970)పెరూ (+51)పోర్చుగల్ (+351)పోలాండ్ (+48)ఫాక్‌ల్యాండ్ దీవులు (+500)ఫారో దీవులు (+298)ఫిజి (+679)ఫిన్‌ల్యాండ్ (+358)ఫిలిప్పీన్స్ (+63)ఫ్యూర్టో రికో (+1)ఫ్రాన్స్ (+33)ఫ్రెంచ్ గయానా (+594)ఫ్రెంచ్ పాలినేషియా (+689)బంగ్లాదేశ్ (+880)బల్గేరియా (+359)బహ్రెయిన్ (+973)బార్బడోస్ (+1)బురుండి (+257)బుర్కినా ఫాసో (+226)బెనిన్ (+229)బెర్ముడా (+1)బెలారస్ (+375)బెలిజ్ (+501)బెల్జియం (+32)బొనెయిర్, సింట్ యూస్టేషియస్ మరియు సబా (+599)బొలీవియా (+591)బోత్సువానా (+267)బోస్నియా మరియు హెర్జెగ్నోవినా (+387)బ్రిటిష్ వర్జిన్ దీవులు (+1)బ్రిటిష్ హిందూ మహాసముద్ర భూభాగం (+246)బ్రూనై (+673)బ్రెజిల్ (+55)భారతదేశం (+91)భూటాన్ (+975)మంగోలియా (+976)మకావ్ (+853)మడగాస్కర్ (+261)మయన్మార్ (+95)మయొట్ (+262)మలావి (+265)మలేషియా (+60)మాంట్సెరాట్ (+1)మారిటేనియా (+222)మారిషస్ (+230)మార్టినిక్ (+596)మార్షల్ దీవులు (+692)మాలి (+223)మాల్టా (+356)మాల్డోవా (+373)మాల్దీవులు (+960)మెక్సికో (+52)మేసిడోనియా (+389)మైక్రోనేషియా సమాఖ్య రాష్ట్రాలు (+691)మొజాంబిక్ (+258)మొనాకో (+377)మొరాకో (+212)మోంటెనెగ్రో (+382)యుఎస్ వర్జిన్ దీవులు (+1)యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (+971)యునైటెడ్ కింగ్‌డమ్ (+44)యునైటెడ్ స్టేట్స్ (+1)యెమెన్ (+967)రష్యా (+7)రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (+242)రీయూనియన్ (+262)రువాండ (+250)రొమేనియా (+40)లక్సెంబర్గ్ (+352)లాట్వియా (+371)లావోస్ (+856)లిథువేనియా (+370)లిబియా (+218)లీచ్‌టెన్‌స్టెయిన్ (+423)లెబనాన్ (+961)లెసోథో (+266)లైబీరియా (+231)వనౌటు (+678)వాటికన్ నగరం (+39)వాల్లిస్ మరియు ఫ్యూటునా (+681)వియత్నాం (+84)వెనిజులా (+58)శాన్ మారినో (+378)శ్రీలంక (+94)సమోవా (+685)సావో టామ్ మరియు ప్రిన్సిపె (+239)సింగపూర్ (+65)సింట్ మార్టిన్ (+1)సియెర్రా లియోన్ (+232)సిరియా (+963)సీషెల్స్ (+248)సురినామ్ (+597)సూడాన్ (+249)సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (+236)సెనెగల్ (+221)సెయింట్ కిట్టీస్ మరియు నెవిస్ (+1)సెయింట్ పియెర్రే మరియు మికెలాన్ (+508)సెయింట్ బెర్తలేమి (+590)సెయింట్ మార్టిన్ (+590)సెయింట్ లూసియా (+1)సెయింట్ విన్సెంట్ మరియు ది గ్రెనడీన్స్ (+1)సెయింట్ హెలెనా (+290)సెర్బియా (+381)సైప్రస్ (+357)సోమాలియా (+252)సోలోమన్ దీవులు (+677)సౌదీ అరేబియా (+966)స్పెయిన్ (+34)స్లొవేకియా (+421)స్లోవేనియా (+386)స్వాజిలాండ్ (+268)స్విట్జర్‌ల్యాండ్ (+41)స్వీడెన్ (+46)హంగేరీ (+36)హంగ్‌ కాంగ్ (+852)హైతి (+509)హోండురాస్ (+504)
మీ యొక్క ఆధార్ నెంబర్ తో మీ రేషన్ కార్డు ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకొనే వాళ్ళు వెబ్ చివర్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇 ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో పైన చూపుతున్న విధంగా హోమ్ బటన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపుతున్న విదంగా 👇 STATUS CHECK అనే ఆప్షన్ కింద ఉన్న PULSE SURVEY SEARCH అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మరొక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇 పైన చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో Enter Uidnumber అనే ఆప్షన్ పక్కన ఉన్న బాక్స్ లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క రేషన్ కార్డు డీటెయిల్స్ అనేవి షో కావటం జరుగుతుంది మీ ఆధార్ కార్డు నెంబర్ తో మీ రేషన్ కార్డు డీటెయిల్స్ ని కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి తెలుసుకోండి 👇
చాలా చిన్న చిన్న సంఘటనలు, మన కంటి ముందర జరుగుతూనే ఉంటాయి..అందులో మనం సహాయపడే విషయాలు ఉంటాయి అది మాట సహాయం లేదా ధన సహాయం ఏదైనా కావొచ్చు.. కానీ చాలా మంది అపుడు అసలు దాని గురించి పట్టించుకోకుండా కొంచెం సమయం గడిచాక అయ్యో నేను ఇలా అనవలసింది..నేను యిలా సహాయం చేయవలసింది అని మనసులో అనుకుంటారు...కానీ ఆ సమయంలో ఎందుకు స్పందించలేదు ఆంటే మాత్రం సరైన జవాబు ఉండదు.. మనిషిలో ఉండే ఒక అలసత్వం.. ఈ సారి చూద్దాంలే అనే మనిషి మనస్తత్వం.. ఒక అడుగు వెనకనే నిలపెడుతుంది. మనిషి మనస్తత్వం విషయంలో చిన్న పెద్ద అని కానీ, గొప్ప బీద అని కానీ ఉండదు.. ఎంతటి వారైన మనిషిలో తరవాత చూద్దాం అనే అలసత్వం ఉంటుంది.. అందుకు ఈ చిన్ని కథ ఒక మంచి ఉదాహరణ.. మంచిపనికి ఆలస్యం ఎందుకు.... ఒకసారి ధర్మరాజు కొలువుదీరి ఉండగా ఒక పేదవాడు వచ్చి తనకు ఉండడానికి ఇల్లు లేదని ప్రార్థిస్తాడు. అప్పుడు ఏదో అవసరమైన చర్చలలో ఉన్న ధర్మరాజు “రేపు రమ్మని” తప్పక సహాయం చేస్తానని అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఒక మూల నుండి ధర్మరాజు తో “ఓ మహానుభావా! సర్వజ్ఞా, సర్వాత్మస్వరూపా” అంటూ సంభోదిస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఇది విన్న ధర్మరాజు నిర్ఘాంతపోయి “బావా! ఏంటి అలా సంభోదించావు?” అని బాధపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు “మీరు అతన్ని రేపు రమ్మన్నారు. మరుక్షణం ఏమవుతుందో తెలియదు. అలాంటిది మీరు అతన్ని రేపు రమ్మన్నారంటే మీరు రేపటి వరకు బ్రతికి ఉంటారన్న విషయం మీకు తెలిసి ఉండాలి. అలాగే ఆ పేదవాడు కూడా రేపటివరకు బ్రతికి ఉంటాడని మీకు తెలిసి ఉండాలి. ఒక సర్వజ్ఞునికి మాత్రమే కదా ఇలాంటి విషయాలు తెలిసేది. అందుకే మిమ్ములను అలా సంభోదించాను” అన్నాడు. ఇది విని తన తప్పు తెలుసుకున్న ధర్మరాజు ఆ పేదవాడికి వెంటనే అతను కోరుకున్నది ఇచ్చి పంపాడు. సహాయం మాట అటు ఉంచుదాం మనం సహాయంపొందడం అంటూ జరిగితే.. దానికి కూడా మనం సరైన కృతజ్ఞత తెలుపాలనుకోము.. ఆ సమయంలో వీళ్ళు కాకుంటే ఇంకొకరు చేసేవాళ్ళు.. వాళ్ళు చేయకున్నా నేను ఇపుడు ఉన్న స్థితిలో ఉండేవాడిని అని తనను తానూ ఊరడించుకొనే మనస్తత్వం ఉండడమే ఒక కారణం కావొచ్చు.. మనం సహాయం అందుకున్నాక తిరిగి దానికి తగిన మూల్యం ఇంకో రూపంగా ఐనా చెల్లించాలి అన్న ఊహ కూడా కలగక పోవడంలో వింత ఏమి లేదు.. అందుకోవడంలో ఆనందం ఇవ్వడంలో నొప్పి ఉన్నంతసేపు ఇలాగే జరుగుతుంది. సహాయం పొందకుండా మనిషి మనుగడ కష్టం ..సహాయ సహకారాలు అన్నవి మానవ సంబంధాలకు పెట్టుబడిలాంటివి.. సహాయం అందుకోవడంలో చిన్న గొప్ప.. వీరుడు.. రాజు ఎవరైనా కావొచ్చు.. కానీ తిరిగి మూల్యం చెల్లించే వాడు మాత్రం గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న రారాజు అని ఒప్పుకోవొచ్చు.. అలాంటి వ్యక్తిని ఈ చిన్ని కథలో చదవండి.... సమయానికి మూల్యం చెల్లించగలమా.... శ్రీకృష్ణుడు భారతయుద్ద ఆరంభానికి ముందు ఒకరోజు కర్ణుడిని కలిసి "కర్ణా నీవు పాండవ తనయుడవు.. నీ సహోదరులు ఈ పాండవులు".. నీవు నిజము తెలియక దుర్యోధనుడితో స్నేహం చేసితివి ఇంతకాలం.. ఇప్పటివరకు అతనికి చేసిన సహాయం చాలు ఇక నీవు నీ తమ్ములతో కలసి నీ శత్రువులను ఓడించు అని పలికెను అపుడు కర్ణుడు స్వామీ! నీకు తెలియని సత్యము కాదు.. ఒంటరినై నించుని ఉన్నవేళ నా భుజము తట్టి నన్ను స్నేహితుడిగా గౌరవించి, నన్ను నలుగురిలో ఒకనిగా గౌరవము పొందుటకు అర్హుని కావించిన వాడు దుర్యోధనుడు.. ఆతను నాకు ఇచ్చిన రాజ్యం కంటే రెండింతలు రాజ్యం అతనికి ధారపోయడం వల్ల.. లేదా అతనితో కూడి స్నేహధర్మం పాటించి అతని విజయానికి తోడ్పాటు అందించడం వల్లనో నాకు చేసిన సహాయానికి ఋణం తీరిపోతుందని అనుకుందాము.. కానీ ఎప్పుడైతే నా మనసుకు ఊరడింపు కలిగించిన సమయం ఉందో.. నా మనసుని స్వాంతన పరచిన పలుకులు ఉన్నాయో వాటికి నేను ఎప్పటికి విలువ కట్టలేను.. నాలో ప్రాణం ఉన్నంత వరకు ధర్మ, అధర్మ అన్న వాటికంటే కూడా తగిన సమయంలో నన్ను స్వాంత పరచిన దుర్యోధనుడి పలుకులకే ఋణపడి ఉంటాను.. నేను సహాయం పొందిన ఆ క్షణమందే నన్ను నేను అతనికి సమర్పించుకున్నాను.." నన్ను క్షమించుము నేను నా సహోదరులతో స్నేహం నెరపలేను" అని శ్రీకృష్ణుడితో పలికెను.. సహాయం అందుకున్న సమయానికి మూల్యం చెల్లించిన నీ వ్యక్తిత్వానికి సాటి ఎవరు లేరు... నీ విలక్షణమైన వ్యక్తిత్వం ముందు నేను తలవంచుతున్నాను అని మనసున కర్ణుని కొనియాడాడు శ్రీకృష్ణుడు...
కె.పి.అశోక్‌ కుమార్‌ 'తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం' అన్న పుస్తకానికి ముందుమాట రాసిన ఎ.కె.ప్రభాకర్‌ తెలుగులో గొప్ప నవల రాలేదంటూ డా.కేశవరెడ్డి, బాలగోపాల్‌ అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు మన రచయితల మేధాస్థాయి, సృజనశక్తి సరిపోలేదని చెప్పుకోవటమే సరైన జవాబు భవిష్యత్తులో గొప్ప నవల వస్తే శ్రామిక వర్గం నుండి రావచ్చునేమోననిపిస్తుంది. శ్రామికుల కుండే జీవితానుభవం ఇతరులలో కనిపించకపోవడం ఒక కారణంగా భావిస్తున్నాను. 'తెలుగు నవల ప్రయోగ వైవిద్యం' వంటి విస్తృత ప్రాతిపదిక మీద పరామర్శించవలసి వచ్చే అంశాల మీద విమర్శనా వ్యాసాలు రాయదలుచుకున్న ఎవరికైనా విస్తృతమైన పఠనం తప్పనిసరి. తెలుగు ఆంగ్ల భాషలోని వేల పుస్తకాలను అధ్యయనం చేసిన అశోక్‌కుమార్‌కు ఇందుకు సంబంధించిన పూర్తి శక్తి స్థాయి సామర్థ్యాలున్నాయని భావించవచ్చు. 'అంపశయ్య నుంచి అంతస్సవంతి వరకు' అన్న వ్యాసంలో నవీన్‌ రాసిన అంపశయ్య, ముళ్ళపొదలు, అంతస్సవంతి అన్న మూడు నవలలు నవలాత్రయం అని ప్రతిపాదించారు అశోక్‌ కుమార్‌. ఇందుకు ప్రధానంగా నాలుగు కారణాలు చూపించారు. ఒకటి అంపశయ్యలోని నాయకుడు రవితో పాటు మరో నలుగురు వేణు, రమేష్‌, సాగర్‌, నిధి వారివారి మౌలిక స్వభావాలతో ఆ తర్వాతి రెండు నవలల్లో కొనసాగుతారు. వారంతా స్నేహితులు, ఒకే వయోవర్గం వారు. మూడు 'అంపశయ్య' లోని జీవన లక్షణమైన చైతన్య స్రవంతి అన్న మనోవైజ్ఞానిక లక్షణమే తరతమ భేదాలతో కొనసాగుతుంది. నాలుగు ఈ మూడు నవలల్లో కథాకాలం పదహారు గంటలే. ఈ నవలలోని జీవితం క్రమానుగతంగా వాస్తవికతకు దగ్గరవుతుంది. ''శిల్పం శిల్పం కోసమే' అన్న యాంత్రిక ధోరణిలో కాక ఆయా పాత్రల అంతరంగాల మీద వెలుతురును ఫోకస్‌ చేసే నిమిత్తమే అంపశయ్య నవీన్‌ చైతన్య స్రవంతి శిల్పాన్ని వాడుకున్నారని అశోక్‌కుమార్‌ అభిప్రాయం. 'కాలరేఖలు' నవలలో 1944 నుండి 1956 వరకు, 'చెదిరిన స్వప్నాలు' నవలలో 1927 నుండి 1970 వరకు, 'బాంధవ్యాలు' నవలలో 1970 నుండి 1995 వరకు ఉన్న జీవితాన్ని చిత్రించారంటున్నారు. తెలుగు సాహిత్యంలో రెండు సీక్వెల్‌ నవలలు, లేదా రెండు నవలాత్రయాలను రాసిన వారెవరూ లేరు. ఒక్క అంపశయ్య నవీన్‌ మాత్రమే పరిణత ప్రయోగాన్ని చేయటం ద్వారా నవలా సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. సత్యాన్ని గుర్తించి ప్రకటించటమే పరిశోధన. ఆ పని అశోకకుమార్‌ చేయగలిగారు. 'ఊబిలో దున్న' నవలతో విఖ్యాతి పొంది, ఆతర్వాత 'కమెండో' పత్రిక ద్వారా పేరు పొందిన వినుకొండ నాగరాజు ఆరు నవలలు రాశాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. సాహితీలోకం మరిచిపోయిన విషయాన్ని శీలావీర్రాజు గారి ద్వారా తెలుసుకొని పరిశోధన చేసి వివరాలు వెల్లడించి నందుకు నిజంగా అశోక్‌కుమార్‌ అభినందనీయులు. ఇంతకూ ఆ ఆరు నవలలు - 'నన్ను పిలిచింది' (1962), 'తాగుబోతు' (1962), 'ప్రేమికుడు' (1963) 'ఎంతదూరం' (1964) 'ఊబిలో దున్న' (1970) 'సువర్ణ' (అలభ్యం) ఉన్నాయి. వీటిలో 'ఊబిలో దున్న' నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి ప్రకటించింది. కాని రచయిత దాన్ని స్వీకరించలేరు. 'నన్ను పిలిచింది' నవల భారత్‌-చైనా యుద్ధ నేపథ్యంలో దేశభక్తిని చాటుకునే వ్యక్తుల మనస్తత్వాలను, త్యాగాలను ప్రధానంగా ప్రకటించిన నవల. 'తాగుబోతు' నవల తాగుబోతు అయిన మాదిగ లింగడి స్వగతం. పొద్దున లేచింది మొదలు పడుకునే దాకా ఆయన దినచర్య ఇది. అతనికి ఎదురయ్యే కష్టనష్టాలు అవమానం, ఆవేదన వీటన్నిటి సమాహారమే ఈ స్వగతం. ఇతర మనోవైజ్ఞానిక లక్షణాలతో పాటు, అంతర్ముఖీన ప్రవృత్తి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయినా రచయిత ఈ నవలను మనో వైజ్ఞానిక నవలగా భావించలేదు. 'ఊబిలో దున్న' నవల ఊబిలో చిక్కుకున్న దున్నపోతు పై జాలి దలచి రాఘవయ్య ప్రాణాలకు తెగించి రక్షించి పైకి తీస్తాడు. అది అతణ్ణి కుమ్మటానికి వస్తే తప్పించుకుంటాడు. స్థూలంగా ఇందులోని ఇతివృత్తమిది. మనోవైజ్ఞానిక నవలల్లో కాని, ఆ లక్షణానికి దగ్గరగా ఉన్న నవలల్లో కాని కథ పెద్దగా ఉండదు, దున్నపోతును రక్షించేందుకు రాఘవయ్య చేసే రకరకాల ప్రయత్నాలు వీటితో పాటు తన జీవితపు ఘటనలు, అనుభవాలు అనుసంధానమై చిత్రితమవుతాయి. అశోక్‌ కుమార్‌ పరిశీలనలో - చైతన్యానికి రాఘవయ్య, జడత్వానికి దున్నపోతు, రక్తం పీల్చే జలగలకు బ్లాక్‌ మార్కెటీర్లు, కోర్టు గుమాస్తాలు, డాక్టర్లు - ప్రతీకలుగా తేలుతారు. 'ఊబిలో దున్న'ను పాక్షికంగా మాత్రమే మనోవైజ్ఞానిక లక్షణాలున్న సామాజిక నవలగా అశోక్‌ కుమార్‌ భావిస్తున్నారు. 'ఊబిలో దున్న' నవలకు 'ఎర్నెస్ట్‌ హెమింగ్వే' ఓల్డ్‌ మాన్‌ అండ్‌ ద సీ' నవలకు మధ్య పోలికలున్నాయని అంటున్నప్పుడు అశోక్‌కుమార్‌లోని, తులనాత్మక పరిశీలనాశక్తి వెల్లడవుతుంది. మొత్తం మీద వినుకొండ నాగరాజు నవలలన్నీ ప్రయోగాత్మకాలేనని, ఒక నవలకు మరోనవలకు పోలిక లేదని అశోక్‌ కుమార్‌ భావిస్తున్నారు. డా. ఎం.వి. తిరుపతయ్య ఎమర్జెన్సీలో మానసికమైన వేదనకు గురైన రచయిత. అతడనుభవించిన రంపపు కోతను అంపశయ్య నవీన్‌ 'చీకటి రోజులు' పేరిట రాసిన ఒక నవలలో చిత్రీకరించారు. ఎంవి. తిరుపతయ్య రచించిన రెండునవలలు ప్రసిద్ధి పొందినవే, బతుకు (1987) అన్నవారి తొలి నవలకు ఒక మాసపత్రిక బహుమతి ప్రకటించింది. ఆ తర్వాత 'జీవనసమరం' అన్న నవలను రచించారు. ఈ రెండు నవలల్లోనూ వర్గ సంఘర్షణను గుర్తించారు అశోక్‌ కుమార్‌. 'బతుకు' నవలలో రాజ్యహింసను తట్టుకోలేక ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అవుతున్న దారుణ పరిస్థితిలో రామలింగం కుటుంబం సొంత ఊరును వదిలి వలసపోవటం అనే కలచివేసే దుస్థితికి అద్దం పడుతున్నది. ప్రధానంగా వ్యవస్థను ప్రశ్నిస్తున్న శ్రామికవర్గానికి చెందిన యువకులు లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఫలితంగా చెలరేగిన అంతర్‌ బహిర్‌ సంఘర్షణ ఈ నవలలో చిత్రితమైందని అశోక్‌ కుమార్‌ గుర్తించారు. ఇక రెండో నవల 'జీవన సమరం' (2006) ఎం.వి. తిరుపతయ్య క్యాన్సర్‌ బారిన పడ్డ తర్వాత రాసిన నవల. ఈ నవలలో కూడా వర్గ సంఘర్షణ రాజ్యహింసలకు సంబంధించిన వస్తువే కనిపిస్తున్నది. అయితే నందు అనే పిల్లవాడి దృక్కోణం ప్రధానంగా చిత్రితమైంది. అయితే అశోక్‌ కుమార్‌ దృష్టిలో ఇది తెలంగాణ సాంస్కృతిక జీవితాన్ని బాగా చిత్రించిన నవల. కథలు, నవలలు రాస్తున్న ఈ తరం రచయిత్రులలో 'గీతాంజలి' చెప్పుకోదగ్గవారని, వారు అభ్యుదయ మార్క్సిస్ట్‌ దృకోణంలో ఒక డాక్టర్‌గా అందిస్తున్న సేవలు ప్రత్యేకమైనవని అశోక్‌ కుమార్‌ అంటున్నారు. గీతాంజలి రచించిన 'ఆమె అడవిని జయించింది' నవలను గూర్చి ప్రస్తావించే ముందు అశోక్‌ కుమార్‌ ఎమర్జెన్సీ తర్వాత స్త్రీవాద ఉద్యమం ప్రారంభమయ్యే మధ్య కాలంలో రూపుదిద్దుకున్న భావజాలం గూర్చి 'కుటుంబం, రాజ్యం అన్ని వ్యవస్థలు స్త్రీకి వ్యతిరేకంగా ఎలా పని చేస్తాయో అర్థం కాసాగింది. తత్ఫలితంగానే స్త్రీల సమస్యలకు మార్క్సిస్ట్‌ జీవితాచరణ నుండి పరిష్కారం లభిస్తుందన్న చైతన్యంతో ప్రారంభమైన ఈ కాలపు స్త్రీల సాహిత్యం, సమస్త పితృస్వామిక వ్యవస్థలను ధిక్కరించి స్త్రీ స్వతంత్ర ప్రతిపత్తి నిలుపుకోవటానికి ఎన్నుకునే జీవనవిధానం నుండి పరిష్కారం లభిస్తుందన్నంత వరకు మారుతూ వచ్చింది' అని అనటమే కాక ఈ నవలను స్త్రీకి సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా చర్చించిన తొలి స్త్రీవాద నవలగా కూడా అశోక్‌ కుమార్‌ గుర్తిస్తున్నారు. కథారచనలో ఆరితేరిన పెద్దింటి అశోక్‌ కుమార్‌ రాసిన 'జిగిరి' నవలిక విలక్షణతను బాగా విశ్లేషించారు, కె.పి. అశోక్‌ కుమార్‌. ఆటవికమైన కర జంతువు ఎలుగు బంటి మనిషి శిక్షణలో సాధు జంతువుగా మారిపోతుంది. మనిషి అదుపు ఆజ్ఞల్లో ఉంటూ ఆడమన్నట్టు ఆడుతూ ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. క్రమశిక్షణతో పాటు కొంత మానవత్వం కూడా అలవడు తుంది. ఆ క్రమంలో వచ్చిన సమస్యలను సంఘర్షణ లను పెద్దింటి అశోక్‌కుమార్‌ హృద్యంగా చిత్రించాడంటున్నారు కె.పి. అశోక్‌కుమార్‌. యజమాను రాలు తన ఏడాది కొడుక్కు ఒక రొమ్ము, పిల్ల ఎలుగు బంటికి ఒక రొమ్ము పాలను ఇచ్చి పెంచు తుంది. ఇది జంతువు పట్ల మాన వత్వం ప్రదర్శించటమే. అయితే సర్కారువారు నిరుపేదలకు రెండెకరాల భూమి ఇచ్చే పథకంలో ఈ కుటుంబాన్ని కూడా చేర్చేస్తారు. ఎలుగుబంటిని పెంచుకుని ఆడిస్తే అది వన్యప్రాణి చట్టానికి వ్యతిరేకమవుతుంది కనుక దాన్ని వదులుకునే ప్రయత్నంలో ఎంతో సంఘర్షణకు గురవుతారు. సాధు జంతువుగా మారిన ఎలుగుబంటిని అడవిలోకి తరిమేస్తే అది సాటి జంతువులతో పాటు సహజంగా ఉండలేదు. దానికి ఆటవిక సమాజం కాదు, కావలసింది మానవ సమాజం. ఆటవిక జంతువులు దాన్ని ఉ ండనీయవు. ఈ పరిస్థితి దానికి ప్రాణాంతకం కాక తప్పదు. అందుకే ఎలుగును పెంచి పెద్ద చేసిన యజమాని దాన్ని అడవిలో చంపేసి రావటానికి తీసుకువెళ్తాడు. కాని యజమాని గాని ఎలుగు గాని మానవ సమాజంలోకి తిరిగి రారు! ఈ ఆశ్చర్యకరమైన ముగింపు మనిషీ మృగమూ ఏర్పరచుకున్న ప్రేమానుబంధాల మూలంగా ఆ ఇద్దరూ ఒకే రకమైన పర్యవ సానాన్ని ఏర్పరచుకోక తప్పలేదన్న సత్యాన్ని వెల్లడించిందన్నది విమర్శకుని భావన. దేవులపల్లి కృష్ణమూర్తి రచించిన తొలి నవలను గూర్చిన వ్యాసం 'ఆత్మకథలో నవలా లక్షణాలు అన్నది 'ఊరువాడ బతుకు పరిశీలన.' బాల్యంలోని సార్వజనీన అంశా లను కధానాయకునికి వర్తింపజేయటం మూలంగాకృష్ణమూర్తి తమ బాల్యానికి కాల్పనికతను సాధించగలిగారన్నది అశోక్‌ కుమార్‌ భావన. గీతాలు సంస్కృతిపరంగా, నవలా ప్రక్రియకు ఒక చేర్పు. వచనము, పాటల సమ్మేళనం ఒక మంచి ప్రయోగం కాగలిగిందని భావిస్తున్నారు అశోక్‌ కుమార్‌, రైతాంగ పోరాటం సమసి పోయిన తర్వాత భూస్వాముల్లో మార్పు వచ్చి గ్రామంలో ఉన్న ఆర్థికంగా తక్కువ స్థాయి శ్రామికులతో సంస్కారంతో ప్రవర్తించి ఉంటారని సాధారణంగా అనుకునే అవకాశం ఉంది. కాని అది తప్పని, వారి దాడులు కొనసాగుతూనే వచ్చాయన్న కఠిన సత్యాన్ని ఈ నవల వేనోళ్ళ చాటుతుందని, ఒక్క కుటుంబం తప్ప తక్కిన కుటుంబాలు వేరే ఊళ్ళకు వలసపోవటమే ఇందుకు నిదర్శనమని విమర్శకుని భావన. తెలంగాణ జీవితాన్ని సాధారణంగా నల్లగొండ జిల్లా జీవితాన్ని ప్రత్యేకంగా చిత్రించిన నవల ఇది. ప్రముఖ కథకుడు, నవలా రచయిత సలీం రచించిన 'వెండిమేఘం'ను తొలి తెలుగు మైనారిటీ నవలగా గుర్తిస్తున్నారు అశోక్‌ కుమార్‌. ఒక మైనారిటీ రచయిత మైనారిటీ వర్గ సమస్యలను వస్తువుగా తీసుకొని నవల రాసిన విషయాన్ని గమనంలోకి తీసుకుంటూనే, అదివర వచ్చివున్న మైనారిటీ సమస్యలు వస్తువుగా ఉన్న రచనలను అశోక్‌ కుమార్‌ ప్రస్తావించటం మంచి పద్ధతి, రాసినవారు ముస్లిమేతరురైతే ముస్లింల పట్ల వారి వైఖరి ఎట్లా ఉందో చూడమంటారు విమర్శకుడు. ఈ అంశం మీద కవిత్వం, కథలు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో సలీం 'వెండిమేఘం' నవలను పరిశీలించాలంటున్నారు. ప్రధానంగా దూదేకుల వారి దయనీయ జీవితాన్ని సమగ్రంగా చిత్రించిన నవలగా 'వెండిమేఘం' గుర్తించాలని కూడా అంటున్నారు. ఇంకా ఈ గ్రంథంలో చాలా వ్యాసాలున్నాయి. ఎక్కడ కొత్తదనంతో కూడిన ప్రయోగం ఉందో గ్రహించి ఆ నవలలో దాని పాత్రను గ్రహించటంలో అశోక్‌ కుమార్‌ కృతకృత్యు లయ్యారు. అవసరమైన చోట తులనాత్మక విమర్శా పద్ధతిని అవలంబించారు. రచయితలో ప్రయోగాన్ని నవలలోని ఏ పార్శ్వంలోనైనా చేయవచ్చు. కొందరు కథాకథనంలో, కొందరు పాత్రపోషణలో, మరికొందరు మనోవైజ్ఞానిక లక్ష ణాన్ని అన్వయించటంలో, ఇంకొందరు జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించుకోవటంలో ప్రయోగాలు చేయవచ్చు. సరిగ్గా ఆ కీలకాన్ని గ్రహించి క్రమ పరిణామశీలంలో భాగంగా దాన్ని నిరూపించటంలో అశోక్‌కుమార్‌ ప్రదర్శించిన విమర్శనాత్మక ప్రతిభ అభినందనీయం.
thesakshi.com : ఏలూరు జిల్లాలోని మద్దూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో బుధవారం రాత్రి భారీ ఫైర్ ఆక్సిడెంట్ చోటుచేసుకుంది. పోరస్ రసాయన పరిశ్రమలోని యూనిట్ 4లో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఆరుగురు మృతిచెందారు. ఘటనా స్థలంలోనే అయిదుగురు సజీవదహనం అయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. బాధితులను మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకువెళ్లారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దీంతో అగ్ని ప్రమాదం జరిగిన కొంతసేపటి తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో షిఫ్ట్ లో 150 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు ఎస్పి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ రసాయన పరిశ్రమలో ఔషధాల్లో వాడే పొడిని తయారు చేస్తున్నట్లు సమాచారం. పోరస్ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. – మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. – మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించారు.
న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా స్వచ్ఛంద కార్యకర్తల అరెస్టులపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార‍్కండేయ కట్జూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌ రవికిరణ్‌ అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. సోషల్‌ మీడియా స్వచ్ఛంద కార్యకర్తల అరెస్ట్‌ రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన ట్విట్టర్‌ అకౌంట్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కార్టూన్లు అనేవి భావ స్వేచ్ఛ ప్రకటనలో ఓ భాగమని కట్జూ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉందని ఆయన అన్నారు. ఆర్టికల్‌ 19 (1) ఏ కింద ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అన్నారు. ప్రజాస్వామ్య విధానంలో రాజకీయవేత్తలను విమర్శించే హక్కు ప్రజలకు ఉందని, ఇక్కడ ప్రజలే ప్రభువులని కట్జూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీరు అనాగరికం, అప్రజాస్వామికమని, ఏపీ ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సర్కార్‌పై ఆర్టికల్‌ 356 ప్రయోగించాలని అని కట్జూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఆయన లేఖ రాశారు. View image on Twitter Follow Markandey Katju @mkatju I appeal to @RashtrapatiBhvn @PMOIndia to dismiss the @ncbn govt over the unconstitutional arrest of cartoonist Ravi Kiran under Article 356
అర్హతలకు సంబంధించి రెగ్యులర్ ప్రాతిపాదికన నియమించే ఈఉద్యోగాలకు కనీసం పదో తరగతి విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు చేసుకునే ఉద్యోగానికి సంబంధించి వృత్తి నైపుణ్యం ఉండాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తే� టాప్ 10 వార్తలు HCU Prof Ravi Ranjan Suspend: థాయ్‌లాండ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం .. HCU ప్రొఫెసర్ రవిరంజన్ సస్పెండ్ Man Killed Woman : ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన వ్యక్తి Gold Coins Found : పొలంలో పైపులైన్ తవ్వుతుండగా.. పురాతనకాలం నాటి బంగారు నాణాలు లభ్యం RamCharan : ఫ్యూచర్ అఫ్ యంగ్ ఇండియా అవార్డు అందుకున్న రామ్ చరణ్ South Africa ‘Phala Phala farmgate’Scam : ‘తేలుకుట్టిన దొంగలా’ తయారైన దేశాధ్యక్షుడు పరిస్థితి..కుంభకోణంతో కూడబెట్టిన సొమ్మును దోచేసిన దొంగలు.. Chiranjeevi : చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ రక్తదానం.. మెగాస్టార్ అభిమానులు ఉన్న ప్రతిచోట బ్లడ్ బ్యాంక్ ఉన్నట్టే.. Sundar Pichai Padma Bhushan Award : గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు పద్మభూషణ్ అవార్డు.. అమెరికాలో ప్రదానం చేసిన భారత రాయబారి RRR : రాజమౌళికి మరో హాలీవుడ్ అవార్డు.. Assam : హిందువులు వివాహేతర సంబంధాలు పెట్టుకుని పెళ్లి ఆలస్యంగా చేసుకుంటారు..అందుకే వారికి పిల్లలు తక్కువ ఉంటారు : అసోం ఎంపీ బద్రుద్దీన్ Unstoppable : సమంత గురించి ఈ స్టార్ ప్రొడ్యూసర్స్ ఏమన్నారో తెలుసా?? ట్రెండింగ్ వార్తలు SpiceJet Plane Emergency Landing : స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం.. కొచ్చి ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ HIV Vaccine Clinical Trials : హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌లో అభివృద్ధిలో ముందడుగు.. తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ సక్సెస్ Heart Attack Driver Died : బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు.. స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచారు
Indian Recipes That You Can Make In Just 30 Minutes: మీరు కేవలం 30 నిమిషాల్లో తయారు చేయగల 7 భారతీయ కూరలు. ఈ వంటకాలు బిజీగా లేదా సోమరితనం ఉన్నవారికి సరైన ఎంపికలు. తనిఖీ చేయండి. లాక్డౌన్ సమయంలో, వంట అనేది మనలో చాలా మందికి వినోదానికి సరైన రీతి. ఏదేమైనా, జనాభాలో ఎక్కువ భాగం, ఇంటి నుండి తీవ్రమైన పనితో గారడీ చేసేటప్పుడు భోజనం వండటం చాలా డిమాండ్ చేసే పని. పరిమిత వనరులు మరియు చేతిలో సమయం ఉన్నందున, కొన్నిసార్లు ప్రజలు భోజనం నుండి తప్పుకుంటారు లేదా రెస్టారెంట్ల నుండి క్రమం తప్పకుండా ఆర్డర్ చేస్తారు, ఈ రెండూ దీర్ఘకాలంలో మంచి ఆలోచనలు కావు. కేవలం 30 నిమిషాల్లో ఇంటి ఆహారం యొక్క అన్ని వెచ్చదనం మరియు మంచితనాన్ని ఇచ్చే కొన్ని వంటకాలను మేము మీకు చెబితే? అవును, మీరు సరిగ్గా చదవండి. పనిలో బిజీగా ఉన్న వారంలో మీరు ఆస్వాదించగల అటువంటి భారతీయ వంటకాల జాబితా మా వద్ద ఉంది. Indian Recipes That You Can Make In Just 30 Minutes మీరు కేవలం 30 నిమిషాల్లో తయారు చేయగల 7 భారతీయ వంటకాలు ఇక్కడ ఉన్నాయి: సాంబార్ ఇన్ ఎ మైక్రోవేవ్ సాంబార్ వంటి సాంప్రదాయ వంటకాలకు మీ అవిభక్త శ్రద్ధ మరియు సమయం అవసరమని మీరు అనుకుంటే, మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు మేము ఇక్కడ ఉన్నాము. అనేక గృహాలలో ప్రధానమైన ఐకానిక్ దక్షిణ భారత కూర – కొన్నిసార్లు మూడు భోజనాలకు కూడా – ఈ సులభమైన రెసిపీని ఉపయోగించి మైక్రోవేవ్‌లో తయారు చేయవచ్చు. మరియు మేము వాగ్దానం చేసినట్లుగా, మీకు కేవలం 30 నిమిషాల్లో ఓదార్పు మరియు రుచిగల సాంబార్ గిన్నె ఉంటుంది. టొమాటో పన్నీర్ 30 నిమిషాల లోపు భారతీయ కూరను రుచులు మరియు జింగ్‌తో కూడా లోడ్ చేయవచ్చు మరియు ఈ రెసిపీ దీనికి రుజువు. కాటేజ్ చీజ్, టొమాటో హిప్ పురీ, తేలికపాటి సుగంధ ద్రవ్యాలు మరియు ఆలివ్ ఆయిల్ వంటి పదార్ధాల మంచితనంతో టొమాటో పన్నీర్ నిండి ఉంటుంది. మంచి భాగం ఏమిటంటే ఇది తక్కువ కేలరీల వంటకం. ఈ వంటకాన్ని ప్రయత్నించడానికి మీకు ఏమైనా మంచి కారణం అవసరమా? ఆలు తమటార్ కా Jhol: బంగాళాదుంపలు మరియు టమోటాలు ప్రపంచవ్యాప్తంగా ప్యాంట్రీలలో స్థిరమైన స్థానాన్ని కలిగి ఉన్న పదార్థాలు. కాబట్టి, మీ కిరాణా సంచిని చూడటానికి మీరు ఇబ్బంది పడలేని పరిస్థితిలో మిమ్మల్ని మీరు కనుగొంటే, ఈ రెసిపీ మీ రక్షణకు రావచ్చు. మీరు సాహసోపేత అనుభూతి చెందుతుంటే, మేము రెసిపీలో సూచించినట్లు మీరు వేయించిన పన్నీర్‌ను డిష్‌లో చేర్చవచ్చు. గ్రీన్ ఫిష్ కర్రీ: 30 నిమిషాల కాలపరిమితిలో శాఖాహార వంటకాలు మాత్రమే తయారు చేయవచ్చని మీరు అనుకుంటే, మీ కోసం మాకు వార్తలు ఉన్నాయి. మనోహరమైన ఆకుపచ్చ చేపల కూర మీరు అరగంటలో బాగా తయారు చేయగల వంటకం మరియు దాని రుచి మీరు బహుళ సహాయాల కోసం మాత్రమే చేరుతుంది. Indian Recipes That You Can Make In Just 30 Minutes వెన్న పన్నీర్: వెన్న పన్నీర్ ఒక ప్రసిద్ధ భారతీయ కూర, ఇది దేశవ్యాప్తంగా వివిధ శైలులలో పునర్నిర్మించబడింది. కానీ ఇది చాలా కాలంగా ఉన్నందున అది తయారు చేయడం కఠినంగా ఉండాలి అని కాదు. ఈ సరళమైన వంటకం మీకు ఎప్పుడైనా వెన్న పన్నీర్ యొక్క పైపింగ్ వేడి గిన్నె ఉందని నిర్ధారిస్తుంది. క్రీము గ్రేవీని బియ్యం లేదా రోటిస్‌తో బాగా ఆనందిస్తారు. కుక్కాడ్ ol ోల్: మీరు కోడి ప్రియులందరూ, మీ కోసం మాకు ప్రత్యేకమైనది ఉంది. ఈ చికెన్ రెసిపీ రెండు ప్రత్యేక భారతీయ వంటకాల మంచితనాన్ని మిళితం చేస్తుంది. కుక్కాడ్ h ోల్ బెంగాలీ ఆహారం యొక్క గొప్పతనాన్ని మరియు పంజాబీ వంటకాల యొక్క ఇర్రెసిస్టిబుల్ రుచులను కలిపిస్తుంది. మరియు దీనిని అరగంటలో ఉడికించాలి. మాకు విజేత ఉంది, ఏమి చెప్పాలి? చేపాలా ఇగురు (ఫిష్ కర్రీ): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చేపాలా ఇగురు సరైన స్పైసి ఫిష్ కర్రీ రెసిపీ, మీరు కొంచెం తెల్ల బియ్యంతో జత చేసి రోజుకు పిలుస్తారు. డిష్ యొక్క గొప్ప రుచులు చాలా తక్కువ పదార్ధాలను ఉపయోగించి సృష్టించబడతాయి, ఇది ‘అండర్ 30 నిమిషాల’ రెసిపీని కూడా చేస్తుంది. కూరను కొన్ని కొత్తిమీరతో అలంకరించాలని మేము సిఫార్సు చేస్తున్నాము ఏడు రుచికరమైన శాఖాహారం మరియు మాంసాహార కూర ఎంపికలతో క్షణంలో తయారు చేయవచ్చు, మీరు ఈ వారం తిరిగి కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. మీరు మొదట ఏ రెసిపీని ప్రతిబింబించబోతున్నారో మాకు చెప్పండి.
వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మొత్తం 10,028 ఖాళీల నియామకాలను అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఒకట్రెండు రోజుల్లోనే తొలి ప్రకటన.. తొలుత 1,326 వైద్యుల ఖాళీలకు..! తర్వాత వారం వారం నోటిఫికేషన్లు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి 20ు వెయిటేజీ నర్సు ఖాళీలకు రాత పరీక్ష: హరీశ్‌రావు హైదరాబాద్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మొత్తం 10,028 ఖాళీల నియామకాలను వైద్యారోగ్య సేవల నియామక బోర్డు ద్వారా చేపట్టనున్నారు. ఖాళీల భర్తీపై వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రిజర్వేషన్లు అనుసరిస్తూ.. న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్‌ రూపొందించాలని ఆదేశించారు. కాగా, తొలుత ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్‌, ఐపీఎం విభాగాల్లో 1,326 ఎంబీబీఎస్‌ వైద్యుల పోస్టులకు, మిగతా ఉద్యోగాలకు వారం వారం నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. వీటిలో ట్యూ టర్స్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు కూడా ఉన్నాయి. ఎంబీబీఎస్‌ అర్హత గల ఈ పోస్టుల్లో ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా సేవలందిస్తున్న వారికి 20% వెయిటేజీ మార్కులు ఇస్తారు. మిగతా 80% ఎంబీబీఎస్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. నిమ్స్‌లోని ఖాళీలను నిమ్స్‌ బోర్డు, మిగిలిన పోస్టుల నియామకాలను బోర్డు ద్వారా నిర్వహించాలని మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్టులు, ట్యూ టర్లు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, స్టాఫ్‌ నర్సులు, మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లతో పాటు, జీవో నం.34, 35ను సవరించి ఆయుష్‌ విభాగంలోని స్టాఫ్‌ నర్సుల ఖాళీలను బోర్డు ద్వారానే భర్తీ చేయాలని ఆదేశించారు. ఇక ఆయుష్‌ విభాగంలోని పోస్టుల భర్తీనీ బోర్డు ద్వారానే చేపట్టనున్నట్లు తెలిపారు. కరోనా కాలంలో సేవలందించిన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి 20ు వెయిటేజీ ఇవ్వాలని మంత్రి సూచించారు. స్టాఫ్‌ నర్సులను బహుళైచ్చిక పశ్నల రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయాలన్నారు. ఆయుష్‌ వైద్యులను బోధనా సిబ్బందిగా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, వారి స్థానాలను నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించారు. ఇలాంటివారంతా ప్రైవేటు ప్రాక్టీస్‌ చేయకూడదంటూ సవరణలు చేయాలని మంత్రి నిర్దేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌లో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిపై నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఎం డైరెక్టర్‌ శ్వేతా మహంతిని ఆదేశించారు. 2, 3 వారాల్లో నోటిఫికేషన్ల జారీ ఉంటుందని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కంటి వైద్యులతో మంత్రి హరీశ్‌ వర్చువల్‌ సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో కాటరాక్ట్‌ శస్త్రచికిత్సలు నిర్వహిం చాలని ఆదేశించారు. తగిన పరికరాలను వెంటనే సమకూర్చాలని కుటుంబ సంక్షేమ కమిషనర్‌కు సూచించారు. శిబిరాలు నిర్వహించి, గుర్తించిన రోగులకు అవసరమైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఆరవరోజు ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి మూడు వాహనాల్లో భక్తకోటికి దర్శనమిచ్చారు. ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణ రథం, రాత్రి గజవాహనంపై .. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 హనుమంత, స్వర్ణరథంపై గోవిందుని అభయం రాత్రి గజవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు వాహనసేవలో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుమల, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఆరవరోజు ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి మూడు వాహనాల్లో భక్తకోటికి దర్శనమిచ్చారు. ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణ రథం, రాత్రి గజవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఉదయం శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధనస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి స్వర్ణ రథంలో కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై ఊరేగుతూ శ్రీవారు భక్తులను ఆశీర్వదించారు. హనుమంత వాహనసేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు సతీ్‌షరెడ్డి పాల్గొన్నారు. ఉత్సవమూర్తులకు హారతి ఇవ్వడంతో పాటు వాహనాన్ని సీజేఐ తన భుజాలపై వాహనాన్ని కొద్ది సమయం ఎత్తుకున్నారు.
‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ‘ టాక్ షోలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గెస్ట్ గా వచ్చన సంగతి తెలిసిందే. ఈ నెల 14 నుంచి స్టార్ట్ కాబోతోన్న ఈ ఎపిసోడ్ కోసం నందమూరి, నారా, టీడీపీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బావ చంద్రబాబును బామ్మర్ది బాలయ్య హోస్ట్ చేసిన ఆ ఎపిసోడ్ పై ఓ రేంజ్ లో హైప్ ఏర్పడింది. ఆ హైప్ నకు ఏ మాత్రం తగ్గకుండా…తగ్గేదేలే అంటూ తాజాగా ఆ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. చంద్రబాబు కాలిబర్ ను, కెరీర్ ను పరిచయం చేస్తూ బాలయ్య చెప్పిన ఇంట్రోకు…చంద్రబాబు ఇచ్చిన ఎంట్రీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంది. వ్యక్తిగత జీవితం, స్నేహాలు, మరచిపోని ఘటనలు, రాజకీయాలు, కీలక నిర్ణయాలు..ఇలా చంద్రబాబు జీవితంలోని పలు ఘట్టాలను ఈ షో ద్వారా బాలయ్య రివీల్ చేశారు. ‘‘ఫస్ట్ షోకు నా బంధువును పిలుద్దామనుకున్నా…కానీ, ఆయన ప్రజలందరి బంధువు…అందుకే ఆయనను పిలిచాము…మీకు బాబుగారు..నాకు బావగారు…లెట్స్ వెల్ కమ్ ఒన్ ఆఫ్ ది టాలెస్ట్ టీడర్స్ ఆఫ్ ది పాలిటిక్స్…శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు…’’ అని బాలయ్య చెప్పడంతో విజిల్స్, చప్పట్లు, కేరింతలు, కేకలు మార్మోగిపోయాయి. మీరు రొమాన్స్ చేశారా అని అడిగితే..కాలేజీ రోజుల్లో మీకంటే ఎక్కువే చేశామని చంద్రబాబు జవాబివ్వడంతో ఆహూతులంతా పగలబడి నవ్వారు. కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడగగానే.. వైఎస్ఆర్ తనకు మిత్రుడని చంద్రబాబు తన కాలేజీరోజులను నెమరేసుకున్నారు 1995 వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ పై ప్రస్తావన కూడా ఈ షోలో వచ్చింది. ఆ రోజు మనం చేసింది తప్పా..? అని బాలకృష్ణను చంద్రబాబు అడిగారు. ఆ రోజు ఆయన కాళ్లుపట్టుకొని బ్రతిమిలాడాను..వినలేదు…అని చంద్రబాబు ఆవేదన చెందారు. అవును..నేను అక్కడే ఉన్నాను అంటూ బాలయ్య జవాబిచ్చారు. ఇలా, బావా బామ్మర్దుల మధ్య సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక, ప్రోమోనే ఇలా దుమ్మురేపుతోందంటే…14వ తేదీన స్ట్రీమ్ కాబోతోన్న ఎపిసోడ్ వ్యూయర్ షిప్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందనడంలో ఎనీ డౌట్?
thesakshi.com : ప్రియాంక చోప్రా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ నటీనటులలో ఒకరు. హిందీ సినిమాల్లో నటించడం నుండి హాలీవుడ్‌లో నటించడం వరకు, నటి తన నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను మెప్పించింది. పీసీఈఈ ది వైట్ టైగర్, ది స్కై ఈజ్ పింక్, బేవాచ్, మేరీ కోమ్, అగ్నిపత్, ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్, కమీనీ, దోస్తానా, ఫ్యాషన్, క్రిష్, వక్త్: ది రేస్ ఎగైనెస్ట్ టైమ్ మరియు వంటి చిత్రాలలో తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్‌తో మనల్ని ఆకట్టుకుంది. ఇంకా ఎన్నో. ప్రియాంక బాలీవుడ్ మరియు హాలీవుడ్‌లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది మరియు విపరీతమైన అభిమానులను కూడా పొందుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం, ప్రియాంక చోప్రా కరణ్ జోహార్ యొక్క చాట్ షో, కాఫీ విత్ కరణ్ సీజన్ 5 లో కనిపించింది మరియు హాలీవుడ్ vs బాలీవుడ్, వివాహం, జాత్యహంకారం మరియు మరిన్నింటి గురించి మాట్లాడింది. విన్ డీజిల్ సరసన XXX: రిటర్న్ ఆఫ్ క్జాండర్ కేజ్‌తో హాలీవుడ్‌లో తన అరంగేట్రం చేసిన దీపికా పదుకొణెతో నిరంతర పోలికల గురించి కూడా నటిని అడిగారు. భారతీయ నటీనటులు హాలీవుడ్‌లో చేరడంపై ప్రియాంక ఎలా ఫీలవుతున్నారని ప్రశ్నించారు. దానికి, ఆమె ఇలా చెప్పింది: “చాలా మంది నటులు కూడా వచ్చారు. నాకు, నేను చేసిన పనిని చేయడం కాంక్రీట్‌ను విచ్ఛిన్నం చేయడం లాంటిది మరియు నేను దాని గురించి మాట్లాడనందున ప్రజలు దానిని గ్రహించలేరు. ఒప్పించడం నిజంగా కష్టం. స్టూడియోలలో ‘నేను ఈ రకమైన భాగానికి అలవాటు పడ్డాను మరియు నేను తక్కువ ధరతో సరిపెట్టుకోను లేదా అన్యదేశ అందమైన అమ్మాయి లేదా నా పెద్ద లావుగా ఉన్న పంజాబీ వివాహానికి సంబంధించిన మూస పద్ధతిలో ఉండకూడదనుకుంటున్నాను.’ భారతీయ నటీనటులు అలవాటైన మూస పద్ధతి మాత్రమే.” ఇంకా, దీపికా XXX: రిటర్న్ ఆఫ్ క్జాండర్ కేజ్ లేదా భవిష్యత్తులో ఆమె చేసేది చూడటం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. “నేను వేరే దేశంలో పూర్తిగా ఆదరణ, ప్రేమ మరియు ఆప్యాయతలను చూశాను, భారతీయ ప్రతిభను నేను నిజంగా కోరుకుంటున్నాను, ఎందుకంటే ప్రపంచానికి మనం ఇవ్వవలసింది చాలా ఉంది. ఇది సరైన మార్గంలో జరుగుతుందని నేను ఆశిస్తున్నాను మరియు మేము చేయను. ‘వెనక్కి వెళ్లి మూస పద్ధతిలో చిక్కుకుపోకండి, ఎందుకంటే అందరూ మిమ్మల్ని అక్కడికి నెట్టివేస్తారు” అని ప్రియాంక జోడించారు. ఇదిలా ఉండగా, ప్రియాంక మరియు దీపిక కలిసి 2015లో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన బాజీరావ్ మస్తానీలో కలిసి నటించారు మరియు బాజీరావుగా రణ్‌వీర్ సింగ్‌ను ప్రధాన పాత్రలో తన్వి అజ్మీ, వైభవ్ తత్వవాది, మిలింద్ సోమన్, మహేశ్ మంజ్రేకర్ మరియు ఆదిత్య పంచోలీ అందించారు. పాత్రలు. ఇందులో ప్రియాంక కాశీబాయి: బాజీరావు మొదటి భార్య పాత్రను పోషించగా, పదుకొనే మస్తానీ: బాజీరావు రెండవ భార్యగా నటించింది. వర్క్ ఫ్రంట్‌లో, జై గంగాజల్ నటి తన పైప్‌లైన్‌లో చాలా ఆసక్తికరమైన చిత్రాలను కలిగి ఉంది. ఆమె చివరిగా 2021 అమెరికన్ చలనచిత్రం, ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్‌లో కనిపించింది, ఇందులో కీను రీవ్స్, క్యారీ-అన్నే మోస్, జాడా పింకెట్ స్మిత్, లాంబెర్ట్ విల్సన్, యాహ్యా అబ్దుల్-మతీన్ II, జెస్సికా హెన్విక్, జోనాథన్ గ్రోఫ్, నీల్ పాట్రిక్ హారిస్ కూడా నటించారు. ఈ చిత్రంలో ఆమె సతీ పాత్రలో నటించింది. నటి తదుపరి ఎండింగ్ థింగ్స్, ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీలో కనిపించనుంది. ఆమె కత్రినా కైఫ్ మరియు అలియా భట్‌లతో ఫర్హాన్ అక్తర్ యొక్క బాలీవుడ్ చిత్రం జీ లే జరా కూడా ఉంది. 2019 చిత్రం, ది స్కై ఈజ్ పింక్ తర్వాత ప్రియాంక హిందీ తెరపైకి తిరిగి రావడాన్ని ఇది సూచిస్తుంది. Tags: # bollywood news#BOLLYWOOD#DEEPIKA PADUKONE#entertainment exclusive#latest#NEWS#Priyanka Chopra#telugu news
పంజాబ్‌ రాష్ట్రం... జలంధర్‌కు విసిరేసినట్టుండే మీఠాపూర్‌ గ్రామం. ఓ మధ్యతరగతి కుటుంబం. తొమ్మిదేళ్ల పిల్లాడు వీడియో గేమ్స్‌లో లీనమైపోయేవాడు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 పంజాబ్‌ రాష్ట్రం... జలంధర్‌కు విసిరేసినట్టుండే మీఠాపూర్‌ గ్రామం. ఓ మధ్యతరగతి కుటుంబం. తొమ్మిదేళ్ల పిల్లాడు వీడియో గేమ్స్‌లో లీనమైపోయేవాడు. పాటలు వింటూ లోకం మరిచిపోయేవాడు. అలాంటి పిల్లవాడు ఒక రోజు నాన్న, అన్నయ్య హాకీ ఆడుతుంటే చూశాడు. ఆటను ఇష్టపడ్డాడు. ఆ ఇష్టమే తరువాత అతడి లోకం అయిపోయింది. భారత హాకీ జట్టుకు కెప్టెన్‌ని చేసింది. నేడు... అతడు 29 ఏళ్ల కుర్రాడు... 130 కోట్ల మంది భారతీయుల ‘ఒలింపిక్‌ పతకం’ కలను నెరవేర్చి... ఘన చరితకు సారథిగా నిలిచిన మన్‌ప్రీత్‌ సింగ్‌ జర్నీ ఇది. టోక్యో ఒలింపిక్స్‌లో మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని భారత హాకీ జట్టు జర్మనీపై 5-4తో గెలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. నాలుగు దశాబ్దాల తరువాత భారత హాకీ సాధించిన తొలి ఒలింపిక్‌ పతకం అది. దీని వెనక ఎన్నో ఏళ్ల అలుపెరుగని కృషే కాదు... ఆటగాళ్ల త్యాగాలూ ఉన్నాయి. సీనియర్‌... జూనియర్‌ అన్న తేడా లేకుండా... ఆటగాళ్లందర్నీ ఒక జట్టులా ఏకం చేసింది మాత్రం మన్‌ప్రీత్‌ సింగ్‌. నాలుగేళ్ల కిందట కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జట్టును అతడు కొత్త పుంతలు తొక్కించాడు. ఏ ఆటగాడైనా మైదానంలో రాణించాలంటే ప్రధానమైనది ఫిట్‌నెస్‌. ముందుగా దానిపైనే దృష్టి పెట్టాడు. ‘‘హాకీలాంటి క్రీడల్లో ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ కీలకం. మ్యాచ్‌ ఆరంభం నుంచి చివరి క్షణం వరకు ఒకే రకమైన ప్రదర్శన ఇవ్వాలంటే అది పూర్తి ఫిట్‌నెస్‌ ఉంటేనే సాధ్యమవుతుంది. అందుకే గత కొన్నేళ్లుగా దాని కోసం విపరీతంగా శ్రమించాం. శిక్షణలో మా ట్రైనర్లు కొన్ని రన్నింగ్‌ డ్రిల్స్‌ చేయించారు. అంతేకాదు... జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడూ ‘యోయో టెస్ట్‌’ను దాటాడు. నాకు తెలిసి ప్రస్తుత భారత జట్టు ప్రపంచ హాకీలోనే అత్యుత్తమ ఫిట్‌నెస్‌ ఉన్న జట్లలో ఒకటి’’ అంటాడు మన్‌ప్రీత్‌. గదికి తాళం వేసినా... 259 అంతర్జాతీయ మ్యాచ్‌లు... ఎన్నో పసిడి పతకాలు... పదేళ్ల మన్‌ప్రీత్‌ కెరీర్‌లో ఎన్నో కలికితురాయిలున్నాయి. ఇప్పుడంటే అతడు ఒక రోల్‌మోడల్‌. కానీ ఒకప్పుడు అసలు మైదానం ముఖం చూసింది లేదు. ఎప్పుడూ ఇంట్లో కూర్చొని వీడియో గేమ్స్‌ ఆడుకునేవాడు. లేదంటే ఏ పాటలో వినేవాడు. అప్పుడతడికి తొమ్మిదేళ్లు. అనుకోకుండా ఒక రోజు అతడి తండ్రి, అన్నయ్య హాకీ ఆడడం చూశాడు. ఆట బాగా నచ్చేసింది. తనూ ఆడాలనుకున్నాడు. కానీ దెబ్బలు తగులుతాయని ఇంట్లోవాళ్లు వద్దన్నారు. అయితే మన్‌ప్రీత్‌ మనసంతా దానిపైనే! ఆట మొదలుపెట్టాడు. ‘‘నేను కోచింగ్‌కు బయలుదేరుతున్నా. ఆ సమయంలో మా అన్నయ్య నన్ను లోపల పెట్టి గదికి తాళం వేశాడు. ఎలాగో తప్పించుకుని బయటపడ్డాను. మైదానానికి వెళ్లాను. అక్కడ కోచింగ్‌లో అన్నయ్య కూడా ఉన్నాడు. నన్ను చూడగానే కోపంతో ఊగిపోయాడు. కొట్టినంత పని చేశాడు. ‘ఆటపై అంత ఆసక్తి చూపిస్తున్నప్పుడు ఒక అవకాశం ఇవ్వాలి కదా’ అని కోచ్‌ అనడంతో ఊపిరి పీల్చుకున్నా’’... చిన్న నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు మన్‌ప్రీత్‌. అమ్మే లేకపోతే... అయితే మన్‌ప్రీత్‌కు అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఇంట్లో వాళ్లను ఒప్పించి హాకీ స్టిక్‌ పట్టుకున్న కొంత కాలానికి ఊహించని సమస్య. అతడి తండ్రి మానసిక సమస్యలతో సతమతమయ్యారు. దీంతో కుటుంబ భారమంతా మన్‌ప్రీత్‌ తల్లి మంజీత్‌ కౌర్‌పైనే పడింది. ముగ్గురు పిల్లల్ని పోషించడం ఒక ఎత్తయితే... హాకీలో రాణించాలన్న మన్‌ప్రీత్‌ కలను సజీవంగా ఉంచడం మరో ఎత్తు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా కొడుకు కెరీర్‌ విషయంలో ఆమె రాజీపడలేదు. రకరకాల పనులు చేసి, కుటుంబాన్ని నిలబెట్టారు. ‘‘నాకు అతిపెద్ద స్ఫూర్తి మా అమ్మే. ఆమె లేకపోతే ఇవాళ నేను లేను. డబ్బు, కీర్తిప్రతిష్టలు... జీవితంలో నేను ఏది సంపాదించినా ఆ ఘనత మా అమ్మకే దక్కుతుంది. మా కోసం ఆమె ఎన్నో కష్టాలు అనుభవించింది. ఎన్నిటినో త్యాగం చేసింది’’ అంటున్న మన్‌ప్రీత్‌ సింగ్‌ అమ్మ నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలూ శ్రమించాడు. వాళ్లే ఆరాధ్యులు... మన్‌ప్రీత్‌కు చిన్నప్పటి నుంచి హాకీ లెజెండ్‌ పర్గత్‌ సింగ్‌ ఆరాధ్య దైవం. ఆయనదీ అతడి ఊరే కావడంతో మరింత ప్రేరణ పొందాడు. ప్రసిద్ధ ‘సుర్జిత్‌ హాకీ అకాడమీ ఆఫ్‌ జలంధర్‌’లో చేరాడు. ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో, భారత బాక్సింగ్‌ రాణి మేరీకోమ్‌ల జీవిత గాథలు అతడిలో నిరంతర పోరాట స్ఫూర్తి రగిలిస్తాయి. 2012లో తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న మన్‌ప్రీత్‌ ఆ తరువాత ఏడాది భారత జూనియర్‌ హాకీ జట్టుకు సారథి అయ్యాడు. ‘జూనియర్‌ హాకీ ప్రపంచ కప్‌, ఆసియా కప్‌, సుల్తాన్‌ ఆఫ్‌ జోహార్‌ కప్‌’లలో భారత్‌ను విజేతగా నిలబెట్టాడు. 2014 ‘కామన్వెల్త్‌ గేమ్స్‌’లోనూ జట్టును తుది సమరానికి చేర్చడంలో అతడిదే ప్రధాన పాత్ర. ఈ చిరస్మరణీయ విజయాలు 2017లో మన్‌ప్రీత్‌కు భారత హాకీ సీనియర్‌ జట్టుకు కెప్టెన్‌ను చేశాయి. తండ్రి మరణించినా... 2016లో ‘సుల్తాన్‌ అజ్లాన్‌షా కప్‌’ సమయంలో మన్‌ప్రీత్‌ తండ్రి మరణించారు. జపాన్‌పై గెలిచిన ఆనందంలో ఉన్న మన్‌ప్రీత్‌కు అది పెద్ద షాక్‌. వెంటనే ఇంటికి వచ్చి, తండ్రి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నాడు. అతడు లేని భారత జట్టు... ఆస్ర్టేలియాతో తరువాతి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. ఆ సమయంలో మన్‌ప్రీత్‌ తల్లి... ‘‘వెళ్లి ఆడు. దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని మీ నాన్న చెప్పేవారు. ఆయన కలను నిజం చెయ్యి’’ అంటూ ధైర్యం చెప్పారు. తిరిగి టోర్నీలో పాల్గొన్న మన్‌ప్రీత్‌ జట్టును ముందుండి నడిపించి ఫైనల్స్‌కు తీసుకువెళ్లాడు. ప్రతిష్టాత్మక ‘అర్జున అవార్డు’ దక్కించుకున్నాడు. కరోనా మహమ్మారి దేశాన్ని కమ్మేసిన సమయంలో వైరస్‌ బారిన పడ్డ మన్‌ప్రీత్‌... కోలుకోవడమే కాదు, తిరిగి ఆ స్థాయి ఫిట్‌నెస్‌ సంతరించుకోవడం సామాన్యం కాదు. ఇలాంటి ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు అతడి జీవితంలో ఎన్నో. పతకంతో వస్తా... ఒలింపిక్స్‌ కోసం టోక్యో బయలుదేరే ముందు ‘పతకంతో తిరిగొస్తా’నంటూ మన్‌ప్రీత్‌ ధీమా వ్యక్తం చేశాడు. అన్నట్టుగానే 41 సంవత్సరాల తరువాత అతడి సారథ్యంలోని భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. అంతేకాదు... ఈ ఒలింపిక్స్‌లో భారత పతాకధారిగా అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ‘ఇది తనకు దక్కిన అదృష్టం’ అంటూ సంతోషం వ్యక్తం చేసిన మన్‌ప్రీత్‌ సింగ్‌ చెప్పినట్టుగానే భారత హాకీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చాడు. నాకు అతిపెద్ద స్ఫూర్తి మా అమ్మే. ఆమె లేకపోతే ఇవాళ నేను లేను. డబ్బు, కీర్తిప్రతిష్టలు... జీవితంలో నేను ఏది సంపాదించినా ఆ ఘనత మా అమ్మకే దక్కుతుంది. మా కోసం ఆమె ఎన్నో కష్టాలు అనుభవించింది. ఎన్నిటినో త్యాగం చేసింది.
