text
stringlengths
335
364k
Vaalmiki Ramayanam – 16 :పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహోగ్రమైన తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేథ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. అశ్వం దొరకకపోతే తనకి మంచి జరగదు అని మహర్షులు చెప్పారు. కాని అశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని తీసుకువస్తే యాగాన్ని పూర్తిచెయ్యచ్చు అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు. ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట, భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద, ఋచీకుడనే ఒక ఋషి భార్య పిల్లలతో కూర్చుని ఉన్నాడు. Vaalmiki Ramayanam – 16 అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన యాగాశ్వం అపహరణకి గురైనందుకుగాను నాకు ఒక యాగపశువు కావాలి, మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడా ఋచీకుడు ఇలా అన్నాడు ‘పెద్దకొడుకు ధర్మసంతానం( పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పెద్దకొడుకుగా ఇస్తారు) కావున నేను వాడిని ఇవ్వలేను, శాస్త్రం ప్రకారం చిట్టచివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు. అప్పుడా మధ్య కొడుకైన శునశ్శేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు. Vaalmiki Ramayanam – 16 Vaalmiki Ramayanam రాజు బతికుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బతకాలంటే యాగం పూర్తవ్వాలి, యాగం పూర్తి చెయ్యడానికి తన కొడుకుని పంపాడు ఋచీకుడు. అంబరీషుడు ఆయనకి లక్ష గోవుల్ని దానంగా ఇచ్చాడు. శునశ్శేపుడిని తీసుకెళుతున్న అంబరీషుడు కొంతదూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడకి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని శునశ్శేపుడు చూశాడు. వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు ” నేను నీ అక్కయ్య కొడుకుని, మీరు నాకు మేనమామఅవుతారు. పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు, ఆఖరివాడిని మా అమ్మ ఇవ్వనన్నది, మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞపశువుగా ఇచ్చేసారు. నాకు దీర్ఘకాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకం పొందాలని ఉంది. కాబట్టి మీరు నన్ను రక్షించాలి’ అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని తన కొడుకులని పిలిచి, తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే, మీలో ఎవరన్నా ఈ శునశ్శేపుడి స్థానంలో యాగపశువుగా వెళ్ళండి అన్నాడు. కథం ఆత్మ సుతాన్ హిత్వా త్రాయసే అన్య సుతం విభో | అకార్యం ఇవ పశ్యామః శ్వ మాంసం ఇవ భోజనే || నీ కొడుకుని నువ్వు యాగపశువుగా పంపిస్తావా, ఇంకొకడి కొడుకుని రక్షిస్తావా ! , మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసము తిన్నట్టు ఉంది అని విశ్వామిత్రుడి కొడుకులన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు.. శ్వ మాంస భోజినః సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు | పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యాం అనువత్స్యథ || మీరు కూడా వశిష్ఠుడి కుమారుల జాతిలో పుట్టి వెయ్యి సంవత్సరాలు వాళ్ళలాగ కుక్క మాంసం తింటూ బతకండని శపించాడు. అప్పుడాయన శునశ్శేపుడితో……… నువ్వు బెంగపెట్టుకోకు, నిన్ను తీసుకెళ్ళి యూపస్తంభానికి కడతారు. ఇప్పుడు నేను నీకు రెండు మంత్రాలని చెప్తాను, నిన్ను అలా యూపస్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ రెండుమంత్రాలని జపించు, అలా జపించడం వల్ల ఇంద్రుడు సంతోషించి, నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి, నేను ఈ యాగానికి ప్రీతి చెందాను అని యాగ ఫలితం ఇస్తాడని చెప్పి ఆ రెండుమంత్రాలని ఉపదేశం చేసి పంపించాడు. తరవాత శునశ్శేపుడిని యూప స్తంభానికి కట్టారు, అప్పుడాయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలని జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి, నేను ఈ యాగానికి సంతోషించాను, మీరు యాగపశువుని బలి ఇవ్వకుండానే మీకు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను అన్నాడు. అందరూ సంతోషించారు. Vaalmiki Ramayanam – 16 కోపంలో తన కొడుకులని శపించానని విశ్వామిత్రుడు బాధపడ్డాడు. ఈ సారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కరక్షేత్రానికి వెళ్ళగా మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపించింది. మేఘాల మధ్య మెరుపు వస్తే ఎలా ఉంటుందో మేనక కూడా అలా ఉంది. ఆ మేనక సౌందర్యాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడైనాడు. మేనకా ! నేను నీయందు కందర్ప వశుడనయ్యాను( అంటే మన్మధ ఆవేశం కలిగింది) అందుకని నువ్వు నా ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు అన్నాడు. మేనక సరే అన్నది. అలా మేనకతో క్రీడిస్తూ క్రీడిస్తూ పదేళ్ళు గడిచిపోయాయి. సర్వం సురాణాం కర్మ ఏతత్ తపో అపహరణం మహత్ | అహో రాత్రా అపదేశేన గతాః సంవత్సరా దశ || పది సంవత్సరాల తరువాత విశ్వామిత్రుడికి అసలు తను ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడో గుర్తొచ్చింది. ఈ మేనకతో ఏదో, ఒక రోజు లేకపోతే రెండు రోజులు అనుకున్నాను, కాని ఇలా పది సంవత్సరాలు గడిచిపోతాయి అనుకోలేదు. నా మనస్సుని దేవతలు వక్రీకరించడానికి ఈ మేనకని పంపారు అనుకొని కోపంగా మేనక వైపు చూశాడు, కాని ఇంతలోనే శాంతించి, ఇందులో నీ తప్పేముంది అని మేనకని వెళ్ళిపోమన్నాడు. ఈ సారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలని ఉత్తరదిక్కుకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.
రేపు విజ‌య‌వాడ‌లో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన ఆ రాత‌లు సిరాతో రాస్తున్నారా..? సారాతో రాస్తున్నారా..? ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ఔదార్యం ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఔదార్యం బీసీలంతా త‌లెత్తుకొని తిరిగేలా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న ర‌విశేఖ‌ర్ కుమార్తె వివాహానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ దంప‌తులు హాజ‌రు నిరుపేదల పాలిట ప్రాణదాత మీరిచ్చిన స‌హ‌కారం, మ‌నోధైర్యంతో ముఖ్యమంత్రిగా మీ ముందున్నా.. సీబీఆర్ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ‘జయహో బీసీ మహాసభ’ను విజయవంతం చేయండి You are here హోం » వార్తలు » రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన శాల ప్రారంభం రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన శాల ప్రారంభం 04 Nov 2022 2:29 PM విజయనగరం: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన శాల సేల్, స్టాల్‌ను రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), శాసన మండలి సభ్యులు పెనుమత్స సూర్యనారాయణ రాజు(సురేష్ బాబు) ప్రారంభించారు. విజయనగరం పట్టణంలో ముసానిక్ టెంపుల్ ఫంక్షన్ హాల్ లో చేనేత వస్త్ర ప్రదర్శన శాల సేల్స్ ను ప్రారంభించిన అనంత‌రం చేనేత‌లు త‌యారు చేసిన వ‌స్త్రాల‌ను ప‌రిశీలించారు. చేనేత రంగానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు చిత్రావ‌తి బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బోటింగ్ - ఫొటో గ్యాల‌రీ చిత్రావ‌తి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ - ఫొటో గ్యాల‌రీ మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
భీమా కోరేగావ్ (bhima koregaon) కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న కబీర్ కళా మంచ్ కళాకారుడు సాగర్ గోర్కే తల్లి సురేఖా గోర్కే తాను మాట్లాడిన ఓ వీడియో విడుదల చేశారు. తన కుమారుడితో పాటు ఆ కేసులో ఉన్న ఎవ్వరూ ఎలాంటి నేరం చేయలేదని, పేదల కోసమే పని చేసే వాళ్ళపై దేశద్రోహం కేసు మోపడం అన్యాయమని ఆమె ఆ వీడియోలో ఆవేదన వెలిబుచ్చారు. ఆమె మాట్లాడిన మాటలు.... ʹʹనా పేరు సురేఖా గోర్కే. నేను సాగర్ గోర్కే తల్లిని. సాగర్ కు చిన్నప్పటి నుండి పాటలు పాడటమంటే చాలా ఇష్టం. స్కూల్ లో ఆ తర్వాత కాలేజ్ లో కూడా అతను పాటలు పాడేవాడు. డాన్స్ లు చేసే వాడు.కాలేజ్ లో కబీర్ కళా మంచ్ తో కలిసి పని చేశాడు. రమేష్, జ్యోతి తదితరులతో కలిసి అనేక స్టేజ్ షోలు కూడా చేశాడు. ఆ షోలు చూడటానికి మేము కూడా వెళ్ళే వాళ్ళం. అయితే మాకెప్పుడూ అతను పాడిన పాటల్లో, మాట్లాడిన మాటల్లో తప్పు కనిపించలేదు. తప్పును తప్పని, ఒప్పును ఒప్పని చెప్పేవాళ్ళు. నాకొడుకు హత్య చేయలేదు. ఎలాంటి నేరం చేయలేదు. అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. కబీర్ కళా మంచ్ కళాకారులందరిపైనా ఆ కేసులు పెట్టారు. ఎందుకలా చేస్తున్నారు. నా బిడ్డ ఏనాడూ ఎవ్వరితో కొట్లాట పెట్టుకోలేదు. అతను చెడ్డ పనులు చేస్తున్నాడని ఏ ఒక్కరూ అనలేదు. జైల్లో కోవిడ్ విస్తరించింది. నా కొడుకుతో పాటు దాదాపు 50 మందిని ఒకే హాల్ లో పెట్టారు. ఎవరికి కరోనా ఉన్నదో ఎవరికి లేదో ఎలా తెలుస్తుంది. నా కుమారుడి ప్రాణాలకు ప్రమాదమున్నది. అతనికి కోవిడ్ వల్ల ఏమన్నా అయితే బాధ్యత ఎవరిది ? మేము చాలా ఆందోళనలో ఉన్నాము. బైట ఉన్న మేమే కోవిడ్ వల్ల భయం భయం గా జీవిస్తున్నాము. ఇక జైల్లో కోవిడ్ ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ పరిస్థుతుల్లో వాళ్ళందరినీ విడిచి పెట్టాలని నా వినతి. వాళ్ళేం నేరం చేయలేదు. మేము చాలా పేదవాళ్ళం కూలీ చేసుకుంటే తప్ప మా కడుపు నిండదు. కోవిడ్ వల్ల మాకు ఏ పనీ లేదు. ఇంట్లోనే ఉండాల్సి వస్తున్నది. నా కుమారుడికి సహాయం కూడా చేయ‌లేని పరిస్థితి మాది. నా కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదు. అతను ఎవరినీ చంపలేదు, దొంగతనం చేయలేదు. మా వృద్దాప్యంలో మాకు ఆసరాగా ఉండాల్సిన వాడు..... మీ అందరికి నాదొక విన్నపం. మా పిల్లలు ఎవరి కోసం పని చేశారు ? ప్రజల కోసమే పని చేశారు. పూరి గుడిశెల్లో నివసించే వారి కోసం పని చేశారు. వాళ్ళ కోసం మీరు గొంతు విప్పి మాట్లాడాలి.ʹʹ Keywords : BK16, VARAVARARAO, #FreeKKM, KABIR KALAMANCH, PUNE, MUMBAI, ARREST, bhima koregaon, sedition, sagar gorkhe, SUREKHA GORKHE (2022-12-05 00:44:12) No. of visitors : 2154 Suggested Posts భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులకు కరోనా పాజిటీవ్ భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులు - మహేష్ రౌత్, సాగర్ గోర్ఖే , రమేష్ గైచోర్ ‍ లకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చినట్టు గురువారం నాడు ʹహిందూʹ నివేదించింది. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ.... జూన్ 13న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ప్రదర్శన‌ కేంద్రం అక్రమ కేసులు మోపిఅరెస్టు చేసిన మేధావులు మరియు ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ జూన్ 13న ర్యాలీ నిర్వహించనుంది. UAPA దుర్వినియోగంపై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం - స్టాన్ స్వామి మరణంపై దిగ్భ్రాంతి భిన్నాభిప్రాయాలను అరికట్టడానికి లేదా పౌరులను వేధించడానికి UAPA చట్టాలను దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు. భారతదేశం మరియు అమెరికా మధ్య చట్టపరమైన సంబంధాలపై జరిగిన స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ కు తరలించండి - బోంబే హైకోర్టు ఆదేశాలు భీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో ప్రస్తుతం తలోజా జైలులో అనారోగ్యంతో ఉన్న ఫాదర్ స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ లో చేర్పించాలని బొంబాయి హైకోర్టు శుక్రవారం రాష్ట్ర జైలు అధికారులను ఆదేశించింది. Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన‌ భీమా కోరేగావ్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన 16 మందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ లో భారీ ప్రదర్శన జరిగింది. భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ? భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న‌16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు. హ‌నీ బాబును జూన్1 వరకు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేయొద్దు - ముంబై హైకోర్టు ఆదేశాలు భీమా కోరేగావ్(ఎల్గార్ పరిషత్) కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబును జూన్ 1 వరకు డిశ్చార్జ్ చేయవద్దని దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిని బొంబాయి హైకోర్టు గురువారం కోరింది. Bhima Koregaon: హక్కుల నేతలపై మరో కుట్ర బీమా కోరేగాం ఎల్గార్ ప‌రిష‌ద్ కేసులో అరెస్ట‌యి జైలు నిర్భంధంలో ఉన్న హ‌క్కుల సంఘాల నేత‌లు, మేధావులు మ‌రో ప్ర‌మాద‌క‌ర‌మైన స‌వాలును ఎదుర్కోబోతున్నారు. వారిని త‌లోజా జైలునుంచి మ‌హారాష్ట్ర‌లోని వివిధ జైళ్ల‌కు త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది. Bhima Koregaon case:గౌతమ్ నవ్‌లఖా జీవన సహచరి హృదయ విదారకమైన ప్రకటన నా వయస్సు 70 ఏళ్లు పైన ఉంటుంది. నేను ఢిల్లీలో నివసిస్తున్నాను. నవ్‌లఖాతో కలవడానికి జైలు అధికారులు అనుమతిచ్చే పది నిమిషాల వ్యవధిలో అతడిని కలవడానికి నవీ ముంబైలోని తలోజా జైలుకు ప్రయాణించడం నాకు చాలా కష్టం.
ప్రపంచంలోని అందమైన ప్రకృతి దృశ్యాల 20+ చిత్రాల సేకరణ. ఇది వాల్‌పేపర్‌కు అనుకూలంగా ఉంటుంది మరియు ప్రపంచంలోని ఉత్తమ సహజ ఆకర్షణలకు సూచనగా ఉంటుంది. ప్రపంచంతో సహా ప్రపంచంలోని అందమైన దృశ్య చిత్రాల యొక్క వివిధ వస్తువులు ఉన్నాయి. సహజ దృశ్యం యొక్క వస్తువు చాలా మంది వ్యక్తులు విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు వారి దృష్టిని ఆకర్షిస్తుంది. అందమైన దృశ్యాల వస్తువులు పర్వతాలు, నదులు, సరస్సులు, జలపాతాలు, పూల తోటలు, బీచ్‌లు, సముద్రం మరియు అనేక ఇతర ఆసక్తికరమైన వస్తువులను కలిగి ఉంటాయి. అత్యంత సన్నిహిత వ్యక్తులు, కుటుంబం, స్నేహితులతో కలిసి అందమైన ప్రదేశంలో ఆనందించడం ఒక ఆహ్లాదకరమైన కార్యకలాపం. ప్రపంచంలో మరియు ప్రపంచంలోని అందమైన దృశ్యాల వస్తువులు మరియు చిత్రాలకు సంబంధించిన కొన్ని సమీక్షలు ఇక్కడ ఉన్నాయి. 1. తోబా సరస్సు - ఉత్తర సుమత్రా ఈ ఒక్క చూపు వస్తువుకు సంబంధించి, అది మన చెవులకు తెలిసి ఉండాలి. టోబా సరస్సు ప్రపంచ సమాజం మరియు విదేశీ పర్యాటకులచే విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. టోబా సరస్సు యొక్క కథ కూడా ప్రపంచ సమాజంలో ఒక పురాణంగా మారింది. టోబా సరస్సు విశాలమైన సముద్రంలా కనిపించే ప్రపంచంలోని అత్యంత అందమైన అగ్నిపర్వత సరస్సులో చేర్చబడింది. టోబా సరస్సు ఆగ్నేయాసియాలో అతిపెద్ద సరస్సు మరియు ప్రపంచంలోని లోతైన సరస్సు కావడంలో ఆశ్చర్యం లేదు. తోబా సరస్సు యొక్క ప్రదేశం పైన్ అడవులు, అనేక జలపాతాలు మరియు వెచ్చని స్నానాలతో విశాలమైన కొండల చుట్టూ ఉంది. దృశ్యం చాలా అందంగా, ప్రశాంతంగా మరియు చల్లగా ఉంటుంది. 2. రింజని పర్వతం - లాంబాక్, వెస్ట్ నుసా టెంగ్గారా ప్రపంచం వివిధ అందమైన ప్రకృతి దృశ్యాలతో సమృద్ధిగా ఉంది. అందమైన ప్రకృతి దృశ్యాలలో ఒకటి లాంబాక్‌లోని రింజని పర్వతం. రింజని పర్వతం సముద్ర మట్టానికి 3700 మీటర్ల ఎత్తులో ఉంది మరియు ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం. ఈ ఎత్తుతో, పర్వతం పైభాగంలో ఒక బిలం సరస్సుతో కప్పబడిన పర్వత ఏర్పాటు యొక్క అందంతో రింజని పర్వతం సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. 3. లాబువాన్ బాజో - తూర్పు నుసా టెంగ్గారా లాబువాన్ బాజో యొక్క అందమైన దృశ్యం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మీరు లాబువాన్ బాజోను సందర్శిస్తే, సముద్రం, పర్వతాలు మరియు కొమోడో నేషనల్ పార్క్ వీక్షణలతో సహా అనేక రకాల అందమైన సుందరమైన వస్తువులను మీరు చూడవచ్చు. నీటి అడుగున ప్రేమికులకు, లాబువాన్ బాజో ఒక అందమైన నీటి అడుగున స్వర్గాన్ని అందిస్తుంది. ఇప్పటికీ మానవులు తాకని నీటి అడుగున దృశ్యాలు మీ కళ్లను పాడు చేస్తాయి. అదనంగా, ద్వీపాల యొక్క అందమైన సమూహం ఉంది. పదర్ ద్వీపంలో అందమైన నీలం సముద్రం చుట్టూ కొండలు ఉన్నాయి. సూర్యోదయాన్ని చూసేందుకు ఈ ప్రదేశానికి తరచుగా పర్యాటకులు వస్తుంటారు. ఇంతలో, రింకా ద్వీపంలో కొమోడో డ్రాగన్‌లకు సహజ నివాసం ఉంది. ఇక్కడ మీరు కొమోడో డ్రాగన్‌లను దగ్గరగా చూడవచ్చు. 4. డెరావాన్ ద్వీపం - తూర్పు కాలిమంతన్ డెరావాన్ ద్వీపాన్ని తరచుగా తూర్పు కాలిమంటన్‌లో దాచిన స్వర్గంగా సూచిస్తారు. అది ఎందుకు? అయితే, ఈ డెరావాన్ ద్వీపం అందించిన అన్యదేశ దృశ్యాల కారణంగా. డెరావాన్ దీవి చరిత్ర 2005లో దేరావాన్ ప్రాంతాన్ని యునెస్కోకు ప్రపంచ వారసత్వ సంపదగా నమోదు చేయడంతో ప్రారంభమైంది. చివరి వరకు ఈ ప్రదేశానికి పేరు పెట్టారు ప్రిస్టిన్ ద్వీపం, అందం ఇప్పటికీ నిర్వహించబడే ప్రదేశాలలో ఒకదానిలో చేర్చబడింది. ఇవి కూడా చదవండి: పాపువాన్ సాంప్రదాయ దుస్తులు: పూర్తి చిత్రాలు మరియు వివరణలు మీరు డెరావాన్ ద్వీపాన్ని సందర్శిస్తే, మీరు నీటి అడుగున అందంలో మునిగి సంతృప్తి చెందవచ్చు మరియు డెరావాన్ ద్వీపంలోని తెల్లని ఇసుక బీచ్‌ల అందాలను ఆస్వాదించవచ్చు. అందమైన బీచ్ వీక్షణలను ఆస్వాదించడమే కాకుండా, డెరావాన్ ద్వీపంలో మనం లాబువాన్ సెర్మిన్ సరస్సు మరియు హాజీ మాంగ్కు గుహ వంటి ఇతర సుందరమైన వస్తువులతో పాటు ఇంకా అందంగా ఉన్న అనేక ఇతర సుందరమైన వస్తువులను ఆస్వాదించవచ్చు. 5. సెంటాని సరస్సు - పాపువా పాపువా భూమి ప్రపంచంలోని దాచిన స్వర్గం. సెంటాని సరస్సుతో సహా వివిధ అందమైన సహజ ఆకర్షణలు ఉన్నాయి. సెంటాని సరస్సు చుట్టూ 22 ద్వీపాలతో ఏర్పడింది మరియు 30 రకాల మంచినీటి చేపలు ఉన్నాయి. ఇప్పటికీ అందమైన ప్రకృతి దృశ్యం సందర్శకులను సెంటాని సరస్సులో ఆలస్యమయ్యేలా చేస్తుంది. 6. గ్రీన్ కాన్యన్- వెస్ట్ జావా అమెరికా మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా పెద్ద లోయ ఉంది. పశ్చిమ జావాలో ఉన్న, స్థానిక నివాసితులచే Cukang Taneuh అని పిలువబడే కాన్యన్, చాలా స్పష్టమైన ఆకుపచ్చని నీటిని కలిగి ఉంది, ఇది నది మరియు కొండ వైపున ఉన్న ఆకుపచ్చ నాచు యొక్క ప్రతిచర్య నుండి వస్తుంది. కాబట్టి, పశ్చిమ జావాలోని ఈ కాన్యన్‌ను గ్రీన్ కాన్యన్ అంటారు. 7. రాజా అంపట్ - పాపువా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో తదుపరి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం రాజా అంపట్ పాపువా. రాజా అంపట్ యొక్క సహజ సౌందర్యం ప్రపంచవ్యాప్తమైంది, ముఖ్యంగా నీటి అడుగున దాని అందం. రాజా అంపట్ పశ్చిమ పాపువాలోని ఒక చిన్న ద్వీపసమూహం. అనేక ద్వీపాల సమూహాలను కలిగి ఉండటం వలన, ఒక యాత్రికుడు వివిధ ద్వీపాల నుండి వివిధ వీక్షణల ద్వారా చెడిపోతాడు. మీరు ఏ ద్వీపానికి వెళ్లాలనుకుంటున్నారో సూచించండి, స్వర్గం వంటి అందమైన ప్రకృతి దృశ్యాలు మిమ్మల్ని ముగ్ధుల్ని చేస్తాయి. 8. కెలిముటు పర్వతం కెలిముటు పర్వతం మీద ఉన్న మూడు రంగుల బిలం యొక్క అందం ప్రయాణికులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఎరుపు, నీలం మరియు తెలుపు అనే మూడు రంగులతో మూడు క్రేటర్లు ఉన్నాయి. కెలిముటు పర్వతం చుట్టూ ఉన్న పర్వతాల సహజ సౌందర్యంతో ఇది మరింత అద్భుతంగా ఉంటుంది. 9. కరిముంజవా- సెంట్రల్ జావా కరిముంజవా యొక్క అందమైన దృశ్యాలను వివిధ దేశాల నుండి వచ్చిన అనేక మంది ప్రయాణికులు ఆనందించారు. ఇది అందమైన బీచ్‌లు మరియు చిన్న ద్వీపాలతో నిండి ఉండటమే కాకుండా, కరిముంజవా దీవులలో, సందర్శకులు డైవింగ్ లేదా స్విమ్మింగ్ వంటి అనేక రకాల నీటి క్రీడలను ఆస్వాదించవచ్చు. స్నార్కెలింగ్. 10. వీకూరి సరస్సు - సుంబ బూమి సుంబా అనేక దాచిన స్వర్గాన్ని కలిగి ఉంది, వాటిలో ఒకటి వీకూరి సరస్సు. వీకూరి సరస్సు యొక్క అందం ఏమిటంటే, సరస్సు నీరు స్పష్టమైన మణి సముద్రపు నీటి రూపాన్ని పోలి ఉంటుంది. నీటి మణి ప్రతిబింబం మరియు చెట్ల పచ్చదనం ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రకృతి దృశ్యం చిత్రాలలో ఒకటిగా రూపొందాయి. 11. న్గుర్తాఫుర్ బీచ్ - మలుకు న్గుర్తఫుర్ బీచ్ అందం నిజంగా అద్భుతమైనది. ఈ బీచ్ అందమైన నీలం సముద్రం మరియు తెల్లని ఇసుకతో అమర్చబడి ఉంటుంది. పై నుండి చూస్తే, న్గుర్తాఫుర్ తీరం తక్కువ ఆటుపోట్ల వద్ద సముద్రాన్ని రెండుగా విభజించినట్లు అనిపిస్తుంది. 12. డైంగ్ పీఠభూమి - సెంట్రల్ జావా పర్వతారోహకులు వంటి సందర్శకులచే డియెంగ్ ప్రాంతం ఎప్పుడూ ఎడారిగా ఉండదు. సముద్ర మట్టానికి 2000 మీటర్ల ఎత్తులో, Dieng ప్రాంతం కాలుష్యం మరియు పట్టణ సందడి లేకుండా స్వచ్ఛమైన గాలితో మనోహరమైన సహజ దృశ్యాలను అందిస్తుంది మరియు Dieng ప్రజల సాంస్కృతిక గొప్పతనాన్ని కలిగి ఉంది. 13. మౌంట్ బ్రోమో - తూర్పు జావా ఇప్పటి వరకు, మౌంట్ బ్రోమో రాష్ట్రం ఇప్పటికీ క్రియాశీల అగ్నిపర్వతంగా ప్రకటించబడింది. అయినప్పటికీ, బ్రోమో పర్వతం స్థానిక మరియు విదేశీ పర్యాటకులచే సందర్శకులచే ఎప్పటికీ విడిచిపెట్టబడదు. విశాలమైన ఎడారి మరియు పచ్చికభూములు మరియు బ్రోమో పర్వతం పైభాగంలో ఉన్న బిలం యొక్క దృశ్యం పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సందర్శకులు సూర్యోదయాన్ని చూసేటప్పుడు బ్రోమో చాలా రద్దీగా ఉంటుంది (సూర్యోదయం) ఉదయాన. ఇది కూడా చదవండి: స్నేహితుల కోసం 100+ పదాలు (తాజాగా) హృదయాన్ని తాకే 14. ఉలువాటు - బాలి బాలి అందం దేశం నలుమూలల వారికి బాగా తెలుసు. అందమైన ప్రకృతి దృశ్యాలను అందించడమే కాకుండా, బాలి సంస్కృతిలో కూడా గొప్పది. కొంతమంది విదేశీ పర్యాటకులకు ఇది ప్రధాన ఆకర్షణ. బాలిలోని ప్రసిద్ధ వస్తువులలో ఉలువాటు ఒకటి. ఇది సముద్రంలోకి దూసుకెళ్లే ఆలయ భవనం. ఈ ప్రదేశం నుండి, సందర్శకులు అద్భుతమైన రాతి శిఖరాల అందాన్ని చూస్తారు. అదనంగా, సందర్శకులు మధ్యాహ్నం సూర్యాస్తమయం అందాలను వీక్షించవచ్చు. 15. జెనీవా సరస్సు - స్విట్జర్లాండ్ తదుపరి అందమైన దృశ్యం ఉన్న ప్రదేశం స్విట్జర్లాండ్‌లో ఉంది. స్విట్జర్లాండ్ ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి, ఇది ప్రపంచ యాత్రికుల కల అని కొత్తది కాదు. ప్రయాణికులు సందర్శించే ప్రదేశాలలో ఒకటి లేక్ జెనీవా ప్రాంతం. ఈ ప్రాంతం అద్భుతమైన వీక్షణలను కలిగి ఉంది. మీరు జెనీవా సరస్సును సందర్శిస్తే, మంచు పర్వతాలు మరియు యూరోపియన్ సూక్ష్మ నైపుణ్యాలతో కూడిన కొన్ని అన్యదేశ భవనాలు ఉన్నాయి. 16. సీ క్లిఫ్స్ - ఫ్రాన్స్ ఈఫిల్ టవర్‌కు ప్రసిద్ది చెందడమే కాకుండా, ఫ్రాన్స్ తక్కువ అందంగా లేని అనేక సహజమైన అందాలను కూడా అందిస్తుంది. వాటిలో ఒకటి సీ క్లిఫ్స్, ఇది ఈ అతిపెద్ద వైన్-ఉత్పత్తి దేశం యొక్క పశ్చిమ తీరంలో ఉంది. ఎరెట్రాట్ ప్రాంతంలోని ఈ సున్నపురాయి కొండపై సముద్రపు అలల కోత వల్ల ఏర్పడిన మూడు అందమైన తోరణాలు ఉన్నాయి. ఫలితంగా, ఏర్పడిన బోలు పగడపు సీ క్లిఫ్స్ వద్ద ప్రధాన ఆకర్షణగా మారుతుంది. ప్రత్యేకంగా, దూరం నుండి చూస్తే, కొండ ఆకారం తెల్లటి ఇసుక బీచ్ అంచున నిలబడి ఉన్న ఏనుగును పోలి ఉంటుంది. జె 17. కొలరాడో పీఠభూమి- అరిజోనా గ్రాండ్ కాన్యన్ పర్యాటకులకు అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. మీరు మిస్ చేయకూడనిది కొలరాడో పీఠభూమి. 5-6 మిలియన్ సంవత్సరాల క్రితం సంభవించిన కొలరాడో నది కోత వల్ల ఈ కొండల వరుస ఏర్పడింది. సముద్ర మట్టానికి సుమారు 2,414 మీటర్ల ఎత్తులో ఉన్న గ్రాండ్ కాన్యన్ ప్రస్తుతం 1,500 మైళ్ల లోతులో ఉంది, కొండల మధ్య 18 మైళ్ల దూరంలో ఉంది. ప్రపంచంలోని ఏడు వింతల జాబితాలో ఈ ప్రాంతం చేరితే ఆశ్చర్యపోనవసరం లేదు. 18. వైట్‌హెవెన్ బీచ్ - ఆస్ట్రేలియా ప్రపంచంలోని అత్యుత్తమ బీచ్‌ల రూపంలో సహజ పర్యాటక విందులు కలిగిన దేశంగా ఆస్ట్రేలియా నిజానికి ప్రసిద్ధి చెందింది. అనే వాస్తవం ఈ వాస్తవాన్ని బలపరుస్తుంది వైట్‌హావెన్ బీచ్ ఇది ప్రపంచంలోని అత్యుత్తమ బీచ్‌లలో ఒకటిగా పేర్కొనబడింది. సాధారణంగా బీచ్‌లా కాకుండా, వైట్‌హావెన్ బీచ్ ద్వీపంలో నది నుండి నీటి ప్రవాహం కారణంగా స్థిరపడిన ఇసుక విస్తరించి ఉంది. ఫలితంగా ఇసుక నిల్వలు తీరాన్ని తలపిస్తున్నాయి వైట్‌హావెన్ బీచ్ కంటికి ఎంతో ఆహ్లాదకరమైన పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. 19. ప్లిట్విస్ లేక్స్ నేషనల్ పార్క్ - క్రొయేషియా క్రొయేషియాలోని ప్లిట్విస్ లేక్స్ నేషనల్ పార్క్ అందం అపూర్వమైనది. ప్రధాన కారణం ఈ జాతీయ ఉద్యానవనంలో డజన్ల కొద్దీ ఎత్తైన జలపాతాలు ఉన్నాయి. మీరు ఈ స్థలాన్ని ఫోటో స్పాట్‌గా చేసుకోవచ్చు లేదా నీటిలో ఆడుకోవచ్చు. కూడా ప్రపంచ వారసత్వ కేంద్రం ప్లిట్విస్ లేక్స్ జాతీయ ఉద్యానవనాన్ని ప్రపంచ సాంస్కృతిక వారసత్వంగా ప్రదానం చేసింది. 20. పముక్కలే - టర్కీ సంప్రదాయ వేడి నీటి బుగ్గలతో విసిగిపోయి, మీరు టర్కీలోని పముక్కలేలో విశ్రాంతితో కొత్త అనుభవాన్ని ప్రయత్నించవచ్చు. సహజ సంఘటనల కారణంగా సహజంగా తయారు చేయబడిన పాముక్కలే సందర్శకులకు కాటన్ లాగా కనిపించే గోడలతో వేడి స్నానం చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది. రోజువారీ దినచర్యల వల్ల వచ్చే అలసట మరియు నీరసం తక్కువ సమయంలో మాయమవుతాయి. ఆ విధంగా ప్రపంచం మరియు ప్రపంచంలోని అందమైన ప్రకృతి దృశ్యాల చిత్రాల సమీక్ష. ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము.
October 2, 2020 October 2, 2020 Suma Latha 633 Views birth anniversary, Gandhi Samadhi, Lal Bahadur Shastri, MahatMa Gandhi, PM Modi, Vijay Ghat మాజీ ప్రధాని లాల్‌బహుదూర్‌ శాస్త్రి కూడా ప్రధాని నివాళి PM Shri Narendra Modi takes part in Sarva Dharma Prarthana at Gandhi Samadhi PM Shri Narendra Modi pays tribute to Lal Bahadur Shastri at Vijay Ghat న్యూఢిల్లీ: నేడు జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడి ఘనంగా నివాళులర్పించారు. యువత మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన మార్గంలో నడవాలని అన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మాగాంధీ అని కొనియాడారు. మరోవైపు ఈరోజు మాజీ ప్రధాని లాల్‌బహుదూర్‌ శాస్త్రి జయంతి సైతం కావడంతో విజయ్‌ఘాట్‌ వద్ద ఆయనకు ప్రధాని నరేంద్రమోడితోపాటు లాల్‌బహుదూర్‌ శాస్త్రి కుమారుడు అనిల్‌ శాస్త్రి సైతం అంజలి ఘటించారు. పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకులు సైతం మహాత్మా గాంధీకి, లాల్‌బహుదూర్‌ శాస్త్రికి నివాళులర్పించారు.
గతేడాది జరిగిన కుప్పం మున్సిపాలిటీలో విజయం సాధించడంతో వైఎస్సార్సీపీ రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో గట్టి అభ్యర్థిని నిలబెట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి షాక్ ఇవ్వాలనే యోచనలో ఉందని సమాచారం. 1989 నుంచి 2019 వరకు అంటే ఏడుసార్లు కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఈసారి షాకివ్వడానికి వైఎస్సార్సీపీ పావులు కదుపుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడి కుమారుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని లేదా బలమైన బీసీ అభ్యర్థిని బరిలో దించుతారని వార్తలు వచ్చాయి. వీరెవరూ కాకుంటే ప్రముఖ సినీ హీరో విశాల్ ను వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేయిస్తారని చర్చ జరిగింది. విశాల్ తమిళ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆయన రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే. విశాల్ తండ్రి జీకే రెడ్డి ప్రముఖ బిల్డర్ గా రియల్టర్ గా నిర్మాతగా కొనసాగుతున్నారు. విశాల్ సొంత వూరు కుప్పం నియోజకవర్గంలోనే ఉందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విశాల్ ను వైఎస్సార్సీపీ తరఫున కుప్పం బరిలో చంద్రబాబుపైకి ప్రయోగిస్తారని వార్తలు వచ్చాయి. వైఎస్ జగన్ తోనూ విశాల్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఈ గాసిప్స్ వార్తల నేపథ్యంలో కుప్పం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థిపై ఇంధన గనులు పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా స్పష్టతనిచ్చారని వార్తలు వస్తున్నాయి. కుప్పంలో వైఎస్సార్సీపీ తరఫున ప్రస్తుతం చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న భరత్ పోటీ చేస్తారని పెద్దిరెడ్డి చెబుతున్నారు. గతంలో రెండుసార్లు భరత్ తండ్రి చంద్రమౌళి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి చంద్రబాబుపై ఓడిపోయారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గ ఇన్చార్జిగా ఎమ్మెల్సీగా భరత్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పటివరకు కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకూ మన ప్రభుత్వం కూడా భరత్ నేతృత్వంలోనే కుప్పం నియోజకవర్గంలో సాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భరత్ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించడంతో హీరో విశాల్ గా పోటీ చేస్తారనే వార్తలకు చెక్ పడ్డట్టేనని సమాచారం. మరోవైపు చంద్రబాబు కుప్పంలోనే ఇల్లు కట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఓడించాలని వైఎస్సార్సీపీ లక్ష్యంగా పెట్టుకోవడంతో చంద్రబాబు ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త చర్యలకు దిగారని అంటున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో కుప్పంను గెలవాలనే లక్ష్యంతో ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జులతో నిర్వహించిన సమావేశంలో వచ్చే ఎన్నికల్లో 175 కు 175 స్థానాలు నెగ్గాలని సూచించిన సంగతి తెలిసిందే. మరోవైపు చిత్తూరు జిల్లాతోపాటు ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నా తమకు ఏకుకు మేకుగా మారిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రబాబు కూడా ఫోకస్ పెట్టారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి కొనసాగుతున్నారు. ఈసారి పెద్దిరెడ్డిపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని నిలపాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముందు పెద్దిరెడ్డికి షాకు ఇస్తే కానీ చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ దూకుడుకు అడ్డుకట్ట పడదనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. గత ఎన్నికల్లో పెద్దిరెడ్డిపై టీడీపీ తరఫున అనీషారెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. Tupaki TAGS: KuppamMuncipalityElections ChandrababuNaidu YSRCpGovernment MinisterPeddireddy PeddireddySudheerReddy HeroVishal AmarnathReddy
Mallikarjun Kharge: మల్లికార్జున్ ఖర్గే అభ్యర్థిత్వానికి తాను, ఆ పార్టీ సహచరుడు ఆనంద్ శర్మ మద్దతిస్తామని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ శుక్రవారం తెలిపారు. తాజాగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. Mahesh Rajamoni First Published Sep 30, 2022, 3:55 PM IST Congress president election: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. "నేను నా నామినేషన్ దాఖలు చేయబోతున్నాను (కాంగ్రెస్ అధ్యక్ష పదవికి)" అని ఖర్గే పార్టీ కార్యాలయం వైపు వెళుతున్నప్పుడు మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ ఎస్ హుడా మాట్లాడుతూ... “కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లికార్జున్ ఖర్గే నామినేషన్ వేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను మరియు అతను ఎన్నిక అవుతాడనే నమ్మకం ఉంది. కొన్నేళ్లుగా ఆయన పార్లమెంటులో ప్రజల గొంతుకను పెంచారు. నేను అతని నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకుడిగా సంతకం చేసాను అని అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, జార్ఖండ్ నేత కేఎన్ త్రిపాఠిలు సైతం పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు, థరూర్ ఈ రోజు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించేందుకు రాజ్ ఘాట్‌ను సందర్శించారు. అలాగే, జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుడు కేఎన్ త్రిపాఠి కూడా పార్టీ అత్యున్నత స్థానానికి తన నామినేషన్‌ను దాఖలు చేశారు. పార్టీ నాయకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. “నేను రైతు కుటుంబానికి చెందినవాడిని. భారత వైమానిక దళంలో పనిచేసిన అనుభవం ఉన్న, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా, జార్ఖండ్ శాసనసభ ఉపనేతగా ఎన్నికైన ఓ రైతు కుమారుడు కూడా ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చని దేశం చూస్తోందని త్రిపాఠి చెప్పారు. అంతకుముందు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు దిగ్విజయ్ సింగ్, రాజస్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ కూడా రేసులో ఉన్నారు. కానీ చివ‌ర‌కు అధ్య‌క్ష ప‌ద‌వి రేసు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే వారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. ఖర్గేను ఆయన నివాసంలో పరామర్శించారు. "నేను అతనికి అండగా ఉంటాననీ, ఆయ‌న‌పై పోటీ చేయడం గురించి ఆలోచించలేనని, నేను అతని ప్రతిపాదకుడిగా ఉంటానని కూడా ఖ‌ర్గేకు చెప్పాను" అని దిగ్విజయ్ సింగ్ విలేకరులతో అన్నారు.
శివుడుకి ఆగ్రహానికి గురైన పార్వతీదేవి ఈ ఆలయం దగ్గర ఉన్న పుష్కరణిలో ప్రాణత్యాగం చేసిందని పురాణం. ఇక్కడ పార్వతీదేవి దర్శనం కూడా అలానే ఉంటుందని చెబుతారు. ఈ ఆలయ శిల్ప సంపద కూడా ఎంతో అందంగా ఉంటుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రం, తిరువారూర్ జిల్లాలో త్యాగేశ్వరస్వామి ఆలయం ఉంది. శివుడి స్వయంభువుగా వెలసిన ఈ ఆలయం అతి ప్రాచీనమైన శివాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని త్యాగేశ్వరస్వామి అని, అమ్మవారిని కమలాంబదేవి అని పిలుస్తారు. ఈ ఆలయం 108 శక్తిపీఠాలలో ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో ఒక పెద్ద కొలను ఉంది. దీనినే కమలాంబ పుష్కరణి అని అంటారు. ఈ కొలను మధ్యలోనే కమలాంబదేవి గా వెలసిన పార్వతీదేవి, కుమారస్వామి ఆలయం ఉంది. ఒకసారి ఏదో ఒక కారణంతో శివుడి ఆగ్రహానికి గురైన పార్వతీదేవి, ఈ కొలనులోనే ప్రాణత్యాగం చేసిందట. ఆ దేవి అలా మునిగిపోతూ ఆమె రెండు చేతులతో శివుడికి నమస్కారం చేస్తూ నిట్టనిలువుగా మునిగిపోయిందట. అలా పైకెత్తి నమస్కారం చేస్తున్నట్లుగా ఉండే ఆ రెండు చేతులు ఆ ఆలయంలో భక్తులకి దర్శనమిస్తాయి. ఈ ఆలయం 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా 98 అడుగులతో రాజగోపురం నిర్మించబడింది. శిల్పసంపద ఎంతో అపురూపంగా మలచబడిన ఈ ఆలయంలో ఏకశిలలో తొలిచిన ఒక పెద్ద రాతి రథం ఉంది. ఇంకా గర్భగుడిలో ఉండే స్వామివారి విగ్రహానికి ఎదురుగా ఒకే వరుసలో నవగ్రహాలు ఉండగా అవి అన్ని కూడా స్వామివారినే చూస్తునట్లుగా ఉండటం ఒక ప్రత్యేకత. ఇంకా ఈ ఆలయం మరకత శివలింగంగా ప్రసిద్ధి చెందింది. అయితే కర్ణాటక సంగీత చరిత్రలో, త్యాగయ్య, శ్యామశాస్రి, ముత్తుస్వామి దీక్షితులు ఈ ముగ్గురు వాగ్దేయకారులు కూడా ఇక్కడి నివాసులే అని చెబుతారు. అయితే త్యాగరాజుకి ఆ పేరుని ఈ ప్రాంతంలో ఉన్న త్యాగేశ్వరస్వామి మీద ఉన్న భక్తితో పెట్టినదిగా చెబుతారు.
తెలుగులో ఎంత మంది ఫిమేల్ యాంకర్స్ ఉన్నా.. రష్మీ గౌతమ్ ప్రత్యేకం. అందం, అభినయంతో పాటు.. ఆకట్టుకునే మాటలు, హావభావాలు, కామెడీకి స్పందించే పద్దతి, తన మీద పంచ్ పడితే ముద్దుగా బుంగమూతి పెట్టే తీరూ.. కామెడీ లవర్స్‌కి సుపరిచతమే. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో కమెడియన్స్ చేసే కామెడీతో పాటూ.. రష్మీ యాంకరింగ్‌కి కూడా చాలా క్రేజ్ ఉంది. అప్పుడప్పుడూ ఆ క్రేజ్‌ని కూడా కామెడీ చేసి నవ్వు పుట్టిస్తుంటారు కమెడియన్స్.జబర్దస్త్ అంటే రష్మీ అనేంతగా పేరు తెచ్చుకున్నారు రష్మీ .. కాగా అనిల్ కపూర్ తనయురాలు సోనమ్ కపూర్ 2007 లో రణ్ బీర్ కపూర్ సరసన సావరియా చిత్రంతో బాలీవుడ్ కి పరిచయం అయ్యి తరవాత చాలా విజయవంతమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు .ఈ నేపథ్యంలో యాంకర్ రష్మీ గౌతమ్ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది. కరోనా వైరస్ వలన దేశమంతటా లాక్ డౌన్ విధించడంతో సెలబ్రెటీలు నుండి సామాన్య ప్రజల వరుకు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు .నిత్యావసరాల కోసం మరియు అత్యవసర పరిస్థితులలో తప్ప ఎవరు బయటకి రావడం లేదు. సెలబ్రెటీలు కరోనా వైరస్ పై స్పందిస్తూ మరియు వారు ఈ లాక్ డౌన్ లో ఎలా గడుపుతున్నారనే దానిపై ట్వీట్ చేస్తున్నారు . తాజాగా సోనమ్ ‘నేను ఓ చాకోలెట్ కేక్ చేశాను. నేను చేయాలనుకున్న టైమ్‌కి ఇంట్లో చాక్‌లెట్ లేకపోతే ఓ పుడ్ సప్లై సంస్థ నాకు చాలా క్వాలిటీ గల చాక్‌లెట్‌ను పంపింది. చాక్లెట్ పంపించి నాకు సహకరించిన వారికి ధ‌న్య‌వాదాలు.. లవ్యూ న్యూ ఢిల్లీ’ అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన రష్మీ.. ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్ బాబు చెప్పిన ‘బాధ్యత ఉండక్కర్లా’ డైలాగుతో సోనమ్‌పై ఫైర్ అయ్యింది . సమాజంలో సెలబ్రెటీ అయితే చాలు …ఏదైనా చేయాలనిపిస్తుంది …తమ పలుకుబడి ఉపయోగించుకొని దేనినైనా తెచ్చుకోగలమని అనుకుంటారు .కాకపోతే కొంచెం బాధ్యతతో నడుచుకుంటే మంచిది . సెలబ్రెటీ ఇలా చాక్‌లెట్ డెలీవరీ కోసం ప్రజలను రోడ్లపైకి తీసుకురావడం ప్రస్తుత పరిస్థితులలో మంచిది కాదు. సామజిక దూరం పాటించి కరోనాను ఎదుర్కోవాల్సిన సమయం ఇది.ఇలా వ్యక్తిగత అవసరాల కోసం బాధ్యతను విస్మరించడం సరైన పద్ధతేనా అని ఒకసారి ఆలోచించాలి అంటూ సోనమ్ పై విరుచుకుపడింది రష్మీ గౌతమ్. ప్రస్తుత పరిస్థితులలో మూగ జీవాలను పట్టించుకోవడం లేదు . వీధి కుక్కల పరిస్థితి దారుణంగా ఉంది అని చలించిపోయిన రష్మీ వాటికీ తానే స్వయంగా ఆహారం ,నీళ్లు అందిస్తుంది .అందరు కూడా దగ్గరలో ఉన్న మూగజీవాలకు ఆహారం అందించి వాటిపై ప్రేమను చూపి మానవత్వాన్ని చాటుకోవాలని అన్నారు .
కాలంతో పాటు మనుషులు కూడా మారిపోతున్నారు. పూర్వం మన ఇళ్లలో డైనింగ్ టేబుల్స్ ఉండేవి కావు. దాంతో అందరూ నేలపై కూర్చుని తినేవారు. అందుకే అప్పట్లో మనిషి ఎక్కువ కాలం జీవించేవాడు. కానీ ప్రస్తుత కాలంలో ఏం తినాలన్నా టేబుల్ మీద పెట్టుకుని తినడానికి అలవాటు పడిపోయాం. ప్రధానాంశాలు: ఆహరం తినే అలవాట్ల కారణంగా ఆరోగ్యం నేలపై కూర్చుని తినడం వల్ల బోలెడు లాభాలు ఇప్పుడు భోజనం చేయాలన్నా, టిఫిన్ చేయాలన్నా, ఏం తినాలన్నా, తాగాలన్నా.. అన్నింటికీ కుర్చీలు, టేబుల్స్‌కు బాగా అలవాటు పడిపోయాం. ఏ మాత్రం నడుము వంచకుండా అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నాం. కుర్చీల్లో కూర్చునేవారికి నడుం చుట్టూ రింగులాగా కొవ్వు పేరుకొని... ఆ తర్వాత పొట్ట పెరుగుతుంది. ఆ తర్వాత అధిక బరువు పెరుగుతారు. ఆ తర్వాత బీపీ, షుగర్, హార్ట్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇదంతా లేకుండా... నేలపై కూర్చుంటే పొట్ట వచ్చే అవకాశాలు తక్కువ అని నిపుణులు చెప్తున్నారు. మన పూర్వీకులు మనకు నేర్పిన అలవాట్లు, పద్ధతులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి. కానీ మనం వాటిని చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. దీంతో ప్రస్తుతం నేలపై కూర్చుని భోజనం చేసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. కానీ నేలపై కూర్చుని ఆహారం తింటే ఎన్నో లాభాలు కలుగుతాయని వైద్యులు చెప్తున్నారు. యూరిపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలలో ప్రచురితమైన ఓ కథనం ప్రకారం... నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినడం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇది ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాన్ని అందివ్వదు. మనం నేలపై కూర్చుని తినాలని మన పెద్దవాళ్లు చెప్పిన పద్ధతి వెనక చాలా ప్రయోజనాలున్నాయి. కూర్చునే పద్ధతి కూడా రెండు కాళ్లు క్రాస్‌గా మడతపెట్టి కూర్చుని తినాలి. ఇలా తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు మీరు విస్తుపోయేలా చేస్తాయి. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థకు సహకారం లభిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. తినడానికి నేలపై కూర్చునప్పుడు ఖచ్చితంగా మీరు కాళ్లు మడతపెట్టి కూర్చుంటారు. అంటే దాన్నే సుఖాసన లేదా హాఫ్ పద్మాసన అని పిలుస్తారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇలా ఆహారం ముందు కూర్చోవడం వల్ల జీర్ణక్రియకు సిద్ధంగా ఉండాలని మెదడుకి సంకేతాలు అందుతాయి. ప్లేట్ నేలపై ఉండటం వల్ల ఆటోమేటిక్‌గా మీ శరీరం కిందకు వంగుతుంది. ఆహారం తీసుకున్న తర్వాత మళ్లీ వెనక్కి కూర్చున్న పొజిషన్‌కు వస్తుంది. ఇలా వెనక్కి, ముందుకి వెళ్లడం వల్ల పొట్టలో ఉండే కండరాలు యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల ఆహారం త్వరగా, సులువుగా జీర్ణమవుతుంది. నేలపై కూర్చుని తినడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇలా కూర్చుని తినేటప్పుడు ఆహారంపై మెదడు ఫోకస్ పెడుతుంది. ఎంత పరిమాణంలో ఆహారం తిన్నారు అనే విషయాన్ని గుర్తించి పొట్ట నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. కింద కూర్చుని భోజనం చేస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. బీపీ కంట్రోల్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఫ్లోర్‌పై కూర్చుని తినడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అదే డైనింగ్ టేబుల్, కుర్చీలో కూర్చుంటే.. బ్లడ్ ఫ్లో హార్ట్‌కి సరిగా ఉండదు. కాబట్టి నిత్యం ఫ్లోర్ పై కూర్చుని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నేలపై కూర్చుని తింటే శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది. దీంతో వెన్ను సమస్యలు రావు. గ్యాస్ సమస్యలు కూడా దూరం అవుతాయి. నేలపై కూర్చుని తినేవాళ్లు ఎలాంటి ఆందోళన చెందకుండా భోజనం చేస్తారని పలు అధ్యయనాల్లో తేలింది. దీంతో ఎంత తింటున్నాం, ఏం తింటున్నామన్నది తెలుస్తుంది. దీంతో సరిపడా భోజనం చేస్తాం. మీరు గమనించారో లేదో... భోజనం చేసేందుకు కూర్చునే స్థితిలో ఒక ఆసనం కనిపిస్తుంది. ఇలా నేల మీద కాళ్లు మడుచుకుని కూర్చునే భంగిమలు సుఖాసనం, అర్ధపద్మాసనాన్ని గుర్తు చేస్తాయి. జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయటానికీ, వెన్ను నిటారుగా ఉండటానికీ, మానసిక ప్రశాంతతకూ ఈ ఆసనాలు ఎంతో సహాయపడతాయి. పద్మాసనంలో కూర్చుని తినడం వల్ల నడుము కింద భాగం, పెల్పిస్, పొట్ట చుట్టూ.. కండరాల నొప్పులు తగ్గుతాయి. మీ జీర్ణవ్యవస్థ రిలాక్సుగా, నార్మల్ పొజిషన్ లో ఉండేలా సహాయపడతాయి. త్వరగా, వేగంగా ఆహారం జీర్ణమవడానికి ఈ పద్మాసనం సహాయపడుతుంది. సాధారణంగా ఫ్లోర్ పై కూర్చుని తినేది ఫ్యామిలీ యాక్టివిటీ. ఇది కుంటుంబంతో సంబంధం ఏర్పరచుకోవడానికి సరైన సమయం. కింద కూర్చుని తినడం వల్ల ప్రశాంతమైన, హ్యాపీ మూడ్ ఉంటుంది. ఇది కుటుంబంతో బాంధవ్యాన్ని పెంచుతుంది. అలాగే.. కింద కూర్చుని తినేటప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి తినడం కూడా ఆనవాయితీ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి భంగిమ చాలా అవసరం. ఫ్లోర్‌పై కూర్చుని తినడం అనేది మంచి భంగిమ. మంచి భంగిమ కేవలం ఆరోగ్యానికే కాదు.. గాయాలను తగ్గిస్తుంది. కండరాలు, కీళ్లపై ఒత్తిడి పడకుండా నివారిస్తుంది. అలాగే రకరకాల బ్యాక్ పెయిన్, ఇతర నొప్పులు రాకుండా అరికడుతుంది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఫ్లోర్‌పై కూర్చుని తినడం వల్ల ఎక్కువకాలం జీవించడానికి సహాయపడుతుందని.. అధ్యయనాలు నిరూపించాయి. ఎలాంటి సపోర్ట్ లేకుండా పద్మాసనం వేసేవాళ్లు ఎక్కువకాలం బతుకుతారని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. సుఖాసన లేదా పద్మాసనం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. అందుకే ఫ్లోర్‌పై కూర్చుని తినే సంప్రదాయం మన పూర్వీకులు కనుగొన్నారు. ఇలా కూర్చుని తినడం వల్ల మైండ్ చాలా రిలాక్స్‌గా ఉంటుంది. దీనివల్ల నరాలు ఉత్తేజితమవుతాయి. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
thesakshi.com : (Megastar Chiranjeevi)మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య అనే పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. సినిమాలో ఈ ఇద్దరు బ్రదర్స్ గా నటించబోతున్నారు. అందుకే ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ సినిమా రిలీజ్ అప్ డేట్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక రవితేజ, ఈ చిత్రంలో మెగాస్టార్ కి సవతి తల్లి కొడుకు అట. మెగాస్టార్ – రవితేజ.. రెండు క్యారెక్టర్ల మధ్య ఫుల్ ఎమోషనల్ డ్రామా ఉంటుందని తెలుస్తోంది. పైగా చిరంజీవితో పాటు ఈ చిత్రంలో రవితేజ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట. అన్నట్టు ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా శృతి(shruti Haasan)హాసన్ నటించబోతుంది. 2023 సంక్రాంతి పండగ కోసం క్రేజీ చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’ ను జనవరి 13న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమిళ హీరో విజయ్ నటిస్తున్న బైలింగ్వల్ మూవీ ‘వారసుడు’ కూడా పొంగల్ సీజన్ లోనే రాబోతోంది. అలానే చిరంజీవి నటిస్తున్న ‘మెగా154′ సినిమా కూడా పెద్ద పండక్కి రాబోతోందని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే(waltair Veerayya)’వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న చిరంజీవి సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇటీవల సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని.. మెగా154 సినిమా అనుకున్న సమయానికే పూర్తవుతుందని నివేదికలు తెలిపాయి. ఇటీవల ‘గాడ్ ఫాదర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి.. ప్రస్తుతం తన 154వ చిత్రంపైనే ఫుల్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ అయింది. మూడు పాటలు మరియు కొద్దిగా టాకీ పార్ట్ మాత్రమే పెండింగ్ ఉన్నట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. చిరంజీవి – శృతి హాసన్ మీద రెండు పాటలతో పాటుగా ఓ ఐటమ్ సాంగ్ ను షూట్ చేయాల్సి ఉందని అంటున్నారు. సంక్రాంతి విడుదలకు ఇంకా దాదాపు 3 నెలల సమయం ఉంది కాబట్టి.. ఓవైపు షూటింగ్ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి టీమ్ అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టినట్లు మేకర్స్ తెలిపారు. మిగతా చిత్రీకరణ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయడం ఖాయమని అంటున్నారు. అదే సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే రూపొందే NBK107 సినిమాని కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీన్ని పండుగ బరిలో నిలపాలని బాలయ్య యోచన చేస్తున్నట్లుగా చెప్పుకున్నారు. అయితే సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమానే లాక్ అయినట్లుగా తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జనవరి 13వ తేదీన విడుదల అవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో #Mega154ForSankranthi అనే హ్యాష్ ట్యాగ్ తో మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇదే నిజమైతే పొంగల్ రేసులో ‘ఆది పురుష్’ ‘వారసుడు’ సినిమాలతో పాటుగా ‘మెగా154’ మూవీ కూడా ఉంటుంది. గతంలో ఫెస్టివల్ సీజన్ లో ఒకేసారి రిలీజైన రెండు మూడు పెద్ద సినిమాలు హిట్టైన సందర్భాలు ఉన్నాయి. మరి ఈసారి బాక్సాఫీస్ వార్ లో ఏమి జరుగుతుందో చూడాలి. Tags: #Chiranjeevi#cinema news#MEGASTAR CHIRANJEEVI#TOLLYWOODEntertainmentMega154th filmwaltheru Veerayya
మాట్లాడితే చాలు పారదర్శకత అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటారు. కానీ ఆచరణలో అలా జరుగుతోందా అన్నదే అతి పెద్ద డౌట్. అందునా కొత్త మంత్రులు కొందరు ఏం చేస్తున్నారో ఏమో కూడా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. ఈ నేపధ్యంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మంత్రిత్వ శాఖలో కొత్త పోస్టుల భర్తీకి సంబంధించి చేపట్టిన నియామకాల ప్రక్రియ మొత్తం లోపభూయిష్టం అంటూ దాఖలైన పిటిషన్ మీద హై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉంది అంటున్నారు. నియామకాల ప్రక్రియ మొత్తం మీద స్టే విధిస్తూ ఆరు వారాల తరువాత తాజాగా సరికొత్త నియామకాల ప్రక్రియ చేపట్టాలని కోర్టు పేర్కొనడం తో జగన్ సర్కార్ లోని పారదర్శకత ఇపుడు ప్రశ్నార్ధకం అయింది అంటున్నారు. ఈ మధ్యనే స్రీ శిశు సంక్షేమ శాఖలో 560 మంది విస్తరణ అధికారుల నియామకం విషయంలో ఏ మాత్రం పారదర్శకత పాటించలేదని ముందే కొందరు ఉన్నతాధికారులు పోస్టులు అమ్ముకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటి మీద హై కోర్టులో ఫైల్ అయిన కేసును విచారించిన న్యాయస్థానం పాత నియామకలా ప్రక్రియ మీద స్టే ఇవ్వడం సర్కార్ వారికి అప్రదిష్టగానే అంతా చూస్తున్నారు. ఈ నెల 18న పరీక్షలు నిర్వహించి 25న మౌఖిక పరీక్ష అంటూ కొందరి పేర్లను మాత్రమే పిలవడం వెనక భారీ తతంగమే నడించింది అని అంటున్నారు. ఒక్కో పోస్టుని పది లక్షల రూపాయలకు అమ్ముకున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. పైగా కనీసం మెరిట్ లిస్ట్ను ప్రకటించకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ పెట్టడంపై వెనుక ఉన్న దురుద్దేశాలని అలాగే యధేచ్చగా సాగిపోయిన అక్రమాలను అర్హులైన అభ్యర్ధుల తరఫున కొందరు కోర్టు దృష్టికి తీసుకెళ్ళడంతో వారికి న్యాయం జరిగేలా టోటల్ నియామకాల ప్రక్రియనే కోర్టు స్టే విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో మళ్ళీ పరీక్ష పెట్టి సజావుగా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారికి పోస్టులు ఇవ్వడం ప్రభుత్వ కీలక బాధ్యతగా ఉంది. ఇదిలా ఉంటే ఈ పోస్టుల నియామకాల ప్రక్రియ అంతా గందరగోళంగా అక్రమ విధానాలతో సాగుతోందని ఒక వైపు రచ్చ సాగుతున్నా ముఖ్యమంత్రి జగన్ అదే శాఖ మీద సమీక్షా సమావేశం నిర్వహించి నెలాఖరులోగా నియామకాలు పారదర్శకంగా పూర్తి చేయాలని చెప్పి వదిలేశారు అన్న మాట కూడా వినిపిస్తోంది. మరి జగన్ దృష్టికి ఈ ఆరోపణలు రాలేదా వచ్చినా వాటిని సదరు మంత్రిత్వ శాఖ పెద్దలు తప్పుదోవ పట్టించారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా జగన్ సర్కార్ పరువు పోయేలా ఈ నియామకాల ప్రక్రియ అయితే సాగింది అన్నది వాస్తవం. మరి దీని మీద ఇప్పటికైనా సదరు శాఖ మీద ఫోకస్ పెట్టి సీరియస్ యాక్షన్ కి దిగుతామని ప్రభుత్వ పెద్దలు చెప్పకపోతే మరోసారి అయినా ఇదే తరహాలో నియామకాల ప్రక్రియ చేసేందుకు వారు సాహసించరు అన్న డౌట్ మాత్రం ఎవరికీ లేదు అంటున్నారు. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. Tupaki TAGS: AndhraPradesh WomenwelfareDepartment Politics YsJagan Minister UshaSreeCharan Government PoliticalNews
ఈ రోజు జెన్నీ వాన్‌ వెస్ట్‌ పాలేన్‌ వర్థంది. ఈనాడు, ఆనాడు కూడా పెట్టుబడిదారుల గుండెల్లో దడపుట్టించే పేర్లల్లో జెన్నీ మార్క్స్‌ పేరు ఒకటి. జెన్నీ మార్క్స్‌ను ప్రేమించింది. ఆయన జీవిత సహచరి అయింది. రాజకీయాల్లోను సహచర్యం అందించింది. వారి ప్రేమ మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు మహారాజుల ప్రేమగాథలు, పుక్కిటిపూరాణం లాంటిది కాదు. తాజ్‌మహల్‌ కట్టించిన షాజహాన్‌, ముంతాజ్‌ల ప్రేమ లాంటిది అసలే కాదు. ‘తాజ్‌మహాల్‌ నిర్మాణంలో రాళ్ళెత్తిన కూలీలెవరోరు’ అని ప్రశ్నిస్తాడు శ్రీశ్రీ. ఆ కూలీలను శ్రమ దోపిడీ నుంచి విముక్తులను చేసేందుకు అంకితమైన ప్రేమ జెన్నీ- మార్క్స్‌లది. ఈ భూతలంలో కొంత మంది తమకోసమే, తమ విలాసాల కోసమే బతుకుతారు. మరి కొందరు ప్రజల కోసమే బతుకుతారు. తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, రాజకీయవేత్తలు, ఎంతో మంది మానవాళికి ఎనలేని మేలుచేసిన వాళ్ళు ఉన్నారు. అంటువంటి తత్వవేత్తల్లో గొప్ప తత్వవేత్త కారల్‌మార్క్స్‌. మార్క్స్‌ సిద్ధాంతం శ్రామికులను అధికార పీఠంపై కూర్చోపెట్టింది. అట్టి మార్క్స్‌ను వరించింది జెన్నీ. జెన్నీలేని మార్క్స్‌ లేడు. మార్క్స్‌లేని మార్క్సిజం లేదు. మార్క్సిజం కానిది కార్మిక వర్గ సిద్ధాంతం కాదు. ఆ సిద్ధాంతం లేకుండా శ్రమదోపిడీ నుంచి కార్మిక వర్గానికి విముక్తి లేదు. ఆ సిద్ధాంత కర్తను, ఆయనతో పాటే ఆయనపడ్డ కష్టాలనూ వరించిన జెన్నీ జీవిత విశేషాలు తెలుసుకోవాలి. జెన్నీ పూర్తి పేరు జోహన్న బెర్త జూలీ జెన్నీ వాన్‌ వేస్ట్‌ఫాలేన్‌. 1814 ఫిబ్రవరి 12న జర్మనీలో పుట్టింది. 1881 డిసెంబర్‌ 2న తన 67వ యేట లండన్‌లో మరణించింది. జెన్నీ తల్లీదండ్రులు ధనవంతులు. జర్మనీని ప్రష్యా అనేవాళ్ళు. జెన్నీ తండ్రి లుడ్విగ్‌ వాన్‌ వేస్ట్‌ ఫాలేన్‌ రాజోద్యోగి. జెన్నీ సోదరుడు ఎడ్గార్‌ కారల్‌మార్క్స్‌ స్నేహితుడు. మరో సోదరుడు ఫెర్డ్డినాండ్‌ ప్రష్యారాజుకు అత్యంత సన్నిహితుడు, మంత్రి. జెన్నీ, కారల్‌మార్క్స్‌ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. చదువుల్లో ఆరితేరినవారు. జెన్నీ గొప్ప అందగత్తె. మార్క్స్‌ తండ్రి అదే పట్టణంలో ప్రముఖ లాయరు. ఆయన, జెన్నీ తండ్రి లుడ్విగ్‌ మంచి స్నేహితులు. జెన్నీ మార్క్స్‌ కన్నా నాలుగైదు సవంత్సరాలు పెద్ద. అయినా వారి భావాలు వారిని దగ్గర చేశాయి. అదే వారి మధ్య ప్రేమకు దారితీసింది. వారి ప్రేమ మన సినిమాల్లో మాదిరి రసవత్తర ప్రేమ కథ కాదు. శ్రామికవర్గ విముక్తి కోసం అంకితమైన ప్రేమ. కొంత కాలానికి వివాహం చేసుకున్నారు. కార్ల్‌, జెన్నీలకు ఏడుగురు సంతానం. నలుగురు పిల్లలు పుట్టిన కొంతకాలానికే చనిపోయారు. ముగ్గురు కుమార్తెలు. జెన్నీ, లారా, ఎలియానార్‌లు. అమ్మనాన్నలాగా కార్మిక, రాజకీయ ఉద్యమాల్లో చేరి తోటి కార్యకర్తలని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు మనం చేప్పుకుంటున్న కథ 1810-1890 మధ్యకాలంలోనిది. ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితులు మనకి అర్థం కాకపోతే జెన్నీ, మార్క్స్‌ల జీవితం కూడా అర్థం కాదు. 1750లో ఫ్రెంచి విప్లవం వచ్చింది. లక్షలాది శ్రామిక జనం పోరాటం చేసిన ఫలితంగా రాచరికం కుప్పకూలింది. సామాన్య జనమే తిరగబడి రాజుకు మరణశిక్ష వేశారు. ఆ తిరుగుబాటు మొత్తం ప్రపంచంలో దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తిరగబడాలనే భావాలు రేకెత్తించింది. స్వేచ్ఛ, సమానత్వం, నినాదాలు అప్పుడే మొదలైయ్యాయి. ఫ్రాన్స్‌కు పక్కనే ఉన్న ప్రష్యా రాచరికంలోనే ఉంది. అయినా రాచరికానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఆలోచనలు మొదలయ్యాయి. ఇంగ్లాండ్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియం వంటి దేశాలల్లో సోషలిస్టు భావాలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రారిశ్రామికీకరణతో కార్మిక వర్గం – విప్లవ వర్గం ఆవిర్భవించింది. మహా మేధావి మార్క్స్‌పై ఈ కొత్త ఆలోచనల ప్రభావం పడింది. ఒక న్యాయవాది కొడుకు. అధికార దర్పాలను, విలాసవంతమైన జీవితాన్ని కోరుకోలేదు. తన మేధస్సుకు పదును పెట్టాడు. అధ్యయనం పెంచాడు. కార్మికుల పోరాటాలను, నియంతృత్వ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సాగే ప్రతిఘటనలను పరిశీలించాడు. క్రమంగా వాటితో మమేకమై పని చేయడం ప్రారంభించాడు. తన రచనా వ్యాసంగాన్ని ఆయుధంగా మార్చుకొన్నాడు. కార్మికవర్గ విముక్తి తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. పెట్టుదారీ ప్రభుత్వాలు ఆయన పట్ల ద్వేషం పెంచుకున్నాయి. ఆయనను ఎక్కడా నిలవనీయలేదు. సొంత దేశం అయిన జర్మనీ నుంచి తరమివేశారు. పారిస్‌లో తల దాచు కున్నాడు. అక్కడా ఉండనియ్య లేదు. బ్రస్సెల్స్‌ చేరుకున్నాడు. అక్కడి ప్రభుత్వం కూడా తరిమి వేసింది. చివరికి లండన్‌ నగరంలోని మురికి వాడల్లో, కార్మిక వాడల్లో కాపురం పెట్టాడు. ఈ కాలంలో జెన్నీ, మార్క్స్‌ల సంసారం ఎలా సాగిందో ఊహాతీతం. రాచ బిడ్డ జెన్నీ. ఆమె కోరుకుంటే రాజపుత్రుడే భర్తగా దొరికేవాడు. కానీ ఆమె జీవితాశయం వేరు. మార్క్స్‌ను ప్రేమించింది. మార్క్స్‌ భావాలను ప్రేమించింది. ఎన్ని కష్టాలైనా భరించింది. పేదరికం వారిపై కక్షగట్టింది. స్థిరమైన నివాసంలేక దేశ బహిష్కరణలకు గురయ్యారు. వలస పక్షుల్లాగా ఎన్ని దేశాలు తిరిగారో? కన్న బిడ్డలకు కడుపునిండ తిండిలేక వైద్యం చేయించే స్తోమత లేక నలుగురు బిడ్డలను పోగొట్టుకున్నారు. ”పాపం ఆ పసిది మూడు రోజులు మృత్యువుతో పోరాడింది. నికృష్టమైన పేదరికం అనుభవిస్తున్నప్పడు మరణించిందా బిడ్డ. మా జర్మన్‌ మిత్రులు సహితం ఆ సమయంలో లేరు. మమ్మల్ని ఆదుకునే స్థితిలో లేరు. దడదడలాడే గుండెతో ప్రక్క శివారులో ఉండే ఒక ఫ్రెంచి ప్రవాసితుని వద్దకు వెళ్ళాను. ఆయన మాకు పరిచయస్తుడు. అత్యంత స్నేహ భావంతోనూ, సానుభూతితోనూ అతను రెండు పౌనులు అందించాడు. దానితో శవపేటిక కొన్నాం. అదిగో అందులో విశ్రాంతి తీసుకుంటున్నది నా బిడ్డ! పుట్టినప్పుడు ఉయ్యాల ఇవ్వలేకపోయాను. తుదకు తుది గూడు కూడా చాలా సేపు సమకూర్చలేకపోయాం” అని మిత్రునికి రాసిన లేఖలో ఈ మాటలు సాధారణ కడగండ్లు, కన్నీరు కాదు. ఇంతకన్న ఎమిచెప్పుకోవాలి! లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికుల కష్టాలు చూశాం. జెన్నీ – మార్క్స్‌ జీవితం అంతకన్నా మెరుగైంది కాదు. పగవాళ్ళకు కూడా వద్దురా బాబు అనిపించే కష్టాలు పడ్డారు. మార్క్స్‌ కుటుంబానికి ఎంగెల్స్‌ మైత్రి కొండంత అండ. మార్క్స్‌ మరణనంతరం కూడా మార్క్స్‌ కుంటుంబ బాధ్యతలను ఎంగెల్స్‌ తన భుజాలపై వేసుకున్నాడు. ”జయించటానికి ప్రపంచం ఉంది” అంటూ శ్రామిక వర్గానికి కర్తవ్య బోధ చేసిన కమ్యూనిస్టు ప్రణాళిక 1848లో ప్రచురించారు. కార్మికవర్గానికి అది ఒక దిక్సూచి. అది మొదలు అనేక దేశాల్లో ప్రతిఘటనలు, పోరాటాలు ఎన్నో జరిగాయి. రాచరికాలకు, నియంతృత్వ ప్రభుత్వాలకు, వలసవాద, సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా తిరగబడని దేశమంటూ లేదు. మార్క్స్‌ పుట్టిన దేశంలోనే హిట్లర్‌ పుట్టాడు. సోవియట్‌ సైన్యాల చేతుల్లో కుక్క చావు చచ్చాడు. తెలిసిన చరిత్రే కదా! తాత్కాలికంగా విప్లవోద్యమాలకు ఎదురుదెబ్బలు తగులుతునే ఉంటాయి. మార్క్స్‌ కాలంలోనూ ఎదురుదెబ్బలు తగిలాయి. విప్లవశక్తులు ఓడిపోయి, ప్రతిఘాత శక్తులు విజృభించిన ప్రతి సారి మార్క్స్‌ దేశ బహిష్కారాలకు గురయ్యాడు. అయినా రాజకీయ అర్థశాస్త్రం, పెట్టుబడి గ్రంథరచన, కార్మిక వర్గ పోరాటాలను ఉచ్చస్థితికి తిసుకేళ్ళడం వారి జీవితాశయం. జెన్నీ మాములు గృహిణి కాదు. ఆమె మార్క్స్‌ని మాత్రమే ప్రేమించలేదు. విప్లవాన్ని ప్రేమించింది. ఆమె బిడ్డలను మాత్రమే సాకలేదు. రాజకీయ కార్యకర్తలను సాకింది. కమ్యూనిస్టులపై నిందా ప్రచారాలు అప్పుడూ ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. కమ్యూనిజం వచ్చేదాక ఉంటాయి. ”వామ్మో వాయ్యో” అంటూ ఈ కాస్త పనికే యాస్ట పడిపోతే, ప్రఖ్యాత రతయిత తెన్నేటి సూరి ఒక పాటలో చెప్పినట్టు ”అసలు ఎందుకు మొదలెట్టావోరు” అని ప్రశ్న వేసుకోవాలి. అయితే మొదలెట్టాక చేసేదేముంది. దోపిడీ దౌర్జన్యాలను భరిద్దామా? దేశ రాజధానిలో లక్షలాది మంది రైతులు పోరాడుతున్నారు. దోపిడీ ఎక్కడ ఉంటుందో పోరాటం అక్కడే ఉంటుంది. అడుగు ముందుకు వేద్దాం. దోపిడీని అంతం చేద్దాం. జెన్ని-మార్క్స్‌-ఎంగెల్స్‌ల త్యాగాలను మరవక వారి కలలను నిజం చేద్దాం.