తక్షణ అల్పాహారం తృణధాన్యాలు నిజానికి రోజును ప్రారంభించడానికి చాలా మంది వ్యక్తుల ఎంపిక. దీన్ని ఎలా సులభతరం చేయాలి, మంచి రుచి, మరియు ధర సరసమైనది. అయితే, తక్షణ తృణధాన్యాలు ఆరోగ్యకరమైనదా లేదా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈ కథనం మీరు అల్పాహారం కోసం తక్షణ తృణధాన్యాల గురించి తెలుసుకోవలసిన విషయాలను అలాగే తృణధాన్యాల ఉత్పత్తులను ఎంచుకోవడంలో చిట్కాలను చర్చించడానికి ప్రయత్నిస్తుంది. తక్షణ అల్పాహారం తృణధాన్యాలు ప్రాసెస్ చేయబడిన ఆహారం తక్షణ అల్పాహారం తృణధాన్యాలు తృణధాన్యాలు (వోట్స్ వంటివి) నుండి తయారు చేయబడతాయి మరియు వివిధ విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. తయారీ ప్రక్రియలో, తృణధాన్యాలు సాధారణంగా క్రింది దశల గుండా వెళతాయి: శుద్ధి చేయడం: తృణధాన్యాల పదార్ధాల గింజలు మెత్తటి పిండిగా ప్రాసెస్ చేయబడతాయి, తర్వాత వండుతారు. మిక్సింగ్: వండిన పిండిని చక్కెర, కోకో (చాక్లెట్) లేదా నీరు వంటి పదార్థాలతో కలుపుతారు. హీటింగ్ (ఎక్స్‌ట్రషన్): అనేక తృణధాన్యాల ఉత్పత్తులు ఎక్స్‌ట్రాషన్ అనే ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. ఈ ప్రక్రియలో తృణధాన్యాన్ని రూపొందించడానికి అధిక ఉష్ణోగ్రత యంత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎండబెట్టడం: వేడిచేసిన తర్వాత, తృణధాన్యాలు ఎండబెట్టబడతాయి. ఏర్పడటం: చివరగా, ఎండబెట్టిన తర్వాత, తృణధాన్యాలు బంతి లేదా నక్షత్ర ఆకారం వంటి ఆకృతి ప్రక్రియకు లోనవుతాయి. అయినప్పటికీ, అల్పాహారం తృణధాన్యాలు ఇప్పటికీ ప్రాసెస్ చేయబడిన ఆహారాలు. పై దశలతో, తక్షణ తృణధాన్యాలు ఇప్పటికీ ప్రాసెస్ చేయబడిన ఆహారాలు లేదా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు. అయినప్పటికీ, ప్రాసెస్ చేసిన ఆహారాలు వివిధ విటమిన్లు మరియు ఖనిజాలతో బలపరచబడినప్పటికీ, వినియోగానికి పూర్తిగా ఆరోగ్యకరమైనవి కావు. మీరు తరచుగా అల్పాహారం తృణధాన్యాలు తింటున్నారా? కింది వాటిపై శ్రద్ధ వహించండి ప్రాసెస్ చేయబడిన ఆహారాలుగా, తక్షణ అల్పాహారం తృణధాన్యాల ఉత్పత్తులను ఎంచుకోవడం మరియు కొనుగోలు చేయడంలో ఈ క్రింది అంశాలను పరిగణించాలి: 1. కొన్ని తృణధాన్యాల ఉత్పత్తులలో చక్కెర ఎక్కువగా ఉంటుంది అధిక చక్కెర వినియోగం ఊబకాయం, గుండె జబ్బులు మరియు మొటిమలతో సహా అనేక రకాల వైద్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. మరియు దురదృష్టవశాత్తు, కొన్ని తక్షణ తృణధాన్యాల ఉత్పత్తులు చాలా ఎక్కువ చక్కెరను కలిగి ఉంటాయి. అధిక చక్కెరతో కూడిన అల్పాహారం కూడా తెలివైన మార్గం కాదు ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర మరియు ఇన్సులిన్ హార్మోన్ స్థాయిలలో పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కొన్ని గంటల తర్వాత, బ్లడ్ షుగర్ కూడా పడిపోతుంది మరియు మనకు మళ్లీ ఆకలిని కలిగిస్తుంది మరియు అధిక కార్బ్ ఆహారాలు మరియు స్నాక్స్ కోసం చూడండి. ఈ పరిస్థితిని "ఎనర్జీ క్రాష్" లేదా "షుగర్ క్రాష్" అని పిలుస్తారు మరియు ఇది ఉత్పాదకతకు ఆటంకం కలిగిస్తుంది మరియు అతిగా తినడానికి దారితీస్తుంది. 2. తక్షణ తృణధాన్యాల ఉత్పత్తి ప్యాకేజింగ్‌పై ఆరోగ్య దావాల ద్వారా మోసపోకండి మీరు తక్షణ తృణధాన్యాల ఉత్పత్తులపై ప్యాకేజింగ్ క్లెయిమ్‌ల గురించి కూడా "సంశయవాదం" కలిగి ఉండాలి. ఉదాహరణకు, ఉత్పత్తి ప్యాకేజింగ్‌పై "తృణధాన్యాలతో తయారు చేయబడింది" అనే పదాలను విక్రయిస్తుంది. ఈ ఉత్పత్తులు తృణధాన్యాలు కలిగి ఉండవచ్చు, కానీ చిన్న మొత్తంలో. అదనంగా, "పూర్తి ధాన్యం" పదార్ధాలు పెద్ద భాగాలతో ప్రాసెస్ చేయబడిన ధాన్యాలు (ప్రాసెస్ చేయబడిన కార్బోహైడ్రేట్లు) తో కూడా కలపబడి ఉండవచ్చు. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లను ఖాళీ కార్బోహైడ్రేట్‌లు అని కూడా పిలుస్తారు, ఎందుకంటే అవి చాలా తక్కువ ఫైబర్ మరియు సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు కూడా మనల్ని త్వరగా పూర్తి చేస్తాయి మరియు అతిగా తినడాన్ని ప్రేరేపించే ప్రమాదం ఉంది. 'ఆరోగ్యకరమైన' తక్షణ తృణధాన్యాల ఉత్పత్తులను ఎంచుకోవడానికి చిట్కాలు మీరు అల్పాహారం కోసం తక్షణ తృణధాన్యాన్ని ఎంచుకుంటే, ఉత్పత్తి యొక్క పోషక విలువలు మరియు పదార్థాలపై సమాచారాన్ని చూసేటప్పుడు క్రింది చిట్కాలను వర్తింపజేయవచ్చు: 1. చక్కెర విషయంలో జాగ్రత్త వహించండి తృణధాన్యాలతో సహా ఆహారాన్ని కొనుగోలు చేసేటప్పుడు మీరు తెలుసుకోవలసిన పదార్థాలలో చక్కెర ఒకటి. ప్రతి సేవకు 5 గ్రాముల చక్కెర కంటే తక్కువ బరువున్న ఉత్పత్తులను ఎంచుకోవడానికి ప్రయత్నించండి. మీరు కొనుగోలు చేసే తృణధాన్యాల ఉత్పత్తి ప్యాకేజింగ్‌లో జాబితా చేయబడిన పోషక విలువపై ఎల్లప్పుడూ శ్రద్ధ వహించండి 2. ఫైబర్ అధికంగా ఉండే ఉత్పత్తుల కోసం చూడండి తగినంత ఫైబర్ వినియోగం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి సర్వింగ్‌కు కనీసం 3 గ్రాముల ఫైబర్ ఉండే ఉత్పత్తులను ఎంచుకోండి. 3. ఒక్కో సేవకు కేలరీలపై శ్రద్ధ వహించండి తృణధాన్యాలు వాటి రుచికరమైన లేదా రుచికరమైన రుచి కారణంగా విస్తృతంగా ఎంపిక చేయబడతాయి, కాబట్టి మీరు ఎక్కువగా తినేలా చేసే ప్రమాదం ఇప్పటికీ ఉంది. మీరు ప్రతి సర్వింగ్‌లో ఎన్ని కేలరీలు ఉంచుతున్నారో చాలా శ్రద్ధ వహించండి. దానిని తూకం వేయడానికి, మీరు ప్రస్తుతం విక్రయించబడుతున్న చిన్న స్థాయిని ఉపయోగించవచ్చు. 4. పోషక విలువలు మరియు కూర్పు సమాచారంపై చాలా శ్రద్ధ వహించండి ఫ్రంట్ ప్యాక్‌లోని ఆరోగ్య క్లెయిమ్‌లను విస్మరించాలి. మరీ ముఖ్యంగా, దాని పోషక విలువలు మరియు కూర్పు కోసం సమాచార పెట్టెను జాగ్రత్తగా చూడండి. మొదటి రెండు లేదా మూడు పదార్థాలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి మీరు తినే తృణధాన్యాలను వివరిస్తాయి. వివిధ పేర్లను ఉపయోగించి చక్కెర అనేకసార్లు జాబితా చేయబడితే, ఉత్పత్తిలో చక్కెర ఎక్కువగా ఉండవచ్చు. ఈ చక్కెరల పేర్లు కొన్ని సుక్రోజ్, HFCS, గ్లూకోజ్. [[సంబంధిత కథనం]] SehatQ నుండి గమనికలు తక్షణ అల్పాహారం తృణధాన్యాలు నిజానికి విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. అయితే, ప్రాసెస్ చేసిన ఆహారంగా, తృణధాన్యాలు పూర్తిగా ఆరోగ్యకరమైనవి కావు. తృణధాన్యాల ఉత్పత్తులను ఎన్నుకునేటప్పుడు పరిగణించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే పదార్థాలు, మరియు తప్పనిసరిగా నిజం కాని ఆరోగ్య వాదనల ద్వారా మోసపోకండి.
ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తేంటి.. మున్సిపాలిటీలో గెలుపు కోసం నేరుగా ప్ర‌చారానికి రావ‌డం ఏంటి? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? ఏం చేస్తాం.. ప‌రిస్థితి తీవ్ర‌త దృష్ట్యా త‌ప్పేలా లేద‌న్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ మున్సిపాలిటీ ఏడు సార్లుగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనిది. సాధార‌ణంగా అయితే.. ప‌ద్నాలుగేళ్లు ముఖ్య‌మంత్రిగా, ఏడు సార్లు ఆ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా కొన‌సాగిన ఆ వ్య‌క్తి క‌నుసైగ చేస్తే.. మున్సిపాలిటీలో గెలుపు కైవ‌సం కావాలి. కానీ.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి బాగోలేక‌పోవ‌డంతో చంద్ర‌బాబు దిగిరాక త‌ప్ప‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల చేదు అనుభ‌వాల నేప‌థ్యంలో కుప్పం మున్సిపాలిటీ గెలుపు కోసం స్వ‌యంగా ఆయ‌నే ప్ర‌చారానికి రెడీ అవుతున్న‌ట్లుగా పార్టీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. చంద్ర‌బాబుకు న‌మ్మ‌కం లేదా? ఎన్నిక ఏదైనా.. చంద్ర‌బాబు సొంత నియోజకవర్గం కుప్పం లో కూడా టీడీపీకి చేదు అనుభ‌వాలే ఎదుర‌వుతున్నాయి. పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో చంద్రబాబు ఇలాకాలో కూడా వైసీపీ అభ్య‌ర్థులే విజ‌యం సాధించారు. దీంతో టీడీపీపై తీవ్ర చ‌ర్చ మొద‌లైంది. చివ‌ర‌కు బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రో నియోజ‌క‌వ‌ర్గాన్ని చూసుకుంటున్నార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు కుప్పం మునిసిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కుప్పం ని మునిసిపాలిటీగా చేశారు. అది ఆ ప్రాంతవాసుల చిరకాల డిమాండ్ కూడా. తెలుగుదేశం అధికారంలో ఉండ‌గా సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క ప్రాంతాన్ని చంద్ర‌బాబు మున్సిపాల్టీగా మార్చుకోలేక‌పోయారు. జ‌గ‌న్ వ‌చ్చాక మార్పు వ‌చ్చింది. అభివృద్ధిలో కూడా దూసుకెళ్తోంది. దీంతో అక్క‌డ గెలుపుపై చంద్ర‌బాబునాయుడుకు న‌మ్మ‌కాలు బ‌లంగా లేన‌ట్లుగా క‌నిపిస్తోంది. అక్క‌డ‌ ఎక్స్ అఫీషియో స‌భ్యుడిగా పేరు న‌మోదు చేసుకోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవ‌చ్చు. బాబేంటి.. మున్సిపాల్టీలో ప్ర‌చార‌మేంటి? కుప్పం ను మున్సిపాలిటీగా మార్చిన వైసీపీ కూడా గెలుపు కోసం తీవ్రంగా శ్ర‌మిస్తోంది. జ‌గ‌న్ పాల‌న‌ను, స్థానికంగా చేసిన అభివృద్ధి ప్ర‌ధాన ఎజెండాగా ప్ర‌చారం చేస్తోంది. మున్సిపాలిటీలో కూడా పాగా వేసి చంద్రబాబుకు ఘోర పరాభవం ఏంటో చూపించాలని కంకణం కట్టుకుంది. దీంతో జాతీయ నేత‌గా ఉన్న చంద్ర‌బాబే టీడీపీ నుంచి రంగంలోకి దిగాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో వరసబెట్టి ఓడి పోతోంది. ఆ ఓటమి చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం దాకా వ‌చ్చేయ‌డంతో కుప్పం మున్సిపాల్టీ లో ఎట్టి ప‌రిస్థితిలోనూ విజ‌యం సాధించాల‌ని బాబు సంక‌ల్పించుకున్నారు. కనీసం మునిసిపాలిటీ అయినా దక్కించుకోకపోతే క్యాడర్ కి బ్యాడ్ సిగ్నల్స్ వెళ్తాయని కూడా పార్టీ భయపడుతోంది. ప్ర‌స్తుతానికి చంద్రబాబు వ‌ర్చువ‌ల్ గానే క‌థ అంతా న‌డిపిస్తున్నా.. త్వ‌ర‌లోనే కుప్పం టూర్ కి రెడీ అవుతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. బాబేంటి.. మున్సిపాల్టీలో ప్ర‌చారం ఏంటి అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
భారతదేశపు నగరాలు, పట్టణాల్లోని కుర్రాళ్లు తమ నుదురుపై వెంట్రుకల్ని రింగులుగా తిప్పుకుని చిద్విలాసంగా పారూ కోసం, తమ ధన్నూ కోసం, అనార్కలీ కోసమో వీధులన్నీ కలియ తిరుగుతూ తమ విరిగిన సైకిల్‌నేమిటి, జేబులోని చివరి పావలాను కూడా పోగొట్టుకునేందుకు సిద్ధపడేవారు. అంతెందుకు? పార్వతి ఊరి వైపు వెళుతున్న ఎడ్లబండిలో కూర్చుని అంతిమ శ్వాస తీస్తున్న దేవదాసుతో బాటు వేలు, లక్షలాది కుర్రకారు ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయే కాలం ఒకటుండేది. ఇదొక్కటేమిటి? దేశం దేశమంతా ఒకానొక సమయంలో తమ ప్రతి దు:ఖానికి విఫల ప్రేమకూ వియోగానికి, విషాదానికి, తమ ప్రేమకి కొలమానంగా ఒకే పేరు పెట్టేవారు. ఆ పేరు దిలీప్‌కుమార్‌. - హెచ్‌.రమేష్‌బాబు, 77807 36386 భారతీయ చలనచిత్ర రంగాన్ని టాకీలు వచ్చిన తొలి దశకంలో పృథ్వీరాజ్‌ కపూర్‌, బిల్లిమోరియా, కె.ఎల్‌.సైగల్‌, వి.శాంతారాం, చంద్రమోహన్‌, అశోక్‌ కుమార్‌ వంటి మహామహులు కథానాయకులై ఏలుతున్న కాలం అది. అప్పట్లో నటు లకు గానం వచ్చి ఉండటం అదనపు అర్హత. కాదు, తప్పని సరి. ఇలాంటి తరుణంలో నటనలో ఓనమాలు కూడా తెలియని ఓ కుర్రాడు సినిమాల్లోకి వచ్చి మహానటుడై నాలుగు తరాల నటు లకు నటనంటే ఏమిటో నేర్పి ఇండియన్‌ స్క్రీన్‌పై అర శతాబ్దానికిపైగా తనదైన మద్రవేశాడు. ఆ మహానటుడు దిలీప్‌కుమార్‌. దిలీప్‌కుమార్‌ భారతీయ సినిమా ప్రేక్షకులకు ఓ ట్రాజెడీకింగ్‌. మొత్తం సినీ పరిశ్రమతో 78 ఏండ్ల అనుబంధం కలిగి వున్న ఏకైక నటుడాయన. ఇక ఈ నెల 7న తన 99వ ఏట బొంబాయిలో దిలీప్‌కుమార్‌ కన్నుమూసి భారతీయులనందరినీ విషాదంలో ముంచెత్తారు. ఆయన మరణంతో సినీసీమలో ఒక తరం అంతరించిపోయినట్లైంది. దిలీప్‌కుమార్‌ పేరెత్తగానే అందాజ్‌, జోగన్‌, ఆర్జు, జుగ్నూ, కోహినూర్‌, మొఘల్‌ - ఏ - ఆజం వంటి ఒక 50 చిత్రాలు ఒకదాని వెంట ఒకటి గుర్తుకు వస్తాయి. స్వాతంత్య్రానికి పూర్వం నుండి ఆ తరువాత మరో 50 ఏండ్ల పాటు తనదైన అద్భుత నటనా వైదుష్యంతో వెండితెరను చకచ్ఛకితం చేసిన సహజ నటుడు దిలీప్‌కుమార్‌. సినిమా రంగంలో రాశి కన్నా వాసి ముఖ్యం అని నమ్మి కడవరకూ ఆచరించి ఉత్తమ చిత్రానికి, అత్యుత్తమ నటనకు తానొక నిర్వచనంగా చరిత్రకెక్కారాయన. అప్పటికే హిమాంశురారు కాలం చేసి (1940), దేవికారాణి ఆధిపత్యంలో బాంబే టాకీస్‌ సంస్థ నడుస్తున్న రోజులవి. అశోక్‌కుమార్‌ హీరోగా చిత్రాలు నిర్మిస్తున్నా, కొన్ని విభేదాలతో ఆయన తన బావ ఎస్‌.ముఖర్జీతో కలిసి బయటికి వచ్చి ఫిల్మిస్తాన్‌ సంస్థను నెలకొల్పుకుని విడిపోయారు. ఈ సమయంలో తమ సంస్థలో నటించేందుకు దేవికారాణి ఓ కొత్త హీరో కోసం అన్వేషిస్తున్నారు. దేవికారాణి భారతీయ చిత్ర రంగంలో తొలి తరం అందాల నాయిక. అప్పటికే ''అఛూత్‌ కన్య' 'నిర్మల' 'కంగన్‌' వంటి చిత్రాల్లో నటించిన స్టార్‌ హీరోయిన్‌, ప్రొడ్యూసర్‌. ఏదో తండ్రి చెప్పాడని పని మీద నైనిటాల్‌ వెళ్లిన దిలీప్‌ కుమార్‌ను తొలిసారిగా చూసిన దేవికారాణి ఆయన మృదుభాషణం, అమాయకపు దృక్కులను చూసి తాను తీయబోయే సినిమాకు హీరో ఇతనేనని నిర్ణయించు కున్నది. ఆ సినిమా 'జ్వార్‌ భటా'. అప్పటికి నటన అంటే అక్షరాలు కూడా తెలియని దిలీప్‌ కూడా జీవిక కోసం ఏదో ఒక పనిలో కుదిరి పోవాలను కుంటున్నాడు. కనుక స్క్రీన్‌ టెస్ట్‌ కోసం వెళ్లాడు. సెలక్టయ్యారు. అయినా అప్పటకీ ఆయనకు అడ్డంకులేవీ తొలగ లేదు. ఎందుకంటే ఆయనింకా 'దిలీప్‌ కుమార్‌'గా మారనే లేదు. అప్పటిదాకా అతనికి ఉన్న 'యూసుఫ్‌ ఖాన్‌' అన్న పేరు దేవికారాణికిష్టం లేదు. ఈ పేరు మార్చే పనిని తమ కంపెనీ రచయిత భగవతీచరణ్‌ వర్మకు అప్పగించింది. ఆయన ఆలోచించి దిలీప్‌ కుమార్‌ పేరు సూచించాడు. దేవికారాణి 'దిలీప్‌కుమార్‌'గా యూసుఫ్‌ ఖాన్‌కు నామకరణం చేసింది. మొదటి నుండీ అంతర్ముఖుడైన యూసుఫ్‌ఖాన్‌ - దిలీప్‌ కుమార్‌గా మారి ఆ తరువాత ఇండియన్‌ సినిమాలో సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఇదంతా దిలీప్‌కుమార్‌ పుట్టుక గురించి.. మరి యూసుఫ్‌ఖాన్‌ పుట్టుపుర్వోత్తరాల్లోకి వెళదాం. 1922 డిసెంబర్‌ 11న నేటి పాకిస్తాన్‌లోని పెషావర్‌లో మధ్య తరగతి పఠాన్‌ల కుటుంబంలో పుట్టారు. తండ్రి గులాం సర్వర్‌ఖాన్‌. యూసుఫ్‌ తండ్రి గులాం సర్వర్‌ ఖాన్‌ది పండ్ల వ్యాపారం. పెషావర్‌లోనే గాకుండా బొంబాయిలో కూడా హౌల్‌సేల్‌ వ్యాపారం ఉండేది. ఈ పరిస్థితుల్లో యూసుఫ్‌ఖాన్‌ పెషావర్‌ లోని స్థానిక పాఠశాలలోనే ప్రాథమక విద్యాభ్యాసం జరిగింది. ఇంతలో వీరి పెద్దన్న అయూబ్‌ఖాన్‌కి ఆరోగ్యం బాగోలేక పోవడంతో చికిత్స కోసం బొంబాయికి వచ్చి అక్కడి నాగదేవి వీధిలో అద్దె ఇంట్లో దిగడంతో వారి బొంబాయి జీవితం మొదలైంది. తన అన్న ఆరోగ్యం మెరుగైన తరువాత అంతా కలిసి పెషావర్‌కి వెళ్లినా ఆ వెంటనే రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1939లో తిరిగి బొంబాయికి వచ్చి స్థిరపడ్డారు. పూర్వపు వి.టి.స్టేషన్‌ దగ్గరలోని అంజుమన్‌ -ఎ- ఇస్లాం స్కూల్‌లో చేరిన యూసుఫ్‌ తన మెట్రిక్యులేషన్‌ పూర్తవగానే విల్సన్‌ కాలేజ్‌లో బిఎస్సీలో చేరిపోయాడు. మరో వైపు కాలేజ్‌లో చదువు కన్నా స్పోర్ట్స్‌లో ఆయనకు అసక్తి ఎక్కువగా ఉండేది. ఫుట్‌బాల్‌ ఇష్టంగా ఆడేవారు. ఇంకా ఎలాగైనా సరే జీవితంలో టెస్ట్‌ క్రికెటర్‌గా రాణించి తొలి సెంచరీ కొట్టాలన్నది ఆయన జీవితాశయం. కాని భవిష్యత్తులో జరిగింది వేరొకటి. చదువు సాగుతుండగానే ఒకనాడు తండ్రి పిలిచి తనకు వ్యాపారంలో పూర్తిగా తోడుండమని ఆడిగాడు. అంతే బిఎస్సీ మధ్యలో ఆపేసి పండ్ల వ్యాపారంలోకి ప్రవేశించారు. ఇంతలో పూణేలోని ఆర్మీ క్యాంప్‌లో 35 రూపాయల వేతనంలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. కొద్దిరోజుల తరువాత క్యాంటీన్‌ మూసి వేయడంతో తిరిగి బాంబే వచ్చేశారు. మళ్లీ ఎప్పటిలా తండ్రి వ్యాపారంలో చేదోడుగా నిలిచాడు. హౌల్‌సేల్‌ బిజినెస్‌ కావడం వల్ల లావాదేవీల కోసం యూసుఫ్‌ఖాన్‌ బొంబాయి పరిసర పట్టణాలకు వెళ్లేవాడు. అలా ఒకసారి నైనిటాల్‌ వెళ్లినపుడు నటి దేవికారాణి కంట పడటంతో యూసుఫ్‌ జీవితం మలుపు తిరిగింది. ఆ తరువాత భారతీయ సినీ యవనికపై దిలీప్‌కుమార్‌గా అవతారమెత్తారు. ప్రతిష్టాత్మకంగా బాంబే టాకీస్‌ వారి 'జ్వార్‌ భటా' అమియా చక్రవర్తి డైరెక్షన్‌లో దిలీప్‌కుమార్‌ హీరోగా నటించారు. హీరోయిన్‌ మృదుల ఇంకా ఆగాజాన్‌, షమీమ్‌ తదితరులు నటించారు. 1944 నవంబరు 29న సినిమా విడులైంది కానీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. తొలి బుక్కలోనే కంకెడు రాయి. తొలి అడుగే తడబడింది. రెండో చిత్రం 'ప్రతిమా' (1945) కూడా బాంబే టాకీస్‌ వారిదే. దర్శకుడు తెలంగాణ వాడైన పైడి జయరాజ్‌. 'ప్రతిమ' కూడా ఆడలేదు. ఫిల్మిండియా వంటి పత్రికలు ఈ సినిమాల గురించి తీవ్రమైన రివ్యూలు రాసినవి. మరో వైపు దేవికారాణి 1945 చివరలో బాంబే టాకీస్‌ను అమ్మేసి బెంగుళూరుకు వెళ్లిపోయింది. దిలీప్‌ కుమార్‌కు దిక్కుతోచలేదు. కానీ సంస్థలో ప్రొడక్షన్‌ కంట్రోలర్‌గా పని చేస్తున్న హితేన్‌ చౌధురి పర్యవేక్షక అధిపతి అయ్యాడు. ఆయన దిలీప్‌ని చాలా ఇష్టపడేవారు. ఫెయిల్యూర్‌తో ఉన్న దిలీప్‌ని నిలబెట్టడానికి ఠాగూర్‌ నవల 'నౌకా డూబి' ఆధారంగా నితిన్‌బోస్‌ దర్శకత్వంలో 'మిలన్‌'లో హీరోగా తీసుకున్నారు. 1946లో వచ్చిన 'మిలన్‌' కూడా పెద్దగా నడవలేదు. కానీ దిలీప్‌ కెరీర్‌లో మైలురాయి అన దగ్గ చిత్రంగా నిలిచిపోయింది.. నితిన్‌బోస్‌ నటుడిగా దిలీప్‌ను తీర్చిదిద్దాడు. నటనలో భావాల అభివ్యక్తీకరణ తీరుతెన్నులు ఎలా ఉండాలో క్షుణ్ణంగా బోధించాడు. ఆ సలహాలు, సూచనలను తన సినీ కెరీర్‌ మొత్తంలో అనుసరించారు దిలీప్‌కుమార్‌. అంతేగాకుండా 'మిలన్‌'లో దిలీప్‌ నటనను అప్పటి సినీ విమర్శకులు ఆకాశానికి ఎత్తేశారు. దీంతో ఆయన సినీ జీవితం మలుపు తిరిగిందనే చెప్పవచ్చు. మిలన్‌ తరువాత షౌకత్‌ హుస్సేన్‌ రజ్వి నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన 'జుగ్ను' (1947) సూపర్‌ హిట్‌ అవడంతో దిలీప్‌కుమార్‌ విజయాల పరంపర మొదలైంది. ఈ చిత్రంలో కాలేజీ కుర్రవాడి వేషం దిలీప్‌కుమార్‌ది కాగా హీరోయిన్‌ నాటి ప్రసిద్ధ సింగింగ్‌ స్టార్‌ నూర్జహాన్‌. 'జుగ్ను'తో పెద్ద హిట్‌ చేజిక్కుంచుకున్నా ఆ వెంటనే మరో హిట్‌ దక్కలేదు. అయితే నౌషాద్‌ అలీ సిఫారసు చేయగా 'మేలా' (1948)లో అవకాశం వచ్చింది. హీరోయిన్‌ నర్గీస్‌. నౌషాద్‌ సంగీతంతో సినిమా పెద్ద హిట్‌. పాటలు దేశమంతా మారుమోగి పోయినవి. 'ఎ జిందగీకి మేలే' (రఫీ). 'ధర్తీ కో ఆకాశ్‌ పుకారే (ముఖేశ్‌ - పంషాద్‌) పాటలు పెద్ద హిట్‌ అయినవి. అతి పెద్ద కమర్షియల్‌ సక్సెస్‌ కావడంతో దిలీప్‌కుమార్‌ నాటి యువతరం మెచ్చే నటుడైపోయారు. ఆయన సంభాషణలు హావభావాలు, నటనలోని విలక్షణత ఇండియన్‌ సినిమాకు కొత్తదనాన్ని ఆపాదించినవి. పైలా పచ్చీస్‌ వయసులో వున్న దిలీప్‌కుమార్‌ యవ్వన స్ఫురద్రూపం ఒక్కసారిగా బాలీవుడ్‌ తెరపై స్టార్‌ హీరో శకాన్ని ప్రారంభించింది. ఒక లెజెండ్‌ హీరోగా తనను తాను రూపొందించుకోవడం మొదలుపెట్టారు దిలీప్‌. మేలా తరువాత ఆయన మరెప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోనే లేదు. ప్రతి సినిమా ఒక చరిత్రను సృష్టించింది. ఒక్కో మైలు రాయిగా నిలిచిపోయిన మిలన్‌, షహీద్‌, నదియా కే పార్‌, జోగన్‌, హల్‌చల్‌, ఫుట్‌పాత్‌, సంగ్‌దిల్‌ అందాజ్‌, దీదార్‌, దాగ్‌ వరుసగా అన్నీ రొమాంటిక్‌ ట్రాజెడీలే. 'ట్రాజెడీ కింగ్‌' అన్న టైటిల్‌ ఆయన కీర్తి కిరీటంతో చేరిపోయింది. దిలీప్‌కుమార్‌ నటన ఏ చిత్రానికాచిత్రంలో వైవిధ్యం కనిపిస్తుంది. ఈ రకంగా మొత్తం మన దేశంలోనే మొట్టమొదటి మెథడ్‌యాక్టర్‌ దిలీప్‌కుమార్‌. పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకుని తనను తాను ఆ పాత్రను ఆవహిస్తాడు. సంభాషణలు పలకడంతో ఆయనదొక శైలి. మాటలు లోగొంతుకలోంచి వస్తున్నట్లుగా స్పష్టతతో ముఖకవళికలను కలగలుపుతూ నటించడం ఆయన ప్రత్యేకత. నటుడుగా తాను కనిపించ కుండా పాత్రను తెరపై ఆవిష్కరిస్తూ గొంతులో నవరసాలను పలికించడం ఆయనకు మాత్రమే సాధ్యం. దిలీప్‌కుమార్‌ నటనలోని గొప్పతనం కూడా ఇదే. ఆ నటన ప్రేక్షకుడిని తన ఆధీనంలోకి తీసుకుం టుంది. ఆ పాత్రలు, సంభాషణలు ప్రేక్షకుడిని వెంటాడుతుంటాయి. దారి తప్పిన మనిషి అరాచక వాదిగా మారి చేసిన అకృత్యాలకు తనను తాను దోషిగా నిలబెట్టుకుని ''ఫుట్‌పాత్‌'' (1953)లో చెప్పే డైలాగ్‌ దిలీప్‌ నటనలోని పరిణితిని ఆవిష్కరిస్తుంది. ''నేను బ్లాక్‌ మార్కెట్‌ దందా చేశాను. జనం ఆకలితో అలమ టిస్తుంటే వారి తిండి గింజల్ని ఎక్కువ ధరకు అమ్మి డబ్బును పెట్టెల నిండా నింపుకున్నాం. రోగాలు ప్రబలు తుంటే మందుల్ని దాచి ఎక్కువ ధరకు అమ్మివేశాం. పోలీసులు దాడులు చేస్తారని తెలియగానే వాటిని మురికి కాలువల్లోకి పారవేశాం. నేను మనిషినే కాదు ఒక రక్త పిశాచాన్ని. నేను దాచిన మందులతో బతికేవాళ్ళంతా చనిపోయారు. మా అన్న కూడా చచ్చిపోయాడు. ఈ భూమి మీద గాలి పీల్చే అర్హత కూడా నాకు లేదు. మనిషిగా ఉండలేదు. నన్ను చంపేయండి'' అంటూ ప్రదర్శించే ఎమోషనల్‌ నటనలో మరొకరిని ఊహించలేము. దిలీప్‌కుమార్‌ను నటునిగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన చిత్రం ''దేవ్‌దాస్‌'' (1955). ఇది అత్యున్నత భారతీయ టాప్‌ 25 చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. 1935లోనే న్యూ ధియేటర్స్‌ వారు కె.ఎల్‌.సైగల్‌లో హిందీలో దేవ్‌దాస్‌ తీశారు. అదొక తరం. ఆ తరంలో సైగల్‌దొక తరహా నటన గానాలతో భారతీయ ప్రేక్షకులకు ఓలలాడించాడు. కాని 1955 నాటికి సమాజంలో ఒక కొత్త తరం శరత్‌ దేవదాస్‌ను ఎలా చూడాలనుకున్నదో బిమాల్‌రారు అదేస్థాయిలో తీశాడు. దిలీప్‌కుమార్‌ దేవదాస్‌గా వీరవిహారం చేస్తాడు. సైగల్‌ని మరిపించాడు కూడా. హీరోయిన్లు సుచిత్రాసేన్‌, వైజయంతి, దర్శకుడు ఎవరూ కనిపించరు. దిలీప్‌ నటన తెర నిండా ఆక్రమించుకుపోయింది. 'కౌన్‌ కంబఖ్త్‌ హై జో బర్దాష్‌ కర్నె కేలియే పీతా హూ మైతో పీతా హూంకి బస్‌ సాంస్‌ లే సకూఁ' దేవాదాస్‌కి జాతీయ స్థాయిలో మూడో ఉత్తమ చిత్రం అవార్డుతో బాటు దిలీప్‌కి ఉత్తమ నటునిగా ఫిలింఫేర్‌ అవార్డు దక్కింది. ''దేవదాస్‌'' చిత్రం దిలీప్‌ని ట్రాజెడీ కింగ్‌ను చేసింది. మరో వైపు వరుసగా విషాద పాత్రలు వేయడంతో దిలీప్‌ వ్యక్తిగతంగా కూడా డిప్రెషన్‌లోకి వెళ్లడం మొదలు పెట్టాడు. ఆయన పాత్రల ప్రభావం అంతలా ఉండేది. దాంతో డాక్టర్‌ సలహా మేరకు విషాద పాత్రలు మాని సరదా పాత్రలు వేయడం ప్రారంభించారు. ఆజాద్‌, నయాదేర్‌, మధుమతి, పైగామ్‌ వంటివి అలాంటి చిత్రాలే. అయితే దిలీప్‌కుమార్‌ చలన చిత్ర జైత్రయాత్రతో బాటు తన ప్రేమ యాత్రను కూడా విజయవంతంగా నడిపిస్తున్నాడు. అసలు సినీ ప్రపంచంలో ప్రేమలో పడనివారెవరు? దిలీప్‌ అందుకు మినహాయింపేమి కాదు. దిలీప్‌ తొలిప్రేమ కామినీ కౌషల్‌తో నడిచింది. అప్పటికే ఆమె వివాహితురాలు. ఇంట్లో వారిని ఎదిరించి సినిమాల్లో నటించేది. ఆమె షహీద్‌ నదియాకే పార్‌, షబ్నం ఆర్జూ చిత్రాల్లో దిలీప్‌ కుమార్‌తో కలిసి నటించింది. ఇద్దరూ పీకల లోతుల్లో ప్రేమలో కూరుకుపోయారు. కామిని మిలటరీ సోదరుడు బెదిరించినా వినలేదు. చివరకు అతను పరువు కోసం ఆత్మహత్య చేసుకోవడం తో వీళ్ల ప్రేమకథ అర్థాంతరంగా ముగిసి పోయింది. మేలా, అందాజ్‌, బాబుల్‌, జోగన్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన నర్గీస్‌తో కొంతకాలం ప్రేమా యణం నడిచినా చివరికి మధుబాలతో ఆయన ప్రేమకథ బలంగా కొనసాగింది. అప్ప టికే ఆయన పెద్ద హీరోగా స్థిరపడిపోయారు. ఆయన రెమ్యునరేషన్‌ లక్షకు చేరింది. బాబుల్‌, తరానా, సంగ్‌దిల్‌ అమర్‌ వంటి చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్‌లో బాక్సాఫీసు వద్ద సూపర్‌ హిట్లు. అంతేలాగ వీరి ప్రేమ కూడా. కానీ ఆమె తండ్రి తను తీసే చిత్రాల్లో దిలీప్‌ తప్పకుండా నటించాలనే నిబంధన పెట్టడంతో వ్యక్తిగతం, కెరీర్‌ రెండూ వేరుగా చూసే దిలీప్‌కు ఈ కండీషన్‌ నచ్చలేదు. మధుబాల ఎవరికీ చెప్పలేకపోయింది. నయాదౌర్‌లో కలిసి నటిస్తున్న సమయం అది. షూటింగ్‌ అంతా ఔట్‌డోర్‌లో. తండ్రి ససేమిరా అన్నాడు. నిర్మాత దర్శకుడు బి.ఆర్‌.చోప్రా కోర్టుకెక్కాడు. దిలీప్‌ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడంతో మధుబాలకు కోర్టులో చుక్కెదురైంది. దాంతో వారి ప్రేమకథ అంతటితో ఆగిపోయింది. 'నయాదౌర్‌' లో మధుబాల స్థానంలో వైజయంతీమాల హీరోయిన్‌గా నటించింది. ఇవన్నీ ఇలా జరుగుతుండగానే కె.ఏ.ఆసిఫ్‌ ప్రతిష్టాత్మకం గా తీస్తున్న 'మొఘల్‌ ఏ ఆజమ్‌' దిలీప్‌ మధుబాల హీరో హీరోయిన్లుగా షూటింగ్‌ మొదలైంది. మొఘల్‌ ఏ ఆజం భారతీయ సినీ తెరపై ఒక సిల్యులాయిడ్‌ కావ్యం. ముందుగా అక్బర్‌ వేషానికి తొలితరం నటుడు చంద్రమోహన్‌ని అనుకున్నారు. కానీ చివరికి పృథ్వీరాజ్‌ కపూర్‌ను ఫైనల్‌ చేశారు. దాంతో దిలీప్‌కుమార్‌ ఒక్కసారిగా సందిగ్ధంలో పడిపోయారు. భారీ డైలాగ్‌లు గాంభీరమైన నటనతో తెరనంతా పెద్దాయన ఆక్రమిస్తాడని అందుకు తను అండర్‌ ప్లేతో హావభావాలు బరువైన డైలాగుల్ని నెమ్మదిగా తనదైన ఒకనూతన శైలిలో పలుకుతూ నటించారు. అది తెరపై పండింది. ఇక మధుబాలతో అప్పటికే దిలీప్‌కి చెడింది. సెట్‌లో చెరో వైపు ముఖాలు తిప్పుకుని కూర్చునేవారు. షాట్‌ రెడీ కాగానే పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసేవారు. ఇద్దరు విడిపోయిన ప్రేమికులు ప్రణయ సన్నివేశాల్లో అంత సజీవంగా నటించడం మరెవరికీ సాధ్యంకాదు. మొఘల్‌ ఏ ఆజం బ్లాక్‌బస్టర్‌ హిట్‌. విఫల ప్రేమికులు నటించిన ప్రణయ కావ్యంగా చరిత్రలోకెక్కిందీ చిత్రం. ఇంతలో తనకేదో సినిమా తీయాలనిపించి 'గంగా జమున' తీశారాయన. కానీ సెన్సార్‌ చిక్కుల్లో పడింది. లెక్కలేనన్ని కటింగ్స్‌తో అడ్డం పడ్డారు. ఆయన ఇమేజి సినిమా విడుదలకు పనికి రాలేదు. ఏకంగా అప్పటి ప్రధాని నెహ్రూ వద్దకెళ్లి ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోయింది. ఆ తరువాత మొరార్జీని కలువగా ఒక్క కట్‌ కూడా లేకుండా సినిమా విడుదలయ్యేలా చేశారు. ఈ అనుభం దృష్ట్యా ఆ తరువాత మరెప్పుడూ స్వంతంగా సినిమాలు తీయలేదు దిలీప్‌. గంగ జమున తరువాత 1976వరకు వరుసగా లీడర్‌, దిల్‌ దియా దర్ద్‌ లియా, పారీ, రాం ఔర్‌ శ్యాం, ఆద్మీ, సంఘర్ష్‌, గోపీ, దాస్తాన్‌, అనోఖాప్యార్‌, బైరాగ్‌ (1976) వరకు ఆయన హీరోగా ఒక వెలుగు వెలిగారు. ఈ మధ్య కాలంలో షమ్మీ కపూర్‌, శశికపూర్‌, రాజేంద్ర కుమార్‌, మనోజ్‌ కుమార్‌, ధర్మేంద్ర, రాజేశ్‌ఖన్నా, అమితాబ్‌, జారు ముఖర్జీ ఒక్కరేమిటీ చాలా మంది హీరోలు ఇండిస్టీకి వచ్చినా దిలీప్‌ స్థానం, స్థాయి ఇంచు కూడా తగ్గలేదు. పైగా అందరూ దిలీప్‌లా నటించి రాణించాలని ఆయనను అనుకరించేవారే. ఇప్పటికీ అమితాబ్‌, అనీల్‌కపూర్‌, షారుఖ్‌ఖాన్‌ల వరకు ఆయన ప్రభావం కొనసాగింది. ఒకరంగా చెప్పాలంటే క్రాంతి (1981)తో ఆయన రెండో ఇన్నింగ్స్‌ మొదలైందనుకోవాలి. ఆ తరువాత విధాత, మజ్జార్‌, మషాల్‌, దునియా, కర్మ, సౌదాగర్‌ (1991) చిత్రాలు వయసు పైబడిన వేషాలు వేసినా వాటిల్లో ఆయనే హీరో. వీటిలో 'శక్తి' చిత్రం లో అమితాబ్‌ మరో హీరో. తండ్రి కొడుకులుగానూ నటించారు. అది మొఘల్‌ ఏ ఆజం నాటి పరిస్థితి. ఇప్పుడు పృధ్వీరాజ్‌ స్థానంలో దిలీప్‌, దిలీస్‌ స్థానంలో అమితాబ్‌ పోటీపడి అద్భుత నటనను పండించారు. ఆయన ఆఖరు చిత్రం ఖిలా (1998). ఆయన డైరెక్ట్‌ చేసిన ఏకైక చిత్రం. కళింగ ఏవేవో కారణాల వల్ల రిలీజ్‌ కాలేదు. 1944 నుండి 1998 వరకు ఆయన నటించిన చిత్రాలు 63కు మించవు. ఆయన తన నట జీవితంలో ఒకే సమయంలో ఒకే సినిమా అన్న నియామవళిని కడవరకు పాటించారు. దిలీప్‌కుమార్‌ నట జీవితంలో జాతీయ అవార్డులు కన్నా అధికంగా ఫిలింఫేర్‌ అవార్డులు అందు కున్నారు. జాతీయ అవార్డులపై ఆయనకు సదాబి ప్రాయం ఉండేది కాదు. 1991లో 'పద్మభూషణ్‌', 1995లో 'దాదాఫాల్కే పురస్కారం', 1998లో పాకిస్తాన్‌ ప్రభుత్వ నిషాన్‌ - ఏ ఇంతియాజ్‌, 2000లో రాజ్యసభ సభ్యుడిగా, 2015లో 'పద్మవిభూషణ్‌' పురస్కారాలు ఆయనను వరించి తమ గౌరవాన్ని పెంచుకున్నవి. రాజకీయ కారణాల వల్ల 'భారతరత్న' రాకపోయినా భారతీయుల హృదయాలలో ఆయన స్థానం అంతకు మించినదే. సత్యజిత్‌రే వంటి మహా దర్శకుడు దిలీప్‌ కుమార్‌ నటనకు నిలు వెత్తు రూపం అని ప్రశంసించారు. హృదయ గతమైన, సున్నిత సుమకోమలమైన ద్వారాలను తాకగలిగే రొమాంటిక్‌, ట్రాజెడీ పాత్రల పోషణలో దిలీప్‌ కుమార్‌ అగ్రగణ్యుడని పలువురు సినీ విమర్శకుల అభిప్రాయం. అందుకే బాలీవుడ్‌లో నటన జీవించిన కాలం పేరు దిలీప్‌కుమార్‌. దిలీప్‌కుమార్‌ తెరపై మానవ సహజ భావనలకు నటనా రూపమిచ్చిన వాడు. అతను నటుడిగా జీవించడానికే పుట్టిన వాడు. ఆయన తన కర్తవ్యం పూర్తవగానే నిశ్శబ్దంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆయన బాలీవుడ్‌ ఆఖరి మొఘల్‌. ఓ దూర్‌ కే ముసాఫిర్‌ హమ్‌ కో భి సాథ్‌ లేలే రే హమ్‌ కో భి సాథ్‌ లే లే హమ్‌ రహెగయే అకేలే! బాలీవుడ్‌ హీరో త్రయం - విఫల ప్రేమలు బాలీవుడ్‌ను తిరుగులేని కథా నాయకులుగా ఏలినది ముగ్గురే ముగ్గురు దిలీప్‌కుమార్‌, రాజ్‌కపూర్‌, దేవానంద్‌. వీరిలో రాజ్‌కపూర్‌ సీనియర్‌. అయినప్పటికీ హీరోగా తొలుత నటిచింది దిలీప్‌కుమార్‌. ఆ తరువాత 1946లో దేవానంద్‌ 'హమ్‌ ఏక్‌హై'తో హీరో అయితే, 1947లో 'నీల్‌ కమల్‌' లో రాజ్‌కపూర్‌ హీరోగా తొలుత నటించాడు. దిలీప్‌ ట్రాజెడీలు చేస్తే, దేవ్‌ రొమాంటిక్‌ రోల్స్‌, రాజ్‌కపూర్‌ షోమన్‌ గా రాణించారు. దేవానంద్‌, రాజ్‌కపూర్‌లు దిలీప్‌కుమార్‌తో కలిసి నటించి వారి మధ్య స్నేహపూర్వకం వాతావరణం ఉందని చెప్పకనే చెప్పారు. 1949లో మెహబూబ్‌ఖాన్‌ 'అందాజ్‌'లో రాజ్‌ - దిలీప్‌లు హీరోలు. నర్గీస్‌ నాయిక. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ. ఇందులో దిలీప్‌ది ట్రాజిక్‌ హీరో పాత్ర. సినిమాలో మార్కులు మొత్తం కొట్టేశాడు. మళ్లీ దిలీప్‌ రాజ్‌లు కలిసి నటించనే లేదు. నిజానికి వాళ్లిద్దరు పెషావర్‌ నాటి నుంచి బాల్య స్నేహితులు. ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. కానీ వృత్తి విషయానికి వచ్చినపుడు ఎవరి జాగ్రత్తల్లో వారున్నారు. దిలీప్‌కుమార్‌ నటుడిగా తన టాలెంట్‌ను తన బలమైన ముద్రతో ఆవిష్కరిస్తాడు. అందాజ్‌లో అదే జరిగింది. 'దీదార్‌'లో కూడా అశోక్‌ కుమార్‌ నటన దిలీప్‌ ముందు దూదిపింజలా తేలిపోయింది. ఇక దిలీప్‌ - దేవానంద్‌లు కలిసి నటించిన ఏకైక చిత్రం 'ఇన్సానియత్‌' (1955). ఇది పల్లెటూరి పిల్ల (1951) తెలుగు చిత్రానికి రీమేక్‌. తెలుగులో ఎన్టీఆర్‌ చేసిన రోల్‌ దేవ్‌, దిలీప్‌ - అక్కినేని పాత్రను పోషించారు. మళ్లీ దేవ్‌ - దిలీప్‌ కలిసి నటించలేదు. ఏది ఏమైనా ముగ్గురూ ఒకరి నీడలు మరొకరిపై పడకుండానే వారి కెరీర్‌ను సాగించారు. ఐతే విచిత్రంగా ముగ్గురూ తమ ప్రేమల్లో విఫలమైనారు. దిలీప్‌కుమార్‌కి అన్ని కలిసి వచ్చినా మధుబాల ప్రేమను ఆమె తండ్రి జోక్యంతో త్యాగం చేయవలసి వచ్చింది. చివరికి తన వయసులో సగం ఉన్న సైరాబానుని పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత హైదరాబాదుకు చెందిన సైరా ఆస్మాన్‌ను 1980లో దిలీప్‌ పెళ్లి చేసుకున్నాడు. కానీ సైరాబాను ఒప్పుకోలేదు. పెద్దల జోక్యంతో 1983లో సైరాకు విడాకులు ఇచ్చేశాడు. తెలుగు సినిమాలతో అనుబంధం.. దిలీప్‌కుమార్‌కు దక్షిణ భారత సినిమా రంగంతో సన్నిహిత సంబంధాలుండేవి. పక్షిరాజా శ్రీరాములు నాయుడు 'ఆజాద్‌' చిత్రం దిలీప్‌తోనే తీశారు. హీరోయిన్‌ భానుమతి. డి.రామానాయుడు 'రాముడు - భీముడు'ని విజయా వారు హిందీలో దిలీప్‌ - రామ్‌ ఔర్‌ శ్యామ్‌ గా తీశారు. జెమినీ వారు 'ఇన్సానియత్‌' 'పైగాం' చిత్రాలలో ఆయనే హీరో. ఎన్టీఆర్‌ ఏఎన్నార్‌లతో ఆయనకు దగ్గర స్నేహం ఉండేది. అక్కినేని తెలుగులో నటించిన 'కలెక్టర్‌ గారబ్బాయి'ని హిందీలో 'కానూన్‌ ఆప్నా ఆప్నా' గా హిందీలో ఆయనే చేశారు. 'బొబ్బిలి బ్రహ్మన్న' హిందీ వెర్షన్‌ 'ధరమ్‌ అధికారి'గా ఆయనే నటించారు. దక్షిణ భారత దేశంలో స్టూడియో నిర్వహణ తీరుతెన్నులను, ఇక్కడి పనితనాన్ని చాలా ఇష్టపడే వారాయన. తాను దేవదాసులో నటించాక ఎవరో చెప్పగా అక్కినేని 'దేవదాసు' చూసి ఒకవేళ ముందుగా ఈ చిత్రాన్ని చూసి ఉంటే నా నటన మరోలా ఉండేదన్నారు.