రాష్ట్రానికి సంబంధించి నాలుగు క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రుల్లో ఉత్తమ వైద్య సేవలను అందించడానికి గుర్తించాం.. జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రులు, అలాగే క్రిటికల్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా వైద్యసేవలు అందించే క్రమంలో రిస్కు ఉంటుందని తెలిసినప్పటికీ కూడా చాలా కష్టపడి ఈ సేవ చేస్తున్నారు.. తెలియని భయం ఉన్నప్పటికీ కూడా మీరు వైద్య సేవలు అందిస్తున్నందుకు నేను సెల్యూట్‌చేస్తున్నాను.. ఢిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగా కేసులు సంఖ్య పెరిగింది.. పూర్తిగా వారందర్నీ ట్రేస్‌ చేసి వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను, సెకండరీ కాంటాక్ట్స్‌ను పూర్తి క్వారంటైన్‌ లేదా? ఐసోలేషన్‌లో పెట్టాం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెంబర్తికి ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం జిల్లాల పునర్విభజన తర్వాత జనగాం జిల్లాలోకి వెళ్ళింది. ఇది వాస్తవానికి ఓ మారుమూల ప్రాంతం. పెంబర్తి గ్రామం ప్రపంచం అబ్బురపడే కళాఖండాలు, ఇత్తడి వస్తువులు, లోహ సామగ్రి, ఇత్తడితో చేయబడ్డ పరికరాల తయారీలో ఎంతో పేరుగాంచింది.ఇక్కడి కళాకారులు ఇత్తడి, కాంస్యంతో అనేక కళాత్మకమైన వస్తువులను రూపొందించటంలో సిద్ధహస్తులు. కాకతీయుల కాలం నుండి పెంబర్తి గ్రామం హస్త కళలకు నిలయంగా మారింది. కాకతీయ శైలిని అనుసరించడం వీరి కళ ప్రత్యేకత. మానవ శ్రమ ఆవిష్కరించిన పెంబర్తి కళలు అనేక కళా ఖండాలుగా దేశ విదేశాల్లోవర్థిల్లుతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, దేవతల విగ్రహాలను, కళా ఖండాలను, గృహ అలంకరణ వస్తువులను గుడి, బడి మొదలైన అనేక మానవ అవసరమైన హస్త కళా రూపాలను పెంబర్తి కళాకారుల నైపుణ్యంతో తయారు చేస్తారు. ఇక్కడ తయారైన కళాత్మక వస్తువులను అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ధ్వజస్తంభ తొడుగులు, గోపుర కలశాలు, కవచాలు రూపొందించడంలో వీరు దిట్ట. లోహాలు, లోహమిశ్రమాలతో కుఢ్యాలంకరణ చేయ డంలో, గీతోపదేశం, దశావతారాలు, అష్టలక్ష్మీ,సీతారామ పట్టాభిషేకం, కాకతీయ కళాతోరణం, చార్మినార్‌, గణేష్‌, లక్ష్మీదేవి, సరస్వతి, హంస తదితర సజీవ రూపాలను నివాస కుఢ్యాలపై హృద్యంగా ఆవిష్కరిస్తారు ఇక్కడి కళాకారులు. Crafts Pembarthi Spot Telangana Tourism Similar Posts Recent Posts International HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog.
భీముడు 10,000 ఏనుగులతో సమానమైన శక్తికి ప్రసిద్ధి చెందినవాడు. మరి అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. దుర్యోధనుడు భీమునిపై విషం ప్రయోగించాడు ఒకమారు పాండవులు మరియు కౌరవులు కలిసి గంగా తీరంలో విహారయాత్రకి వెళ్లేరు. వారు ఆడుకునే చోట అందమైన ప్రకృతి దృశ్యాలతో కూడిన ఒక తోట ఉండేది. పిల్లలు రాజభవనం నుండి తెచ్చిన తినుబండారాలను ఒకరి నోటిలో ఒకరు తినిపించుకున్నారు. ఆ సమయంలో దుర్యోధనుడు భీముడికి కాలకూటం అనే ప్రాణాంతకమైన విషాన్ని తినిపించేడు. Click below to watch - భీమ బకాసుర అప్పుడేం జరిగింది? తర్వాత అందరూ నీళ్లలో ఆడుకున్నారు. సాయంత్రానికి అందరూ అలసిపోయారు. రాత్రంతా అక్కడే గడపాలని నిశ్చయించుకున్నారు. వారందరూ నిద్రకు ఉపక్రమించగా, భీముడు విషం యొక్క ప్రభావంతో ఆక్రమించబడ్డాడని దుర్యోధనుడు గ్రహించి వాడిని లతలతో కట్టి గంగలోకి తోసేసాడు. భీముడు 10,000 ఏనుగుల బలాన్ని ఎలా పెంచుకున్నాడు? అపస్మారక స్థితిలో గంగలో మునిగిపోయిన భీముడు నాగలోకానికి చేరుకున్నాడు. చాలా మంది నాగులు అతన్ని శత్రువుగా భావించి కొరికారు. దుర్యోధనుడు ఇచ్చిన విషానికి నాగుల విషం యాంటీ- వేనమ్‌గా పనిచేసింది. భీముడు మేల్కొని, తనకు తానే కట్టడాలను విప్పుకుని నాగులను పట్టుకుని, నేలపై పడగొట్టడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు వాసుకి దిగి వచ్చాడు. ఆర్యక అనే ముసలి నాగుడు భీముడిని తన మనవడికి మనవడిగా గుర్తించాడు. ఆర్యక తాలుక కుమార్తెకు కుమారుడు కుంతీ తండ్రి అయిన శూరసేనుడు. వాసుకి భీముడికి చాలా బంగారం మరియు రత్నాలు సమర్పించాడు. నాగలోకంలోని కుండలలోని పాయసం తాగడానికి భీముడిని అనుమతించమని ఆర్యక సూచించాడు, వీటిలో ప్రతి ఒక్క కుండలో పాయసం తాగేవారికి 1,000 ఏనుగుల బలాన్ని ఇస్తాయి. భీముడు అన్ని కుండల నుండి పాయసం తాగి వాటిని జీర్ణం చేసుకోవడానికి ఏడు రోజులు నిద్రపోయాడు. ఎనిమిదవ రోజు అతను మేల్కొన్నప్పుడు 10,000 ఏనుగులంత బలవంతుడయ్యాడని, అతన్ని ఎవరూ ఓడించలేరని నాగులు భీముడికి చెప్పారు.
దశాబ్దాల తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది బీజేపీ పట్టుదల. అందుకని అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటోంది. పైగా కేంద్రంలో ఉంటు రాష్ట్రాన్ని నియంత్రిస్తోంది కాబట్టి ప్రయత్నాలు సాఫీగా సాగుతున్నాయి. మరి జనాలు ఏమనుకుంటున్నారు ? ఇదంతా జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జమ్మూలో పర్యటించిన కేంద్ర హోంశాఖ అమిత్ షా మాట్లాడుతు మూడు వర్గాలకు తొందరలోనే రిజర్వేషన్లు అమలు కాబోతున్నట్లు ప్రకటించారు. కాశ్మీర్ పర్యటనలో రాజౌరిలో అమిత్ మాట్లాడుతు గుజ్జర్లు బకర్వాల్లు పహరీ సామాజికవర్గాలకు తొందరలోనే రిజర్వేషన్ల సౌకర్యాలు అందుతాయన్నారు. పై వర్గాలకు ఎస్టీ హోదాను కల్పించేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రకటించారు. 370 అధికరణాన్ని తొలగించిన కారణంగానే అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం కేంద్రానికి దక్కిందని చెప్పారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తికాగానే పై వర్గాలకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జమ్మూ-కాశ్మీర్ లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలీదు. అయితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా కచ్చితంగా అధికారంలోకి రావాలన్నదే బీజేపీ వ్యూహం. ఇందులో భాగంగానే కొత్త ఓటర్లను ప్రక్రియ మొదలైంది. అయితే దీన్ని లోకల్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధంలేని వాళ్ళందరినీ లోపలికి పిలిపించి స్ధానికులని చెప్పి ఓటర్లుగా నమోదు చేయిస్తున్నట్లు బీజేపీపై మండిపోతున్నాయి. ఇప్పటికే ఈ పద్దతిలో లక్షల్లో కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే కాకుండా ప్రతిపక్షాలను విడదీయటం ప్రతిపక్షాల్లోని గట్టి నేతలను ఆకర్షించేందుకు గాలమేయటం లాంటి వ్యవహారాల్లో బీజేపీ బిజీగా ఉంది. ఇవన్నీ సరిపోవన్నట్లు మూడు సామాజికవర్గాలను ఎస్టీలో చేర్చబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. అధికారం కోసం ముందు ముందు ఇంకెన్ని చర్యలకు దిగబోతుంది ఎవరు చెప్పలేకున్నారు. మొత్తానికి ఏమిచేసైనా సరే అధికారంలోకి రావటమే టార్గెట్ గా పెట్టుకున్నది. మరి కమలంపార్టీ ప్రయత్నాలు ఫలిస్తాయా ? నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. Tupaki TAGS: UnionHomeMinister AmitShah JammuAndKashmir BJP Politics Government PoliticalParties PoliticalNews
thesakshi.com : IMAX యొక్క K.G.F. చాప్టర్ 2 పోస్టర్‌లో కఠినమైన రాకీని భీకరమైన లుక్‌లో చిత్రీకరించారు. IMAX కన్నడ భాషా పీరియడ్ యాక్షన్ డ్రామా K.G.F కోసం ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేసింది. చాప్టర్ 2. ప్రశాంత్ నీల్ రచన మరియు దర్శకత్వం వహించి, హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటించగా, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్ మరియు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రక్తంతో తడిసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగే సంఘటనల ఆధారంగా ఈ కథ రూపొందించబడింది మరియు ఇది K.G.F యొక్క కొనసాగింపు. అధ్యాయం 1. సీక్వెల్ ఏప్రిల్ 14న కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో IMAX స్క్రీన్‌లలో విడుదల కానుంది. IMAX యొక్క ప్రత్యేక పోస్టర్‌లో గందరగోళం మరియు గూండాలతో రెండు చేతుల్లో ఆయుధాలతో మరింత భయంకరమైన రూపంతో నిశ్చయమైన రాకీని కలిగి ఉంది. తన శత్రువులు ప్రతీకారం తీర్చుకోవాలని, అతని పతనానికి కుట్ర పన్నుతున్నప్పుడు, రాకీ తనను తాను కట్టుకున్నప్పుడు పోస్టర్ అతని ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. కె.జి.ఎఫ్‌ విడుదల సందర్భంగా మాట్లాడుతూ. IMAXలోని చాప్టర్ 2, ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ VP, క్రిస్టోఫర్ టిల్‌మాన్ ఇలా అన్నారు, “IMAX ప్రేక్షకులకు జీవితానుభవం కంటే పెద్ద అనుభూతిని అందించడంలో ప్రసిద్ధి చెందింది మరియు KGF చాప్టర్ 2 వంటి యాక్షన్-ప్యాక్డ్ చిత్రాన్ని విడుదల చేయడం మాకు సముచితం. IMAX అనుభవం ప్రేక్షకులకు జీవించడానికి మరియు ఈ ఆకర్షణీయమైన చిత్రంలో భాగమయ్యే అవకాశాన్ని అందిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. భారతదేశం బలమైన మరియు వైవిధ్యమైన కథలు మరియు ప్రతిభకు నిలయం మరియు KGF చాప్టర్ 2 విడుదల అత్యంత దృశ్యమానంగా అద్భుతమైన వాటిని అందించాలనే మా నిబద్ధతకు అనుగుణంగా ఉంది. మరియు IMAXలో మానసికంగా ఆకట్టుకునే కథలు.” హోంబలే ఫిలింస్ భాగస్వామి మరియు సహ వ్యవస్థాపకుడు చలువే గౌడ మాట్లాడుతూ, “KGF చాప్టర్ 2 IMAXలో ప్రదర్శించబడుతున్న మొదటి కన్నడ చిత్రం అని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము మరియు గర్విస్తున్నాము. IMAXతో మా భాగస్వామ్యం మా విజన్‌కు అనుగుణంగా ఉంది. మా అభిమానులకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతికతతో వినోదాన్ని అందించండి. అభిమానుల స్పందన అనూహ్యంగా ఉంది మరియు ఉత్సాహం స్థాయికి చేరుకుంది. మేము మా పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కూడా ప్రయత్నించాము మరియు ఇది మాకు మంచిదని మేము విశ్వసిస్తున్నాము. సినిమా చారిత్రాత్మకం అవుతుంది. గొప్ప కమర్షియల్ విజయాన్ని ఆస్వాదిస్తూనే విమర్శకుల ప్రశంసలు పొందిన చలనచిత్రాలు ఎక్సలెన్స్ కోసం మా అన్వేషణ ఫలితంగా వచ్చాయి. IMAXతో మా అనుబంధం మా ఆలోచనలకు అనుగుణంగా ఉంది మరియు ఈ అసోసియేషన్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా అభిమానులకు ప్రపంచ స్థాయి ఆఫర్‌ను అందించగలమని మేము ఆశిస్తున్నాము. రాబోయే సంవత్సరాల్లో మా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మేము IMAXలో బృందంతో కలిసి పని చేయడం కొనసాగిస్తాము.”
కేవం 30 గంటల వ్యవధిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర గతిని, స్థితిని మార్చే మూడు ముఖ్యమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఎక్కువ మంది ఆధారపడే వ్యవసాయ రంగానికి, తెలంగాణలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత ఏపాటిదో ఈ సన్నివేశం చూస్తే అర్థమవుతుంది. వ్యవసాయాధార దేశమైన భారత్‌లో విధానాలు పారిశ్రామిక ప్రగతికి అనుకూలంగా ఉండాలా? వ్యవసాయానికి అనుకూలంగా ఉండాలా? అనే మీమాంస స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో జవహర్‌ లాల్‌ నెహ్రూ సారథ్యంలోని జాతీయ నాయకత్వానికి కలిగింది. ఆనాటి నుంచి చాలా ఏండ్ల వరకు కూడా ప్రభుత్వాలు ఎటూ తేల్చకోలేకపోయాయి. అందుకే అటు పూర్తిగా పారిశ్రామిక రంగంలో, ఇటు వ్యవసాయ రంగంలో మనదేశంలో చెప్పుకోదగ్గ పురోగతి సాధించలేకపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ రెండు రంగాల పట్ల పూర్తి అవగాహనతో విధానాలు రూపొందించారు. తెలంగాణలో వ్యవసాయంపై ఆధారపడి బతికే వారి సంఖ్య 60 శాతానికి పైగానే ఉంటుంది. కానీ వ్యవసాయ రంగం వాటా స్థూల జాతీయోత్పత్తి(జిడిపి)లో 17 శాతం మాత్రమే. కానీ పరిశ్రమల విషయానికొస్తే జిడిపిలో దాని వాటా 30 శాతం. అయితే, పరిశ్రమలపై ఆధారపడి జీవించే వారి సంఖ్య చాలా స్వల్పం. తెలంగాణలో అటు ఎక్కువ మంది ఆధారపడే వ్యవసాయాన్ని విస్మరించకుండా, ఇటు ఆర్థికాభివృద్ధికి దోహదపడే పారిశ్రామిక రంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా విధానాలు రూపొందించే విషయంలో కెసీఆర్‌ ప్రభుత్వం సమతూకం పాటించింది. సమన్యాయం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానంపై దాదాపు పది నెలలకు పైగానే కసరత్తు చేసింది. ప్రపంచంలో ఎక్కడ మంచి పారిశ్రామిక విధానం ఉందో తెలుసుకోవడానికి యూనివర్సిటీల్లో రీసెర్చి చేసిన విధంగా శ్రమించింది. ముఖ్యమంత్రి కెసీఆర్‌ స్వయంగా సింగపూర్‌లో పర్యటించడంతో పాటు దేశ, విదేశాలకు చెందిన అనేక మంది పారిశ్రామిక రంగ ప్రముఖులతో, నిపుణులతో చర్చించారు. పారిశ్రామిక విధానంపై సచివాలయంలోనే దాదాపు 30 సమీక్ష సమావేశాలు జరిగి ఉంటాయి. చివరికి తెలంగాణకు అవసరమైన పారిశ్రామిక విధానం తయారైంది. పరిశ్రమల అవసరం ఏమిటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు మారుతాయని ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే నమ్మకంతో ఉన్నారు. కానీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు చాలా తక్కువ. ప్రపంచంలోని ఏ దేశంలో చూసినా రక్షణ, పోలీస్‌ రంగాలతో కలుపుకుని కూడా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 20 శాతంగా ఉంటున్నది. మిగతా 80 శాతం ప్రైవేటు రంగంలోనే. సేవా, పారిశ్రామిక రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. ఐటి, సినిమా, మీడియా లాంటి రంగాలను కూడా పరిశ్రమలుగానే గుర్తిస్తున్నందున సేవా రంగాన్ని కూడా పారిశ్రామిక రంగంలో భాగంగానే గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి 80 శాతం ఉద్యోగాల కల్పన 30 శాతం జిడిపి వాటా కలిగిన పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఏర్పడింది. ఎక్కువ పరిశ్రమలు వస్తేనే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఎక్కువ ఉత్పత్తులు ఇక్కడి నుంచి వస్తేనే, ఎక్కువ ఎగుమతులు జరుగుతాయి. అటు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇటు ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా, తెలంగాణలో అమలయ్యే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూరాలన్నా పారిశ్రామికాభివృద్ధి మాత్రమే దిక్కు అని ప్రభుత్వం గట్టిగా నమ్మింది. కమ్యూనిస్టు దేశమైన చైనా కూడా ఇప్పుడు పెట్టుబడులకు అనుకూలమైన పారిశ్రామిక విధానానికి మొగ్గుచూపుతుండడం ఇక్కడ గమనార్హం. కొత్త విధానం ఎందుకు? సమైక్య ఆంధ్రప్రదేశ్‌ లో కూడా రాష్ట్రానికి ఓ పారిశ్రామిక విధానం ఉంది. దాన్నే యధాతథంగా వినియోగించుకోవచ్చు కదా, మళ్లీ కొత్త విధానం ఎందుకు అనే ప్రశ్న ఉదయించకమానదు. నిజానికి ఇప్పుడు పరిశ్రమల స్థాపన విషయంలో, పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య విపరీతమైన పోటీ ఉంది. ప్రధానమంత్రి మోడీ నుంచి మొదలుకుని ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం తరచూ విదేశీ పర్యటనలు చేస్తుండడం మనం చూస్తున్నాం. ప్రతీ పర్యటన ఉద్దేశ్యం పెట్టుబడులను ఆహ్వానించడమే. ఇంత పోటీ ఉన్న నేపథ్యంలో ఏ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉందో, ఏ ప్రాంతం పరిశ్రమల స్థాపనకు అనుకూలమో పారిశ్రామిక వేత్తలు ఆ ప్రాంతానికే వస్తారు. తెలంగాణ రాష్ట్రం, మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ నగరం పరిశ్రమలకు చాలా అనుకూలమైన ప్రాంతం. ఇక్కడ భూకంపాల భయం లేదు. భూకంప ప్రభావ రహిత ప్రాంతం. తెలంగాణలో అతి తీవ్ర వాతావరణ పరిస్థితులుండవు. అంటే బాగా వేడి ఉండదు. బాగా చలి ఉండదు. పెను తుఫాన్లు రావు. సమశీతోష్ణ వాతావరణ మండలంలో ఉంది. ఈ వాతావరణం వల్ల పరిశ్రమల్లో పరికరాలు చాలా కాలం పాటు మన్నికతో ఉంటాయి. వాటి సామర్థ్యం కూడా చాలా కాలం ఉంటుంది. ఐటి రంగంలో డాటా కాపాడుకోవడానికి కూడా ఇలాంటి వాతావరణం చాలా అవసరం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటి కంపెనీలు తమ డాటా బేస్‌ను హైదరాబాద్‌లోనే భద్రపరుస్తున్నాయి. ఎల్‌ఐసి కూడా దేశవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారుల వివరాలతో కూడిన డాటా బేస్‌ను హైదరాబాద్‌ లోని తమ ప్రధాన కార్యాయంలోనే భద్రపరిచింది. రక్షణ రంగానికి చెందిన పలు పరిశోధనా సంస్థలు కూడా హైదరాబాద్‌లోనే ఉండడానికి, అమెరికా అధ్యక్షుడు వాడే హెలిక్యాప్టర్‌ విడిభాగాలు కూడా ఇక్కడే తయారు కావడానికి కారణం అదే. ఈ వాతావరణ, భౌగోళిక అనుకూలతలతో పాటు ప్రభుత్వం నుంచి కూడా మద్దతు, ప్రోత్సాహం ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఉండే పారిశ్రామిక వేత్తలు తమ కార్యక్షేత్రాలను హైదరాబాద్‌ కు మార్చుకునే అవకాశం ఉంది.
ఆదికాండము 4:4 – హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టెను; ఆదికాండము 4:7 – నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీయెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను. Was offered -for sins of Ignorance లేవీయకాండము 4:2 – నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపియైనయెడల, ఎట్లనగా లేవీయకాండము 4:13 – ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరబాటున ఏ తప్పిదముచేసి, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరానిపని చేసి అపరాధులైనయెడల లేవీయకాండము 4:22 – అధికారి పొరబాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధియైనయెడల లేవీయకాండము 4:27 – మీ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరాని పనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధియైనయెడల -at the consecration of Priests నిర్గమకాండము 29:10 – మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమచేతులనుంచగా నిర్గమకాండము 29:14 – ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాపపరిహారార్థమైన బలి. లేవీయకాండము 8:14 – ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను తీసికొనివచ్చెను. అహరోనును అతని కుమారులును పాపపరిహారార్థబలి రూపమైన ఆ కోడె తలమీద తమ చేతులుంచిరి. -at the consecration of Levites సంఖ్యాకాండము 8:8 – తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధమపిండిని తేవలెను. నీవు పాపపరిహారార్థబలిగా మరియొక కోడెను తీసికొనిరావలెను. – At the expiration of a Nazarite’s vow సంఖ్యాకాండము 6:14 – అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను, సమాధానబలిగాను నిర్దోషమైన యొక పొట్టేలును, -on the day of atonement లేవీయకాండము 16:3 – అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను. లేవీయకాండము 16:9 – ఏ మేకమీద యెహోవా పేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొనివచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. Was a most holy sacrifice లేవీయకాండము 6:25 – నీవు అహరోనుకును అతని సంతతివారికిని ఈలాగు ఆజ్ఞాపించుము పాపపరిహారార్థబలిని గూర్చిన విధి యేదనగా, నీవు దహనబలి రూపమైన పశువులను వధించు చోట పాపపరిహారార్థబలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను; అది అతిపరిశుద్ధము. లేవీయకాండము 6:29 – యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము. Consisted of -A young Bullock for Priests లేవీయకాండము 4:3 – ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసినయెడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. లేవీయకాండము 9:2 – అహరోనుతో ఇట్లనెను నీవు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను, దహనబలిగా నిర్దోషమైన యొక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసికొనిరమ్ము. లేవీయకాండము 9:8 – కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తనకొరకు పాపపరిహారార్థబలిగా ఒక దూడను వధించెను. లేవీయకాండము 16:3 – అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను. లేవీయకాండము 16:6 – అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి -A young Bullock or He-Goat for the congregation లేవీయకాండము 4:14 – వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడునప్పుడు, సంఘము పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొనిరావలెను. లేవీయకాండము 16:9 – ఏ మేకమీద యెహోవా పేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొనివచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. 2దినవృత్తాంతములు 29:23 – పాపపరిహారార్థ బలికై రాజు ఎదుటికిని సమాజము ఎదుటికిని మేకపోతులను తీసికొనిరాగా, వారు తమచేతులను వాటిమీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి -A male kid for A Ruler లేవీయకాండము 4:23 – అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసికొనివచ్చి -A Female kid or Female lamb for A Private person లేవీయకాండము 4:28 – తాను చేసినది పాపమని యొకవేళ తనకు తెలియబడినయెడల, తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసికొనివచ్చి లేవీయకాండము 4:32 – ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొఱ్ఱను తీసికొని వచ్చినయెడల నిర్దోషమైనదాని తీసికొనివచ్చి Sins of the offerer transferred to, by imposition of hands లేవీయకాండము 4:4 – అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసికొనివచ్చి కోడె తలమీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను లేవీయకాండము 4:15 – సమాజము యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడెమీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను. లేవీయకాండము 4:24 – ఆ మేకపిల్ల తలమీద చెయ్యి ఉంచి, దహనబలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. లేవీయకాండము 4:29 – పాపపరిహారార్థ బలిపశువుయొక్క తలమీద తన చెయ్యి ఉంచి, దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. 2దినవృత్తాంతములు 29:23 – పాపపరిహారార్థ బలికై రాజు ఎదుటికిని సమాజము ఎదుటికిని మేకపోతులను తీసికొనిరాగా, వారు తమచేతులను వాటిమీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి Was killed in the same place as the burnt-offering లేవీయకాండము 4:24 – ఆ మేకపిల్ల తలమీద చెయ్యి ఉంచి, దహనబలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. లేవీయకాండము 6:25 – నీవు అహరోనుకును అతని సంతతివారికిని ఈలాగు ఆజ్ఞాపించుము పాపపరిహారార్థబలిని గూర్చిన విధి యేదనగా, నీవు దహనబలి రూపమైన పశువులను వధించు చోట పాపపరిహారార్థబలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను; అది అతిపరిశుద్ధము. The blood of -for A Priest or for the congregation, Brought by the Priest into the Tabernacle లేవీయకాండము 4:5 – అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. లేవీయకాండము 4:16 – అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెయొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసికొనిరావలెను. -for A Priest or for the congregation, Sprinkled seven times before the Lord, outside the Vail, by the Priest with His Finger లేవీయకాండము 4:6 – ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర యెదుట ఆ రక్తములో కొంచెము ఏడు మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. లేవీయకాండము 4:17 – ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెరవైపున యెహోవా సన్నిధిని ఏడు మారులు దాని ప్రోక్షింపవలెను. -for A Priest of for the congregation, put Upon the horns of the altar of burnt offering by the Priest with His Finger లేవీయకాండము 4:25 – ఇది పాపపరిహారార్థబలి. యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తములో కొంచెము తన వ్రేలితో తీసి, దహనబలిపీఠము కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును దహనబలిపీఠము అడుగున పోయవలెను. లేవీయకాండము 4:30 – యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను. -in Every case poured at the foot of the altar of burnt offering లేవీయకాండము 4:7 – అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ములమీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహనబలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను. లేవీయకాండము 18:25 – ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కివేయుచున్నది. లేవీయకాండము 18:30 – కాబట్టి మీకంటె ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుటవలన అపవిత్రత కలుగజేసికొనకుండునట్లు నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. లేవీయకాండము 9:9 – అహరోను కుమారులు దాని రక్తమును అతనియొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ములమీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను. Fat of the inside, kidneys, burned on the altar of burnt offering లేవీయకాండము 4:8 – మరియు అతడు పాపపరిహారార్థబలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దానినుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వంతటిని లేవీయకాండము 4:9 – మూత్రగ్రంథులను వాటిమీది డొక్కలపైనున్న క్రొవ్వును మూత్రగ్రంథుల పైనున్న కాలేజముమీది వపను లేవీయకాండము 4:10 – సమాధానబలియగు ఎద్దునుండి తీసినట్లు దీనినుండి తీయవలెను. యాజకుడు దహనబలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను. లేవీయకాండము 4:19 – మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠముమీద దహింపవలెను. లేవీయకాండము 4:26 – సమాధాన బలిపశువుయొక్క క్రొవ్వువలె దీని క్రొవ్వంతయు బలిపీఠముమీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. లేవీయకాండము 4:31 – మరియు సమాధాన బలిపశువుయొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. లేవీయకాండము 9:10 – దాని క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజముమీది వపను బలిపీఠముమీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. When for a priest or the congregation, the skin, carcass, burned without the camp లేవీయకాండము 4:11 – ఆ కోడెయొక్క శేషమంతయు, అనగా దాని చర్మము దాని మాంసమంతయు, దాని తల దాని కాళ్లు దాని ఆంత్రములు దాని పేడ లేవీయకాండము 4:12 – పాళెము వెలుపల, బూడిదెను పారపోయు పవిత్ర స్థలమునకు తీసికొనిపోయి అగ్నిలో కట్టెలమీద కాల్చివేయవలెను. బూడిదె పారపోయు చోట దానిని కాల్చివేయవలెను. లేవీయకాండము 4:21 – ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాపపరిహారార్థబలి. లేవీయకాండము 6:30 – మరియు పాపపరిహారార్థబలిగా తేబడిన యే పశువు రక్తములో కొంచెమైనను అతిపరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలిపశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను. లేవీయకాండము 9:11 – దాని మాంసమును చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను. Was eaten by the priests in a holy place, when its blood had not been brought into the tabernacle లేవీయకాండము 6:26 – పాపపరిహారార్థబలిగా దానినర్పించిన యాజకుడు దానిని తినవలెను; పరిశుద్ధస్థలమందు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క ఆవరణములో దానిని తినవలెను. లేవీయకాండము 6:29 – యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము. లేవీయకాండము 6:30 – మరియు పాపపరిహారార్థబలిగా తేబడిన యే పశువు రక్తములో కొంచెమైనను అతిపరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలిపశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను. Aaron, &c rebuked for burning and not eating that of the congregation, its blood not having been brought into the> tabernacle లేవీయకాండము 10:16 – అప్పుడు మోషే పాపపరిహారార్థబలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడు అది కాలిపోయియుండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారిమీద ఆగ్రహపడి లేవీయకాండము 10:17 – మీరు పరిశుద్ధస్థలములో ఆ పాపపరిహారార్థబలి పశువును ఏల తినలేదు? అది అతిపరిశుద్ధము గదా. సమాజము యొక్క దోషశిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా. లేవీయకాండము 10:18 – ఇదిగో దాని రక్తమును పరిశుద్ధస్థలములోనికి తేవలెను గదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధస్థలములో దానిని తినవలెనని చెప్పెను. లేవీయకాండము 9:9 – అహరోను కుమారులు దాని రక్తమును అతనియొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ములమీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను. లేవీయకాండము 9:15 – అతడు ప్రజల అర్పణమును తీసికొని వచ్చి ప్రజలు అర్పించు పాపపరిహారార్థబలియగు మేకను తీసికొని వధించి మొదటిదానివలె దీనిని పాపపరిహారార్థబలిగా అర్పించెను. Whatever touched the flesh of, was rendered holy లేవీయకాండము 6:27 – దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రముమీద ప్రోక్షించినయెడల అది దేనిమీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధస్థలములో ఉదుకవలెను. Garments sprinkled with the blood of, to be washed లేవీయకాండము 6:27 – దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రముమీద ప్రోక్షించినయెడల అది దేనిమీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధస్థలములో ఉదుకవలెను. Laws respecting the vessels used for boiling the flesh of లేవీయకాండము 6:28 – దాని వండిన మంటికుండను పగులగొట్టవలెను; దానిని ఇత్తడిపాత్రలో వండినయెడల దాని తోమి నీళ్లతో కడుగవలెను. Was typical of Christ’s sacrifice 2కొరిందీయులకు 5:21 – ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను. హెబ్రీయులకు 13:11 – వేటి రక్తము పాపపరిహారార్థముగ పరిశుద్ధస్థలములోనికి ప్రధానయాజకునిచేత తేబడునో, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబులా తాను దుష్టచతుష్టయాన్ని నమ్ముకోలేదని... దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అనేదే కొలమానంగా పెట్టుకోవాలని... మీకు మంచి జరిగితే మీ బిడ్డనైన తనకు అండగా ఉండాలని ప్రజలను కోరారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రైతులకు భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు తాను పార్టీ పెట్టుకుని వచ్చిన వారిని ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారని... కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేసిన వాళ్లను చంద్రబాబు అంటారని సీఎం ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటని అన్నారు. మోసం చేసే చంద్రబాబుకు మళ్లీ అధికారాన్ని ఇవ్వొద్దని కోరారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వేను చేపడుతున్నామని జగన్ తెలిపారు. 17 వేలకు పైగా గ్రామాల్లో భూముల సర్వే చేస్తున్నామని చెప్పారు. తొలి దశలో 2 వేల గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందని తెలిపారు. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలను అందించామని చెప్పారు. వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సర్వే పూర్తవుతుందని తెలిపారు. సర్వే కోసం 13,849 మంది సర్వేయర్లను నియమించామని... రూ. 1,000 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయాల్లోనే జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. Chandrababu Telugudesam Jagan YSRCP Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?..... We are here for YOU: Team ap7am.com
సంబంధం లేని పాత వీడియోలని భారతదేశానికి అంబులన్స్ వాహనాలు పంపి సహాయం చేసిన పాకిస్తాన్ అని షేర్ చేస్తున్నారు ఫాక్ట్ చెక్స్వీడియోలుక్విక్ చెక్డైలీ డేటాHelpful LinksFAQ Stories Coronavirus Telugu Fake News Telugu సంబంధం లేని పాత వీడియోలని భారతదేశానికి అంబులన్స్ వాహనాలు పంపి సహాయం చేసిన పాకిస్తాన్ అని షేర్ చేస్తున్నారు By Dilip Kumar Sripada On May 4th, 2021 “కరోనాతో కుక్క చావు చస్తుంది పాకిస్తాన్ అంటూ టీవీల్లో సంబరాలు చేసుకుంటూ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ మానవతా దృక్పధంతో అంబులెన్స్ లు పంపుతుంది”, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విళయ తాండవం చేస్తున్న వేళ, పాకిస్తాన్ మానవత దృక్పధంతో భారతదేశానికి అంబులన్స్ లని పంపించినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు. క్లెయిమ్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ భారత దేశానికి అంబులన్స్ వాహనాలు పంపుతున్న వీడియో. ఫాక్ట్ (నిజం): పాకిస్తాన్ దేశానికి చెందిన ‘Edhi Foundation’, కరోనా వైరస్ తో పోరాడుతున్న భారతదేశానికి సహాయంగా 50 అంబులన్స్ వాహనాలు పంపుతామని చెప్పిన మాట వాస్తవం. కానీ, ‘Edhi Foundation’ చేసిన ఈ ఆఫర్ ని భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించలేదు. ఈ వీడియోలో షేర్ చేసిన నాలుగు వేర్వేరు క్లిప్పులు పాకిస్తాన్ అంబులన్స్ లకి సంబంధించిన పాత వీడియోలు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు. పోస్టులో షేర్ చేసిన ఈ వీడియోలో నాలుగు వేర్వేరు క్లిప్స్ ఉండటాన్ని మనం చూడవచ్చు. ఈ నాలుగు వీడియో క్లిప్స్ కు సంబంధించిన సమాచారాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. క్లిప్-1: ఈ వీడియో క్లిప్ లో కనిపిస్తున్న అంబులన్స్ వాహనాల పై ‘EDHI Ambulance’ అనే అక్షరాలు రాసి ఉండటాన్ని మనం గమనించవచ్చు. దీనిబట్టి, ఈ అంబులన్స్ వాహనాలు పాకిస్తాన్ దేశానికి చెందిన ‘Edhi Foundation’ కి సంబంధించినవని చెప్పవచ్చు. ఈ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Geo News’ ఛానల్ 03 డిసెంబర్ 2017 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ‘Edhi Foundation’ కొత్తగా 100 అంబులన్స్ వాహనాలని తమ సంస్థలో చేర్చుకున్నట్టు ఈ వీడియో వివరణలో తెలిపారు. క్లిప్-2: పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్పుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని షేర్ చేస్తూ 2016లో పెట్టిన సోషల్ మీడియా పోస్టులు దొరికాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ‘Edhi Foundation’ సంస్థ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఎది మరణం తరువాత అంతక్రియల కోసం తీసుకెళ్తున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. అబ్దుల్ సత్తార్ ఎది మరణానికి సంబంధించి ‘Al Jazeera’ న్యూస్ సంస్థ జూలై 2016లో పబ్లిష్ చేసిన వీడియోని ఇక్కడ చూడవచ్చు. క్లిప్-3: పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్పుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Edhi Foundation’ సంస్థ 08 అక్టోబర్ 2019 నాడు తమ ఫేస్బుక్ పేజి లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. The Jammu and Kashmir Liberation Front (JKLF) పార్టీ అక్టోబర్ 2019లో నిర్వహించిన ‘ఆజాద్ మార్చ్’ కార్యక్రమం కోసం ఈ అంబులన్స్ లని సిద్దం చేసినట్టు ‘Edhi Foundation’ ఈ పోస్టులో తెలిపారు. ఈ వీడియో ఇటివల తీసినది కాదు. క్లిప్-4: ఈ వీడియోలో కనిపిస్తున్న అంబులన్స్ వాహనాల పై ‘CHHIPA Ambulance’ అనే అక్షరాలు రాసి ఉండటాన్ని మనం గమనించవచ్చు. దీనిబట్టి, ఈ అంబులన్స్ వాహనాలు పాకిస్తాన్ దేశానికి చెందిన ‘Chhipa Welfare Association’ కి సంబంధించినవని చెప్పవచ్చు. ఈ వీడియో క్లిప్పుని కొన్ని పదాలు ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Chhipa Welfare Association’ సంస్థ 25 మే 2016 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. Chhipa అంబులన్స్ సర్వీస్ ప్రకటనకు సంబంధించిన ఈ వీడియోలోని కొన్ని క్లిప్పులని పోస్టులోని వీడియోలో జతచేసినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ దేశానికి చెందిన ‘Edhi Foundation’, కరోనా వైరస్ తో పోరాడుతున్న భారతదేశానికి 50 అంబులన్స్ లు సహాయంగా పంపుతామని ఆఫర్ చేసింది. కాని, భారత ప్రభుత్వం ఈ ఆఫర్ ని ఇప్పటివరకు ఆమోదించలేదు. దీనికి సంబంధించి పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా భారత దేశానికి సహాయంగా పాకిస్తాన్ అంబులన్స్ వాహనాలు పంపుతున్న దృశ్యాలని షేర్ చేసిన ఈ వీడియో తప్పని ఖచ్చితంగా చెప్పవచ్చు. చివరగా, సంబంధం లేని పాత వీడియో క్లిప్పులని జోడిస్తూ కరోనా వైరస్ తో పోరాడుతున్న భారతదేశానికి అంబులన్స్ వాహనాలు పంపి సహాయం అందిస్తున్న పాకిస్తాన్ అని షేర్ చేస్తున్నారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్లకు పైనే చెక్కి.. చెక్కి తీర్చిదిద్దిన ‘లైగర్’ మూవీ ఈ రోజు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతోపాటు అతడ్ని ముద్దుగా రౌడీ అని పిలిచే ఆయన ఫ్యాన్స్ అంతా కూడా మిస్ అయిన పాయింట్ ను నటి షాలినీ పాండే గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ఇప్పుడంతా లైగర్ హడావుడిలో మునిగిపోయిన వేళ.. పాత విషయాన్ని కొత్తగా గుర్తు చేసి రౌడీ ఫ్యాన్స్ లో జోష్ నింపింది షాలినీ పాండే. తాజాగా ఆమె పెట్టిన పోస్టు సారాంశం ఏమంటే.. సుమారు ఐదేళ్ల క్రితం ఇదే రోజున (ఆగస్టు 25న) అర్జున్ రెడ్డి మూవీ విడుదలైందని.. తనను వెండితెరకు పరిచయం చేసిన వైనం ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించినట్లుగా పేర్కొంది. ఆ మూవీలో తాను పోషించిన ప్రీతి పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రేమాభిమానానికి తాను ఎప్పటికి కృతజ్ఞురాలినేనని పేర్కొంది. తన తొలి చిత్రాన్ని ఎలా చేస్తానా?అన్న టెన్షన్ లో ఉన్న తనలో ఉత్సాహాన్ని నింపి.. షూటింగ్ సరదాగా గడిచిపోయేలా చేసిన తన సహనటుడు విజయ్ దేవరకొండకు ఆమె థ్యాంక్స్ చెప్పింది ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు రౌడీ అభిమానుల్ని సంతోషంలో నింపుతున్నాయి. ‘లైగర్.. నువ్వు చేసిన ప్రతి పనికి థ్యాంక్యూ. లవ్ యూ. అలానే నీ కొత్త మూవీ మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం ఇదే రోజున విజయ్ దేవరకొండ ఇమేజ్ ను అమాంతం పెంచేసి.. స్టార్ స్టేటస్ కు తీసుకొచ్చిన రోజునే అతని కెరీర్ లోనే అత్యంత భారీ మూవీ విడుదల కావటానికి మించిన హ్యాపీ న్యూస్ విజయ్ అభిమానులకు ఇంకేం ఉంటుంది చెప్పండి. The post రౌడీ ఫ్యాన్స్ మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసిన షాలినీ పాండే first appeared on namasteandhra.
గుంటూరు. (ప్రజా అమరావతి); నగరం సంపత్ నగర్ లోని మేయర్ నివాసం వద్ద గల క్యాంపు కార్యాలయం నందు 65వ సచివాలయ కార్యదర్శులు మరియు వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి,సచివాలయ పరిధిలోని స్థానిక సమస్యలను మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు అడిగి తెలుసుకుని,స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించి,అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్న గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శమన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయ వ్యవస్థను ఆదర్శంగా తీసుకొని వారి రాష్ట్రాల్లో ప్రవేశ పెట్టుటకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు ఇతర సేవలు ప్రజలకు సత్వరమే అందించుటకు అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా కరోనా వంటి ప్యాండమిక్ లాక్ డౌన్ సమయంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించుటయే కాక కరోనా వ్యాప్తిని అరికట్టుటలో కీలకపాత్ర వహించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల ద్వారా సొంత గృహాలు లేని పేద ప్రజలకు ఇచ్చిన ఫ్లాట్ల యందు త్వరితగతిన గృహాలు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో కుల,మత పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందేలా చూసే బాధ్యత సచివాలయ కార్యదర్శులపై మరియు వాలంటీర్లపై ఉందన్నారు. ప్రజల నుండి వచ్చు పిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిచ్చి,వారి పిర్యాదులను వెంటనే పరిష్కరించి, మరల పునరావృతం కాకుండా చూడాలన్నారు. కార్యదర్శులు మరియు వాలంటీర్లు వారి సచివాలయ పరిధిలో డోర్ టు డోర్ తిరిగి స్థానిక సమస్యలను గుర్తించి,వాటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వాలంటీర్లు మరియు కార్యదర్శులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధుల్లా ఉంటూ,సంక్షేమ పథకాలు ప్రజలకు త్వరితగతిన అందేలా చూడాలన్నారు. కార్యదర్శులు మరియు వాలంటీర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సంయుక్తంగా పనిచేసి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యదర్శులకు మరియు వాలంటీర్లకు విధుల నిర్వహణలో స్థానికంగా సమస్యలు ఏమైనా ఎదురైనట్లయితే,స్థానిక అధికారుల మరియు ప్రజాప్రతినిధుల దృష్టికి గాని,తమ దృష్టికి తీసుకురావాలని,సదరు సమస్యలను వెంటనే పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు,వాలంటీర్ లు పాల్గొన్నారు. Comments addComments Post a Comment Popular posts ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది. November 25, 2022 • GUDIBANDI SUDHAKAR REDDY ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి. November 30, 2022 • GUDIBANDI SUDHAKAR REDDY న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం. November 29, 2022 • GUDIBANDI SUDHAKAR REDDY *ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
India First Monkeypox Death: భయపడినట్లే జరిగింది. కేరళలో మంకీపాక్స్ తరహా లక్షణాలతో కన్నుమూసిన 22 ఏళ్ల యువకుడికి మంకీపాక్స్ నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ప్రకటించాయి. మృతుడి నుంచి సేకరించిన నమూనాల్లో.. మంకీపాక్స్ సోకినట్లు తేలిందని వెల్లడించాయి. యువకుడికి యూఏఈలోనే మంకీపాక్స్ సోకినట్లు తెలుస్తోంది. India First Monkeypox Death: కేరళలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో ప్రాణాలు కోల్పోయిన యువకుడికి మంకీపాక్స్ నిర్ధరణ అయ్యింది. సదరు యువకుడు.. జులై 21న యూఏఈ నుంచి కేరళకు వచ్చాడు. స్వదేశానికి వచ్చేముందే జులై 19న యూఏఈలో అతడి నుంచి నమూనాలు సేకరించారు. కేరళకు వచ్చిన తర్వాత మంకీపాక్స్ తరహా లక్షణాలతో యువకుడు త్రిస్సూరులోని ఓ ఆస్పత్రిలో జులై27న చేరాడు. జులై 30న చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అతడికి మంకీపాక్స్ సోకిందనే అనుమానంతో నమూనాలు సేకరించి పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్ నుంచి వివరాలు రాగా.. యువకుడికి మంకీపాక్స్‌ సోకినట్లు నివేదికల్లో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. యూఏఈలో జరిపిన పరీక్షల్లోనూ మంకీపాక్స్ నిర్ధరణ అయినట్లు జులై 30న అతడి కుటుంబసభ్యులకు సమాచారం వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్వగ్రామంలో భయాందోళనలు.. మంకీపాక్స్‌తో చనిపోయిన యువకుడి స్వగ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. యువకుడు మృతిచెందటం వల్ల త్రిస్సూర్‌ జిల్లాలో పున్నయార్ గ్రామవాసులు అందరూ సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే గ్రామ ప్రజల్లో ఎలాంటి ఆందోళన లేదని పేర్కొన్నారు. యూఏఈ నుంచి వచ్చిన తర్వాత.. బాధితుడు కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాత్రమే సన్నిహితంగా మెలిగినట్లు.. వివరిస్తున్నారు. బాధితుడితో పది మంది సన్నిహితంగా మెలిగినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ 20 మందిని క్వారంటైన్ చేసినట్లు వివరించారు. యూఏఈ నుంచి వచ్చి.. ఫుట్​బాల్ ఆడి.. జులై 21న యూఏఈ నుంచి వచ్చిన యువకుడు.. జులై 22న స్నేహితులతో కలిసి ఫుట్​బాల్​ ఆడాడు. జులై 26న జ్వరం రావడం వల్ల ఆస్పత్రిలో చేరాడు. మంకీపాక్స్ లక్షణాలుగా నిర్ధరించడం వల్ల.. మరో ఆస్పత్రికి తరలించారు. దీంతో యువకుడు స్నేహితులు ఐసోలేషన్​లోకి వెళ్లారు. అతని శరీరంపై మంకీపాక్స్‌ లక్షణాలు లేకపోవడం వల్ల ఆ దిశగా చికిత్స అందించలేదు. అయితే, శనివారం ఆ యువకుడు మృతి చెందాడు. అనంతరం అతడికి యూఏఈలో జులై 19నే మంకీపాక్స్‌ సోకిన విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులు అధికారులకు వెల్లడించారు. యూఏఈ నుంచి భారత్‌కు బయలుదేరే ముందు వచ్చిన మంకీపాక్స్‌ పరీక్ష ఫలితాన్ని వైద్యులకు అందించారు.
లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా సామాన్యుడు, సెలబ్రిటి అని తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు..మరికొందరు ఎక్కడి వాళ్లక్కడే ఆగిపోయారు.. వాళ్ల వాళ్ల ఇన్ఫ్లూయెన్స్ లు ఉపయోగించి ఎక్కడికన్నా వెళ్లడానికైనా కరోనా ఊరుకోదుగా అనే భయంతో ఆగిపోయారు.. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సిచ్చిన వాళ్లు నానా తిప్పలు పడి తాము చేరాలనుకున్న గమ్యం చేరుకుంటున్నారు.. అలాంటి ఇబ్బందులే పడ్డారు బాలీవుడ్ నటి స్వరా భాస్కర్.. Video Advertisement తను వెడ్స్ మను, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించిన బాలివుడ్ యాక్టర్ స్వరభాస్కర్. పలు సామాజిక అంశాలపై కూడా స్పందించే స్వరభాస్కర్ అందరికి సుపరిచితురాలే..స్వర భాస్కర్ తల్లి ఇరా భాస్కర్ ఢిల్లీలో నివాసం ఉంటారు.. ఢిల్లీలోని JNU(జవహర్ లాల్ నెహ్యూ యూనివర్శిటి)లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. లాస్ట్ వీక్ ప్రమాదానికి గురైన ఇరా భాస్కర్ భుజానికి తీవ్ర గాయమైంది..లాక్ డౌన్ ఉండడంతో తల్లిని చూడడానికి వెళ్లలేకపోయిన స్వర భాస్కర్ ఫోన్లోనే తల్లి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంది. లాక్ డౌన్ నిబంధనలు సడలించగానే ఒక్క క్షణం ఆలోచించకుండా కార్ తీసుకుని ఢిల్లికి బయల్దేరింది.1400 కిలోమీటర్ల దూరం రోడ్డు ప్రయాణం… మార్గ మధ్యలో ఉదయ్ పూర్ వద్ద నైట్ హాల్ట్ చేసి, చివరకు ఢిల్లీకి చేరుకుంది..తల్లిని కలుసుకోగానే తన గాయం గురించి ఆరా తీసి, హమ్మయ్యా అని సంతోషపడిందో లేదో..ఢిల్లీ పోలీసులు క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు..14రోజుల పాటు సెల్ఫ్ హోం క్వారంటైన్ లో ఉండి తీరాల్సిందే అని అధికారులు చెప్పడంతో దానికి ఒప్పుకున్న స్వరభాస్కర్ ..మొత్తానికి అమ్మను చూడగలిగా అని సంతోషం వెలిబుచ్చింది. లాక్ డౌన్ 4.0లో కొన్ని సడలింపులు ఇవ్వగానే చాలామంది ప్రయాణాలు మొదలుపెట్టారు..యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖి కూడా ఫ్యామిలితో ముంబై నుండి సొంత గ్రామానికి పయనమై వెళ్లాడు..అక్కడికి వెళ్లిన తర్వాత కరోనా టెస్టులు చేసారు అధికారులు. ..రిజల్ట్ నెగటివ్ వచ్చింది..అయినప్పటికి 14 రోజుల పాటు సెల్ఫ్ హోం క్వారంటైన్ లో ఉండాలి అని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 కేసుల సంఖ్య 50లక్షల మార్కుని దాటింది..ఇప్పటి వరకు 3లక్షలపైన మరణాలు సంభవించగా..మన ఇండియాలో మరణాల సంఖ్య 3,435గా నమోదైంది.. 1,12,359 కొవిడ్ -19 కేసులు నమొదయ్యాయి.. లాక్ డౌన్ సడలింపులతో రోజువారి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి..ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఎవరికి వారే స్వచ్చందంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.. Recent Posts ఒక వేళ ఇదే లుక్‌తో ఉంటే..? “మహేష్ బాబు” పై రాజమౌళి కామెంట్స్..! ఇటీవల జరిగిన ఒక పార్టీలో… స్టైలిష్ స్టార్ “అల్లు అర్జున్” వేసుకున్న షర్ట్‌ ధర ఎంతో తెలుసా? Mahesh Babu: స్టేజ్ పై అదరగొట్టిన గౌతమ్.. వీడియో వైరల్..! “విలాసవంతమైన బంగ్లా” నుండి… “కోట్ల ఖరీదైన కార్” వరకు.. పవర్ స్టార్ “పవన్ కళ్యాణ్” దగ్గర ఉన్న 10 ఖరీదైన వస్తువులు..!
ALL Breaking News Cinema News Cultural News Eductional News Health News Latest News Political News Sports News గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి దసరా శుభాకాంక్షలు October 05, 2019 • Roja Rani తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి శనివారం మర్యాదపూర్వకంగా కలిశి దసరా శుభాకాంక్షలు తెలిపారు. . తాను నటించిన సైరా నర్సింహారెడ్డిసినిమాను చూడాలని చిరంజీవి, గవర్నర్‌ను కోరారు. తాను సైరా సినిమా చూడాలనుకుంటున్నట్టు గవర్నర్‌ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా` సినిమా తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లోనూ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం విడుదలైంది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది గవర్నర్‌కు తెలిపారు. . విడుదలకు ముందు `సైరా`కు వచ్చిన బజ్ చూసి తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.
యువతీ యువకులలో దాగివున్న ప్రతిభను వెలికి తీసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో వారి నైపుణ్యమును ప్రదర్శించుటకు 15-20 సంవత్సరములు మధ్య వయస్సు గల యువతీ, యువకులకు వివిధ సాంస్కృతిక అంశాలలో జిల్లా స్థాయిలో పోటీలను ఎంతో దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ, సెట్రాజ్ ఆధ్వర్యములో శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో జిల్లా స్థాయి యువజనోత్సవాలు సంస్క్రతిక ప్రదర్శనల పోస్టర్స్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ డిసెంబర్ 1 వ తేదీ ఉదయం 9 గంటలు నుంచి రాజమహేంద్రవరం,కన్వెక్షన్ హాల్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ లో సాంస్క్రతిక కార్యక్రమాల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు. అర్హులైన వారందరు ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటలు లోగా ప్రదర్శన చేయు అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్బగంగా జిల్లా యువజన సాంస్క్రతిక ప్రదర్శనల పోస్టర్ ను ఆవిష్కరించారు. సెట్రాజ్, ముఖ్య కార్యా నిర్వాహణాధికారిణి డి ఎస్ ఎస్ సునీత వివరిస్తూ.. జాతీయ స్థాయి అంశాలలో శాస్త్రీయ నృత్యం: (వ్యవధి:(15 ని॥లు) విభాగంలో భరతనాట్యం, కధక్, కూచిపూడి, ఒడిస్సీ, మణిపురి అంశాలలో శాస్త్రీయ గాత్ర సంగీతం:(వ్యవధి:15 ని.లు) అంశాలలో హిందూస్తానీ, కర్ణాటిక్, శాస్త్రీయ వాయిద్య పరికరములు, మృదంగం (వ్యవధి: 10 ని॥లు), ఫ్లూట్ (వ్యవధి: 15 ని॥లు), సితార (వ్యవధి: 15 ని॥లు), తబల (వ్యవధి: 10 ని॥లు), వీణ (వ్యవధి: 15 నిllలు), హార్మోనియం(లైట్)(వ్యవధి:10ని॥లు) , గిటార్ (వ్యవధి: 10 ని॥లు); వకృత్వం (ఎక్స్ టెంపోర్) (హిందీ మరియు ఇంగ్లీషు - వ్యవధి: 4 ని॥లు)సంబంధించిన టాపిక్స్: అంశములను పోటీలు నిర్వహించే సమయంలో ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రూపు అంశాలలో జానపదగేయాలు (గ్రూపు) - (4 నుండి 10 మంది అభ్యర్థులు వుండాలి - వ్యవధి: 7 ని॥లు), జానపద నృత్యం (గ్రూపు) ముందుగా రికార్డింగ్ చేసిన సి.డి / సెల్ ఫోన్ ద్వారా పాటలు అనుమతించబడను. ప్రత్యక్ష సంగీత సహకారంతో పాటలు పాడవలెను. (కనీసం 8 నుండి 20 మంది అభ్యర్ధులు వుండాలి. వ్యవధి: 15 ని॥లు), వన్ యాక్టు ప్లే (హిందీ / ఇంగ్లీషు) (కనీసం 10 నుండి 12 మంది అభ్యర్థులు వుండాలి - వ్యవధి: 45 ని॥లు) రాష్ట్ర స్థాయి అంశములలో భాగంగా ఎక్కువ మంది యువత వారి యొక్క ప్రతిభను వివిధ రంగాలలో నిరూపించుకొనుటకు గాను వ్యక్తిగత అంశాలు (తెలుగులో) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు లో పాల్గొనే వారిని ప్రోత్సహించే క్రమములో జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి వరకు మాత్రమే పరిమితం చేయడం జరుగుతుందని అన్నారు. వ్యవధి: 4 నిలు), మోనో యాక్షన్ (సోలో) (వ్యవధి: 10 ని॥లు), మిమిక్రి (సోలో)(వ్యవధి: 10 ని॥లు), మేజిక్ షో (సోలో)(వ్యవధి: 10 ని॥లు) , వెంట్రిలాక్విజం (సోలో) (వ్యవధి: 10 నిలు), వయోలిన్ (వ్యవధి: 10 ని॥లు, వకృత్వం (వ్యవధి: 4 ని॥లు), మోడరన్ సాంగ్ (సోలో) (వ్యవధి: 4 ని॥లు), మోడరన్ డ్యాన్స్ (సోలో) (వ్యవధి: 4 ని) వయోలిన్ (వ్యవధి: 10 ని॥లు), ఫ్యాన్సీడ్రస్, గ్రూపు డిస్క్క్షన్ (వ్యవధి: 20 ని॥లు), క్విజ్ (వ్యవధి: 20 ని॥లు), అడ్వేంచర్ యాక్టవిటీస్ (వ్యవధి: 20 ని॥లు, పెయింటింగ్ (వ్యవధి: 30 ని॥లు), స్కల్పర్స్ (వ్యవధి: 50 ని॥లు), ఆర్టిజన్ (వ్యవధి: 30 ని॥లు) టాపిక్స్: దేశ భక్తి, సామాజిక మరియు ఆర్థిక ఉద్యమము (Socio-Economic Movement), పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యము, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరియు స్వచ్ఛ భారత్ (మత పరమైన అంశాలు ఉండరాదు) మొదలగునవి సినిమా పాటలు లేదా అసభ్యకర పాటలు, డ్యాన్స్ లు అనుమతించబడవు. నమోదు కొరకు ఆయా అంశాల్లో పాల్గొనే అభ్యర్థులు వయస్సు దృవీకరణ కొరకు ఏదైనా ధృవపత్రము (ఆధార్ కార్డు) నకలు తీసుకొని రావలెనని, క్షళాకారులు తమ సొంత వాయిద్య పరికరములతో, మేకప్ ఏర్పాట్లు తో హాజరు కావాలన్నారు. * జిల్లా స్థాయిలో ప్రధమ స్థానం పొందిన వారిని రాష్ట్రస్థాయిలో నిర్వహించబడు పోటీలకు.. రాష్ట్రస్థాయిలో ప్రధమ స్థానం పొందినవారిని జాతీయ స్థాయిలో నిర్వహించబడు పోటీలకు ఉచిత ప్రయాణభత్యము, భోజన సదుపాయములతో పంపడం జరుగుతుందన్నారు. " గత 3 సంవత్సరములలో రాష్ట్రస్థాయి యూత్ ఫెస్టివల్ కార్యక్రమములలో పాల్గొన్నవారు / టీమ్ సభ్యులు ఈ సంవత్సరము జరుగు పోటీలకు దరఖాస్తు చేసుకోవాడానికి అనర్హులు అని స్పష్టం చేశారు. ముఖ్య గమనిక : ఆశక్తిగల, ఉత్సాహవంతులైన యువ కళాకారులు వివరములు: ఈ క్రింది తెలిపిన గుగుల్ ఫారమ్ లింక్ నందు (లేదా) QR కోడ్ ద్వారాతమ వివరాలు నమోదు చేసుకోవచ్చును. లింక్: https://docs.google.com/forms/d/e/ ఉత్సాహవంతులైన / చదువుకున్న, చదువులేని యువతీ, యువకులు ఈ సదవకాశమును ఉపయోగించు కోవలసినదిగా కోరడమైనది. సెట్రాజ్ కార్యాలయము, కాకినాడ 0884-2344913, 98499 13065, 8919135344 సంప్రదించ వచ్చునని ఆమె తెలిపారు. Comments addComments Post a Comment Popular posts ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది. November 25, 2022 • GUDIBANDI SUDHAKAR REDDY ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి. November 30, 2022 • GUDIBANDI SUDHAKAR REDDY న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం. November 29, 2022 • GUDIBANDI SUDHAKAR REDDY *ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
కొన్ని వారాల క్రితం మేము మీ Linksys WRT54GLలో టొమాటో, ఓపెన్ సోర్స్ రూటర్ ఫర్మ్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడాన్ని కవర్ చేసాము. ఈ రోజు మనం టొమాటోతో పాటు ఓపెన్‌విపిఎన్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో మరియు ప్రపంచంలో ఎక్కడి నుండైనా మీ హోమ్ నెట్‌వర్క్‌ని యాక్సెస్ చేయడానికి దాన్ని సెటప్ చేయడం ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం! OpenVPN అంటే ఏమిటి? వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) అనేది ఒక లోకల్ ఏరియా నెట్‌వర్క్ (LAN) మరియు మరొకటి మధ్య విశ్వసనీయమైన, సురక్షితమైన కనెక్షన్. మీరు కనెక్ట్ చేస్తున్న నెట్‌వర్క్‌ల మధ్య మీ రూటర్‌ని మధ్యస్థ వ్యక్తిగా భావించండి. మీ కంప్యూటర్ మరియు OpenVPN సర్వర్ (ఈ సందర్భంలో మీ రూటర్) రెండూ ఒకదానికొకటి ధృవీకరించే సర్టిఫికేట్‌లను ఉపయోగించి కరచాలనం చేస్తాయి. ధ్రువీకరణ తర్వాత, క్లయింట్ మరియు సర్వర్ రెండూ ఒకరినొకరు విశ్వసించటానికి అంగీకరిస్తాయి మరియు క్లయింట్ సర్వర్ నెట్‌వర్క్‌లో యాక్సెస్ అనుమతించబడుతుంది. సాధారణంగా, VPN సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ అమలు చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మీరు దీన్ని ఇప్పటికే ఊహించి ఉండకపోతే, OpenVPN అనేది (డ్రమ్ రోల్) ఉచిత ఓపెన్ సోర్స్ VPN పరిష్కారం. తమ వాలెట్‌ని తెరవకుండానే రెండు నెట్‌వర్క్‌ల మధ్య సురక్షితమైన కనెక్షన్‌ని కోరుకునే వారికి OpenVPNతో పాటు టొమాటో సరైన పరిష్కారం. వాస్తవానికి, OpenVPN బాక్స్ వెలుపల పని చేయదు. దీన్ని సరిగ్గా పొందడానికి కొద్దిగా ట్వీకింగ్ మరియు కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. అయితే చింతించకండి; మీ కోసం ఆ ప్రక్రియను సులభతరం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము, కాబట్టి మీరే ఒక వెచ్చని కప్పు కాఫీని తీసుకోండి మరియు ప్రారంభించండి. OpenVPN గురించి మరింత సమాచారం కోసం, అధికారికంగా OpenVPN అంటే ఏమిటి? పేజీ. ముందస్తు అవసరాలు ఈ గైడ్ మీరు ప్రస్తుతం మీ PCలో Windows 7ని నడుపుతున్నారని మరియు మీరు అడ్మినిస్ట్రేటివ్ ఖాతాను ఉపయోగిస్తున్నారని ఊహిస్తుంది. మీరు Mac లేదా Linux వినియోగదారు అయితే, ఈ గైడ్ విషయాలు ఎలా పని చేస్తాయనే దాని గురించి మీకు ఒక ఆలోచనను అందిస్తుంది, అయితే, మీరు విషయాలను పరిపూర్ణంగా పొందడానికి మీ స్వంతంగా మరికొంత పరిశోధన చేయాల్సి రావచ్చు. అలాగే, మేము Linksys WRT54GL వెర్షన్ 1.1 రూటర్‌లో TomatoUSB VPN అనే టొమాటో యొక్క ప్రత్యేక వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేస్తాము. మీ రూటర్ TomatoUSBకి అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వారి బిల్డ్ రకాల పేజీని చూడండి. ఈ గైడ్ ప్రారంభంలో మీరు వీటిని కలిగి ఉన్నారని ఊహిస్తుంది: మీ రూటర్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన అసలైన Linksys ఫర్మ్‌వేర్ లేదా మేము మా గత వ్యాసంలో వివరించిన టొమాటో ఫర్మ్‌వేర్ ఇది లింసిస్ ఫర్మ్‌వేర్ లేదా టొమాటో ఫర్మ్‌వేర్ కోసం అని సూచించే నిర్దిష్ట దశలపై ఉన్న వచనాన్ని గమనించండి. TomatoUSBని ఇన్‌స్టాల్ చేస్తోంది PolarCloud వెబ్‌సైట్ నుండి అసలు టొమాటో v1.28 ఫర్మ్‌వేర్‌ను ఎలా ఇన్‌స్టాల్ చేయాలో మునుపటి కథనంలో మేము చర్చించాము. దురదృష్టవశాత్తూ, ఆ టొమాటో వెర్షన్ OpenVPN మద్దతుతో రాలేదు, కాబట్టి మేము TomatoUSB VPN అనే కొత్త వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేస్తాము. మీరు చేయాలనుకుంటున్న మొదటి విషయం TomatoUSB హోమ్‌పేజీకి వెళ్లి డౌన్‌లోడ్ టొమాటో USB లింక్‌ని క్లిక్ చేయండి. కెర్నల్ 2.4 (స్థిరమైన) విభాగం క్రింద VPNని డౌన్‌లోడ్ చేయండి. .rar ఫైల్‌ను మీ కంప్యూటర్‌లో సేవ్ చేయండి. .rar ఫైల్‌ను సంగ్రహించడానికి మీకు ప్రోగ్రామ్ అవసరం. WinRARని ఉపయోగించమని మేము సూచిస్తున్నాము ఎందుకంటే ఇది ప్రయత్నించడం ఉచితం మరియు ఉపయోగించడానికి సులభమైనది. మీరు వారి వెబ్‌సైట్‌లో ఉచిత సంస్కరణ యొక్క కాపీని మీరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. WinRAR ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీరు డౌన్‌లోడ్ చేసిన ఫైల్‌పై కుడి క్లిక్ చేసి, ఇక్కడ ఎక్స్‌ట్రాక్ట్ చేయండి. అప్పుడు మీరు CHANGELOG మరియు tomato-NDUSB-1.28.8754-vpn3.6.trx అనే రెండు ఫైల్‌లను చూడాలి. మీరు Linksys ఫర్మ్‌వేర్‌ని నడుపుతుంటే... మీ బ్రౌజర్‌ని తెరిచి, మీ రూటర్ యొక్క IP చిరునామాను నమోదు చేయండి (డిఫాల్ట్ 192.168.1.1). మీరు వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్ కోసం ప్రాంప్ట్ చేయబడతారు. Linksys WRT54GL కోసం డిఫాల్ట్‌లు అడ్మిన్ మరియు అడ్మిన్. ఎగువన ఉన్న అడ్మినిస్ట్రేషన్ ట్యాబ్‌ను క్లిక్ చేయండి. తరువాత, క్రింద చూసినట్లుగా ఫర్మ్‌వేర్ అప్‌గ్రేడ్‌ని క్లిక్ చేయండి. బ్రౌజ్ బటన్‌ను క్లిక్ చేసి, సంగ్రహించిన TomatoUSB VPN ఫైల్‌లకు నావిగేట్ చేయండి. tomato-NDUSB-1.28.8754-vpn3.6.trx ఫైల్‌ని ఎంచుకుని, వెబ్ ఇంటర్‌ఫేస్‌లో అప్‌గ్రేడ్ బటన్‌ను క్లిక్ చేయండి. మీ రూటర్ TomatoUSB VPNని ఇన్‌స్టాల్ చేయడం ప్రారంభిస్తుంది మరియు పూర్తి చేయడానికి ఒక నిమిషం కంటే తక్కువ సమయం పడుతుంది. ఒక నిమిషం తర్వాత, కమాండ్ ప్రాంప్ట్‌ని తెరిచి, మీ రూటర్ యొక్క కొత్త IP చిరునామాను గుర్తించడానికి ipconfig -release అని టైప్ చేయండి. అప్పుడు ipconfig -renew అని టైప్ చేయండి. డిఫాల్ట్ గేట్‌వేకి కుడివైపున ఉన్న IP చిరునామా... మీ రూటర్ యొక్క IP చిరునామా. గమనిక: టొమాటోను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ > కాన్ఫిగరేషన్‌కి వెళ్లి, అన్ని NVRAMలను ఎరేస్ చేయండి... మీరు టొమాటో ఫర్మ్‌వేర్‌ని నడుపుతుంటే... మీ బ్రౌజర్‌ను తెరిచి, మీ రూటర్ యొక్క IP చిరునామాను నమోదు చేయండి. మీరు టొమాటోను ఇన్‌స్టాల్ చేసినట్లయితే, మీ రూటర్ యొక్క IP చిరునామా మీకు తెలుసని మేము అనుకుంటాము. మీకు ఖచ్చితంగా తెలియకుంటే, అది బహుశా 192.168.1.1 డిఫాల్ట్‌కి సెట్ చేయబడి ఉండవచ్చు. తరువాత, మీ వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి. ఇది అవసరం లేనప్పటికీ, మీరు TomatoUSB VPNకి అప్‌గ్రేడ్ చేయడానికి ముందు మీ ప్రస్తుత టొమాటో కాన్ఫిగరేషన్‌ను బ్యాకప్ చేయాలనుకోవచ్చు. మీ కాన్ఫిగరేషన్‌ను సేవ్ చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ > కాన్ఫిగరేషన్‌కి నావిగేట్ చేసి, బ్యాకప్ బటన్‌ను క్లిక్ చేయండి. ఇది మీ కంప్యూటర్‌లో .cfg ఫైల్‌ను సేవ్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది. ఇప్పుడు టొమాటోను TomatoUSB VPNకి అప్‌గ్రేడ్ చేసే సమయం వచ్చింది. ఎడమ కాలమ్‌లో అప్‌గ్రేడ్ చేయి క్లిక్ చేసి, ఫైల్‌ను ఎంచుకోండి బటన్‌ను క్లిక్ చేయండి. మేము ఇంతకు ముందు సంగ్రహించిన ఫైల్‌లకు నావిగేట్ చేయండి మరియు tomato-NDUSB-1.28.8754-vpn3.6.trx ఫైల్‌ని ఎంచుకోండి. ఆపై అప్‌గ్రేడ్ బటన్‌ను క్లిక్ చేయండి. మీరు అప్‌గ్రేడ్‌ని నిర్ధారించమని అడగబడతారు; సరే క్లిక్ చేయండి. మీ రూటర్ కొత్త ఫర్మ్‌వేర్‌ను అప్‌లోడ్ చేయడం ప్రారంభిస్తుంది మరియు ఒక నిమిషంలోపు పునఃప్రారంభించబడుతుంది. ఇది పునఃప్రారంభించిన తర్వాత అదే లేదా వేరే IP చిరునామాను కలిగి ఉండవచ్చు. మా విషయంలో, రూటర్ కాన్ఫిగరేషన్ ఇప్పటికీ అలాగే ఉంది కాబట్టి మా IP చిరునామా ఇప్పటికీ అలాగే ఉంది. మీ రూటర్ యొక్క కొత్త IP చిరునామాను గుర్తించడానికి, కమాండ్ ప్రాంప్ట్‌ని తెరిచి, ipconfig -release అని టైప్ చేయండి. అప్పుడు ipconfig -renew అని టైప్ చేయండి. డిఫాల్ట్ గేట్‌వేకి కుడివైపున ఉన్న IP చిరునామా... మీ రౌటర్ చిరునామా. మీ కాన్ఫిగరేషన్ డిఫాల్ట్‌లకు తిరిగి సెట్ చేయబడితే, కాన్ఫిగరేషన్ పేజీకి (అడ్మినిస్ట్రేషన్ > కాన్ఫిగరేషన్) తిరిగి వెళ్లి, రీస్టోర్ కాన్ఫిగరేషన్ క్రింద ఉన్న ఫైల్‌ను ఎంచుకోండి బటన్‌ను క్లిక్ చేయండి. మీరు ముందుగా మీ కంప్యూటర్‌లో సేవ్ చేసిన .cfg ఫైల్ కోసం బ్రౌజ్ చేసి, పునరుద్ధరించు బటన్‌ను క్లిక్ చేయండి. OpenVPNని కాన్ఫిగర్ చేస్తోంది మీరు Linksys ఫర్మ్‌వేర్ లేదా టొమాటో ఫర్మ్‌వేర్ ఇన్‌స్టాల్ చేసినా, ఇప్పుడు మీరు మీ రూటర్‌లో కొత్త TomatoUSB VPNని ఇన్‌స్టాల్ చేసి ఉండాలి. మీరు ఎడమ కాలమ్‌లో వెబ్ వినియోగం, USB మరియు NAS మరియు VPN టన్నెలింగ్‌తో సహా కొన్ని కొత్త మెనులను గమనించవచ్చు. ఈ గైడ్ కోసం, మేము VPN టన్నెలింగ్ మెనుతో మాత్రమే ఆందోళన చెందుతున్నాము కాబట్టి ముందుకు సాగండి మరియు VPN టన్నెలింగ్ క్లిక్ చేయండి. ఈ బ్రౌజర్ విండోను తెరిచి ఉంచండి; మేము త్వరలో దానికి తిరిగి వస్తాము. ఇప్పుడు OpenVPN డౌన్‌లోడ్‌ల పేజీకి వెళ్లి OpenVPN విండోస్ ఇన్‌స్టాలర్‌ను డౌన్‌లోడ్ చేద్దాం. ఈ గైడ్‌లో, మేము 2.1.4 అని పిలువబడే OpenVPN యొక్క రెండవ తాజా వెర్షన్‌ని ఉపయోగిస్తాము. తాజా వెర్షన్ (2.2.0)లో బగ్ ఉంది, అది ఈ ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తుంది. మేము డౌన్‌లోడ్ చేస్తున్న ఫైల్ మీ VPN నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే OpenVPN ప్రోగ్రామ్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది, కాబట్టి మీరు క్లయింట్‌లుగా వ్యవహరించాలనుకునే ఏదైనా ఇతర కంప్యూటర్‌లలో ఈ ప్రోగ్రామ్‌ను ఇన్‌స్టాల్ చేయాలని నిర్ధారించుకోండి (దీనిని ఎలా చేయాలో మేము చూస్తాము. తరువాత). openvpn-2.1.4-install .exe ఫైల్‌ను మీ కంప్యూటర్‌లో సేవ్ చేయండి. మేము ఇప్పుడే డౌన్‌లోడ్ చేసిన OpenVPN ఫైల్‌కి నావిగేట్ చేయండి మరియు దానిపై డబుల్ క్లిక్ చేయండి. ఇది మీ కంప్యూటర్‌లో OpenVPN యొక్క ఇన్‌స్టాలేషన్‌ను ప్రారంభిస్తుంది. అన్ని డిఫాల్ట్‌లను తనిఖీ చేసి ఇన్‌స్టాలర్ ద్వారా అమలు చేయండి. ఇన్‌స్టాలేషన్ సమయంలో, TAP-Win32 అనే కొత్త వర్చువల్ నెట్‌వర్క్ అడాప్టర్‌ను ఇన్‌స్టాల్ చేయమని అడుగుతున్న డైలాగ్ బాక్స్ పాపప్ అవుతుంది. ఇన్‌స్టాల్ బటన్‌ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ కంప్యూటర్‌లో OpenVPN ఇన్‌స్టాల్ చేసారు, మేము పరికరాలను ప్రామాణీకరించడానికి ప్రమాణపత్రాలు మరియు కీలను సృష్టించడం ప్రారంభించాలి. సర్టిఫికెట్లు మరియు కీలను సృష్టించడం విండోస్ స్టార్ట్ బటన్‌ను క్లిక్ చేసి, యాక్సెసరీస్ కింద నావిగేట్ చేయండి. మీరు కమాండ్ ప్రాంప్ట్ ప్రోగ్రామ్‌ను చూస్తారు. దానిపై కుడి క్లిక్ చేసి, నిర్వాహకుడిగా రన్ క్లిక్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్‌లో, మీరు క్రింద చూసినట్లుగా 64-బిట్ విండోస్ 7ని రన్ చేస్తున్నట్లయితే cd c:Program Files (x86)OpenVPNeasy-rsa అని టైప్ చేయండి. మీరు 32-బిట్ విండోస్ 7ని రన్ చేస్తున్నట్లయితే cd c:Program FilesOpenVPNeasy-rsa అని టైప్ చేయండి. ఆపై ఎంటర్ నొక్కండి. ఇప్పుడు init-config అని టైప్ చేసి, vars.bat మరియు openssl.cnf అనే రెండు ఫైల్‌లను సులభంగా-rsa ఫోల్డర్‌లోకి కాపీ చేయడానికి ఎంటర్ నొక్కండి. మేము త్వరలో దానికి తిరిగి వస్తాము కాబట్టి మీ కమాండ్‌ని ప్రాంప్ట్‌గా ఉంచండి. C:Program Files (x86)OpenVPNeasy-rsa (లేదా C:Program FilesOpenVPNeasy-rsa 32-బిట్ Windows 7)కి నావిగేట్ చేయండి మరియు vars.bat అనే ఫైల్‌పై కుడి క్లిక్ చేయండి. నోట్‌ప్యాడ్‌లో తెరవడానికి సవరించు క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా, ఈ ఫైల్‌ని నోట్‌ప్యాడ్++తో తెరవమని మేము సిఫార్సు చేస్తున్నాము ఎందుకంటే ఇది ఫైల్‌లోని వచనాన్ని మరింత మెరుగ్గా ఫార్మాట్ చేస్తుంది. మీరు వారి హోమ్‌పేజీ నుండి నోట్‌ప్యాడ్++ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫైల్ యొక్క దిగువ భాగం మనకు సంబంధించినది. లైన్ 31 నుండి ప్రారంభించి, KEY_COUNTRY విలువ, KEY_PROVINCE విలువ మొదలైనవాటిని మీ దేశం, ప్రావిన్స్ మొదలైన వాటికి మార్చండి. ఉదాహరణకు, మేము మా ప్రావిన్స్‌ని ILకి, సిటీని చికాగోకి, orgని HowToGeekకి మరియు ఇమెయిల్‌ని మా స్వంత ఇమెయిల్ చిరునామాకు మార్చాము. అలాగే, మీరు Windows 7 64-bitని నడుపుతున్నట్లయితే, లైన్ 6లోని HOME విలువను %ProgramFiles (x86)%OpenVPNeasy-rsaకి మార్చండి. మీరు 32-బిట్ విండోస్ 7ని నడుపుతున్నట్లయితే ఈ విలువను మార్చవద్దు. మీ ఫైల్ దిగువన ఉన్న మాదిలా ఉండాలి (వాస్తవానికి, మీ సంబంధిత విలువలతో). మీరు సవరించడం పూర్తయిన తర్వాత దాన్ని ఓవర్‌రైట్ చేయడం ద్వారా ఫైల్‌ను సేవ్ చేయండి. మీ కమాండ్ ప్రాంప్ట్‌కి తిరిగి వెళ్లి vars అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. అప్పుడు clean-all అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. చివరగా, build-ca అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. build-ca కమాండ్‌ని అమలు చేసిన తర్వాత, మీరు మీ దేశం పేరు, రాష్ట్రం, ప్రాంతం మొదలైనవాటిని నమోదు చేయమని ప్రాంప్ట్ చేయబడతారు. మేము ఇప్పటికే మా vars.bat ఫైల్‌లో ఈ పారామితులను సెటప్ చేసాము కాబట్టి, మేము ఎంటర్ నొక్కడం ద్వారా ఈ ఎంపికలను దాటవేయవచ్చు, కానీ ! మీరు ఎంటర్ కీ వద్ద స్లామ్ చేయడం ప్రారంభించే ముందు, సాధారణ పేరు పరామితి కోసం చూడండి. మీరు ఈ పరామితిలో ఏదైనా నమోదు చేయవచ్చు (అంటే మీ పేరు). మీరు ఏదైనా నమోదు చేశారని నిర్ధారించుకోండి. ఈ ఆదేశం సులభ-rsa/కీల ఫోల్డర్‌లో రెండు ఫైల్‌లను (రూట్ CA సర్టిఫికేట్ మరియు రూట్ CA కీ) అవుట్‌పుట్ చేస్తుంది. ఇప్పుడు మేము క్లయింట్ కోసం ఒక కీని నిర్మించబోతున్నాము. అదే కమాండ్ ప్రాంప్ట్‌లో బిల్డ్-కీ క్లయింట్1 అని టైప్ చేయండి. మీరు క్లయింట్1ని మీకు కావలసినదానికి మార్చవచ్చు (అంటే Acer-Laptop). ప్రాంప్ట్ చేయబడినప్పుడు సాధారణ పేరు వలె అదే పేరును నమోదు చేయాలని నిర్ధారించుకోండి. ఉదాహరణకు, మీరు బిల్డ్-కీ Acer-Laptop ఆదేశాన్ని అమలు చేసినప్పుడు, మీ సాధారణ పేరు Acer-Laptop అయి ఉండాలి. మేము చేసిన చివరి దశ (కామన్ నేమ్ మినహా) వంటి అన్ని డిఫాల్ట్‌ల ద్వారా అమలు చేయండి. అయితే, చివరికి మీరు సర్టిఫికేట్‌పై సంతకం చేయమని మరియు కట్టుబడి ఉండమని అడగబడతారు. రెండింటికీ y అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. అలాగే, మీరు 'యాదృచ్ఛిక స్థితి' లోపాన్ని వ్రాయలేకపోయినట్లయితే చింతించకండి. మీ సర్టిఫికేట్‌లు ఇప్పటికీ ఎలాంటి సమస్య లేకుండా తయారవుతున్నాయని నేను గమనించాను. ఈ ఆదేశం సులభమైన-rsa/కీల ఫోల్డర్‌లో రెండు ఫైల్‌లను (క్లెంట్1 కీ మరియు క్లయింట్1 సర్టిఫికేట్) అవుట్‌పుట్ చేస్తుంది. మీరు మరొక క్లయింట్ కోసం మరొక కీని సృష్టించాలనుకుంటే, మునుపటి దశను పునరావృతం చేయండి, కానీ సాధారణ పేరును మార్చాలని నిర్ధారించుకోండి. మేము రూపొందించే చివరి ప్రమాణపత్రం సర్వర్ కీ. అదే కమాండ్ ప్రాంప్ట్‌లో, బిల్డ్-కీ-సర్వర్ సర్వర్‌ని టైప్ చేయండి. మీరు కమాండ్ చివరిలో సర్వర్‌ని మీకు కావలసిన దానితో భర్తీ చేయవచ్చు (అంటే HowToGeek-Server). ఎప్పటిలాగే, ప్రాంప్ట్ చేయబడినప్పుడు సాధారణ పేరు వలె అదే పేరును నమోదు చేయాలని నిర్ధారించుకోండి. ఉదాహరణకు, మీరు build-key-server HowToGeek-Server ఆదేశాన్ని అమలు చేసినప్పుడు, మీ సాధారణ పేరు HowToGeek-Server అయి ఉండాలి. ఎంటర్ నొక్కండి మరియు సాధారణ పేరు మినహా అన్ని డిఫాల్ట్‌ల ద్వారా అమలు చేయండి. ముగింపులో, సర్టిఫికేట్‌పై సంతకం చేయడానికి మరియు కట్టుబడి ఉండటానికి y అని టైప్ చేయండి. ఈ ఆదేశం సులభమైన-rsa/కీల ఫోల్డర్‌లో రెండు ఫైల్‌లను (సర్వర్ కీ మరియు సర్వర్ సర్టిఫికేట్) అవుట్‌పుట్ చేస్తుంది. ఇప్పుడు మనం Diffie Hellman పారామితులను రూపొందించాలి. Diffie Hellman ప్రోటోకాల్ ఇద్దరు వినియోగదారులను ఎటువంటి ముందస్తు రహస్యాలు లేకుండా అసురక్షిత మాధ్యమంలో రహస్య కీని మార్పిడి చేసుకోవడానికి అనుమతిస్తుంది. మీరు RSA వెబ్‌సైట్‌లో Diffie Hellman గురించి మరింత చదువుకోవచ్చు. అదే కమాండ్ ప్రాంప్ట్‌లో build-dh అని టైప్ చేయండి. ఈ ఆదేశం సులభమైన-rsa/కీల ఫోల్డర్‌లో ఒక ఫైల్ (dh1024.pem)ని అవుట్‌పుట్ చేస్తుంది. క్లయింట్ కోసం కాన్ఫిగరేషన్ ఫైల్‌లను సృష్టిస్తోంది మేము ఏదైనా కాన్ఫిగరేషన్ ఫైల్‌లను సవరించే ముందు, మేము డైనమిక్ DNS సేవను సెటప్ చేయాలి. మీ ISP మీకు ప్రతిసారీ డైనమిక్ బాహ్య IP చిరునామాను జారీ చేస్తే ఈ సేవను ఉపయోగించండి. మీకు స్థిరమైన బాహ్య IP చిరునామా ఉంటే, తదుపరి దశకు వెళ్లండి. DynDNS.comని ఉపయోగించమని మేము సూచిస్తున్నాము, ఇది హోస్ట్ పేరును (అంటే howtogeek.dyndns.org) డైనమిక్ IP చిరునామాకు సూచించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. OpenVPNకి మీ నెట్‌వర్క్ పబ్లిక్ IP చిరునామాను ఎల్లప్పుడూ తెలుసుకోవడం చాలా ముఖ్యం మరియు DynDNSని ఉపయోగించడం ద్వారా, మీ పబ్లిక్ IP చిరునామా ఎలా ఉన్నా మీ నెట్‌వర్క్‌ను ఎలా గుర్తించాలో OpenVPN ఎల్లప్పుడూ తెలుసుకుంటుంది. హోస్ట్ పేరు కోసం సైన్ అప్ చేయండి మరియు దానిని మీ పబ్లిక్ IP చిరునామాకు సూచించండి. మీరు సేవ కోసం సైన్ అప్ చేసిన తర్వాత, బేసిక్ > DDNS కింద టొమాటోలో ఆటో-అప్‌డేట్ సేవను సెటప్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు OpenVPNని కాన్ఫిగర్ చేయడానికి తిరిగి వెళ్ళు. విండోస్ ఎక్స్‌ప్లోరర్‌లో, మీరు 64-బిట్ విండోస్ 7ని రన్ చేస్తున్నట్లయితే C:Program Files (x86)OpenVPNsample-configకి నావిగేట్ చేయండి లేదా మీరు 32-బిట్ రన్ చేస్తున్నట్లయితే C:Program FilesOpenVPNsample-config Windows 7. ఈ ఫోల్డర్‌లో మీరు మూడు నమూనా కాన్ఫిగరేషన్ ఫైల్‌లను కనుగొంటారు; మేము client.ovpn ఫైల్‌తో మాత్రమే ఆందోళన చెందుతాము. client.ovpnపై కుడి క్లిక్ చేసి, నోట్‌ప్యాడ్ లేదా నోట్‌ప్యాడ్++తో తెరవండి. మీ ఫైల్ క్రింది చిత్రంలో ఉన్నట్లు మీరు గమనించవచ్చు: అయితే, మేము మా Client.ovpn ఫైల్ ఈ క్రింది చిత్రాన్ని పోలి ఉండాలని కోరుకుంటున్నాము. DynDNS హోస్ట్ పేరును లైన్ 4లో మీ హోస్ట్ పేరుకు మార్చాలని నిర్ధారించుకోండి (లేదా మీకు స్టాటిక్ ఒకటి ఉంటే దానిని మీ పబ్లిక్ IP చిరునామాకు మార్చండి). ఇది ప్రామాణిక OpenVPN పోర్ట్ అయినందున పోర్ట్ నంబర్‌ను 1194కి వదిలివేయండి. అలాగే, మీ క్లయింట్ యొక్క సర్టిఫికేట్ ఫైల్ మరియు కీ ఫైల్ పేరును ప్రతిబింబించేలా 11 మరియు 12 లైన్లను మార్చాలని నిర్ధారించుకోండి. దీన్ని OpenVPN/config ఫోల్డర్‌లో కొత్త ఫైల్ .ovpn ఫైల్‌గా సేవ్ చేయండి. టొమాటో యొక్క VPN టన్నెలింగ్‌ను కాన్ఫిగర్ చేస్తోంది మేము ఇంతకు ముందు చేసిన సర్వర్ సర్టిఫికేట్‌లు మరియు కీలను కాపీ చేసి, వాటిని టొమాటో VPN సర్వర్ మెనూలలో అతికించడం ఇప్పుడు ప్రాథమిక ఆలోచన. అప్పుడు మేము టొమాటోలో కొన్ని సెట్టింగ్‌లను తనిఖీ చేస్తాము, VPN కనెక్షన్‌ని పరీక్షిస్తాము, ఆపై మేము చేతులు కడుక్కోగలుగుతాము మరియు దానిని ఒక రోజుగా పిలుస్తాము! బ్రౌజర్‌ని తెరిచి, మీ రూటర్‌కి నావిగేట్ చేయండి. ఎడమ సైడ్‌బార్‌లో VPN టన్నెలింగ్ మెనుని క్లిక్ చేయండి. సర్వర్1 మరియు బేసిక్ కూడా ఎంచుకోబడ్డాయని నిర్ధారించుకోండి. మీ సెట్టింగ్‌లు క్రింద కనిపించే విధంగానే సెటప్ చేయండి. సేవ్ క్లిక్ చేయండి. అప్‌డేట్: డిఫాల్ట్ మోడ్ TUN లేదా టన్నెల్, కానీ మీరు బహుశా దాన్ని TAPకి మార్చాలనుకోవచ్చు, ఇది నెట్‌వర్క్‌ను వంతెనగా మారుస్తుంది. టన్నెల్ మోడ్ మీ బాహ్య క్లయింట్‌లను అంతర్గత నెట్‌వర్క్ కాకుండా వేరే నెట్‌వర్క్‌లో ఉంచుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్‌ఫేస్ రకాన్ని TAPకి మార్చండి. తర్వాత, బేసిక్ పక్కన ఉన్న అధునాతన ట్యాబ్‌ను క్లిక్ చేయండి. మునుపటిలాగే, మీ సెట్టింగ్‌లు సరిగ్గా దిగువన కనిపించే విధంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. సేవ్ క్లిక్ చేయండి. మేము మొదట సృష్టించిన కీలు మరియు ప్రమాణపత్రాలను అతికించడం మా చివరి దశ. అధునాతనం పక్కన ఉన్న కీస్ ట్యాబ్‌ను తెరవండి. Windows Explorerలో, 64-bit Windows 7లో C:Program Files (x86)OpenVPNeasy-rsakeysకి నావిగేట్ చేయండి (లేదా 32-bit Windows 7లో C:Program FilesOpenVPNeasy-rsakeys) . నోట్‌ప్యాడ్ లేదా నోట్‌ప్యాడ్++తో దిగువన ఉన్న ప్రతి సంబంధిత ఫైల్‌ను (ca.crt, server.crt, server.key మరియు dh1024.pem) తెరిచి, కంటెంట్‌లను కాపీ చేయండి. దిగువ చూసినట్లుగా సంబంధిత పెట్టెల్లో కంటెంట్‌లను అతికించండి. మీరు సర్వర్.crtలో దిగువన ఉన్న అన్నింటినీ మాత్రమే అతికించవలసి ఉంటుందని నేను గమనించాలి. మీరు మొత్తం ఫైల్‌ను అతికించినప్పటికీ OpenVPN సరిగ్గా పని చేస్తుంది, కానీ అసలు సర్టిఫికేట్ సమాచారాన్ని అతికించడం మాత్రమే మరింత శుభ్రంగా ఉంటుంది. సేవ్ క్లిక్ చేసి, ఆపై ప్రారంభించు క్లిక్ చేయండి. మేము మా VPN కనెక్షన్‌ని పరీక్షించే ముందు, టొమాటో లోపల మనం తనిఖీ చేయవలసిన మరో విషయం ఉంది. ఎడమ చేతి కాలమ్‌లో ప్రాథమిక క్లిక్ చేసి ఆపై సమయం క్లిక్ చేయండి. రూటర్ సమయం సరైనదని మరియు టైమ్ జోన్ మీ ప్రస్తుత టైమ్ జోన్‌ని ప్రదర్శిస్తుందని నిర్ధారించుకోండి. NTP టైమ్ సర్వర్‌ని మీ దేశానికి సెట్ చేయండి. OpenVPN క్లయింట్‌ని సెటప్ చేస్తోంది ఈ ఉదాహరణలో మేము Windows 7 ల్యాప్‌టాప్‌ని మా క్లయింట్‌గా ఉపయోగిస్తాము. ఓపెన్‌విపిఎన్‌ని కాన్ఫిగర్ చేయడం కింద మేము పైన మొదటి దశల్లో చేసినట్లుగా మీ క్లయింట్‌లో ఓపెన్‌విపిఎన్‌ని ఇన్‌స్టాల్ చేయడం మీరు చేయాలనుకుంటున్న మొదటి విషయం. ఆపై C:Program FilesOpenVPNconfigకి నావిగేట్ చేయండి, ఇక్కడే మనం మన ఫైల్‌లను అతికించగలము. ఇప్పుడు మనం మా అసలు కంప్యూటర్‌కు తిరిగి వెళ్లి, మా క్లయింట్ ల్యాప్‌టాప్‌కి కాపీ చేయడానికి మొత్తం నాలుగు ఫైల్‌లను సేకరించాలి. C:Program Files (x86)OpenVPNeasy-rsakeysకి మళ్లీ నావిగేట్ చేయండి మరియు ca.crt, client1.crt మరియు client1.keyని కాపీ చేయండి. క్లయింట్ కాన్ఫిగరేషన్ ఫోల్డర్‌లో ఈ ఫైల్‌లను అతికించండి. చివరగా, మనం మరో ఫైల్‌ని కాపీ చేయాలి. C:Program Files (x86)OpenVPNconfigకి నావిగేట్ చేయండి మరియు మేము ఇంతకు ముందు సృష్టించిన కొత్త client.ovpn ఫైల్‌పై కాపీ చేయండి. క్లయింట్ యొక్క కాన్ఫిగరేషన్ ఫోల్డర్‌లో కూడా ఈ ఫైల్‌ను అతికించండి. OpenVPN క్లయింట్‌ని పరీక్షిస్తోంది క్లయింట్ ల్యాప్‌టాప్‌లో, Windows Start బటన్‌ను క్లిక్ చేసి, అన్ని ప్రోగ్రామ్‌లు > OpenVPNకి నావిగేట్ చేయండి. OpenVPN GUI ఫైల్‌పై కుడి క్లిక్ చేసి, నిర్వాహకుడిగా రన్ క్లిక్ చేయండి. OpenVPN సరిగ్గా పని చేయడానికి మీరు ఎల్లప్పుడూ నిర్వాహకుడిగా తప్పనిసరిగా అమలు చేయాలని గుర్తుంచుకోండి. ఫైల్‌ను ఎల్లప్పుడూ నిర్వాహకుడిగా అమలు చేసేలా శాశ్వతంగా సెట్ చేయడానికి, ఫైల్‌పై కుడి క్లిక్ చేసి, గుణాలు క్లిక్ చేయండి. అనుకూలత ట్యాబ్ కింద ఈ ప్రోగ్రామ్‌ను నిర్వాహకుడిగా అమలు చేయడాన్ని తనిఖీ చేయండి. టాస్క్‌బార్‌లోని గడియారం పక్కన OpenVPN GUI చిహ్నం కనిపిస్తుంది. చిహ్నంపై కుడి క్లిక్ చేసి, కనెక్ట్ చేయి క్లిక్ చేయండి. మా కాన్ఫిగరేషన్ ఫోల్డర్‌లో ఒక .ovpn ఫైల్ మాత్రమే ఉన్నందున, OpenVPN డిఫాల్ట్‌గా ఆ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవుతుంది. కనెక్షన్ లాగ్‌ను ప్రదర్శించే డైలాగ్ బాక్స్ పాప్ అప్ అవుతుంది. మీరు VPNకి కనెక్ట్ అయిన తర్వాత, టాస్క్‌బార్‌లోని OpenVPN చిహ్నం ఆకుపచ్చగా మారుతుంది మరియు మీ వర్చువల్ IP చిరునామాను ప్రదర్శిస్తుంది. మరియు అంతే! మీరు ఇప్పుడు OpenVPN మరియు TomatoUSBని ఉపయోగించి మీ సర్వర్ మరియు క్లయింట్ నెట్‌వర్క్ మధ్య సురక్షిత కనెక్షన్‌ని కలిగి ఉన్నారు. కనెక్షన్‌ని మరింత పరీక్షించడానికి, క్లయింట్ ల్యాప్‌టాప్‌లో బ్రౌజర్‌ని తెరవడానికి ప్రయత్నించండి మరియు సర్వర్ నెట్‌వర్క్‌లో మీ టొమాటో రూటర్‌కి నావిగేట్ చేయండి. ది ఇవాన్ ద్వారా చిత్రం మరిన్ని కథలు బహుళ ఆడియో పరికరాల నుండి ఏకకాలంలో రికార్డ్ చేయడం ఎలా ప్రతిసారీ, మీరు మీ ఆడియో ప్రాజెక్ట్‌ల కోసం ఏకకాలంలో బహుళ విషయాలను రికార్డ్ చేయాల్సి రావచ్చు. సరైన పరికరాలు లేకుండా, ఇది చాలా కష్టమైన పని, కానీ సరైన సాఫ్ట్‌వేర్ ట్రిక్స్‌తో, మీరు త్వరగా ట్రాక్‌లోకి రావచ్చు. మీ ఉబుంటు ISOని తిరిగి డౌన్‌లోడ్ చేయకుండా ఎలా అప్‌గ్రేడ్ చేయాలి Zsync అనేది Linux కమాండ్, ఇది తప్పిపోయిన లేదా గడువు ముగిసిన భాగాలను మాత్రమే డౌన్‌లోడ్ చేయడానికి ఇప్పటికే ఉన్న .isoని తాజా zsync మెటా ఫైల్‌తో పోల్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ ప్రస్తుత ఫైల్‌తో ఆ భాగాలను కలపండి మరియు డౌన్‌లోడ్ చేయడానికి సమయాన్ని వెచ్చించకుండానే మీకు మిగిలి ఉన్నది పూర్తిగా తాజా ఐసో ప్రో వంటి విండోస్ అడ్మిన్ టూల్స్ ఉపయోగించడం ప్రో వంటి విండోస్ అడ్మినిస్ట్రేషన్ సాధనాలను ఎలా ఉపయోగించాలో ఈ సిరీస్ మీకు నేర్పుతుంది. మీ డెస్క్‌టాప్ మరియు డాక్స్ కోసం జపనీస్ నేపథ్య ఐకాన్ ప్యాక్‌లు మీరు మీ ఆసియన్-థీమ్ డెస్క్‌టాప్ లేదా మేము ఈరోజు ముందుగా ఫీచర్ చేసిన చెర్రీ బ్లాసమ్స్ థీమ్‌తో వెళ్లడానికి చిహ్నాల కోసం చూస్తున్నారా? అప్పుడు మీరు ఖచ్చితంగా deviantART యూజర్ dunedhel నుండి అందంగా తయారు చేయబడిన ఈ రెండు ఐకాన్ ప్యాక్‌లను చూడాలని కోరుకుంటారు. ఇది ఉచిత అనువర్తనాల విషయానికి వస్తే, Android ఆధిపత్యం [ఇన్ఫోగ్రాఫిక్] Apple అభిమానులు యాప్‌స్టోర్‌లో ఎన్ని యాప్‌లు ఉన్నాయో చెప్పడానికి ఇష్టపడతారు-సరే, సరే, చాలా కొన్ని ఉన్నాయి-కాని ఉచిత అప్లికేషన్‌ల శాతం విషయానికి వస్తే Android పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తుంది. 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు కంప్యూటర్ మౌస్ [గీక్ చరిత్ర] మీరు ప్రస్తుతం మీ చేతిని ఒకదానిపై ఉంచి ఉండవచ్చు, మరింత చదవడానికి ఈ కథనం యొక్క శీర్షికను క్లిక్ చేయబోతున్నారు, వినయపూర్వకమైన కంప్యూటర్ మౌస్. ఈ రోజు మౌస్ 30 ఏళ్లు పూర్తవుతుంది మరియు ఎక్కువ లేదా తక్కువ, దాని పూర్వ స్వభావానికి కేవలం ఒక కాంపాక్ట్ వెర్షన్. జపాన్ చెర్రీ చెట్ల అందాన్ని మీ డెస్క్‌టాప్‌కు తీసుకురండి [Windows 7 థీమ్] ప్రతి సంవత్సరం జపాన్ చెర్రీ చెట్లు వికసించినప్పుడు చూడటానికి ఒక అందమైన దృశ్యం. ఇప్పుడు మీరు Windows 7 కోసం చెర్రీ బ్లాసమ్స్ థీమ్‌తో మీ డెస్క్‌టాప్‌కు ఈ అద్భుతమైన మరియు ప్రత్యేకమైన స్ప్రింగ్ టచ్‌ని జోడించవచ్చు. మీడియా గేర్‌ను కనిపించకుండా ఉంచడానికి IR రిపీటర్‌ను సెటప్ చేయండి మీరు మీ అన్ని ఆడియో వీడియో గేర్‌లను దాచి ఉంచగలిగితే మంచిది కాదా? IR రిపీటర్‌తో మీరు క్యాబినెట్ లేదా క్లోసెట్‌లో దాదాపుగా కనిపించకుండా ఉండే చిన్న IR డాంగిల్‌తో ప్రతిదీ దాచవచ్చు. గీక్ రాంట్స్: ప్రింట్ స్టైల్‌షీట్‌లను ఉపయోగించడంలో చాలా వెబ్‌సైట్‌లు ఎందుకు విఫలమయ్యాయి? వెబ్ పేజీలో ప్రింట్ అని చెప్పే లింక్ లేదా బటన్ కోసం ప్రజలు వెతకడం నన్ను ఆశ్చర్యపరుస్తుంది, ప్రత్యేకించి ఆ దశను అనవసరంగా మార్చే అద్భుత సాంకేతికత ఉంది. దురదృష్టవశాత్తు దాదాపు ఎవరూ దీనిని ఉపయోగించరు, అయినప్పటికీ ఇది 10 సంవత్సరాల వయస్సు. చాలా డెస్క్‌టాప్ వినోదం కోసం రూబిక్స్ క్యూబ్ యొక్క మీ స్వంత కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి మీరు రూబిక్స్ క్యూబ్ అభిమానులా? అప్పుడు మీరు అదృష్టవంతులు! ఇప్పుడు మీరు ఈ అత్యంత వ్యసనపరుడైన గేమ్ యొక్క ఎలక్ట్రానిక్ వెర్షన్‌ను మీ స్వంతంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వర్గం న్యూస్ ఎలా వార్తలు వార్తలు వ్యాపార వార్తలు మునుపటి వ్యాసం MLB మరియు డిస్నీ 'లీగ్ ఆఫ్ లెజెండ్స్' స్ట్రీమింగ్ హక్కులను తీసుకున్నాయి తదుపరి ఆర్టికల్ వర్డ్‌లో ఒకేసారి బహుళ పేజీలను ఎలా చూడాలి ఆసక్తికరమైన కథనాలు జంప్‌లిస్ట్ లాంచర్‌తో విండోస్ 7 టాస్క్‌బార్‌ను ఏకీకృతం చేయండి పాఠకులను అడగండి: మీరు ఇంటి నుండి సురక్షితంగా ఎలా బ్రౌజ్ చేస్తారు? Windows 7లో ఫైల్‌లను తెరవడానికి వాటిని టాస్క్‌బార్‌కి ఎలా లాగాలి ఆసక్తికరమైన కథనాలు ఇమెయిల్ స్పామ్ ఇప్పటికీ ఎందుకు సమస్యగా ఉంది? హైబర్నేషన్ ఇప్పటికీ ఎందుకు ఉపయోగించబడుతోంది? గీక్ ట్రివియా: అప్‌గ్రేడ్ కోసం ప్రచారం చేసిన తారాగణం ఏ సైన్స్ ఫిక్షన్ షో యొక్క కాస్ట్యూమ్స్ చాలా బాధాకరమైనవిగా నిరూపించబడ్డాయి? ఇప్పుడు Android కోసం Google Maps ఆఫ్‌లైన్ కాషింగ్‌కు మద్దతు ఇస్తుంది గీక్ ట్రివియా: డెసిబెల్ దేనిని కొలవడానికి ఉపయోగించే పద్ధతుల నుండి ఉద్భవించింది? ఎడిటర్స్ ఛాయిస్ ఇమెయిల్ స్పామ్ ఇప్పటికీ ఎందుకు సమస్యగా ఉంది? హైబర్నేషన్ ఇప్పటికీ ఎందుకు ఉపయోగించబడుతోంది? గీక్ ట్రివియా: అప్‌గ్రేడ్ కోసం ప్రచారం చేసిన తారాగణం ఏ సైన్స్ ఫిక్షన్ షో యొక్క కాస్ట్యూమ్స్ చాలా బాధాకరమైనవిగా నిరూపించబడ్డాయి?
క్వాల్కమ్ కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక అమెరికన్ పబ్లిక్ బహుళజాతి సంస్థ. ఇది మేధో సంపత్తి, సెమీకండక్టర్స్, సాఫ్ట్‌వేర్ మరియు వైర్‌లెస్ టెక్నాలజీకి సంబంధించిన సేవలను సృష్టిస్తుంది. ఇది [[:en:Code-division_multiple_access|CDMA2000]], TD-SCDMA మరియు WCDMA మొబైల్ కమ్యూనికేషన్ ప్రమాణాలకు కీలకమైన పేటెంట్లను కలిగి ఉంది. ఇది [[వాహనము|వాహనాలు]], [[గడియారం|గడియారాలు]], [[:en:Laptop|ల్యాప్‌టాప్‌లు]], [[వై-ఫై]], స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇతర పరికరాల కోసం సెమీకండక్టర్ భాగాలు లేదా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. '''క్వాల్కమ్ చరిత్ర:''' 1. క్వాల్కమ్ను 1985 లో [[:en:Irwin_M._Jacobs|ఇర్విన్ ఎం. జాకబ్స్]] మరియు మరో ఆరుగురు సహ వ్యవస్థాపకులు స్థాపించారు. 2. ఈ సంస్థకు "క్వాలిటీ కమ్యూనికేషన్స్" కోసం క్వాల్కమ్ అని పేరు పెట్టారు. ఇది కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా ప్రారంభమైంది ఎక్కువగా ప్రభుత్వ మరియు రక్షణ ప్రాజెక్టుల కోసం. '''క్వాల్‌కామ్‌లో ఇటీవలి పరిణామాలు''' 1. 2016 లో, క్వాల్కమ్ తన మొదటి బీటా ప్రాసెసర్ చిప్‌ను "[https://www.forbes.com/sites/aarontilley/2016/12/07/qualcomm-launches-the-first-10nm-server-chip/#699cb1652119 సర్వర్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫామ్]" అని పిలిచే సర్వర్‌లు మరియు పిసిల కోసం అభివృద్ధి చేసింది మరియు పరీక్ష కోసం నమూనాలను పంపింది. 2. జనవరి 2017 లో, రెండవ తరం డేటా సెంటర్ మరియు సెంట్రిక్ 2400 అనే పిసి సర్వర్ చిప్ విడుదలైంది. క్వాల్‌కామ్‌కు ఈ విడుదల చారిత్రాత్మకమైనదని పిసి మ్యాగజైన్ తెలిపింది, ఎందుకంటే ఇది కంపెనీకి కొత్త మార్కెట్ విభాగం. 3. 2017 లో, క్వాల్కమ్ 3 డి కెమెరాల కోసం ఎంబెడెడ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది, ఇది రియాలిటీ అనువర్తనాలను పెంచింది. [141] క్వాల్‌కామ్ 2017 నాటికి ల్యాప్‌టాప్ ప్రాసెసర్‌లను మరియు ఇతర భాగాలను అభివృద్ధి చేస్తోంది మరియు ప్రదర్శిస్తోంది. 4. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ సిస్టమ్-ఆన్-చిప్స్ [148] మరియు గోబీ మోడెమ్‌లు [149] మరియు స్వీయ-డ్రైవింగ్ కార్లు మరియు ఆధునిక ఇన్-కార్ కంప్యూటర్ల కోసం ఇతర సాఫ్ట్‌వేర్ లేదా సెమీకండక్టర్ ఉత్పత్తులను పరిచయం చేయడం ప్రారంభించింది. '''[[:en:Qualcomm_Snapdragon|క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్]]''' 1. క్వాల్‌కామ్ టెక్నాలజీస్ ఇంక్ రూపొందించిన మరియు విక్రయించే మొబైల్ పరికరాల కోసం చిప్ (SoC) సెమీకండక్టర్ ఉత్పత్తులపై సిస్టమ్ యొక్క సూట్ స్నాప్‌డ్రాగన్. స్నాప్‌డ్రాగన్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (CPU) ARM RISC ని ఉపయోగిస్తుంది. 2. క్వాల్కమ్ తరచుగా స్నాప్‌డ్రాగన్‌ను "మొబైల్ ప్లాట్‌ఫాం" గా సూచిస్తుంది (ఉదా., స్నాప్‌డ్రాగన్ 865 5 జి మొబైల్ ప్లాట్‌ఫాం). ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్ మరియు నెట్‌బుక్‌లతో సహా వివిధ వ్యవస్థల పరికరాల్లో స్నాప్‌డ్రాగన్ సెమీకండక్టర్స్ పొందుపరచబడ్డాయి. ప్రాసెసర్లతో పాటు, స్నాప్‌డ్రాగన్ లైన్‌లో మోడెములు, వై-ఫై చిప్స్ మరియు మొబైల్ ఛార్జింగ్ ఉత్పత్తులు ఉన్నాయి. 3. 2018 నాటికి, ఆసుస్, హెచ్‌పి మరియు లెనోవా విండోస్ 10 ను "ఆల్వేస్ కనెక్టెడ్ పిసిలు" పేరుతో నడుపుతున్న స్నాప్‌డ్రాగన్ ఆధారిత సిపియులతో ల్యాప్‌టాప్‌లను అమ్మడం ప్రారంభించాయి, ఇది క్వాల్‌కామ్ మరియు ఎఆర్ఎమ్ ఆర్కిటెక్చర్ కోసం పిసి మార్కెట్‌లోకి ప్రవేశించినట్లు సూచిస్తుంది.
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఇంటిపై మహిళా కాంగ్రెస్‌ నాయకులు చేసిన ముట్టడి అమానుషమని టీఆర్‌ఎస్‌, టీబీ జీకేఎస్‌ నేతలు ఖండించారు. ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ఎస్సీ, బీసీ సెల్‌ పట్టణ కమిటీల అధ్యక్షులు రామస్వామి, మోతె కనకయ్య, టీబీజీకేఎస్‌ నేతలు సురేం దర్‌ రెడ్డి, డికొండ అన్నయ్యలు మాట్లాడారు. విజిత్‌రావుకు పెరుగుతున్న ప్రజా దరణను ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ నాయకులు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 నస్పూర్‌, మార్చి 4: మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఇంటిపై మహిళా కాంగ్రెస్‌ నాయకులు చేసిన ముట్టడి అమానుషమని టీఆర్‌ఎస్‌, టీబీ జీకేఎస్‌ నేతలు ఖండించారు. ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ఎస్సీ, బీసీ సెల్‌ పట్టణ కమిటీల అధ్యక్షులు రామస్వామి, మోతె కనకయ్య, టీబీజీకేఎస్‌ నేతలు సురేం దర్‌ రెడ్డి, డికొండ అన్నయ్యలు మాట్లాడారు. విజిత్‌రావుకు పెరుగుతున్న ప్రజా దరణను ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్ళపై దాడులకు దిగడం మంచి సంస్కృతి కాదని, అమాయక ప్రజలను రెచ్చగొట్టి ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పూనుకున్నారన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, నాయకులు ఏనుగు రవీందర్‌ రెడ్డి, కమాలాకర్‌ రావు, రాజేశం, వంగ తిరుపతి, బొయ మల్లయ్య, అన్నపూర్ణ పాల్గొన్నారు. దండేపల్లి: ఎమ్మెల్యే దివాకర్‌రావు ఇంటిని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ముట్ట డించడం హేయమైన చర్య అని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, జిల్లా రైతు సమన్వ య సమితి అధ్యక్షుడు గురువయ్యలు అన్నారు. శుక్రవారం దండేపల్లిలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాటకు మాట సమాధా నం చెప్పాలే తప్ప ఇలా ఇంటిని ముట్టడించడం సరికాదన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. టీఆర్‌ ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ లింగన్న, గాండ్ల నరేష్‌, మల్లేష్‌, రాజేందర్‌, సర్పంచులు, పాల్గొన్నారు. లక్షెట్టిపేటరూరల్‌: ఎమ్మెల్యే దివాకర్‌రావు ఇంటి ముట్టడి హేయమైన చర్య అని డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ నల్మాసు కాంత య్యలు అన్నారు. లక్షెట్టిపేట విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివాకర్‌రావు తనయుడు విజిత్‌రావు ఏవో మాట లు అన్నారని ఆరోపిస్తూ ప్రేంసాగర్‌రావు తన గుండాయిజాన్ని చూపించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్‌, నాయకులు జగన్మోహన్‌రెడ్డి, నడిమెట్ల రాజన్న, కౌన్సిలర్‌ సురేష్‌ నాయక్‌ పాల్గొన్నారు.