Today’s stock market – సెన్సెక్స్ 60,260 పాయింట్లకు చేరుకోగా, నిఫ్టీ 17,950 మార్కు దగ్గర స్థిరపడింది. బుధవారం బెంచ్‌మార్క్ సెన్సెక్స్ మరియు నిఫ్టీ సూచీలు లాభాలను చవిచూశాయి, ఏడు రోజుల విజయ పరంపరను సూచిస్తుంది. సెన్సెక్స్ 0.69% పెరిగి 60,260.13 పాయింట్లకు చేరుకోగా, నిఫ్టీ 0.66% జంప్ చేసి 17,944.25 పాయింట్లకు చేరుకుంది. మిడ్‌క్యాప్ సూచీలు కూడా సానుకూల సంకేతాలను చూపించాయి, నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 50.65 పాయింట్లు లేదా 0.6% లాభపడి 8,506.8 పాయింట్ల వద్ద ముగిసింది. బుధవారం మార్కెట్ నివేదికపై మరిన్ని వివరాల కోసం చదవండి. అత్యధికంగా లాభపడినవారు మరియు నష్టపోయినవారు ఎవరు? స్టాక్ మార్కెట్‌లో గెలిచిన రంగాలలో నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్, నిఫ్టీ మీడియా మరియు నిఫ్టీ ఐటి వరుసగా 2.21%, 1.44% మరియు 1.15% పెరిగాయి. అదే సమయంలో, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ మరియు హీరో మోటోకార్ప్ వరుసగా 5.73%, 3.48% మరియు 3.3% లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్, M&M, మరియు టాటా మోటార్స్ లిమిటెడ్ వరుసగా 1.11%, 1.11% మరియు 0.99% పడిపోయి అత్యధికంగా నష్టపోయిన స్టాక్‌లుగా నిలిచాయి. సమాచారం గ్లోబల్ మార్కెట్లను ఒక్కసారి చూడండి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్, హ్యాంగ్ సెంగ్ మరియు నిక్కీ వరుసగా 0.45%, 0.46% మరియు 1.23% పెరిగి 3,292.53 పాయింట్లు, 19,922.45 పాయింట్లు మరియు 29,222.77 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. USలో, NASDAQ ఎరుపు రంగులో ముగిసింది, 0.19% పడిపోయి 13,102.55 పాయింట్లకు చేరుకుంది. సరుకులు US డాలర్‌తో పోలిస్తే INR 0.26% పెరిగింది US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి (INR) 0.26% పెరిగి రూ. బుధవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో 79.45. మరోవైపు, గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్ప కదలికను చవిచూసి, ఫ్లాట్‌గా ముగిసేసరికి రూ. 51,829, వెండి ఫ్యూచర్స్ 0.56% పడిపోయి రూ. 57,342. ముడి చమురు భవిష్యత్ ధరలు బ్యారెల్‌కు $0.57 లేదా 0.66% పెరిగి $87.04కి చేరుకున్నాయి. సమాచారం ఢిల్లీ, ముంబైలలో ఇంధన ధరలు మారలేదు బుధవారం ఢిల్లీలో ఇంధన ధరలు మారలేదు, డీజిల్ ధర రూ. 89.66/లీటర్ మరియు పెట్రోల్ ధర రూ. 96.76/లీటర్. ముంబైలో డీజిల్ ధర రూ. 94.25/లీటర్ పెట్రోల్ ధర రూ. 106.29/లీటర్. క్రిప్టో నేడు జనాదరణ పొందిన క్రిప్టోకరెన్సీలు ఎలా పని చేస్తున్నాయి? ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ $23,840.53 వద్ద అమ్ముడవుతోంది, ఇది నిన్నటితో పోలిస్తే 1.09% తగ్గింది. ఇంతలో, Ethereum 0.2% తగ్గింది మరియు $1,889.92 వద్ద విక్రయిస్తోంది. టెథర్, BNB మరియు కార్డానో వరుసగా $1 (0.01% తగ్గుదల), $316.38 (0.51% తగ్గుదల) మరియు $0.5596 (1.32% తగ్గుదల) వద్ద ట్రేడవుతున్నాయి. చివరగా, నిన్నటితో పోలిస్తే 3.43% తగ్గింది, Dogecoin ఇప్పుడు $0.08464 వద్ద ట్రేడవుతోంది. ద్రవ్యోల్బణం సడలించడం మరియు బలమైన ఆదాయాలు లాభాలను పెంచడంతో భారతీయ ఈక్విటీలలో బుల్ రన్ బుధవారం వరుసగా ఐదవ వారం వరకు పొడిగించబడినందున సెన్సెక్స్ నాలుగు నెలల్లో మొదటిసారిగా కీలకమైన 60,000 స్థాయికి పైన ముగిసింది. Today’s stock market 30 షేర్ల బిఎస్‌ఇ ఇండెక్స్ 417.92 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 60,260.13 వద్ద స్థిరపడింది. రోజులో, ఇది 481.04 పాయింట్లు పెరిగి 60,323.25 వద్దకు చేరుకుంది. విస్తృత NSE నిఫ్టీ 119 పాయింట్లు లేదా 0.67 శాతం పెరిగి 17,944.25 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ప్యాక్ నుండి, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఎన్‌టిపిసి, విప్రో మరియు హిందుస్థాన్ యూనిలీవర్ అత్యధికంగా లాభపడ్డాయి. మరోవైపు, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు పవర్ గ్రిడ్ వెనుకబడి ఉన్నాయి. శుక్రవారం ఊహించిన దాని కంటే మృదువైన ద్రవ్యోల్బణం పఠనం రాబోయే నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రేటు పెంపుదల యొక్క వేగం మరియు పరిమాణాన్ని తిరిగి స్కేల్ చేయగలదనే ఆశలను పెంచింది. “ఒకటి లేదా రెండు చక్రాలతో దూకుడు రేట్ల పెంపు చక్రం ముగిసే అవకాశం ఉంది” అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా రాయిటర్స్‌తో అన్నారు. “దృక్పథం (గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల ద్వారా) క్రమంగా మృదువుగా మారవచ్చు మరియు మార్కెట్ మృదువైన ల్యాండింగ్ కోసం ఆశిస్తోంది, ఇది ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్‌ను పెంచుతుంది.” బలమైన కార్పొరేట్ జూన్-త్రైమాసిక ఫలితాలు, వస్తువుల ధరలను తగ్గించడం మరియు వినియోగదారుల ద్రవ్యోల్బణం తగ్గడం దేశీయంగా సహాయపడింది. మానసిక స్థితి, ముఖ్యంగా వినియోగదారు మరియు ఆటో స్టాక్‌లలో, Mr Khemka జోడించారు. భారతీయ మూలధన మార్కెట్లలోకి ఇటీవలి విదేశీ మూలధన ప్రవాహం కారణంగా సానుకూల పెట్టుబడిదారుల మూడ్ కూడా పెరిగింది. భారతీయ స్టాక్‌లలో తాజా బుల్ రన్ ఇప్పుడు వరుసగా ఐదవ వారంలో ఉంది, గత నాలుగు వారాలలో దాదాపు 11 శాతం లాభాలతో, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు 2022లో తమ నష్టాలన్నింటినీ తిరిగి పొందాయి. “ఎఫ్‌ఐఐల స్థిరమైన భాగస్వామ్యం దేశీయ మార్కెట్‌లో ప్రస్తుత ర్యాలీకి వెన్నెముక. ద్రవ్యోల్బణం పాశ్చాత్య మార్కెట్‌లను పీడిస్తున్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ ప్రదర్శించిన స్థితిస్థాపకత కారణంగా ఎఫ్‌ఐఐ ధోరణిలో ఈ తిరోగమనం ఏర్పడింది” అని రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో, PTIకి చెప్పారు. “కమోడిటీ మరియు చమురు ధరలు తగ్గడం కూడా విదేశీ పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని నింపింది” అని ఆయన చెప్పారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) జులై ప్రారంభం వరకు స్థిరంగా భారతీయ స్టాక్‌లను విక్రయిస్తూనే ఉన్నారు, ఆధునిక ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం, డాలర్‌కు డిమాండ్ పెరగడం మరియు US బాండ్ల నుండి బలమైన రాబడి వంటి అనేక కారణాల వల్ల, జూలైలో వారు నికర కొనుగోలుదారులను మార్చారు. , మొత్తం స్టాక్‌లో రూ. 4,989 కోట్లు పెట్టుబడి పెట్టడంతోపాటు ఈ నెల కూడా అలాగే కొనసాగింది.
ఈ ఏడాది దీపావళి కానుకగా వచ్చిన చిత్రాలన్నీ తెలుగు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత వచ్చిన సినిమాలలో ఫర్వాలేదు అనిపించుకున్న చిత్రాలకు సైతం ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కలేదు. దాంతో దీపావళి సీజన్‌ను ఉపయోగించుకోవడానికి తెలుగు నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. నవంబర్ మొదటి వారాంతంలో అనువాద చిత్రాలు మూడు విడుదల కాగా, స్ట్రయిట్ తెలుగు సినిమా ఒక్కటే దీపావళికి విడుదలైంది. వీటితో పాటే సూర్య తమిళ చిత్రం ‘జై భీమ్’ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యి, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. గత కొంతకాలంగా రజనీకాంత్ ఒకే వర్గం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. ‘కబాలి, కాలా’ చిత్రాలతో పాటు ఆ తర్వాత వచ్చిన ‘దర్బార్, పేట’ కూడా ఘన విజయాన్ని పొందలేక పోయాయి. దాంతో దర్శకుడు శివ ఈ తమిళ సూపర్ స్టారను మరోసారి కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసే ప్రయత్నం చేశాడు. అలా తెరకెక్కిన ‘అన్నాతే’ను తెలుగులో ‘పెద్దన్న’గా డబ్ చేశారు. అయితే మరీ ఎనభైల నాటి కాలానికి చెందిన ఈ కథ ఈ తరాన్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. తల్లి చనిపోతూ తన చేతిలో పెట్టిన చెల్లిని అల్లారుముద్దుగా పెంచే వీరన్న అనే గ్రామ పెద్ద పాత్రను రజనీకాంత్ ఇందులో పోషించాడు. అతని చెల్లిగా కీర్తిసురేశ్ నటించింది. అన్నయ్య కోసం ప్రాణం పెట్టే ఆ చెల్లి సరిగ్గా పెళ్లి రేపు అనగా ఇంటి నుండి వెళ్లిపోతుంది. ఆమె ఎందుకు అలా చేసింది? ఆ తర్వాత ఎలాంటి కష్టాలు పడింది? ఆ సమయంలో చెల్లి మనసెరిగి ఆ అన్నయ్య ఎలా ఆమెను ఆదుకున్నాడు? అనేదే ఈ సినిమా. కథ, కథనాలలో ఏ మాత్రం కొత్తదనం లేని ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చినా, రజనీకాంత్ అభిమానులు సైతం దీనిని చూసి డీలా పడిపోయారు. నేల విడిచి సాము చేసిన ‘ఎనిమి’ విశాలకు తమిళంలో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు ఉంది. అలానే ఆర్యకూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ కలిసి గతంలో ‘అవన్ – ఇవన్’ అనే సినిమాను బాల దర్శకత్వంలో చేశారు. తిరిగి పదేళ్ల తర్వాత వీరిద్దరితోనూ ఆనంద్ శంకర్ ‘ఎనిమి’ అనే సినిమా తీశాడు. మైండ్ గేమ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం దర్శకుడు చాలా బలహీనమైన కథను రాసుకున్నాడు. బాల్యంలోనే ప్రకాశ్ రాజ్ చేతిలో కొంత శిక్షణ పొందిన ఇద్దరు పిల్లలు ఆ తర్వాత వేర్వేరు దారులు పడతారు. ఒకరు హీరో అయితే, మరొకరు విలన్. ఆ తర్వాత కొన్నేళ్లకు ఒకరికి ఒకరు తారసపడినప్పుడు వారి ఎత్తులు, జిత్తులు ఎలా ఉంటాయన్నదే ఈ సినిమా. కాస్తంత ఫాదర్ సెంటిమెంట్ ను ఈ యాక్షన్ మూవీకి దర్శకుడు జత చేశాడు. కానీ సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఏ ఒక్క సన్నివేశమూ ప్రేక్షకులను కట్టిపడేసేలా లేకపోయింది. యాక్షన్ సన్నివేశాలు బాగానే ఉన్నా, కథలో బలం లేకపోవడంతో ‘ఎనిమి’ నేల విడిచి సాము చేసినట్టు అయ్యింది. పెద్దంతగా ఆకట్టుకోని ఇటర్నల్స్’ దీపావళి కానుకగా రెండు తమిళ చిత్రాలు తెలుగులో డబ్ కాగా, మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఆంగ్ల త్రీడీ చిత్రం ‘ఇటర్నల్స్’ సైతం తెలుగువారి ముందుకు వచ్చింది. సూపర్ హీరోస్ సినిమాలకు మార్వెల్ స్టూడియోస్ పెట్టింది పేరు. అవెంజర్స్ సీరినకు గత యేడాది ఈ సంస్థ ఫుల్ స్టాప్ పెట్టడంతో ఇప్పుడు కొత్త సూపర్ హీరోను తెర మీదకు తీసుకొస్తూ ‘ఆటర్నల్స్’ను నిర్మించింది. ఇందులో సూపర్ పవర్స్ ఉన్న పదిమంది వ్యక్తులు మనకు తారసపడతారు. ఏడు వేల సంవత్సరాల క్రితం భూమిని రాక్షసుల బారి నుండి రక్షించడానికి వేరే గ్రహం నుండి ఇక్కడికి వచ్చిన వీరు, ఇక్కడే రకరకాల ప్రదేశాలలో ఉంటారు. తాజాగా మరోసారి ప్రళయం ముంచుకొచ్చినప్పుడు వారు దాన్ని ఎలా ఎదుర్కొ న్నారు? అందులో కొందరు ఎలా కన్నుమూశారు? అనేదే ఈ సినిమా. యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్ సీన్స్ బాగున్నా, కథలో దమ్ములేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విఫలమైన మారుతి ప్రయోగం! దర్శకుడు మారుతి ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ పడటంతో ఖాళీగా ఉండకుండా ఆ టైమ్ లో ‘మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమా తీశాడు. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరించలేక పోయింది. కొలిగ్ తో ప్రేమలో పడిన తన కూతురు ఎక్కడ చేజారిపోతుందో అని మథనపడే ఓ తండ్రి వ్యథ ఇది. అయితే వినోదం పేరుతో మారుతీ నటీనటులతో చేయించిన ఊర కామెడీ జనాలకు వెగటు పుట్టించింది. దాంతో ఈ స్ట్రయిట్ తెలుగు సినిమానూ వారు తిరస్కరించారు. మొత్తం మీద దీపావళి కానుకగా వచ్చిన నాలుగు సినిమాలు తడిచిన బాణసంచా మాదిరి తుస్సుమన్నాయి. మరి కార్తీకమాసం తొలి వారాంతంలో వచ్చే సినిమాలైనా కాకరపువ్వొత్తుల్లా వెలుగులు విరజిమ్ముతాయేమో చూడాలి.
సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ ఉద్యమించి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్న ఘన చరిత్ర విశాఖపట్నం సొంతం. ఇప్పుడు అదే నగరంలో ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ నినాదంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభ నిర్వహించేందుకు సర్వసన్నద్ధమవుతోంది. రాష్ట్రాభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమరశంఖం పూరించనున్నారు. విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే జై ఆంధ్రప్రదేశ్ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణానికి స్వాతంత్య్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం, సభా వేదికకు గురజాడ అప్పారావు పేరిట నామకరణం చేశారు. సభకు తరలివచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఐదు కోట్లమంది ఉద్యమం రాజధానిలో ఉద్యోగాలను దూరం చేసిన ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా 1972లో రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో యువత ప్రత్యేక రాష్ర్టం కోసం ‘జై ఆంధ్ర’ నినాదంతో మహోద్యమం సాగించిన సంగతి తెల్సిందే. నేడు సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా లభించిన ‘ప్రత్యేక హోదా’ను పాలకులు నిరాకరించడం, ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలను దూరం చేయడానికి నిరసనగా ‘జై ఆంధ్రప్రదేశ్’ నినాదంతో జగన్‌మోహన్ రెడ్డి ఉద్యమిస్తున్నారు. ప్రత్యేక హోదాపై ‘యువభేరి’ సదస్సులతో యువతను చైతన్యపరుస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ఇపుడు ప్రత్యేక హోదా సాధన కోసం ‘జై ఆంధ్రప్రదేశ్’ నినాదంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇపుడు ఈ ఉద్యమం ఐదు కోట్ల మంది ఆంధ్రుల చేతుల్లోకి వెళ్లింది. ఏర్పాట్లను సమీక్షిస్తున్న విజయసాయిరెడ్డి విశాఖ తరహాలోనే జై ఆంధ్రప్రదేశ్ సభలను రాష్ర్టవ్యాప్తంగా మరో ఐదు చోట్ల నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం విశాఖపట్నంలో పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, రాష్ర్ట ప్రొగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా తదితరులతో కలిసి మున్సిపల్ స్టేడియంలో సభఏర్పాట్లను పరిశీలించారు. ఆయన సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు దగా చేసిన తీరు, రెండున్నరేళ్లలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు జై ఆంధ్రప్రదేశ్ సభ నిర్వహిస్తున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సభపై కక్ష సాధింపు జై ఆంధ్రప్రదేశ్ సభ కోసం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు విశాఖలోని ప్రధాన కూడళ్లు, రహదారులను పార్టీ జెండాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ జెండాలతో నిండిపోయాయి. అయితే నగర పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలు జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెచ్చి జెండాలు, తోరణాల్ని తొలగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఓ పక్క జనచైతన్య యాత్రల పేరిట టీడీపీ చేపట్టిన కార్యక్రమాలకోసం నగరంలో ఎక్కడపడితే అక్కడ ఆ పార్టీ జెండాలు కడుతున్నా తొలగించని అధికారులు పనిగట్టుకుని వైఎస్సార్‌సీపీ జెండా లు, తోరణాలను తొలగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏదైనా పేజీలో కానీ, ఆ పేజీ నుండి లింకై ఉన్న పేజీల్లో కానీ జరిగిన మార్పులను చూసేందుకు ఆ పేజీ పేరు ఇవ్వండి. (ఏదైనా వర్గంలోని పేజీలను చూసేందుకు, వర్గం:వర్గం పేరు ఇవ్వండి). మీ వీక్షణ జాబితాలోని పేజీల్లో జరిగిన మార్పులు బొద్దుగా కనిపిస్తాయి. ఇటీవలి మార్పుల ఎంపికలు గత 1 | 3 | 7 | 14 | 30 రోజుల లోని చివరి 50 | 100 | 250 | 500 మార్పులను చూపించు నమోదైన వాడుకరులను దాచు | అజ్ఞాత వాడుకరులను దాచు | నా మార్పులను దాచు | బాట్లను చూపించు | చిన్న మార్పులను దాచు | పేజీ వర్గీకరణ చూపించు | వికీడేటా ను చూపించు 10 డిసెంబరు 2022, 10:18 తో మొదలుపెట్టి ఆ తరువాత జరిగిన మార్పులను చూపించు ‌నేంస్పేస్: అన్నీ (మొదటి) చర్చ వాడుకరి వాడుకరి చర్చ విక్షనరీ విక్షనరీ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Gadget Gadget talk Gadget definition Gadget definition talk ఎంపికను తిరగవెయ్యి సంబంధిత పేరుబరి ట్యాగుల వడపోత: 2017 source edit discussiontools (దాచిన ట్యాగు) discussiontools-added-comment (దాచిన ట్యాగు) discussiontools-source-enhanced (దాచిన ట్యాగు) MassMessage delivery meta spam id PAWS [2.1] SWViewer [1.0] SWViewer [1.3] SWViewer [1.4] wikieditor (దాచిన ట్యాగు) ఉన్నత మొబైల్ దిద్దుబాటు కొత్త దారిమార్పు కొత్త విషయం చరవాణి జాల సవరింపు చరవాణి సవరింపు తిరగ్గొట్టారు తుడిచివేత దారిమార్పు లక్ష్యాన్ని మార్చారు దారిమార్పును తీసేసారు మానవిక తిరగవేత మార్చేసారు మూలం రద్దుచెయ్యి రోల్‌బ్యాక్ విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ విజువల్ ఎడిట్: మార్చారు
ఏడాదిన్న‌ర‌పైగా క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా విమాన‌యానం..ప‌ర్యాట‌క రంగాలు దారుణంగా న‌ష్టాలు చ‌విచూశాయి. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు ప‌లు దేశాలు ఈ వ్యాక్సిన్ పాస్ పోర్టు విధానాన్ని ప్ర‌తిపాదిస్తున్నాయి. ఇలా చేయ‌టం ద్వారా కొంత‌లో కొంత ఆయా రంగాల‌కు ఊర‌ట క‌ల్పించిన‌ట్లు అవుతుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. దీని కోసం ప‌లు దేశాలు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. వ్యాక్సిన్ పాస్ పోర్టు అంటే..వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకున్న వారిని మాత్ర‌మే ఆయా దేశాల్లోకి అనుమ‌తిస్తారు. దీని వ‌ల్ల వైర‌స్ వ్యాప్తి పెద్ద‌గా ఉండ‌ద‌ని..దీంతోపాటు ప‌ర్యాట‌కం..విమాన‌యాన రంగాల‌కు కూడా ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌నేది ఆయా దేశాల ఆలోచ‌న‌. దీనిపై ఇంకా క‌స‌ర‌త్తులు సాగుతున్నాయి. అయితే భార‌త్ మాత్రం వ్యాక్సిన్ పాస్ పోర్టు విధానాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించింది. జీ7 వైద్య ఆరోగ్య శాఖ‌ల మంత్రుల స‌మావేశంలో వ్యాక్సిన్ పాస్ పోర్టు ప్ర‌తిపాద‌న‌ను భార‌త్ త‌ర‌పున పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఇది భార‌త్ తోపాటు చాలా దేశాల‌కు న‌ష్టం చేస్తుంద‌ని పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సినేష‌న్ కేవ‌లం మూడు శాతం మందికి మాత్ర‌మే వ్యాక్సిన్ అందింద‌ని..ఈ ద‌శ‌లో వ్యాక్సిన్ పాస్ పోర్టు వ‌ల్ల దేశ ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని తెలిపారు. అభివ‌ద్ధి చెందిన దేశాల‌తో పోలిస్తే అభివ‌ద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సినేష‌న్ చాలా మెల్ల‌గా సాగుతోంద‌ని..ఇప్పుడు ఆయా దేశాల‌కు వ్యాక్సినేష‌న్ అతి పెద్ద స‌వాల్ గా మారింద‌న్నారు. మ‌హ‌మ్మారుల‌ను ఎదుర్కొనేందుకు జీ7 దేశాలు క‌ల‌సి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప‌లుద దేశాలు వ్యాక్సినేష‌న్ పూర్తి అయిన వారిని మాత్ర‌మే అనుమ‌తిస్తున్నాయి. vaccine Passport "hugely discriminatory". India Opposed Harsh vardhan Latest travel news వ్యాక్సిన్ పాస్ పోర్టు భార‌త్ అభ్యంత‌రం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ Similar Posts Recent Posts International HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog.
నటి శ్రీదేవి కంటే భర్త బోనీ కపూర్ కు ప్రాణం. ఆమె సడెన్ గా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోవడంతో తట్టుకోలేకపోయాడట బోని కపూర్. అందుకే శ్రీదేవి కోసం బోనీ కపూర్ ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడట. ఎవరు మర్చిపోయినా... ఆయన మాత్రం ఆ విషయాన్ని మర్చిపోరట. ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిన దేవకన్య శ్రీదేవి. సినిమాల్లో ఆమె నటన సౌందర్యానికి అతిలోక సుందరిగా పేరు వచ్చిందంటే.. ఆడియన్స్ మనసుల్లో ఆమె ఎంతలా నాటుకపోయిందో తెలుస్తుంది. మరి అటువంటి శ్రీదేవి హఠాత్మరణం అందరికి కలిచివేసింది. ఈమె స్మృతులను మర్చిపోలేని భర్త బోనీ కపూర్... శ్రీదేవికోసం ఇప్పటికీ ఓ పనిని మర్చిపోకుండా చేస్తున్నారట. గుర్తు పెట్టుకుని మరీ ఆమెకు ఇష్టమైన పనిని కంటీన్యూ చేస్తున్నాడ. Boney Kapoor Sridevi కొన్ని సంవత్సరాల పాటు ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలింది శ్రీదేవి. తెలుగు,తమిళ, మలయాళ పరిశ్రమతో పాటు.. హిందీని కూడా వందలాది సినిమాల్లో నటించి మెప్పించి దేవతగా పేరు సంపాదించింది శ్రీదేవి. తన నటనతో ఫిలిం ఇండస్ట్రీ ని ఏలేసిన నటి శ్రీదేవి. అతిలోక సుందరిగా... కుందనపు బొమ్మగా.. ఎన్నో రకాలుగా పిలవడిని ఆమె హాటాత్తుగా మరణించి అందరిని శోఖ సంద్రంలో ముంచి వెల్లిపోయింది. బోణీ కపూర్ తో పెళ్ళి తరువాత చాలా గ్యాప్ తీసుకున్న శ్రీదేవి.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తుంది అనుకున్న టైమ్ కు.. శ్రీదేవి ఎవ్వరు ఊహించని విధంగా 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో ఓ హోటల్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయంలో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఆమె మరణానికిగల కారణాలు తెలియదు. తన ఆస్తి కోసం బోనీ కపూర్ ఈ పని చేశాడని విమర్షలు కూడా వచ్చాయి. సూసైడ్ అని ఒకరు, కాదు కాలు జారి పడి చనిపోయందని కొందరు.. ఇలా చాలా రకాల వాదను వినిపించాయి. ఎవరుఎన్ని అనుకున్నా శ్రీదేవిపై ప్రేమను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాడు బోనీ కపూర్. ప్రేమించి పెళ్ళి చేసుకన్నారు శ్రీదేవి - బోని కపూర్. ఆమె సినిమాలో నటించే టైంలోనే బోనికపూర్ తో డేటింగ్ చేసింది. ఈ క్రమంలోనే ఆయనతో డేటింగ్ చేస్తూ.. ఆమె ప్రెగ్నెంట్ అయింది. దీంతో 1996 జూన్ రెండున సింపుల్ గా .. ఏఆర్భాటం లేకుండా వీరు పెళ్ళి చేసుకున్నారు. అయితే బోనీకి అంతకు ముందే పెళ్ళి అయ్యింది. ఆయన మొదటి భార్య కొడుకే అర్జున్ కపూర్. ఆయన ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకడిగా ఉన్నారు. ఇక వీరిద్దరికి జాన్వీ కపూర్- ఖుషీ కపూర్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీదేవి మరణించిన తర్వాత కొన్నాళ్లు బోనీకపూర్ డిప్త్రెషన్ కి పోయారట. ఆ తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ తో పాటు.. విదేశాల్లో కొన్ని థెరఫీలు తీసుకోవడంతో.. నార్మల్ కండిషన్లోకి వచ్చారట బోనీ కపూర్. ఇక ఆమెను మర్చిపోలేక పోయిన ఆయన.. శ్రీదేవికిచ్చిన మాటను మాత్రం నెరవేరుస్తూ... ఆమెను సంతోషపెడుతున్నారట. శ్రీదేవికి ఫస్ట్ నుంచి పేద పిల్లలకు అన్నదానం చేయడం అలవాటు ఉందట. ఇంట్లో ఏ పండగ జరిగినా.. ఆమె పేదవారికి అన్నదానం చేస్తుందట. ముఖ్యంగా ఎవరు పుట్టినరోజు జరిగినా..? వీళ్ళ పెళ్లిరోజు అయినా అన్నదానం చేస్తుందట. అమ్మ నాన్న లేని పిల్లలకి కూడా ఆమె చేయూతనందిస్తుందట. ఇక ఈ క్రమంలో ఆమె ప్రస్తుతం శ్రీదేవి మరణించినా.. ఆమె ఈ లోకాన లేకపోయినా సరే బోనీకపూర్ ఆమె ఇష్టాన్ని కొనసాగిస్తున్నాడట. అంతే కాదు ఆమె పుట్టినరోజుకి.. వాళ్ళ పెళ్లి రోజుకి పిల్లల పుట్టిన రోజులకి ఇంకా ఏ సందర్భం వచ్చినా.. శ్రీదేవి పేరిట అన్నదానం చేస్తున్నారట. అంతే కాదు శ్రీదేవి పేరు మీద ఇవే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడట బోనీ కపూర్. వాటికి ప్రచారాలు చేసకోకుండా.. రహస్యంగా ఉంచుతున్నాడట. ఎంతో మంది పేదవారికి సహాయం చేస్తూ..అందులో తన భార్యను చూసుకుంటున్నాడట బోనీ.
స్కిజోఫ్రెనియా అనేది ఒక సంక్లిష్టమైన మానసిక రుగ్మత. ఈ పరిస్థితితో బాధపడుతున్న వ్యక్తులు వాస్తవికత మరియు ఫాంటసీల మధ్య తేడాను గుర్తించడం, భావోద్వేగాలను వ్యక్తపరచడం మరియు రోజువారీ పనితీరును ప్రభావితం చేసే ఆలోచన మరియు ప్రవర్తనను కలిగి ఉంటారు. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రకారం, స్కిజోఫ్రెనియా సాధారణంగా భ్రమలు, భ్రాంతులు, అస్తవ్యస్తమైన ప్రసంగం మరియు ప్రవర్తన మరియు సామాజిక లేదా వృత్తిపరమైన పనిచేయకపోవడానికి దారితీసే ఇతర లక్షణాల ద్వారా వర్గీకరించబడుతుంది. రోగనిర్ధారణ కోసం, లక్షణాలు కనీసం ఆరు నెలల పాటు కనిపించాలి. ఒక నెల క్రియాశీల లక్షణాలతో సహా. స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న వ్యక్తులు భ్రమలు అనుభవించవచ్చు లేదా అసలైన విషయాలను నమ్మవచ్చు. ఉదాహరణకు, ఎవరైనా తనను హింసించాలనుకుంటున్నారని విశ్వసించడం, నిజంగా లేనప్పటికీ. బాధపడేవారు కూడా భ్రాంతులు అనుభవిస్తారు, వాస్తవం కాని లేదా జరగనిది విన్నట్లు లేదా చూసినట్లుగా. నిర్ధారణకు ఉపయోగించే స్కిజోఫ్రెనియా రకాలు ప్రారంభంలో, ఐదు రకాలైన స్కిజోఫ్రెనియా నిపుణులకు సూచనగా మారింది. అయితే, 2013 లో మానసిక రుగ్మతల నిర్ధారణ మరియు గణాంక మాన్యువల్ 5వ ఎడిషన్ (DSM-V), అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ (APA)లోని నిపుణులు ఈ రకమైన స్కిజోఫ్రెనియాను తొలగించాలని నిర్ణయించుకున్నారు మరియు స్కిజోఫ్రెనియా అనే ఒక గొడుగు రుగ్మతను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ రకమైన స్కిజోఫ్రెనియా మినహాయించబడింది, APA శాస్త్రవేత్తల ముగింపు ఆధారంగా, మునుపటి నిర్ధారణ పరిమిత రోగనిర్ధారణ స్థిరత్వం, తక్కువ విశ్వసనీయత మరియు పేలవమైన చెల్లుబాటును కలిగి ఉంది. కిందివి స్కిజోఫ్రెనియా రకాలు, వీటి వర్గీకరణ నిపుణులచే సూచనగా ఉపయోగించబడింది. పారానోయిడ్ స్కిజోఫ్రెనియా ఈ రకం స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువగా ఎదుర్కొంటారు. మతిస్థిమితం లేని స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న వ్యక్తులు చూపించే కొన్ని లక్షణాలు భ్రమలు, భ్రాంతులు మరియు ప్రసంగ క్రమరాహిత్యాలు. బాధపడేవారు ఏకాగ్రత వహించడం, ప్రవర్తించే సామర్థ్యం తగ్గడం మరియు చదునైన వ్యక్తీకరణను కలిగి ఉండటం కూడా కష్టమవుతుంది. ఈ రకమైన మతిస్థిమితం లేని స్కిజోఫ్రెనియాలోని భ్రమలను తరచుగా మతిస్థిమితం లేని భ్రమలు లేదా హింస యొక్క భ్రమలు అంటారు. ఇతరులు తనను మరియు తన కుటుంబాన్ని బాధపెడతారని బాధితుడు నమ్ముతాడు. ఉదాహరణకు, తన భాగస్వామి తనను మోసం చేస్తున్నాడని మతిస్థిమితం లేని కారణంగా, ఒక సహోద్యోగి ఆమెకు విషం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు లేదా పొరుగువారు ఆమెను దుర్వినియోగం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హెబెఫ్రెనిక్ స్కిజోఫ్రెనియా లేదా స్కిజోఫ్రెనియా అస్తవ్యస్తమైన హెబెఫ్రెనిక్ స్కిజోఫ్రెనియా అనేది ఒక రకమైన స్కిజోఫ్రెనియా, దీని వలన బాధితుడు ప్రవర్తన మరియు మాటలలో అస్తవ్యస్తంగా ఉంటాడు. హెబెఫ్రెనిక్ స్కిజోఫ్రెనియా ఉన్న వ్యక్తులు సాధారణంగా భ్రమలు లేదా భ్రాంతులు అనుభవించరు. హెబెఫ్రెనిక్ స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న రోగులలో ప్రవర్తన మరియు ప్రసంగం యొక్క లోపాలు, మాట్లాడేటప్పుడు ఆటంకాలు, సక్రమంగా ఆలోచించడం, అనుచితమైన ముఖ కవళికలు, చదునైన ముఖ కవళికలు, రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడంలో ఇబ్బంది వంటివి. అవశేష స్కిజోఫ్రెనియా ఈ రకమైన స్కిజోఫ్రెనియా ఒక సంక్లిష్టమైన పరిస్థితి. ఒక రోగికి స్కిజోఫ్రెనియా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే అతనికి అవశేష స్కిజోఫ్రెనియా ఉందని చెప్పబడింది, కానీ ప్రముఖ లక్షణాలు కనిపించలేదు. ఇది జరుగుతుంది, ఎందుకంటే స్కిజోఫ్రెనియా లక్షణాల తీవ్రత తగ్గింది. భ్రాంతులు లేదా భ్రమలు ఇప్పటికీ ఉండవచ్చు. అయినప్పటికీ, వ్యాధి యొక్క తీవ్రమైన దశతో పోలిస్తే దాని వ్యక్తీకరణలు గణనీయంగా తగ్గుతాయి. అవశేష స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా ఫ్లాట్ ఎక్స్‌ప్రెషన్, సైకోమోటర్ ఆటంకాలు, నెమ్మదిగా మాట్లాడటం మరియు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల శ్రద్ధ చూపకపోవడం వంటి ప్రతికూల లక్షణాలను కూడా చూపుతారు. కాటటోనిక్ స్కిజోఫ్రెనియా సాధారణంగా, కాటటోనిక్ స్కిజోఫ్రెనియా ఉన్న వ్యక్తులు కదలిక రుగ్మతలను (కాటటోనిక్) చూపుతారు. అదనంగా, ఈ పరిస్థితిని అనుభవించే వ్యక్తులు తరచుగా ఇతరుల ప్రవర్తనను అనుకరిస్తారు, మాట్లాడటానికి ఇష్టపడరు మరియు మూర్ఛ వంటి పరిస్థితులను చూపుతారు. ప్రస్తుతం, నిపుణులు స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న వ్యక్తులు మాత్రమే కాటటోనిక్ పరిస్థితులు అనుభవించరని అంగీకరించారు. బైపోలార్ డిజార్డర్ వంటి ఇతర మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు కూడా కాటటోనిక్ స్కిజోఫ్రెనియాను అభివృద్ధి చేయవచ్చు. స్కిజోఫ్రెనియా వివరంగా లేదు వివరణాత్మక స్కిజోఫ్రెనియా అనేది ఒకటి కంటే ఎక్కువ రకాల స్కిజోఫ్రెనియాను వివరించే వ్యక్తి యొక్క ప్రవర్తనను వివరించడానికి గతంలో ఉపయోగించే పదం. భ్రమలు లేదా భ్రాంతులు కలిగి ఉన్న కాటటోనిక్ ప్రవర్తన కలిగిన వ్యక్తి, స్కిజోఫ్రెనియాతో వివరంగా నిర్ధారణ చేయబడవచ్చు. పైన పేర్కొన్న స్కిజోఫ్రెనియా రకాలు రోగనిర్ధారణ కోసం ఉపయోగించబడనప్పటికీ, వైద్య చికిత్సను ప్లాన్ చేయడంలో ఈ వర్గీకరణ ఇప్పటికీ నిర్ణయాత్మకంగా సహాయపడుతుంది. అదనంగా, రకాలు మరియు సాధారణంగా స్కిజోఫ్రెనియా గురించిన సమాచారాన్ని అర్థం చేసుకోవడం కూడా మీ స్వంత మానసిక స్థితిని నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది. ఖచ్చితమైన రోగనిర్ధారణతో, మీ ఆరోగ్య సంరక్షణ బృందం ద్వారా ఒక నిర్దిష్ట చికిత్స ప్రణాళికను రూపొందించి అమలు చేయవచ్చు. [[సంబంధిత కథనం]] స్కిజోఫ్రెనియా చికిత్స స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న వ్యక్తులకు తరచుగా ఉపయోగించే హ్యాండ్లింగ్, అవి యాంటిసైకోటిక్ ఔషధాల ఏర్పాటు. భ్రమలు మరియు భ్రాంతులు వంటి స్కిజోఫ్రెనియా లక్షణాలను తగ్గించడానికి ఈ మందులు ఇవ్వబడతాయి. రెండు రకాల యాంటిసైకోటిక్స్ ఉన్నాయి, అవి సాధారణ యాంటిసైకోటిక్స్ మరియు వైవిధ్య యాంటిసైకోటిక్స్. రెండింటి మధ్య వ్యత్యాసం వారి ఆవిష్కరణ కాలంలో ఉంది. విలక్షణమైన యాంటిసైకోటిక్స్ వైవిధ్య యాంటిసైకోటిక్స్ కంటే ముందుగానే కనుగొనబడ్డాయి, కాబట్టి వాటిని మొదటి తరం యాంటిసైకోటిక్స్ అంటారు. యాంటిసైకోటిక్ మందులు తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు ఉండవచ్చు మరియు చికిత్స ప్రణాళికకు కట్టుబడి ఉండటం చాలా కష్టం. మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా యాంటిసైకోటిక్ తీసుకోవలసి వస్తే, మీరు సాధ్యమైనంత ఉత్తమమైన సహాయాన్ని అందించారని నిర్ధారించుకోండి.
మీ వర్డ్ప్రెస్ సైట్ భద్రతను సెటప్ చేసేటప్పుడు, మీ రక్షణను పెంచుకోవడానికి మీరు చేయగలిగే కొన్ని ప్రాథమిక విషయాలు ఉన్నాయి. మీ వెబ్‌సైట్‌ను రక్షించడంలో సహాయపడటానికి మీరు అమలు చేయవలసిన కొన్ని మొదటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. 1. SSL సర్టిఫికెట్లను అమలు చేయండి సురక్షిత సాకెట్స్ లేయర్ (SSL) సర్టిఫికెట్లు అనేది మిలియన్ల కొద్దీ వెబ్‌సైట్‌లు తమ కస్టమర్‌లతో తమ ఆన్‌లైన్ లావాదేవీలను రక్షించుకోవడానికి ఉపయోగించే పరిశ్రమ ప్రమాణం. మీ వెబ్‌సైట్‌ను సురక్షితంగా ఉంచడానికి మీరు తీసుకునే మొదటి దశల్లో ఒకదాన్ని పొందడం ఒకటి. మీరు SSL ప్రమాణపత్రాన్ని కొనుగోలు చేయవచ్చు, కానీ చాలా మంది హోస్టింగ్ ప్రొవైడర్లు వాటిని ఉచితంగా అందిస్తారు. తర్వాత, గుప్తీకరించిన కనెక్షన్‌ని సక్రియం చేసే HTTPS దారి మళ్లింపును బలవంతం చేయడానికి ప్లగిన్‌ని ఉపయోగించండి. ఈ ప్రామాణిక సాంకేతికత వెబ్ సర్వర్ (హోస్ట్) మరియు వెబ్ బ్రౌజర్ (క్లయింట్) మధ్య ఎన్‌క్రిప్టెడ్ కనెక్షన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ ఎన్‌క్రిప్టెడ్ కనెక్షన్‌ని జోడించడం ద్వారా, రెండింటి మధ్య పంపబడిన మొత్తం డేటా ప్రైవేట్‌గా మరియు అంతర్గతంగా ఉంటుందని మీరు నిర్ధారించుకోవచ్చు. 2. బలమైన పాస్‌వర్డ్‌లు అవసరం & ఉపయోగించండి SSL ప్రమాణపత్రాన్ని పొందడంతో పాటు, మీ సైట్‌ను రక్షించుకోవడానికి మీరు చేయగలిగే మొదటి పని ఏమిటంటే, మీ అన్ని లాగిన్‌ల కోసం బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం మరియు అవసరం. సుపరిచితమైన లేదా గుర్తుంచుకోవడానికి సులభమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం లేదా మళ్లీ ఉపయోగించడం ఉత్సాహం కలిగించవచ్చు, కానీ అలా చేయడం వలన మీరు, మీ వినియోగదారులు మరియు మీ వెబ్‌సైట్ ప్రమాదంలో పడవచ్చు. మీ పాస్‌వర్డ్ బలం మరియు భద్రతను మెరుగుపరచడం వలన మీ హ్యాక్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. మీ పాస్‌వర్డ్ ఎంత బలంగా ఉంటే, మీరు సైబర్‌టాక్‌కు గురయ్యే అవకాశం తక్కువ. పాస్‌వర్డ్‌ను సృష్టించేటప్పుడు, మీరు అనుసరించాల్సిన కొన్ని సాధారణ పాస్‌వర్డ్ ఉత్తమ పద్ధతులు ఉన్నాయి. మీరు తగినంత బలమైన పాస్‌వర్డ్‌ని ఉపయోగిస్తున్నారని మీకు ఖచ్చితంగా తెలియకపోతే, ఈ ఉపయోగకరమైన పాస్‌వర్డ్ స్ట్రెంత్ చెకర్ వంటి ఉచిత సాధనాన్ని ఉపయోగించడం ద్వారా బలాన్ని తనిఖీ చేయండి. 3. సెక్యూరిటీ ప్లగిన్‌ను ఇన్‌స్టాల్ చేయండి వర్డ్ప్రెస్ ప్లగిన్‌లు మీ వెబ్‌సైట్‌కి ఉపయోగకరమైన ఫీచర్‌లను త్వరగా జోడించడానికి ఒక గొప్ప మార్గం మరియు అనేక గొప్ప భద్రతా ప్లగిన్‌లు అందుబాటులో ఉన్నాయి. భద్రతా ప్లగ్‌ఇన్‌ను ఇన్‌స్టాల్ చేయడం వలన ఎక్కువ శ్రమ అవసరం లేకుండానే మీ వెబ్‌సైట్‌కి కొన్ని అదనపు రక్షణ పొరలను జోడించవచ్చు. మీరు ప్రారంభించడానికి, సిఫార్సు చేయబడిన వర్డ్ప్రెస్ భద్రతా ప్లగిన్‌ల జాబితాను చూడండి. Wordfence సెక్యూరిటీ – ఫైర్‌వాల్ & మాల్వేర్ స్కాన్ అన్నీ ఒకే WP సెక్యూరిటీ & ఫైర్‌వాల్‌లో iThemes సెక్యూరిటీ Jetpack – WP సెక్యూరిటీ, బ్యాకప్, స్పీడ్ & గ్రోత్ 4. వర్డ్ప్రెస్ కోర్ ఫైల్‌లను అప్‌డేట్ చేస్తూ ఉండండి మీ సైట్ యొక్క భద్రత మరియు స్థిరత్వాన్ని నిర్వహించడానికి మీ WordPressని ఎప్పటికప్పుడు తాజాగా ఉంచడం చాలా కీలకం. వర్డ్ప్రెస్ భద్రతా దుర్బలత్వం నివేదించబడిన ప్రతిసారీ, సమస్యను పరిష్కరించే నవీకరణను విడుదల చేయడానికి కోర్ బృందం పని చేయడం ప్రారంభిస్తుంది. మీరు మీ వర్డ్ప్రెస్ వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేయకుంటే, మీరు దుర్బలత్వాలను కలిగి ఉన్న వర్డ్ప్రెస్ సంస్కరణను ఉపయోగిస్తున్నారు. 2021 నాటికి, వెబ్‌లో మొత్తం 1.3 బిలియన్ వెబ్‌సైట్‌లు ఉన్నాయని అంచనా వేయబడింది, వాటిలో 455 మిలియన్ కంటే ఎక్కువ సైట్‌లు వర్డ్ప్రెస్ని ఉపయోగిస్తున్నాయి. ఇది చాలా ప్రజాదరణ పొందినందున, హ్యాకర్లు, హానికరమైన కోడ్ పంపిణీదారులు మరియు డేటా దొంగల కోసం వర్డ్ప్రెస్ ప్రధాన లక్ష్యం. వర్డ్ప్రెస్ యొక్క పాత సంస్కరణను ఉపయోగించడం ద్వారా దాడి చేయడానికి మిమ్మల్ని మీరు తెరవవద్దు. ఆటో-అప్‌డేట్‌లను ఆన్ చేసి, దాని గురించి మరచిపోండి. మీరు నవీకరణలను నిర్వహించడానికి మరింత సులభమైన మార్గాన్ని కోరుకుంటే, స్వయంచాలక నవీకరణలను కలిగి ఉన్న నిర్వహించబడిన వర్డ్ప్రెస్ హోస్టింగ్ పరిష్కారాన్ని పరిగణించండి. 5. థీమ్‌లు & ప్లగిన్‌లపై శ్రద్ధ వహించండి వర్డ్ప్రెస్ని అప్‌డేట్‌గా ఉంచడం వలన మీ కోర్ ఫైల్‌లు చెక్‌లో ఉన్నాయని నిర్ధారిస్తుంది, అయితే మీ థీమ్‌లు మరియు ప్లగిన్‌లు వంటి కోర్ అప్‌డేట్‌లు రక్షించలేని ఇతర ప్రాంతాలు వర్డ్ప్రెస్కు హాని కలిగిస్తాయి. స్టార్టర్స్ కోసం, విశ్వసనీయ డెవలపర్‌ల నుండి మాత్రమే ప్లగిన్‌లు మరియు థీమ్‌లను ఇన్‌స్టాల్ చేయండి. ఒక ప్లగ్ఇన్ లేదా థీమ్ విశ్వసనీయమైన మూలం ద్వారా అభివృద్ధి చేయబడకపోతే, మీరు దానిని ఉపయోగించకపోవడమే బహుశా సురక్షితం. దాని పైన, మీరు మీ వర్డ్ప్రెస్ ప్లగిన్‌లు మరియు థీమ్‌లను అప్‌డేట్ చేశారని నిర్ధారించుకోండి. వర్డ్ప్రెస్ యొక్క పాత వెర్షన్ వలె, పాత ప్లగిన్‌లు మరియు థీమ్‌లను ఉపయోగించడం వలన మీ వెబ్‌సైట్ దాడికి మరింత హాని కలిగిస్తుంది. 6. తరచుగా బ్యాకప్‌లను అమలు చేయండి మీ వర్డ్ప్రెస్ వెబ్‌సైట్‌ను రక్షించడానికి ఒక మార్గం మీ సైట్ మరియు ముఖ్యమైన ఫైల్‌ల యొక్క ప్రస్తుత బ్యాకప్‌ను ఎల్లప్పుడూ కలిగి ఉండటం. మీ సైట్‌కు ఏదైనా జరగాలని మీరు కోరుకునే చివరి విషయం మరియు మీకు బ్యాకప్ లేదు. మీ సైట్‌ని బ్యాకప్ చేయండి మరియు తరచుగా చేయండి. ఆ విధంగా మీ వెబ్‌సైట్‌కు ఏదైనా జరిగితే, మీరు దాని యొక్క మునుపటి సంస్కరణను త్వరగా పునరుద్ధరించవచ్చు మరియు బ్యాకప్ చేసి వేగంగా రన్ చేయవచ్చు. మరింత రక్షణను జోడించడానికి ఇంటర్మీడియట్ భద్రతా చర్యలు మీరు అన్ని ప్రాథమిక అంశాలను పూర్తి చేసినప్పటికీ, మీ వెబ్‌సైట్‌ను రక్షించుకోవడానికి మీరు ఇంకా ఎక్కువ చేయాలనుకుంటే, మీ భద్రతను బలోపేతం చేయడానికి మీరు తీసుకోవలసిన మరికొన్ని అధునాతన దశలు ఉన్నాయి. 7. “అడ్మిన్” వినియోగదారు పేరును ఎప్పుడూ ఉపయోగించవద్దు “అడ్మిన్” అనేది చాలా సాధారణ వినియోగదారు పేరు కాబట్టి, ఇది సులభంగా ఊహించబడుతుంది మరియు స్కామర్‌లు తమ లాగిన్ ఆధారాలను ఇచ్చేలా ప్రజలను మోసగించడం చాలా సులభం చేస్తుంది. “అడ్మిన్” వినియోగదారు పేరును ఎప్పుడూ ఉపయోగించవద్దు. అలా చేయడం వలన మీరు బ్రూట్ ఫోర్స్ దాడులు మరియు సోషల్ ఇంజనీరింగ్ స్కామ్‌లకు గురవుతారు. బలమైన పాస్‌వర్డ్‌ను కలిగి ఉన్నట్లే, మీ లాగిన్‌ల కోసం ప్రత్యేకమైన వినియోగదారు పేరును ఉపయోగించడం మంచి ఆలోచన ఎందుకంటే ఇది మీ లాగిన్ సమాచారాన్ని క్రాక్ చేయడం హ్యాకర్‌లకు చాలా కష్టతరం చేస్తుంది. మీరు ప్రస్తుతం “అడ్మిన్” వినియోగదారు పేరును ఉపయోగిస్తుంటే, మీ వర్డ్ప్రెస్ అడ్మిన్ వినియోగదారు పేరును మార్చండి. 8. మీ WP-అడ్మిన్ లాగిన్ పేజీని దాచండి డిఫాల్ట్‌గా, URL చివర “/wp-admin” లేదా “/wp-login.php”ని జోడించడం ద్వారా WordPress లాగిన్ పేజీలలో ఎక్కువ భాగం యాక్సెస్ చేయవచ్చు. ఇది హ్యాకర్లు మీ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడాన్ని సులభతరం చేస్తుంది. హ్యాకర్ లేదా స్కామర్ మీ లాగిన్ పేజీని గుర్తించిన తర్వాత, వారు మీ అడ్మిన్ డ్యాష్‌బోర్డ్‌ను యాక్సెస్ చేయడానికి మీ వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్‌ను ఊహించడానికి ప్రయత్నించవచ్చు. మీ వర్డ్ప్రెస్ లాగిన్ పేజీని దాచడం అనేది మిమ్మల్ని తక్కువ సులువుగా లక్ష్యంగా చేసుకోవడానికి మంచి మార్గం. WPS దాచు లాగిన్ వంటి ప్లగిన్‌తో WordPress అడ్మిన్ లాగిన్ పేజీని దాచడం ద్వారా మీ లాగిన్ ఆధారాలను రక్షించండి. 9. XML-RPCని నిలిపివేయండి వర్డ్ప్రెస్ సాఫ్ట్‌వేర్ క్లయింట్‌లకు కార్యాచరణను విస్తరించడానికి XML-RPC ప్రోటోకాల్ అమలును ఉపయోగిస్తుంది. ఈ రిమోట్ ప్రొసీజర్ కాలింగ్ ప్రోటోకాల్ XMLలో ఫార్మాట్ చేయబడిన డేటాతో ఆదేశాలను అమలు చేయడానికి అనుమతిస్తుంది. చాలా మంది వినియోగదారులకు వర్డ్ప్రెస్ XML-RPC ఫంక్షనాలిటీ అవసరం లేదు మరియు వినియోగదారులను దోపిడీకి తెరతీసే అత్యంత సాధారణ దుర్బలత్వాల్లో ఇది ఒకటి. అందుకే దీన్ని డిసేబుల్ చేయడం మంచిది. Wordfence సెక్యూరిటీ ప్లగిన్‌కు ధన్యవాదాలు, దీన్ని చేయడం చాలా సులభం. 10. wp-config.php ఫైల్‌ను గట్టిపరచండి మీ WordPress wp-config.php ఫైల్ మీ వర్డ్ప్రెస్ సెక్యూరిటీ కీలు మరియు WordPress డేటాబేస్ కనెక్షన్ వివరాలతో సహా మీ వర్డ్ప్రెస్ ఇన్‌స్టాలేషన్ గురించి చాలా సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉంది, అందుకే మీరు దీన్ని సులభంగా యాక్సెస్ చేయకూడదనుకుంటున్నారు. మీరు మీ .htaccess ఫైల్ ద్వారా మీ wp-config.php ఫైల్‌ను రక్షించడం ద్వారా మీ వెబ్‌సైట్‌ను “గట్టిపరచవచ్చు”. దీని అర్థం మీరు మీ సైట్‌కు హ్యాకర్‌లకు వ్యతిరేకంగా కొంత అదనపు కవచాన్ని ఇస్తున్నారని అర్థం. 11. భద్రతా స్కానింగ్ సాధనాన్ని అమలు చేయండి కొన్నిసార్లు మీ WordPress వెబ్‌సైట్ ఉనికిలో ఉన్నట్లు మీకు తెలియని దుర్బలత్వాన్ని కలిగి ఉండవచ్చు. దుర్బలత్వాలను కనుగొని వాటిని మీ కోసం పరిష్కరించగల సాధనాలను ఉపయోగించడం తెలివైన పని. WPScan ప్లగ్ఇన్ WordPress కోర్ ఫైల్‌లు, ప్లగిన్‌లు మరియు థీమ్‌లలో తెలిసిన దుర్బలత్వాల కోసం స్కాన్ చేస్తుంది. కొత్త భద్రతా లోపాలు కనుగొనబడినప్పుడు ప్లగ్ఇన్ ఇమెయిల్ ద్వారా మీకు తెలియజేస్తుంది. మీ సర్వర్-సైడ్ సెక్యూరిటీని బలోపేతం చేయండి ఇప్పటి వరకు, మీరు మీ వెబ్‌సైట్‌ను రక్షించుకోవడానికి పైన పేర్కొన్న అన్ని చర్యలను తీసుకున్నారు. అయినప్పటికీ, వీలైనంత సురక్షితంగా చేయడానికి మీరు ఇంకా ఎక్కువ చేయగలరా అని మీరు ఇంకా తెలుసుకోవాలనుకోవచ్చు. మీ భద్రతను మెరుగుపరచడానికి మీరు తీసుకోగల మిగిలిన చర్యలు మీ వెబ్‌సైట్ యొక్క సర్వర్ వైపున చేయాల్సి ఉంటుంది. 12. దీన్ని చేసే హోస్టింగ్ కంపెనీ కోసం చూడండి హోస్టింగ్ కంపెనీ కోసం వెతుకుతున్నప్పుడు, మీరు వేగవంతమైన, విశ్వసనీయమైన, సురక్షితమైన మరియు గొప్ప కస్టమర్ సేవతో మీకు మద్దతునిచ్చేదాన్ని కనుగొనాలనుకుంటున్నారు. అంటే వారు మంచి, శక్తివంతమైన వనరులను కలిగి ఉండాలి, కనీసం 99.5% సమయ సమయాన్ని నిర్వహించాలి మరియు సర్వర్-స్థాయి భద్రతా వ్యూహాలను ఉపయోగించాలి. హోస్ట్ ఆ ప్రాథమిక పెట్టెలను తనిఖీ చేయలేకపోతే, అవి మీ సమయం లేదా డబ్బు విలువైనవి కావు. మీ బ్లాగు వెబ్‌సైట్‌ను హోస్ట్ చేయడానికి సరైన హోస్టింగ్ కంపెనీని ఎంచుకోవడం అనేది మీ సైట్‌ను చాలా కాలం నుండి రక్షించుకోవడానికి మీరు చేయగలిగే ఉత్తమమైన విషయాలలో ఒకటి. 13. తాజా PHP సంస్కరణను ఉపయోగించండి వర్డ్ప్రెస్ యొక్క పాత సంస్కరణల వలె, PHP యొక్క పాత సంస్కరణలు ఇకపై ఉపయోగించడం సురక్షితం కాదు. మీరు PHP యొక్క తాజా వెర్షన్‌లో లేకుంటే, దాడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీ PHP వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేయండి. 14. పూర్తిగా-ఐసోలేటెడ్ సర్వర్‌లో హోస్ట్ చేయండి ప్రైవేట్ క్లౌడ్ సర్వర్‌లకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాల్లో ఒకటి మీ భద్రతను పెంచుతుంది. అన్ని క్లౌడ్ పరిసరాలకు యాంటీవైరస్ మరియు ఫైర్‌వాల్ రక్షణ యొక్క బలమైన కలయిక అవసరం, కానీ ఒక ప్రైవేట్ క్లౌడ్ నిర్దిష్ట భౌతిక యంత్రాలపై నడుస్తుంది, దాని భౌతిక భద్రతను నిర్ధారించడం సులభం చేస్తుంది. భద్రతతో పాటు, పూర్తిగా-వివిక్త సర్వర్‌లో చాలా ఎక్కువ సమయము మరియు నిర్వహించబడే హోస్టింగ్ యొక్క సులభమైన ఏకీకరణ వంటి ఇతర పెర్క్‌లు ఉన్నాయి. మీ వర్డ్ప్రెస్ వెబ్‌సైట్ కోసం సరైన క్లౌడ్ వాతావరణం కోసం చూస్తున్నారా? ఇక చూడకండి. InMotion హోస్టింగ్ నిర్వహించే వర్డ్ప్రెస్ హోస్టింగ్‌తో మీరు సర్వర్-టు-సర్వర్ మైగ్రేషన్‌లు, సురక్షితమైన అప్‌గ్రేడ్, ఆన్-ది-ఫ్లై సెక్యూరిటీ ప్యాచింగ్ మరియు ఇండస్ట్రీ-లీడింగ్ స్పీడ్ అన్నీ ఒకదానిలో ఒకటిగా ఉంటాయి. 15. వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్ ఉపయోగించండి మీ వర్డ్ప్రెస్ వెబ్‌సైట్‌కి అదనపు భద్రతా చర్యలను జోడించడానికి మీరు చేయగలిగే చివరి పని ఏమిటంటే వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్ (WAF)ని ఉపయోగించడం. WAF అనేది సాధారణంగా క్లౌడ్-ఆధారిత భద్రతా వ్యవస్థ, ఇది మీ సైట్ చుట్టూ రక్షణ యొక్క మరొక పొరను అందిస్తుంది. దీన్ని మీ సైట్‌కి గేట్‌వేగా భావించండి. ఇది అన్ని హ్యాకింగ్ ప్రయత్నాలను బ్లాక్ చేస్తుంది మరియు డిస్ట్రిబ్యూటెడ్ డినయల్-ఆఫ్-సర్వీస్ (DDoS) దాడులు లేదా స్పామర్‌ల వంటి ఇతర హానికరమైన రకాల ట్రాఫిక్‌ను ఫిల్టర్ చేస్తుంది. WAFలకు సాధారణంగా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజులు అవసరం, కానీ మీరు మీ వర్డ్ప్రెస్ వెబ్‌సైట్ సెక్యూరిటీపై ప్రీమియంను ఉంచినట్లయితే ఒకదానిని జోడించడం విలువైనది. మీ వెబ్‌సైట్ & వ్యాపారం సురక్షితంగా & సురక్షితంగా ఉందని నిర్ధారించుకోండి మీ వెబ్‌సైట్ సురక్షితంగా లేకుంటే, మీరు మిమ్మల్ని బాధించే ప్రపంచానికి తెరిచి ఉండవచ్చు. కృతజ్ఞతగా, మీ అవసరాలకు తగినట్లుగా సరైన సాధనాలు మరియు హోస్టింగ్ ప్లాన్ ఉన్నంత వరకు WordPress సైట్‌ను భద్రపరచడానికి చాలా సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు. బెదిరింపులు సంభవించిన తర్వాత వాటికి ప్రతిస్పందించడానికి వేచి ఉండకుండా, భద్రతా సమస్యలను నివారించడానికి మీరు మీ వెబ్‌సైట్‌ను ముందుగానే సురక్షితంగా ఉంచుకోవాలి. ఆ విధంగా, ఎవరైనా మీ వెబ్‌సైట్‌ను లక్ష్యంగా చేసుకుంటే, మీరు ఇటీవలి బ్యాకప్‌ను గుర్తించడానికి స్క్రాంబ్లింగ్ చేయడానికి బదులుగా ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు మీ వ్యాపారాన్ని యధావిధిగా కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉచిత SSL, అంకితమైన IP చిరునామా, ఉచిత బ్యాకప్‌లు, స్వయంచాలక WordPress నవీకరణలు, DDoS రక్షణ మరియు WAFతో సురక్షితమైన మరియు పూర్తిగా వేరుచేయబడిన WordPress హోస్టింగ్‌ను పొందండి.
మాఘ పౌర్ణమి విశిష్టత అంతా ఇంతా కాదు. హిందువులు భక్తి తో కొలిచే పర్వదినం ఇది. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. హిందువులు ఆ రోజున పవిత్ర నది లో స్నానం చేయడం, దానం చేయడం మొదలైన వాటిని అనుసరిస్తారు. మాసాలన్నిటిలో మాఘ మాసం చాలా విశిష్టమైనది. దీనిలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే రథసప్తమి, భీష్మఏకాదశి, శ్రీ పంచమి, మహా శివ రాత్రి ఇలా సకల దేవతలను ఈ నెల లో కొలుస్తాము. ఇక మాఘ పౌర్ణమి వచ్చిందంటే పుణ్య తీర్థాలు అన్నీ కూడా కళకళలాడి పోతాయి. ముఖ్యంగా నదులు, సముద్రాలు గుడిలో ఉన్న చిన్న చిన్న కోనేరులు కూడా జనాలతో నిండిపోతాయి. ఇక మాఘ పౌర్ణమి నాడు ఏం చేయాలి...? ఏ విధంగా చేస్తే పుణ్యం లభిస్తుంది...? ఇలా అనేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి. చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం కాబట్టి దీన్ని మాఘ మాసం అని అంటారు. శ్రేష్టమైన ఈ మాసం యజ్ఞయాగాది క్రతువులకు శ్రేష్టమైనది అంటారు. భక్తులు తెల్లవారుజామునే లేచి పుణ్య స్నానాలు ఆచరిస్తారు. వైష్ణవ శివాలయాల్లో అయితే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సముద్ర స్నానం చేయడం, శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం. మాఘ పౌర్ణమి ప్రత్యేకత: ఈరోజు స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోయి మోక్షం వస్తుందని భక్తుల విశ్వాసం. మాఘ మాసం వల్ల ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్షు తో పాటు మంచితనం కూడా లభిస్తాయని పద్మ పురాణం లో ఉంది. ఇలాంటి ప్రభావాలకు ముఖ్యమైన కారణం సూర్యుడు మకర రాశి నుండి కుంభ రాశిలో ప్రవేశించడమే. అయితే ఈ సమయం లో శివుడిని కేశవుని కూడా పూజించాలని అంటారు. అలానే దాన ధర్మాలు చేయడం వల్ల ఉత్తమ ఫలితం కలుగుతుందని పండితులు అంటున్నారు. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 26 శుక్రవారం మధ్యాహ్నం 03:49 నుంచి పౌర్ణమి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27న 1:46 నిమిషాల వరకు ముగుస్తుంది. ఉదయ తిథి శుక్రవారం 27న ఉంది కాబట్టి ప్రధానంగా ఈ రోజున జరుపుకుంటారు. ఈ రోజున నది లో స్నానం చేయడం చాలా మంచిది. పౌర్ణమి నాడు ఉపవాసం పాటించే వారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే 26వ తేదీన చేసుకోవచ్చు. 27న మాత్రం నదీ స్నానం చేయచ్చు. పవిత్ర నది లో స్నానం చేయడం వల్ల ఏం కలుగుతుంది: మాఘ పౌర్ణమి నాడు గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గర లో ఉన్న సముద్రాలు లేదా దేవాలయం లో ఉండే కోనేరు లో కూడా స్నానం చేయచ్చు. ముఖ్యంగా కాశి, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల లో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. హిందువుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మాఘ పౌర్ణమి రోజు గంగాస్నానం చేయడం పట్ల అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని అంటారు. మాఘ పౌర్ణమి నాడు చేయవలసిన దానాలు: మామూలు రోజుల్లోనే దానం వల్ల ఎంతో మంచి ఫలితం కనిపిస్తుంది అని అంటారు. అటువంటిది ఇటువంటి పర్వ దినాన ఎవరికైనా దానం చేస్తే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది. మాఘ పౌర్ణమి మహాభాగ్యం అని కూడా అంటారు. మాఘ మాసం లో దేవతలు తమ సర్వశక్తులూ తేజస్సులు జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది అని అంటారు. ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం కనిపిస్తుంది. స్నానం చేసిన తర్వాత సమస్త జీవ రాశికి ఆధారమైన సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పణ చెయ్యాలి. దగ్గర లో ఉన్న వైష్ణవ, శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. పూజ అయిపోయిన తర్వాత ధర్మాలు చేయొచ్చు. గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల జన్మజన్మల నుంచి వెంటాడుతున్న పాపాలు మరియు దోషాలు తొలగిపోతాయి ఇవి దానం చేయడం వల్ల అశ్వమేధయాగం చేసినంత ఫలితం మనకి వస్తుంది. ఈ విషయం సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజు తో చెప్పాడట. మాఘ పౌర్ణమి స్నాన ఫలం: బావి నీటితో స్నానం చేయడం వల్ల 12 సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది. అదే చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది. సాధారణ నదిలో స్నానం చేయడం వల్ల 96 సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది. పుణ్య నదీ జలాలలో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది. అలానే సంగమ నదుల్లో స్నానం చేస్తే 38400 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది. గంగా నది లో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది. ప్రయాగ లోని, త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగానదీ స్నాన ఫలితం కంటే నూరు రెట్లు అధిక ఫలం కలుగుతుంది. సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్య ఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవుట. ఇంత గొప్ప ఫలితం మనకి మాఘ పౌర్ణమి నాడు కలుగుతుంది.
కడప: ఇటీవల అయిదు మృతదేహాలు లభ్యమై రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి వేదికైన జియోన్ పాఠశాల గుర్తింపును జిల్లా విద్యాశాఖ రద్దు చేసింది. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వారిని సమీప పాఠశాలల్లో సర్దుబాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నష్టం కల్గించకుండా నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్య ఆర్జేడీ సి.హెచ్.రమణకుమార్, డీఈవో అంజయ్య చర్చించి పాఠశాల విద్య సంచాలకులు ఉషారాణి దృష్టికి తీసుకువెళ్లారు. చదవండి : మృతదేహాల కేసులో నిందితుల అరెస్టు ఈ మేరకు పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ ఆర్జేడీ రమణకుమార్ ఉత్తర్వులిచ్చారు. తల్లిదండ్రులు వారి పిల్లలను సమీప పాఠశాలల్లో చేర్చుకోవాలి. జిల్లా విద్యాధికారి అంజయ్య, మండల విద్యాధికారి నాగమునిరెడ్డి గురువారం పాఠశాలను సందర్శించి అక్కడి స్థితిగతులను పరిశీలించారు. నగరంలోని నబీకోటలో ఉన్న జియాన్ ఆంగ్ల మాధ్యమ పాఠశాల 1996 సంవత్సరం జిల్లా విద్యాశాఖ నుంచి గుర్తింపు పొందింది. ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలగా మార్పుచెందింది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 365 విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు.ఈ పాఠశాలలో మొత్తం 365 మంది పిల్లలు ఉన్నారు. చదవండి : వైకాపాకు కొమ్ము కాసిన అధికార యంత్రాంగం - ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు విద్యాహక్కుచట్టం-2009 ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలు ఏతరగతిలో అయినా ఎప్పుడైనా ప్రవేశాలు పొందవచ్చు. వీరికి వేరొక పాఠశాలల్లో చేరడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. 9, 10 తరగతుల విద్యార్థులు ఆగస్టు 31వ తేదీలోపు పాఠశాలల్లో ప్రవేశం పొందాలి. ఈ పాఠశాల ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వేరొక పాఠశాలల్లో చేరేందుకు విద్యాశాఖ అధికారులు అనుమతి ఇచ్చారు.
మనం మన సంప్రదాయాన్నీ, మన సంస్కృతనీ ఎలాగైతే పండగలను చేసుకోవాలని ఆరాటపడతామో, అందులో పదోవంతు – “నా దేశం” అన్న భావనలో ఉంటే, ఎందుకు ఈ దినోత్సవాలు? అన్న విషయం అర్థమౌతుందని నా అభిప్రాయం. స్వతంత్ర్యం అంటే ఏమిటి? దేశమంటే ఏమిటి? ఈదేశాన్ని ప్రేమిస్తే తక్కిన దేశాల్ని ద్వేషించాలా? దేశమా – మానవత్వమా? అనికాదు , దినోత్సవాలు ద్వార గత స్ముతులను జ్ఞాపకం చేసుకోవడమే . చరిత్ర తెలుసు కొని మన జీవిత విధానము సరియైన మార్గం లో సాగించడమే నా అభిప్రాయము. Saturday, December 11, 2010 National Law Day , జాతీయ న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరము నవంబర్ 26 న జరుపు కుంటారు . గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబర్ 26 న )National Law Day(జాతీయ న్యాయ దినోత్సవం) గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము మన దేశము లో ప్రతి ఏటా నవంబర్ 26 న " నేషనల్ లా డే " నిర్వహిస్తారు . 1979 లో నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ రొజున న్యాయ దినోత్సవం నిర్వహించాలని ప్రకటించారు . 1949 లో భారత రాజ్యాంగ కమిటి, రాజ్యాంగ ముసాయిదాను చేపట్టింది . కమిటీ సభ్యులు 1949 నవంబరు 26 వ తీదీన తొలి ముసాయిదా ప్రతుల పై సంతకాలు చేశారు . అది 1950 జనవరి 26 వ తీదీ నుంచి అమల్లోకి వచ్చింది . రాజ్యాంగ మౌలిక లక్ష్యం -- సామాజిక , ఆర్ధిక , రాజకీయ న్యాయాన్ని అందరరికీ అంచించడం . ఈ లక్ష్యము ప్రజల హక్కులకు రూపాన్ని ఇచ్చింది . ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలను పరిరక్షించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి గల , సమర్ధవంతమైన న్యాయాన్ని ఇవ్వగల వ్యవస్థ అవసరము . చట్టము ముందు సమాన పరిగణన , వ్యక్తిగత స్వేచ్చ వంటి అంశాల అధ్యయనము ద్వారా బారతీయ న్యాయవ్యవస్థ కీలక సామాజిక పాత్రను బలోపేతము చేయడం జరిగినది . ముఖ్యముగా గత మూడు దశాబ్దాలలో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్‌ (పి.ఐ.యల్) ఉద్యమ వికాసము తర్వాత ఇది మరింతగా బలపడింది . హక్కుల అవగాహనను వివిధ దశల్లో విసృత పరిచారు . ప్రాధమిక హక్కులకు పెద్దపీట వేశారు . వీటన్నింటికీ రక్షణ న్యాయవవస్థ . . . కాబట్టి రాజ్యాంగ ముసాయిదా సంతకాల రోజును జాతీయ న్యాయదినోత్సవాన్ని జరపడానికి ఎంచుకున్నారు . ఈ దినోత్సవము నాడు న్యాయవాదులు సమావేశమై ప్రతిజ్ఞ చేస్తారు . చట్టము ముందు అందరూ సమానమేనని తెలిలజేయడం , సత్వర న్యాయము కోసము కృషిచేయడం .. న్యాయదినోత్సవ ధ్యేయాలు . ప్రభుత్వాలు చట్టాలు ప్రజా వ్యతిరేకముగా ఉన్నా, రాజ్యాంగాన్ని అతిక్రమించేవిగా ఉన్నా అవి చెల్లవని చెప్పే అధికారము రాజ్యాంగ ధర్మాసనాలకు ఉన్నది .. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పులకు కూడా చట్ట హోదా ఉంటుంది . 2008 నాటికి 1.8 కోట్ల కేసులు కోర్టుల ముందు పెండింగ్ లో ఉన్నట్లు అంచనా . కొన్నేళ్ళుగా పెండింగ్ కేసుల పెరుగుదల స్థిరము గా కొనసాగుతున్నది . 2008 లో 14,000 మంది న్యాయమూర్తులు 1.7 కోట్ల కేసుల్ని పరిష్కరించారు . సగటున ఒక్కోన్యాయమూర్తికి ఏటా 1200 కేసులు చొప్పున పరిష్కరించగలరన్నమాట. కేసుల నమోదు రేటు రాను రాను పెరుగుతుంది . మనదేశము లో న్యాయమూర్తుల కొరత ఉన్నందున కేసుల పరిష్కారము సత్వరము జరుగుటలేదు . కేసు పరిష్కారానికి చాలా కాల వ్యవధి పడుతున్నది . న్యాయము అందడము లో జాప్యము జరుగుతుందన్న కారణముగా చాలా మంది కోర్టుల్ని ఆశ్రయించడానికి సందేహిస్తుంటారు . అయితే న్యాయవాద వృత్తిలో ఉన్న వారంతా చట్టబద్దము గా సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరము ఉన్నది . ఈ మేరకు ప్రజల్లో విశ్వాసము పెంపొందించగలగాలి . ఆప్పుడే న్యాయ పరిరక్షణ సంపూరణము కాగలదు ... న్యాయదినోత్సవం నిర్వహణ ప్రక్రియ ఫలవంతంగా ఉండగలదు .
గిడుగు వెంకట రామమూర్తి (1863-1940) ఆధునిక తెలుగు భాషానిర్మాతల్లో ముఖ్యుడు. ఉపాధ్యాయుడు, చరిత్ర, శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్త. ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలోనూ వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు కూడా ఒకరు. ఆయన ఒక జీవితకాలంలో అనేక జీవితాలపాటు చేయవలసిన మహోద్యమాలెన్నో చేపట్టారు. వాటిలో కొన్ని ఆయన జీవితకాలంలోనే ఫలితాలివ్వడం మొదలుపేట్టాయి. కొన్ని మహోద్యమాల ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోగలిగే స్థితికి జాతి ఇంకా పరిణతి చెందలేదు. ఒక విధంగా చెప్పాలంటే వాటి గురించిన అధ్యయనమే ఇంకా మొదలుకాలేదు. గిడుగు వారు అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకీ, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాల పేట గ్రామంలో జన్మించారు. 1880 లో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టారు. అప్పటినుంచి 1911 దాకా పర్లాకిమిడి సంస్థానంలో విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు. పదవీ విరమణ తరువాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష,విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు తలకెత్తుకున్నారు. మధ్యలో 1913-14 కాలంలో విజయనగరంలో విజయనగరం సంస్థానంలో ఉద్యోగం చేసారు. 1936 లో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్సును ఏరాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించినప్పుడు, ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేసారు. అప్పటినుంచి తాను స్వర్గస్తులయ్యేదాకా నాలుగేళ్ళ పాటు రాజమండ్రిలోనే కడపటిరోజులు గడిపారు. గిడుగు జీవితకాలంలో చేపట్టిన కృషి ఎన్నో శాఖలకు విస్తరించింది. వాటిలో ప్రధానంగా నాలుగు విభాగాల గురించి వివరించవలసి ఉంటుంది. మొదటిది ఆయన ముప్పయ్యేళ్ళకు పైగా ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. పర్లాకిమిడి మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడిగా, పాఠశాలల పరీక్షకుడిగా, పర్యవేక్షణాధికారిగా పనిచేసాడు. 1813 లో బ్రిటిష్ ఇండియాలో మిషనరీలో మొదటిసారిగా ప్రాథమిక పాఠశాలలు తెరిచారు. అప్పణ్ణుంచి 1835 దాకా పాతికేళ్ళ పాటు భారతదేశంలో విద్యపట్ల ఈస్టిండియా కంపెనీ ఎటువంటి వైఖరి అవలంబించాలి అన్నదాని మీద పెద్ద చర్చ జరిగింది. కొందరు ప్రాచీన భాషలైన సంస్కృతం, పారశీకాల్లో విద్యాబోధన జరగాలన్నారు. వాళ్ళని ఓరియెంటలిస్టులు అంటారు. కొందరు ఇంగ్లీషులో విద్యాబోధన జరగాలని వాదించారు. వారిని ఆంగ్లిసిస్టులు అంటారు. ఈ చర్చను ముగిస్తూ మెకాలే 1835 లో ఒక నిర్ణయం ఒక ప్రకటించాడు. తరువాత ఆ మినిటు ఆధారంగా కంపెనీ ఆధ్వర్యంలో పాఠశాలల పాలనావ్యవస్థను ఏర్పాటు చేస్తూ సర్ ఛార్లెస్ వుడ్ 1854లో ఆదేశాలు విడుదలచేసాడు. మెకాలే, వుడ్ ఉద్దేశ్యం ప్రకారం విద్యాబోధన ఇంగ్లీషులో జరగాలి. అది ఆధునిక విద్య కావాలి. ఆ విద్యని అందిపుచ్చుకున్న మొదటి తరం భారతీయులు తాము అందుకున్న ఆధునిక విద్యని తిరిగి తమ తమ దేశభాషల్లో దేశప్రజలకి అందచేయాలి. కాని, 1882లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్ వారి నివేదిక ప్రకారం ఆ ఆదర్శాలు నెరవేరనే లేదు. ఆ పరిస్థితిని చక్కదిద్దాలని లార్డ్ కర్జన్ భావించాడు. 1899 నుంచి 1905 కాలంలో ఆయన భారతదేశంలో వైస్ రాయి గా పనిచేసిన కాలంలో విద్యకి సంబంధించిన ఎన్నో సంస్కరణలు మొదలుపెట్టాడు. ఆ నేపథ్యంలో విద్యారంగంలో గిడుగు చేసిన కృషిని మనం పరిశీలించవలసి ఉంటుంది. కర్జన్ కన్నా దాదాపు ఇరవయ్యేళ్ళ ముందే ప్రాథమిక విద్యారంగంలో ప్రవేశించిన గిడుగు విద్యాబోధన విషయంలో ఎన్నో కొంతపుంతలు తొక్కాడు. గిడుగు జీవితచరిత్రకారులు ఈ అంశం గురించి దాదాపుగా ఏమీ చెప్పలేదనే చెప్పాలి. కాని విద్యకి సంబంధించి, ముఖ్యంగా పాఠశాల విద్యకి సంబంధించి గిడుగు ఆలోచనల్ని క్రోడీకరించి చూసుకున్నప్పుడు ఆయన భారతదేశంలోని మహనీయ విద్యావేత్తలైన వివేకానందుడు, జ్యోతిబా ఫూలేలకు సమస్కంధుడిగానూ, మహాత్మా గాంధీ, టాగోర్, అరవిందులు, రాధాకృష్ణన్, జిడ్డు కృష్ణమూర్తిలకన్నా ఎంతో ముందే విద్యాచింతన కొనసాగించినవాడిగానూ దర్శనమిస్తాడు. ఇక రెండవ అంశం విద్యారంగంలో గిడుగు చేసిన కృషికి కొనసాగింపే గాని, అసాధారమైన కొనసాగింపు. పర్లాకిమిడి ప్రధానంగా గిరిజన ప్రాంతం. అక్కడి సవరల స్థితిగతులు చూసి వారికి విద్యాబోధన చేపట్టాలనే ఉద్దేశ్యంతో 1892 లో గిడుగు సవరభాష నేర్చుకోవడం మొదలుపెట్టారు. వారికోసం ఒక పాఠశాల తెరిచారు. వారి విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ 1894 లో ఒక మెమొరాండం రాసి అప్పటి మద్రాసు గవర్నరుకు సమర్పించారు. కాని ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనా లేకపోవడంతో తానే సవర మాధ్యమంలో ఒక పాఠశాల తెరిచి సవరభాషలో వాచకాలు రూపొందించారు. 1913 నాటికి, అంటే, మిషనరీలు ఇంగ్లీషు మాధ్యమం పాఠశాలలు తెరిచిన వందేళ్ళకు సవరమాధ్యమంలో పుస్తకాలు వెలువరించి, పాఠశాలలు తెరిచాడు గిడుగు. కాని అప్పుడు భారతదేశంలో భాషల సర్వే చేపడుతున్న గ్రియర్ సన్ ఆ వాచకాలు బాగున్నాయిగాని, వాటిని తెలుగు లిపిలో రాయడంవల్ల ప్రయోజనం లేదని చెప్పాడు. తెలుగు లేదా ఒరియా లిపి వాడటంకన్నా ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫబెట్ వాడితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సూచించాడు. కాని ఆ విధంగా గిరిజన భాషామాధ్యమంలో ఒక పాఠశాల తెరవడంలోనూ, వాచకాలు రూపొందించడంలోనూ, వారి విద్య గురించి ఆలోచించడంలోనూ భారతదేశంలో గిడుగునే మొదటివాడు. అందుకని మనం ఆయన్ని భారతదేశంలో మొదటి యాంత్రొపాలజిస్టు అనవచ్చు. దాంతో 1913 నాటికి సవర భాషలో తన కృషి పూర్తయిందనుకున్న గిడుగు ఆ రోజు నుంచే తన కృషి నిజంగా మొదలయ్యిందని భావించాడు. అప్పటినుంచీ మరొక ఇరవయ్యేళ్ళు అపారమైన కృషి చేసి 1931 లో ‘మాన్యువల్ ఆఫ్ సోర లాంగ్వేజ్’ నీ, 1933 లో ‘ఇంగ్లీషు-సోర నిఘంటువు’ నీ వెలువరించాడు. భాషా శాస్త్రంలోనూ, ధ్వని శాస్త్రంలోనూ ఆయన చేపట్టిన ఈ అద్వితీయమైన కృషి వల్ల ఆయన్ని నేడు గొప్ప భాషాశాస్త్రవేత్త అనీ, కాలం కన్నా ముందున్న భాషావేత్త అని అంతర్జాతీయ స్థాయి లింగ్విస్టులు ప్రశంసిస్తున్నారు. సవర భాషకి సంబంధించిన కృషి ఆయన్ని తెలుగు భాష గురించి కూడా ఆలోచించేలా చేసింది. కర్జన్ చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో మద్రాసు ప్రావిన్సులో భాషాబోధనకి సంబంధించి కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. 1906 లో విశాఖపట్టణం జిల్లా పర్యవేక్షణాధికారిగా వచ్చిన యేట్సు ఆలోచనలు గిడుగుని శిష్ట వ్యావహారికం వైపు నడిపించాయి. అప్పటిదాకా పాఠశాలల్లో బోధిస్తున్న తెలుగు, రాసిన పుస్తకాలూ, పరీక్షలూ అన్నీ కూడా ఒక కృతక గ్రాంథికంలో నడుస్తున్నాయనీ, వాటి స్థానంలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టవలసి ఉంటుందని గిడుగు వాదించాడు. ప్రామాణిక భాషగా చెప్పుకుంటున్న పండితుల భాష జీవరహితమైన ఒక కృతక భాష అని చెప్పడానికి, వారి పుస్తకాలనుంచే ఉదాహరణలు ఎత్తిచూపుతూ ఆయన చాలా పెద్ద పోరాటమే చెయ్యవలసి వచ్చింది. ఆ ఉద్యమంలో భాగంగా ‘బాలకవి శరణ్యము’, ‘ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము’, గద్యచితామణి’ వంటి రచనలు చేపట్టారు. ఆ పుస్తకాల్లో వెలిబుచ్చిన భావాల సారాంశంగా 1912 లో A Memorandum of Modern Telugu వెలువరించి ప్రభుత్వానికి సమర్పించారు. గిడుగు అనగానే ప్రజలకు స్ఫురించేది వాడుకభాష గురించి చేపట్టిన ఈ మహోద్యమమే. ఈ ఉద్యమం ఫలితంగానే నేడు మనం పాఠశాలల్లో, సమాచార ప్రసారసాధనాల్లో, సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించుకోగలుగుతున్నాం. ఇక గిడుగు చేపట్టిన కృషిలో శాసన పరిశోధన, చరిత్ర పరిశోధన కూడా చెప్పుకోదగ్గవే. శ్రీముఖలింగం దేవాలయంలోని శాసనాల అధ్యయనంతో మొదలైన ఆయన చరిత్ర పరిశోధన చివరిదాకా కొనసాగుతూనే వచ్చింది. ఒక విధంగా గిడుగు వల్లనే గురజాడ కూడా శాసన, చరిత్ర పరిశోధన వైపు ఆసక్తి పెంచుకున్నాడని చెప్పాలి. గిడుగు జీవితకాలం పాటు చేసిన కృషిని ప్రతిబింబించే రచనలన్నీ కీర్తిశేషులు వేదగిరి రాంబాబు చొరవవల్ల 2014-2016 లో రెండు పెద్ద సంపుటాలుగా వెలువడ్డాయి. ఆ రచనలమీద సమగ్ర అధ్యయనం ఇంకా మొదలుకావలసి ఉంది. ఆయన గురించి తెలుసుకునేకొద్దీ, ఆయన శిష్యురాలు మిస్ మన్రో వర్ణించినట్టుగా ‘భారతదేశంలోని ఉదాత్తతకీ, సౌందర్యానికీ సంపూర్ణ ప్రతినిధి గిడుగు ‘ అని మనకి తెలుస్తూ ఉంటుంది.
జనగాం అభివృద్ధి చెందుతున్న అవకాశాలు అనంతమైనవి అటువంటి ముఖ్యమైన స్థలంలో ఉన్నాయి. చాలామంది ప్రజలు వ్యవసాయంపై మాత్రమే ఆధారపడి ఉన్నారు. అయినప్పటికీ, నీటి కొరత కారణంగా వేసవి నెలలలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ బాధపడతాడు.పరిశ్రమలలో మాకు సాధనము చేద్దాము: జనగాం ఎగుమతి పరిశ్రమట్ బియ్యం ఎగుమతుల రూపంలో ఈ నగరం యొక్క ఎగుమతి చాలా వరకు జరుగుతుంది, ఈ ప్రాంతం ప్రధాన బియ్యం సాగు కోసం ప్రసిద్ధి చెందింది. రైస్ మిల్స్, పత్తి ఇండస్ట్రీస్ బియ్యం, పత్తి మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని అందిస్తున్నాయి. అన్నంతో పాటు, పెబార్తితి చేతిపనులు కూడా భారతదేశానికి మాత్రమే కాకుండా, ఇతర విదేశీ దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతున్నాయి. జనగాం నుండి ఎగుమతి చేసిన ఉత్పత్తుల ప్రధాన జాబితాలో లెదర్ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. హస్తకళలు ఈ ప్రాంతం యొక్క ప్రధాన ఎగుమతులలో ఒకటి, వీటిలో రాయి స్మారక కట్టడాలు, బ్రాస్వేర్ మరియు పట్టు (చేనేత నేత) హస్తకళలు ఉన్నాయి. జనగాం వ్యవసాయ పరిశ్రమ జనగాం దాని వ్యవసాయ పరిశ్రమకు అత్యంత ప్రసిద్ధి చెందింది. ధాన్యం ఉత్పత్తి ఇక్కడ ఆదాయం ప్రధాన వనరు మరియు అది ధాన్యం మార్కెట్ లో మొత్తం ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచింది. చాలామంది రైతులు బియ్యం ఉత్పత్తిలో మార్కెట్ మాత్రమే కాక, వారి ప్రధాన జీవనోపాధికి కూడా నివసించారు. పత్తి ప్రాంతం యొక్క మరొక పంట. అయితే, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా దాని ఉత్పత్తి తగ్గుతోంది. జనగాం యొక్క ఇతర పరిశ్రమలు జనగాం కొన్ని చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు నిలయంగా ఉంది, కానీ ఈ ప్రాంతంలో అభివృద్ధికి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇక్కడ అభివృద్ధి చెందలేదు. నిజాం నియమావళిలో ప్రారంభించిన కొన్ని వ్యాపారాలు కూడా మూసివేయబడ్డాయి, అదే కారణం వలన ఈ ప్రాంతంలోని నిరుద్యోగం పెరుగుతుంది. అదే విధంగా దృశ్యం కొనసాగితే, రోజుకు పెరుగుతున్న నిరుద్యోగ రోజు కారణంగా నక్సలైట్ ఉద్యమం ఈ ప్రాంతంలో పెరుగుతుంది. లెదర్ టానింగ్, వస్త్ర పరిశ్రమ, పొగాకు ఉత్పత్తులు, చెక్క ఫర్నిచర్, పేపర్ మరియు కాగితపు ఉత్పత్తులు, ఖనిజ ఆధారిత ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ మెషినరీ మరియు ట్రాన్స్పోర్ట్ పరికరాలు, మరమ్మతు మరియు సేవలు మరియు జంతువుల హస్బ్రేరీ వంటి ఇతర పరిశ్రమలు ఇక్కడ కొద్దిస్థాయిలో వృద్ధి చెందాయి.
యంగ్ హీరో నిఖిల్ అనూహ్యంగా పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన ‘కార్తికేయ-2′ పాన్ ఇండియా వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. చిన్న సినిమాగా రిలీజ్ అయి అతి పెద్ద విజయం అందుకున్నచిత్రంగా నిలిచింది. టాలీవుడ్ సినీ చరిత్రలో ఇది ఓ సంచలనమే. హిందీ బెల్ట్ లో ఊహించని వసూళ్లని సాధించింది. తెలుగు రాష్ట్రాలల్లో సైతం నికిల్ కెరీర్ లోనే అతి పెదద్ హిట్ చిత్రంగా నిలిచింది. దీంతో ఆ సినిమా యూనిట్కి అన్నిచోట్లా మంచి పేరొచ్చింది. తాజాగా ఇదే క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకోబుతున్నాడు నిఖిల్. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ’18 పేజిస్’ రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులోనూ అనుపమ పరమేశ్వర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ రకంగా కార్తికేయ-2 కాంబో మళ్లీ తెరపైకి వస్తోంది. అయితే ఇప్పుడీ క్రేజ్ని నిఖిల్ 18 పేజిస్ విషయంలో ఎంత వరకూ వర్కౌట్ చేస్తాడు? అన్నది చూడాలి. కార్తికేయ2 ముందు వరకూ అతను యావరేజ్ హీరో. ఆ సినిమా వసూళ్లు అతని స్థాయిని మార్చేసాయి. స్టార్ ఇమేజ్ ని రెట్టింపు చేసాయి. ఇప్పుడా ఇమేజ్ తో తన కొత్త సినిమా థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించగలగాలి. భారీ ఓపెన్సింగ్ తేగలగాలి. అప్పుడే నిఖిల్ సత్తా ఏంటన్నది తేలేది. స్టార్ హీరోల సినిమాలు ఓపెనింగ్స్ ఏ స్థాయిలో వస్తాయో…నిఖిల్ విషయంలోనూ అది జరిగాలి. కంటెంట్ కంటే ముందు హీరో ఇమేజ్ అనేది కీలకం. ఆ ఇమేజ్ తోనే జనాలు థియేటర్ రావాలి. మరి నిఖిల్ సత్తా ఎలా ఉంటుందన్నది అడ్వాన్స్ బుకింగ్స్ ని బట్టి అంచనా వేయోచ్చు. మరి ఓపెనింగ్ రేసులో నిలుస్తాడా? లేక మరోసారి హిట్ కంటెట్ తో నెమ్మదిగా బాక్సాఫీస్ బరిలో నిలుస్తాడా? అన్నది చూడాలి. ఈ సినిమాకి అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉండగా బన్నీ వాస్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. కార్తికేయ-2 హిదీ వసూళ్లు చూసి అరవింద్ షాక్ అయిన సంగతి తెలిసిందే. 50 థియేటర్లలో రిలీజ్ చేసిన సినిమా ఆ తర్వాత 1000 థియేటర్లలో రిలీజ్ అయిందంటూ సంతోషం వ్యక్తం చేసారు. మరి సైలెంట్ గా ’18 పేజిస్’ ని కూడా పాన్ ఇండియాలో వదులుతున్నారో? ఏమో చూడాలి.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. December 02, 2020 • Valluru Prasad Kumar *కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. October 14, 2020 • Valluru Prasad Kumar వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు. October 18, 2020 • Valluru Prasad Kumar *ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు. October 20, 2020 • Valluru Prasad Kumar *పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
కోవిద్ పై ఆందోళన వద్దని, అనవసర భయాల వల్ల మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుందని కేంద్రం ప్రజలను హెచ్చరించింది. ఇప్పుడు ప్రధాన సమస్య ఆక్సిజన్ కొరత అని, దీన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. No Panic On Covid Says Centre Umakanth Rao | Edited By: Phani CH Apr 26, 2021 | 6:31 PM కోవిద్ పై ఆందోళన వద్దని, అనవసర భయాల వల్ల మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుందని కేంద్రం ప్రజలను హెచ్చరించింది. ఇప్పుడు ప్రధాన సమస్య ఆక్సిజన్ కొరత అని, దీన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. అయితే దీన్ని ఆసుపత్రులకు రవాణా చేయడం పెద్ద సమస్యగా మారిందని తెలిపింది. దేశంలో పలు ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసి ఉన్నాయని, అయితే చాలామంది రోగులు భయంతో తమ పడకలను వదలడం లేదని, వారు డాక్టర్ల సలహా ప్రకారం నడుచుకోవాలని హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. కొనుగోలు ద్వారానో, అద్దె రూపంలోనో ఇండియా విదేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పించుకుంటోందని ఆయన వెల్లడించారు. కానీ వీటి రవాణా ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఆయా హాస్పిటల్స్ ఆక్సిజన్ ని హేతు బద్ధంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. తమకు అవసరమైన దానికన్నా ఎక్కువ కావాలని కొన్ని ఆస్పత్రులు కోరడం వల్ల ఇది అత్యంత అవసరమైన ఆసుపత్రులకు సమస్య ఏర్పడుతుందని ఆయన వివరించారు. భౌతిక దూరం పాటించకపోతే ఒక వ్యక్తి 30 రోజుల్లో 406 మందికి వైరస్ ను వ్యాప్తి చెందింప జేయగలుగుతాడని పరిశోధనల ద్వారా తెలుస్తోందన్నారు . కోవిడ్ ప్రొటొకాల్స్ ను పాటించడం మనకే మంచిదని, నిర్లక్ష్యం వల్ల కూడా ఇంతటి తీవ్రమైన పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నామని కేంద్రం అభిప్రాయపడింది. ఏమైనా ఈ తరుణంలో మన దేశానికి సాయపడేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయని వెల్లడించింది. ఇక ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం వివిధ ఉత్పాదక సంస్థలను కోరినట్టు పేర్కొంది. ఢిల్లీ ఆసుపత్రుల్లో పరిస్థితి మెల్లమెల్లగా మెరుగుపడుతోందని తెలిపింది. మరిన్ని ఇక్కడ చూడండి: Polavaram Project: పోలవరానికి మరో 333 కోట్లు.. విడుదలకు కేంద్రం సుముఖం.. ఇంకా రావాల్సిందెంత? West Bengal Election 2021 Phase 7 Voting LIVE: ప్రశాంతంగా ఏడో విడత పోలింగ్.. కోల్‌కతాలో ఓటేసిన సీఎం మమతా బెనర్జీ
రెండురోజుల కిందట. పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళే హడావిడి. విజ్జి అన్నం వడ్డించింది. కాని నా మనసులో కర్ణపర్వంలో శ్రీకృష్ణుడు మాట్లాడిన మాటలే పదేపదే వినిపిస్తున్నాయి. ఘటోత్కచవధ అయిన తరువాత ఆయన సంతోషం ఆపుకోలేకపోయాడు. మాటిమాటికి అర్జునుడి వీపు చరుస్తూ సంతోషంతో అరుస్తూ ఉన్నాడు. ఆ సంతోషాన్ని అర్జునుడు కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ‘అంతా దు:ఖంతో ఉంటే నువ్విట్లా సంచలిస్తూండటం నేను అర్థం చేసుకోలేక పోతున్నాను. ఇందుకు కారణం రహస్యం కాకపోతే నాకు చెప్పు’ అన్నాడు. దానికి కృష్ణుడు చాలా వివరంగానే జవాబిచ్చాడు. ‘తన కవచకుండలాలు ఇంద్రుడికిచ్చినందుకు, ఇంద్రుడినుంచి కర్ణుడు పొందిన శక్తిని ఇన్నాళ్ళూ నీ మీద ప్రయోగించడంకోసమే దాచుకున్నాడు. అది ఉన్నంతకాలం నాకు నిద్రపట్టలేదు. అది ఇన్నాళ్ళకు ఘటోత్కచుడిమీద ప్రయోగించడంతో కర్ణుడింక మామూలు యుద్ధవీరుడు మాత్రమే. ఆ శక్తి ఉందనే ఇన్నాళ్ళూ నిన్ను కర్ణుడికి ఎదురుగా పోనివ్వలేదు. నిన్ను అహర్నిశలూ అతణ్ణుంచి కాపాడుకోవడమెట్లా అన్న ఆలోచనతో నాకు నిద్రకూడా పట్టేది కాదు’ అన్నాడు కృష్ణుడు. అంతేకాదు, ఆ తరువాత సాత్యకితో ఇట్లా అన్నాడు: న పితా న చ మే మాతా న యూయం భ్రాతర న చ ప్రాణస్తథా రక్ష్యా యథా బీభత్సురాహవే (కర్ణ పర్వం:183:43) (‘యుద్ధంలో బీభత్సుడిని రక్షించుకోవడం కన్నా నాకు నా తండ్రి, నా తల్లి, నా సోదరుడి ప్రాణాలుగాని, మీ ప్రాణాలుగాని, చివరికి నా ప్రాణాలు కూడా ముఖ్యం కాదు.’) అక్కడితో ఆగకుండా మరోమాట కూడా అన్నాడు: త్రైలోక్యరాజ్యాద్ యత్ కించిద్ భవేదన్యత్ సుదుర్లభమ్ నేచ్ఛేయమ్ సాత్వతాహమ్ తద్ వినా పార్థమ్ ధనంజయమ్ (183:44) (‘ఈ మూడులోకాల్నీ పాలించడంకన్నా కూడా విలువైనదంటూ ఏదన్నా ఉంటే దాన్ని కూడా పార్థధనంజయుడు లేకుండా పొందడం నాకు ఇష్టం లేదు.’) బహుశా మనమెవరమైనా జీవితంలో కోరుకోవలసింది ఇటువంటి మనిషిని, సఖుణ్ణి, హితైషిని. ఇటువంటి సారథి దొరికితే నా బతుకు పగ్గాలు అతడి చేతిలో పెట్టేసి నిశ్చింతగా జీవించగలను కదా అనిపించింది. లేదా మనమెవరి జీవితంలోనైనా ప్రవేశిస్తే, వారికి స్నేహితులిగానో, ప్రేమికులుగానో మారదలచుకుంటే ప్రవర్తించవలసిందిట్లానే కదా అనిపించింది. అయితే నీకొక పార్థసారథి దొరకాలి, లేదా నువ్వొక పార్థసారథిగానైనా బతకాలి. ఈ మాటలే మనసులో సుళ్ళు తిరుగుతుంటే లోపల అణచుకోలేక అదంతా పైకి చెప్పాను. విజ్జి సానుకూలంగా విందిగాని, ప్రమోద్ ఉండబట్టలేక ‘మరి కర్ణుడు కూడా దుర్యోధనుడితో అట్లాంటి స్నేహమే చేసాడు కదా. కాని మీరంతా కృష్ణుడు దేవుడంటారుగాని, కర్ణుణ్ణి దేవుడిలాగా చూడరెందుకు’ అనడిగాడు. మా ఇంట్లో ఇదొక పారడాక్స్. నా తాత, నా తండ్రి కృష్ణాభిమానులు. కాని నా తల్లినుంచి సంక్రమించిందేమో నా కొడుకు రామాభిమాని. కృష్ణుడికీ, కర్ణుడికీ తేడా ఏమిటని ప్రమోద్ అడుగుతున్నప్పుడు మ్యూజింగ్స్ లో చలం రాముడికీ, కృష్ణుడికీ మధ్య లేవనెత్తిన చర్చ అంతా గుర్తొచ్చింది. కాని ఆ ప్రశ్న చిన్నదేమీ కాదు. అవును. కృష్ణుడు అర్జునుడి పట్ల చూపించిన స్నేహంకన్నా కర్ణుడు తన మిత్రుడి పట్ల చూపించిన నిబద్ధత ఏం తక్కువ? కాని తేడా ఉందనిపించింది. ఒకనిముషం ఆలోచించాక ప్రమోద్ తో ఇలా చెప్పాను: ‘ కృష్ణుణ్ణి అందరూ దేవుడనే అన్నారు. ఆయన కూడా భగవద్గీతలో తనను సర్వేశ్వరుడిగానే చెప్పుకున్నాడు. కాని తన మిత్రుణ్ణి రక్షించుకోవాలన్న సంకల్పం ముందు ఆయన తన దైవత్వానికి విరుద్ధమైన ఏ ఒక్క పని చెయ్యడానికి కూడా వెనకాడలేదు. తనన్ని లోకులు ఏమనుకుంటారో, శత్రువులు ఏమని విమర్శిస్తారో అన్న అలోచనలేదు. ఆయన ముందున్నదంతా ఒకటే. తన సఖుణ్ణి ఎట్లాగైనా రక్షించుకోవాలి.ఆ విషయంలో ఆయన highly focused.’ ‘కాని కర్ణుడలా కాదు. కర్ణుడి అండ చూసుకునే దుర్యోధనుడు మొత్తం కురుక్షేత్రానికి అంకురార్పణ చేసాడు. కర్ణుడు పరిచయమయ్యాకనే దుర్యోధనుడికి పాండవుల్ని గెలవగలన్న ఆశ కలిగింది. కర్ణుడి మాటలు ఎప్పటికప్పుడు ఆ నమ్మకాన్ని బలపరుస్తూ వచ్చాయి. కాని అంత వాగ్దానం చేసినవాడు, తన మిత్రుడి క్షేమం కోరుకున్నవాడు, తన దివ్యాస్త్రాల విషయంలో, ముఖ్యంగా ఇంద్రుడు కవచకుండలాలు కోరుకున్నప్పుడు వాటిని దానం చెయ్యకుండా ఉండలేకపోయాడు. అంటే ఏమిటి? తన దాతృత్వలక్షణం తక్కువకాకూడదనే కదా! కుంతి వచ్చి యాచించినప్పుడు అర్జునుడు తప్ప తక్కిన పాండవులు ఎవరు దొరికినా చంపకుండా వదిలిపెడతానని మాట ఇచ్చాడు. కాని అప్పటికే తన స్నేహితుడిలో ఆశలు రేకెత్తించి అతణ్ణి యుద్ధానికి సిద్ధం చేస్తున్న కర్ణుడి అట్లా దానాలూ, వాగ్దానాలూ ఇచ్చే అధికారం ఎక్కడుంది? అంటే కర్ణుడు ఆ సందర్భాల్లో మనిషిలాగా కాకుండా దేవుడిలాగా ప్రవర్తించాడు. కాని చూడు దాతృత్వమనే విషయానికి వచ్చినప్పుడు బహుశా కర్ణున్ని మనం గొప్పగా తలుచుకోవచ్చు. కాని తన దాతృత్వం వల్ల తాను తన స్నేహితుడికోసం సంపూర్ణంగా నిలబడలేనని గ్రహించుకోలేకపోయాడు. తాను దాత కాకుండా పోతానేమోనన్న ఆందోళన అతణ్ణి బలహీనపరిచింది. స్నేహితుడికోసం కట్టుబడటం ఒక విలువ. అడిగినవారికి లేదనకపోవడం ఒక విలువ. కాని రెండు విలువల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు కర్ణుడు రెండింటినీ నిలుపుకోవాలని చూసాడు. కాని కృష్ణుడట్లా చెయ్యలేదు. ఆయనకి స్నేహితుణ్ణి రక్షించుకోవడమా, తాను దేవుడనిపించుకోవడమా ఏది ముఖ్యమంటే, స్నేహితుడే ముఖ్యమన్నాడు. అందుకోసం ఎటువంటి ఎత్తులకైనా, జిత్తులకైనా వెనకాడలేదు. పైగా అట్లా చెయ్యడమే తన వ్యూహమని సమర్థించుకున్నాడు.’ ‘చిత్రంగా లేదూ, తన జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడిలాగా ప్రవర్తించిన కర్ణుడికి మనం దైవత్వాన్ని ఆపాదించట్లేదు. కాని ఏం చేసైనా సరే అర్జుణ్ణి రక్షించిన కృష్ణుణ్ణి మాత్రం దేవుడని కొలుస్తున్నాం.’
Munugode: మునుగోడు ఉపఎన్నిక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉపఎన్నిక ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనంగా మారడంతో.. మునుగోడు ఉపఎన్నికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పార్టీలన్నీ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, హోరాహోరీగా ప్రచారం చేయడంతో ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠకరంగా మారింది. పార్టీలన్నీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాయి. నేతలందరినీ మునుగోడులోనే రంగంలోకి దింపి ప్రచారం చేయించాయి.ఇంటింటికి తిరిగి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. ఇక ధనప్రవాహం గురించి ప్రత్యేకగా చెప్పనక్కర్లేదు. పోలింగ్ రోజు కూడా డబ్బులు పంచారంటే మునుగోడులో డబ్బు ప్రవాహం ఏ విధంగా పారిందో తెలుసుకోవచ్చు. తమకు డబ్బులు పంచలేదంటూ కొంతమంది ఓటర్లు ఆందోళనకు దిగారు. పార్టీల నేతలు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ పోలింగ్ లో పాల్గొనకుండా బహిష్కరించారు. తులం బంగారం ఓటర్లకు ఇస్తామంటూ పార్టీల నేతలు ఆఫర్ చేశారంటూ మునుగోడులో ప్రలోభాలపర్వం ఏ స్థాయిలో జరిగిందో తెలుసుకోవచ్చు. పార్టీల నేతల మధ్య ఘర్షణలు, దాడులతో మునుగోడు ఉపఎన్నిక వాడివేడిగా జరిగింది. అయితే పోలింగ్ ముగియడంతో మునుగోడు ఉపఎన్నికపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ టీఆర్ఎస్ కే కట్టం కట్టాయి. రెండు, మూడు సర్వే సంస్థలు తప్ప.. మిగతా సర్వే సంస్థలన్నీ కూడా టీఆర్ఎస్ కే జై కొట్టాయి. ఎస్‌ఏఎస్(ఆత్మసాక్షి), హెచ్ఎంఆర్, పీపుల్స్ పల్స్, పొలిటికల్ లేబొరేటరీ, త్రిశూల్, థర్డ్ విజన్, పల్స్ టుడే, కౌటిల్య, తెలంగాణ జర్నలిస్టు అధ్యయన వేదిక, స్మార్ట్ పొలిటికల్ రిసెర్చ్ సంస్థ మునుగోడు ఉపఎన్నికపై ఎగ్జిట్ పోల్ అంచనాలు అంచనా వేశాయి. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ లో టీఆర్ఎస్ కు 41 శాతం నుంచి 42 శాతం, బీజేపీకి 35 శాతం నుంచి 36 శాతం, కాంగ్రెస్ 16.5 శాతం నుంచి 17.5 శాతం, బీఎస్పీ 4 నుంచి 5 శాతం వరకు సంపాదించుకుంటాయని వెల్లడించింది.ఇక హెచ్ఎంఆర్ సంస్థ టీఆర్ఎస్ 42.13 శాతం, బీజేపీ 31.98 శాతం, కాంగ్రెస్ 21.06 శాతం, ఇతరులు 4.83 శాతం వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరించింది. పీపుల్స్ పల్స్ టీఆర్ఎస్ 44.4 శాతం, బీజేపీ 37.3 శాతం, కాంగ్రెస్ 12.5 శాతం, ఇతరులు 5.8 శాతం వస్తాయని తన ఎగ్జట్ పోల్ అంచనాల్లో తెలిపింది. పొలిటికల్ లేబొరేటరీ సంస్ధ బీజేపీకి 42 శాతం, టీఆర్ఎస్ కి 39 శాతం, కాంగ్రెస్ కి 12 శాతం, బీఎస్పీకి 3 శాతం వస్తాయని అంచనా వేసింది. త్రిశూల్ ఎగ్జిట్ పోల్ అంచనాల్లో టీఆర్ఎస్ 47 శాతం, బీజేపీ 31 శాతం, కాంగ్రెస్ 18 శాతం, ఇతరులు 4 శాతం అని ఇచ్చింది. థర్డ్ విజన్ విషయానికొస్తే.. టీఆర్ఎస్ 48 శాతం నుంచి 51 శాతం, బీజేపీకి 31 శాతం నుంచి 35 శాతం, కాంగ్రెస్ కు 13 శాతం నుంచి 15 శాతం, బీఎస్పీకి 5 శాతం నుంచి 7 శాతం వస్తాయని తెలిపింది. పల్స్ టుడే సర్వేలో టీఆర్ఎస్ కు 42 నుంచి 43 శాతం, బీజేపీకి 38.5 శాతం, కాంగ్రెస్ కు 14 నుంచి 16 శాతం, బీఎస్పీకి 3 శాతం వస్తాయని తెలిపింది. ఇక కౌటిల్య, తెలంగాణ జర్నలిస్టు అధ్యయన వేదిక, స్మార్ట్ పొలిటికల్ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్ అంచనాల్లో కూడా టీఆర్ఎస్ గే గెలుపు అవకాశాలు ఉన్నాయిన స్పష్టం చేసింది. ఒక్క పొలిటికల్ ల్యాబరేటరీ సంస్థ తప్పితే.. మిగతా అన్ని సర్వేలలోనూ టీఆర్ఎస్ దే విజయం అని తేల్చేశాయి. మరి ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా.. లేదా అనేతి 6వ తేదీన చూడాలి.
*సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ హెచ్చరించారు.* *- బిగ్గరగా చేసే నినాదాలు, వాస్తవాలు అత్యధిక ప్రజల అభిప్రాయాలకు ప్రతిబింబం కాకపోవచ్చని.. స్వతంత్రంగా, బాహ్య ఒత్తిళ్లకు అతీతంగా నిలబడి పనిచేయడమే ముఖ్యమని స్పష్టం చేశారు.* *- జస్టిస్‌ పి.డి.దేశాయ్‌ స్మారకోపన్యాసంలో పాల్గొన్న సీజేఐ ఈ మేరకు వ్యాఖ్యానించారు.* ★ ప్రభుత్వ అధికారాలు, చర్యలను తనిఖీ చేసే సమయంలో న్యాయ వ్యవస్థకు సంపూర్ణ స్వాతంత్య్రం ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తెలిపారు. ★ శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల ద్వారా, చట్టాల రూపంలో న్యాయ వ్యవస్థను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానో నియంత్రించరాదని అభిప్రాయపడ్డారు. ★ అందుకు భిన్నంగా జరిగితే చట్టబద్ధ పాలన(రూల్‌ ఆఫ్‌ లా) ఓ భ్రమగానే మిగిలిపోతుందని పేర్కొన్నారు. ★ బుధవారం సాయంత్రం జస్టిస్‌ పి.డి. దేశాయ్‌ 17వ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ★ _*’చట్టబద్ధ పాలన’*_ అనే అంశంపై ప్రసంగించారు. ★ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని హెచ్చరించారు. ★ బిగ్గరగా చేసే నినాదాలు, వాస్తవాలు అత్యధిక ప్రజల అభిప్రాయాలకు ప్రతిబింబం కాకపోవచ్చన్న విషయాన్ని న్యాయమూర్తులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ★ _*’మంచి-చెడు, తప్పు-ఒప్పు, అసలు-నకిలీల మధ్య వ్యత్యాసాలను తెలుసుకోలేని విధంగా విషయాన్ని విపరీతంగా ప్రేరేపించే శక్తి నవీన మాధ్యమ సాధనాలకు ఉంది. అందువల్ల తీర్పులు వెలువరించడానికి మీడియా విచారణలు ప్రాతిపదిక కాకూడదు. స్వతంత్రంగా, బాహ్య ఒత్తిళ్లకు అతీతంగా నిలబడి పనిచేయడం అత్యంత ముఖ్యం’*_ అని జస్టిస్‌ రమణ స్పష్టం చేశారు. అందుబాటులో న్యాయం “చట్టం ముందు అందరూ సమానమే అంటే న్యాయం అందరికీ సమానంగా అందుబాటులో ఉండటమేనని అర్థం. మన దేశంలో చట్టబద్ధ పాలనకు ఇదే మూలసూత్రం. పేదరికం, నిరక్షరాస్యత, ఇతరత్రా బలహీనతల కారణంగా పేదలు తమ హక్కులను అనుభవించలేకపోతే సమానత్వ సిద్ధాంతానికి అర్థమే ఉండదు. స్త్రీ,పురుష సమానత్వం కూడా ముఖ్యమే. మహిళా సాధికారత కేవలం వారి హక్కుల కోసం పోరాడటానికే కాకుండా సమాజానికీ ముఖ్యం”*_ అని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తెలిపారు. రాజ్యాంగ బాధ్యతల సక్రమ నిర్వహణ ★ దేశంలో ఇప్పటివరకు జరిగిన 17 సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీలు, కూటములను ప్రజలు 8 సార్లు తిరస్కరించారు. అంటే 50% ప్రభుత్వాలు మారిపోయాయి. ★ విశాల దేశంలో ఎన్నో అసమానతలు, నిరక్షరాస్యత, వెనుకబాటుతనం, పేదరికం, అజ్ఞానం ఉన్నప్పటికీ స్వతంత్ర భారత పౌరులు వారికి అప్పగించిన పనిని అత్యంత బాధ్యతాయుతంగా, విజయవంతంగా పూర్తిచేశారు. కీలక వ్యవస్థలకు నేతృత్వం వహిస్తున్న వారు రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నామా? లేదా? అని పరీక్షించుకోవాలి. పరిపాలకుడిని మార్చినంత మాత్రాన దౌర్జన్యాల నుంచి రక్షణ లభిస్తుందన్న హామీ ఏమీలేదు. రాజకీయ విభేదాలు, విమర్శలు, నిరసనలు ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతర్భాగం. చట్టసభలు రూపొందించే చట్టాలు రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఉండేలా చూసే ప్రాథమిక వ్యవస్థ న్యాయ వ్యవస్థే. దాని ప్రధాన విధి చట్టాలను సమీక్షించడమే. రాజ్యాంగ మూల సూత్రాల్లో భాగంగా సుప్రీంకోర్టు ఈ పని చేస్తోంది. దానిని పార్లమెంటు నియంత్రించలేదు. అయితే రాజ్యాంగాన్ని రక్షించే ప్రధాన బాధ్యత కేవలం కోర్టుల మీదే కాకుండా శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలపైనా ఉంది. న్యాయ వ్యవస్థ పాత్రకు పరిమితులున్నాయి. తన ముందుకొచ్చిన విషయాలను మాత్రమే అది పరిశీలించగలదు. ఈ పరిమితే రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యతలను మిగతా వ్యవస్థలకు అప్పగిస్తోంది” అని జస్టిస్‌ రమణ తెలిపారు. ప్రభుత్వాల మద్దతుతో రూపుదిద్దుకొనే ఏ చట్టమైనా కొన్ని ఆదర్శాలు, న్యాయసూత్రాలకు కట్టుబడి ఉండాలని, అలాంటి చట్టాల ప్రాతిపదికన పరిపాలన చేస్తున్నప్పుడే దాన్ని ‘రూల్‌ ఆఫ్‌ లా’గా అభివర్ణించడానికి వీలవుతుందని స్పష్టం చేశారు. తీర్పులే న్యాయమూర్తుల సత్తాకు కొలమానాలు “తీర్పుల ద్వారా మాత్రమే న్యాయమూర్తుల గురించి తెలుస్తుంది. న్యాయమూర్తుల సత్తాను పరీక్షించడానికి తీర్పులే నిజమైన కొలమానాలు. న్యాయమూర్తులు వెలువరించే గొప్ప తీర్పులు ఎప్పటికీ న్యాయబద్ధంగా గుర్తుంటాయి” అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ జులై 4వ తేదీన పదవీ విరమణ చేయనున్న సందర్భంగా బుధవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ ప్రసంగిస్తూ సుప్రీంకోర్టు సహచరుడిగా జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ అందించిన సేవలను కొనియాడారు. ఆయన గొప్ప మానవతావాది అని, ఆ లక్షణాలు ఆయన విధి నిర్వహణలో ఎప్పుడూ ప్రస్ఫుటమవుతుంటాయని పేర్కొన్నారు. 2016, మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌.. పలు చరిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు.
ఆదివారం పెద్దకూర పండగా, నాటుసార ఏడుకా గడిచిపోయాక సోమారం చెప్పుల దుకానం కాడ కూచోడం బలే కష్టమనిపిస్తది మారయ్యకి. కానీ తప్పదు. మళ్లీ వారమంతా అందరి కడుపు నిండి, వారం చివర కాసింత సరదా కావాలంటే వారమంతా ఈడ కూచుని ఎదురు చుడాలిసిందే. దుకానమంటే ఏమంత కాదుగానీ, నేలమీద రెండు గోనెలు, సుత్తీ, అరా, పెద్దసూదీ, దారం, అతికిచ్చే బంక ఇంకా నాలుగు జతల పాత చెప్పులు! ఓ చిన్న టార్పలిన్ షెడ్డు. అదీ వాన కాలం గాబట్టి ఓ మనిషి పట్టేంత చోట్లో ఎదురు కర్రలతో షెడ్డు ఏశాడు. చలికాలం ఆకాశం కిందనే. ఎండకి మాత్రం ఓ గొడుగేసుకుని నల్లని గొడుగు కింద మండతా వుంటాడు. అలవాటై పోయింది. నలభైయేళ్లుగా ఈడనే కూచుని వున్నాడు. రామారావు ముక్యమంత్రి కాకముందర, అయిన తరవాత ఊరికొచ్చినపుడు యీ దారంటే ఊరేగింపు చేశాడు. అంత లావు రామారావుని జనం బుర్రలోంచి మరిపిచ్చేసిన ఈ మారాజేవరా అని చంద్రబాబుని ఎగిరెగిరి చూసి ఆశ్చర్యపోయాడు. అయితే రాజన్న మటుకు తక్కువా?! పంచెగట్టి చేతులూపుకుంటాపోతావుంటే జనాలు ఎంత ఇదైపోయారు. చూస్తానే వున్నాడు…అందర్నీ…. యీడ్నే కూచుని. ముందుకీ పక్కకీ జరగలా గాని రోడ్డు ఎడల్పు చేసేప్పుడు కాసింత ఎనక్కి పోవలిసొచ్చింది! సినిమా హాలు సెంటరు కాడ రాత్రి చానా పొద్దు దాకా జనాలు తిరుగతనే వుంటారు. పెళ్లి గాక ముందు తను రేత్తిరిపూట సినిమా యిడిసి పెట్టేదాకా ఆడనే కాసుకుని ఉండేవాడు. రేత్తిరి సినిమాకి వచ్చే జనం పొయ్యే జనం-ఇద్దరి ముగ్గురి చెప్పులన్న తెగిపోయ్యేయి. ఆ టయాన జోడు తెగితే మంచి గిరాకి. ఏళ గానీ ఏళ గాబట్టి తనకి ఓ రూపాయి ఎక్కువ వసూలు! ఆ వసూలైన డబ్బులు దాపెట్టి ఆదోరం జలసా చేసేవాడు. పెళ్లైన తరవాత పొద్దు గుంకక ముందరే ఇంటికి పోవలిసొచ్చింది. సందకాడ ఉజ్జోగం మానేశాడు. అయినా ఇదివరకులా ఇప్పుడు తెగేదాకా చెప్పులు ఏసేవాడు ఏడున్నాడు! ఒక్కో మడిసికి నాలుగేసి రకాలాయే. పొద్దున్న లేస్తే ఆమనే నడస్తా పొయ్యేదానికి ఒకటి , ఇంట్లో ఒకటి, ఆఫీసుకొకటి, ఆటలకొకటి, బజారుకి పోతే ఇంకొకటి!. తిండికి లేనోడు తిండికి యాడస్తంటే జరిగినోడికి ఇట్ట….! ఈడ కూచుని చూస్తనే వున్నాడు, జనాలు సినిమాలకి నడస్తా రావడం మానేశారు. తొక్కుడు రిక్షాలు పోయి ఆటోలు, సైకిళ్ళు పోయి మోటారు బళ్ళు, రకరకాల గుడ్డలు, ఇంకా …గుడ్డ రంగునిబట్టి జోళ్ళు! జోళ్ళు నలక్క ముందే పడేత్తన్నారు. ఇంకా తెగేది ఏడ? తనకి పని దొరికేది ఏడ? పక్క సందులో సాయి బాబా గుడికాడ రకరకాల కొత్త జోళ్ళు వుంటాయి. ఆటిల్లో నాలుగు తెగబెరికేసి ఆడనే దుకానవెట్టి మళ్ళా కుట్టేస్తే బావున్ను! కానీ తనకట్టా చెయ్యను చాతగాదు. ఇప్పుడుగాదు, ఎప్పుడూ తప్పుడు పనులు జేసి డబ్బులు సంపాయించాలని చూళ్ళేదు. బిడ్డల చిన్నతనంలో ఇంటికాడ మంది తక్కువ, పనెక్కువ. ఇప్పుడు మంది పెరిగారు గాని పని రాన్రాను తగ్గిపోయింది. తనకొచ్చే సొమ్ముతో ఇల్లు గడవక, పెళ్ళాం పాలేనికి దగ్గర్లో టీచరమ్మకాడ పనికిజేరింది. మరి దానికి బైట రోజుకూలి పనికి పోయే ఓపిక లేదు, అలవాటూ లేదు. దుకానం సర్దతానే తలెత్తి చూశాడు. ప్రతిరోజూ చూస్తాడు. ఎదురుగా కిళ్ళి షాపులో షబానా వుంటది. పెళ్లి కాకండానే ముసిల్ది అయిపొయ్యింది. ముసుగుల్లో వుండాలిసిన పిల్ల బజార్లో కూచుని వుండటానో, తల్లీ తండ్రికి తాహతు లేకనో ఆ పిల్లకి నికా కాలేదు. షాపుకి మొగోళ్ళు సిగ్రేట్లకని, వక్కపొడికననీ ఒక్కోసారి కాలక్షేపానికని వస్తనే వుంటారు. షబానా ఎవ్వురివంకా తలెత్తి చూడదు. అందరితోను కోపంగా వున్నట్టు మాట్టాడతాది. కానీ తనవంక మాత్తరం అదో ఇదిగా చూసేది. తన మొహాన్నీ, బుజాలని మొత్తం కండల్ని కళ్ళతో తడిమేది. ఎప్పుడైనా ఒళ్ళు తేడాజేసి రెండ్రోజులు షాపు తెరవకపోయినా ఆలిసంగా తీసినా కంగారుగా కళ్ళతో పలకరించేది. తను తలెత్తి చూడకుండానే షబానా తన్ని చుస్తందని కనిబెట్టగలడు. తనక్కూడా షబానా మీద మోజుండేది. ఓ కాలంనాడు దయిర్నం చేసి మాట్టాడి లేవదీసుకుపోవల్నుకున్నాడు. కానీ ఇద్దరూ మంచం పొత్తు లేని జాతులై పోయే. పైగా అంగడి ఎవైపోద్దో అని గాబరా పడ్డాడు. ఈ రోజున పెళ్లి పెటాకులు లేకండా దిగాలుగా వాడిపోయిన షబానాని చూత్తే జాతిని తీసుకెళ్ళి నూతిలో పారేసి నా ‘సూపరు మారికేట్టు’ ఎత్తి ఏ సందులో పరిస్తే పని జరక్కుండా పోయేదా, దీనికోసరం ఆ పిల్లని ఉసురు పెట్టానా అని మనేద కలుగుద్ది. మేనమావ కూతురు రవనని మనువాడినా చానా మాట్లు రేత్తిరిల్లు తన పక్కన ఒత్తిగిల్లిన పిల్ల రవనలా కాకండ షబానాలాకనబడేది! అల్లంత దూరాన జగ్గయ్య పంతులొస్తా కనబడ్డాడు. ఇద్దరూ ఒకే కాలాన్ని పుట్టినోళ్ళు. ఇంటికాడ చొక్కా ఏసుకోడు, బజారోస్తే నీలం గళ్ళ చొక్కా ఏస్తాడు. మడిసి పచ్చగా తన నల్లటి సేతులతో తాకితే మాసిపోతా అనేలా వుంటాడు. కానీ తనంత గట్టింగ లేడు. మెడ కాడా, చెంపలకాడా జారిపోయింది. పంతులు తనూ ఒకే బళ్ళో పలకబట్టారు. తన సదువు నాలుగుతో ముగిసిపోతే పంతులు చానా దూరం పొయ్యాడు. పోతం పోయ్యడుగాని ఎప్పుడూ అత్తెసరే. ఆడాడ లెక్కలు రాసి బతకతంటాడు. వున్నా లేక పోయినా గుడ్డ నలగనీడు. మడిసి చానా ఉషారు. ఐతే చాదస్తం బాపడు. లేకపోతే ఉళ్ళో ఎన్ని యాపారాలొచ్చాయి! కానీ తన దగ్గర్నే చెప్పు తయారు చేబిచ్చుకుంటాడు. ఎంత అడిగినా బేరం ఆడకుండా ఇచ్చేస్తాడు. తనుగూడ ఎప్పుడూ పంతులినుండి ఎక్కువ గుంజాలని చూళ్ళేదు. “ఆ మారయ్యా, మన బాటా కంపెనీ కొత్త మోడల్స్ తియ్యి. జోళ్ళు మార్చేద్దాం” జగ్గయ్య తన పరచికానికి తనే ఇరగబడి నవ్వుతా పక్కనే బల్లమీద కూలబడ్డాడు. “రా పంతులా, నీ కోసరం గాక ఎవురికోసరం ఈడ కూసుండి వున్నా?! అట్నే కుట్టేద్దాం., రేపొద్దుటికి.” తన పాత సావాస గాడినీ, కస్టమర్నీ చూసి మారయ్య మనసు కుశాలైపోయింది. తోలు పని చేయడం గమ్మత్తనిపించినపుడు, బడి మానేసి పన్లోజేరాలనుండే సంగతి మొదులు ఇంటికాడ కాకండా జగ్గయ్యతోనే చెప్పాడు. జగ్గయ్య కాసేపు బడి మానోద్దని మారయ్యని బతిమిలాడాడు. గోటింబిల్లా, గోలికాయలు, బచ్చాలు, ఇంకా అట్టాంటి చానా ఆటలు మారయ్య కాడనే జగ్గయ్య రహస్యంగా నేరిచాడు. అట్టాంటి గురువు తన్ని వొదిలి పోతాడంటే జగ్గయ్యకి దిగులైపోయింది. కానీ మారయ్య ఇనిపిచ్చుకోల. “రేపటినించీ రానంటే రానంతే” ఆఖరికి ఇసయం అదే. ఆ రోజున ఇద్దరూ ఆశతీరా ఆడుకున్నారు మాపటేళకి ఇంటిదారి బోతన్నారు. జగ్గయ్య ఇల్లు బజారు ఏమ్మిడే. మారయ్య గుడిసె మాత్తరం బజారు దాటి సివరాకర్న ఆడేడో. ఆటకి అలిసి సావాసగాళ్ళకి దాహమైపోయింది. “దాహంగా వుందిరా” మారయ్యకి గస లేసింది. జగ్గయ్య చప్పున ఇంట్లోకి పోయి లోటానిండా నీళ్ళు తెచ్చాడు. మారయ్య గటగటా తాగేశాడు. అంతట్లోకి యీదిలోంచి పెద్ద పంతులు (జగ్గడి నాన్న) గుమ్మంలోకొచ్చాడు. మారయ్య సాయ ఎగాదిగా చూశాడు. “ఎవరబ్బాయివిరా”అనుమానం! “తోలు మల్లయ్య కొడుకుని” మా పాలెంలో మానాన్నని అందరూ అట్టానే పిలుస్తారు. అట్టా పిలవడం నాకు బలే గొప్పగా అనిపిస్తాది. “దాహానికి నీళ్ళు తాగితే తాగావుగానీ, ఆ చెంబు ఇహ ఇంటికి పట్టుకుపో. మళ్ళా మాఅబ్బాయితో తిరగవాక”జగ్గన్ని బుజం పట్టుకుని ఈడ్చుకుపోతా చెప్పాడు. మారయ్యకి చెంబు బలే నచ్చింది. ఉత్తికినే వచ్చింది పైగా. ఇంట్లో వున్న సత్తు సొట్టల చెంబు మాదిరిగాగాకండ ఇది తళ తళగా వుంటం మూలాన మొగంగూడ సూస్కోవచ్చు. “యాడిదిరో చెంబు”పుల్లమ్మ కొడుకునీ చెంబుని వింతగా మార్చి మార్చి చూస్తా అడిగింది. “జగ్గయ్య నాన్న, పెద్ద పంతులిచ్చాడు. ఆడ నీళ్ళు తాగినా. ఎమ్మటే సెంబిచ్చేశారు”గర్వంగా గడ్డమెత్తి చెప్పాడు. “నిన్ను తిట్టి కొట్నారా?”అమ్మకి గాబరా పుట్టింది. “లేదే! ఎందుకూ?”అమ్మ నేను ఆళ్ళకి తెలీకండా చెంబు తెచ్చాననుకుంటందనుకుంటా. “ఏరే వాళ్ళైతే సంపినంత పని జేద్దురు. పెద్ద పంతులు దేవుడే. బిడ్డో, నీళ్ళ కోసరం అట్టా పెద్దోళ్ళ కొంపలమీద పడమాక. కడగొట్టోళ్ళం. ఆళ్ళని కళ్ళతోజూసిందే మనకి గొప్ప. అంతగా దప్పికైతే దోసిట్లో పోబిచ్చుకుని తాగు”అమ్మ జాగర్త చెప్పింది. ఈ రోజుకీ మారయ్య ఆ చెంబుతోనే నీళ్ళు తాగుతాడు. ఆ చెంబు తన పుట్టుకని ఎగతాళి చేసేదని చానాకాలానికి గాని బుర్రకెక్కలేదు. పని తగ్గి కాళీ పెరుగుతున్న రోజుల్లో, పక్కనే వున్న వేరే పాలెం లోకి సున్నం పనికిబోయాడు. దండెం మీద తువ్వాలుకి కడిగిన చేతులు తుడిస్తే ఆ ఇంటి ఆడది నారాయణమ్మ తువ్వాలు ఎత్తకపోమ్మంది! అమ్మ జెప్పిన సంగతి గ్యాపకం వొచ్చింది. తను కడగొట్టు మడుసుల్లో కడగొట్టు. చెర్చి కాడ కంచం పొత్తు సూబెట్టెవోళ్ళు ఇంటికాడ తేడా సూబెట్టేశారు. బడి మానేసి తోలుపనికి జేరేప్పటికి తను చిన్నోడే. మోదట్లో ఆ వాసనకి వాంతి చేసుకున్నాడు. కొన్నాళ్ళకి అలవాటైంది. కానీ పని ఎన్నాళ్ళో సాగలా. “తోలు పని ఇడిసి పెట్టేసేయ్ రా. ఇది ఒంటిని లోపట్నించి తినేస్తాది. పేనం వున్నప్పుడు మెరిసే తోళ్ళు పేనం పోయినాక కరిసేస్తాయి. నా రోగం తోలు నుంచే పుట్టింది”. సచ్చేముందు అయ్య మాట ఇన్న తరవాత తోలంటే బెదురు పుట్టింది. దాన్ని ఇడిసి పెట్టేశాడు. సినిమా హాలు కాడ దుకానవెట్టాడు. జోళ్ళు బాగుజేసేది, తాయారుజేసేది నేరిచాడు. కొత్తగా పని జేసేప్పుడు పనిలో ఒళ్ళు దగ్గిరిండాల! లేపోతే సేతులు సిల్లులే “పిల్లకాయలెట్టున్నారు పంతులా?”మారయ్య ఆరా తీశాడు. జగ్గయ్య మోహంలో కులాసా మాయమై దిగులొచ్చింది. “ఆ ఏముంది మారయ్యా. పూజలు చేసేదానికి పనికి రాని పంతుళ్ళు. ఉజ్జోగాలు సంపాయించలేని మొద్దోళ్ళు. పెద్దోడు హైదరాబాద్ పోయాడు. చిన్నోడు ఇంకా ఏపని చెయ్యాలో తెలుసుకోక తిరగతా వున్నాడు”. “కానీ పంతులా. ఏదో పనికి పోనీ” “మాబోటోళ్ళని మీవోళ్ళు నేలకి తోక్కేసిన పాపం మీరిట్టా అనుబగిస్తన్నరేవో పంతులా”పరచికంగా నవ్వతా అనేశాడు మారయ్య. జగ్గయ్య కూడా నోరారా నవ్వాడు. “ఓ కాలం నాడు మేం గొడ్లు కాసుకుంటా, గొడ్డుమాంసం తింటా బతికామంట. తారవాత రాజుల్నీ, రాజ్యాల్నీ ఏలాం. ఈ రోజు నువ్వు తోలు కోసుకుంటా, గొడ్డుమాంసం తింటా బతకతన్నావు. రేపు నువ్వు రాజ్యం ఏలతావులే’’ పంతులు బరోసా ఇచ్చాడు. “నే రాజ్జానికి వొచ్చేలోగా ఇల్లు గడవాలిగా. మనవడికి వొళ్ళు ఎచ్చబడింది. మందు ఏపిచ్చాలి. రెండొందలిప్పియి పంతులా”మారయ్యకి అవసరం గురుతుకొచ్చింది. పంతులు జాగర్తగా రెండు నోట్లు తీసి మారయ్య చేతిలో పెట్టాడు. మారయ్య ఆటిని బొడ్లో దోపాడు. “ఇంతకీ రాజ్యం చేతికొచ్చాక ఏం జేస్తావు మారయ్యా?”జగ్గయ్య నవ్వతానే అడిగాడు. “నాకైతే ఆటిగురించి ఆలోశన లేదు. రాజ్జాలు ఏలేది ఒకరో ఇద్దరో. తీరా కురిచీలు ఏక్కాక మడుసుల్లో మారుపోచ్చెసుద్ది. నాకు దరమం కావాలి. నా పని గూడా అన్ని పనుల్లోకి సమానం కావాలి. అంటే సూది మందేసే బాబుతో నాకూ సమానంగా డబ్బుఇయ్యాలి. నాకే గాదు…అన్ని పనులకీ అటు ఇటుగా ఒకే రేటువుండాలి. ఇగ అన్ని కూలాలోల్లకి పని దొరకాలి! అప్పుడు ఎక్కువా తక్కువా తేడా ఏడుంటది?” “ఓర్నీ అసాధ్యం గూలా! నువ్వూ సూదిమందిచ్చే డాక్టరూ ఒకటే?”పంతులు నమ్మలేనట్టు మొకం పెట్టి నవ్వాడు. మారయ్య పొగాకు నముల్తా వున్నాడు. జవాబు చెప్పేదానికి తుపుక్కున ఉమ్మేశాడు. ఇంతట్లోకి గందరగోళంగా గోస ఇనపడింది. మందిజేరి రాలి తీశారు. మారయ్య పెద్దకొడుకు కొండయ్య ముందర్నే నడస్తావున్నాడు. ఆడు మందిలో లేపోతే అనుకొవాల. ఉండకుండా ఎట్టా? మరి తన కొడుకు నాయకుడుగాదా! కొండయ్యకి అన్ని కులాల్లో సావాసగాళ్ళున్నారు. ఎవురూ ఆడికి నీళ్ళు తాగిన చెంబిచ్చేసేదానికి, దోసిట్లో నీళ్ళు పోసేదానికి దయిర్నం చెయ్యరు. ఆడు పులిలాటోడు. ఆడికన్ని తెలుసు. కానీ ఇంకా సంపాదన్లోకి రాలేక పోతన్నాడు. కొండయ్య ఊరేగింపు వొదిలి నాన్న కాడికొచ్చాడు. “నువ్వు గూడా రాగూడదా నానా?” “నువ్వు పోరా నాకు దుకానముంది”. “ఎప్పుడూ వుండే దుకానమేగా. ఆడ పారేసి రాగూడదా,” కొడుకు ఆదుర్దా “ఎందుకురా ఈ తంతు ఇయ్యాల?” “ఉజ్జోగాల్లో న్యాయం జరిగేదానికి” “ఎన్ని ఉజ్జోగాలున్నయిరా?” “ఎన్నైనాగానీ, పెద్ద పెద్ద ఉజ్జోగాల్లో మనోళ్ళు పోవాలి” “నే రాలేను. నువ్వు పోరా”మారయ్య ఉన్న చోటునుంచి కదలేదానికి ఇష్టపడలేదు. కొండయ్య కోపంగా చిరాగ్గా చూసి ఎల్లిపోయాడు. రెండో కొడుకు బుద్ది పుట్టినపుడు ఆటోఏస్తాడు. తనకొడుకేంది, తనకి తెలిసిన కమ్మరోల్ల కొడుకులు, కుమ్మరోల్ల కొడుకులు, వొడ్డి పిలకాయలు ఆటోలు తోల్తానే వున్నారు. అంతకి మించి వాళ్ళకేం పని అగపడలా. పంతులు రాలీ చూత్తా గమ్మునున్నాడు. మారయ్య మాట్టాడాడు, “పాత రోజులే నయ్యం పంతలా. జనాలు తక్కువ. పని దండిగా దొరికేది. ఇయ్యాల జనాలెక్కువ. పనులు లేవు. పని వున్నోడికి పనిమీందనే వుంటది. లేనోడికి కోపంగా ఇసుగ్గా వుంటది. పెద్ద పెద్ద కురిచీలెక్కినోళ్ళు ఈ పిల్లోళ్లికి పని సూబిచ్చలేక, ఆళ్ళు రోడ్లట్టుకు తిరగతా ఆక్రూసిస్తా వుంటే నిమ్మళంగా వుంటారు. ఈ పిలకాయల్లో చురుకంతా ఎవురికీ పనికి రాకండా పోతంది. దీన్ని వాడుకోను లోకానికి చాతగావడంలేదు”. పంతులు మళ్ళా ఏంమాట్టాడ లేదు. “ఇహ పోతా మారయ్య”అనేసి ఇంటేపుకి పొయ్యాడు. పంతులు తనని ‘అరే ఓరే’ అనీ బమగా పిలస్తాడు. కానీ తనట్టా పిలవలేడు. మారయ్య చిన్నదో పెద్దదో అని సూడకుండా ఏ పనైనా జేసుకు బతగ్గలడు. కానీ పంతులట్ట బతకలేడు. వాళ్లిద్దరికీ ఒకళ్ళ మీంద ఒకళ్ళకి అబిమానం వుంది గానీ ఒకళ్ళింటికి ఒకళ్ళు పోరు. కొండయ్య మాత్రం ఎవురింటికైనా పోగలడు. పెద్ద పెద్ద సంగతులు మాట్టాడగలడు. కానీ అదేందో మరి ఆడుగూడా సంతోషంగా లేడు! నిట్టురుస్తా పంతులి పని మొదలెట్టబోయిన మారయ్యకి ఇంటికి పోవలసిన తొందర గురుతొచ్చింది. కూతురొచ్చింది. ముగ్గురు బిడ్డల తల్లి. అల్లుడు మరీ తట్టుకోలేనంత దెబ్బలుగొడితే వచ్చేసుద్ది. అల్లుడు అదోరకం. ఆడికి ఎప్పుడు తిక్కరేగినా పెళ్ళాం లోకువగా దొరుకుద్ది. దాన్ని సావ బాత్తాడు. తిక్క రేగడానికిపెద్ద వొంకలు కుడా అవసరంలా. ముద్ద మింగేప్పుడు పొలమారినా సాలు. అమ్మమ్మ గ్యాపకంగా కూతురికి ఎంకటలచ్చిమని పేరెట్టాడు. పెళ్లి తరవాత అల్లుడు దాన్ని ఎలిజిబెతని మారిచాడు. అంతకు ముందు మాతమ్మ గుడి కాడ దన్నవెట్టే కూతురు ఇప్పుడు మరియమ్మ గుడికాడ గూడా మొక్కుతాది. అంతే! పేరుమారినా, కొలిచే దేవుళ్లు మారినా ఆ పిల్లకి పట్టదు. “అన్నీ ఒగటేలే అయ్యా, తిని తీరిగ్గా కూచ్చునే వాడికి తగూలన్ని,” కాచి వడబోసినట్టు చెప్పేసుద్ది. ఐతే రవనకి గానీ తనకి గానీ కొత్త పేరు నోరు తిరగాలా, గానీ బిడ్డ అలవాటు జేసేసుకుంది. అడదిగాద, మొగోడు చెప్పినదానికి అలవాటు పడాల. కడగొట్టోళ్లలోకి కడగొట్టుది ఆడదే! అంగడి కట్టేసాడు. అంటే తాళాలు ఎయ్యడం కాదు. ఉన్న సరంజామా మీద గోతం పట్టాలు కప్పి వచ్చేసాడు. ఎవురి సొత్తు అయినా దోసుకోగలరు. కానీ మాదిగోని సొమ్ము దోసుకోరు. అది దరిద్రపు సొమ్మంటారు. ఏవుందాడ? పాత చెప్పుల సంపద! ఇదే లోకం మాదిగోనికిచ్చిన సొత్తు. ఊరికే ఇస్తా అన్నా ఎవురూ తీసుకోరు! బుడ్డోడికి అయ్యవారమ్మ జరం బిళ్ళ ఇప్పించిందని జెప్పింది రవన. జరం నిమ్మలిచ్చింది. రెండొందలు మిగులు. పెళ్లామిచ్చిన టీ నీళ్ళు తాగి కింద గుడ్దేసుకుని పండుకున్నడు మారయ్య. తలలో ఆలోశన్లు కుమ్మరి పురుగాలే తొలిసేస్తన్నాయి. పంతులికి కూటికి ఇబ్బందే. చెప్పుకోడు. తనకి రేపటి రోజు ఎలా తెల్లారుద్దో తెలీని పరిస్థితి. కొడుక్కి తెలివి వుంది గానీ ఉజ్జోగం లేదు. షబానాకి ఇంక మొగుడు దొరకడు. కూతురికి మొగుడు బారినుండి ఎట్టా బైట పడాలో తెలీదు. ఏదో మందపాటి గోడ అడ్డంబడతంది…ఈ బతుకులకి ఆటి సుకానికీ మద్దెన! గోడలు! ఎదురుగా చూశాడు. తన ఇంటి మట్టి గోడ. ఒక్క దెబ్బకి పడిపోద్ది! కళ్ళు మూసుకున్నాడు. ఎత్తుగా గోడలేవో కనబడతన్నాయి. చాలా బలంగా వున్నాయి. కలగంటన్నాడా? మేలుకునున్నాడా? మారయ్యకే అర్ధం కాలేదు. మళ్ళా కళ్ళు తెరిచాడు. కళ్ళ ముందు ఏడోకలాసుకంటే ఎక్కువ, ఎనిమిదో తొమ్మిదో సదూతున్న ఎలిజిబెత్ కూతురు. “అమ్మీ, ఉక్కు పోసి గట్టి మందపాటి గోడ కట్టారనుకో…దాన్నెట్టా బద్దలు కొట్టేదీ?” అడిగాడు “కింద బాగా వేడి పెట్టు. కరిగిపోద్ది. అయితే వేడి చానా ఎక్కువ పెట్టాలి తాతో”. కాసేపటికి బైయట మబ్బు గమ్మి వాన పడతా వుంది. ఇంటి ఆడది బొగ్గుల కుంపటి రాజేసి పిలకాయల కోసరం మొక్కజొన్న కంకులు కాలస్తంది. కొండయ్య కూడా ఇంటి కాడనే వున్నాడు. అంతా చలికి వనకతా వున్నారు. చేతులు ఎచ్చబెట్టుకోడం కోసరం కుంపటి కాడజేరి చేతులు జాపారు.
Irregular Periods : మహిళలు – క్రమరహిత పీరియడ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏమిటి? మీ ఋతు చక్రం యొక్క పొడవు ఊహించని విధంగా మీ సాధారణ పరిధికి వెలుపల పడిపోవడాన్ని క్రమరహిత పీరియడ్ (Irregular Periods)అంటారు. ఇది సాధారణంగా అసమతుల్య ఈస్ట్రోజెన్ స్థాయిలు మరియు పెల్విక్ ప్రాంతంలో సరికాని రక్త ప్రసరణ కారణంగా జరుగుతుంది. క్రమరహిత పీరియడ్స్‌లో అసాధారణమైన గర్భాశయ రక్తస్రావం ఉండవచ్చు, అవి: Also Read : శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రోజువారీ ఆహారాలు పీరియడ్స్ మధ్య రక్తస్రావం లేదా చుక్కలు కనిపించడం • లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం • మీ పీరియడ్ సమయంలో భారీ రక్తస్రావం • ఋతు రక్తస్రావం సాధారణం కంటే ఎక్కువ కాలం ఉంటుంది • మీరు రుతువిరతి చేరుకున్న తర్వాత రక్తస్రావం క్రమరహిత పీరియడ్స్(Irregular Periods) కోసం మీరు ఏ ఆహారాలు తినాలి? అధిక బరువు పెరగడం హార్మోన్ల అసమతుల్యతకు మరియు ఇన్సులిన్ స్థాయిలకు భంగం కలిగించవచ్చు. ఈ హార్మోన్ల అసమతుల్యత క్రమరహిత పీరియడ్స్‌కు దారి తీస్తుంది. ఊబకాయం అటువంటి సమస్యలకు దారి తీస్తుంది కాబట్టి మన ఆహారాన్ని తెలివిగా ఎంచుకోవడం అవసరం. పార్స్లీలోని మిరిస్టిసిన్ మరియు అపియోల్ వంటి పార్స్లీ సమ్మేళనాలు ఈస్ట్రోజెన్ యొక్క సరైన ఉత్పత్తిలో సహాయపడతాయి, ఇది ఋతు చక్రం నిర్వహణలో సహాయపడుతుంది. బొప్పాయిలోని బొప్పాయి కెరోటిన్ శరీరంలోని ఈస్ట్రోజెన్ స్థాయిలను ఉత్తేజపరుస్తుంది మరియు నియంత్రిస్తుంది. అదనంగా, ఇది ఋతు తిమ్మిరి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. అల్లంలోని జింజర్ మెగ్నీషియం మరియు విటమిన్ సి పీరియడ్స్ సక్రమంగా ఉండేలా చేస్తుంది. దాల్చిన చెక్క ఇది శరీరాన్ని లోపలి నుండి వేడి చేస్తుంది మరియు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఆహారంలో దాల్చిన చెక్కను జోడించడం వల్ల రుచిని మెరుగుపరచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పసుపు బహుళ ప్రయోజనాలను కలిగి ఉన్న పదార్ధం కూడా పీరియడ్స్ యొక్క క్రమబద్ధతను మెరుగుపరుస్తుంది. పైనాపిల్ ఈ పండు ఎరుపు మరియు తెల్ల రక్త కణాలను పెంచుతుందని చెబుతారు. ఇది రక్త ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడంలో మరియు ఋతుస్రావం సమయంలో గర్భాశయంలోని పొరను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. క్యారమ్ విత్తనాలు క్యారమ్ గింజలు యాంటిస్పాస్మోడిక్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి ఋతు క్రమరాహిత్యాల నుండి ఉపశమనం పొందేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా, గర్భాశయాన్ని ఉత్తేజపరచడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. బీట్‌రూట్ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ యొక్క గొప్ప మూలం పీరియడ్స్ సమయంలో ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇది చెదిరిన ఋతు చక్రం నిర్వహించడానికి కూడా కనిపిస్తుంది. కలబంద మన హార్మోన్లను ఉత్తమంగా నిర్వహిస్తుంది మరియు తద్వారా పీరియడ్స్ నియంత్రిస్తుంది. కార్బోనేటేడ్ పానీయాలతో పాటు శుద్ధి చేసిన పిండి మరియు చక్కెరలను నివారించండి. ఈ ఆహారాలు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి, ఇది అటువంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ట్వీట్స్ తరచుగా వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ఈసారి ఆయన జాతిపిత మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. Sambi Reddy First Published Oct 4, 2022, 4:54 PM IST కమెడియన్ రాహుల్ రామకృష్ణ చాలా త్వరగా పరిశ్రమలో ఎదిగారు. సైన్మా అనే ఒక షార్ట్ ఫిల్మ్ తో వెలుగులోకి వచ్చిన రాహుల్ కి అర్జున్ రెడ్డి మూవీ బ్రేక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ పాత్రలో ఆయన ఆకట్టుకున్నారు. స్టార్ కమెడియన్ గా ఎదిగిన రాహుల్ రామకృష్ణ బ్రోచేవారెవరురా, జాతి రత్నాలు చిత్రాల్లో హీరోకి సమానమైన క్యారెక్టర్స్ చేశాడు. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ వివాదాస్పద ట్వీట్స్ వేస్తూ ఉంటాడు. బాల్యంలో తాను లైంగిక వేధింపులు గురయ్యానని ఒకసారి ట్వీట్ చేశారు. మరోసారి సారి సినిమాలు మానేస్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ నెక్స్ట్ డే... ఇంత లగ్జరీ లైఫ్ ఎవడైనా వదులుకుంటాడా? అబద్ధం చెప్పానని మరో ట్వీట్ వేశాడు. ఇలా తిక్క తిక్కగా, వివాదాస్పదంగా ఆయన సోషల్ మీడియా పోస్ట్స్ ఉంటాయి. కాగా అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు జాతిపితను కించపరిచేలా రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో రాహుల్... గాంధీజీ గొప్పవారని నేను అనుకోవడం లేదు' అని కామెంట్ పోస్ట్ చేశారు. ఈ కామెంట్ క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక నెటిజెన్స్ ఓ రేంజ్ లో రాహుల్ పై యుద్ధానికి దిగారు. బండ బూతులతో రెచ్చిపోయారు. గాంధీ జయంతి నాడు మందు దొరకదు కదా.. రాహుల్ కి పిచ్చి లేచి ఇలాంటి ట్వీట్స్ వేస్తున్నాడంటూ కామెంట్స్ చేశారు. ఎందరో పూజించే జాతిపితను జయంతి నాడు కించపరచటం సబబు కాదు. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో రాహుల్ రామకృష్ణ ఆ ట్వీట్ డిలీట్ చేశారు. కెరీర్ చక్కగా సాగుతుండగా రాహుల్ అనవసర వివాదాల్లో తలదూర్చుతున్నాడు. ఇదే కొనసాగితే మనోడి కెరీర్ గోవిందే.
వ్యయాలు తగ్గించుకునేందుకు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలో ఎడ్‌టెక్‌ బిజినెస్‌ను మూసివేస్తున్నట్లు గురువారం నాడు ప్రకటించింది. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను స్కూల్‌ విద్యార్ధుల కోసం ప్రారంభించింది. గత సంవత్సరం అమెజాన్‌ అకాడమీ పేరుతో దీన్ని ప్రారంభించింది. జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కూడా కోచింగ్‌ ఇస్తోంది. 2023 ఆగస్టు నుంచి మూసివేత ప్రారంభం అవుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ విద్యా సంవత్సరంలో ఎన్‌రోల్‌ చేసుకున్న వారికి పూర్తి ఫీజు రిఫండ్‌ చేస్తామని ప్రకటించింది. విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా అమెజాన్‌ అకాడమీ సెంటర్లను దశలవారిగా మూసివేస్తామని తెలిపింది. మన దేశంలో ఎడ్‌టెక్‌ రంగంలో తీవ్ర పోటీ ఉంది. ప్రస్తుతం బైజూస్‌, అన్‌అకాడమీ వంటి సంస్థలు అగ్రస్థానంలో ఉన్నాయి. అమెజాన్‌ అకాడమీ ఈ రంగంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆన్‌లైన్‌లో కోర్సు మెటిరీయల్‌ 2024 అక్టోబర్‌కు అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. కరోనా అదుపులోకి రావడంతో అన్ని విద్యాసంస్థలు నడుస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్‌ విద్యను అందిస్తున్న పలు సంస్థలు అచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న బై జూస్‌ 2,500 మంది ఉద్యోగులను తొలగించింది. అన్‌అకాడమీ, వైట్‌హ్యాట్‌ వంటి సంస్థలు కూడా ఉద్యోగులను తొలగించాయి. - Advertisement - ఉద్యోగులకు ఆఫర్‌ ఇప్పటికే 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిన అమెజాన్‌, 2023లోనూ ఉద్యోగాల తొలగింపు ఉంటుందని తెలిపింది. స్వచ్ఛందంగా రాజీనామా చేసి, వేతన సంబంధిత ప్రయోజనాలు తీసుకుని వెళ్లిపోవాలని కొందరు భారతీయ ఉద్యోగులకు అమెజాన్‌ కోరిందని తెల్సింది. సంస్థనే కాంట్రాక్ట్‌ రద్దు చేసేబదులు, స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరడంతో, చాలా మంది ఉద్యోగులు దీనివైపే మొగ్గు చూపుతున్నారు. దీనికి సానుకూలంగా ఉన్న వారు నవంబర్‌ 30 నాటికి సంతకం చేయాలని అమెజాన్‌ కోరింది. కంపెనీ విధించిన గడువులోగా సంతకాలు చేసిన ఉద్యోగులకు వేతన ప్రయోజనాలు అందిస్తామని తెలిపింది. ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే చట్ట ప్రకారం తొలగింపును సవాల్‌ చేసే అవకాశం ఉండదు. అమెజాన్‌ సంస్థ ఉద్యోగుల తొలగింపుపై కార్మిక శాఖకు ఫిర్యాదులు వెళ్లడంతో కార్మిక శాఖ నోటీస్‌లు జారీ చేసింది. దీనిపై వివరణ అడిగింది. ఇప్పుడు ఈ స్కీమ్‌ పెట్టి, ఉద్యోగులను తొలగించాలని ఆమెజాన్‌ నిర్ణయించింది. తొలగింపు బదులు, రాజీనామా రూట్‌లో ఉద్యోగులను ఇంటికి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది.
thesakshi.com : అత్యంత బలమైన ప్రత్యర్థిని ఢీకొనడం అంత సులువు కాదు అని తేలిపోయింది. ప్రత్యుపకారం చేసినా కూడా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ మళ్లీ మళ్లీ టీడీపీ వైపు చూడాలంటే ఇంకాస్త నమ్మకం కలిగించాలి. లేదా భరోసా ఇప్పించాలి అధినాయకత్వం చేత! ఆ విధంగా అయినా టీడీపీకి పూర్వ వైభవం కాస్త దక్కి నిలబడుతుంది. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర మొదలుకుని చాలా ప్రాంతాలలో టీడీపీ చాలా పెద్ద మాటల యుద్ధమే చేయాల్సి ఉంది. అందుకు తగ్గ సాధన సంపత్తిని పోగేసుకోవాలిక ! అంటే ప్రత్యర్థి తో వీలున్నంత ఎక్కువగా మాట్లాడించగలగాలి. వారి తప్పులను వెలుగులోకి తీసుకువచ్చే వేళ అవి నిరాధారంగా ఉండకూడదు. అదేవిధంగా నాటకీయతకు ఆనవాలు అన్న విధంగా కూడా ఉండకూడదు. అందుకు తగ్గ గణాంకాలు కూడా నమ్మబలికే విధంగానే ఉండాలి. అప్పుడు మాత్రమే టీడీపీని జనం నమ్ముతారు. అధికారంలో ఉన్నప్పుడు నేను తప్పులు చేశాను అని చంద్రబాబు మరో సారి ఒప్పుకునే తరుణం రానే వచ్చింది. వాటిని ప్రస్తావిస్తూనే జగన్ సర్కారు చేస్తున్న లేదా చేయబోతున్న తప్పిదాల సంఖ్యను వివరించగలగాలి. అప్పుడే విజయం టీడీపీకి. ఈ నేపథ్యాన చినబాబు అయిన లోకేశ్ మంగళగిరికి లో ఏనేమన్నారంటే… “మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించాను. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్యకర్త నవీన్ ని పరామర్శించాను. అనంతరం దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో పర్యటించాను. విద్యుత్ కోతలతో పడుతున్న బాధలు ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. అధికార పార్టీ వేధింపులు అక్రమ కేసులతో ఇబ్బంది పడుతున్న ఎంపిటిసిలు గ్రామ సర్పంచ్ ని కలిసి అండగా ఉంటానని హామీ ఇచ్చాను.” ఇదీ చినబాబు అయిన లోకేశ్ సోషల్ మీడియాలో ఇచ్చిన స్టేట్మెంట్… ఇక లోకేశ్ కూడా సొంత నియోజకవర్గం పై మొగ్గు చూపాలి. అదేవిధంగా ఉత్తరాంధ్రతో సహా ఇతర ప్రాంతాలపై ఫోకస్ పెంచాలి.నియోజకవర్గాల వారీగా ప్రత్యర్థిని ఎదుర్కొంటున్న క్రియాశీలక కార్యకర్తలను ఏకం చేయాలి. ఇవే ఇప్పుడు లోకేశ్ ముందున్న లక్ష్యాలు కావాలి. అంతేకాకుండా క్యాడర్ ను నిలబెట్టే విధంగా లీడర్లు తయారు కావాలి. ఇదే నినాదంతో అటు చంద్రబాబు కానీ ఇటు లోకేశ్ కానీ పనిచేస్తే మంచి ఫలితాలు రావడం ఖాయం. Tags: #Andhrapradesh#andhrapradeshpolitics#appolitics#ChandrababuNaidu#lokeshnara#TDP#tdppolitics#TeluguDesamParty
భారత మాజీ బ్యాటింగ్ మాస్ట్రో సచిన్ టెండూల్కర్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ “ఏదో కొత్తది”తో వస్తున్నాడని ప్రశంసలు కురిపించాడు.ప్రపంచవ్యాప్తంగా ద్రోహపూరితమైన పచ్చిక బయళ్లలో నావిగేట్ చేసి, జ్వలించే రంగులతో బయటికి వచ్చిన వ్యక్తి, సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ ఫాబ్రిక్‌లో ఒక కీలకమైన వ్యక్తి ఒకప్పుడు దాదాపు ఒంటరిగా ఆడటం నుండి. దేశం యొక్క ఆటను అలంకరించిన మరుగుతున్న యువ రక్తం యొక్క సన్నిహిత ఆరాధకుడు. అతను పదే పదే, అతను భారత క్రికెట్ నైపుణ్యం యొక్క పెనెంట్ బేరర్‌గా భావించబడే యువకులను హైలైట్ చేశాడు మరియు ఈ మెరుస్తున్న జాబితాలో తాజా చేరిక మరెవరో కాదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ బౌలర్ మహ్మద్ సిరాజ్.అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయమైనప్పటి నుండి యువకుడు బాగా ఆకట్టుకున్నాడు, డౌన్ అండర్ మరియు ఇంగ్లండ్‌లో మెరుస్తున్న బొమ్మలను పోస్ట్ చేయగలిగాడు. భారతదేశం యొక్క స్లో పిచ్‌లలో కూడా, అతను కివీ బ్యాటింగ్ ఆర్డర్‌ను మోకాళ్ల వరకు తీసుకువచ్చినప్పుడు అతను ప్రేరేపించగల తుఫాను యొక్క సంగ్రహావలోకనం ఇచ్చాడు.’బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా’పై బోరియా మజుందార్‌తో ఒక ఇంటర్వ్యూలో, సచిన్ టెండూల్కర్ సిరాజ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. యువకుడి గురించి అడిగినప్పుడు, “అతని కాళ్ళలో వసంతం ఉంది మరియు నేను చూడాలనుకుంటున్నాను. అతని రన్-అప్, మరియు అతను శక్తితో నిండి ఉన్నాడని మీరు చూడవచ్చు. అతను అలాంటి బౌలర్లలో ఒకడు, మీరు అతనిని చూసినప్పుడు, ఇది రోజు మొదటి ఓవర్ లేదా రోజు చివరి ఓవర్ అని మీరు గుర్తించలేరు ఎందుకంటే అతను అన్ని సమయాలలో మీ వద్దకు వస్తున్నాడు మరియు అదే నాకు ఇష్టం.సచిన్ కొనసాగించాడు, “అతను సరైన ఫాస్ట్ బౌలర్ మరియు అతని బాడీ లాంగ్వేజ్ చాలా సానుకూలంగా ఉంటుంది. అతను వేగంగా నేర్చుకునేవాడు. వాస్తవానికి, అతను గత సంవత్సరం ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు, అతను మెల్‌బోర్న్‌లో అరంగేట్రం చేసినందున, అతను తన మొదటి మ్యాచ్ ఆడుతున్నట్లు ఎప్పుడూ కనిపించలేదు. ఈ వ్యక్తి కొంతకాలంగా ఉన్నాడని నాకు అనిపించింది. అది ఆయన చూపిన పరిణితి. అతను అక్కడ తన మంత్రాలను చాలా అందంగా నిర్మించాడు మరియు అక్కడ నుండి అతను వెనక్కి తిరిగి చూడలేదు. నేను చూసిన ప్రతిసారీ, అతను పరిచయం చేసిన కొత్తదనం ఉంటుంది.ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లో కఠినమైన దశల్లో సానుకూల శక్తి సహచరులపై రుద్దుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. Previous post Next post Search for: Latest Headlines December 2, 2022 Indian former cricketer makes a searing remark on KL Rahul December 2, 2022 இந்திய கிரிக்கெட் அணியின் முன்னாள் வீரர் மனிந்தர் சிங், கே.எல்.ராகுல் குறித்து கருத்து தெரிவித்துள்ளார்.
రేపు విజ‌య‌వాడ‌లో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన ఆ రాత‌లు సిరాతో రాస్తున్నారా..? సారాతో రాస్తున్నారా..? ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ఔదార్యం ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఔదార్యం బీసీలంతా త‌లెత్తుకొని తిరిగేలా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న ర‌విశేఖ‌ర్ కుమార్తె వివాహానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ దంప‌తులు హాజ‌రు నిరుపేదల పాలిట ప్రాణదాత మీరిచ్చిన స‌హ‌కారం, మ‌నోధైర్యంతో ముఖ్యమంత్రిగా మీ ముందున్నా.. సీబీఆర్ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ‘జయహో బీసీ మహాసభ’ను విజయవంతం చేయండి You are here హోం » టాప్ స్టోరీస్ » ముస్లిం సోదరసోదరీమణులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్ష‌లు ముస్లిం సోదరసోదరీమణులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్ష‌లు 09 Oct 2022 10:48 AM తాడేప‌ల్లి: మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు ముఖ్యమంత్రి వైయస్ జగ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ``సాటి మనుషుల పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, ప్రపంచ శాంతి మహ్మద్ ప్రవక్త మానవాళికి ఇచ్చిన గొప్ప సందేశాలు. మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు మిలాద్-ఉన్-నబీ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరసోదరీమణులందరికీ శుభాకాంక్షలు. అల్లాహ్ దీవెనలతో అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను`` అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ట్వీట్ చేశారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు చిత్రావ‌తి బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బోటింగ్ - ఫొటో గ్యాల‌రీ చిత్రావ‌తి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ - ఫొటో గ్యాల‌రీ మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
ఆసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ.. నిన్ను చంపేస్తా, నీ అంతు చూస్తా అంటూ మట్కా సుదర్శన్‌ అలియాస్‌ సుదర్శన్‌రెడ్డి (క్రికెట్‌ బుకీ) తనను బెదిరించాడని వైసీపీ కౌన్సిలర్‌ మునీర్‌ టుటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 బంగారుమునిరెడ్డి అండ చూసుకునే బెదిరిస్తున్నాడు సుదర్శన్‌రెడ్డిపై వైసీపీ కౌన్సిలర్‌ మునీర్‌ ఫిర్యాదు ప్రొద్దుటూరు క్రైం, సెప్టెంబరు 24: ఆసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ.. నిన్ను చంపేస్తా, నీ అంతు చూస్తా అంటూ మట్కా సుదర్శన్‌ అలియాస్‌ సుదర్శన్‌రెడ్డి (క్రికెట్‌ బుకీ) తనను బెదిరించాడని వైసీపీ కౌన్సిలర్‌ మునీర్‌ టుటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుదర్శన్‌రెడ్డి ఎమ్మెల్యే బావమరిది బంగారు మునిరెడ్డి అండతోనే బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాది మునీర్‌ వివరాల మేరకు... తాను 19 వార్డు వైసీపీ కౌన్సిలర్‌ నని, శనివారం సాయం త్రం తన ఇంటి వద్ద ఉండగా, 9666312783 నెంబరు నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిందన్నారు. తాను మాట్లాడుతుండగానే, ఫోన్‌ చేసిన సుదర్శన్‌రెడ్డి ఆసభ్యకరమైన పదజాలంతో తిడుతూ నా అక్క గురించి మాట్లాడతావా.. చంపి నీ అంతు చూ స్తానంటూ బెదిరించాడని మునీర్‌ ఆరోపించారు. తాను ఎవరి గురించి ఎక్కడా మాట్లాడలేదన్నాడు. నందం సుబ్బయ్యకు పట్టిన గతే నీకు పడుతుండని బెదిరింపులకు పాల్పడ్డాడని, సదరు సుదర్శన్‌రెడ్డి గతంలో తన స్నేహితుడు దుగ్గిరెడ్డి రఘునాధరెడ్డిని కూడా బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు, తన కుటుంబ సభ్యులకు, తోటి కౌన్సిలర్లకు సుదర్శన్‌రెడ్డి ద్వారా ప్రాణహనీ ఉం దని, సుదర్శన్‌రెడ్డి అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఆయన టుటౌన్‌ సీఐ ఇబ్రహీంకు ఫిర్యాదు ప్రతిని అందించారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫిర్యాది మునీర్‌ వెంట ఎమ్మెల్సీ రమే్‌షయాదవ్‌ సోదరుడు వెంకటప్రసాద్‌, వైసీపీ కౌన్సిలర్లు వంగనూరు మురళీధర్‌రెడ్డి, వైఎస్‌ మహమ్మద్‌ గౌస్‌, కొత్తపల్లె సర్పంచ్‌ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఉన్నారు.