ఆయన గుండె గొంతుక ఎప్పటికీ సజీవమే... ఆయన పాటలే ఆయనకు సంజీవ మంత్రాలు. బాలు కోలుకోవాలని ఆబాలగోపాలం చేస్తున్న స్వరార్చనలే ఆయనను అజరామరుడిని చేస్తాయి. August 22, 2020 at 4:56 PM in General, Tollywood Share on FacebookShare on TwitterShare on WhatsApp సుస్వర సంగీత సురఝరీ గమనం… ఆయన గానం.. అందుకే ఆయన పాట మధురామృతం… అది ఏ స్వరమైనా ఆయన స్వరంతో పలికితే వినవచ్చే మాధుర్యం వేరు. ఇలాంటి ఆణిముత్యాలు కొందరికే దొరకుతాయి. బాలు ఓ ఆణిముత్యం అని మొట్టమొదటగా గ్రహించిన వ్యక్తి కోదండపాణి. మనసే అందాల బృందావనం.. ఇది మల్లెల వేళయనీ…, ఎన్నాళ్లో వేచిన ఉదయం.., నాగమల్లి కోనలోనా.., కోటలోని మొనగాడా… విశాల గగనంలో చందమామా.., రా వెన్నెల దొరా.. మనసా కవ్వించకే నన్నిలా.. వంటి అద్భుత బాణీల స్వరరాజు కోదండపాణిని మన బాలు ప్రత్యేకంగా ఆకర్షించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మహమ్మద్ రఫీ, కె.జె.ఏసుదాస్, వాణీ జయరాంలను పరిచయం చేసినట్లుగానే బాలును కూడా ఆయనే పరిచయం చేశారు. ఒక రకంగా బాలు ఆయనకు దత్త పుత్రుడు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గళాన్ని కోదండపాణి తొలిసారిగా మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ లో విని ఆయన గళంలోని మాధుర్యాన్ని గమనించారు. అనేకమంది నిర్మాతలకూ, సంగీత దర్శకులకూ బాలును పరిచయం చేస్తూనే ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో ‘ఏమి ఈ వింత మోహం..’ అనే పాట పాడే అవకాశం కల్పించారు. బాలు ఆరోగ్యం, దుస్తులు వంటి అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. గాయకుడిగా బాలు ఎదుగుతుంటే పుత్రోత్సాహాన్ని కోదండపాణి అనుభవించారు. దత్త పుత్రులు మేలు మరుస్తారు కానీ బాలు ఆయనను మరువకుండా తనను గాయకుడు చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డారో గుర్తించి కోదండపాణి రికార్డింగ్ థియేటర్‌ను మద్రాసులో నిర్మించారు. ఆ ‘బాలు’డిలో సంగీతం పాలు ఎంతో… ఐదు దశాబ్దాలు వెనక్కి వెళితే… అది 1964వ సంవత్సరం. మద్రాసులో సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ లో సంగీత పోటీలు జరుగుతున్నాయి. న్యాయమూర్తులు ఎవరో కాదు సంగీత దర్శక త్రిమూర్తులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు. పాటలు పాడిన వారిలో ఓ ‘బాలు’డు ప్రథమ బహుమతి కొట్టేశాడు. ఆ కుర్రాడిది లేలేత గొంతు… ఆ గొంతులో ఓ ప్రత్యేకత. ప్రేక్షకులలో కూర్చున్న ఓ సంగీత దర్శకుడికి ఆ కుర్రాడి ప్రతిభ అర్థమైంది. ఆయనే కోదండపాణి. ఆ బాలుడే మన బాలు. గుంటూరులో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో శ్రీపతి పండితారాధ్యుల నందయ్య, రాజేశ్వరీ దేవి దంపతులకు బాలు జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచి హార్మోనియం మీద, నాటకాల్లో పద్యాలు పాడటం మీద ఉన్న ఆసక్తి,అభిరుచి కారణంగా చదువు ముందుకు సాగలేదు. తొమ్మిదో తరగతిలోనే చదువుకి స్వస్తి పలికేశాడు. తన వేలికున్న ఉంగరాన్ని అమ్మించేసి మద్రాసు రైలెక్కేలా చేసింది. కోదండపాణి కంటపడేలా చేసింది మాత్రం సంగీత పోటీలే. ఆ గుంపులో గోవిందయ్యలా… గాయకుడిగా బాలు జీవితం నల్లేరు మీద బండినడకలా ఏమీ సాగలేదు. మొదట ఆయన స్థానం కోరస్ లోనే. దీన్నే మనం గుంపులో గోవిందయ్య అన్నాం. నాలుగేళ్లపాటు ఆయన జీవితం అలానే గడిచింది. నిదానంగా సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, మాస్టర్ వేణు, కె.వి. మహదేవన్ లకు సహాయకుడిగా మారారు. 1966లో ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రం ద్వారా పాటపాడే అవకాశాన్ని కోదండపాణి ఆయనకు ప్రసాదించారు. అంతే బాలు ఇంక వెనుతిరిగి చూసుకోలేదు. ఆయన సంగీతాన్ని ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. అయినా రాగ తాళాల జ్ఞానం, సంగీత పరిజ్ఞానం పుష్కలంగా ఉండడంతో ట్యూను ఒకసారి వింటే యాధాతథంగా పాడగలిగే శక్తిని భగవంతుడే బాలుకు ఇచ్చాడనుకోవాలి. ఆరో దశాబ్దానికి చేరువవుతున్నా బాలు గళంలో అదే రసవాహిని ఉప్పొంగుతోంది. ఆ గానమాధుర్యం అంబరాన్నంటింది. ఆబాల గోపాలాన్ని కట్టిపడేసి సమ్మోహనాశక్తి బాలు గళానికే కాదు… ఆయన వ్యక్తిత్వానికీ ఉంది. ఒకటా రెండా… ఆయన పాటలకు అంతే లేదు. ఈ స్వర యుగానికి ఆయనే కర్త, కర్మ, క్రియ అనడంలో అతిశయోక్తి లేదు. ఆస్పత్రిలో ఉన్న బాలు మళ్లీ కోలుకుని గళం విప్పాలని వేవేల గొంతులు స్వరార్చన చేస్తున్నాయి. ఆయన పాటలనే సంజీవని మంత్రంగా జపిస్తూ ప్రార్థనలు చేస్తున్నాయి.
మన దేశంలో ఎన్నో గుహాలయాలు ఉన్నవి. అలాంటి గుహలలో పాతాళ భువనేశ్వర్ ఎన్నో రహస్యాలకు నిలయం అని చెప్పవచ్చు. శివుడు నరికిన వినాయకుడి తల ఇక్కడే ఉందని, 33 కోట్ల మంది దేవతలకు నిలయం ఈ గుహనే అని స్థల పురాణం చెబుతుంది. మరి ఎన్నో రహస్యాలకు నిలయమైన ఈ గుహ ఎక్కడ ఉంది? ఈ గుహలో దాగిఉన్న మరిన్ని ఆశ్చర్యకర విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాంచల్, పిత్తోడాఘడ్ జిల్లా, భువనేశ్వర్ అనే గ్రామంలో పాతాళ భువనేశ్వర్ అనే గుహ ఉంది. ఈ గుహని చేరాలంటే సుమారు 3 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాలి. అయితే చాలా ఇరుకుగా ఉండే ఈ గుహలోకి వెళ్లాలంటే రెండు పక్కల ఉండే గొలుసులను పట్టుకుంటూ సుమారు 90 అడుగుల లోతుకు దిగాల్సి ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఈ గుహలలో త్రిమూర్తులు, వేయి పడగల శేషుడు, శివుడి జటాజూటం, ఐరావతం, కల్పవృక్షం, 33 కోట్ల దేవతల ఆకారాలు దర్శనమిస్తుంటాయి. ఈ గుహకి సంబంధించి పురాణానికి వస్తే, నలుడు తన భార్య అయినా దమయంతి చేతిలో ఓడిపోయి అరణ్యంలో సంచరిస్తుండగా నలుడికి తనకి సహాయం చేయమని ఋతువర్ణ మహారాజుని కోరుతాడు. ఆలా అరణ్యంలో ఒక చెట్టు కింద సేదతీరుతుండగా ఒక జింక నన్ను వేటాడకు రాజా అని అనగానే వెంటనే నలుడు నేను జింకని వెంటాడలేదు కదా అని చూడగా అక్కడ ఒక జింక పాతాళ గుహవైపు వెళ్లడం చూసి అక్కాడికి వెళ్లగా ఆ జింక లేదు. జింక అంతరార్థం అర్దమవ్వక అక్కడ స్థలానికి ఏదో ప్రత్యేకత ఉందని గ్రహించి చూడగా నలుడికి పాతాళ భువనేశ్వర్ గుహ కనిపించిందని స్థల పురాణం చెబుతుంది. ఇంకా ఈ గుహలో శివుడు నరికిన వినాయకుని తల ఈ ప్రదేశంలోనే ఉన్నదని చెబుతారు. అయితే శివుడు వినాయకుని తలని నరకగా ఏనుగు మొండాన్ని తెచ్చేంతవరకు ఇక్కడ వినాయకుని మొండాన్ని ఉంచారని దానికి గుర్తుగానే ఇక్కడ ఒక శిలారూపాన్ని వదిలిపెట్టారని పురాణం. ఇది ఇలా ఉంటె, కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులు ఈ గుహకి వచ్చి తపస్సు చేసి ఇక్కడ ఉన్న గుప్త ద్వారం గుండా కైలాసానికి వెళ్లారని చెబుతారు. శివుడి జటాజూటం ఉన్న గుహలో మొత్తం పాపద్వారము, రణద్వారము, మోక్షద్వారము, ధర్మ ద్వారము అనే నాలుగు గుహలు ఉన్నవి. ఇందులో ప్రస్తుతం రెండు గుహాద్వారాలు తెరచి ఉన్నవి. ఇక్కడి నుండి కైలాసపర్వతానికి గుప్తమార్గం ఉన్నదని చెబుతారు. ఈవిధంగా ఎన్నో అద్భుతాలకు నిలయమైన పాతాళ భువనేశ్వర్ గుహ చూడటం మరువలేని అనుభూతుని ఇస్తుంది.
కోవర్టుగా, నరేంద్ర మోదీ ఏజెంట్‌గా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పనిచేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి విమర్శించారు. పరిపాలనా సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన గట్టుప్పల మండలంలో ఆదివారం నూతన కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. గట్టుప్పల మండల ప్రారంభ సభలో మాట్లాడుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 మంత్రి జగదీ్‌షరెడ్డి గట్టుప్పల మండల కార్యాలయాలు ప్రారంభం చండూరురూర ల్‌, అక్టోబరు 2: కోవర్టుగా, నరేంద్ర మోదీ ఏజెంట్‌గా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పనిచేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి విమర్శించారు. పరిపాలనా సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన గట్టుప్పల మండలంలో ఆదివారం నూతన కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడా రు. బ్రిటీష్‌ వారికి, నిజాం రజాకార్లకు భూస్వాములు కోవర్టులుగా మారి దేశాన్ని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినట్లు మునుగోడు ప్రాంత ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్‌రెడ్డి బీజీపీకి తాకట్టు పెట్టారని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని 2.20లక్షల మంది ఓట ర్ల నమ్మకాన్ని, అభివృద్ధిని స్వలాభం కోసం రూ.22వేల కోట్ల రూపాయలకు అమ్మిన కోవ ర్టు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని అన్నారు. ఈ ప్రాంతానికి ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గతంలో ఉప ఎన్నికలు కేవలం ఆ ప్రాంత ఎమ్మెల్యే మృతిచెందితేనో, అనివార్య కారణాలతో రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటేనో, రెండు పదవులకు ఎన్నికైతే ఒక దానికి రాజీనామా చేస్తేనే ఉప ఎన్నిక వచ్చేదన్నారు. అయితే స్వలాభం కోసం బహిరంగ మార్కెట్‌లో అమ్ముడుపోయి పార్టీకి, పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు గతంలో ఎవ్వరూ వెళ్లలేదని విమర్శించారు. బీజేపీలో చేరి ఈ ప్రాంతానికి అమిత్‌షాను తీసుకువచ్చి ఏం చేశాడు, ఏం తెచ్చాడు, ఎన్ని నిధులు మంజూరు చేయించారని మంత్రి ప్రశ్నించారు. భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని, అన్ని రంగాల్లో దేశంలో తొలిస్థానంలో నిలబెట్టిన సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలు, రైతులు, నాయకుల కోరిక మేరకే సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీని స్థాపిస్తున్నారని పేర్కొన్నారు. మునుగోడు ప్రాంత ప్రజలు 50 సంవత్సరాల నుంచి ఫ్లోరోసిస్‌ బారిన పడి ఎన్నో అవస్థలు పడ్డారని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ వంటి పథకాలను అమలు చేయడంతో ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్‌ పూర్తిగా రూపుమాసిపోయిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని అన్నారు. అది గట్టుప్పల మండలం నుంచే మొదలవ్వాలని, రానున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించి గట్టుప్పల, మునుగోడు ప్రజలు సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, 37 ఏళ్ల కల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో సాకారమైందన్నారు. 1984లో గట్టుప్పల మండల ఏర్పాటుకు ప్రతిపాదన ఉండగా, నేడు ఏర్పాటైందన్నారు. గట్టుప్పల నూతన మండల కార్యాలయాలు ప్రారంభం అనంతరం తహసీల్దార్‌గా పులి సైదులు, ఎస్‌ఐగా ఉప్పు సురేష్‌ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ రెమారాజేశ్వరి, ఆర్డీవో జగన్నాథరావు, గట్టుప్పల ఎన్నికల ఇన్‌చార్జి గొపగాని వెంకట్‌నారాయణ గౌడ్‌, మునగాల నారాయణరావు, గుర్రం వెంకట్‌రెడ్డి, బొమ్మరబోయిన వెంకన్న, అన్నెపర్తి శేఖర్‌, గ్రామ సర్పంచ్‌ ఇడెం రోజా, ఇడెం కైలాసం, ఎంపీటీసీలు అవ్వారు గీతాశ్రీనివాస్‌, చెరుపల్లి భాస్కర్‌, గొరిగ సత్తయ్య, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.
నేడు టాలివుడ్ సినీ హీరోలు మరియు వ్యాపార దిగ్గజాలు ఇలా ప్రతీ ఒక్కరూ కరోనాపై యుద్ధంలో తమవంతు సాయం చేస్తూ ఇలాంటి సమయంలో మంచి పాత్ర పోషిస్తుండటం అందరూ అనందించదగ్గ పరిణామం. ఇక మన తెలుగు హీరోలు సైతం తమవంతు ఆర్ధిక సాయం చెయ్యడంతో పాటూ మరో ముందడుగు వేసి కరోనాపై ఓపాటలో మంచి స్టెప్పులేస్తు తమ హావభావాలు ప్రధర్సిస్తూ అందరిలో కరోనా పై ప్రజల్లో అవగాహన కల్పించారు. వీరిలో చిరంజీవి, నాగార్జునా, వరుణ్ తెజ్ సాయిధర్మతేజ్ వంటి టాలివుడ్ యంగ్ హీరోలు కూడా ఉన్నారు కోటీ ఈ పాటకి తన గిటార్ తో సంగీతమిస్తూ పాట ప్రారంభించగా చిరు, నాగ్, వరుణ్, సాయి ధర్మ్ తేజ్ దానికి తగ్గట్టుగా కాలుకదిపారు. ప్రస్తుతం ఈ వీడియో పై ప్రధాని తన ట్వట్టర్ ఖాతా ద్వారా వాళ్లకు అభినందనలు తెలియజేసారు. చిరుకూడా మోడీ ట్వీట్ కు ప్రతిస్పందిస్తూ ప్రధాని మోదీ కి ఈ విధంగా రిప్లై ఇచ్చారు. గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం కరోనా విలయతాండవం వల్ల మన దేశానికి జరగభోయే నష్టాన్ని తగ్గించడానికి మీరు చేస్తున్న కృషిని హృదయపూర్వకంగా మేము అందరం అభినందిస్తున్నాము. మీరు చేపడుతున్న ఈ మహా యజ్ఞంలో భాగంగా మా వంతు కూడా కృషి చేసాము. ఇందులో భాగంగా సంగీత దర్శకుడు కోటి గారు మా అందరి తరుపున మీకు నా ధన్యవాదాలు’ అంటూ మెగాస్టార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మోది తన ట్విట్టర్ ఖాతా లో తెలుగులో ఈ విధంగా రాస్తూ అభినందించడాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ప్రశంసిస్తున్నారు సోషల్ మీడియాలో ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అయింది.
'''కింజరాపు ఎర్రన్నాయుడు''' (జ.[[23 ఫిబ్రవరి]], [[1957]] -జ.[[2 నవంబర్]], [[2012]] ) 11వ, 12వ, 13వ మరియు 14వ [[లోక్ సభ]]కు [[శ్రీకాకుళం]] స్థానం నుండి ఎన్నికైనాడు. ఇతడు [[తెలుగుదేశం పార్టీ]] పొలిట్ బ్యూరొ సభ్యుడు., కేంద్ర మాజీ మంత్రి.[[కోటబొమ్మాళి]] మండలంలోని [[నిమ్మాడ]] ఇతడి స్వగ్రామం. తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మల ఏడుగురు సంతానంలో ఇతను పెద్ద కొడుకు. ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం [[గార]]లో సాగించి, [[టెక్కలి]]లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి, డిగ్రీ [[విశాఖపట్టణం]]లోని డాక్టర్ వి.ఎస్.కృష్ణ కళాశాలలో పూర్తిచేశాడు. ఎల్.ఎల్.బి. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి మొదటి తరగతిలో ఉత్తీర్ణులయ్యాడు. ==బాల్యం , విద్యాభ్యాసం== ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం [[గార]]లో సాగించి, [[టెక్కలి]]లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి, డిగ్రీ [[విశాఖపట్టణం]]లోని డాక్టర్ వి.ఎస్.కృష్ణ కళాశాలలో పూర్తిచేశాడు. ఎల్.ఎల్.బి. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి మొదటి తరగతిలో ఉత్తీర్ణులయ్యాడు. ==రాజకీయ జీవితం== [[ఎన్.టి.రామారావు]] స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరి 1982లో [[హరిశ్చంద్రపురం]] నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1967లో స్వతంత్ర్య పార్టీ అభ్యర్ధిగా హరిశ్చంద్రపురం నుండి ఎన్నికైన [[కింజరాపు కృష్ణమూర్తి]] ఇతడి చిన్నాన్న. అతను, [[గౌతు లచ్చన్న]], [[ఎన్.జి.రంగా]]ల అడుగుజాడల్లో నడిచి ప్రజాసేవ ధ్యేయంగా కష్టించి పనిచేశాడు. అప్పటి నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా, ఆ తరువాత [[శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం]] నుండి నాలుగు సార్లు (1996, 1998, 1999 మరియు 2004) లోక్ సభ సభ్యునిగా బారత [[పార్లమెంటు]]కు ఎన్నికయ్యాడు. ==కుటుంబం== ఇతడి భార్య విజయకుమారి; వీరికి ఇద్దరు పిల్లలు; ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సమాజ సేవ ప్రధమ ఉద్దేశ్యంగా వీరు 'భవానీ చారిటబుల్ ట్రస్ట్' ప్రారంభించారు.
వరంగల్ త్రినగరిలో అక్రమకట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తవ్వినకొద్ది అక్రమకట్టడాలు బయటపడుతున్నాయి.ఏమవుతుందిలే… అని భావన యజమానులు లైట్ తీసుకుంటుంటే అక్రమ నిర్మాణాలు కనపడిన అధికారులు చూడనట్లు వ్యవహరిస్తుండడంతో రోజురోజుకు ఈ అక్రమకట్టడాల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది… అక్రమకట్టడాలపై న్యూస్10 గత వారంరోజులుగా వరుసకథనాలు ప్రచురిస్తుండగా.. అక్రమకట్టడాలపై కార్యాలయానికి అనేక ఫిర్యాదులు అందాయి.ఈ అక్రమ కట్టడాల సంఖ్య చాంతాడంత పెరిగిపోయింది.ముందు ఇష్టం ఉన్నట్లు కడదాం ఆ తర్వాత ఏమయినా ఉంటే చూద్దాం అనే ధోరణితో భవన యజమానులు ఉండగా వీరి ఆలోచనాధోరనికి తగ్గట్టుగా కొందరు అధికారులు సైతం సహకరిస్తుండడం విమర్శలకు దారితీస్తుంది…. అక్రమకట్టడాల వరుసలో మరో అక్రమకట్టడం ప్రధాన రహదారిని ఆనుకొని రాజసం ఒలకబోస్తుంది…అదాలత్ ప్రాంతంలో గ్రీన్ పార్క్ హోటల్ పక్కన ఈ అక్రమ కట్టడం టౌన్ ప్లానింగ్ అధికారులకు సవాల్ విసిరినట్టు చుట్టు గ్రీన్ మ్యాట్ కట్టి చక చక నిర్మాణం కానిచ్చేస్తున్నారు. సెట్ బ్యాక్ లేదు… అదాలత్ ప్రాంతం ప్రదానరహదారిని ఆనుకుని గ్రీన్ పార్క్ హోటల్ పక్కనే నిర్మితం అవుతున్న ఈ బహుళ అంతస్తుల భవనానికి కనీస సెట్ బ్యాక్ లేదు.అంతర్గత రోడ్ లను సైతం వదలకుండా రోడ్డు పక్కకు ఏమాత్రం వెనక్కి జరగకుండా నిర్మాణం కొనసాగిస్తున్నారు.ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించకుండా నిబంధనలకు తూట్లు పొడిచారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు కనిపించడం లేదా..? హన్మకొండ నగరంలో అదాలత్ దగ్గరలోని గ్రీన్ పార్క్ హోటల్ పక్కనే నిబంధనలకు విరుద్ధంగా ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్న అధికారులకు ఎందుకు కనబడట్లేదో అని సామాన్యుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ అక్రమ నిర్మాణం అధికారులకు నిజంగానే కనబడడం లేదా…లేక చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారా అనేది టౌన్ ప్లానింగ్ అధికారులకే తెలియాలి..
It was not clear to science even today what is the beginning of this Universe. Veda ( Rigveda expressed the nature of the beginning, its structure and character thousands of years ago) expression on the beginning is still appealing for today’s science or fiction. An expression of energy as matter నాసాదాసీనో సదాసీత్ తదానీం నాసీద్రజో నొవ్యోమా పరో యత్కిమావారీవాహ కుహకస్య శర్మాన్భః కిమాసీత్ గహనం గభీరం – 1 ముందు సత్తుగానీ అసత్తు గానీ లేదు . భూమి గానీ ఆకాశం గానీ లేదు . అగాధమైన, గంభీరమైన వెల్లువ తో ఆవరించిన అనుభవం వుంది There is nothing in the beginning – no existence of earth and sky. The whole is alone with its enitirity and completeness. నమృత్యురాసీదమృతం న తర్హి న రాత్ర్యా అహ్న ఆసీత్ ప్రకేత హ అనీదవాతం స్వధయా తదేకం తస్మాధ్యాన్నన్న పరః కించనాస – 2 అప్పుడు మృత్యువు, అమృతము , రాత్రిమ్బవళ్ళు లేవు . శ్వాస లేని ఆ ఒక్కటి ఉన్నది . స్వయంగా అది తరువాత శ్వాసించింది . There is no life or death or eternity, night or day. There existed one without any breath. Later that One has started breathing. వ్యాఖ్య – మనిషి తన శరీరమునుండి విశ్వకేంద్రం దాక శోధించి రెండూ ఒకటేనని అంతర్ద్రుష్టితో వ్యక్తిత్వాన్ని విస్తరించడం యోగం . దాన్ని తెలిపే జ్ఞానమే వేదం . మహర్షులు శాశ్వత తత్వాన్నీ కనుగొనడానికి చేసిన ప్రయత్నం ఇది . దీనికి సమతుల్యత భావం , దాన్ని సాధించడానికి నిరంతరం ఇంద్రియ నిరోధం, మానసిక సంయమనం చేయాలని అర్థం చేసుకుని, ఆచరించి చెప్పిన మాటలే వేదం . ఈ క్రమంలో శరీరం ప్రకృతితో మమేకమై జీవించడం భోగం . ప్రకృతితో మమేకమై భోగించకుండ ఉండటం యోగం . అదే నిష్కామ కర్మయోగం . ఈ యోగంలో అశాశ్వతమైన శరీరం నుండి శాశ్వత తత్వమైన మనస్సుకు, బుద్ధికి , శక్తికి ఆవల, ఆదిలో వున్న ఏక తత్వం అనుభవానికి వస్తుంది . ముందు ఉన్నది అదే చివర చేరాల్సింది అదే . తేడా మాత్రం చైతన్య రహితమైన ఆది నుండి చైతన్య సహితమైన ఆది లోనికి ప్రవేశించడమే జీవిత పరమార్థం . ఈ గమనంలో చుట్టూ ఆ చైతన్యాన్ని ఆవరించి ఉన్న శరీరాన్ని , కుటుంబాన్ని , సమాజాన్ని , ప్రపంచాన్ని, ప్రకృతిని , విశ్వాన్ని మనతోపాటు తీసుకుపోయే ప్రయత్నం గానీ లేదా ఆ విషయం చెప్పే ప్రయత్నం గానీ చెయ్యడం సాంఘిక ధర్మం . అది చేయకపోతె మనలోని ఛైతన్యం చుట్టూ ఉన్న ఆవరణతో సమతుల్యంగా , సంయమనంగా ఉండలేదు . విడిగా దూరంగా ఉండాలనుకుంటే ఏ బంధము లేకుండా జీవితం గడపాలి . ఇతరులతో బంధం తగిలించుకొని పాటించకపోతే కర్మబంధమై తిరిగి కర్మకు కారణమౌతుంది . అందుకే వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచి చివరికి సన్యాసంతో ముక్తుడు కావాలని చెప్పారు . విశ్వ కేంద్రంగా ఉంటూ నిమిత్తమాత్రంగా ఉండడం శివ తత్వం . నిమిత్త మాత్రంగా ఉంటూ ప్రకృతితో ప్రకృతిలో సంయమనంగా ఉంటూ సమతుల్యతా క్రియ చేయడం విష్ణు తత్వం . ఆది అంతము శివ తత్వమైతే మధ్య ఉన్న క్రియాశీలమైన చైతన్యమే విష్ణు తత్వం . చైతన్యం విడిగా ఉన్నంతవరకు విష్ణు తత్వం అవసరం అవుతుంది . చైతన్యం శివశక్తి లేక స్థితి శక్తిలోనికి ఐక్యం కాగానే నిశ్చలమైన శివ తత్వమై ప్రకాశిస్తుంది . జీవిలో చైతన్యం ఉన్నంతవరకు విష్ణు తత్వం గ ఉండ క. తప్పదు. శరీర బంధం ఉన్నంతవరకు కర్మ బంధం తప్పదు. జీవన్ముక్తుడు కావాలంటే శరీర బంధం నుండి జీవుని విడదీయాలి . వారికీ ఎటువంటి పాప పుణ్యాలు అంటవు జీవుడు చైతన్యం , బుద్ధి, మనస్సు , ప్రాణం ద్వారా శరీరానికి అరిషడ్వార్గాలతో బంధించబడి ఉంటాడు . తిరిగి అదే క్రమంలో వాటిని విడదీసి జీవుడు తన స్వరూపాన్ని చేరుకోవాల్సి ఉంటుంది . అరిషడ్వార్గాలను క్రమబద్ధమైన , ధర్మబద్ధమైన జీవితంతోనూ , ప్రాణాన్ని ప్రాణాయామంతోను , బుద్ధిని ధారణతోను , మనస్సును ధ్యానంతో , చైతన్యాన్ని సమాధితోను నిలువరించాలి సంకల్పం జీవునితో మొదలై చైతన్యాన్ని ప్రేరేపించి , భావంగ మారి , ప్రేరణగా మారి , ఆలోచనగా రూపుదిద్దుకుని, భాషగా , క్రియగ మారి మనకు కావలసిన మార్పుగా రూపాంతరం చెందుతుంది తమ ఆసీత్ తమసా గూఢమాగ్రి ప్రకేతం సలిలమ్ సర్వమా ఇదంతుచ్యేనాభ్వాపిహితం యదాసీత్ తపసత్ తన్మహినాజాయతైకం – 3 ముందు యావత్తూ అంధకారంతో ఆవరించబడి గుర్తుపట్టలేని వెల్లువగా సమస్తాన్ని ఇముడ్చుకొని ఒక్కటే ఏదయితే ఉందొ అదే అభివ్యక్తమౌతున్నది Everything is in the flow of complete darkness that emerged with its expression of what it is today. అప్పుడు ఉన్నది స్త్రీ కాదు పురుషుడు కాదు . ఆ ఒక్కటీ అనిర్వచనీయమైనది . విశ్వం యొక్క ఈ స్థితి ఇప్పుడు చెప్పే బిగ్ బాంగ్ ను పోలి ఉంది . అది చైతన్యాన్ని తనలో ఇముడ్చుకున్న స్థితి శక్తి . అందులోనుండి వెలువడిన చైతన్యం చరాచర పరాపర విశ్వంగా మారింది . ప్రథమంగా ఉన్నది అంధకారమై ఇప్పుడు కనపడే సమస్తాన్ని తనలో ఇముడ్చుకొని ఒక ఆవరణగా ఉంది . ఈ స్థితి ఏది అని కనుక్కోవడానికి శాస్త్రాలు ఇప్పటికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి . అందుకే ఋగ్వేదం దాన్ని అనిర్వచనీయమైనదని అన్నది. కామస్తదగ్రే సమవర్ధతాది మనసో రేతః ప్రథమం యదాసీత్ సతో బంధుంసతి నిరవిందన్ హృది ప్రతీప్యా కవయో మనీషా – 4 మనస్సు ప్రథమ రేతస్సుతో మొదట హృదయంనుండి ఆకాంక్ష అంకురించబడినదని తెలుసుకున్న ఋషులు సత్యానికి అసత్యానికి ఉన్న సంబంధాన్ని కనుగొన్నారు . The First being with breath has began to desire to expand. The Vedic seers have understood this connection between the dream and reality, between the eternal and temporal, between the beginning and ending. సత్యం అన్నది మూలం . అసత్యం అన్నది మూలం నుంచి వచ్చి తిరిగి అందులోనికి పోయేది అని అర్థం . సృష్టి పరంగానైనా శాస్త్ర పరంగానైనా ఈ నిజం ఒకటే . జగత్తులో ఒక్క మనిషి మాత్రం ఆ చైతన్యాన్ని గుర్తించి మూలంలోకూడా చైతన్యంగా వ్యవహరించగలుగుతాడు . ఆ చైతన్యం కలిగిన మనిషే దేవుడౌతాడు . ఏ మనిషి ఇతరులకంటే శక్తిమంతుడు అయి ఇతరులకు ఉపయోగపడే కార్యం చేస్తాడో అతడే దైవంగా భావిస్తున్నారు . తన్ను తాను తెలుసుకున్నవాడు మూలం చేరి విముక్తడవుతాడు . ఇతరులకు ఉపయోగపడితే దేవుడవుతాడు . ఆ దేవుడు చేసిన కార్యంలో మహిమలు మాత్రమే కాదు , సమాజంలో ధర్మసంస్థాపన చేసినవాడు అది కూడ ప్రకృతిని శాసించి చేసినవాడు పరమోత్క్రుష్టమైన కృష్ష్ణుడుగా మారతాడు
Telugu News » Entertainment » Tollywood » Mahesh Babu shares post on social media after his mother Indira Devi's death Telugu Cinema News Mahesh Babu: తల్లి మరణం తర్వాత సోషల్ మీడియాలో మహేష్ పోస్ట్.. చెదిరిన మనసుతో సూపర్ స్టార్ ఎమోషనల్.. సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మామ కూతురు. కుటుంబసభ్యుల నిర్ణయంతో మరదలు అయిన ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. పద్మ, మంజుల, ఇందిరా ప్రియదర్శిని, రమేష్ బాబు, మహేష్ బాబు. Mahesh Babu Rajitha Chanti | Sep 28, 2022 | 6:47 PM తల్లి ఇందిరా దేవి మృతితో సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి బుధవారంఉదయం తన నివాసంలోనే కన్నుమూశారు. ఇందిరా దేవి పార్థివదేహాన్ని చూసి చలించిపోయారు మహేష్. ఒకే ఏడాదిలో అటు అన్నయ్య.. ఇటు తల్లి మరణంతో ఆయన కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయింది. జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో ఇందిరా దేవి పూర్తిచేశారు కుటుంబసభ్యులు. తల్లి అంత్యక్రియలు పూర్తైన తర్వాత సోషల్ మీడియాలో ఇందిరా దేవి ఫోటోను షేర్ చేస్తూ నలుపు రంగు హార్ట్ ఎమోజీలు పోస్ట్ చేశారు మహేష్. ఈ పోస్ట్ పై అభిమానులు స్పందిస్తూ.. స్టే స్ట్రాంగ్ అన్నా.. మీతో మేము ఉన్నాం… బాధపడకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబుకు తల్లి ఇందిరా దేవి అంటే అమితమైన ప్రేమ. సినీ ప్రమోషన్లలో తన తల్లి గురించి గొప్పగా చెబుతూ ఎమోషనల్ అయ్యేవారు. అంతేకాకుండా.. తన ప్రతి సినిమా విడుదలకు ముందుకు అమ్మ ఇంటికి వెళ్లి కాఫీ తాగడం అలవాటు అంటూ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చారు మహేష్. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి అయినా.. సినీ పరిశ్రమకు దూరంగా ఉండేవారు. భర్త, కొడుకులిద్దరు స్టార్ హీరోస్ అయిన.. వారి సినిమా ప్రమోషనల్లో పాల్గోనేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. కేవలం కుటుంబసభ్యుల ఫంక్షన్లలో మాత్రమే ఇందిరా దేవి కనిపించేవారు. పెళ్లి వరకు మహేష్ ఎక్కువగా తన తల్లితోనే గడిపారు. ఆమెతో మహేష్‏కు అనుబంధం ఎక్కువగానే ఉంది. సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మామ కూతురు. కుటుంబసభ్యుల నిర్ణయంతో మరదలు అయిన ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. పద్మ, మంజుల, ఇందిరా ప్రియదర్శిని, రమేష్ బాబు, మహేష్ బాబు. ఇందిరా దేవితో వివాహం జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత కృష్మ దివంగత నటి విజయ్ నిర్మలతో ప్రేమలో పడ్డారు. ఇదే విషయాన్ని ఇందిరా దేవితో చెప్పగా.. రెండవ వివాహనికి అంగీకరించింది. కృష్ణ రెండవ వివాహం తర్వాత ఇందిరా దేవి ఎక్కువగా బయట కనిపించలేదు.
విజృంభిస్తున్న కరొనతో ఇప్పటికే చాల దేశాలలో పరిస్థితులు చేజారిపోయాయి . అగ్రరాజ్యం అమెరికా ,ఇటలీ లో ఇప్పటికే వేల సంఖ్యలో మరణాలు ,లక్షల సంఖ్యలో వ్యాధి బారిన పడ్డవారు నమోదు అయ్యారు ..చైనా వుహాన్ లో మొదలైన కరోనా వైరస్ అన్ని దేశాలకు విస్తరించింది ..కాగా చైనా సాధారణ పరిస్థితికి చేరి అక్కడ పరిశ్రమలలో ఉత్త్పత్తులు కూడా తిరిగి ప్రారంభించింది ..ఇది చైనా కు కట్టుదిట్టంగా విధించిన పూర్తి లాక్ డౌన్ వలన సాధ్యమైంది …మిగిలిన దేశాలు కూడా ఇప్పుడు ఇదే పద్దతిలో లాక్ డౌన్ అమలు చేస్తూ కరోనా ను అదుపు చేసే పనిలో ఉన్నారు. కాగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అంత తీవ్రంగా దెబ్బ తిన్నది. Video Advertisement భారత దేశంలో కూడా ఇప్పటికే లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు ..బడా వ్యాపారవేత్తల నుండి సెలెబ్రెటీల దాక అందరూ పెద్ద మొత్తం లో సీఎం కేర్ ఫండ్ కు విరాళాలు ఇచ్చారు ..ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకునే వారే మన దేశంలో ఎక్కువగా ఉండగా లాక్ డౌన్ వలన ఆదాయం లేక తినడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో చాల మంది స్వచ్చందంగా ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు..ఇప్పటికే చాలామంది సెలెబ్రెటీ లా దగ్గర నుండి సాధారణ ప్రజల వరుకు తమ పాటలతో మాటలతో క్రియేటివ్ గా కరోనా పై అవగాహనా కల్పించే ప్రయత్నం చేసారు ..కాగా ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఒక క్రియేటివ్ క్రియేషన్ అందరిని ఆకర్షిస్తుంద…వివరాలలోకి వెళ్తే మనం చాలా రకాల వింత బైక్ లను కార్ లను ఇప్పటికే చాలానే చూసాం ..చాల మంది వాటర్ తోను తర్వాత బ్యాటరీతోను నడిచే కార్ లను తయారు చేసారని మనం చాలానే విన్నాం ..హైదరాబాద్ బహదూర్ కి చెందిన సుధాకర్స్ మ్యూజియం ఓనర్ సుధాకర కు ఈ కరోనా సమయంలో ఒక వినూత్న ఆలోచన వచ్చింది ..కరోనా వైరస్ కలకలం రేపుతున్న ఈ సమయంలో కరోనా వైరస్ షేప్ లో ఉండే కార్ తయారు చేస్తే ఎలా ఉంటుంది అని ..ఆయన ఆలోచనను నిజం చేసుకున్నారు కూడా . ఇప్పటికే సుధాకర్ చాలా విభిన్న కార్స్ ని తయారు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు ..అసలు కరోనా వైరస్ షేప్ ఎలా ఉంటుందో సేమ్ అలానే తయారు చేసి అందరికి కరోనా వైరస్ తెలిసేలాగా ప్రజలలో అవగాహనా పెరిగే ఉద్దేశంతోనే దీనిని తయారు చేసారని సుధాకర్ చెప్తున్నారు …ఈ కార్ ట్రయిల్ వీడియో ను సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యగా ఇప్పటికే ఈ వీడియో వైరల్ అయ్యి ప్రజల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది .
వెన్నుపాము గాయాలు గాయం లేదా వెన్నుపాము దెబ్బతినడం లేదా వెన్నుపాము కాలువ చివర్లలో ఉన్న నరాలు ఫలితంగా ఏర్పడతాయి. తరచుగా ఈ గాయాలు మీ భాగస్వామితో మీ సన్నిహిత కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. ఈ గాయం మీ వెన్నుపాముకి హాని కలిగించినప్పటికీ, ఈ గాయం మీ భాగస్వామితో మీ లైంగిక సంబంధానికి అంతరాయం కలిగించనివ్వవద్దు. మీరు వీల్ చైర్‌లో కూడా సెక్స్ చేయవచ్చు వీల్‌చైర్ వినియోగదారులు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేదనే భావన సరికాదు. వీల్‌చైర్‌లను సాధారణంగా వెన్నుపాము గాయాలు ఉన్నవారు ఉపయోగిస్తారు ( వెన్నుపూసకు గాయము ) ప్రమాదం ఫలితంగా. నిజానికి, మీకు వెన్నుపాము గాయం ఉంటే ( వెన్నుపూసకు గాయము ) లైంగిక కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు, గొప్ప భావప్రాప్తిని కూడా పొందవచ్చు. వెన్నుపాము గాయం తర్వాత, లైంగిక స్థితి ఖచ్చితంగా మారుతుంది, ఎందుకంటే మంచంలో లైంగిక కార్యకలాపాలు చేయడం చాలా కష్టం. వెన్నుపాము గాయాలు ఉన్నవారు కాళ్లకు మద్దతు ఇవ్వడానికి మరియు తుంటిని నెట్టడానికి చేసే పనితీరును కోల్పోతారు. అందువల్ల, వారు లైంగిక చర్యలో ఎగువ శరీరం యొక్క బలంపై ఎక్కువగా ఆధారపడతారు. అయితే, కొన్ని లైంగిక స్థానాలు వీల్‌చైర్‌ని ఉపయోగించి చేయడం సులభం. చింతించకండి, ఈ రోజుల్లో వినియోగదారులు ఆర్మ్‌రెస్ట్‌లను తీసివేయడం, లెగ్ ప్లేట్‌లను తిప్పడం, సీట్ బ్యాక్‌లను మడవడం మరియు బ్రేక్‌లను లాక్ చేయడం వంటివి సులభంగా చేసే అనేక ఆధునిక చక్రాలు ఉన్నాయి, తద్వారా వీల్‌చైర్‌లో లైంగిక కార్యకలాపాలు చేయడం సులభం. వెన్నుపాము గాయాలు ఉన్నవారికి ఎలాంటి సెక్స్ పొజిషన్‌లు తగినవి? వెన్నుపాము గాయం ఉన్నవారికి సెక్స్ స్థానాలను నిర్ణయించడం అంత తేలికైన విషయం కాదు. ఈ గాయం పరిస్థితి బలం, సంచలనం మరియు గాయపడిన ప్రాంతంలోని ఇతర అవయవాల పనితీరుపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, ముఖ్యంగా అతని రోజువారీ జీవితంలో పూర్తిగా మార్చగలదు. ఉదాహరణకు, దిగువ వీపుకు గాయాలు నరాల కణాలను మరియు కాళ్లు, ట్రంక్ వంటి అవయవాల పనితీరును ప్రభావితం చేస్తాయి, ఇందులో మూత్రాశయం వంటి అంతర్గత అవయవాలు మరియు లైంగిక అవయవాలు ఉంటాయి. నరాల నష్టం కూడా వివిధ అంశాలను కలిగి ఉంటుంది, స్పర్శను అనుభవించే సామర్థ్యం, ​​కదిలే సామర్థ్యం మరియు అంతర్గత అవయవాలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఉదాహరణకు శ్వాస ప్రక్రియ కోసం (వెన్నెముకలో తగినంత నష్టం జరిగితే). ఫలితంగా, భాగస్వామి మరియు రోగి ఇద్దరూ సెక్స్ పొజిషన్ శ్వాసక్రియకు ఆటంకం కలిగిస్తుందా, చర్మాన్ని చికాకుపెడుతుందా (ఉదాహరణకు అధిక ఒత్తిడి ఒత్తిడి పుండ్లు ఏర్పడవచ్చు) మరియు కండరాలు మరియు వెన్నెముకకు చికాకు కలిగిస్తుందా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. సహచరులు మరింత అప్రమత్తంగా ఉండాలి, రోగికి నొప్పి లేదా జలదరింపు దీర్ఘకాల నిగ్రహం లేదా అసౌకర్య స్థితి (సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తికి సులభంగా అనుభూతి చెందుతుంది) నుండి అనిపించకపోవచ్చు. స్పూనింగ్ జర్నల్ ఆఫ్ స్పైనల్ కార్డ్ మెడిసిన్ ద్వారా వెన్నుపాము గాయాలు ఉన్నవారికి సిఫార్సు చేయబడిన సెక్స్ పొజిషన్‌లు, ప్రత్యేకించి మీరు మగవారైతే పొజిషన్‌లు చెంచా. ఈ సైడ్‌వేస్ స్థానం ఎందుకు మంచి ఎంపిక? స్థానం చెంచా ఈ గాయంతో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా అనుభవించే ఒత్తిడిని తగ్గించడానికి మరియు సమతుల్య సమస్యలను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. స్థానం చెంచా ఒక స్త్రీ తన ప్రక్కన నిద్రిస్తూ మరియు తన కాళ్ళను తన పొట్ట వైపుకు వంచి, ఒక చెంచా లాంటి స్థితిని ఏర్పరుస్తుంది, స్త్రీ వెనుక పురుషుడు తన శరీరాన్ని కౌగిలించుకుంటాడు. మీరు చొచ్చుకుపోవడానికి లేదా కదలడానికి కష్టంగా ఉంటే, మీ కటిని పైకి లేపడానికి ఒక దిండును ఉపయోగించండి. చెంచా ప్రేమ శైలి విషయానికి వస్తే , పురుషులు సులభంగా చొచ్చుకుపోయేలా చేయడానికి స్త్రీలు ఒక కాలు పైకి లేపవచ్చు మరియు కొంచెం ముందుకు చేయవచ్చు. ఈ సెక్స్ పొజిషన్‌తో సెక్స్ చేస్తున్నప్పుడు, స్త్రీ శరీరం మరింత సన్నిహితంగా ఉండటానికి పురుషుడు తన చేతులను చుట్టవచ్చు. పైన స్త్రీ మీరు మరియు మీ భాగస్వామి కూడా ఈ స్థానాన్ని ఉపయోగించవచ్చు పైన స్త్రీ అకా పై స్త్రీ. వెనుక కుషన్‌ని ఉపయోగించి కూర్చున్న వ్యక్తిని ఉంచండి. ఈ స్థానం వెన్నెముకకు గాయం అయిన పురుషులను ఎక్కువగా కదలకుండా అనుమతిస్తుంది, కానీ ఇప్పటికీ సెక్స్‌ను ఆస్వాదించవచ్చు. లైంగిక చర్యలో, అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ పరిస్థితికి సుఖంగా ఉండాలి మరియు మిమ్మల్ని మీరు అంగీకరించాలి. ఎలాంటి పొజిషన్ సౌకర్యవంతంగా ఉంటుందో మీకు బాగా తెలుసు. మీ భాగస్వామితో వివిధ లైంగిక కార్యకలాపాలు మరియు స్థానాలను కమ్యూనికేట్ చేయడం మరియు అన్వేషించడం కూడా పరస్పర సంతృప్తిని సాధించడంలో సహాయపడుతుంది. మరియు మీరు గుర్తుంచుకోవాలి, లైంగిక కార్యకలాపాలతో పాటు, మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేసే అనేక ఇతర విషయాలు ఉన్నాయి.
ALL Breaking News Cinema News Cultural News Eductional News Health News Latest News Political News Sports News మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం (3 May World Press Freedom Day) May 03, 2020 • Roja Rani మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం (3 May World Press Freedom Day) పత్రికారంగం‌లో శ్రమిస్తున్న మిత్రులందరికీ శుభాకాంక్షలు ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవాన్ని మే 3 వ తేదీన యునెస్కో నిర్వహిస్తుంది. ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశపు విండ హాక్ నగరంలో 1991 ఏప్రిల్ 29 నుండి మే 3 వ తేదీవరకు యునెస్కో నిర్వహించిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పలు తీర్మానాలు చేశారు. స్వేచ్ఛాయుతమైన, స్వాతంత్ర్యమైన, ప్రపంచవ్యాప్తంగా బహుళ జాతుల సమన్వయానికి మాధ్యమంగా, ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి, ఆర్ధీకాభివృధ్ధికీ, పౌరుల ప్రాధమిక హక్కుయైన పత్రికా స్వేచ్చ పరిఢవిళ్లడం అవసరం. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రపంచ పత్రికా దినోత్సవాన్నిడిసెంబర్ 1993లో ప్రకటించింది ఐక్య రాజ్య సమితి 19వ ఆర్టికల్ లోనే పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన మూలాలు ఇమిడి ఉన్నాయి “భావ స్వేచ్చ, ప్రకటన, స్వేచ్ఛగా అభిప్రాయాలను కల్గియుండటం ప్రపంచంలోని ప్రతీ పౌరుని ప్రాధమిక హక్కు. ఈ హక్కుల ఇతరుల దయా దాక్షిణ్యాలతో వచ్చినవి కావు, జన్మతో స్వతఃసిధ్ధంగా సంక్రమించినవి. (మన రాజ్యాంగం‌లో కూడా ప్రాధమిక హక్కులను చర్చించింది 19అధికరణం‌లోనే) రాజకీయాలలోనూ, పరిపాలనలోనూ స్వచ్ఛత విలసిల్లడానికీ, పరుగెత్తేకాలంతో సమాంతరంగా ప్రజల ముంగిటికి వార్తలు అందించే విలేకరులు ప్రతీ దినం ఎన్నో దాడులను, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. కొందరు జైళ్ల పాలవుతున్నారు, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరి వివరాలు తెల్యకుండా పోతున్నాయి. పత్రికాస్వేచ్చా హరణంలో ఇరాక్ ప్రధమ స్థానాన్ని సంపాదిస్తే భారతదేశం 8వ స్థానంలో ఉంది. పత్రికా స్వేచ్చ ప్రతీ సమాజానికి, వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది. ఆ దేశంలోకానీ, సమాజంలోకానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడమంటే ఆ సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేయడమే. పత్రికా స్వేచ్చా పారదర్శకతను తద్వారా సుపరిపాలనను పెంపొందిస్తుంది. పత్రీకా స్వేచ్చ అవగాహన, విజ్ఞానాలను అనుసంధానం చేసే వారధి వంటిది. జాతులు, సంస్కృతుల మధ్య భావ మార్పిడికి, వాటి అభివృధ్ధికి పత్రికలు, పత్రికా స్వేచ్చా తప్పనిసరి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రమాదపుటంచుల్లో వార్తలు సేకరించే విలేకరులకు (లేదా మరిణించిన విలేకరులకు) యునెస్కో/ గ్యూలెర్మో కనో ప్రపంచ పత్రికా స్వేచ్చా బహుమతిని ప్రదానం చేస్తారు. కొలంబియాకు చెందిన గ్యూలెర్మో కనో అనే విలేకరి డ్రగ్ మాఫియాను ఎండగడుతూ 1986లో తన పత్రికా కార్యాలయం ఎదుటనే హత్యకు గురయ్యాడు. ప్రజలకోసం, పత్రికా స్వేచ్ఛాకోసం కృషిచేస్తున మన పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ, అసువులు బాసిన సంపాదకులకు, విలేకరులకు ఈ రోజున నివాళులర్పించడం మన కనీస ధర్మం.
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 భూములు తీసుకుని 20 ఏళ్లయినా న్యాయం చేయలేదంటున్న మత్స్యకారులు విశాఖలో సముద్రంలో బోట్లతో ఆందోళన విశాఖపట్నం/మహారాణిపేట, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ వల్ల నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మత్స్యకారులు శనివారం ఆందోళనకు దిగారు. తొలుత బోట్లలో సముద్రంలోకి వెళ్లి హార్బర్‌ నుంచి నౌకలేవీ లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పదుల సంఖ్యలో బోట్లు, వాటిలో మత్స్యకారులు.. టెర్మినల్‌కు దగ్గరగా రావడం గమనించిన సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది.. వేరే బోటులో అక్కడికి వెళ్లి నిలువరించే ప్రయత్నం చేశారు. వారిలో కొందరు రాళ్లు విసరడంతో పలువురు మత్స్యకారులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ఒక దశలో తుపాకులు కూడా గురిపెట్టారు. అయితే పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించిన అధికారులు వారిని వారించారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు బోట్లపై ఆందోళన విడిచి పెట్టి, టెర్మినల్‌ గేటు వద్దకు చేరుకుని బైఠాయించారు. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు లారీలను వెళ్లనివ్వబోమని అడ్డం పడ్డారు. టెర్మినల్‌ కోసం పోర్టు అధికారులు 2001లో తమ భూములు తీసుకున్నారని, 543 కుటుంబాలకు టెర్మినల్‌లో ఉద్యోగం, లక్ష రూపాయలు నగదు, వేరే ప్రాంతంతో ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని ఆందోళనకు నాయకత్వం వహించిన మత్స్యకారుల పారిశ్రామిక సంక్షేమ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. హామీఇచ్చి ఇప్పటికి ఇరవై ఏళ్లయిందన్నారు. తమ హామీలు నెరవేర్చాలని కోరగా ఈ నెల 12న పోర్టు, టెర్మినల్‌ అధికారులతో సమావేశం నిర్వహించి పది రోజుల్లో పరిష్కారం చూపుతామన్నారని, అయినా స్పందించక పోవడంతో ఆందోళనకు దిగామని తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఆర్‌డీఓ హుస్సేన్‌ అక్కడకు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు.
thesakshi.com : Google CEO ఇటీవల Google యొక్క వారపు ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో ఉద్యోగుల ప్రశ్నలను సంధించారు. వినోదం మరియు ప్రయాణ బడ్జెట్‌లపై ఇటీవలి ఖర్చు తగ్గింపుపై Google ఉద్యోగులు సమాధానాలు కోరుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కఠినమైన స్థూల ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని పిచాయ్ కోరారు. Google వరుసగా రెండవ త్రైమాసికంలో ఊహించిన దాని కంటే బలహీనమైన ఆదాయాలను నివేదించిన తర్వాత ఉద్యోగుల ప్రయాణం మరియు వినోదం కోసం బడ్జెట్‌ను తగ్గించింది. ఉత్పాదకతను నిర్వహించడం, విశ్రాంతి బడ్జెట్‌పై కంపెనీ కాఠిన్యం మరియు తొలగింపులపై వివరణలు కోరుతూ ఇటీవల CEO సుందర్ పిచాయ్ నుండి సమాధానాలు కోరిన ఉద్యోగులతో మార్పు బాగా లేదు. డబ్బు మరియు పెర్క్‌లు అన్నీ కాదనీ, మాంద్యం మరియు ఉద్యోగుల ప్రయోజనాల కోసం తగ్గిన బడ్జెట్‌తో బాధపడే బదులు పనిలో వినోదం కోసం వెతకాలని పిచాయ్ ఉద్యోగులకు చెప్పినట్లు తెలిసింది. CNBC యొక్క నివేదిక ప్రకారం, పిచాయ్ గత వారం నిర్వహించిన ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో ఖర్చు తగ్గింపు గురించి ఉద్యోగుల నుండి ప్రశ్నలు ఎదుర్కొన్నారు. అధిక-రేటింగ్ ఉన్న ప్రశ్న — అటువంటి సమావేశాలలో ప్రశ్నలు సమర్పించబడి, ఆపై సహచరులు రేట్ చేస్తారు — Google ద్వారా, ఉద్యోగులు పిచాయ్‌ని “Google కలిగి ఉన్నప్పుడు ప్రయాణ మరియు ఇతర బడ్జెట్‌లను తగ్గించడం ద్వారా కంపెనీ “నికెల్ అండ్ డైమింగ్ ఉద్యోగులు” ఎందుకు అని అడిగారు రికార్డు లాభాలు మరియు భారీ నగదు నిల్వలు” కోవిడ్ మహమ్మారి నుండి బయటకు వస్తున్నాయి. అనే ప్రశ్నకు పిచాయ్ స్పందిస్తూ, ఇటువంటి స్థూల ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉద్యోగులు కలిసి ఉండాలని కోరారు. “నేను ఎలా చెప్పగలను? చూడండి, మీరందరూ వార్తలను బాహ్యంగా చదువుతున్నారని నేను ఆశిస్తున్నాను. మీకు తెలిసిన వాస్తవం, గత దశాబ్దంలో జరుగుతున్న అత్యంత కఠినమైన స్థూల ఆర్థిక పరిస్థితులలో మనం కొంచెం ఎక్కువ బాధ్యత వహిస్తున్నాము. ఒక కంపెనీగా మనం కలిసి ఇలాంటి క్షణాలను పొందడం ముఖ్యం” అని పిచాయ్ CNBC యాక్సెస్ చేసిన ఆడియో క్లిప్‌లో చెప్పారు. తర్వాత అతను ఇలా అన్నాడు, “గూగుల్ చిన్నగా మరియు చెత్తగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది. మనం ఎల్లప్పుడూ డబ్బుతో వినోదాన్ని సమానం చేయకూడదు. మీరు కష్టపడి పనిచేసే స్టార్ట్-అప్‌లోకి ప్రవేశించవచ్చని నేను భావిస్తున్నాను మరియు ప్రజలు సరదాగా ఉండవచ్చు మరియు ఇది ఎల్లప్పుడూ సమానంగా ఉండకూడదు. డబ్బుకు.” తీవ్రమైన ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో కదులుతూ, సుందర్ పిచాయ్ కొన్ని క్షణాల్లో చిరాకుగా అనిపించి, “మేము ఎల్లప్పుడూ స్థూల ఆర్థిక పరిస్థితులను ఎన్నుకోలేము” అని కూడా అన్నారు. నియామక ప్రక్రియను గూగుల్ మందగించడంపై కూడా పిచాయ్ వ్యాఖ్యానించారు. గూగుల్‌లో చాలా మంది వ్యక్తులు ఉన్నారని మరియు ఉత్పాదకత ఈ సంఖ్యలను ప్రతిబింబించదని అతను మళ్లీ సూచించాడు. “మీరు 20 మంది వ్యక్తుల బృందం లేదా 100 మంది వ్యక్తుల బృందం కావచ్చునని నేను భావిస్తున్నాను. మేము ఎదురుచూసే ప్రాతిపదికన మా వృద్ధికి అడ్డుకట్ట వేయబోతున్నాం. బహుశా మీరు మరో ఆరుగురిని నియమించుకోవాలని ప్లాన్ చేసి ఉండవచ్చు, కానీ మీరు కలిగి ఉండవచ్చు నలుగురితో చేయడం మరియు మీరు దీన్ని ఎలా చేయబోతున్నారు? వేర్వేరు జట్లకు సమాధానాలు భిన్నంగా ఉంటాయి” అని పిచాయ్ జోడించారు. ఆలస్యంగా, కంపెనీలు — టెక్ కంపెనీలతో సహా – ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ బెల్ట్‌లను బిగించుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి మరియు స్టార్టప్ సంస్కృతికి ఆజ్యం పోసిన ఈజీ మనీ కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నంత సమృద్ధిగా అందుబాటులో లేదు. ఇది గూగుల్ మరియు ఫేస్‌బుక్‌తో సహా అనేక టెక్ కంపెనీలు కొన్ని పెర్క్‌లను తగ్గించడానికి మరియు నియామకంపై నెమ్మదిగా వెళ్లడానికి దారితీసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వెంకటాచలయ్య ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు అప్పటి ప్రధాని పివి నరసింహారావు హాజరయ్యారు. ఇద్దరు పరస్పర గౌరవాభిమానాలతో... అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వెంకటాచలయ్య ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు అప్పటి ప్రధాని పివి నరసింహారావు హాజరయ్యారు. ఇద్దరు పరస్పర గౌరవాభిమానాలతో పలకరించుకున్న తర్వాత పివి ఆయనతో మాట్లాడుతూ ‘ జస్టిస్ వెంకటాచలయ్య గారూ, మన మధ్య సుహృద్భావ సంబంధాలు ఉంటాయని భావిస్తున్నాను’ అన్నారు. జస్టిస్ వెంకటాచలయ్య ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ‘ప్రధానమంత్రి గారూ మన మధ్య సుహృద్భావ సంబంధాలు ఎలా ఉంటాయి? ఉంటాయని నేను అలా అనుకోవడం లేదు..’ అని అన్నారు. పివి చిరునవ్వు నవ్వి, ‘సరేనండీ, సుహృద్భావ సంబంధాల సంగతి అటుంచండి, పరస్పర గౌరవం ఉంటే చాలు..’ అని జవాబిచ్చారు. ఈ ఘట్టం గురించి జస్టిస్ వెంకటాచలయ్య 2017లో విశాఖపట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో పివి నరసింహారావు స్మారకోపన్యాసం చేస్తూ వెల్లడించారు. పివిని రాజనీతిజ్ఞుడని, అత్యంత ప్రతిభావంతుడైన మేధావి అని అభివర్ణించిన జస్టిస్ వెంకటాచలయ్య, దివంగత ప్రధాని హయాంలో తాను ప్రభుత్వాన్ని ఎలా అగ్నిపరీక్షకు గురిచేసింది కూడా వివరించారు. జస్టిస్ వెంకటాచలయ్య చెప్పిన ఈ ఘట్టం భారత ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకూ, కార్యనిర్వాహక వర్గానికి మధ్య ఉండాల్సిన సంబంధాలు ఎలా ఉండాలో చెబుతాయి. చాలా మంది న్యాయమూర్తులు పదవీ స్వీకారం చేసిన వెంటనే జస్టిస్ వెంకటాచలయ్య తమకు ఆదర్శమని చెబుతారు కాని ఆయన అడుగుజాడల్లో తుచ తప్పకుండా నడిచిన వారు మనకు అంతగా కనపడరు. పివి హయాంలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలను జస్టిస్ వెంకటాచలయ్యతో పాటు జస్టిస్ అహ్మది, జస్టిస్ జెఎస్ వర్మ తీవ్రంగా ప్రశ్నించారు. జస్టిస్ కుల్దీప్ సింగ్ పర్యావరణంపై ఎన్నో చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. పెట్రోలు బంకులు, ప్రభుత్వ నివాస గృహాల కేటాయింపులో నాటి కేబినెట్ మంత్రులు సతీశ్ శర్మ, షీలా కౌల్ నిర్ణయాలను తప్పు పట్టారు. సుప్రీంకోర్టు సిబిఐ కేసులను పర్యవేక్షించడం కూడా పివి హయాంలోనే ప్రారంభమైంది. సిబిఐ సుప్రీంకోర్టుకు జవాబుదారీగా ఉండాలి కాని రాజకీయ నాయకత్వానికి కాదని నాడు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నాటి సిబిఐ డైరెక్టర్ ను కూడా సుప్రీంకోర్టు బోనులో నిలబెట్టింది. సిబిఐ పనితీరును పర్యవేక్షించే బాధ్యతను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు అప్పజెప్పింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా సుప్రీంకోర్టు మద్దతుతో స్వేచ్ఛగా వ్యవహరించింది. సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం వల్ల నరసింహారావు ప్రభుత్వం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. కాని దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా ఆయన ఏనాడూ పెదవి విప్పి మాట్లాడలేదు. పార్లమెంట్ లో ఆయన నిర్ణయాలపై తీవ్ర గందరగోళం రేగినప్పుడు కూడా న్యాయవ్యవస్థపైనే ఆయన బాధ్యత మోపారు. తాను కేవలం న్యాయవ్యవస్థ నిర్ణయాలను అమలు చేస్తున్నానని చెప్పారు. తన పట్ల న్యాయవ్యవస్థ ఏ విధంగా ప్రవర్తిస్తుందన్న విషయానికి పివి అంత ప్రాధాన్యత నీయలేదు. న్యాయవ్యవస్థ స్వతంత్ర్రంగానే వ్యవహరించాలని ఆయన అనుకునేవారు. ఆయన స్వతహాగా న్యాయవాది కావడం ఇందుకు కారణమేమో? ! పివి యుగం ముఖ్యంగా న్యాయవ్యవస్థకు సంబంధించి స్వర్ణయుగం అని చెప్పక తప్పదు. నాటి పరిస్థితులతో పోలిస్తే ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన 16 మందిలో 8 మంది అవినీతిపరులని మాజీ న్యాయమంత్రి , సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ 2010లో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో అన్నారు. న్యాయ వ్యవస్థలో ఎవరినైనా కొనుగోలు చేయొచ్చు అని నాడు గుజరాత్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ జె ముఖోపాధ్యాయ అన్నారు. ఈ పరిస్థితి గత దశాబ్దంలో మారిందా, ఇంకా దిగజారిందా అన్నవిషయం న్యాయవ్యవస్థలో నిత్యసంబంధాలున్నవారే స్పష్టంగా చెప్పగలరు. కార్యనిర్వాహక వర్గ నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ లోపాలను ఎంచుతోందా, లేక కార్యనిర్వాహక వర్గం న్యాయవ్యవస్థ ను ప్రభావితం చేస్తోందా అన్న అనుమానాలు గత కొన్నేళ్లుగా కలుగుతున్నాయి. నేరచరితులైన ప్రజా ప్రతినిధులపై విచారణను వేగవంతం చేయడంతో పాటు అనేక కీలక కేసుల విచారణ ను ప్రక్కన పెట్టారు. ఇందిరాగాంధీ వంటి నేత పదవీ గండంలో పడి ఎమర్జెన్సీ విధించడానికి ఒక హై కోర్టు ప్రధానన్యాయమూర్తి తీర్పు కారణమైంది. ఈ ఏడాది ఏప్రిల్ లో పాకిస్థాన్ లో కూడా ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోవడానికి ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు దారితీసింది. న్యాయవ్యవస్థ తీర్పులతో వివిధ దేశాధినేతలు జైలు పాలైన సందర్భాలెన్నో ఉన్నాయి. ఒక ప్రజాస్వామ్యం పనితీరుపై ప్రజల విశ్వాసం పెరగాలంటే న్యాయవ్యవస్థ నిజాయితీగా పనిచేయడం అవసరం. న్యాయవ్యవస్థ అవినీతికి, ప్రలోభాలకు, ఒత్తిళ్లకూ అతీతం అని తేలినప్పుడు ఈ విశ్వాసం మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు, మద్రాస్ హై కోర్టులకు ప్రధానన్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన ఏపి షా గత ఎనిమిదేళ్లలో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ప్రభుత్వ నియంత్రణకు లొంగిందని అభిప్రాయపడ్డారు. పౌరసత్వ చట్టం, ఆర్టికల్ 370 రద్దు జోలికి ఎందుకు పోలేదన్నది చర్చనీయాంశం. కాని ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ఎలెక్టోరల్ బాండ్ల పథకం, హెబియస్ కార్పస్ కేసులను పట్టించుకోలేదని, కొవిడ్ సమయంలో వలస కూలీల దుస్థితి పై ప్రభుత్వ వైఖరినే సమర్థించిందని, భావ వ్యక్తీకరణ కు సంబంధించి పది కేసుల్లో కేవలం మూడు కేసులనే పట్టించుకున్నదని జస్టిస్ షా అన్నారు. జస్టిస్ గొగోయ్ అనేక ముఖ్యమైన కేసుల్లో సమాచారాన్ని సీల్డు కవర్లలో సమర్పించమని కోరడం, ఈ కేసుల విచారణను పక్కన పెట్టడం ప్రశ్నార్థకమైందని ఆయన అన్నారు. ప్రధానమంత్రిని ప్రశంసలతో ముంచెత్తిన జస్టిస్ అరుణ్ మిశ్రా ను కూడా ఆయన తప్పు పట్టారు.వీరిద్దరిలో ఒకరు తమ పదవి ముగిసిన తర్వాత ఒకరు రాజ్యసభ సభ్యత్వాన్ని, మరొకరు జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ పదవిని స్వీకరించడం అనుచితమని, ఇది లా కమిషన్ అభిప్రాయానికి విరుద్దమని ఆయన అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగ ఆత్మ గా వ్యవహరించిన ఆర్టికల్ 32 (సుప్రీం కోర్టుకు వెళ్లే హక్కు) క్రింద పిటిషన్లను తాను ప్రోత్సహించబోనని మరో సిజె బాబ్డే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. జస్టిస్ రమణ ప్రధానన్యాయమూర్తి అయిన తర్వాత న్యాయవ్యవస్థపై కొంత గౌరవం పెరిగిందని ఆయన అంగీకరించారు. న్యా యపరిపాలనా వ్యవస్థను కట్టుదిట్టం చేసిన జస్టిస్ రమణ రాజద్రోహ నేరంపై స్టే విధించడం మాత్రమే కాదు, లఖీంపూర్ ఖేరీ కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడిని అరెస్టు చేయించడం, కశ్మీర్ లో ఇంటర్నెట్ పై నిషేధాన్ని ఎత్తివేయించడం, పెగాసస్ నిఘాపై కమిటీని నియమించి ప్రభుత్వం తమకు సహకరించడం లేదని స్పష్టం చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మానవ హక్కుల పరిరక్షణకు బహిరంగంగా వత్తాసు పలికారు. జస్టిస్ రమణ న్యాయస్థానాన్ని ముందుండి నడిపించారని దుష్యంత్ దవే వంటి సీనియర్ న్యాయవాదులు మాత్రమే కాదు, సాధారణంగా ఎవరికీ సర్టిఫికెట్లు ఇవ్వని ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షీలాంటి న్యాయనిపుణులు కూడా ప్రశంసించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. జస్టిస్ రమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ లలిత్ కేవలం 74 రోజులు పదవిలో ఉన్నప్పటికీ తనదైన ముద్ర వేశారు. వందలాది పెండింగ్ కేసులను పరిష్కరించడం, రాజ్యాంగ బెంచ్ కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయించడం, మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్ వాద్, జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్ లకు బెయిల్ ఇవ్వడం, సిఏఏ , పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి కేసులను విచారణకు స్వీకరించడం ఆయన హయాంలో జరిగిన నిర్ణయాల్లో చెప్పుకోదగ్గవి. అయితే మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణకు గురైన ప్రొఫెసర్ సాయిబాబా పై బొంబాయి హై కోర్టు కేసు కొట్టివేసిన తర్వాత ఆగమేఘాలపై శనివారం నాడు సుప్రీం కేసును విచారించి ఆయన విడుదలపై స్టే విధించడం కూడా జస్టిస్ లలిత్ హయాంలోనే జరిగింది. అతి అరుదైన సందర్భాల్లో తప్ప ఒక హైకోర్టు నిర్ణయంపై స్టే విధించడం గతంలో ఏనాడూ జరగలేదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ తో పాటు అనేక మంది న్యాయనిపుణులు వ్యాఖ్యానించారు. సాయిబాబా కేసును అర్జెంట్ గా విచారించేందుకు నిరాకరించిన జస్టిస్ డివై చంద్రచూడ్ ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి. రెండు సంవత్సరాల సుదీర్ఘకాలం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించే జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీకాలంలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రెండవ టర్మ్ చివరి ఏడాదిన్నర కాలం ముగియనుంది. మోదీ హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలు, తీసుకోబోయే అనేక నిర్ణయాలు ఆయన హయాంలో సుప్రీంకోర్టు ముందుకు రానున్నాయి. కిస్సా కుర్సీకా కేసులో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీని జైలు కు పంపిన జస్టిస్ వై.వి చంద్రచూడ్ ఆయన తండ్రి. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు తన తండ్రి మాదిరే తాను వ్యవహరిస్తానని, కొన్ని సందర్భాల్లో తండ్రి అభిప్రాయాలతో కూడా విభేదించగలనని జస్టిస్ డివై చంద్రచూడ్ ఇప్పటికే నిరూపించుకున్నారు. అత్యంత ఆధునిక భావాలు గల మేధావి, మహిళల హక్కులు, వ్యక్తి స్వేచ్చ, ప్రైవసీ హక్కు విషయంలో రాజీ పడని న్యాయమూర్తిగా గుర్తింపు పొందిన జస్టిస్ డివై చంద్రచూడ్ హయాంలో న్యాయవ్యవస్థకు మళ్లీ స్వర్ణయుగం వస్తుందా అన్నది వేచి చూడాలి.
కిల్లాడ సత్యనారాయణ గారు వ్రాసిన మాట - మౌనం అనే వ్యాసం ఈనెల మిసిమి మాసపత్రిక లో చదివాను. నాకు ఎంతగానో నచ్చింది.. అందుకని ఆర్టికిల్ లోని కొన్ని వాక్యాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను....... మాట - మౌనం మనిషి ఎంత ముఖ్యమో మాట అంతే ముఖ్యం.. మాటంటే జీవి అంతరంగపు ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రం. మాటంటే అగాధ జలనిధిలో నుంచి పిలుస్తున్న ఆణిముత్యం. మాటంటే పలుకుల గర్భం లోపల వెలుగుతున్న శిశువు. కొందరి మాటలు మంత్రాల్లా ముగ్ధుల్ని చేస్తాయి. మరి కొందరి మాటలు మెడచుట్టూ బిగుసుకుంటాయి. కొందరి మాటలు లేపనాలు. మనసుపై మొలిచిన వ్రణాన్ని వెంటనే మాన్పుతాయి. మరి కొందరి మాటలు ఈటెలు. గుండెను నిలువునా చేరుస్తాయి. కొందరి మాటలు దొరసానులు. మరి కొందరి మాటలు మంత్రగత్తెలు. కొందరి మాటలు ఉరుములు. మరి కొందరి మాటలు ఇంద్రధనస్సులు. కొందరి మాటలు మేఘాలు. మరి కొందరి మాటలు వర్షాలు. కొన్ని మాటలు లేడి పిల్లలు..వాటికి లేచిందే పరుగు. కొన్ని మాటలు ఐరావతాలు దేనికి తొందర పడవు. కొన్నిసార్లు మనసుని చంపి మాటలు బయటకు వస్తాయి లేదా మనసును చంపడానికి బయటకు వస్తాయి. అక్షరాలు కలలు కంటాయి మాటలు గా మారాలని.. ఆ మాట మధురమై పది మంది మదిలో వెలిగినప్పుడు వాటి జన్మ ధన్యమైంద నుకుంటాయి. మాటను ఒడిసి పట్టుకొని ఇతరులకు ఇచ్చేటప్పుడు తూకం వేసి ఇవ్వు ..ఇవ్వకున్నా పర్వాలేదు, అక్కర లేని వాళ్లకు అసలు ఇవ్వకు. అవసరానికి మించి అస్సలు ధారపొయ్యకు.
సినీరంగంలో మరో తార నేలరాలింది. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి (69) మృతి. ముంబైలోని క్రిటికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. లహిరి నెల రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి ఈ మధ్యే డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయన ఆరోగ్యం మంగళవారం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబసభ్యులు డాక్టర్ ను ఇంటికి పిలిపించారు. డాక్టర్ సూచన మేరకు లహిరిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. పరిస్థితి విషమించడంతో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. బప్పి లహిరి గత ఏడాది ఏప్రిల్ లో కరోనా బారినపడ్డారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. బాలీవుడ్ సహా టాలీవుడ్ సినిమాలకు కూడా ఆయన సంగీతమందించారు. 1970 –80 లల్లో బప్పీ లహరి పాడిన, కంపోజ్ చేసిన ఎన్నో పాపులర్ సాంగ్స్ విడుదలయ్యాయి. సింహాసనం, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్ స్పెక్టర్స వంటి తెలుగు చిత్రాలకు సంగీతం అందిచారు. తెలుగు, తమిళ, కన్నడ, గుజరాత్ సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. తెలుగులో సింహాసనం, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్ స్పెక్టర్స్, స్టేట్ రౌడీ, రౌడీగారి పెళ్లాం, దొంగాపోలీసు, బ్రహ్మ, నిప్పురవ్వ, బిగ్ బాస్, ఖైదీ ఇన్ స్పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు. ఇటీవలే విడుదలైన డిస్కో రాజా చిత్రంలో పాట పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా… గాయకుడిగానూ ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు.
రోలర్ యొక్క ప్రధాన విధి ఎక్స్కవేటర్ మరియు బుల్డోజర్ యొక్క బరువుకు మద్దతు ఇవ్వడం, తద్వారా ఆపరేషన్ పూర్తి చేయడానికి ట్రాక్ చక్రం వెంట కదులుతుంది.కాబట్టి బుల్డోజర్ రోలర్లు ఎంత తరచుగా భర్తీ చేయాలి?ఈ రోజు నేను మీకు క్లుప్త పరిచయం ఇస్తాను. 1. దిరోలర్ఎక్స్‌కవేటర్‌లు మరియు బుల్‌డోజర్‌ల వంటి నిర్మాణ యంత్రాల ఫ్యూజ్‌లేజ్ యొక్క బరువుకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగిస్తారు.అదే సమయంలో, ఇది గైడ్ పట్టాలపై (రైలు లింక్‌లు) లేదా ట్రాక్ షూలను ట్రాక్ చేస్తుంది.ఇది ట్రాక్‌ను పరిమితం చేయడానికి మరియు పార్శ్వ జారకుండా నిరోధించడానికి కూడా ఉపయోగించబడుతుంది.నిర్మాణ యంత్ర పరికరాలను తిప్పినప్పుడు, రోలర్లు ట్రాక్‌ను నేలపై జారడానికి బలవంతం చేస్తాయి. 2. ఎంత తరచుగా బుల్డోజర్ కోసంరోలర్లుభర్తీ చేయాలి, వాస్తవానికి, బుల్డోజర్ రోలర్ల మధ్య అంతరం చాలా పెద్దది మరియు అవి పగుళ్లు ఏర్పడినట్లయితే, వాటిని భర్తీ చేయాలి.కానీ ఇది నిర్దిష్ట వినియోగ వాతావరణంపై కూడా ఆధారపడి ఉంటుంది.జాగ్రత్తగా నిర్వహించినట్లయితే, సేవ జీవితం సుమారు 20,000 నుండి 30,000 గంటల వరకు ఉంటుంది. 3. బుల్డోజర్రోలర్లుసరికాని సంస్థాపన కారణంగా తరచుగా చమురు లీక్ అవుతుంది.అందువల్ల, ఇన్‌స్టాలేషన్ ప్రక్రియలో కొన్ని రక్షణ చర్యలు తీసుకోవాలి.యంత్రం యొక్క సుదూర రన్నింగ్ రోలర్లు మరియు చివరి డ్రైవ్ దీర్ఘకాల భ్రమణ కారణంగా అధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయడానికి కారణమవుతుంది., నూనె యొక్క స్నిగ్ధత తగ్గుతుంది మరియు సరళత తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది చల్లబరచడానికి మరియు దిగువ శరీరం యొక్క జీవితాన్ని పొడిగించడానికి తరచుగా మూసివేయబడాలి. సాధారణంగా, బుల్డోజర్ సపోర్ట్ రోలర్‌ను ఎంతకాలం భర్తీ చేయాలి, వాస్తవ పరిస్థితిని బట్టి దానిని అంచనా వేయాలి, మన వినియోగ వాతావరణాన్ని పరిశీలించాలి, మొదలైనవి. దాని సేవా జీవితాన్ని పొడిగించడానికి, మేము ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. తనిఖీ మరియు నిర్వహణ చర్యలు. పోస్ట్ సమయం: మే-23-2022 ఫీచర్ చేయబడిన ఉత్పత్తులు హాట్ ట్యాగ్‌లు సైట్‌మ్యాప్.xml © కాపీరైట్ 2021 : సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి. హాట్ ఉత్పత్తులు - సైట్‌మ్యాప్ - AMP మొబైల్ ఎక్స్కవేటర్ బకెట్ కట్టింగ్ ఎడ్జ్, Mtg వేర్ పార్ట్స్, ట్రాక్ బేరింగ్ రోలర్, ఎక్స్కవేటర్ బకెట్ వేర్ పార్ట్స్, ఎక్స్కవేటర్ అండర్ క్యారేజ్ వేర్, అధిక బలం బోల్ట్,
భారత తదుపరి అటార్నీ జనరల్‌గా ఉండేందుకు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఆదివారం నిరాకరించారు. కేకే వేణుగోపాల్ స్థానంలో ముకుల్ రోహత్గీని నియ‌మించాలని కేంద్రం భావించింది. ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌లు కూడా చేసింది. కానీ అంతకు ముందు అతను ఈ ఆఫర్‌ను తిరస్కరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. Rajesh Karampoori First Published Sep 25, 2022, 10:54 PM IST కేంద్ర‌ప్ర‌భుత్వ అత్యున్న‌త ప్ర‌తిపాద‌న‌ను సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తిర‌స్క‌రించారు. భారత తదుపరి అటార్నీ జనరల్‌గా సేవ‌లందించేందుకు ఆయ‌న నిరాకరించారు. గత కొన్ని రోజులుగా.. త‌దుప‌రి భారత అటార్నీ జనరల్‭గా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మరోసారి ఆ పదవిని చేపట్టనున్నట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఆ ప్రచారానికి పుల్ స్ఠాప్ పెడుతూ.. త‌న‌కు ఆ ప‌ద‌విపై ఆస‌క్తి లేద‌ని ఆదివారం ప్రకటించారు. కానీ, తిరస్క‌రించాడ‌నికి గ‌ల కారణాలను రోహత్గీ వెల్లడించలేదు. ఈ ఆఫర్‌ను మరోసారి పరిశీలించి తిరస్కరించినట్లు న్యాయవాది తెలిపారు. ముకుల్ రోహత్గీ 2014 నుండి 2017 వరకు భారతదేశ అటార్నీ జనరల్‌గా ప‌నిచేశారు. అయితే 2017 జూన్‌లో ఆయ‌న త‌న‌ వ్యక్తిగత కారణాలతో ఈ పదవికి రాజీనామా చేశారు. మళ్లీ న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. మరోవైపు, 2017లో ముకుల్ రోహత్గీ అటార్నీ జనరల్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయ‌న స్థానంలోకి కేకే వేణుగోపాల్ వ‌చ్చారు. అయితే వేణుగోపాల్ పదవీ కాలం సెప్టెంబర్ 30తో ముగియనుంది. దీని తరువాత రోహత్గీ అటార్నీ జనరల్ అవుతాడని చర్చ జరిగింది, కానీ అతను ఈ పదవిని తిరస్కరించాడు. ప్రస్తుతం భారత అటార్నీ జనరల్‌గా ప‌నిచేస్తూ.. కేకే వేణుగోపాల్ పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగియనుంది. అయితే.. మోడీ ప్రభుత్వం పదవీకాలాన్ని పొడిగించాలని ప్రతిపాదించినప్పటికీ.. త‌న వ‌య‌స్సు రీత్యా ఆ ఆఫ‌ర్ ను తిరస్కరించారు. వేణుగోపాల్‌ వయసు 91 ఏళ్లు. కేకే వేణుగోపాల్ స్థానంలో రోహత్గీకి అటార్నీ జనరల్ పదవిని కేంద్ర ప్రభుత్వం ఈ నెల మొదట్లో ఆఫర్ చేసింది. న్యాయవాది ముకుల్ రోహత్గీ.. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రోహత్గీ అత్యంత సన్నిహితుడు. 2014లో అత్యున్నత న్యాయ అధికారిగా నియమితులయ్యారు. ప్రభుత్వ వైఖరిని వ్య‌తిరేకిస్తూ 2017 జూన్ రెండో వారంలో ఏజీ పదవికి రోహత్గీ రాజీనామా చేశారు. అనంతరం లాయ‌ర్ గా ప్రాక్టీస్ మొద‌లు పెట్టారు.