ఈ సిరీస్ మీరు Google Gmail యొక్క ముఖ్యమైన మరియు ఉపయోగకరమైన ఫీచర్‌లు మరియు దాని సరళమైన కానీ స్మార్ట్ ఇంటర్‌ఫేస్‌పై నైపుణ్యం సాధించడంలో సహాయపడటానికి ఉద్దేశించబడింది. ఈ పాఠాలు ముగిసే సమయానికి, మేము మిమ్మల్ని రూకీ నుండి పవర్ యూజర్‌గా తీసుకెళ్తాము. పాఠం 2: మొబైల్ యాప్, కంపోజింగ్ మెయిల్ మరియు సంభాషణలు ఈ పాఠంలో, మేము Gmail యాప్‌ను, ప్రత్యేకంగా Android వెర్షన్‌ను కవర్ చేయడం ద్వారా Gmail ఇంటర్‌ఫేస్‌కు సంబంధించిన మా పర్యటనను కొనసాగిస్తాము. ఆపై మేము సందేశాలను ఎలా కంపోజ్ చేయాలో మరియు Gmail యొక్క ప్రత్యేక సంభాషణ వీక్షణతో మీ సందేశాలను ఎలా సులభంగా అనుసరించవచ్చో చూపడం ద్వారా మేము చివరకు మంచి విషయాలను పొందుతాము. పాఠం 3: ఇన్‌బాక్స్ నిర్వహణ మరియు లేబుల్‌లు నేటి పాఠంలో, మీ ఇన్‌బాక్స్‌ను ఎలా బాగా వర్గీకరించాలో మరియు లేబుల్‌లు మరియు కొన్ని ముందే నిర్వచించబడిన కానీ కాన్ఫిగర్ చేయగల ట్యాబ్‌లతో మీ సందేశాలను ఎలా నిర్వహించాలో అర్థం చేసుకోవడంలో మేము మీకు సహాయం చేయబోతున్నాము. పాఠం 4: మెయిల్ ఫిల్టర్‌లు మరియు స్టార్ సిస్టమ్ నేటి గీక్ స్కూల్ పాఠం ఫిల్టర్‌లను చేర్చడానికి Gmailలోని లేబుల్‌ల గురించి మా చర్చను విస్తృతం చేస్తుంది మరియు ఆపై స్టార్‌లతో ముఖ్యమైన ఇమెయిల్‌లను ట్రాక్ చేస్తుంది. పాఠం 5: జోడింపులు, సంతకాలు మరియు భద్రత ఈ పాఠంలో, మేము అటాచ్‌మెంట్‌లపై దృష్టి కేంద్రీకరిస్తాము మరియు మీరు వ్యక్తిగతీకరించిన సంతకంతో మీ ఇమెయిల్ సందేశాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చు. పాఠం 6: ఆహ్వానాలు మరియు సెలవు ప్రతిస్పందనదారులు మేము తదుపరి ఈవెంట్ ఆహ్వానాల గురించి మాట్లాడబోతున్నాము. Gmailలో Google క్యాలెండర్‌ని ఏకీకృతం చేయడం వలన మీరు Google క్యాలెండర్‌ను యాక్సెస్ చేయకుండా Gmailలోనే ఈవెంట్ ఆహ్వానాలను పంపడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు Gmail సందేశాల నుండి నేరుగా Google క్యాలెండర్‌కు ఈవెంట్‌లను కూడా జోడించవచ్చు. పాఠం 7: Gmailని టాస్క్ లిస్ట్‌గా ఉపయోగించండి నేటి పాఠం కోసం, మేము Gmailని టాస్క్ లిస్ట్‌గా ఎలా ఉపయోగించాలో కవర్ చేయబోతున్నాం. Gmail మీ ఖాతాలో చేయవలసిన పనుల జాబితాను అనుసంధానిస్తుంది. అంశాల జాబితాలను సృష్టించడానికి, గడువు తేదీలను సెట్ చేయడానికి మరియు గమనికలను జోడించడానికి Google టాస్క్‌లు మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు Gmail సందేశాల నుండి నేరుగా టాస్క్‌లను కూడా సృష్టించవచ్చు. పాఠం 8: బహుళ ఖాతాలు, కీబోర్డ్ సత్వరమార్గాలు మరియు రిమోట్ సైన్అవుట్ ఈ హౌ-టు గీక్ స్కూల్ పాఠంలో, మేము బహుళ ఖాతాలను ఎలా ఉపయోగించాలి, మీ Gmail నుండి రిమోట్‌గా సైన్ అవుట్ చేయడం మరియు కీబోర్డ్ షార్ట్‌కట్‌లతో Gmailని ఎలా ఉపయోగించాలో చర్చిస్తాము — ఇది ప్రతి పవర్ యూజర్ తెలుసుకోవలసిన ఫీచర్లలో ఒకటి. పాఠం 9: ఇతర ఖాతాలను యాక్సెస్ చేయడానికి మీ Gmail ఖాతాను ఉపయోగించండి Gmail ఎంత ఉపయోగకరంగా ఉంటుందనే దాని గురించి మేము మీకు చూపించిన తర్వాత, మీరు Gmailలో మీ అన్ని ఇమెయిల్ ఖాతాలను (Hotmail, Outlook, Yahoo మెయిల్, మొదలైనవి) తనిఖీ చేయాలని నిర్ణయించుకోవచ్చు. అదృష్టవశాత్తూ, Gmail ఇమెయిల్ క్లయింట్‌గా పని చేస్తుంది మరియు POP యాక్సెస్‌కు మద్దతు ఇచ్చేంత వరకు ఇతర ఇమెయిల్ ఖాతాల నుండి ఇమెయిల్‌ను పొందడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. పాఠం 10: పవర్ చిట్కాలు మరియు Gmail ల్యాబ్‌లు మేము కొన్ని పవర్ యూజర్ చిట్కాలను కనుగొనడం మరియు Gmail ల్యాబ్స్ ఫీచర్‌లతో విషయాలను మూసివేయడం ద్వారా Gmailలో మా హౌ-టు గీక్ స్కూల్ సిరీస్‌ను ముగించాము. మరిన్ని కథలు మీ హౌ-టు గీక్ RSS ఫీడ్‌లను ఎలా అనుకూలీకరించాలి (మేము విషయాలను మారుస్తున్నాము) మీరు RSS సబ్‌స్క్రైబర్ అయితే, మేము కొన్ని మార్పులు చేస్తున్నామని మీరు త్వరలో గమనించవచ్చు. ఎందుకు? ఇది మా సిస్టమ్‌ను సరళీకృతం చేయడానికి సమయం ఆసన్నమైంది, అదే సమయంలో మీరు ఏ కథనాలను చూడాలనుకుంటున్నారో దానిపై కొంచెం నియంత్రణను అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ నెట్‌వర్కింగ్ Windows 7 eBook యొక్క 10 ఉచిత కాపీలు అందించడానికి మేము పొందాము. మీది పొందండి! గత నెలలో, మేము Microsoft Press, Network Your Computers & Devices ద్వారా మా స్నేహితుడు సిప్రియన్ యొక్క కొత్త పుస్తకాన్ని సమీక్షించాము: దశలవారీగా-మరియు అతను మా పాఠకులకు 10 ఉచిత కాపీలను అందించాలని నిర్ణయించుకునే వరకు మేము అతని చేతిని తిప్పికొట్టాము. MyPaint అనేది డిజిటల్ పెయింటర్‌ల కోసం ఓపెన్ సోర్స్ గ్రాఫిక్స్ యాప్ మీరు మీ కంప్యూటర్‌లో ఒరిజినల్ పెయింటింగ్ మరియు ఆర్ట్‌వర్క్ క్రియేషన్ కోసం ఉపయోగించడానికి అద్భుతమైన గ్రాఫిక్స్ యాప్ కోసం చూస్తున్నారా? ఇది మీ కోసం లేదా పిల్లల కోసం అయినా, MyPaint అనేది ఆ కళాత్మక మూడ్‌లు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా కలిగి ఉండవలసిన యాప్. గీక్ ఎలా చేయాలో అడగండి: నా బ్యాండ్‌విడ్త్ వినియోగాన్ని నేను ఎలా పర్యవేక్షించగలను? ప్రియమైన హౌ-టు గీక్, ఉబుంటు 10.10 మరియు 11.04కు కొత్త యూనిటీ ఇంటర్‌ఫేస్ యొక్క 2D వెర్షన్‌ను జోడించండి మీ కంప్యూటర్ లేదా వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్ ఉబుంటులో యూనిటీ ఇంటర్‌ఫేస్ యొక్క కొత్త 3D వెర్షన్‌ను ప్రదర్శించలేకపోయిందా? ఇప్పుడు మీరు మీ సిస్టమ్‌కి జోడించిన కొంచెం PPA మ్యాజిక్‌తో 2D వెర్షన్‌ను యాక్సెస్ చేయవచ్చు మరియు ఆనందించవచ్చు! MightyMintyBoost ఒక 3-in-1 గాడ్జెట్ ఛార్జర్ మీరు బహుముఖ బ్యాటరీ బూస్టర్ కోసం చూస్తున్నట్లయితే, MightyMintyBoost అని పిలువబడే ఈ DIY 3-in-1 సోలార్/USB/వాల్ కరెంట్ ఛార్జర్ మీ ఫోన్, mp3 ప్లేయర్ మరియు ఇతర గాడ్జెట్‌లలో సులభంగా అగ్రస్థానంలో ఉంటుంది. వాట్సన్ హ్యూమన్ జియోపార్డీ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా జతకట్టాడు జనవరిలో మేము జియోపార్డీ ఛాంపియన్స్ కెన్ జెన్నింగ్స్ మరియు బ్రాడ్ రట్టర్‌తో ప్రాక్టీస్ రౌండ్‌లో వాటన్ వీడియోను మీకు చూపించాము. గత రాత్రి వారు రటర్‌తో టైలో వాట్సన్‌తో జియోపార్డీ యొక్క నిజమైన రౌండ్‌లో స్క్వేర్ చేసారు. SnapBird మీ Twitter శోధనలను సూపర్ఛార్జ్ చేస్తుంది Twitter యొక్క డిఫాల్ట్ శోధన సాధనం కొంచెం రక్తహీనతగా ఉంది. మీరు మీ Twitter శోధనను సూపర్‌ఛార్జ్ చేయాలనుకుంటే, వెబ్ ఆధారిత శోధన సాధనం SnapBirdని ప్రారంభించండి మరియు మీ గత ట్వీట్‌లతో పాటు స్నేహితులు మరియు అనుచరుల ట్వీట్‌లను పరిశీలించండి. డెస్క్‌టాప్ వినోదం: Firefox కోసం వసంతకాలపు వ్యక్తిగత థీమ్‌లు వారాల శీతాకాలపు వాతావరణం మిగిలి ఉన్నందున, బయట చూడటం మరియు చప్పగా, నిర్జీవమైన దృశ్యం తప్ప మరేమీ చూడకుండా ఉండటం కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. మీరు కిటికీలు తెరిచే వరకు, సూర్యుని వెచ్చదనాన్ని ఆస్వాదించే వరకు మరియు మీ ముఖం మీద వసంత గాలిని అనుభవించే వరకు సమయ అంతరాన్ని తగ్గించడంలో సహాయపడటానికి మేము మా వసంతకాలపు వ్యక్తులను అందిస్తున్నాము ఉబుంటు లైనక్స్‌లో మ్యాక్‌బుక్-స్టైల్ ఫింగర్ సంజ్ఞలను ఎలా పొందాలి Apple వినియోగదారులు Mac యొక్క వినియోగదారు ఇంటర్‌ఫేస్‌లను వారి వేళ్ల కంటెంట్‌కు స్వైప్ చేయడం, చిటికెడు చేయడం మరియు తిప్పడం చేస్తున్నారు. నేటి కథనంలో, విండోలను విస్తరించడం మరియు తగ్గించడం మరియు వేలి సంజ్ఞలను ఉపయోగించి డెస్క్‌టాప్‌లను మార్చడం వంటి గ్రూవీ పనులను ఎలా చేయాలో మేము మీకు చూపుతాము.
కడలూరు జిల్లా చిదంబరంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడలూరు జిల్లా చిదంబరం సమీపం చంద్రకిలై గ్రామానికి అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 పెరంబూర్‌(చెన్నై): కడలూరు జిల్లా చిదంబరంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడలూరు జిల్లా చిదంబరం సమీపం చంద్రకిలై గ్రామానికి చెందిన పెరియస్వామి (26) జిల్లా సాయుధ దళంలో పోలీసుగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న 10,11,12 పబ్లిక్‌ పరీక్షల బందోబస్తు విధుల్లో పెరియస్వామి పాల్గొంటున్నాడు. చిదంబరం తిల్లై నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు ఉంచిన గది వద్ద విధులు నిర్వహిస్తుండగా, బుధవారం ఉదయం హఠాత్తుగా తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ శక్తిగణేశ్‌ పరిశీలించి, పెరియస్వామితో కలసి విధులు నిర్వహిస్తున్న రాజ్‌కుమార్‌ను విచారించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పెరియస్వామికి నిశ్చితార్థమై వచ్చే నెల 10వ తేదీ వివాహం జరుగనుందన్నారు. కొద్దిరోజుల క్రితం ప్రమాదానికి గురైన అతడు సెలవుపై ఉంటూ రెండు రోజుల కిత్రం విధుల్లో చేరారని తెలిపారు. అతడి ఆత్మహత్యకు ప్రేమ, వివాహం కారణమని ప్రాథమి విచారణలో తెలిసిందని ఎస్పీ తెలిపారు. దిండుగల్‌లో ఎస్‌ఐ.. దిండుగల్‌ జిల్లా నత్తం సమీపం వత్తిపట్టికి చెందిన జీవరాజ్‌ (45) పళని 14వ బెటాలియన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన అతడు తరచూ భార్యతో గొడవలు పడుతుండడం, విధులకు కూడా మద్యం సేవించి రావడంతో అధికారులు సస్పెండ్‌ చేశారు. మనస్తాపం చెందిన జీవరాజ్‌ ఈ నెల 14న ఇంట్లో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు, బంధువులు అతడిని దిండుగల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్సలు ఫలించక బుధవారం మృతిచెందాడు. ఈ ఘటనపై నత్తం పోలీసులు కేసు నమోదుచేశారు. సిరుముగైలో కానిస్టేబుల్‌.. చెన్నై: తూత్తుకుడి జిల్లా విలాంకురిచ్చికి చెందిన దామోదరన్‌ అనే కానిస్టేబుల్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మేట్టుపాళయం డీఎస్పీ కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న దామోదరన్‌ కుటుంబ సభ్యులతో కలిసి సిరుముగై ప్రాంతంలో నివసిస్తున్నాడు. కొద్ది రోజులుగా అతడు విరక్తిగా గడుపుతుండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం వేకువజామున దామోదరన్‌ తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దామో దరన్‌కు ప్రియ అనే భార్య, ప్రేమిత అనే కుమార్తె, కార్తీక్‌ అనే కుమారుడు ఉన్నారు. పనిభారం ఎక్కువైనందువల్ల దామోదరన్‌ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. సిరుముగై పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
‘అగ్నిపథ్’ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌పై తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి మాజీ ఆర్మీమాన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిరసనకారులు అనేక రైళ్లకు నిప్పంటించిన హింసకు ఆవుల సుబ్బా రావు ప్రధాన సూత్రధారి అని ఆరోపించబడింది, గుంపును చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు మరణించారని అధికారులు తెలిపారు. గుంపును సమీకరించేందుకు వాట్సాప్ గ్రూపులను సృష్టించి, సికింద్రాబాద్‌లో కాల్పులు, విధ్వంసంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. Mr రావు ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందినవారు మరియు గత కొన్ని సంవత్సరాలుగా నర్సరావుపేట, హైదరాబాద్ మరియు కనీసం ఏడు ఇతర ప్రాంతాలలో శాఖలను కలిగి ఉన్న ఆర్మీ ఔత్సాహికుల కోసం శిక్షణా అకాడమీని నడుపుతున్నారు. శనివారం అతడిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్‌లోని అనేక ప్యాసింజర్ రైళ్లపై వేలాది మంది ప్రదర్శనకారులు దాడి చేయడం, కోచ్‌లను తగలబెట్టడం మరియు ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడంతో శుక్రవారం నాడు వరంగల్‌కు చెందిన 19 ఏళ్ల రాజేష్ మరణించగా, డజనుకు పైగా గాయపడ్డారు. ఆదోని, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ఆమదాలవలస, విశాఖపట్నం, యలమంచిలి తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు సంవత్సరాల స్వల్పకాలిక కాంట్రాక్టు ప్రాతిపదికన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో సైనికుల నియామకం కోసం ప్రభుత్వం మంగళవారం ‘అగ్నిపత్’ పథకాన్ని ఆవిష్కరించిన తర్వాత అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగాయి. ఈ పథకం కింద, 17.5 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు నాలుగు సంవత్సరాల పదవీకాలానికి సేవల్లోకి చేర్చబడతారు. ఈ కాలంలో, వారికి నెలవారీ జీతం రూ. 30,000-40,000 మరియు అలవెన్సులు, తర్వాత గ్రాట్యుటీ మరియు పెన్షన్ ప్రయోజనాలు లేకుండా చాలా మందికి నిర్బంధ పదవీ విరమణ ఉంటుంది.
హీరో మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ల కలయికలో వచ్చిన లేటెస్ట్ కామెడీ మూవీ 'జిన్నా'. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల చేశారు. అయితే ఈ సినిమాకి డీసెంట్... Itlu Maredumilli Prajaneekam Review : “అల్లరి నరేష్” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.! kavitha November 25, 2022 11:41 AM చిత్రం : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నటీనటులు : అల్లరి నరేష్ ,ఆనంది, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, రఘుబాబు, ప్రవీణ్, నిర్మాత : రాజేష్ దండా దర్శకత్వం... Recent Posts “ఇంక మాకు ఇండియా టీమ్ మీద ఆశలు ఏం లేవు” అంటూ… బంగ్లాదేశ్ తో భారత్ రెండో ODI కూడా ఓడిపోవడంపై 15 ట్రోల్స్.! “పోలో టీం” నుండి… లక్షల విలువ చేసే “వాచ్” వరకు… మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్” దగ్గర ఉన్న 9 ఖరీదైన వస్తువులు..!
ఆయన విలక్షణ నటుడు.. డెస్టిని కూడా ఆయన జీవితాన్ని విలక్షణంగానే ట్రీట్ చేసింది.. ఒక విలక్షణమైన వ్యాధితో ఆ కళాకారుడి జీవితానికి అర్దాంతరంగా తెరవేసింది. ఇర్ఫాన్ ఖాన్ నటుడిగా తన జర్నీ తక్కువ కాలం అయినా కూడా చిత్ర పరిశ్రమలో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు..అదే సమయంలో సామాజిక విషయాల్లోనూ తప్పుని తప్పుగా చెప్పగలిగే గట్స్ ని ప్రదర్శించి నటన పరంగానే కాదు, వ్యక్తిత్వ పరంగాను అభిమానులను సొంతం చేసుకున్నారు .ఇర్ఫాన్ ఖాన్ ను బలిగొన్న అరుదైన న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.ఎప్పుడూ విన్నట్టుగా లేదు కదా.. చర్మకణజాలల్లో విస్తరించి అంతర్గతంగా శరీర భాగాలకు సోకే అరుదైన క్యాన్సర్ ఎండోక్రైన్ క్యాన్సర్..దీనికి సంబంధించి కేసులు తక్కువే, అధ్యయనం తక్కువే. Video Advertisement న్యూరోఎండోక్రిన్ కణితులు (NET’s) శరీరంలో ఎక్కడైనా ఏ భాగానికైనా విస్తరించవచ్చు.ముఖ్యంగా ఊపిరితిత్తులు, క్లోమం, పేగులు మరియు పురీషనాళంలో ఈ కణుతులు ఎక్కువగా కనిపించవచ్చు. ఈ కణితులను శరీరంలో ఏ భాగంలో ఉన్నాయో వాటి వర్గీకరణ ఆధారంగా గుర్తించవచ్చు. వీటిల్లో కొన్ని రకాల క్యాన్సర్స్ శరీరంలోని హార్మోనల్ ఇంబాలెన్స్ కి కారణమవుతాయి..కొన్నిసార్లు ఇవి శరీరంలో ఉన్నప్పటికి ఎటువంటి లక్షణాలు కనపడవు, అలాంటి సమయంలో వీటిని గుర్తించడం కష్టమవుతోంది..చాలా వరకు న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ కణితులను గుర్తించలేకపోవడానికి కారణం ఇదే.. ఏదైనా పొరపాటున లేదంటే ఇతరత్రా అనారోగ్య లక్షణాల రీత్యా వీటిని ముందుగా గుర్తిస్తే తప్ప, లేదంటే చివరి స్టేజ్ వరకు వీటిని గుర్తించడం కష్టం..అందుకే దీనిలో మరణాలు ఎక్కువే. వారసత్వపరంగా న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది..60 ఏళ్లు పైబడిన వారిలో NET లు ఎక్కువగా కనిపిస్తాయి. జీర్ణశయాంతర ప్రేగులను ప్రభావితం చేసే వ్యాధులు ఉన్నవారికి ఈ క్యాన్సర్ నుండి ఎక్కువ ప్రమాదం ఉంది.డయేరియా, చర్మంపై దద్దుర్లు, అలసట మరియు హై బిపి ఇతరత్రా లక్షణాలు ఎక్కువగా ఈ క్యాన్సర్ ఉన్నవారిలో కనిపిస్తుంటాయి..ఈ లక్షణాలు ఉన్నవారు డాక్టర్ని సంప్రదించి బయాప్సి చేయించుకుంటే ఎటువంటి ట్యూమర్ లక్షణాలు కనపడిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రమాదం బారినుండి బయటపడవచ్చు.. RIP Irrfan Khan – Source : Cultnuts ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది బాధపడుతున్నది, మరణాల సంఖ్య నమోదవుతున్నది క్యాన్సర్ కారణంగానే.. చర్మ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ , బ్లడ్ క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్లతో మరణాలు సంభవిస్తున్నాయి.నిజానికి ప్రతి ఒక్కరి శరీరంలో క్యాన్సర్ కణాలు అనేవి ఉంటాయి. వాటితో ఫైట్ చేసే కణాలు కూడా మన శరీరంలోనే ఉండడం మూలంగా ఎప్పటికప్పుడు వాటి నుండి మనకి ముప్పు తప్పుతూ ఉంటుంది..కొన్ని సంధర్బాల్లోనే ఇవి ప్రమాదకరమైన కణితులుగా మారతాయి…ఈ క్యాన్సర్ అనేది మొదట్లో గుర్తిస్తే చికిత్సతో నయం అవుతుంది. కాని చాలా కేసులలో దీన్ని ఫస్ట్ స్టేజ్లోనే గుర్తించలేకపోవడం వలన మరణాల శాతం ఎక్కువవుతున్నది. సోనాలిబింద్రేకి క్యాన్సర్ అనే వార్త రాగానే ఎక్కువ మంది శరీరానికి సంబంధించిన పూర్తిస్థాయి చెకప్స్, టెస్ట్ చేయించుకున్నారనేది నిజం..నిజానికి ముఫ్పై ఏళ్ల పై బడిన వారు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి శుభ్రత పాటించడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం,ఆల్కహాల్,సిగరెట్ వాటికి దూరంగా ఉండడంలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం.
తెలుగు సినీ అభిమానులకు నవదీప్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ తేజ చేతుల మీదుగా 'జై' సినిమాతో హీరోగా లాంచ్ చేయబడిన నవదీప్.. 18 ఏళ్లుగా ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. కెరీర్ ప్రారంభంలో హీరోగా సినిమాలు చేసిన నవదీప్.. ఆ తర్వాత విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హోస్ట్ గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. 'గౌతమ్ SSC' 'చందమామ' 'ఆర్య 2' 'బాద్ షా' 'ధృవ' నేనే రాజు నేనే మంత్రి' 'అల వైకుంఠపురములో' 'మోసగాళ్లు' వంటి సినిమాలు నటుడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. వెండితెరపైనే కాకుండా ఓటీటీలోనూ సత్తా చాటుతూ బిజీగా గడుపుతున్నారు. అయితే నవదీప్ చాలా గ్యాప్ తర్వాత హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ తాజాగా వచ్చింది. నేడు నవదీప్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు ''లవ్ మౌళి'' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు ప్రకటించారు. టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ట్విట్టర్ వేదికగా ''లవ్ మౌళి'' టైటిల్ మోషన్ పోస్టర్ ఆవిష్కరించారు. "బాయ్స్ అండ్ గర్ల్స్.. బోల్డ్ డీప్ కలర్ ఫుల్ మౌలీని పరిచయం చేస్తున్నాము. పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ నవదీప్ 2.0. స్క్రీన్ మీద ఈ మాడ్ నెస్ ని అన్వేషించడానికి వేచి ఉండలేను" అని రానా పేర్కొన్నారు. నవదీప్ 2.0 ని పరిచయం చేస్తున్న ''లవ్ మౌళి'' టైటిల్ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. నవదీప్ ఇందులో సరికొత్త గెటప్ లో ఇంతకుముందు ఎన్నడూ కనిపించని అవతార్ లో ఉన్నాడు. దీనికి గోవింద్ వసంత అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పంఖురి గిద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. నైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మరి హీరోగా నవదీప్ కు ''లవ్ మౌళి'' సినిమా సరైన బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. Tupaki TAGS: HappyBirthdayNavdeep Navdeep LoveMouli Love Mouli Title Avaneendra Govind Vasantha Navdeep Movies
కమల హ్యారిస్ పేరు ఇప్పుడు మారుమ్రోగి పోతోంది. ఈమె నిజంగా కొద్ది రోజుల్లోనే బాగా పాపులర్ అయిపొయింది. అందులోను ఈమె కి భారత దేశం లో మూలాలు ఉండడం తో ఈమె సెన్సేషనల్ గా మారింది. మరి హ్యారిస్ గురించి, హ్యారిస్ కి భారత్ లో ఉన్న మూలాలు గురించి, ఆమె బాల్యం మరియు విద్యాభ్యాసం వంటి ఎన్నో వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇంక ఆలస్యంగా ఎందుకు ఇప్పుడే చూడండి.... ఇటీవలే అమెరికా లో ఎన్నికలు అయిన సంగతి తెలిసినదే. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ అధ్యక్షుడిగా నిలిచాడు. కమల హ్యారిస్ఉ పాధ్యక్షుడుగా ఎన్నిక అవ్వడం జరిగింది. అయితే అధ్యక్షుడు గురించి కంటే కూడా ఉపాధ్యక్షురాలిగా ఎంపికైన కమల హ్యారిస్ మీద చర్చ ఇప్పుడు జోరుగా కొన సాగుతోంది. మన భారత దేశంలో ఈమె కోసం ఇంతగా చర్చించుకోవడానికి కేవలం ఒకే ఒక కారణం...! అది ఏమిటంటే..? ఆమె కి భారతీయ మూలాలు ఉండడమే. కమల హ్యారిస్ కి భారత దేశం లో మూలాలు: కమల హ్యారిస్ కి భారత దేశంలో మూలాలు ఉన్నాయి. వీటి వివరాల లోకి వెళితే... కమల హ్యారిస్ తల్లి తమిళనాడు రాష్ట్రం లో జన్మించారు. అందుకే కమల హ్యారిస్ విజయం సాధించడం తో భారత్ లో సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ఈమె అంత గొప్ప ఘనత సృష్టించింది మరి. ఇది ఇలా ఉండగా కమల హ్యారిస్ తల్లి శ్యామల గురించి పూర్తిగా ఇప్పుడే చూసేయండి..... కమల హ్యారిస్ తల్లి శ్యామల గోపాలం భారత్ నుండి యునైటెడ్ స్టేట్స్ కి వెళ్లడం జరిగింది. ఈమె మద్రాసు లో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ లో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లో డాక్టరేట్ అందుకున్నారు. 1958 వ సంవత్సరంలో కమల హ్యారిస్ తల్లి యుఎస్ కి చేరుకున్నారు. అప్పట్లో తన తల్లి భారత దేశం లో ఉన్న కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రాసేది. ఉత్తరాలు అక్కడ నుండి ఇక్కడికి రావడానికి రెండు వారాల వరకూ పట్టేది. పీహెచ్డీ అయిపోయిన తర్వాత ఈమె UC Berkeley లో స్థిరపడి రొమ్ము క్యాన్సర్ మీద రీసెర్చ్ చేసేవారు. అందులో ఆమె విజయం సాధించారు. ఇది నిజంగా గొప్ప విషయం కదా...? అది అయ్యాక ప్రపంచం లో అనేక విశ్వవిద్యాలయాల్లో ఆమె టీచింగ్ అండ్ రీసెర్చ్ కూడా మొదలుపెట్టారు. Illinois and the University of Wisconsin లో కూడా ఈమె పని చేయడం జరిగింది. 1960 వ దశకం లో, గోపాలన్ తన భర్త మరియు ఆమె పిల్లల తండ్రి అయిన వ్యక్తిని కలవడం జరిగింది. ఇద్దరూ (జమైకా నుండి హారిస్) యుసి బర్కిలీ లో డాక్టరేట్లు పొందారు మరియు పౌర హక్కుల ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నారు. అయితే వారు నిరసనలో సమావేశమయ్యారు. ఈ జంట 1963 లో వివాహం చేసుకుంది మరియు ఉద్యమం లో పాలుపంచుకుంది, అప్పుడప్పుడు వారి కుమార్తెలను కూడా తీసుకుని వచ్చేవారు. ఇది ఇలా ఉండగా తన తల్లి మాత్రం ఎంతో మంది విద్యార్థులకి విద్య నేర్పించేవారు. కమల హ్యారిస్ కి 12 సంవత్సరాల వయసప్పుడు కెనెడా తీసుకొచ్చేసింది. కమల హ్యారిస్ తల్లి కి 1963 లో వివాహం జరిగింది. ఆ తరువాత 1970లో వీరి ఇద్దరికి విడాకులు అవ్వడం తో విడిపోవడం కూడా జరిగింది. అప్పుడు కమలా హ్యారిస్ వయసు కేవలం 7 సంవత్సరాలు. ఈమె తల్లి మాత్రం రేషియల్ క్వాలిటీ మీద ఫైట్ చేస్తూ ఉండేది. కమల హ్యారిస్ 2019లో ఒక ఆటోబయోగ్రఫీ రచించడం జరిగింది. దానిలో ఆమె నా తల్లి ఇంటి పనులు చేస్తూ పొలిటికల్ యాక్టివేషన్ అండ్ లీడర్షిప్ మీద ప్రధానంగా పని చేసేవారు అని ఆమె చెప్పింది. మా తల్లి కూతుర్ల మధ్య ప్రేమానురాగాలు ఎక్కువ అని హ్యారిస్ చెప్పారు. కష్టాలని ఎలా ఎదుర్కోవాలో మా అమ్మ నాకు నేర్పించారు అని హ్యారిస్ చెప్పడం జరిగింది. కానీ 2009 లో హ్యారిస్ తల్లి కి పెద్దప్రేగు కాన్సర్ రావడం తో ఆమె మరణించింది. ఇతరులకు సేవ చేస్తేనే జీవితానికి అర్థాన్ని ఇస్తుందని నా తల్లి నాకు నేర్పింది అని ఆమె అంది. ఈ రాత్రి ఆమె ఇక్కడే ఉండాలని నేను కోరుకుంటున్నాను, కాని ఆమె పై నుండి నన్ను చూస్తుందని నాకు తెలుసు అని ఆమె మాట్లాడారు. కాలిఫోర్నియా లోని ఓక్లాండ్ ‌లోని కైజర్ హాస్పిటల్‌లో నాకు జన్మనిచ్చిన 25 ఏళ్ల భారతీయ మహిళ, ఐదు అడుగుల పొడవు..... ఆమె కోసమే ఆలోచిస్తూన్నాను అని అన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉపాధ్యక్షుడిగా నామినేషన్ ని నేను అంగీకరిస్తున్నాను అని ముగించారు.
లాక్ చేయబడిన BOLT ఓరియన్ మోడెమ్ ఉందా? ఇక్కడ JalanTikus బోల్ట్ ఓరియన్ movimax mv1 మోడెమ్‌ను అన్‌లాక్ చేయడానికి సులభమైన మార్గాన్ని కలిగి ఉంది. బోల్ట్! Movi Max MV1 లేదా బోల్ట్ ఓరియన్ అనేది PT ఇంటర్నక్స్ ద్వారా జారీ చేయబడిన ఒక రకమైన WiFi మోడెమ్. దాని ప్రారంభం ప్రారంభంలో, బోల్ట్! ఓరియన్ ఉందిఅన్‌లాక్ చేయండి ప్రారంభం నుండి. అయితే, అనుభవిస్తున్నప్పుడు సాఫ్ట్‌వేర్ నవీకరణలు చాలా సార్లు, బోల్ట్! అది తిరిగి వచ్చిందితాళం వేయండి బోల్ట్ కాకుండా ఇతర కార్డులతో అలియాస్ ఉపయోగించబడదు!. Huawei E5372s BOLT 4G మోడెమ్‌ని ఎలా అన్‌లాక్ చేయాలి BOLT 4G ZTE MF90 మోడెమ్‌ని అన్‌లాక్ చేయడం ఎలా బోల్ట్ ఓరియన్ MoviMax MV1 మోడెమ్‌ని అన్‌లాక్ చేయండి ఇప్పటికీ బోల్ట్‌ని ఉపయోగించగలిగేలా! మరొక SIM కార్డ్‌తో ఓరియన్, ఈ కథనంలో JalanTikus ఎలా చేయాలో మీకు సహాయం చేస్తుంది అన్‌లాక్ చేయండి బోల్ట్ వైఫై మోడెమ్! ఓరియన్ Movi Max mv1 సులభంగా. బోల్ట్ ఓరియన్ MoviMax MV1ని ఎలా అన్‌లాక్ చేయాలి డౌన్‌లోడ్ చేయండి ఫర్మ్వేర్ MoviMax MV1 బోల్ట్ V016ని అన్‌లాక్ చేయండి. డౌన్‌లోడ్‌ను ముందుగా డెస్క్‌టాప్‌లో ఉంచండి, కనుక సులభంగా కనుగొనవచ్చు. యాప్స్ డెవలపర్ టూల్స్ PT ఇంటర్‌నక్స్ డౌన్‌లోడ్ బోల్ట్‌ని ఆన్ చేయండి! ఓరియన్ తర్వాత బోల్ట్‌ను కనెక్ట్ చేయండి! డేటా కేబుల్ ఉపయోగించి మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌కు. కనెక్ట్ అయిన తర్వాత, కంప్యూటర్ స్వయంచాలకంగా బోల్ట్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది! ఓరియన్. మీరు బోల్ట్‌ను ఇన్‌స్టాల్ చేస్తే! ఓరియన్ స్వయంచాలకంగా విఫలమవుతుంది, మీరు వెళ్లడం ద్వారా డ్రైవర్‌ను మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేయవచ్చు CD డ్రైవ్ BOLT! 4G MV1 వెతకండి AUTORUN.INF >కుడి క్లిక్ చేయండి >ఇన్‌స్టాల్ చేయండి. డ్రైవర్ ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, WebGUI BOLTని నమోదు చేయండి! 192.168.1.1. అడ్మిన్ పాస్‌వర్డ్ బోల్ట్‌ని నమోదు చేయండి! మీ ఓరియన్, పాస్వర్డ్ "అడ్మిన్" (మీరు అడ్మిన్ పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ మార్చకపోతే పాస్‌వర్డ్). ఇది ఇప్పటికే ఉంటే ప్రవేశించండి, మెనుకి వెళ్లండి సెట్టింగ్‌లు >సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లు. మెనుని క్లిక్ చేయండి బ్రౌజర్‌లు... ఆపై ఫైల్‌ల కోసం శోధించండి కొడుకు మీరు ఇంతకు ముందు డౌన్‌లోడ్ చేసినవి. ఫైల్ కనుగొనబడినప్పుడు, బటన్‌ను క్లిక్ చేయండి అప్‌గ్రేడ్‌లు మోడెమ్ బోల్ట్ వరకు వేచి ఉండండి! ఓరియన్ పూర్తయింది-అప్గ్రేడ్. NB: బోల్ట్‌ను అన్‌ప్లగ్ చేయవద్దు! ప్రాసెసింగ్ సమయంలో కంప్యూటర్ నుండి అప్గ్రేడ్ బోల్ట్! జరిగేటట్లు. తర్వాత అప్గ్రేడ్ స్వయంచాలకంగా పూర్తయింది BOLT ఓరియన్ MoviMax MV1 మీరు విజయం సాధించారుఅన్‌లాక్ చేయండి. మీరు ఖచ్చితంగా నిర్ధారించుకోవడానికి BOLT కాకుండా వేరే కార్డ్‌ని చొప్పించడానికి ప్రయత్నించవచ్చు. ఇక్కడ బోల్ట్ ఉదాహరణ! ఓరియన్ MoviMax MV1 అన్‌లాక్. అది సులభమైన మార్గం అన్‌లాక్ చేయండి బోల్ట్ మోడెమ్! WiFi Movi Max MV1. ఇబ్బందులు ఉంటే, మర్చిపోవద్దు వాటా వ్యాఖ్యల కాలమ్‌లో.
తనపై మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీ. వివేక్ వెంకటస్వామి తీవ్రంగా ఖండించారు. తమపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజం కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్ కోకాపేటలో తమ కంపెనీ కోసం ల్యాండ్ కొనుగోలు చేస్తే .. హవాలా లావాదేవీలు జరిగాయాంటూ కేటీఆర్ తప్పుడు ప్రకటన చేశారంటూ మండిపడ్డారు. కంపెనీ కోసం తాము భూమి కొనడం తప్పా..? అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తాను డబ్బులు ఇచ్చానని కేటీఆర్ ఆరోపించడాన్ని తప్పుపట్టారు. జమునా హచరీస్ పైనా కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ నుంచి తనకు రెండున్నర కోట్లు వచ్చాయని కేటీఆర్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర పోలీసులతోనూ విచారణ చేయించుకోవచ్చని టీఆర్ఎస్ ప్రభుత్వానికి వివేక్ వెంకటస్వామి సవాల్ విసిరారు. ఫస్ర్టేషన్ లో కేటీఆర్ తమపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్ అన్నారు. ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిదే విజయం మునుగోడు ఉప ఎన్నికలో నైతిక విజయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిదే అని జీ.వివేక్ వెంకటస్వామి అన్నారు. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల, పోలీసుల సహకారంతో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. పోలింగ్ రోజు కూడా ఇతర నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మునుగోడులోనే తిష్టవేసి, విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బులు పంచిపెట్టారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపును కేటీఆర్ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రలోభాలతోనే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులను తమకు ఇష్టం వచ్చినట్లు టీఆర్ఎస్ నాయకులు వాడుకున్నారని చెప్పారు. కమ్యూనిస్టుల ఓట్లు, పోలీసుల సపోర్టు లేకపోతే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచేది కాదన్నారు. బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు తమ పార్టీ నాయకులు ప్రచారం చేసుకోనివ్వకుండా బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలందరూ మునుగోడులోనే తిష్టవేసి, క్యాంపెయిన్ చేశారని చెప్పారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని మండిపడ్డారు. ఉపఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే టీఆర్ఎస్ మనుగడ లేకుండాపోతుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ చేయలేదని, ఒకవేళ సీఎంగా కేటీఆర్ ను చేసి ఉంటే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోందని వివేక్ వెంకటస్వామి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 65 నుంచి 70 సీట్లను బీజేపీ గెలిచే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. గత ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ నాయకులు సొంత ఆస్తులను మాత్రమే పెంచుకున్నారని చెప్పారు. కేసీఆర్ పరిపాలనలో సాగిన అవినీతి, అక్రమాలను త్వరలోనే తాము బయటపెడుతామని చెప్పారు. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎసీ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ గ్రాఫ్ మరింత పెరుగుతోందని చెప్పారు. తనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పటాన్ చెరులో ఉన్న తమ ఫ్యాక్టరీని మూసివేయించారని చెప్పారు. బీజేపీ అంటే భయంతోనే కేసీఆర్, కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు తమపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ రాత్రి షోటైమ్‌లో ప్రత్యేకంగా వక్రీకృత మరియు అత్యంత వినోదాత్మక కార్యక్రమం సిగ్గులేనిది సరికొత్త ఆదివారం ఫిబ్రవరి 15, సీజన్ 5 ఎపిసోడ్ 6 అని పిలవబడుతుంది పిచ్చి ప్రేమ మరియు మేము మీ వీక్లీ రీక్యాప్ క్రింద ఉన్నాము. ఈ రాత్రి ఎపిసోడ్‌లో, ఫియోనా [ఎమ్మీ రోసమ్]జిమ్మీ తిరిగి రావడంతో గందరగోళంలోకి నెట్టబడింది. ఇయాన్ [కామెరాన్ మోనాఘన్]మిక్కీని తీసుకుంటాడు [నోయెల్ ఫిషర్]శిశువు. చివరి ఎపిసోడ్‌లో ఫ్రాంక్ తన ఆరు అంకెల బీమా సెటిల్‌మెంట్‌తో ఏమి చేశాడో తెలుసుకోవడానికి ఒక పురాణ బెండర్ తర్వాత తన దశలను తిరిగి పొందడానికి ప్రయత్నించాడు; తాను ఫియోనాతో ప్రేమలో పడినట్లు గుస్ ఒప్పుకున్నాడు; లిప్ మయామిలోని అమండాను సందర్శించింది; డ్రగ్ డీలర్‌గా కార్ల్ కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించాడు; డెబ్బీ కొత్త క్రష్‌ను అభివృద్ధి చేశాడు; డెబీ డెరెక్ బాక్సింగ్ జిమ్‌లో శిక్షణ ప్రారంభించాడు; అమ్మాయిలను సిట్టర్‌తో విడిచిపెట్టడానికి ఇష్టపడనందున కెవ్ తేదీని పేల్చాడు. మీరు గత వారం ఎపిసోడ్ చూసారా? మీరు తప్పిపోయినట్లయితే, మాకు పూర్తి మరియు వివరణాత్మక రీక్యాప్ ఉంది మీ కోసం ఇక్కడే . షోటైమ్ సారాంశం ప్రకారం ఈ రాత్రి ఎపిసోడ్‌లో, జిమ్మీ తిరిగి వచ్చి కనికరం లేకుండా ఆమెను వెంబడించినప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న ఫియోనా నమ్మకంగా ఉండటానికి కష్టపడుతోంది; ఇయాన్ మిక్కీ మరియు స్వెత్లానా బిడ్డను దొంగిలించాడు; సమ్మి గల్లాఘర్ ఇంటిని స్వాధీనం చేసుకుంది మరియు కఠినమైన కర్ఫ్యూలను అమలు చేస్తుంది; డెబ్బీ ఉన్నత పాఠశాలను ప్రారంభించాడు; కెవ్ నుండి విడిపోవాలనే తన నిర్ణయంతో వెరోనికా పట్టుకుంది. టునైట్ సిగ్గులేని సీజన్ 5 ఎపిసోడ్ 6 చాలా బాగుంది, మరియు మీరు దాన్ని మిస్ అవ్వకూడదు. కాబట్టి సిగ్గులేని మా ప్రత్యక్ష ప్రసారం కోసం ట్యూన్ చేయండి - ఈ రాత్రి 9 PM EST కి! మీరు మా రీక్యాప్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, వ్యాఖ్యలను నొక్కండి మరియు సిగ్గులేని కొత్త సీజన్ గురించి మీరు ఎంత సంతోషిస్తున్నారో మాకు తెలియజేయండి? టునైట్ ఎపిసోడ్ ఇప్పుడు ప్రారంభమవుతుంది - అత్యంత తాజా అప్‌డేట్‌లను పొందడానికి తరచుగా పేజీని రిఫ్రెష్ చేయండి! ఫియోనా స్టీవ్ ముఖంపై కొట్టి, అతన్ని మదర్ *** ఎర్ అని పిలుస్తుంది, ఆపై అతన్ని తన్ని అతడిని చెంపదెబ్బ కొట్టింది. అతను ఆమెకు ఏదో చెప్పాడు మరియు అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తుంది. అతను ఒక సంవత్సరం పాటు పడవలో ప్రయాణించలేదని చెప్పాడు. అతను ఇంజిన్ రూమ్‌లోని పైపుకు చేతులెత్తేశాడని మరియు కప్పులో పిస్ చేస్తున్నాడని చెప్పాడు. అప్పుడు అతను బ్రెజిల్‌లో బానిస కార్మికుడని చెప్పాడు. తనకు మలేరియా కూడా వచ్చిందని చెప్పారు. ఫెడరల్స్ దాడి చేసినప్పుడు అతను తప్పించుకున్నాడని అతను చెప్పాడు. ఆ మహిళ ఎవరు అని ఆమె అడిగింది మరియు అతను నేరాలలో తన భాగస్వామి అని చెప్పాడు. ఆమె ఎందుకు పెళ్లి చేసుకుందని అతను అడిగాడు మరియు ఆమె తన సెప్టంను ఫిరాయించిందని చెప్పాడు. ఆమె తన వద్ద కత్తి లేకపోవడం అదృష్టమని ఆమె చెప్పింది. ఫియోనా చెప్పారు - మీరు అదృశ్యమయ్యారు. అతను ఇప్పుడు ఏమి అడిగాడు మరియు ఆమె పెళ్లి చేసుకుందని ఆమె చెప్పింది. అతను దశలవారీగా కనిపించడం లేదు మరియు ఆమె అతన్ని ఎఫ్-ఇన్-హోల్ అని పిలిచింది. మిక్కీ కాల్స్ మరియు స్టీవ్ అతనిని చెప్పమని చెప్పాడు. ఆమె స్టీవ్‌ని నోరు మూయించమని చెప్పింది మరియు ఆమె ఇయాన్ గురించి చూసే మార్గంలో ఉందని చెప్పింది. స్టీవ్ ఇయాన్ ఏమి చేసాడు అని అడిగాడు మరియు తరువాత బయట వేచి ఉన్నాడు. ఇయాన్ దొంగిలించబడిన శిశువుతో రోడ్డుపై డ్రైవింగ్ చేయడాన్ని మేము చూశాము మరియు అతను ఫ్లోరిడాను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అతను తిట్టాడు, నవ్వుతాడు అప్పుడు పిచ్చిగా మాట్లాడుతాడు కానీ అతని ఫోన్ పట్టించుకోడు. డిస్నీ వరల్డ్ గొప్పగా ఉంటుందని మరియు ప్రపంచానికి వ్యతిరేకంగా వారిద్దరు ఉన్నారని ఆయన చెప్పారు. వారి సమస్యలన్నీ మాయమవుతున్నాయని ఆయన చెప్పారు. మిక్కీ కాల్ చేస్తూనే ఉన్నాడు మరియు స్వెత్లానా పోలీసులను పిలవాలనుకుంటున్నాడు. ఇయాన్ వారి కొడుకును తిరిగి తీసుకువస్తాడని మిక్కీ చెప్పాడు, సైక్ వార్డ్ గురించి మాట్లాడేందుకు అతను భయపడ్డాడు. లిప్ డార్మ్‌లలో తన RA విధులు నిర్వర్తిస్తుంది మరియు తరువాత ఒక తల్లి అతనిని సమీపించింది మరియు ఆమె కరెన్ యొక్క తల్లి అని మరియు అతనికి మందుల సంచిని అందజేయాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇది సమ్మర్ క్యాంప్ కాదని మరియు అతను నర్స్ కాదని లిప్ చెప్పారు. తల్లిదండ్రులు వెళ్లే వరకు కలుపు మరియు అశ్లీలతను తొలగించమని అతను ఒక రూమ్‌ఫుల్ ఇడియట్స్‌కి చెప్పాడు. అతను RA కావడం గురించి అమండాకు ఫిర్యాదు చేస్తాడు మరియు అతను అతనితో కలిసి ఉండవచ్చని ఆమె చెప్పింది. ఆమె అతని గోడపై ఒక కుడ్యచిత్రాన్ని పెయింటింగ్ చేస్తోంది మరియు క్రెయిగ్స్ జాబితాలో తన కొత్త రూమి మొత్తం బుల్ డైక్ అని చెప్పింది. ఇయాన్ కేవలం ఒక బిడ్డను దొంగిలించినందున అతను తన కారును అరువుగా తీసుకోవచ్చా అని అతనికి కాల్ వచ్చింది. ఫ్రాంక్ మెయిల్ లేడీ గేల్‌ని అడ్డగించి అతని ప్రభుత్వ తనిఖీ గురించి అడుగుతాడు. ఉద్యోగం సంపాదించమని ఆమె అతనికి చెప్పింది మరియు అది అతనికి మద్దతు ఇచ్చే అధికారాన్ని కోల్పోతుందని అతను చెప్పాడు. అతను తరువాత కడుపు నొప్పి మధ్య ఇంటికి వెళ్తాడు. సమ్మి తెరిచే వరకు అతను తలుపు మీద కొట్టాడు. అతను లోపలికి రావడానికి ప్రయత్నించాడు మరియు ఆమె అతన్ని అడ్డుకుంటుంది. అతను ఆమెను దారికి నెట్టాడు మరియు అతను ఎక్కడ ఉన్నాడని ఆమె అడుగుతుంది. అతడిని బయటకు రాకుండా బెడ్‌రూమ్‌లు లాక్ చేయబడ్డాయని ఆమె చెప్పింది. ఆమె అతని చెత్తను పెట్టెలో వేసి పెరట్లో పెట్టినట్లు చెప్పింది. అతను ఎక్కడ నిద్రపోతాడని అతను అడిగాడు మరియు ఆమె పట్టించుకోవడం లేదని ఆమె చెప్పింది. ఆమె గట్టర్ లేదా మంచానికి తిరిగి చెప్పింది. కొత్త నియమాలు డబ్బులు లేవు, ఆహారం లేదు మరియు కర్ఫ్యూ ఉందని ఆమె చెప్పింది. 10 గంటలకు తలుపులు లాక్ చేయబడ్డాయని మరియు పిల్లలు తిట్టారని ఆమె చెప్పింది. సమ్మి మినహాయింపులు లేవని మరియు డెబ్బీ లియామ్ దాని కంటే ఆలస్యంగా ఉంటాడని చెప్పారు. ఆమెను ప్రయత్నించవద్దని మరియు బయట చల్లగా ఉందని సమ్మి చెప్పింది. డెబ్బీ తాను హైస్కూల్ కోసం సిద్ధం కావాలని చెప్పింది మరియు సమ్మి ఆమెను కౌగిలించుకుంది మరియు ఆమె అత్యాచారానికి గురికాకుండా డౌడీ వేసుకోవాలని చెప్పింది. ఆమె వెళ్లే ముందు మూత్ర విసర్జన చేయమని చెప్పింది, తద్వారా ఆమె ఉక్రేనియన్‌లచే కొట్టబడదు. డెబ్బీకి స్కూలు సామాగ్రికి డబ్బు అవసరమా అని ఆమె అడుగుతుంది, తర్వాత చకీకి కూడా కొన్ని వస్తువులను తీయమని అడిగింది. ఫియోనా మరియు లిప్ మిక్కీకి వస్తాయి మరియు స్వెత్లానా ఇయాన్ గురించి వాపోతోంది. మియాక్ అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తానని ఇయాన్‌తో చెప్పాడని, అతను భయపడి బిడ్డను తీసుకున్నాడని చెప్పాడు. లియాన్ మరియు ఫియోనా ఇయాన్‌కు సైకోటిక్ బ్రేక్ ఉందని నిర్ణయించుకుంటారు. ఖచ్చితంగా అతను చేతులు లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు. అతను విల్లీ నెల్సన్ రేడియో స్టేషన్‌లో మళ్లీ రోడ్ మీద పాడుతున్నట్లు కనుగొని, వెంట పాడుతున్నాడు. అతను ఒక పెద్ద ఫ్యాక్టరీని చూస్తాడు, ఆపై లాగుతాడు. అతను బయటకు వెళ్లి సూర్యాస్తమయం అందంగా ఉందని చెప్పాడు. అతను ఏడుస్తున్న చిన్నారిని కారులోంచి బయటకు తీసి చుట్టూ తిప్పాడు. తరువాత వారు ఒక కుటుంబంగా మాట్లాడుతారు మరియు ఇయాన్ ఎక్కడికి వెళ్లి ఉండవచ్చు అని ఆశ్చర్యపోతారు. సమ్మి పోలీసులను పిలవమని సూచించాడు మరియు అందరూ వద్దు అని అరుస్తారు. స్టీవ్ చూపిస్తాడు మరియు అక్కడ అతను f-k ఏమి చేస్తున్నాడని లిప్ అడుగుతుంది. ఆమె పెళ్లయిందని అతను భావించాడని లిప్ చెప్పింది మరియు ఆమె గుస్‌కు ఆమె అని చెప్పింది. స్టీవ్ సంగీతకారులు నమ్మదగని వారు మరియు ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంది మరియు ఎందుకు రహస్యంగా ఉంచారు అని అడిగింది. ఫియోనా స్టీవ్‌ని ఇంటి నుండి బయటకు నెట్టివేసి, అతను కనిపించడం లేదని చెప్పాడు. అతను సమ్మి ఎవరని అడిగాడు మరియు ఆమె వారికి తెలియని సోదరి అని చెప్పింది. లియామ్‌ను దాదాపుగా చంపినందుకు ఆమె జైలుకు వెళ్లడంతో సహా అతను చాలా కోల్పోయాడని ఆమె చెప్పింది. అతను 35 ఏళ్ల బాస్ ప్లేయర్ గురించి అస్సలు అడగనని చెప్పాడు. అతనికి అది ఎలా తెలుసని ఆమె అడుగుతుంది మరియు ఏంజెలా తన కోసం ఆమెను తనిఖీ చేస్తోందని అతను చెప్పాడు. అతను ఆమెను ప్రేమిస్తున్నాడని మరియు ఆమె ఇంకా తనను ప్రేమిస్తుందా అని అడిగాడు. ఆమె వద్దు అని చెప్పింది మరియు అతను ఆమెను అబద్దాలు అంటాడు. అతను ఆమెను ప్రేమిస్తున్నానని ఆమెతో మళ్లీ చెప్పాడు, ఆపై ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఆమె ఏడుస్తూ కళ్లపై చేతులు వేసింది. ప్రతిఒక్కరూ వాటిని కిటికీ గుండా చూస్తున్నారు మరియు పెదవి చెప్పింది - చేయవద్దు. కానీ అప్పుడు ఆమె అతన్ని ముద్దుపెట్టుకునే స్టీవ్ చేతుల్లో ఉంది. అది చాలా వేడిగా ఉందని సమ్మి చెప్పింది. మరుసటి రోజు, లిప్ చేతిలో లియామ్ ఉంది మరియు ఆమె తలుపు తెరవడానికి సిద్ధమవుతోంది. ఫియోనా తన పక్కన నిద్రపోతున్న స్టీవ్‌తో మేల్కొంటుంది. ఆమె తన బట్టలు తీసి, ఆమె తలుపు వెలుపల పెదవి దాక్కున్నట్లు గుర్తించింది. అతను ఇయాన్ నుండి విన్నారా అని ఆమె అడుగుతుంది. వారిద్దరికీ లేదు. అతను స్టీవ్‌ను జాగ్రత్తగా చూసుకోగలడా లేదా అతను స్టీవ్‌ను బ్యాట్‌తో కొట్టి చంపేసి, అతను ఒక చొరబాటుదారుడని చెప్పాలా అని అతను అడుగుతాడు. క్రింద, సమ్మి వంట చేస్తోంది మరియు పిల్లలందరూ ఫియోనా వైపు చూస్తున్నారు. స్టీవ్ ఆమె మరియు గుస్‌తో కలిసి వెళ్లబోతున్నారా అని సమ్మి అడుగుతుంది. వివాహమైన ఆ తొలి రోజులు చాలా ముఖ్యమని ఆమె చెప్పింది. ఇయాన్ నుండి కూడా మిక్కీ వినలేదని లిప్ చెప్పింది. డెబ్బీ ఆమె వెళ్ళవలసి ఉంది మరియు లిప్ కూడా అలానే ఉంది. అతను తన ఫోన్‌ను తానే ఉంచుకుంటానని చెప్పాడు. దాన్ని కొట్టడానికి ఎవరో కొట్టారు మరియు సమ్మీ కార్ల్‌తో అరుస్తుంది. కార్ల్ ఇతర భర్త వ్యక్తి ముందు తలుపు వద్ద ఉన్నాడని చెప్పారు. అతను తనకు మెసేజ్ చేస్తున్నట్లు చెప్పడంతో ఆమె ఫోన్ చనిపోయిందని ఫియోనా చెప్పింది. సోఫాలో ఉన్న గడ్డ మరియు వాసన ఆమె సోదరుడు అని ఆమె చెప్పింది. ఇయాన్ ఒక బిడ్డను దొంగిలించిందని ఆమె చెప్పింది. అతను కాలేజీలో ఉన్నదా అని అడుగుతాడు. ఆమె లేదు అని చెప్పింది, సైన్యంలో చేరడానికి పారిపోయిన వ్యక్తి మరియు అతను తన BF బిడ్డను దొంగిలించాడని చెప్పాడు. లిప్ గుస్‌కి దీనిని f-k చేయవద్దని చెబుతుంది మరియు ఫియోనా విలువైనదని చెప్పింది. డెమోలో పనిచేయడానికి అతను క్రిస్‌ని కలవాల్సి ఉందని గుస్ చెప్పాడు, కానీ ఆమె వెళ్లమని చెప్పింది మరియు ఆమె తర్వాత అతనికి కాల్ చేస్తుంది. ఆమె అతడిని ఆప్యాయంగా ముద్దాడింది మరియు అతను వెళ్తాడు. సమ్మి ఇవన్నీ ఆసక్తిగా చూస్తుంది. ఇయాన్ కారులో నిద్రపోతున్నాడు కానీ అరుస్తున్న శిశువుకు నిద్ర లేచింది. అతను కారు దిగి వెళ్ళిపోయాడు. అతను చుట్టూ చూసాడు మరియు శిశువును బయటకు తీయడానికి వెళ్తాడు. అందమైన ఉదయం కనుక ఏడవవద్దని అతను చెప్పాడు. అతను తన డైపర్‌ని మార్చి, సూర్యుడిని భయపెట్టకుండా ఏడుపు ఆపమని చెప్పాడు. అతను డైపర్ కోసం వెళ్తున్నప్పుడు శిశువును కారు హుడ్ మీద వదిలివేస్తాడు. అతను ఒక డైపర్ కోసం ట్రంక్‌ను తనిఖీ చేయడానికి వెళ్తాడు, అప్పుడు అతను ఒక చొక్కాను కనుగొని అతని చుట్టూ కట్టుకున్నాడు. అతను చెడ్డ గాడిద అని ఇతర పిల్లలు అనుకుంటున్నారని ఆయన చెప్పారు. అతను అతన్ని ఎత్తుకుని, అప్పుడు అతను తప్పనిసరిగా ఆకలితో ఉన్నాడని చెప్పాడు. అతను పిల్లవాడిని తినిపించడానికి ఏదైనా చుట్టూ చూశాడు మరియు వారు ఆక్వేడక్ట్ దగ్గర ఉన్నారని మరియు మేత పెట్టవచ్చని చెప్పారు. యేవి ఏడుపు ఆపదు. అతను తన రింగింగ్ ఫోన్‌ను పట్టించుకోలేదు మరియు యెవి తన భుజాలపై స్వారీ చేస్తున్నాడు. మిక్కీ అతన్ని కోపంగా మరియు నరహంతక సందేశాన్ని వదిలేస్తాడు, అప్పుడు అతను అతన్ని ప్రేమిస్తున్నాడని మరియు అతని గురించి ఆందోళన చెందుతున్నాడని చెప్పాడు. తనను తిరిగి పిలవమని వేడుకున్నాడు. స్వెత్లానా తాను ప్రసవ వేదనలో ఉన్నానని మరియు ఆమె విసుగు పుట్టించే దుస్తులు ధరించాలని చెప్పింది. యెవిని తిరిగి పొందమని ఆమె చెప్పింది లేదా ఆమె పోలీసులను పిలుస్తుంది. బిడ్డను అప్పగించే ముందు డబ్బు పొందమని మిక్కీ ఆమెకు గుర్తు చేసింది. ఆమె తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి హాస్పిటల్‌కు వెళ్లి, ప్రసవం మరియు ప్రసవం నుండి తిరిగి వచ్చే సమయానికి తన బిడ్డ తిరిగి రావాలని చెప్పింది. ఫియోనా స్టీవ్‌ని మేల్కొలిపి, అతడిని ఇప్పుడు బయటకు పంపాలని చెప్పింది. అతను లేచి సరే అన్నాడు. ఫియోనా వెనుకకు దూసుకెళ్లింది, అప్పుడు స్టీవ్ తన బట్టలు లాగుతూ కిందికి వచ్చాడు. అతను ప్రతిఒక్కరికీ ఉదయం చెప్పాడు మరియు కాఫీ కోసం అడుగుతాడు. సమ్మి అతనికి ఒక కప్పు పోస్తుంది. ఫియోనా వెరోనికాను చూడటానికి వస్తుంది, ఆమె మరియు కెవిన్ విడిపోతున్నారని ఆమె చెప్పింది, ఎందుకంటే అతను ఇకపై ఆమెను పట్టించుకోడు. అతను మంచం మీద నిద్రిస్తున్నాడని ఆమె చెప్పింది మరియు ఆమె మరియు కెవిన్ గొడవ పడ్డారని మరియు వెరోనికా తన వైపుకు వెళ్లడం మంచిదని చెప్పింది. కెవిన్ అమ్మాయిలను పార్కుకు తీసుకెళ్లాడని మరియు ఆమె అలీబిని తెరవాల్సి ఉందని ఆమె చెప్పింది. ఫియోనాకు ఏమి కావాలో ఆమె అడుగుతుంది మరియు ఆమె పట్టించుకోనని, అది వేచి ఉండవచ్చని ఆమె చెప్పింది. వెరోనికా ఫియోనాను కౌగిలించుకుని, తాను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి, షవర్‌లోకి ఎక్కడానికి వెళ్లింది. డెబ్బీ ఉన్నత పాఠశాలకు వెళ్తాడు మరియు కొంచెం భయపడ్డాడు. ఒక అమ్మాయి ఆమె మొహంలో పాపప్ చేసి, ఆమె డెడ్లీ డెబ్బీ అని అడుగుతుంది. డెరెక్ అక్కడ ఉన్నాడు మరియు ఆ అమ్మాయిని తన విన్నప ఛార్జ్ కోసం తన కమ్యూనిటీ సర్వీస్ పూర్తి చేశాడా అని అడుగుతాడు. అమ్మాయి వెళ్ళిపోయింది మరియు డెరెక్ ఆమె ఇప్పటికే శత్రువులను తయారు చేస్తుందా అని అడుగుతుంది. చాలా మంది ప్రయత్నించాలనుకుంటున్నారని డెరెక్ చెప్పారు. ఆమె తన గాడిదను తన్నగలదా అని అతను అడిగాడు మరియు ఆమె తనకు తెలియదని చెప్పింది. అమండా తన రూమ్‌మేట్ మఫ్‌ను టవల్స్ కొనడానికి పంపింది మరియు లిప్ ఆమె తనకు వేడిగా ఉందని చెప్పింది. డాన్స్ తల్లులు అబ్బి కొత్త ప్రారంభం క్రెడిట్ కార్డ్ ఆఫర్ చూసినప్పుడు ఇది ఒక రకమైన చమత్కారమని అమండా చెప్పారు. ఆమె తండ్రి తన క్రెడిట్ కార్డులన్నింటినీ తీసుకెళ్లినట్లు ఆమె చెప్పింది. అమండా ఆమె దానిని అమలు చేస్తానని చెప్పింది, ఆపై దానిని చెల్లించాలని తన తండ్రిని వేడుకుంది. అతను పట్టుకుంటానని చెప్పాడు, ఆపై అతను ఎక్కడ ఉన్నాడని అడగడానికి ఇయాన్‌కు కాల్ చేశాడు. ఇయాన్ గ్యాస్ స్టేషన్‌లోకి లాగి యెవిని పట్టుకున్నాడు. అతను అతన్ని లోపలికి తీసుకెళ్లి కొన్ని డైపర్‌లు, రెడ్ బుల్ మరియు బేబీ ఫుడ్‌ని పట్టుకున్నాడు. అతను గ్యాస్ కూడా అడుగుతాడు. అతను డబ్బును తవ్వుతున్నప్పుడు శిశువును అపరిచితుడికి అప్పగిస్తాడు. ఇది సరిపోదని ఆమె చెప్పింది. అతను గ్యాస్ కోసం ఎంత అడుగుతాడు మరియు అప్పుడు ఒక మహిళ అడుగుపెట్టి డైపర్‌ల కోసం $ 5 అందజేస్తుంది. ఇయాన్ ఆమెకు ధన్యవాదాలు. అతను యెవిని వెనక్కి తీసుకొని వెళ్లి కౌంటర్ మీద వేసి అతడిని మార్చడం ప్రారంభించాడు. క్లర్క్ అతడిని అక్కడ మార్చలేనని చెప్పాడు మరియు అతను స్టోర్ నుండి బయటకు వెళ్తాడు. సీన్ ఆమెను స్టీవ్ ఎవరు మరియు ఎందుకు అతన్ని కొడుతున్నాడని అడుగుతుంది. అతను ఆమెలాగే పిచ్చిగా నిద్రపోతున్నాడని అతను చెప్పాడు. అతను జాకీ హాస్పిటల్ నుండి బయటకు వస్తున్నాడని మరియు ఆమె PO ఆమెను పికప్ చేస్తుందని చెప్పాడు. ఫియోనా ఆమెను మరో అవకాశం కోసం అడుగుతుంది కానీ సీన్ అతను ఆమెను ఎనేబుల్ చేయలేనని చెప్పాడు. ఏంజెలా వస్తుంది మరియు సీన్ ఆమె పెద్ద టిప్పర్ అని చెప్పింది. ఆమె దగ్గరకు వెళ్లి తర్వాత ఏంజెలాను పలకరించింది. ఆమె మరియు స్టీవ్ ప్రేమికులని ఆమె అడుగుతుంది. ఏంజెలా అతను తన రకం కాదని, ఫియోనా అని చెప్పింది. ఆమె వారి వ్యాపారం గురించి నిర్ణయం తీసుకోవటానికి స్టీవ్ అవసరమని మరియు అతను ఉంటున్నట్లయితే తాను ఇతర ఏర్పాట్లు చేస్తానని చెప్పింది. ఫియోనా తనకు తెలియదని చెప్పింది. కెవిన్ వెరోనికా గురించి పార్కులో జూలీకి అమ్మాయిలను పట్టించుకోలేదు. అతను తన భార్య రాత్రంతా నిద్రపోతున్నాడని మరియు ఆమె పిల్లలు ఏడ్చినప్పుడు ఎలాంటి తల్లి లేవదని అతను అడిగాడు. జూలీ అతడిని చెదరగొట్టడం ఒకప్పటి విషయం అని చెప్పింది. నర్సు కరోల్‌ని పొందింది, తల్లి స్వెత్లానా బిడ్డను దత్తత తీసుకుని ఆమెను తిరిగి తీసుకువస్తుంది. తండ్రి వెయిటింగ్ రూమ్‌లో స్వెత్లానా యొక్క GF నికాను తనిఖీ చేస్తున్నారు. ఆమె కొంత కాలు చూపిస్తుంది. అతనికి వి. ఫ్లాష్ ఇస్తుంది. ఆమె అతని పక్కన కూర్చోవడానికి వచ్చింది. వేచి ఉండటం చాలా ఒత్తిడిని కలిగిస్తుందని ఆమె అతనికి చెప్పింది. ఆమె తన చేతులను అతని కాలు మీదకు నడిపి, అతను తన నోరు $ 100 కు పొందగలనని చెప్పింది. అతను ప్రసవాన్ని కోల్పోవాలనుకోవడం లేదని, అయితే పిల్లలు గంటలు తీసుకుంటారని ఆమె చెప్పింది. ఇయాన్ కారు పార్క్ చేసి అతని జుట్టును చెక్ చేసుకుంటున్నాడు. అతను శిశువుకు కొత్త జత బూట్లు అవసరమని చెప్పాడు మరియు అతను నగదుతో తిరిగి వస్తానని యెవికి చెప్పాడు. అతను కొంత డబ్బు సంపాదించడానికి ప్రయత్నించడానికి వెళ్తాడు. పాప ఏడుపు ప్రారంభించింది మరియు ఒక మహిళ విన్నది మరియు యెవిని కారు నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఫ్రాంక్ మేల్కొని సహాయం కోసం పిలుస్తాడు. సమ్మికి చకీ మరియు లియామ్ ఉన్నారు మరియు పాన్‌హ్యాండిల్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అతను నొప్పిగా ఉందని మరియు అతను తన మెడ్స్ తీసుకుంటున్నారా అని ఆమె అడుగుతుంది. అతను వాటిని తనకు ఇస్తున్నారా అని అతను అడిగాడు మరియు అది తన పని కాదని ఆమె చెప్పింది. సమ్మి అబ్బాయిలకు చెడ్డ వస్తువులను ధరించమని చెప్పింది. ఫ్రాంక్ చకీని సహాయం కోసం అడుగుతాడు. అతను వాటిని పట్టించుకోనందున అతనికి సహాయం చేయవద్దని సమ్మి చెప్పింది. ఫ్రాంక్ లియామ్‌కి ఫోన్ ఇవ్వమని అడిగాడు, కానీ సమ్మి ఫోన్ చేసి అతనికి సహాయం చేయవద్దని చెప్పాడు. ఫ్రాంక్ నేలపై క్రాల్ చేస్తాడు మరియు అతను లియామ్‌ను కోకో ఇన్‌గ్రేట్ అని పిలుస్తాడు. అతను వంటగదికి వెళ్లి ఫోన్‌ని కిందకి లాగాడు. అది అతని ముఖానికి తగిలింది. ఇయాన్ రాగానే యెవీని కారు నుండి బయటకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతను శిశువును ఒంటరిగా వేడి కారులో వదిలి వెళ్ళలేడని వారు అతనికి చెప్తారు. వారు శిశువును భయపెట్టారని, ఆ తర్వాత మహిళను తిట్టారని ఇయాన్ చెప్పారు. ఇయాన్ శిశువుపై ఉన్నారా అని పోలీసు అడుగుతాడు మరియు ఇయాన్ తన బిడ్డను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడని మరియు అతనితో ఎఫ్-కే ఏంటి అని అడిగాడు. తన బిడ్డను దొంగిలించమని ఎవరు చెప్పారని అడిగారు, తర్వాత యేవీతో కలిసి పరుగెత్తుతాడు. పోలీసులు వెంబడిస్తున్నారు. ఇయాన్ ఒక కిరాణా దుకాణంలోకి పరిగెత్తుతూ సహాయం కోసం పిలుస్తున్నాడు మరియు వారు తన బిడ్డను ఎలా దొంగిలించాలనుకుంటున్నారు. పోలీసు అతడిని వ్రేలాడదీయగా, యివి అరుస్తుండగా ఇయాన్ వారిపైకి వస్తువులు విసిరాడు. అతను బిడ్డను పట్టుకుని ఏడుస్తూ వారిని ఆపమని వేడుకున్నాడు. తలుపు తట్టింది మరియు మిక్కీ తన తుపాకీని అందుకున్నాడు, ఆపై సమాధానం చెప్పడానికి వెళ్తాడు. అతను దానిని తెరిచి, అది కార్ల్‌ని చూస్తాడు. అతను అక్కడ ఎందుకు ఉన్నాడని అతను అడిగాడు మరియు అతను ఇయాన్ నుండి విన్నారో లేదో చూడాలని చెప్పాడు. మిక్కీ నో అంటాడు మరియు కార్ల్ తన తల్లి మోనికాతో కలిసి చూశానని చెప్పాడు. ఆమె వారి పైకప్పుపైకి ఎక్కి, ఆమె ఒక పక్షి అని చెప్పింది. మిక్కీ ఆమె దూకిందా అని అడిగింది మరియు కార్ల్ ఫైర్‌మెన్ ఆమెను కిందకు దించాడని చెప్పాడు. మిక్కీ కార్ల్‌కి బీర్ అందించి, అతనికి కలుపు ఉందా అని అడుగుతాడు. కార్ల్ లాభాలను తింటాడని మరియు మిక్కీ డ్రగ్స్ వ్యాపారం ఇకపై తెల్ల మనిషి ఆట కాదని చెప్పాడు. మిక్కీ ఫోన్ మోగుతుంది మరియు అతను పోలీసులకు ఇయాన్ మరియు బిడ్డ ఉన్నట్లు చెప్పాడు. అతను టెర్రా హౌట్ ఎక్కడ అని అడుగుతాడు. ఏంజెలా మరియు స్టీవ్ కారులో వేచి ఉండి మాట్లాడుకున్నారు. వారు త్వరలో దుబాయ్ వెళ్లాల్సి ఉందని ఆమె చెప్పింది. ఫియోనా ఇంటికి వచ్చినప్పుడు స్టీవ్ ఆమెను అడ్డగించాడు. వారు మాట్లాడుకోవాలని అతను చెప్పాడు కానీ ఆమె అందుకు సిద్ధంగా లేదని చెప్పింది. వారు లోపలికి వెళ్లి, ఆమె లైట్ ఆన్ చేసింది. ఆమె శపించింది మరియు ఆమె ఫోన్ చనిపోయిందని చెప్పింది. అతను ఆమెకు ఏమి చెప్పాలో తెలియదని చెప్పాడు. ఆమె తన ఫోన్ ఛార్జర్ కోసం చూస్తుంది మరియు అతను జరిగిన ప్రతిదానికీ క్షమించండి అని చెప్పాడు. ఆమె ఒక బీరు తీసుకుని, అది సరిపోతుందా అని అతడిని అడుగుతుంది. అతను ప్రతిరోజూ ఆమె గురించి ఆలోచించాడని మరియు ఆమెను ప్రేమిస్తున్నాడని చెప్పాడు. అతను ఆమె గురించి ప్రతిదీ ప్రేమిస్తున్నాడని చెప్పాడు. అతనికి ఏమి కావాలని ఆమె అడుగుతుంది. అతను క్షమించండి అని చెప్పాడు. అతను ఆమె ముఖాన్ని తాకి, ఆమెను ప్రేమిస్తున్నానని మళ్లీ చెప్పాడు. అతను ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. వారు ఒకరినొకరు బట్టలు విప్పుతారు. అతను ఆమెను సింక్ మీద చేస్తాడు మరియు తరువాత వారు నేలపై పడతారు. ఆమె ఏడుస్తూ అతడిని ఆపమని చెప్పింది. ఆమె ఏడుపుతో నిండిపోతుంది. ఆమె వాషర్ దగ్గర కూర్చోవడానికి వెళ్లి, ఇంటికి వెళ్లమని వేడుకుంది. అతను వెళ్లిపోతాడు. లిప్ మళ్లీ ఫియోనాకు కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది, అప్పుడు డెబ్బీ ఆమెకు టెక్స్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. వారు మిక్కీ మరియు కార్ల్‌తో కలిసి కారులో ఉన్నారు. ఇయాన్ గురించి తమ మాట విననందుకు మిక్కీ క్షమాపణలు చెప్పాడు మరియు ఇది చాలా ఘోరంగా ఉంటుందని వారందరూ అంగీకరిస్తున్నారు. ఫ్రాంక్ ఆసుపత్రిలో ఉన్నాడు మరియు అతని కుమార్తె తన మెడ్స్ ఇవ్వలేదని అతను చెప్పాడు. అతనికి 51 అని మరియు అతను మానసికంగా అసమర్థుడైతే తప్ప తన సొంత మెడ్‌లకు బాధ్యత వహించగలడని ఆమె చెప్పింది. అతను మందగించాడా అని ఆమె అడుగుతుంది. అతను నో అంటాడు మరియు ఆమె అతని ఒంటిని కలవమని చెప్పింది. అతను కాలేయాన్ని కోల్పోతున్నాడా అని అడుగుతాడు. అతని రక్తంలో ఆల్కహాల్ కానీ ఆక్సి, కోక్ మరియు కలుపు లేకుండా ఉండటం చూసి తనకు సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. ఆమె జీవించడానికి ఎవరైనా తమ జీవితాన్ని ఇచ్చారని ఆమె చెప్పింది. వారు అవయవాలు తీసుకోవడం ప్రారంభించే ముందు ఆ వ్యక్తి చనిపోయాడని ఫ్రాంక్ చెప్పాడు. అతను ఈ కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే, అతను మరొకటి పొందలేనందున అతను అదృష్టవంతుడు అని ఆమె చెప్పింది. వారు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి K9 కుక్క మొరుగుతుంది. కారులో ఒక పౌండ్ కలుపు ఉన్నందున అతను కారులోనే ఉండాల్సిన అవసరం ఉందని కార్ల్ చెప్పాడు. వారు దీని గురించి తర్వాత మాట్లాడబోతున్నారని లిప్ చెప్పారు. ఇయాన్ శిశువును వేడి కారులో లాక్కెళ్లి పారిపోయాడని అరెస్టు అధికారి చెప్పారు. శిశువు తనదని మిక్కీ చెప్పింది. అతను ఇయాన్‌తో ఎవరు సంబంధాలు కలిగి ఉంటారని అడిగారు మరియు అతను భాగస్వామి, ప్రేమికుడు మరియు కుటుంబం అని చెప్పాడు. పోలీసులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చారని చెప్పారు. అతను అయాన్‌కు కొంత సహాయం పొందాలని అతను చెప్పాడు మరియు లిప్ వారికి తెలుసు అని చెప్పాడు. వారు ఇయాన్‌ను బయటకు తీసుకువచ్చారు మరియు పెదవి అతనిని కౌగిలించుకుంది. అతను ఒక జోంబీ లాగా కనిపిస్తాడు. మిక్కీ అతడిని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. పోలీసు యెవిని బయటకు తీసుకువస్తాడు మరియు మిక్కీ తన కొడుకును తీసుకువెళ్తాడు. అతను మిక్కీకి ఒక అందమైన పిల్లవాడు మరియు మంచి స్లీపర్ అని చెప్పాడు. మిక్కీ తన కొడుకును తీసుకొని ఆఫీసర్‌కి కృతజ్ఞతలు తెలుపుతాడు. అతను తన కొడుకును దగ్గరగా కౌగిలించుకున్నాడు. ఫియోనా అతని స్థానంలో గుస్‌ను చూడటానికి వెళ్తుంది. ఆమె తన బట్టలు తీసి అతనితో మంచం ఎక్కింది. అతను మేల్కొని తిరగబడతాడు. అతను ఆమెను మెల్లగా ముద్దుపెట్టుకున్నాడు మరియు అతను ఆమెపైకి వెళ్లాడు. ఆమె అతడిని గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది. మిక్కీ అతను వెళ్లడానికి ఇష్టపడకపోయినా అయాన్‌కు కట్టుబడి ఉండాలని చెప్పాడు. [2015-02-15, 11:01:45 PM] రాచెల్ రోవాన్: ఇయాన్ శిశువును కిడ్నాప్ చేసిందని చెబితే, వారు అతడిని తీసుకెళ్లాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. మిక్కీ అతను వెళ్లకపోతే, అతను పోలీసులను పిలిచి, తాను యెవిని కిడ్నాప్ చేశానని చెప్పాడు. లిప్ మిక్కీకి అతను ఓకే చేసాడు మరియు చాలా మంది చేసేదానికంటే చాలా ఎక్కువ ప్రయత్నించాడు. వారు ఇంటికి వెళుతున్నప్పుడు ఇయాన్ అతని భుజంపై నిద్రపోతాడు. ఫియోనా గుస్ తన గిటార్ వాయిస్తూ మరియు పాడుతూ మేల్కొంటుంది. డేవిస్ కూడా ఉన్నాడు. ఆమె ఫోన్ ఆగిపోతూనే ఉంది, కానీ అతను ఆమెను మేల్కొలపడానికి ఇష్టపడలేదని గుస్ చెప్పాడు. ఆమె ఫోన్ తీసుకుని చెక్ చేయడానికి వెళ్లింది. ఆమె లిప్‌కు కాల్ చేసింది. ఇతర గది నుండి గస్ గడియారాలు. ఆమె వెళ్లిపోయి ఆసుపత్రికి పరిగెత్తుతుంది. ఆమె ఆయన్ను కౌగిలించుకుని, అతను బాగున్నారా అని అడుగుతుంది. అడ్మిటెన్స్ పేపర్‌లపై సంతకం చేయమని లియాన్ ఇయాన్‌కు చెబుతాడు. అతను చేస్తాడు. ఇయాన్ మిక్కీ వైపు తిరిగి చూశాడు, అతను ప్రోత్సాహకరమైన ఆమోదం ఇచ్చాడు. ఆయన్ను పొందడానికి నర్సు వస్తుంది. అతను వెళ్లి యెవికి ఒక ముద్దు ఇచ్చాడు, ఆపై మిక్కీని దాటి వెళ్తాడు. అతను ఆయన్ను ఆపి గట్టిగా కౌగిలించుకున్నాడు. అతను మెడలో ఏడుస్తూ ఇయాన్‌ను పట్టుకున్నాడు. అతను అతనితో వెళ్ళగలరా అని అతను అడిగాడు కాని నర్సు లేదు అని చెప్పింది. వారు ఇయాన్‌ను తిరిగి తీసుకువెళతారు, ఇతరులు గేట్ వద్ద వేచి ఉండి, అతను హాల్‌లోకి వెళ్తుండగా చూస్తున్నారు. వారు ఆయన్ను ఒక వార్డుకు తీసుకువెళతారు. అతని వెనుక తలుపు లాక్ చేయబడింది. అతను భయంతో చుట్టూ చూస్తున్నాడు కానీ నడుస్తూనే ఉన్నాడు. శుభవార్త ఏమిటంటే, అతను స్పష్టంగా పిచ్చివాడు కాబట్టి సైన్యం అతని అన్ని చేష్టలకు అతన్ని విచారించలేకపోతుంది. ముగింపు! ప్లీజ్ ఇ సిడిఎల్ గ్రో సహాయం చేయండి, ఫేస్‌బుక్‌లో షేర్ చేయండి మరియు ఈ పోస్ట్‌ను ట్వీట్ చేయండి! పునశ్చరణ ఆసక్తికరమైన కథనాలు న్యూ ఆమ్స్టర్‌డ్యామ్ రీక్యాప్ 04/27/21: సీజన్ 3 ఎపిసోడ్ 9 డిస్‌కనెక్ట్ చేయబడింది పునశ్చరణ 2022 నాష్‌విల్లే సీజన్ 5 స్పాయిలర్స్: కోనీ బ్రిటన్ అవుట్, రేనా జేమ్స్ నిష్క్రమించడానికి నాష్‌విల్లే 2022 ఎడిటర్స్ ఛాయిస్ బిల్ క్లింటన్ మరియు మోనికా లెవిన్స్కీ యొక్క సెక్స్ టేప్ కనుగొనబడింది: హిల్లరీ క్లింటన్ మరింత అవమానాన్ని ఎదుర్కొంటుంది (ఫోటో) దురదృష్టవశాత్తు సెక్స్ కుంభకోణం మరియు లేడీ గాగా యొక్క 'బాడ్ రొమాన్స్' తగిన ఉపయోగం ఇంకా ముగియలేదు. బిల్ క్లింటన్, మా ప్రియమైన రోగ్ మరియు అతని మాజీ వివేకం లేని ఉంపుడుగత్తె, మోనికా లెవిన్స్కీ, సెక్స్ టేప్ కలిగి ఉన్నారు. అవును, సెక్స్ టేప్‌లు 2000 ల ప్రారంభంలో ఉన్నాయని మనందరికీ ఖచ్చితంగా తెలిసినప్పటికీ, మేము తప్పుగా భావించాము. బిల్లు స్పష్టంగా చేయలేదు స్పెయిన్ యొక్క టాప్ 40 టెంప్రానిల్లో వైన్లు... పెడ్రో బాలేస్టెరోస్ టోర్రెస్ MW మరియు సారా జేన్ ఎవాన్స్ MW స్పెయిన్ అంతటా ఉన్న 40 ఉత్తమ టెంప్రానిల్లో వైన్లను సిఫార్సు చేస్తారు they u2026 మెరిసే వైన్ కోసం లాస్ కార్నెరోస్ AVA ను ఏది అనుకూలంగా చేస్తుంది? - డికాంటర్‌ను అడగండి... కార్నెరోస్ మెరిసే వైన్లను చేస్తుంది చికాగో మెడ్ ఫాల్ లైవ్ ఫినాలే రీక్యాప్: సీజన్ 2 ఎపిసోడ్ 8 ఫ్రీ విల్ ఈ రాత్రి NBC వారి కొత్త మెడికల్ డ్రామా చికాగో మెడ్ సరికొత్త గురువారం, నవంబర్ 10, 2016, ఎపిసోడ్‌తో ప్రసారం చేయబడుతుంది మరియు మీ రీక్యాప్ దిగువన ఉంది. టునైట్ చికాగో మెడ్ సీజన్ 2 ఎపిసోడ్ 8 లో, డాక్టర్ చార్లెస్ (ఆలివర్ ప్లాట్) తన కుమార్తె వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటాడు. మీరు గత వారం చికాగో మెడ్ ఎపిస్ చూసారా సంపూర్ణ మరియు బ్రాంకాట్ వోడ్కా-సావిగ్నాన్ మిశ్రమాన్ని ఉత్పత్తి చేస్తారు... స్వీడన్ వోడ్కా నిర్మాత అబ్సొలట్ పెర్నాడ్ రికార్డ్ స్టేబుల్‌మేట్ బ్రాంకాట్ ఎస్టేట్‌తో జతకట్టి వోడ్కా మరియు మార్ల్‌బరో సావిగ్నాన్ బ్లాంక్ యొక్క 'మెరిసే ఫ్యూజన్' ను ఉత్పత్తి చేశాడు. ఇంటర్వ్యూ: బాటిల్ డైరెక్టర్ జాసన్ వైజ్ లోకి సోమ్... విలియం కెల్లీ దర్శకుడు జాసన్ వైజ్, సోమ్: ఇంటు ది బాటిల్ ఫిల్మ్ గురించి వైన్ చరిత్ర గురించి మరియు 2016 ప్రారంభంలో ఐట్యూన్స్లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించిన వైన్ ప్రపంచంలోని అతి పెద్ద పేర్లలో నటించారు. అగ్రశ్రేణి ఫినో షెర్రీ... సోలెరా-ఏజ్డ్ ఫ్లోర్ కింద కనీసం రెండు సంవత్సరాలు, ఫినో షెర్రీ కుటుంబంలో తాజా ముఖం గల యువత ... ప్రముఖ పోస్ట్లు వంచనైన పనిమనిషిలు పునశ్చరణ 6/29/14: సీజన్ 2 ఎపిసోడ్ 11 మీరు దానిని మీతో తీసుకెళ్లలేరు కార్టర్ రీక్యాప్‌ను కనుగొనడం 12/15/15: సీజన్ 2 ముగింపు షెల్టరింగ్ స్కై - ప్రాయశ్చిత్తం ఎనోటెకా జపాన్ DWWA 2020 అవార్డు పొందిన వైన్లను ప్రదర్శిస్తుంది... ప్రాథమిక పునశ్చరణ 07/11/19: సీజన్ 7 ఎపిసోడ్ 8 మిస్ అర్థమైంది ఎడిటర్స్ ఛాయిస్ సొమ్మీలియర్ అంటే ఏమిటి? జూలీ మన జీవితపు రోజులను వదిలివేస్తోంది నరకం వంటగది సీజన్ 8 ఎపిసోడ్ 7 క్రిమినల్ మైండ్స్ సీజన్ 12 ఎపిసోడ్ 18 స్పేడ్స్ షాంపైన్ యొక్క నల్ల ఏస్ ఈ రాత్రి తారలతో డ్యాన్స్ చేయడం ప్రారంభించారు మా జీవితాలు చెడిపోయే రోజులు మా గురించి వైన్ల సమీక్షలు, ఉత్తమ వైన్ పొందుటకు, వైన్లు గురించి తాజా వార్తలు చదవండి, వైన్ రుచి మరియు మరింత గురించి తెలుసుకోవడానికి
దాదాపు నలభయ్యేళ్ళ కిందట గోదావరి ఒడ్డున ఒక సాయంకాలం మాట్లాడుకున్న ఈ మాటలు నిన్న రాత్రే విన్నట్టుంది. చక్రవాక కానాడ రాగాలతో కలిపి రూపొందించిన ఆ రాగంలో ‘రసికరాజ తగువారము కామా’ పాట ఎట్లా కూర్చారో, ఎలా రాసారో, ఎలా పాడారో నా మిత్రులు మహేష్, వంక బాలసుబ్రహ్మణ్యం, గోపీచంద్ మాట్లాడుకున్న మాటలు ఇంకా నా చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి. ఆ వెన్నెల రాత్రుల్లో మా ఊరి ఏటి ఒడ్డున వంతెన మీద ఇమ్మాన్యుయేలు ‘రాగమయీ రావే’ అని పాడుతున్నప్పుడు కొండా, కోనా, ఏరూ, నింగీ ఎట్లా చెవులప్పగించి వింటూ ఉండేవో నా కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూనే ఉన్నది. పది పదిహేనేళ్ళ కిందట, వరల్డ్ స్పేస్ తెలుగు రేడియో ‘స్పందన’ కోసం ‘మోహన రాగం’ ప్రసంగాలు చేస్తున్నప్పుడు, నా మాటల మధ్యలో పాటలు కూర్చడానికి పాతపాటలన్నీ వెతుకుతున్నప్పుడు ‘సంగీత సాహిత్యమే, మేమే, నవ శృంగార లాలిత్యమే’ అన్న పాట వెతుక్కుని పెట్టినప్పుడు ఆ పాట ఇంకా వేళ్ళ మధ్య తారాడుతూనే ఉన్నది. రెండేళ్ళ కిందట విల్లుపురం వెళ్ళినప్పుడు పాటలు పుట్టిన తావులు వెతుక్కుంటూ తిరిగినప్పుడు చిదంబరంలో నందనార్ కోవెల కు వెళ్ళినప్పుడు ‘నందుని చరితము వినుమా, పరమానందము కనుమా ‘ అని నా పక్కన ఎవరో పదే పదే పాడుతున్నట్టే ఉండింది. కాబట్టి జయభేరి చూడాలని గాని, చూడలేదని గాని నాకు అనిపించకపోవడం సహజమే కదా. ఆ సినిమా నాతోనే ప్రయాణిస్తున్నది ఇన్నేళ్ళూ. కాని చూసాను మొన్నా, అటుమొన్నా. ఈ సారి పుస్తకప్రదర్శనలో పి.పుల్లయ్య, శాంతకుమారి దంపతుల మీద ఓలేటి శ్రీనివాస భాను రాసిన ‘అనురాగమూర్తులు’ ఆవిష్కరణ సభలో ఆ పుస్తకాన్ని పరిచయం చేసి వచ్చాక, ఆ సినిమా చూడాలనిపించింది. సినిమా కోసం కాదు, కథ కోసం కాదు, పాటల కోసం కూడా కాదు, పి.పుల్లయ్యగారి దర్శకత్వం ఎలా ఉంటుందో చూడాలని. ఆ సినిమా నన్ను నిరాశపర్చలేదు. అది నిజంగానే ఒక శ్రవ్యకావ్యం. ఎంతో కొంత మెలోడ్రామా తప్పని ఆ నాటి ఆ కథనంలో కూడా ఇప్పటికీ కంట తడిపెట్టించే సన్నివేశాలు కనిపించడంలో ఆశ్చర్యం లేదనిపించింది. కాని ఇంట్లో సోఫాలో కూచుని ఆ సినిమా చూస్తున్నంతసేపూ బయట రెండెడ్ల బళ్ళు ఆగిఉన్నాయనీ, ఎడ్లు నెమ్మదిగా ఎండుగడ్డిపోచల్ని నెమరేసుకుంటున్నాయనీ, వాటిమీద మూడవజాము వెన్నెల రాలుతూ ఉందనీ అనిపిస్తూనే ఉంది. సినిమా అయిపోగానే ఆ ఎడ్లబండిమీద తిరిగి ఆ వెన్నెల రాత్రి అడవి దారిన మా ఊరు వెళ్ళిపోతానని అనుకుంటూ ఉన్నాను. పాతసినిమాలు, జానపదాలు చూసేటప్పుడు, ఆ పాటలు స్టూడియోలో తీసినప్పుడు వెనగ్గా సీనరీ చిత్రించిన తెరలు వాడతారే, ఆ తెరలు చూస్తే నాకేదో అద్భుతమైన లోకమొకటి చూస్తూన్నట్టు ఉంటుంది. ఆ తెరలమీద దూరంగా కోటగోడలూ, అటూ ఇటూ చెట్లూ, దూరంగా ఒక కాలవ, పైన సగం చంద్రుడూ, పలచగా పరుచుకున్న వెన్నెలా కనిపిస్తుంటాయి. నా దృష్టి ఎంతసేపూ ఆ పాటలమీద కాక, అపురూపమైన ఆ మంత్రనగరం మీదనే ఉంటుంది. అందుకనే ఈ సినిమాలో కూడా ‘సవాల్ సవాల్ అను చినదానా, సవాల్ సవాల్ పై సవాల్ ‘ అనే పాట చూస్తూన్నంతసేపూ నేను కూడా ఏదో పూర్వకాలపు గ్రామంలో, ఏదో జక్కుల భాగోతం చూస్తున్నట్టే ఉంది. ఇక ఆ పాట నడుస్తున్నంతసేపూ అంజలీ దేవి ఆశ్చర్యంతో ముంచెత్తుతూనే ఉంది నన్ను . నా చిన్నప్పుడు తారాశంకర్ బందోపాధ్యాయ రాసిన ‘కవి’నవల చదివినప్పుడు అటువంటి లోకమొకటి నా మనసులో చిత్రించుకున్నాను. ‘కవి ‘సినిమాలో కూడా కనిపించని ఆ లోకం మళ్ళా ఈ సినిమాలో ఆ పాట వింటున్నంతసేపూ కనిపిస్తూనే ఉంది. నా చిన్నప్పుడు, మరీ పసివయసులో, మా ఊరు ఏటికవతల జాగరాలమ్మ గుడి ముంగిట ఒక రాత్రి జక్కుల వాళ్ళు భాగవతం ఆడారు. మా అన్నయ్య నన్ను ఆ నాటకం చూడటానికి తీసుకువెళ్ళాడు. పదిమంది కూడా ప్రేక్షకులు లేని ఆ ఆరుబయలు ప్రదర్శనలో ఆ భాగవతులు పూర్తి నాటకం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేరు. ఆ కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమి పాడేరో, మాట్లాడేరో నాకేమీ గుర్తు లేదుగానీ, ఆ రాత్రంతా మా మీద ధారాళంగా వర్షించిన వెన్నెల తడి ఇప్పటికీ నా వీపుకి అంటుకునే ఉంది. అందుకే వెళ్ళి వచ్చాను మళ్ళీ ఆ లోకానికి, మా ఊరికి, రాజమండ్రికి, చిదంబరానికి, వరల్డ్ స్పేస్ రేడియో స్టూడియోకి.
మ‌నిషి జీవితంలో పుట్టుక‌, చావుకు మ‌ధ్య‌లో వివాహం అనేది అతిముఖ్య‌మైన ఘ‌ట్టం. ఈ వివాహం ద్వారా మ‌నిషి మ‌రో స‌రికొత్త జీవితం ఆరంభిస్తాడు. ఈ వివాహంతోనే త‌న‌కంటూ స‌మాజంలో ఓ కుటుంబం ఏర్ప‌డుతుంది. ప్ర‌తి మ‌నిషి జీవితాన్ని పెళ్లికి ముందు ఘ‌ట్టం. పెళ్లి త‌ర్వాత ఘ‌ట్టం అని విభ‌జించ‌వ‌చ్చు. పెళ్లికి ముందు మ‌న జీవితంలో స్నేహితులు, త‌ల్లిదండ్రులు కీల‌కంగా ఉంటారు. పెళ్లి త‌ర్వాత మాత్రం జీవిత భాగ‌స్వామే ముఖ్యం. ఆ త‌ర్వాత పుట్టిన పిల్ల‌లు మ‌నిషి జీవితంలో కీల‌క పాత్ర పోషిస్తారు. పురుషుడు అయినా స్త్రీ అయినా కూడా పెళ్లికి ముందు వ‌ర‌కు వారి జీవితంలో, వారి ఎదుగుద‌ల‌లో త‌ల్లిదండ్రుల‌దే కీల‌క పాత్ర‌. ఆ త‌ర్వాత వారికి భ‌ర్తే స‌ర్వ‌స్వం అవుతాడు. అయితే తాజాగా ఓ అధ్య‌య‌నం ఎలాంటి అమ్మాయిల‌ను పెళ్లి చేసుకోవాలి.. ఎలాంటి అమ్మాయితో పెళ్లి జ‌రిగితే ఇబ్బందులు త‌ప్ప‌వు అనే విష‌యాల‌పై ఓ నివేదిక వెల్ల‌డించింది. పురుషుడు వివాహం చేసుకునేట‌ప్పుడు ఆస్తి కోసం ఆరాట ప‌డ‌కూడ‌ద‌ట‌. త‌న‌కు వ‌చ్చే భార్య ఎక్కువ క‌ట్నం తేవాల‌నుకోవ‌డం.. అత్తింటి నుంచి ఎక్కువ కోరుకుంటే అత‌డు త‌ర్వాత మాట ప‌ట్టింపు వ‌చ్చిన‌ప్పుడు అత్తింటి వాళ్లు గ‌ట్టిగా మాట్లాడితే త‌ల‌దించుకునే ప‌రిస్థితులు కూడా త‌లెత్తుతాయ‌ట‌. పురుషుడు ఎంత వ‌ర‌కు త‌మ‌కంటే త‌క్కువ ఆస్తి ఉన్న కుటుంబం నుంచి అమ్మాయిని మాత్ర‌మే భార్య‌గా స్వీక‌రిస్తేనే అత‌డి జీవితం ప్ర‌శాంతంగా ఉంటుంద‌ట‌. త‌మ కుటుంబం కంటే త‌క్కువ ఆస్తి ఉన్న అమ్మాయిని భార్య‌గా స్వీక‌రిస్తే స‌మాజంలో అత‌డికి మ‌రింత గౌర‌వం పెర‌గ‌డంతో పాటు అత్తింటి వాళ్లు, ఆ బంధువుల ద‌గ్గ‌ర ఉన్న‌తంగా ఉండ‌డంతో పాటు త‌న భార్య‌కు ముందు జీవితం కంటే మంచి జీవితం ఇచ్చిన‌వాడు అవుతాడ‌ట‌. ఇక త‌మ కుటుంబంలో కలిసిపోయే అమ్మాయినే పెళ్లి చేసుకోవ‌డం మంచిద‌ట‌. అలా పెళ్లి చేసుకుంటే పెళ్లి త‌ర్వాత గొడ‌వ‌లు రాకుండా ఉండ‌డంతో పాటు చిన్న చిన్న స‌మ‌స్య‌లు వ‌చ్చినా స‌ర్దుకుపోతార‌ట‌. ఇక అబ్బాయి మ‌న‌స్త‌త్వంతో పాటు అత‌డి ఉద్యోగం, ఆస్తిని మాత్ర‌మే చూసి పెళ్లికి ఒప్పుకునే అమ్మాయిల‌కు దూరంగా ఉండాల‌ట‌. అలాంటి వారిని చేసుకుంటే భవిష్య‌త్తులో తీవ్ర‌మైన ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని తాజా అధ్య‌య‌నం చెపుతోంది. ఇక త‌మ ఇంట్లోకి వ‌చ్చే అమ్మాయి అత్త‌, మామ‌ల‌ను త‌న తల్లిదండ్రుల‌తో స‌మానంగా గౌరవించేలా ఉండాల‌ట‌. అలాంటి అమ్మాయి అయితే కుటుంబంలో స‌మ‌స్య‌లు, అపార్థాలు పెద్ద‌గా రావు అట‌.
నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ షూటింగ్ మొత్తానికి పూర్తయింది. గతేడాది మొదలైన ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా పలు వాయిదాలు పడుతూ ముందుకు సాగింది. అయితే చిత్ర షూటింగ్ పూర్తయినట్లు టీమ్ అధికారికంగా వెల్లడించింది. - Advertisement - మాస్ ఎంటర్టైనర్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోన్న ఈ సినిమాలో పూర్ణ మరో ప్రముఖ పాత్ర చేస్తోంది. శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. అఖండ టీజర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. రెండు భిన్నమైన గెటప్స్ లో బాలకృష్ణ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. అందులో ఒకటి అఘోరా గెటప్. ఎస్ ఎస్ థమన్ అఖండకు సంగీతం అందిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. అఖండ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీపావళి సీజన్ ను కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఏదేమైనా విడుదల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. And it’s a wrap for Blockbuster combo #NandamuriBalakrishna & #BoyapatiSrinu‘s film #Akhanda ? Post production works in full swing, Roaring? in cinemas soon#AkhandaShootWrapped#BB3 @ItsMePragya @MusicThaman @actorsrikanth @IamJagguBhai @dwarakacreation #MiryalaRavinderReddy pic.twitter.com/SKNzH6M0Bd
ప్రతీ సందర్భంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వేసే ట్వీట్ లు ప్రతీ ఒక్కరినీ ఎట్రాక్ట్ చేస్తుంటాయి. కొంత చాలా ప్రత్యేక సమయాల్లో మాత్రమే ట్వీట్ లు చేస్తుంటారు. అలా చేసే ట్వీట్ లు అటెన్షన్ క్రియేట్ చేస్తుంటాయి. ఏదైనా నచ్చిన బాగా మెచ్చిన సినిమా విషయంలోనే.. ఎవరిని అయినా అభినందించాల్సిన సమయంలోనో.. లేదా పాపులర్ సెలబ్రిటీలు మృతి చెందితేనో మన సెలబ్రిటీలు ట్వీట్ చేస్తుంటారు. రాజకీయాలపై మాత్రం చాలా అరుదుగా స్పందిస్తుంటారు. ఎలా స్పందిస్తే అది ఎటు దారితీస్తుందోఅని ఆలోచించి మరీ స్పందిస్తుంటారు. కొంత మంది ఇవన్నీ ఏవీ ఆలోచించకుండానే ట్వీట్ లు చేసేస్తుంటారు. వివాదాల్లో ఇరుక్కుంటుంటారు. అయితే తాజాగా బుధవారం స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ని ఏపీ నుంచి రాజ్య సభకు నామినేట్ చేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో తమిళనాడు నుంచి మాస్ట్రో ఇళయరాజాని పీటీ ఉషను రాజ్య సభకు ఎంపీలుగా నామినేట్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. దీనిపై చాలా మంది సినీ సెలబ్రిటీలు ట్వీట్ ల వర్షం కురిపించారు. మరీ ప్రధానంగా తెలుగు రైటర్ విజయేంద్రప్రసాద్ ని రాజ్యసభకు ఏపీ నుంచి నామినేట్ చేయడంపై కొంత మంది విమర్శలు చేస్తే మరి కొంత మంది ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ లు చేశారు. అందులో సినీ సెలబ్రిటీలు కూడా వున్నారు. అయితే ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు లేకపోవడం ఆసక్తికర చర్చకు దారితీసింది. రాజమౌళికి ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా పేరున్న ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. రాజమౌళితో కలిసి ఎన్టీఆర్ స్టూడెంట్ నెం.1 సింహాద్రి యమదొంగ ట్రిపుల్ ఆర్ చిత్రాల్లో నటించాడు. ఈ సినిమాల్లో సింహాద్రి యమదొంగ ట్రిపుల్ ఆర్ లకు విజయేంద్ర ప్రసాద్ కథలు అందించారు. ఇక రామ్ చరణ్ మగధీర 'ట్రిపుల్ ఆర్' చిత్రాలతో రాజమౌలి ఫ్యామిలీకి దగ్గరయ్యారు. ఫ్యామిలీ వ్యక్తి అయ్యారు. ఇలా రాజమౌళి ఫ్యామిలీతో అనుబంధం వున్న ఈ ఇద్దరు హీరోలు విజయేంద్ర ప్రసాద్ పై ట్వీట్ లు చేయకపోవడం నెట్టింట వైరల్ గా మారింది. సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు చనిపోయిన విషయం తెలిసి ట్వీట్ లు వేసిన ఈ ఇద్దరు హీరోలు రాజమౌళి ఫాదర్ విషయంలో మాత్రం ట్వీట్ చేయకపోవడంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇదిలా వుంటే విజయేంద్ర ప్రసాద్ గురించి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ట్విట్ చేయకపోవడం పలువురికి షాకిస్తోంది. పవన్ నా అభిమాన హీరో అని మాట్లాడిన ఆయన గురించి ట్వీట్ చేయకపోవడం ఏంటని అంతా విస్తూ పోతున్నారట. మరి ఇప్పటికైనా స్టార్ హీరోలు స్పందిస్తారో లేదో చూడాలని నెట్టింట జోరుగా ప్రచారం నడుస్తోంది. Tupaki TAGS: TollywoodFilms SSRajamouliFather VijayendraPrasad BahubaliWriter PawanKalyan VijayendraRajyaSabhaNomination PawanKalyan NTR Ramcharan
అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం పర్యవేక్షించడం ద్వారా నిర్దేశించిన మేరకు లక్ష్యాలను అధిగమించొచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ జిల్లా కలెక్టర్‌ని ఆదేశించారు. సచివాలయం నుంచి ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కి హాజరైన కలెక్టర్‌, జేసీ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 జిల్లా అధికారులకు సీఎస్‌ సమీర్‌ శర్మ ఆదేశాలు గుంటూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం పర్యవేక్షించడం ద్వారా నిర్దేశించిన మేరకు లక్ష్యాలను అధిగమించొచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ జిల్లా కలెక్టర్‌ని ఆదేశించారు. గురువారం వెలగపూడి సచివాలయం నుంచి గృహనిర్మాణం, భూముల రీసర్వే, సచివాలయాలు, స్పందన అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్‌ సమీర్‌శర్మ మాట్లాడుతూ పేదలందరికి ఇళ్ల పథకం లేఅవుట్లలో నిర్దేశించిన మేరకు ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. సమగ్ర భూ సర్వేకి సంబంధించి సర్వే ముమ్మరంగా నిర్వహించాలన్నారు. సచివాలయాలు, స్పందన ద్వారా ప్రజలు అందిస్తున్న అర్జీలను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలన్నారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతి పైనా సీఎస్‌ సమీక్షించారు. ప్రభుత్వ ప్రాధాన్య భవనాలను పూర్తి చేయాలి ప్రభుత్వ ప్రాధాన్య భవనాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ అహ్మద్‌ బాబు, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏపీఎంఎఫ్‌సీ, ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణం, జగనన్న పాల వెల్లువ అంశాలపై ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సమీక్షించారు. ఈ సందర్భంగా అహ్మద్‌బాబు మాట్లాడుతూ జనన్న పాలవెల్లువకు సంబంధించి ఏఎంసీయూ, బీఎంసీయూల భవనాలను పూర్తి చేయాలన్నారు. మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్నా మాట్లాడుతూ ఏపీఎంఎఫ్‌సీ భవనాలకు సంబంధించి తొలి దశ నిర్మాణాలు 100 శాతం గ్రౌండింగ్‌ చేయాలన్నారు. రెండో దశలో మంజూరు చేసిన భవనాలకు నిర్దేశించిన నిబంధనల ప్రకారం స్థలాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, జేసీ గణియా రాజకుమారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ నిధి మీనా, జిల్లా సహకార శాఖ అధికారి వీరాచారి, పశుసంవర్థక శాఖ జేడీ జేపీ వెంకటేశ్వర్లు, సీపీవో శేషశ్రీ, సచివాలయాల ఇన్‌చార్జి అధకారిణి గీతరాణి, ఆర్‌డీవో ప్రభాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.
నేటి యువకుల్లో కండలు పెంచి దృఢంగా కనిపించాలన్న కోరిక చాలామందిలో ఉంటుంది. అందుకే జిమ్ కు వెళ్లి భారీ కసరత్తులు చేస్తుంటారు. కొందరు త్వరగా కండలు పెరిగేందుకు మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు కూడా తీసుకుంటారు. అయితే, ఈ ఇంజెక్షన్లు అతిగా వాడితే ప్రాణాలకు ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెఫెంటెర్మైన్ ఇంజెక్షన్లు యాంటీ హైపోటెన్సివ్స్ కేటగిరీలోకి వస్తాయి. లో బీపీ (హైపోటెన్షన్) ఉన్నవారికి చికిత్సలో భాగంగా వీటిని వినియోగిస్తారు. అంతేకాదు, శస్త్రచికిత్స సమయాల్లో రోగి హృదయ స్పందనను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కూడా ఈ ఇంజెక్షన్లను ఉపయోగిస్తారు. కానీ వీటిని బాడీబిల్డర్లు మరింత స్టామినా కోసం, కండరాల పెరుగుదల కోసం ఉపయోగిస్తున్నట్టు వెల్లడైంది. ఈ ఇంజెక్షన్లను సుదీర్ఘకాలం వాడడం వల్ల హైబీపీ, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బలహీనత, మగత, నిద్రలేమి, వికారం, వాంతులు, కొన్నిసార్లు గుండెపోటుతో మరణాలు కూడా సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించితే ఈ ఇంజెక్షన్ హృదయ స్పందనను దెబ్బతీస్తుందని వివరించారు. పుణేలో ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పలు చోట్ల దాడులు చేసి 246 ఇంజెక్షన్ వయల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంజెక్షన్ ధర రూ.299 కాగా, కొందరు వ్యక్తులు జిమ్ ఔత్సాహికుల కోసం వీటిని ఒక్కొక్కటి రూ.1000 చొప్పున విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వీటిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పైనే విక్రయించాల్సి ఉంటుందని, మెడికల్ ప్రాక్టీషనర్లతోనే ఈ ఇంజెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. Muscle Growth Injections Heart Attack Health Experts Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?..... We are here for YOU: Team ap7am.com
సినిమా స్క్రిప్ట్ & రివ్యూ : 07/04/17 .Header h1 { font: normal normal 90px Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; color: #ffff00; } .Header h1 a { color: #ffff00; } .Header .description { font-size: 130%; } /* Tabs ----------------------------------------------- */ .tabs-inner { margin: 1em 0 0; padding: 0; } .tabs-inner .section { margin: 0; } .tabs-inner .widget ul { padding: 0; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; } .tabs-inner .widget li { border: none; } .tabs-inner .widget li a { display: inline-block; padding: 1em 1.5em; color: #ffffff; font: normal bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; } .tabs-inner .widget li.selected a, .tabs-inner .widget li a:hover { position: relative; z-index: 1; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } /* Headings ----------------------------------------------- */ h2 { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #00ffff; } .main-inner h2.date-header { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #0f0e0c; } .footer-inner .widget h2, .sidebar .widget h2 { padding-bottom: .5em; } /* Main ----------------------------------------------- */ .main-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner .section { margin: 0 20px; } .main-inner .column-right-inner { margin-left: 20px; } .main-inner .fauxcolumn-right-outer .fauxcolumn-inner { margin-left: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner { margin-right: 20px; } .main-inner .fauxcolumn-left-outer .fauxcolumn-inner { margin-right: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner, .main-inner .column-right-inner { padding: 15px 0; } /* Posts ----------------------------------------------- */ h3.post-title { margin-top: 20px; } h3.post-title a { font: italic bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #b02ef1; } h3.post-title a:hover { text-decoration: underline; } .main-inner .column-center-outer { background: #ffffff none repeat scroll top left; _background-image: none; } .post-body { line-height: 1.4; position: relative; } .post-header { margin: 0 0 1em; line-height: 1.6; } .post-footer { margin: .5em 0; line-height: 1.6; } #blog-pager { font-size: 140%; } #comments { background: #cccccc none repeat scroll top center; padding: 15px; } #comments .comment-author { padding-top: 1.5em; } #comments h4, #comments .comment-author a, #comments .comment-timestamp a { color: #b02ef1; } #comments .comment-author:first-child { padding-top: 0; border-top: none; } .avatar-image-container { margin: .2em 0 0; } /* Comments ----------------------------------------------- */ #comments a { color: #b02ef1; } .comments .comments-content .icon.blog-author { background-repeat: no-repeat; background-image: url(); } .comments .comments-content .loadmore a { border-top: 1px solid #b02ef1; border-bottom: 1px solid #b02ef1; } .comments .comment-thread.inline-thread { background: #ffffff; } .comments .continue { border-top: 2px solid #b02ef1; } /* Widgets ----------------------------------------------- */ .sidebar .widget { border-bottom: 2px solid #f1d08f; padding-bottom: 10px; margin: 10px 0; } .sidebar .widget:first-child { margin-top: 0; } .sidebar .widget:last-child { border-bottom: none; margin-bottom: 0; padding-bottom: 0; } .footer-inner .widget, .sidebar .widget { font: normal normal 14px Georgia, Utopia, 'Palatino Linotype', Palatino, serif; color: #ffe599; } .sidebar .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .sidebar .widget a:visited { color: #6ef12e; } .sidebar .widget a:hover { color: #c1c1c1; text-decoration: underline; } .footer-inner .widget a:link { color: #3630f4; text-decoration: none; } .footer-inner .widget a:visited { color: #000000; } .footer-inner .widget a:hover { color: #3630f4; text-decoration: underline; } .widget .zippy { color: #ffffff; } .footer-inner { background: transparent none repeat scroll top center; } /* Mobile ----------------------------------------------- */ body.mobile { background-size: 100% auto; } body.mobile .AdSense { margin: 0 -10px; } .mobile .body-fauxcolumn-outer { background: transparent none repeat scroll top left; } .mobile .footer-inner .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .mobile .footer-inner .widget a:visited { color: #6ef12e; } .mobile-post-outer a { color: #b02ef1; } .mobile-link-button { background-color: #3630f4; } .mobile-link-button a:link, .mobile-link-button a:visited { color: #ffffff; } .mobile-index-contents { color: #444444; } .mobile .tabs-inner .PageList .widget-content { background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } .mobile .tabs-inner .PageList .widget-content .pagelist-arrow { border-left: 1px solid #ffffff; } sikander777 --> సినిమా స్క్రిప్ట్ & రివ్యూ రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు... టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం! Tuesday, July 4, 2017 డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు -4 సినిమాల్ని కేవలం వినోదించడానికే ‘చూస్తాం’, కాబట్టి ‘చదవం’. సినిమాల్ని కేవలం ‘చూస్తున్నప్పుడు’ చాలా ఆణిముత్యాలు చేజారిపోతాయి. సినిమాల్లోని మంచో చెడో పూర్తిగా అనుభవం కాకుండా అరకొర ఫేక్ ‘వినోదం’ తో సంతృప్తి పడిపోతాం. సినిమాల్ని ‘చదువుతూ చూసినప్పుడు’ చాలా ఆణిముత్యాలు దొరుకుతాయి మంచో చెడో. అవి పూర్తి ఆనందాన్నిస్తాయి. మంచికి ఎలాగూ ఆనందమే, చెడుకి లోపం పట్టుకున్నామన్నఆనందం. మంచి కనిపిస్తే మనసుకి ఆనందం, చెడు కన్పిస్తే బుద్ధికి ఆనందం. అప్పుడే పరిపూర్ణ ఆనందం. బుద్ధిని ఇంట్లో వదిలి వచ్చి మనసుతో సినిమాలు చూస్తూంటే, ఇంటి దగ్గరున్న బుద్ధి- ఒరేయ్ మధ్యాహ్నం నువ్వు కేబుల్ వాడికి డబ్బులు కడతానన్నావ్, ఎక్కడి కెళ్లావ్ రా?... ఒరేయ్ బైక్ వాషింగ్ చేయించడం ఎగ్గొట్టి సినిమా కేసు కెళ్తావా?... ఒరేయ్ వీధి కుక్కలు వెంటాడితే ఈ నైట్ కూడా బైక్ స్పీడు లాగించి చావకు రొరేయ్ ....అని రకరకాల స్క్రోలింగ్స్ ఇస్తూ సినిమాని సరీగ్గా చూడనివ్వదు. అదే బుద్ధిని కూడా సినిమాకి లాక్కొస్తే అది మనసుతో బాటు కూర్చుని బుద్ధిగా సినిమా ఒకటే చూస్తుంది. అప్పుడు పరిపూర్ణ ఆనందం అనుభవం లోకొస్తుంది. ఈ క్షణంలో జీవించు అనే కదా సూక్తి? జీవించడమంటే మెదడూ మనసూ ఒకటి చేసుకుని అనుభవాల్ని ద్విగుణీకృతం చేసుకోవడమే. సినిమాని చదవడమంటే ఏమిటి? ఉదాహరణకి క్రిందటి వ్యాసంలో చెప్పుకున్న ‘బ్లడ్ సింపుల్’ ఆరవ సీను పెంపుడు కుక్క ఇంట్లోకి రావడంతో ప్రారంభమవుతుంది, హీరోయిన్ ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ముగుస్తుంది. ఈ ప్రారంభ ముగింపులు ఎంత అర్ధాన్నిస్తున్నాయి! విశ్వాసం గల కుక్క ఇంట్లోకొస్తూంటే, విశ్వాసం లేని భార్య (హీరోయిన్) ఇంట్లోంచి ప్రియుడితో వెళ్ళిపోతోంది... ఎంత కదిలించే, పోయెటిక్ ప్రారంభ ముగింపులు! ఇదెప్పుడు అర్ధమవుతుంది? వెండి తెర మీద దీన్ని చూడడమే గాక, చదివి నప్పుడు కూడా. అలాగే ఇదే సీనులో హీరోయిన్ రివాల్వర్ కోసం చాలా హేండ్ బ్యాగులు వెతుకుతుంది. ఎందుకు అన్ని బ్యాగులు వెతకాలి. ఓ రెండు బ్యాగులు, ఆ తర్వాత పెట్టెలు, సొరుగులూ వెతికినట్టు చూపించ వచ్చుగా? అలా చూపిస్తే అది సినిమా జ్ఞానం అన్పించుకుంటుందా? సినిమా జ్ఞానం లెక్కలు వేరే వుంటాయి. ఏది చూపించినా అది పాత్రకో కథనానికో ఉపయోగపడాలి. ఒక సీను మూల సూత్రమేమిటి? పాత్ర గురించి సమాచార మివ్వడమో, లేదా కథని ముందుకి నడిపించడమో కదా? లేదూ ఈ రెండూ చేయడం కూడా కదా? అప్పుడు ఈ సీనులో హీరోయిన్ క్యారక్టర్ గురించి చెప్పాల్సింది ఏదైనా మిగిలుంటే అది చెప్పడానికే ప్రాధాన్యమిచ్చారు ఇక్కడ కోయెన్ బ్రదర్స్. బోలెడు హేండ్ బ్యాగులు పడేసి, అవే వెతుకుతున్నట్టు చూపిస్తే, అన్నేసి బ్యాగుల్ని చూస్తున్న మనకి, ఆమె బాహ్య చర్యలకి ( వివాహేతర సంబంధం పెట్టుకోవడం), లోపలి మనస్తత్వం తెలుస్తోంది. సైకలాజికల్ గా ఈ హేండ్ బ్యాగుల అబ్సెషన్ ని బట్టే తను ఇంటిపట్టున వుండే మనిషి కాదని చెప్పకనే చెప్తోంది... ఇది ముందే చూపించకుండా ఇప్పుడెందుకు చూపిస్తున్నారు దర్శకులు? అసలు మూడో సీనులో మోటెల్ లో ప్రియుడితో ఈమె ఫలానా ఈ రకమని చూపించేశాక, ఇంకా ఈమె అంతరంగాన్ని ఫిజికల్ గా ఎస్టాబ్లిష్ చేయడం అవసరమా? చేస్తేనే ఈమె పాల్పడుతున్న చర్యల్ని పక్కాగా నమ్మగలం. మానసిక స్థితే భౌతిక స్థితికి సర్టిఫికేట్ ఇస్తుంది. ఇక ఇదిప్పుడే ఎందుకు వెల్లడి చేయాలంటే, ఇప్పుడు ఫైనల్ గా ఇల్లు వదిలి వెళ్ళిపోతోంది గనుక. ఇల్లువదిలే ఘట్టంలోనే స్వాభావికంగా ఆమె ఎలాటి మనిషో వెల్లడించడం సీనుకి చైతన్యం తెచ్చే డైనమిక్స్. 2000 లో జేమ్స్ మొనాకో ‘హౌ టు రీడ్ ఏ ఫిలిం’ అని గొప్ప గ్రంథం రాశాడు. దీని పీడీఎఫ్ ఫ్రీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సినిమాల్ని చదివే (స్క్రిప్టులు కాదు, స్క్రీన్ మీద) పధ్ధతి తెలుస్తుంది. *** ఆర్డర్ లో సీన్ 7 లోకి వెళ్తే, రే బార్ కెళ్ళి జీతం డబ్బులు అడిగి మార్టీ ని రెచ్చ గొట్టడం. ఈ సీను ప్రారంభం స్క్రిప్టు కీ, చిత్రీకరణకీ తేడా వుంది. స్క్రిప్టులో రే నేరుగా బార్ లోకి వచ్చి బార్ టెండర్ మారీస్ ని కలిసినట్టు రాశారు. చిత్రీకరణలో మారీస్ ఫ్రెండ్ దెబ్రాతో మళ్ళీ అదే అగ్నిపర్వతాల గురించి మాట్లాడుతూంటే, రే వస్తాడు. చిత్రీకరణలో చేసిన ఈ మార్పు మంచి డైనమిక్సే. బద్ధలవబోయే అగ్నిపర్వతంలా వున్న మార్టీ దగ్గరకి రిస్కు చేసి రే వచ్చిన అర్ధంలో వుంది. వెనక సీనులో బార్ కి వెళ్లనని ఎబ్బీ కి చెప్పాడు. బార్ కే వచ్చాడు. ఇప్పుడు మారీస్ తో మాట్లడుతోంటే, బ్యాక్ గ్రౌండ్ లో ఒక లోగో కన్పిస్తూంటుంది. అది మార్టీ హంటర్ షూ లోగో. అంటే బూటు కాలితో కిక్ ఇవ్వబోతున్నాడా మార్టీ ఇప్పుడు రేకి ? ఇలా ఒక ప్రశ్న రేకెత్తిస్తూ సీను ప్రారంభిస్తున్నారు కోయెన్ బ్రదర్స్. కొంత సంభాషణ జరిగాక, మార్టీ వున్నాడా- అని మారీస్ ని అడుగుతాడు. లేడు - నిన్నకూడా లేడు , వెనక ఆఫీసులో అసలే లేడు - అని చెప్పేస్తూంటాడు మారీస్. రే థాంక్స్ చెప్పి వెళ్లిపోతూంటే, ఎందుకు థాంక్స్? అంటాడు మారీస్ అర్ధంగాక. తను చెప్పిందాంట్లోనే సమాధానం వుందని తెలీదు- వెనక ఆఫీసులో అసలే లేడంటే ఏమనుకోవాలి? ఇప్పుడు బార్ బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే, తెరచి వున్న బ్యాక్ ఆఫీసు ‘డోర్ ఫ్రేం’ బ్యాక్ డ్రాప్ లో కూర్చుని మార్టీ, ఆఫ్ స్క్రీన్ లో తదేకంగా దేన్నో చూస్తూంటాడని రాశారు. ఇక్కడ ‘డోర్ ఫ్రేం’ అనే నోయర్ ఎలిమెంట్ ని వాడారు. డోర్ ఫ్రేం నేపధ్యంలో పాత్రని చూపించడమంటే పాత్ర బందీ అయినట్టు చెప్పడం. అతను అటు ఏం చూస్తున్నాడో అతడి పాయింటాఫ్ వ్యూలో ఓపెన్ అవుతుందని రాశారు- అటు దూరంగా భగభగ మండుతున్న ఫర్నేస్ లో ఇద్దరు మనుషులు గార్బేజ్ ని వేస్తూంటారు. ఇది మార్టీ గుండె మంటకి ప్రతీక కాదు, అగ్నిపర్వతానికి సింబాలిజం కూడా కాదు. ఎందుకంటే ఆ ఫర్నేస్ లో గార్బేజ్ (చెత్త) వేసి కాల్చేస్తున్నారు. మనం ఒకటి అనుకుంటే చాలా నేర్పుగా పాత్రకి అవసరమైన, కథకి అవసరమైన కొత్త డెవలప్ మెంట్ ని దృష్టికి తెస్తున్నారు కోయెన్ బ్రదర్స్. అవును, ఇప్పుడు ఇది చెప్పడమే అవసరం. ఎటూ తేల్చుకోలేక అస్థిమితంగా వున్నట్టు గతంలో చూపించిన మార్టీని ఇప్పుడు ఒక కొలిక్కి తెస్తున్నారు ఇంకా నాన్చకుండా. మన తెలుగు ప్రేమ సినిమాల్లో మనసులో మాట చెప్పలేక హీరోనో, హీరోయినో సినిమా చివరిదాకా ప్రేక్షకుల్ని ఏడ్పించినట్టు గాక- మార్టీ సమస్యని కొలిక్కి తెచ్చి, కథ ముందుకు సాగడానికి ఈ సీనులో ఏర్పాటు చేశారు కోయెన్ బ్రదర్స్. అతను డిసైడ్ అయిపోయాడు. మనసులోని చెత్తంతా ఊడ్చేసి కొలిమిలో కాల్చేస్తున్నాడు! భార్యతో ఇక రాంరాం. అదీ అర్ధం! ఈ క్యారక్టర్ మన్నుతిన్న పాములా పడి లేదు. కథ ముందుకు సాగడానికి క్యారక్టర్ డెవలప్ మెంట్ (ఆర్క్) ని కనబరుస్తోంది. మనసులో చెత్త కాల్చేస్తున్నాక ఇప్పుడేమిటి? –అని తదుపరి విషయాన్ని కదుపుతోంది. మనసుంటే ఒక్క సీనులో చెప్పకనే చాలా విషయాలు చెప్పవచ్చు. బోరు కొట్టించకుండా కథ ముందుకు వెళ్తోందనే ఆశాభావాన్ని కల్పించవచ్చు. భార్య గురించి మార్టీ ఫైనల్ వెర్షన్ ఇప్పుడతని మాటల్లోనే తెలుసుకోవచ్చు... ఇప్పుడు మార్టీ వెనక డోర్ లోంచి రే వస్తూంటాడని రాశారు. ఆ వస్తున్నప్పుడు అతణ్ణి చూపించడం నడుం వరకే చూపించారు. ఆ డోర్ ఫ్రేం లోనే మార్టీ తో సీను ఓపెన్ చేశాక, ఇప్పుడు అదే డోర్ ఫ్రేం లోంచి రే వస్తున్నట్టు రాశారు. ఇద్దరూ ఒక చక్రబంధంలో ఇరుక్కుంటున్న మనుషులే నన్నమాట. అదెలా? - అన్న ప్రశ్నతో సస్పెన్స్ ని రేకెత్తిస్తున్నారు ఈ తరహా రైటింగ్ తో, చిత్రీకరణతో. వస్తూనే - మార్టీ? - అంటాడు రే. మోటెల్ లో ఎబ్బీతో వున్నప్పుడు మార్టీ ఫోన్ చేసినప్పుడే అతడికి తెలిసిపోయిందని తెలిసీ రే ఇలా రావడం, పైగా ఎబ్బీని తన ఇంటికి తీసికెళ్ళి పోయే తీవ్ర నిర్ణయం తీసుకునీ రావడం, అదీ జీతం డబ్బుల కోసం – చాలా సిగ్గులేని తనం. ఇలాగే వుంటాయి నోయర్ పాత్రలు. తాము చేస్తున్నవి నార్మల్ అనుకుంటాయి. మార్టీ ముందుకొచ్చి- ఓకే, ఏంటి? – అంటాడు రే. ఏంటి ఏంటి? – అంటాడు మార్టీ. పీకేశావా నన్ను? కక్ష తీర్చుకుంటున్నావా?- అని రే అంటే, నిజంగా నీతో మాట్లాడాలని లేదు నాకు- అంటాడు మార్టీ. ఓకే, నువ్వు నన్ను పీకేయ్యకపోతే నేనే పని మానుకుని వెళ్లి పోతానంటాడు రే. ఫైన్, నీకు నచ్చింది చెయ్, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావ్ ?- అని కవ్విస్తాడు మార్టీ. టెన్షన్ గా చూసి, క్షణం తర్వాత రే - ఇలా మాట్లాడ్డం నాకు నచ్చదు- అంటాడు. అయితే దేని కొచ్చావిక్కడికి? –మార్టీ ప్రశ్న. ఏమాత్రం రాజీపడే ఉద్దేశంలేక- నాకు నువ్వు రెండు వారాల జీతం బాకీ- అనేస్తాడు రే. మార్టీ తలవిదిల్చి- నో, ఆమె చాలా కాస్ట్లీ గుంట...అనుకుని, ఫైనల్ గా రే వైపు చూసి- నేను రీఫండ్ ఇస్తా, అదింకెవర్ని పిండుకుంటోందో చెప్పు- అంటాడు. వ్యాపారిలా మారిపోయాడు మార్టీ లాభ నష్టాలు చూసుకుంటూ. ఇప్పుడంతే, భార్యాభర్తల సంబంధం తెంచుకున్నాక! భార్య తన షోకులతో ఆర్ధికంగా తనకి చాలా భారమై వుంటుంది. భరించాడు. ఇప్పుడామె ప్రియుణ్ణి చూసుకుంటే, ఆ ప్రియుడికి తను జీతం డబ్బులిస్తే,ఆమెకిచ్చినట్టే. ఇంకా ఆమె మీద వేస్ట్ ఎందుకు చేసుకుంటాడు? అందుకే ఎగ్గొడతాడు. ఇదీ వరస! ఐతే ఒక ఆఫర్ ఇచ్చాడు - నా భార్యని వాడుకుంటున్నందుకు, జీతం రూపంలో నువ్వు వదులుకున్న నీ డబ్బుని నీకు రీఫండ్ ఇస్తా- అదింకెవర్ని పిండుకుంటోందో నువ్వు చెబితే!- అని. ఇవన్నీ కసికొద్దీ అంటున్న మాటలే- పనిలోపనిగా ఎబ్బీ మీద రే కి అనుమానాలు రేకెత్తించడం కూడా జెలసీతో! నాకా డబ్బుకావాలి, నువ్వింకేదైనా చెబితే మంచిదే- అంటాడు రే పట్టువదలకుండా. ఎవరనుకుంటున్నావ్ నువ్వు- మ్యారేజ్ కౌన్సెలర్ వా?- అని తిప్పికొడతాడు మార్టీ. ఈ మాటకి వచ్చీ రాని స్మైల్ ఇస్తాడు రే. ఇప్పుడు మార్టీలో కోపం పెరుగుతూ- దేనికి నవ్వుతావ్? ఫన్నీ గైలా కన్పిస్తున్నానా? యెదవలా కన్పిస్తున్నానా? నో నో నో నో- ఫన్నీగా వున్నది నేను కాదు, ఫన్నీగా వున్నది నీ లవర్. నేను మీ ఇద్దరి మీద నిఘా పెట్టించాను చూడూ అదీ ఫన్నీ. ఎందుకంటే నువ్వు కాకపోతే అదింకొకడితో పడుకునేదే, కాబట్టీ అదీ ఫన్నీ. నీకింకా చాలా ఫన్నీగా ఎప్పుడన్పిస్తుందంటే, ఏంటీ రే నువ్వు మాట్లాడుతున్నదీ... ఫన్నీగా నేనేం చేశాననీ? అని అమాయకంగా అది మొహం పెట్టి అంటుంది చూడూ, అప్పుడూ! – అని కసికసిగా అనేస్తాడు. ఈ డైలాగులతో ఇక్కడ మనమనుకుంటున్న కథ, పాత్రలు చాలా వూహించని మలుపులు తిరగడం ఆశ్చర్యమేస్తుంది... ఇప్పుడు- ఇప్పుడు- అసలు డ్రామా ఎస్టాబ్లిష్ అవుతోంది. కచ్చితంగా ఎవరేమిటో తేలిపోతోంది. ఎవగింపు కలిగే పాత్ర సానుభూతిని మూట గట్టుకుంటూ, సానుభూతి పొందిన పాత్ర ఏవగింపుని సంపాదించుకుంటోంది...హీరోయిన్ ని నెగెటివ్ గా చూపించడం కమర్షియల్ సినిమా లక్షణం కాదని చెబుతోందీ సీను. చెడ్డది- చెడ్డది- చెడ్డదీ - అనుకుంటున్న హీరోయిన్ పాత్ర గుడ్ అయిపోతోంది, గుడ్ -గుడ్ -గుడ్ -అనుకుంటున్న భర్త పాత్ర చెడ్డదిగా బయటపడుతోంది... ఇదీ నిజమైన డ్రామా అంటే. కేవలం ఒక డైలాగు, ఒక నిగూఢార్ధం, ఒక ఎలిమెంట్ మొదలైనవి చాలా మ్యాజిక్కులు చేస్తూ కథని రక్తి కట్టిస్తున్నాయి. ఇప్పుడు మార్టీ వెళ్లగక్కుకుంటున్న అక్కస్సుతో మనకేమైనా సానుభూతి కలుగుతోందా? అస్సలు లేదు. ఫూలిష్ గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే, రెండవ సీన్లో వర్షంలో కారులో పోతున్నప్పుడు- మా ఆయన మూడీగా అదోలా వుంటాడు- అని రే తో అంది ఎబ్బీ. అదీ డబ్బున్న మార్టీ ని వదిలేసి, సామాన్యుడైనా సరే రే ని చూసుకోవడానికి ఆమెకి గల కారణం! మార్టీ ఏమో అది నా డబ్బుని ఎంజాయ్ చేసి హేండ్ ఇచ్చిందను కుంటున్నాడు. ఆమెకి డబ్బే ముఖ్యమనుకుంటే మార్టీ డబ్బునే ఎంజాయ్ చేస్తూ మార్టీతోనే వుండేది. డబ్బుకన్నా మానసిక తృప్తే ముఖ్యమనుకుంది గనుక, అది మూడీ మార్టీతో లభించక హేండ్ బ్యాగుల అబ్సెషన్ మొదలై, బయట షికార్లు కొట్టింది. ఇంట్లో సుఖమంటే బయట షికార్లు ఎందుకు తిరుగుతుంది. కాబట్టి ఆమె హేండ్ బ్యాగుల అబ్సెషన్ కి అసలు కా మేమిటో ఇప్పుడు బయట పడ్డాక- సానుభూతి ఆమెకి లభిస్తుంది. డబ్బులేని వాడు రే అయినా సరే అతడితో వెళ్ళిపోయింది...దీనికంతటికీ బాధ్యుడైన మార్టీ మంచి వాడనే పేరుని కోల్పోయాడు. మార్టీ అక్కస్సుతో, రే చేస్తున్నది తప్పనిపించదు ఈ డైలాగుల తర్వాత. ఇలా మంచి వాళ్ళెవరు- చెడు ఎవరు - బలాబలాల సమీకరణ ఫైనల్ గా ఈ సీనుతో పూర్తయింది. భార్యతో వుండే అర్హత మార్టీకి లేదు, రేకే వుందని లాజికల్ గా సమర్ధిస్తూ. ఇక ఫైనల్ గా తేల్చి చెప్తున్నప్పుడు మార్టీ అగ్నిపర్వతం బద్దలైనట్టే బరస్ట్ అవుతాడు. మాట్లాడకుండా వెళ్ళిపోతాడు రే. మళ్ళీ ఇటు వస్తే షూట్ చేస్తానంటాడు మార్టీ. ఇదంతా ప్రేలాపనే అన్పిస్తుంది మనకి. ఈ సీనుతో కథలో టెన్షన్ తీవ్రత కూడా పెరిగింది. అంటే టైం అండ్ టెన్షన్ థియరీ అమలవుతోంది. స్క్రీన్ టైం గడిచేకొద్దీ అంతకంతకూ కథలో టెన్షన్ పెరుగుతూ పోవడం టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ ని ఏర్పరుస్తుంది. సీను సీనుకీ టెన్షన్ ఎంతెంత పెరుగుతోందో ఈ గ్రాఫ్ ద్వారా మానిటర్ చేయడం ముఖ్యం! - సికిందర్ http://www.cinemabazaar.in/ Posted by సికిందర్ at 9:56:00 PM Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Newer Posts Older Posts Home Subscribe to: Posts (Atom) ఈ కాన్సెప్ట్ కి బాధితురాలి కథ అవసరం! స్క్రీన్ ప్లే సంగతులు...? Search This Blog contact msikander35@gmail.com, whatsapp : 9247347511 Popular Posts 1255 : రివ్యూ! రచన- దర్శకత్వం : శైలేష్ కొలను తారాగణం : అడివి శేష్ , మీనా క్షీ చౌదరి , కోమలీ ప్రసాద్ , రావు రమేష్ , శ్రీకాంత్ అయ్యంగార్ , తనికెళ్ళ భర... 1257 : రివ్యూ! 2023 లో జరిగే 95 వ ఆస్కార్ అవార్డ్స్ కి మన దేశం తరపున అధికారిక ఎంట్రీ పొందిన గుజరాతీ చలన చిత్రం ‘ చెల్లో షో ’ (చివరి షో) అక్టోబర్... 1260 : రివ్యూ! దర్శకత్వం : అమర్ కౌషిక్ తారాగణం : వరుణ్ ధావన్ , కృతీ సానన్ , దీపక్ దోబ్రియాల్ , పాలిన్ కబాక్ , అభిషేక్ బెనర్జీ తదితరులు. రచన : నీరేన్ భట్ , ... 1258 : సండే స్పెషల్ రివ్యూ! ‘ చాం దినీ బార్ ’ (ముంబాయి బార్ గర్ల్స్ జీవితాలు) , ‘ పేజ్ త్రీ ’ (ఉన్నత వర్గాల హిపోక్రసీ ) , ‘ కార్పొరేట్ ’ (కార్పొరేట్ రంగం... 1259 : రివ్యూ! రచన - దర్శకత్వం : చెల్లా అయ్యావు తారాగణం : విష్ణు విశాల్ , ఐశ్వ ర్యా లక్ష్మి , కరుణాస్ , శ్రీజా రవి , మునిష్కాంత్ తదితరులు సంగీతం : జస్... రైటర్స్ కార్నర్ హై కాన్సెప్ట్ స్క్రిప్ట్ అంటే బిగ్ కలెక్షన్స్ ని రాబట్టే స్క్రిప్ట్. ఈ ఆర్టికల్ లో మీకు బిగ్ కలెక్షన్స్ ని సాధించి పెట్టే హై కాన్స... 1254 : రివ్యూ! రచన - దర్శక త్వం : ప్రదీప్ రంగనాథన్ తారాగణం : ప్రదీప్ రంగనాథన్ , సత్యరాజ్ , యోగి బాబు , ఇవానా , రాధి కా శరత్‌కుమార్ , రవీనా తదితరులు సంగీ త... (no title) ప్ర తిభ నిరూపించుకోవడానికి షార్ట్ ఫిలిమ్సే కాదు, డాక్యుమెంటరీ లనే విభాగం కూడా వుంది. ఐతే ఇది సామాజిక బాధ్యతలతో కూడుకున్నది. వివ... తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17 స్క్రీ న్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసల... 1256 : రివ్యూ! రచ న -దర్శక త్వం : ఆనంద్ జె తారాగణం: రావణ్ రెడ్డి , శ్రీ ని ఖి త , లహ రీ గుడివాడ , రవీంద్ర బొమ్మకంటి , అమృత వర్షిణి తదిత తరులు సంగీతం: ఫ...
హైదరాబాద్: చాలా బాధతో కాంగ్రెస్ పార్టీతో తాను బంధాన్ని తెంచుకొంటున్నట్టుగా మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరణకు గురైన తర్వాత మర్రి శశిధర్ రెడ్డి మంగళవారంనాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా బాధతో కాంగ్రెస్ తో బంధం తెంచుకుంటున్నానన్నారు.కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. సోనియాగాంధీకి కూడా ఈ విషయమై లేఖను రాసినట్టుగా శశిధర్ రెడ్డి వివరించారు. ఈ పరిస్థితి వస్తుందని తాను ఏనాడూ ఊహించలేదని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. ఇవాళ్టి నుండి కాంగ్రెస్ పార్టీ హోంగార్డుగా తాను ఉండడం లేదని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారనే అపవాదు ప్రజల్లోకి వెళ్లిందని మర్రి శశిదర్ రెడ్డి చెప్పారు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాద్యతలు చేపట్టిన తర్వాత అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందన్నారు. అయినా కూడా ఆయనను సుదీర్ఘకాలంపాటు పీసీసీ చీఫ్ గా కొనసాగించారని మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీలు పీసీసీ చీఫ్ లకు ఏజంట్లుగా మారారని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో ఏం జరిగిందో తనకు తెలుసునన్నారు. తన తండ్రి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో ఇంచార్జీలుగా ఉన్న నేతలు ఎలా వ్యవహరించారో తనకు అవగాహన ఉందన్నారు. పార్టీలో డబ్బు ప్రభావం బాగా పెరిగిందని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. పార్టీలో డబ్బులు ఇచ్చిన వారి మాటే చెల్లుబాటు అవుతుందని ఆయన ఆరోపించారు. పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కూడా ఇందుకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పీసీసీ చీఫ్ పదవి కోసం రూ. 25 కోట్లు తీసుకున్నారని భువనగరి ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై తాను గతంలో సోనియాగాంధీకి లేఖ రాశానని చెప్పారు. ఈ పరిణామాలను తాను పరిశీలిస్తానని సోనియాగాంధీ తనకు లేఖ రాసినట్టుగా చెప్పారు. సోనియాగాంధీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. కోదాడలో తన భార్య పద్మావతి ఓటమి పాలైన తర్వాత పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. కానీ కొత్త పీసీసీ చీఫ్ పదవి ఎంపిక కోసం అప్పటి ఇంచార్జీ పార్టీ సెక్రటరీలకు తెలియకుండానే 17 మంది పేర్లను పార్టీ అధిష్టానానికి పంపారని మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగాలని ఇష్టం ఉన్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారని మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం తనకు చెప్పారని శశిధర్ రెడ్డి తెలిపారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారినట్టుగా ఆయన చెప్పారు. పార్టీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి గురించి ఠాగూర్ మాట్లాడనిచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించని విషయాన్ని శశిదర్ రెడ్డి వివరించారు. కోకాపేట భూముల విషయంపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్టుగా శశిధర్ రెడ్డి తెలిపారు.కానీ రేవంత్ రెడ్డి ఈ భూముల విషయంలో సైలెంట్ గా ఉన్నారన్నారు.హుజూరాబాద్ లో మూడు వేల ఓట్లు వస్తే ఎవరికీ కూడా చీమ కుట్టినట్టు లేదన్నారు.హుజూరాబాద్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆయన విమర్శించారు. దుబ్బాకలో ఏం చేసినా కూడా కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాలేదని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, చీటర్ అంటూ శశిదర్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు.రేవంత్ రెడ్డిపై తనకు వేరే ఉద్దేశ్యం లేదని ఆయన చెప్పారు.మునుగోడులో భువనగిరి ఎంపీ వెంకట్ రెడ్డికి తెలియకుండానే సభను పెట్టారన్నారు. అద్దంకి దయాకర్ తో వెంకట్ రెడ్డిపై అలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని శశిధర్ రెడ్డి తెలిపారు.
ప్రజల మధ్య మతాల వారీ విభజనకు బిజెపి విద్వేష రాజకీయాలతో ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ ప్రజలను సమైక్యం చేసేందుకు కృషిచేస్తుందని రాహుల్‌ గాంధీ అన్నారు... అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ప్రజల మధ్య మతాల వారీ విభజనకు బిజెపి విద్వేష రాజకీయాలతో ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ ప్రజలను సమైక్యం చేసేందుకు కృషిచేస్తుందని రాహుల్‌ గాంధీ అన్నారు. దాదాపు ప్రతిపక్ష నేతలంతా ఇప్పుడివే వాక్యాలను వల్లెవేస్తున్నారు. మోదీ సర్కార్ ప్రతిపక్షాలపై ఈడీ, సిబిఐలను ప్రయోగించడం, ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలకే ప్రయోజనాలు సమకూర్చడం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గొంతు నొక్కేయడం, నిరుద్యోగం, అధిక ధరలు, అగ్నిపథ్, సరిహద్దుల్లో చైనా చొరబాటు వంటి అనేక అంశాలపై విపక్షాల మధ్య ఐక్యత నెలకొన్నది. ఆర్థిక అంశాలపై కూడా వాటిమధ్య ఏకాభిప్రాయం నెలకొని ఉన్నట్లు కనపడుతోంది. ‘మరల నిదేల రామాయణంబన్నచో ఈ ప్రపంచకమెల్ల వేళల యందు తినుచున్నయన్నమే తినుచున్నదిన్నాళ్లు’ అని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన వాక్యాల్లో అత్యంత గూఢార్థం లేకపోలేదు. చరిత్ర ఏ విధంగా పునరావృతమవుతుందో అదే విధంగా పోరాటాలు, ఘర్షణలు కూడా పునరావృతమవుతాయి. ఈ సత్యం తెలిసినందువల్లే నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మరోసారి సంఘటితమయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. గత ఎనిమిది సంవత్సరాలుగా వివిధ ప్రతిపక్షాలు బిజెపి వ్యతిరేక ఫ్రంట్‌ను జాతీయ స్థాయిలోను, రాష్ట్రాల స్థాయిలోనూ నిర్మించేందుకు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాలనన్నిటినీ మోదీ తుత్తునియలు చేశారు. ఆయన్ని ఎదుర్కొనే ప్రయత్నాలు విఫలం కావడంతో, ఇంట గెలువకుండా రచ్చ గెలువడం అసాధ్యమని భావించిన కొందరు నేతలు తమ పోరాటాన్ని విరమించుకుని తమ ఇళ్లను చక్కబెట్టుకునే ప్రయత్నమూ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పోరాటం చేయడం అంత సులభం కాదు. ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నప్పుడే ఆయన గుజరాత్ పీఠంపై కన్నువేసి రకరకాల అడ్డంకులను తొలగించుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోగలిగారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు ఎన్నికైన తర్వాత కేంద్రంలో ప్రధానమంత్రి పదవికి కూడా పార్టీలో తనకు ప్రత్యర్థి లేకుండా చూసుకున్నారు. ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీలోనే కాదు, దేశంలోనే తనకు ప్రత్యర్థి లేకుండా చూసుకోవడంలో ఆయన ఇప్పటి వరకూ విజయవంతమయ్యారు. అంత మాత్రాన ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో పడిపోయి నిస్తేజంగా, స్తబ్దంగా ఉండిపోతారని మోదీ భావించడం పొరపాటు అని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ సర్కార్‌లో మంత్రులుగా ఉన్నవారిని జైళ్లకు పంపిన తర్వాత, సోనియా, రాహుల్‌లను సైతం ఈడీ కార్యాలయాల చుట్టూ తిప్పిన తర్వాత భీతిల్లిన ప్రతిపక్షాలు తమ గాయాలు మానకముందే సమర శంఖారావం పూరిస్తున్నాయి. 1967 నుంచి ఇప్పటి వరకూ 15సార్లు చట్టసభలకు ఎన్నికై 32వ ఏట రాష్ట్ర మంత్రిగా, 38వ ఏట ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన శరద్ పవార్ తన 81వ ఏట ఇంకా మోదీ ధాటికి తట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రఫుల్ల పటేల్, నవాబ్ మాలిక్‌తో పాటు అనేకమంది ఎన్‌సిపి నేతలు ఈడీ ఉచ్చులో ఉన్నారు. ‘మీ చిటికెన వ్రేలు పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని మోదీ అంటున్నారు కదా’ అని ఇటీవల ఒక విలేఖరి ప్రశ్నించినప్పుడు ‘దాని వల్ల నాకింత నష్టం జరుగుతుందని అప్పుడూహించలేదు..’ అని ఆయన వ్యాఖ్యానించారు. 1985లో మోదీ ఆర్ఎస్ఎస్ నుంచి బిజెపిలోకి ప్రవేశించే నాటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లోక్‌సభలో సభ్యురాలు. తన కేబినెట్‌లో మంత్రిగా ఉన్న తన కుడిభుజం పార్థాబెనర్జీ ఈడీ కస్టడీలోకి వెళ్లిన తర్వాత ఆమె తనకు సమయం అనుకూలంగా లేదని మౌనం పాటించవలిసి వచ్చింది. కేసీఆర్ కూడా మోదీ కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. నితీశ్ కుమార్ కూడా మోదీ కంటే ఎంతో ముందు 1985లో ఎమ్మెల్యేగా ఉన్నారు. కేసీఆర్ టార్గెట్‌గా ఈడీ, సిబిఐ ఇప్పటికే రంగంలోకి దూకాయి. నితీశ్ కుమార్ బిజెపిని వదుల్చుకుని ఆర్‌జెడితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే మణిపూర్‌లో ఆయన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవడాన్ని చూస్తే బిహార్ పరిణామాన్ని బిజెపి జీర్ణించుకోలేకపోయిందని స్పష్టం అవుతుంది. బిజెపిలో తనకంటే సీనియర్లు అయిన నేతలను ఇంటికి పంపించడంతో విజయం సాధించిన మోదీ, ఇవాళ రాజకీయాల్లో తనకంటే సీనియర్ నేతలైన పవార్, నితీశ్, మమత, కేసీఆర్ తదితరులను సాగనంపేందుకు పోరును ఉధృతం చేశారు. గదుల్లో బంధించిన పిల్లులు తిరుగుబాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు ఒక రకంగా తన చర్యల ద్వారా మోదీ, బిజెపి వ్యతిరేక పార్టీలు ఏకం అయ్యేందుకు తగిన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. తన వ్యతిరేక శక్తులన్నీ తనను ఎదుర్కొనేందుకు ఒక సైద్ధాంతిక ప్రాతిపదికను అనుసరించేందుకు ప్రేరేపిస్తున్నారు. అందువల్ల నేడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు శరద్ పవార్, మాజీ ప్రధాని దేవెగౌడ ఒకే రకమైన సైద్ధాంతిక పరిభాషను ప్రయోగిస్తున్నారు. బీహార్ పరిణామాల తర్వాత దేశంలోని ఒకప్పటి జనతాదళ్ పరివార్ రాజకీయ ప్రత్యామ్నాయంగా తలెత్తే అవకాశం ఉన్నదని జనతాదళ్ (సెక్యులర్) నేత మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. జనతాదళ్ పరివార్ దేశానికి ముగ్గురు ప్రధానమంత్రులను అందించిన విషయం ఆయన గుర్తు చేశారు. బిహార్ పరిణామాలతో 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల మహా కూటమి అవతరించేందుకు మంచి అవకాశం ఉన్నదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం నిర్మించాల్సిన అవసరం ఉన్నదని ఎన్‌సిపి నేత శరద్ పవార్ నొక్కి చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వీరందరికంటే ఒక అడుగు ముందుకు వేసి దేశంలో బిజెపి ముక్త్ భారత్‌ను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. బిహార్‌లో కేసీఆర్ తనను కలిసిన తర్వాత ఢిల్లీకి వచ్చి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసి సార్వత్రక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను ఏకం చేయాలన్నదే తన లక్ష్యం అని ప్రకటించారు. కేసీఆర్ మాదిరి ఆయన కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జనతాదళ్ (ఎస్) అధినేత కుమారస్వామి తదితరులను కలుసుకున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే 2024 ఎన్నికలకు ఎంతో ముందు ప్రతిపక్ష ఐక్యతకు రంగం సిద్ధమవుతున్నట్లు కనపడుతోంది. కాంగ్రెసేతర, బిజెపియేతర ఫ్రంట్ ఆలోచనను కూడా ప్రక్కన పెట్టి కాంగ్రెస్‌ను కూడా కలుపుకుపోవాలనే అభిప్రాయం దాదాపు అన్ని పార్టీల్లో వ్యక్తమవుతోంది. అంతే కాదు, ఈడీ, సిబిఐ దాడులకు ఏ మాత్రం భయపడకుండా ముందుకు వెళ్లాలన్న పట్టుదల కూడా ఈ పార్టీల్లో కనపడుతోంది. మరో వైపు ఈ పార్టీలన్నీ ఒకే సైద్ధాంతిక రాజకీయ కార్యాచరణ అనుసరించే అవకాశాలు లేకపోలేదని ఈ పార్టీల నేతల ప్రకటనలను బట్టి అర్థమవుతోంది. ఇప్పుడు జరుగుతున్నది సైద్ధాంతిక సమరమని రాహుల్ గాంధీ రాంలీలా మైదానంలో జరిగిన ర్యాలీలో ప్రకటించారు. ప్రజల మధ్య మతాల వారీగా విభజన చేసేందుకు బిజెపి విద్వేష రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ ప్రజలను సమైక్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. దాదాపు ప్రతిపక్ష నేతలంతా ఇప్పుడివే వాక్యాలను ప్రయోగిస్తున్నారు. మోదీ సర్కార్ ప్రతిపక్షాలపై ఈడీ, సిబిఐలను ప్రయోగించడం, ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలకే ప్రయోజనాలు సమకూర్చడం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గొంతు నొక్కేయడం, నిరుద్యోగం, అధిక ధరలు, అగ్నిపథ్, సరిహద్దుల్లో చైనా చొరబాటు వంటి అనేక అంశాలపై ప్రతిపక్షాల మధ్య ఐక్యత నెలకొన్నది. ఆర్థిక అంశాలపై కూడా వీరి మధ్య ఏకాభిప్రాయం నెలకొని ఉన్నట్లు కనపడుతోంది. గుజరాత్‌లో రాహుల్ గాంధీ రైతులకు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడితే నిజామాబాద్‌లో కేసీఆర్ కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. మోదీ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని దాదాపు బిజెపియేతర ప్రతిపక్షాలన్నీ ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రకు కూడా ఒక కీలక ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో ఎందరో రాజకీయనాయకులు రకరకాల యాత్రలు చేసి ఫలితాలను పొందారు. జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ 1983లో దాదాపు ఆరునెలల పాటు జరిపిన 4500 కిమీ పాదయాత్రకు అద్భుత ప్రతిస్పందన లభించింది. కాని 1984లో ఇందిర మరణానంతరం జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ కేవలం 10 సీట్లనే సాధించగలిగింది. తన రథయాత్ర ద్వారా బిజెపిని రాజకీయంగా బలోపేతం చేసిన లాల్ కృష్ణ ఆడ్వాణీ వాజపేయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చేసిన యాత్రల వల్ల ప్రత్యేక ఫలితాలు సాధించలేకపోయారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఎవరూ యాత్రలు జరపలేదు. అందువల్ల రాహుల్ యాత్రకు ఎటువంటి ప్రతిస్పందన లభిస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 2019లో రెండవసారి కూడా కాంగ్రెస్ పరాజయం చెందిన తర్వాత, దేశంలో ప్రతిపక్షాలు తీవ్ర ఆత్మరక్షణలో పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ తప్పని సరై కాంగ్రెస్ ఉనికిని కాపాడేందుకు ఈ యాత్రను చేపట్టవలసి వచ్చింది. ఈ యాత్రలో రాహుల్ చేసే ప్రసంగాలు, కలుసుకునే ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల్లో ఏర్పడే ఉత్సాహం పార్టీని సైద్ధాంతికంగా పటిష్ఠం చేసేందుకు ఉపయోగపడవచ్చు. అరుణా రాయ్, యోగేంద్ర యాదవ్, బెజవాడ విల్సన్, పివి రాజగోపాల్ లాంటి మేధావులు, గాంధేయ వాదులు పాల్గొనడం ద్వారా ఈ యాత్ర కాంగ్రెస్‌కు ఒక రాజకీయ పార్టీకి మించిన నైతిక అస్తిత్వాన్ని కల్పించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లుతోంది. ఏకమయ్యేందుకు ప్రతిపక్షాలు మరోసారి సన్నద్ధమవుతున్నాయి. ఒకేరకమైన భాషలో మాట్లాడుతున్నాయి. మరి 2024 సార్వత్రక ఎన్నికలలో మోదీని దీటుగా ఎదుర్కోగల ఐక్యతను అవి సాధించగలవా అన్నది ఇప్పుడే చెప్పలేం. అయితే ప్రతిపక్ష నేతలు గతంలో కంటే ఎక్కువ పరిపక్వతతో వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. ప్రధానమంత్రి పదవి గురించి ప్రశ్న తలెత్తినప్పుడు కేసీఆర్, నితీశ్ కుమార్ స్పందించిన తీరు ఇందుకు నిదర్శనం. భవిష్యత్‌లో ప్రతిపక్షాల ఐక్యతకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. మోదీ ఆశ్రిత పక్షపాతం చూపుతున్నారు. ఆయన అనుయాయులు మతాన్ని, జాతీయ వాదాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ అస్త్రాలను మోదీకి వ్యతిరేకంగా తిప్పిగొట్టేందుకు ప్రతిపక్షాలు తమ రాజకీయ సైద్ధాంతిక కార్యాచరణపై మరింత స్పష్టతను ఏర్పర్చుకోవాలి. అనేక శక్తులను, పాత మిత్రులను కలుపుకుపోవాలి. జీవన్మరణ సమస్యగా ఉధృత పోరు చేపట్టాలి. మోదీపై ప్రతిపక్షాల పోరు ఇప్పటికి మొదటి అంకంలోనే ఉన్నది కనుక రాజకీయాలు ఎటువైపు మలుపుతిరుగుతాయో ఇప్పుడే చెప్పలేము.
టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసిన అతి తక్కువ సినిమాలతోనే టాలెంటెడ్ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరోలలో సత్యదేవ్ (Satyadev) ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ఆయన సొంతం. రీసెంట్‌గా ఆయన మెగాస్టార్ Dil Raju: అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు.. ‘వారసుడు’ వివాదంపై దిల్ రాజు గత కొన్ని రోజులుగా టాలీవుడ్, కోలీవుడ్‌లలో ‘వారసుడు’ (Vaarasudu) సినిమా విడుదలపై వివాదం నడుస్తూ ఉంది. సంక్రాంతి (Sankranthi)కి స్ట్రయిట్ చిత్రాలకు ప్రయారిటీ ఇవ్వాలని కౌన్సిల్ నుంచి ప్రకటన రాగానే.. Dil Raju: ‘వారసుడు’ కాంట్రవర్సీకి కారణమెవరో నాకు తెలుసు.. కానీ (OHRK promo) పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా.. ఆయన విషయంలో కూడా ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ దిల్ రాజుని వెంటాడుతూనే ఉంటుంది. అయినా వాటన్నింటిని ఎదుర్కొంటూ.. Rahul- Priyadarshi: ఈ ఐదేళ్లలో ఏం నేర్చుకున్నామంటే.. (OHRK Promo) కమెడియన్లుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. విలక్షణమైన పాత్రలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటులు ప్రియదర్శి (Priyadarshi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna). ప్రస్తుతం ఈ ఇద్దరూ open heart with rk: నాకెవ్వరూ డైరెక్ట్‌గా ప్రపోజ్ చేయలేదు.. ఎందుకంటే. హీరోలంతా ఎక్కువగా డ్యాన్స్ చేయరు. డ్యూయట్ సాంగ్స్‌లో కూడా హీరోయిన్సే ఎక్కువ చేస్తుంటారు. హీరోలు వారి చుట్టూ తిరుగుతుంటారు.. నా పాటకు రేటు ఇంత అనే మాట నా నోట రాలేదు.. ఓపెన్‌హార్ట్‌లో సిరివెన్నెల మా తరంలో వాళ్లకి సిగరెట్‌ కాల్చడం ఫ్యాషన్‌. నా వ్యసనం కూడా అలాగే మొదలైంది. ఇంత అహంకారినైన నేను ప్రతిసారీ ఒక సిగరెట్‌ ముందు తలవంచుతున్నాను. నాకు చేతగాకనే ఈ వ్యసనాన్ని వదల్లేకపోతున్నాను. భయపడుతూ బతకడం కంటే.. చచ్చి బతికిపోదామనే పరిస్థితి ఇప్పుడు ఉంది.. ఓపెన్‌హార్ట్‌లో సిరివెన్నెల జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది.. అంటూ..సముద్రమంత లోతైన తత్వాన్ని.. ఆకాశమంత భావాన్నీ.. అలతిఅలతి పదాల్లో ఇమిడ్చి ఆలోచింపజేసే పాటలు రాసే ‘మంచి’ రచయిత.. సిరివెన్నెల సీతారామశాస్త్రి. జగమంత కుటుంబం అని రాసినా... నిగ్గదీసి అడుగు అని ఆక్రోశించినా అది ఆయనకే సొంతం. దాచుకున్న ఎమోషన్స్‌ సంగీతంలో పెడతా! త్రివిక్రమ్‌ను కలిసినప్పుడల్లా కొత్తగా కనిపిస్తూ ఉంటారు. ఊరికే ఏదీ ఆయన మాట్లాడరు. కానీ మాట్లాడేది కొత్తగా ఉంటుంది..
ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా ‘ది వారియర్’. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌తో ఇంటర్వ్యూ… ప్రశ్న: రామ్ గారూ… ‘ది వారియర్’ ట్రైలర్ బావుంది. ఈ కథ కంటే ముందు కొన్ని కథలు రిజెక్ట్ చేశానని చెప్పారు. ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి? రామ్: పోలీస్ కథ చేద్దామనుకున్నాను. నాలుగైదు కథలు విన్నాను. అనీ రొటీన్ అనిపించాయి. పోలీస్ కథలు చేస్తే ఫ్రెష్‌నెస్‌ ఉండాలనేది నా ఫీలింగ్. రొటీన్ కథలు విని వద్దని డిసైడ్ అయ్యాను. లింగుస్వామి కథ చెప్పడానికి వస్తానంటే సరేనన్నాను. అప్పుడు పోలీస్ కథ అని తెలియదు. కథ చెప్పే ముందు నాకు విషయం తెలిసింది. ఫార్మాలిటీ కోసం వినేసి ఆ తర్వాత వద్దని చెబుదామనుకుని వినడం మొదలుపెట్టా. కథంతా విన్న తర్వాత ఇటువంటి కథే చేయాలని డిసైడ్ అయ్యా. బయట నుంచి చూసినప్పుడు ఏ కథైనా ఒకేలా ఉంటుంది. అదే పోలీస్, అదే విలన్! కానీ, ఒక సోల్ ఉంటుంది. పోలీస్ ఎందుకు అయ్యాడు? అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? అనేదానిపై సినిమాకి మెయిన్ అవుతుంది. ‘ది వారియర్’లో ఆ సోల్, ఎమోషన్ నాకు బాగా నచ్చింది. ‘మీరు ఎలా రాశారు? ఈ ఆలోచన ఎలా వచ్చింది?’ అని అడిగితే… ‘కొంత మంది రియల్ పోలీస్ ఆఫీసర్లను చూసి కథ రాశా’ అని చెప్పారు. నిజంగా కొందరు పోలీసులు అలా ఉన్నారు. ఆ విషయం చాలా మందికి తెలియదు. కథ చెప్పేటప్పుడు అందులో జెన్యూన్ ఎమోషన్ నాకు కనిపించింది. ఈ కథ నన్ను ఎంత ఎగ్జైట్ చేసిందంటే… లింగుస్వామి గారు నేరేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ సాయంత్రానికి పోలీస్ యూనిఫామ్ మా ఇంటికి తెప్పించా. ప్రశ్న: ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత మీ ఆలోచనా విధానం మారినట్టు అనిపిస్తోంది. మాస్, కమర్షియల్ సినిమాలతో ఎంట‌ర్‌టైన్‌ చేస్తున్నారు! రామ్: (నవ్వుతూ…) ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ముందే మారింది. అందుకే, ఆ సినిమా చేశా. ప్రశ్న: జీవితం ముఖ్యమా? సినిమాలు ముఖ్యమా? అని డాక్టర్ ప్రశ్నించారని చెప్పారు. అసలు ఏమైంది? రామ్: కొంచెం సీరియస్ ఇంజ్యూరీ అయ్యింది. స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అంటే చిన్నది కాదు కదా! ఎడమ చెయ్యి పని చేయలేదు. జిమ్ చేసిన తర్వాత మూడు నెలలు ఖాళీగా ఉండటం కష్టం అయ్యింది. ఆ సమయంలో డాక్టర్ అలా ప్రశ్నించే సరికి… ‘అలా అడిగారు ఏంటి?’ అనుకున్నాను. తర్వాత వారానికి సెట్ అయ్యాను. అప్పటికి ఆది పినిశెట్టి వేరే సినిమాలు చేయకుండా అలా ఉన్నాడు. పెళ్ళికి రెడీ అవుతున్నాడు. అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా! డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్. నాకు ఏమో నా వల్ల అందరూ వెయిట్ చేస్తున్నారని ఫీలింగ్. సినిమాలే లైఫ్ అనుకునే నాకు అది అవుటాఫ్ సిలబస్ క్వశ్చన్ లా అనిపించింది. ప్రశ్న: ‘ఇస్మార్ట్ శంకర్’ మీ కెరీర్‌లో పెద్ద హిట్. అటువంటి బ్లాక్ బస్టర్ తర్వాత లెక్కలు వేసుకుని సినిమాలు చేస్తారు. లింగుస్వామికి ఈ మధ్య పెద్ద విజయాలు లేవు. ఆయనతో సినిమా చేయడానికి కారణం? రామ్: అటువంటి లెక్కలు వేసుకుంటే ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా చేసేవాడిని కాదు. పూరి జగన్నాథ్ గారు, లింగుస్వామి గారు ట్రెండ్ సెట్టర్స్. వేరే కథలు డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఆ కథలు కనెక్ట్ కావడం లేదు గానీ… వాళ్ళ బ్రిలియన్స్ కనబడుతోంది. ఇద్దరం కనెక్ట్ అయ్యి కరెక్ట్ స్క్రిప్ట్ పడితే రిజల్ట్ బావుంటుంది. లింగుస్వామి గారు కూడా అంతే! ఫైనల్‌గా ఈ స్క్రిప్ట్‌కు కనెక్ట్ అయ్యాం. ఈ స్క్రిప్ట్ లింగుస్వామి సినిమాగా మారితే ఎలా ఉంటుందో నేను చూశా. నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. వీళ్ళందరూ డైమండ్స్ లాంటి వాళ్ళు. లోస్ వచ్చినప్పుడు కొంచెం దుమ్ము పడుతుంది. తుడిస్తే మళ్లీ డైమండ్ కనబడుతుంది. ప్రశ్న: ప్రతినాయకుడి పాత్రకు ఆది పినిశెట్టిని తీసుకున్నారు. ఆ ఛాయిస్ ఎవరిది? రామ్: కథ చెప్పినప్పుడు ఆది పినిశెట్టి రోల్… గురు క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సినిమాకు ఆ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరు చేస్తున్నారు? అనేది టెన్షన్. అయితే, లింగుస్వామి గారు ఆది పేరు చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆది ఏమో సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. కథ చెప్పాక… ఆయన కూడా ఎగ్జైట్ అయ్యారు. వెంటనే ఓకే చెప్పేసి క్యారెక్టర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ప్రశ్న: బుల్లెట్, విజిల్ సాంగ్స్ ఛార్ట్‌బ‌స్ట‌ర్స్‌ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి… రామ్: మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ చాలా కేర్ తీసుకున్నారు. దేవితో నాకు ఏడో సినిమా ఇది. లింగుస్వామి గారు స్క్రిప్ట్ చెప్పి వెళ్లిన తర్వాత నాకు ఫోన్ చేసి… రీ రికార్డింగ్ గురించి, సీక్వెన్సుల గురించి మాట్లాడాడు. అంత ఎగ్జైట్ అయ్యాడు. ఇలా అంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు. పాటలు కూడా కార్ స్పీకర్‌లో సాంగ్స్ వినడం వేరు. ఇంట్లో వినడం వేరు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినడం వేరు. థియేటర్‌లో వేరు. ఒక్కో స్పీకర్‌లో సాంగ్ ఎలా రావాలి? అని ఆలోచించి డిజైన్ చేశాడు. సాంగ్స్ మాత్రమే కాదు… కంప్లీట్ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ కోసం డిజైన్ చేశాం. ఎమోషన్స్, సాంగ్స్, పెర్ఫార్మన్స్… కమర్షియల్ ప్యాకేజ్డ్ మూవీ ఇది. ప్రశ్న: శింబు ఒక పాట పాడారు. మీకు ఎలా అనిపించింది? రామ్: తమిళంలో శింబు ‘లూసు పెన్నే’ అని ఒక పాట పాడారు. ‘బుల్లెట్…’ పాటకు శింబు అయితే బావుంటుందని చెప్పగానే నాకు ఆ వాయిస్ గుర్తు వచ్చింది. తెలుగులో 80 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. తమిళంలో 70 మిలియన్ ప్లస్ వచ్చాయి. తమిళంలో అంత రీచ్ రావడానికి శింబు ఒక కారణం. ప్రశ్న: ‘ది వారియర్’తో మీరు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తమిళంలో నటించడం గురించి… రామ్: నేను ఎప్పటి నుంచో తమిళంలో చేయాలనుకుంటున్నాను. కథలు సెట్ కాలేదు. తమిళ్ నుంచి సూపర్ స్క్రిప్ట్స్ వచ్చాయి. కానీ, అవి తెలుగులో తేడా కొడతాయేమో అనిపించింది. తెలుగు, తమిళ్… రెండు వర్కవుట్ అయ్యే స్క్రిప్ట్ దొరికితే చేద్దామనుకున్నాను. లింగుస్వామి గారు చెప్పిన స్క్రిప్ట్ కుదిరింది. ప్రశ్న: తమిళ్ వెర్షన్ డబ్బింగ్ కూడా ఫాస్ట్ గా చెప్పారట! రామ్: నేను చెన్నైలో పెరిగాను కదా! తమిళ్ మాట్లాడటం వచ్చు. డబ్బింగ్ చెప్పడం కూడా ఈజీగా అనిపించింది. నేను ఒక్కడినే డబ్బింగ్ చెబుతా. వేరే వాళ్ళు ఉండటం ఇష్టం ఉండదు. కరెక్షన్స్ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు. లింగుస్వామిగారితో అదే చెప్పాను. నేను మొత్తం డబ్బింగ్ చెప్పిన తర్వాత మీరు వినండి. మళ్ళీ కరెక్షన్స్ ఉంటే చెప్పండి. అప్పుడు వచ్చి చెబుతానని అన్నాను. ఒక్క సెన్సార్ కరెక్షన్ తప్ప ఏమీ లేదు. లింగుస్వామి గారు షాక్ అయ్యారు. ‘అంత పర్ఫెక్ట్‌గా ఎలా చెప్పారు. నేను ఊహించలేదు’ అని అన్నారు. ప్రశ్న: బ్యాక్ టు బ్యాక్ శ్రీనివాసా చిట్టూరి గారితో చేస్తున్నారు. రామ్: ‘మీతో పని చేసిన వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ మీతో చేస్తున్నారు’ అని మొన్నే ఆయనతో అన్నాను. ఆయన ఎక్కడా ఏమీ మాట్లాడరు. చాలా సైలెంట్. నేను ఇంకో సినిమా ఎందుకు చేస్తున్నాను? నాకు ఆయన ఏం చేశారు? అని ఎనలైజ్ చేస్తున్నాను. బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో నేను చేయబోయే సినిమాకు ఆయన నిర్మాత అనేది తెలిసిందే. ప్రశ్న: కరోనా సయమంలో వారియర్ అనే పదం బాగా పాపులర్ అయ్యింది. దానికి, ఈ సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? రామ్: కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అనే పదం బాగా నచ్చింది. ఎవరూ బయటకు రాకుండా ఇళ్లల్లో ఉన్నప్పుడు డాక్టర్లు, పోలీసులు బయటకు వచ్చారు. అందుకని, వారియర్ టైటిల్ పెట్టాం.*ప్రశ్న: కృతి శెట్టి గురించి… రామ్: వర్క్ మీద ఆమెకు చాలా డెడికేషన్ ఉంది. గౌరవం ఉంది. మనం చేసే పని మీద మనకు గౌరవం ఉంటే మిగతావన్నీ సెట్ అవుతాయి. ప్రశ్న: మోకాలికి గాయమైనా సాంగ్ షూటింగ్ చేశారని విన్నాను. ఇప్పుడు మీరు అంత చేయాల్సిన అవసరం ఉందా? రామ్: అవసరం లేదని చాలా మంది అంటున్నారు. దర్శకులు కూడా! కానీ, ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కోసం చేయాలని నాకు అనిపించింది. చేస్తున్నాను. సెట్‌కు వెళ్లిన తర్వాత కెమెరా చూస్తే కెమెరా లెన్స్ కనిపించదు. పదికోట్ల మంది కనిపిస్తారు. నా కోసం థియేటర్లకు వచ్చి చూస్తున్నారంటే… నేను చేయగలననే ఫీలింగ్ వస్తే 100 పర్సెంట్ చేయాల్సిందే. ప్రశ్న: బోయపాటితో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. దాని గురించి… రామ్: నా సినిమాలు హిందీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆయన సినిమాలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక హీరోను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన సినిమా చేస్తారు. అందుకని, భారం అంతా ఆయన మీద వేశా. ప్రశ్న: మీకే తెలియని మీ స్కూల్ గాళ్ ఫ్రెండ్ గురించి మాకు చెప్పండి. రామ్: ఏం చెప్పాలి? ఆ అమ్మాయిని అడిగి నాకు చెప్పండి. నేను ఎందుకు రియాక్ట్ అయ్యానంటే… సీక్రెట్ చైల్డ్‌హుడ్‌ గాళ్ ఫ్రెండ్ అని రాశారు. ఇంట్లో వాళ్ళు కూడా డౌట్ డౌట్ గా చూడటం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ కూడా నెమ్మదిగా ‘మాకే తెలియకుండా ఏంటిది?’ అని ఫోన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ‘ఏం లేకుండా రాస్తారంటావా?’ అనే క్వశ్చన్ వచ్చింది. అందుకని, జెన్యూన్ గా అడిగా… నేను స్కూల్ కి ఎప్పుడు వెళ్లానని! ప్రశ్న: హిందీలో మీకు మంచి మార్కెట్ ఉంది. హిందీ ప్రేక్షకుల కోసం, వాళ్ళకు తగ్గట్టు స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుంటారా? రామ్: హిందీ మార్కెట్ కోసం మనం కొత్తగా ఏమీ చేయకూడదని నేను నమ్ముతా. వాళ్ళు హిందీ సినిమాలు చూస్తున్నారు. తెలుగు, సౌత్ సినిమాలు చూసేది మన ఫ్లేవర్ కోసం! మనం క‌న్‌ఫ్యూజ్‌ అయిపోయి బాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తామంటే హిందీ ప్రేక్షకులు చూడరు. హిందీ మార్కెట్ కోసం మనం ట్రై చేయలేదు. హిందీలో డబ్బింగ్ అయినప్పుడు చూశారు. ప్రశ్న: బోయపాటి శ్రీను తర్వాత హరీష్ శంకర్ సినిమానా? అనిల్ రావిపూడి సినిమానా? రామ్: అందరితో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎవరితో ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. కరోనా వల్ల మనకు బ్రేక్స్ వచ్చాయి. అందుకని, ‘ది వారియర్’ విడుదల తర్వాత బోయపాటి శ్రీను గారి సినిమా స్టార్ట్ చేస్తున్నాను.