• WDRA రిజిస్ట్రేషన్ లలో రాష్ట్రానికి దేశంలో 3వ స్థానం సాధించినందుకు ఉద్యోగులకు అభినందనలు తెలిపిన మంత్రి ఎప్పటికీ ఉండేవారు ఉద్యోగులు మాత్రమేనని.. సంస్థ మనుగడ కోసం ఉద్యోగులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ లో వ్యవసాయ, కో-ఆపరేషన్ మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. గతంలో వ్యవసాయం, మార్కెటింగ్, వేర్ హౌసింగ్, ఉద్యాన శాఖలకు వేర్వేరు మంత్రులు ఉండేవారని.. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి రైతులకు మరింత మేలు చేసే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్ లో జరిగిన వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నిర్వహించిన మొదటి రాష్ట్రస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆంధ్రప్రదేశ్ వేర్ హౌసింగ్ ఆన్ లైన్ సిస్టం (APWOS) సాప్ట్ వేర్ ను మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో గోడౌన్ లలో కేవలం ఎరువులు మాత్రమే లభించేవని, కానీ ఈ ప్రభుత్వంలో విత్తనం నుండి పంట విక్రయం వరకూ అన్ని సేవలు రైతు గడప వద్దనే అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ 1958వ సంవత్సరంలో ఏర్పాటుచేశారని, కాలానుగుణముగా వచ్చిన మార్పులు, ప్రభుత్వ విధానాలకు అనుగుణముగా చేర్పులు చేసుకుంటూ లాభాల బాటలో పయనిస్తోందన్నారు. మార్కెట్ వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా గిడ్డంగుల నిర్మాణం చేపట్టామన్నారు. సిబ్బందికి కేంద్ర ప్రభుత్వ సంస్థలలో శిక్షణ కల్పించి గిడ్డంగుల సేవలలో మెరుగైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని తెలిపారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మార్క్ ఫెడ్ లో కూడా ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్ లైన్ దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని రైతులకు, వినియోగదారులకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గిడ్డంగుల సంస్థకి వ్యాపారం ఇచ్చే సంస్థలలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఎఫ్‌సీఐ, మార్క్ ఫెడ్, నాఫెడ్ వంటి ప్రభుత్వ సంస్థలు ఉన్నాయన్నారు. కాబట్టి ప్రభుత్వరంగ సంస్థలలోనే స్టోరేజి స్పేస్ ని మొదటి ప్రాధాన్యతగా వినియోగించాలన్నారు. వేర్ హౌసింగ్ డెవలప్ మెంట్ & రెగ్యులేటరీ అథారిటీ (WDRA) రిజిస్ట్రేషన్ లలో రాష్ట్రానికి దేశంలో 3వ స్థానం లభించడంతో ఉద్యోగులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. గిడ్డంగుల సంస్థకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనవంతు సంపూర్ణ సహకారాలు అందిస్తామని తెలిపారు. వ్యవసాయ రంగంలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందని, జాతీయ స్థాయిలో అగ్రస్థాననంలో నిలుస్తుందన్నారు. వేర్ హౌసింగ్ సంస్థ కూడా దేశంలో నెంబర్ వన్ సాధించాలని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆకాక్షించారు. సంస్థ ఛైర్మన్ షేక్ అమీన్ కరిముల్లా మాట్లాడుతూ.. గిడ్డంగులలో రైతులు సరుకు నిల్వ చేసుకున్నప్పుడు వేర్ హౌస్ సంస్థ నుంచి ఎలక్ట్రానిక్ వేర్ హౌస్ రశీదు జారీ చేస్తామని, దీనిపై 70 శాతం వరకూ రైతులు హామిలేని ఋణం బ్యాంకు నుండి పొందవచ్చని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్ లు అన్నీ వేర్ హౌసింగ్ డెవలప్ మెంట్ & రెగ్యులేటరీ అథారిటీ (WDRA) రిజిస్ట్రేషన్ లలో రాష్ట్రానికి దేశంలో 3వ స్థానం లభించిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గత 3 సంవత్సరాలలో 2019 - 20 సంవత్సరానికి గాను రూ. 19 కోట్లు, 2020 - 21 సంవత్సరానికి గాను రూ. 27 కోట్లు, 2021 - 22 సంవత్సరానికి గాను రూ. 33 కోట్లు లాభాలను గడించిందని తెలిపారు. భారతదేశంలో వేర్ హోసింగ్ భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CWC ప్రాంతీయ అధికారి అజయ్ జాదూ ఈ సమావేశములో పీపీటీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ & కో ఆపరేషన్ ముఖ్య కార్యదర్శి చిరంజీవ్ చౌదరి, , ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ ఎస్. శ్రీకంఠ నాథ రెడ్డి, జనరల్ మేనేజర్ డి. చంద్రశేఖర్, వేర్ హౌసింగ్ సంస్థ బోర్డు డైరెక్టర్స్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. Comments addComments Post a Comment Popular posts ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది. November 25, 2022 • GUDIBANDI SUDHAKAR REDDY ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు November 24, 2022 • GUDIBANDI SUDHAKAR REDDY *ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార పార్టీ నేత‌లు ఏం చేసినా చెల్లిపోతుంది. ఎంత‌టి దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డినా, ప్ర‌త్య‌ర్థుల‌పై ఎంత‌గా రెచ్చిపోయి మాట్లాడినా వారిపై కేసులుండ‌వు, చ‌ర్య‌లుండ‌వు. కానీ అధికార పార్టీకి వ్య‌తిరేకంగా ఎవ‌రైనా నోరు విప్పితే మాత్రం వారి మీద కేసులు బ‌నాయిస్తారు. త‌ప్పుడు కేసులు పెట్ట‌డానికి కూడా వెనుకాడ‌రు. ఇక రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను తీసుకెళ్లి తీవ్రంగా హింసిస్తున్న ఉదంతాలు కూడా త‌ర‌చుగా జ‌రుగుతున్నాయి. కేసులు, నోటీసుల్లాంటి విష‌యాల్లో ప్ర‌భుత్వ విభాగాలు ఎంత ప‌క్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తాయో ఇప్ప‌టికే చాలా ఉదాహ‌ర‌ణ‌లు చూశాం. తాజాగా ఇలాంటి ఉదంతం మ‌రొక‌టి చోటు చేసుకుంది. ఇటీవ‌ల వైసీపీ నేత‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం, హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం తెలిసిందే. దీనికి బ‌దులుగా వైసీపీ నేత‌లు ఇంకా రెచ్చిపోయి మాట్లాడారు. దారుణ‌మైన భాష ఉప‌యోగించారు. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచారంటూ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ ఛైర్ ప‌ర్సన్ వాసిరెడ్డి ప‌ద్మ ప‌వ‌న్‌కు నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. అయినా ప‌వ‌న్ వైసీపీ నేత‌ల్ని కొడ‌క‌ల్లారా అని తిడుతూ చెప్పుతో కొడ‌తా అన్నాడే త‌ప్ప మ‌హిళ‌ల్ని ఏం కించ‌ప‌రిచాడ‌ని సందేహం రావ‌డం స‌హ‌జం. ఐతే త‌న మూడు పెళ్ళిళ్ల గురించి వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతూ.. ఒక పెళ్లి చేసుకుని 30 మంది స్టెప్నీల‌తో తిరిగే మీరు నాకేంట్రా చెప్పేది అని ప‌వ‌న్ ఎటాక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో స్టెప్నీ అనే ప‌దం మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచేలా ఉంద‌ట‌. ఐతే ప‌వ‌న్ ఏ మ‌హిళ పేరు పెట్టి ఈ మాట అన‌లేద‌న్న‌ది గ‌మ‌నార్హం. ఇష్టం ఉన్న వాళ్లు ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకోండి అని ప‌వ‌న్ అన‌డం కూడా త‌ప్ప‌ట‌. మీకు కుద‌ర‌క‌పోతే విడాకులిచ్చి పెళ్లి చేసుకోండ‌ని ప‌వ‌న్ అన్నాడు. అందులో ప్ర‌త్యేకంగా త‌ప్పుబ‌ట్ట‌డానికి ఏముందో మ‌రి. ఎవ‌రి పేరు పెట్ట‌కుండా స్టెప్నీ అనే ప‌దం వాడినందుకు ప‌వ‌న్‌కు నోటీసులు ఇవ్వ‌డం రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్‌కే చెల్లింది.
దివి వద్యత గురించి పరిచయం అవసరం లేదు. `బిగ్ బాస్` సీజన్ 4లో వేడెక్కించే పెర్పార్మెన్స్ తో యూత్ గుండెల్లోకి దూసుకెళ్లింది. తనదైన అందం కవ్వింతతో యువతరానికి తెగ నచ్చేసింది. అమ్మడి అందచందాల ప్రతిభకు దర్శకనిర్మాతలు ఫిదా అవుతున్నారు. ఆక్రేజ్ తోనే వెబ్ సిరీస్ లలోనూ అవకాశాలు అందుకుంటుంది. అటు కమర్శియల్ యాడ్స్ లోనూ బిజీ అవుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కొద్ది రోజులుగా ఇటలీ అందాల్లో మమేకమైంది. అమ్మడి సోలో ట్రిప్లో ఇది. దీంతో బ్యూటీ ఇటలీ మొత్తాన్ని స్వేచ్ఛగా చుట్టేస్తుంది. ఇప్పటికే అక్కడి అందాల్ని కవర్ చేస్తూ కొన్ని ఫో టోల్ని షేర్ చేసింది. తాజాగా హాలీవుడ్ చిత్రం `ఈక్విలైజర్ 3` సెట్స్లో ప్రత్యక్షమైంది. రోమ్లో షూటింగ్ జరుగుతోన్న సమయంలో చిత్ర ప్రధాన నటుడు డెంజెల్ వాషింగ్టన్.. దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా మరియు సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ రిచర్డ్సన్లను కలిసింది. ఆ ఫోటోల్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేసింది. “రోమ్లో ఈక్వలైజర్ 3 సెట్స్లో అద్భుతమైన సమయం గడిపాను. ధన్యవాదాలు బాబ్. ఇలాంటి అవకాశం కల్పించడం అద్భుతమైన అనుభవానికి గురిచేస్తుంది. గ్రేట్ సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ రిచర్డ్సన్… మీరు లేకుండా ఇది జరిగేది కాదు. మూడు సంవత్సరాల క్రితం నేను యాడ్ ఫిల్మ్ కోసం ఇండియాలో అతని దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. డెంజెల్ వాషింగ్టన్ అద్భుతమైన వ్యక్తి. అతను చాలా వినయపూర్వకంగా ఉంటారు. అతనితో సంభాషణను ఎంతో ఇష్టపడతాను. అతని ప్రసంగాలను తరుచు చూస్తాను. వీడియోలను అనుసరిస్తాను. అతని ప్రభావం నాపై బలంగా ఉంటుంది. అతనిలో పాజిటివ్ యాటిట్యూడ్ ఎంతో నచ్చుతుంది. అంటోని పూక్వా ఈక్వలైజర్ సిరీస్.. ట్రైనింగ్ డే లాంటి అనేక గొప్ప చిత్రాలు తెరకెక్కించారు. సన్నివేశం పట్ల అతనికి ఉన్న స్పష్టత .. ఆన్ సెట్స్లో అతను పనితనం ఎంతో నచ్చుతుంది. వారు పనితనం చూసి వారి పట్ల నా గౌరవం 10 రెట్లు పెరిగింది. నా రోమ్ పర్యటన ఎంతో విలువైనది. ఈ ట్రిప్ జీవితాంతం గుర్తుండిపోతుంది. దివ్య వద్యత మెగాస్టార్ చిరంజీవి నటించిన `గాడ్ ఫాదర్` లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
ఏదైనా సాధ్యం కావాలంటే అది వ్యక్తి యొక్క ఓపిక, వివేకం విచక్షణ ,కృషి,పట్టుదల,తపనతో పాటుగా సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. సాధ్యం కాని వాటి కోసం సామర్థ్యాన్ని ఎంతగా పెట్టుబడి పెట్టినా ,కొండతో పొట్టేలు ఢీ కొట్టినట్లు ఉంటుంది. ఏదైనా కార్యాన్ని మొదలు పెట్టే ముందు సాధ్యాసాధ్యాలతో పాటు దాని వల్ల ఒనగూరే మంచి చెడుల వివేచన చేయాలి. పావలా పనికి రూపాయి ఖర్చు పెట్టినట్లు, కొండను తవ్వి ఎలుకను పట్టిన చందం కాకూడదు. తలపెట్టిన పని తప్పకుండా సాధ్యం అవుతుందనే నమ్మకం ఉంటేనే ప్రారంభించాలి. ఆ పని విజయవంతం అయ్యేందుకు శక్తి వంచన లేకుండా ,లోలోపలి సామర్థ్యానికి పదును పెట్టుకుంటూ నమ్మకంతో సాగిపోవాలి.
thesakshi.com : బాలీవుడ్‌లో అత్యంత చురుకైన తారలలో నటి దిశా పటానీ ఒకరు. 29 ఏళ్ల ఆమెకు జిమ్‌లో వర్కవుట్ చేయడం చాలా ఇష్టం మరియు తీవ్రమైన వ్యాయామ దినచర్యలతో చెమటలు పట్టించే వీడియోలను తరచుగా పోస్ట్ చేస్తుంది. నెయిల్ ఫ్లయింగ్ కిక్‌ల నుండి ఏసింగ్ డెడ్‌లిఫ్ట్‌ల వరకు, స్టార్ చేయలేనిది ఏమీ లేదు. ఆమె తాజా జిమ్ వీడియో కూడా మా దావాకు మద్దతు ఇస్తుంది. స్టార్ తాను కండరాలను పెంచే మరియు కోర్-బలపరిచే వ్యాయామం చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది మరియు ఇది వారాంతపు ప్రేరణ యొక్క ఖచ్చితమైన మోతాదును మీకు అందిస్తుంది. టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకారు వచ్చిన దిశా పటానీ, జిమ్‌లో వైడ్ లాట్ పుల్‌డౌన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. స్టార్ క్లిప్‌లో తన లక్ష్యానికి తగిన శరీరాన్ని ప్రదర్శించింది. ఆమె క్రిస్-క్రాస్ బ్యాక్ టైస్ మరియు టై-డై బ్యాగీ షార్ట్‌లతో కలర్‌ఫుల్ ప్రింటెడ్ బికినీ టాప్ ధరించింది. స్లీక్డ్ బ్యాక్ సగం-టైడ్ హెయిర్‌డోలో ట్రెస్‌లు కట్టుకుని, దిశా వ్యాయామం చేసింది. ఆమె చిన్న రీల్ కోసం బేఖ్యూన్ రాసిన క్రై ఫర్ లవ్ పాటను ఉపయోగించింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో దిశా లాట్ పుల్‌డౌన్ వ్యాయామం చేయడానికి బాహ్య బరువులను క్రిందికి లాగినట్లు చూపిస్తుంది. ఇది బెంచ్‌పై కూర్చొని గ్రిప్‌లను ఉపయోగించి బరువులను క్రిందికి లాగేటప్పుడు పుల్-అప్ వర్కౌట్ యొక్క కదలికను అనుకరించడం ఉంటుంది. ఇది బలాన్ని పెంపొందించడానికి మరియు వెనుక మరియు పై చేయి కండరాలను లక్ష్యంగా చేసుకోవడానికి అనుమతిస్తుంది. లాట్ పుల్‌డౌన్ అనేది లాటిస్సిమస్ డోర్సీ (చేతులు కలుపుతూ వెన్నెముకకు ఇరువైపులా ఎగువ వీపు కండరాలు) మరియు ట్రాపెజియస్ కండరాలను (మెడ కదలికను అలాగే భుజాలను నియంత్రించే మీ మెడ వెనుక కండరాలు) బలోపేతం చేయడానికి అద్భుతమైన వ్యాయామం. ఇది మంచి భంగిమ మరియు వెన్నెముక స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ వ్యాయామం ముంజేతులు, పై చేయి కండరాలు మరియు భుజాలను కూడా లక్ష్యంగా చేసుకుంటుంది మరియు వాటిని బలంగా చేస్తుంది. ఇది కోర్ని సక్రియం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇదిలా ఉండగా, సిద్ధార్థ్ మల్హోత్రా మరియు రాశి ఖన్నా కూడా నటించిన రాబోయే యాక్షన్-డ్రామా యోధాలో దిశా తదుపరిగా కనిపించనుంది. పుష్కర్ ఓజా మరియు సాగర్ అంబ్రే దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 11, 2022న థియేటర్లలో విడుదల కానుంది.
భీమా కోరేగాం కేసులో నిందితురాలు షోమా సేన్ భర్త తుషార్ కాంతి భట్టాచార్యకు మే 9 న ఫోన్ చేశాను. ఆమె నాలుగు సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతుండగా, ఆయన ఒంటరిగా బైట అనుభవిస్తున్న వేదన కథను నాతో పంచుకోగలరా అని అడగడానికి. సరిగ్గా ఆరోజునే 1991లో తాము పెళ్లి చేసుకున్నామని ఆయన చెప్పాడు. ʹనా వివాహ దినోత్సవాన నేను మరీ మరీ ఒంటరిగా ఉన్నాననిపిస్తోందిʹ అన్నాడాయన. వాళ్ల పెళ్లి అంటే, వాళ్లిద్దరూ ఇరవై మంది మిత్రుల సమక్షంలో తాము ఉమ్మడిగా తమ జీవితాలను అణగారిన ప్రజానీకం కోసం వెచ్చిస్తామని చేసిన వాగ్దాన ప్రకటన సందర్భం. అంతే. ఆ రకంగా భారత సమాజపు అనుల్లంఘనీయమైన వర్గ విభజన రేఖను వాళ్లు దాటారు. ఎలాగంటారా?! షోమా తండ్రి ముంబాయిలో ఒక వ్యాపార ప్రకటనల సంస్థలో క్రియేటివ్ హెడ్ అనే ఉన్నత స్థానంలో ఉండేవాడు. వాళ్ల కుటుంబం బాంద్రాలో ఉన్నత మధ్యతరగతి జీవితాన్ని గడుపుతుండేది. షోమా ఒక కార్మిక నాయకుడిని పెళ్లి చేసుకుని, అతనితో కలిసి జీవించడానికి మురికివాడలకు పయనించింది. వాళ్ల జీవితాల్లోకి పాప కోయెల్ ప్రవేశించింది. కొన్నాళ్లకు ఆ వివాహ బంధం విచ్ఛిన్నం కాగా షోమా 1987లో నాగపూర్ కు వెళ్లిపోయింది. అక్కడ దళితులు నడిపే విద్యా సంస్థ డా. మధుకర్ రావు వాస్నిక్ పి డబ్ల్యు ఎస్ కాలేజిలో ఇంగ్లిష్ లిటరేచర్ అధ్యాపకురాలిగా చేరింది. తుషార్ తండ్రి ఇప్పుడు తెలంగాణలో ఉన్న సిర్పూర్ కాగజ్ నగర్ అనే చిన్నపట్నంలో గుమస్తాగా పనిచేస్తుండేవాడు. తుషార్ ఏడుగురు తోబుట్టువులలో ఒకరు. వాళ్లలో ముగ్గురు మగపిల్లలను – ఆలోక్, కలోల్, తుషార్ లను ప్రతిరోజూ ఉదయం ఒక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త వచ్చి ఆటలు ఆడించడానికి తీసుకువెళ్తుండేవాడు. తుషార్ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఒకరోజు ప్రచారక్ ఇందిరాగాంధీని దూషించడం మొదలుపెట్టాడు. ʹమీరు ఆర్ ఎస్ ఎస్ సాంస్కృతిక సంస్థ అని చెప్పుకుంటారు గదా. ఇక్కడ రాజకీయాలెందుకు మాట్లాడుతున్నారుʹ అని తుషార్ నిలదీశాడు. ఆ తెలివైన పిల్లవాడు అప్పటికే నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల గురించీ, 1968 పారిస్ విద్యార్థి తిరుగుబాటు గురించీ చదివి ఉన్నాడని ఆ ప్రచారక్ కు తెలియదు. తుషార్ అధ్యయనమే ఆయనలో కుల వర్గ అంతరాలను బద్దలు గొట్టాలనే కోరికను ప్రేరేపించింది. సరిగ్గా ముంబాయిలో షోమాకు కూడ అధ్యయనం వల్లనే అటువంటి ప్రేరణలే కలిగాయి. ఆ ప్రేరణలే వాళ్లను ఒకే మార్గం మీద నడిపించాయి, ఒక్కచోటికి చేర్చాయి. తన భావజాల ప్రత్యర్థులను జైళ్లకు పంపించే భారత రాజ్యంతో తలపడే చోటు అది. జైలుతో తుషార్ సంబంధం చాల ముందే, ఆయన పదో తరగతిలో ఉన్నప్పుడే మొదలైంది. ఆయన చేరిన ఒక నవయువకుల బృందం గోడల మీద విప్లవ నినాదాలు రాస్తుండేది. తమ విప్లవ స్ఫూర్తిని చాటుకోవడానికి, పొరపాటుగానే అయినా వాళ్లు మహాత్మా గాంధీ పాలరాతి విగ్రహానికి ఎర్రజాజు పూశారు. తర్వాత కొన్నాళ్లకే ఆ విగ్రహాన్ని ఎవరో పగులగొట్టారు. వెంటనే ఈ పిల్లలను అరెస్టు చేశారు. కాకపోతే ఆ నేరారోపణ అబద్ధమని న్యాయస్థానం వారిని విడిచిపెట్టింది. ఆ తర్వాత తుషార్ తమ హక్కుల కోసం పోరాడే కార్మికులను సంఘటితం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. 1987లో నాగపూర్ లోని ఖపర్ ఖేడా థర్మల్ పవర్ ప్లాంట్ లోని కార్మికుల దుర్భరమైన పని పరిస్థితులను చూసి తుషార్, కార్యకర్త అనురాధతో, ఆమె భర్త, డూన్ స్కూల్ మాజీ విద్యార్థి కోబడ్ గాంధీలతో కలిసి అక్కడి కార్మికులను సంఘటితం చేయడం మొదలుపెట్టాడు. ఆ సంవత్సరమే తుషార్ కు టైఫాయిడ్ వచ్చింది. చికిత్స కోసం, విశ్రాంతి కోసం అనురాధ ఆయనను షోమా ఇంట్లో ఉంచింది. అక్కడ షోమా సపర్యలతో తుషార్ కోలుకున్నాడు. వాళ్ల మధ్య ప్రేమ చిగురించింది. వాళ్ల మార్క్సిస్టు విశ్వాసాలూ, బెంగాలీ నేపథ్యమూ ఆ ప్రేమను బలోపేతం చేశాయి. కోయెల్ కూడ తుషార్ ను పాపా అని పిలవడంతో ఆ సంబంధం మరింత బలపడింది. కాని ఆ కుటుంబాన్ని రాజ్యం చెప్పనలవి గాని వేదనకు గురిచేసింది. ఇక్కడ విచిత్రం ఏమంటే నాగపూర్ లో షోమా తన మధ్యతరగతి మూలాల్లోకి తిరుగుప్రయాణం ప్రారంభించింది. స్త్రీ చేతన అనే మహిళా సంస్థను స్థాపించి తన పని మీద కేంద్రీకరించింది. అవును, చైతన్యవంతులైన పౌరులందరి లాగే ఆమె దళితుల మీద అత్యాచారాలకు వ్యతిరేకంగా ఎలుగెత్తింది. గడ్చిరోలి లోని నిరుపేద ఆదివాసుల కుటుంబ సభ్యులు గణనీయమైన సంఖ్యలో నాగపూర్ జైళ్లలో ఉండగా, వారికి అంతదూరం రావడం కష్టమనీ, వారికోసం గడ్చిరోలిలోనే జైలు ఏర్పాటు చేయాలనీ హైకోర్టులో కేసు వేసింది. ఎవరి హృదయమైనా ఆదివాసుల కోసం రవరవలాడుతున్నదంటే రాజ్యానికి ఉలికిపాటు కలుగుతుంది. షోమా, తుషార్ ల బాధలు 2018 జూన్ 6న భీమా కోరేగాం కేసులో ఆమె అరెస్టు కావడంతోనే ప్రారంభం కాలేదు. ఆ వేదన 2007లో మొదలైంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తర బీహార్ మూడు ప్రాంతాలను కలిపిన ట్రిపుల్ యు అనే అజ్ఞాత మావోయిస్టు విభాగానికి ఆయనే నాయకుడు అని ఆరోపిస్తూ 2007లో ఆయనను అరెస్టు చేశారు. ఆ జంటను విడదీశారు. ʹఆ రోజుల్లో షోమానే నా బలంʹ అన్నాడు తుషార్. అలాగే తుషార్ అన్న కలోల్ కూడ ఆయనకు మద్దతు ఇచ్చాడు. అప్పటికి ఆయన ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థ అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ కు తెలంగాణ కార్యదర్శి. తుషార్ మీద ఏడు కేసులు పెట్టారు. కాని న్యాయస్థానాలు అన్ని కేసులనూ కొట్టివేసి ఆయనను నిర్దోషిగా విడుదల చేశాయి. 2013 ఫిబ్రవరిలో ఆయన జైలు నుంచి స్వేచ్ఛలోకి బైటికి వచ్చాడు. అప్పటికి షోమా ఆర్ టి ఎం నాగపూర్ యూనివర్సిటీ ఇంగ్లిష్ శాఖలో అధ్యాపకురాలైంది. ʹఅపరాధ భావనతో నన్ను నేను చంపుకుంటూ, నా సంపాదనను దాచుకోవడమో, లేదా ఆ సంపాదనను ఈ వయసులో కాస్త సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి వాడుకోవడమోʹ అనే ఎంపికే మిగిలిందని షోమా తన స్నేహితురాలు, జర్నలిస్టు జ్యోతి పున్వానికి రాసింది. ఆమె ఇప్పుడు, ఒక చిట్టడవి ఎదురుగా అపార్ట్ మెంట్ లో ఇద్దరు సహాయకులు, ఒక డ్రైవర్ లతో మెరుగైన జీవితం గడిపే అవకాశం వచ్చింది. ʹమా ఇద్దరి పరస్పర విరుద్ధ జీవిత విధానాల మధ్య రాజీ కుదుర్చుకోవడానికి నాకు రెండు సంవత్సరాలు పట్టిందిʹ అన్నాడు తుషార్. ఆయన పుస్తకాలు అనువాదం చేస్తూ, తమ భవనం మీద మిద్దె తోటను సంరక్షిస్తూ కాలం గడపడం మొదలు పెట్టాడు. ఈ ప్రశాంత జీవనం 2018 జూన్ 6న బద్దలైపోయింది. తన తల్లి జైలు నిర్బంధంతో కోయెల్ అల్లకల్లోలమైపోయింది. ఇరుగు పొరుగువాళ్లు ముఖం చాటేశారు. ఇంట్లో సహాయం చేస్తుండే పని మనిషి ఇతర ఇళ్లవాళ్ల ఒత్తిడి వల్ల ఈ ఇంట్లో పని మానేసింది. గ్లకోమా (కంటి వ్యాధి) తో, ఆర్థ్రైటిస్ (కీళ్ల వ్యాధి) తో, హైపర్ టెన్షన్ (తీవ్ర రక్తపోటు) తో షోమా జైలు జీవితాన్ని ఎట్లా తట్టుకోగలుగుతుంది అనే ప్రశ్న ఎవరో తననే అడుగుతున్నట్టు తుషార్ మనసులో ప్రతిక్షణమూ గుసగుస వినిపిస్తుండేది. కంప్యూటర్ ముందు కూచుని ఒక్క వాక్యం కూడ రాయలేక రోజంతా ఖాళీ కంప్యూటర్ తెరను చూస్తూ ఉండేవాడు. చివరికి సైకోథెరపీ తీసుకుంటే గాని ఈ మనసులో గుసగుస అదుపులోకి రాలేదు. తుషార్ షోమాను ఏప్రిల్ 28న కలిశాడు. ఆమె విచారంగా, నిరాశగా ఉన్నట్టనిపించింది. తన నిర్బంధం త్వరలో ముగిసిపోయే అవకాశం లేదనే సంపూర్ణమైన ఎరుకతో కలిగిన నిరాశ అది. ఎందుకంటే భీమా కోరేగాం కేసులో విచారణ ప్రారంభం కావడానికి మొదటి మెట్టు అయిన ఆరోపణల నిర్ధారణే ఇంకా జరగలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ʹపౌరహక్కుల పరిరక్షణకూ, మానవ హక్కులను గౌరవించడానికీʹ కట్టుబడి ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ఒక అఫిడవిట్ లో ఇటీవలనే చెప్పింది. షోమా, తుషార్ లకు ఇది ఒక క్రూర పరిహాసంలా ధ్వనించి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి వారిద్దరి 31 సంవత్సరాల వివాహ జీవితంలో ఇద్దరూ కలిసి తొమ్మిది సంవత్సరాలు జైళ్లలోనే గడిపారు. ఆ జైలు నిర్బంధ కాలం ఇంకా సాగుతూనే ఉంది. (సీనియర్ జర్నలిస్టు అజాజ్ అష్రఫ్ ముంబాయి పత్రిక మిడ్ డే లో తన శీర్షిక ʹమండే బ్లూస్ʹ లో మే 16న రాసిన వ్యాసానికి తెలుగు: ఎన్ వేణుగోపాల్) Keywords : bk16, bk15, shomasen, tushar kanth battacharya, varavararao, (2022-12-05 05:39:23) No. of visitors : 396 Suggested Posts మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్ గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది.... ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్ దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నదని కొంత కాలంగా వస్తున్న వార్తలు.. విశ్లేషణలు... నిజాలు.. అబద్దాలు... ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదన్నది నిజం. GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1) జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి.... మే 4 ఉద్యమం - ఒక విద్యార్థి సంచలనానికి వందేళ్లు అది జాతికి విద్రోహం చేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. సామ్రాజ్యవాదంతో కలిసి కుట్ర చేసి దేశ ప్రయోజనాలను అమ్మివేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. అది ఒక విప్లవోద్యమం తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్ హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి..... విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్ కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది. పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల? ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె.... మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్ తెలంగాణ ఎందుకు రావాల్నంటిమంటె నీళ్లనిరి, పైసలనిరి, కొలువులనిరి. నీళ్లు ఇగొ వచ్చె అగొ వచ్చె అని పెగ్గెలే గాని యాడిదాక ఒచ్చినయి? నూరు పైసల పనిల ముప్పై పైసలు గుడ కాకమునుపె దొర అయిపాయె అయిపాయె అని పండుగ జేసిండట గద. ఎనబై వేల కోట్ల రూపాయల పనిల అరవై వేల కోట్లు ఒక్క గుత్తెదారుకె ఇచ్చిండట గద. ఎంత దండి గొట్టిండొ మారాజు. అయినా మా ఊళ్లె నూటికి ముప్పై మందికి భూమే లేక ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్ ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.
వెబ్ సిరీస్ ప్రారంభం నుండి శుభం కార్డు పడేవరకూ అనుక్షణం తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠకు గురిచేసే బెస్ట్ థ్రిల్లర్‌లను ‘జీ 5’ ఓటీటీ ప్రేక్షకులకు అందించింది. వెబ్ వరల్డ్‌ వీక్షకులలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఇటీవల ‘అభయ్’ సీజన్ 2తో వీక్షకులందరూ ఆ సిరీస్ గురించి చర్చించుకునేలా చేసిన ‘జీ 5’, మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎక్స్‌పైరీ డేట్’ రిలీజ్ డేట్ ప్రకటించింది. అక్టోబర్ 2న ఆ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలియజేసింది. స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎక్స్‌పైరీ డేట్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గురువారం ‘జీ 5’ విడుదల చేసింది. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. నిర్మిస్తోందీ సిరీస్. అక్టోబర్ 2న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. రెండు జంటలు, వాళ్లకు సంబంధించిన వివాహేతర సంబంధాల చుట్టూ సాగే కథతో ‘ఎక్స్‌పైరీ డేట్’ రూపొందింది. కథానాయకుల ప్రవర్తనలో కోపం, అసూయ వల్ల వచ్చిన మార్పులు మోసపూరిత, దుర్మార్గపు స్వభావాన్ని బయటపెడతాయి. అప్పుడు కథను మలుపులు తిరుగుతుంది. ప్రధాన పాత్రలో నటించిన టోనీ ల్యూక్ మాట్లాడుతూ “ఇదొక ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్. రొమాన్స్, రివెంజ్, మనిషి పంతాలు పట్టింపులు, మోసం… కథలో చాలా ఉన్నాయి. పాత్రల్లో కూడా వివిధ షేడ్స్ ఉంటాయి. అవి కథనాన్ని ఆసక్తికరంగా మారుస్తాయి. ఆసక్తికరమైన మలుపులతో సిరీస్ సాగుతుంది. ‘జీ 5’ ఈ షోకి గ్లోబల్ రీచ్ ఇస్తోంది. ప్రజలకు ఈ షో నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు. ఈ షోతో డిజిటల్ వరల్డ్‌లో అడుగుపెడుతున్న స్నేహ ఉల్లాల్ మాట్లాడుతూ “జీ5 ఒరిజినల్ సిరీస్ ‘ఎక్స్‌పైరీ డేట్’తో డిజిటల్ అరంగేట్రం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సిరీస్‌లో నేనూ పార్ట్ అవ్వడం ఎగ్జయిటింగ్ గా ఉంది. ప్రతి ఎపిసోడ్ లో వీక్షకులు సస్పెన్స్ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. నా పాత్ర ఇతరులను డామినేటింగ్ చేసేలా, ఆర్డర్లు ఇచ్చేలా ఉంటుంది. తప్పకుండా ఇతరులను ఇబ్బందిపెడుతుంది” అని అన్నారు. ప్రేమ, నమ్మకం, మోసం, ప్రతీకారంతో ముడిపడిన కథాంశంతో ప్రతి ఎపిసోడ్‌లో ప్రేక్షకులు ఊహించని మలుపులతో సీట్ చివర కూర్చుని ఉత్కంఠగా చూసేలా ఈ సిరీస్ ఉంటుందని దర్శకుడు శంకర్ కె. మార్తాండ్ తెలిపారు. మొత్తం పది ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ అక్టోబర్ 2న ‘జీ 5’ ఓటీటీలో రిలీజ్ కానుంది.
ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం జరిగే 3వ టీ20 మ్యాచ్‌ సిరీ్‌సను డిసైడ్‌ చేసే మ్యాచ్‌ కావడంతో అభిమానులు వివిధ మార్గాల్లో టికెట్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 రూ.1500 @ రూ.9 వేలు సికింద్రాబాద్‌/ బోయినపల్లి, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం జరిగే 3వ టీ20 మ్యాచ్‌ సిరీ్‌సను డిసైడ్‌ చేసే మ్యాచ్‌ కావడంతో అభిమానులు వివిధ మార్గాల్లో టికెట్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ మ్యాచ్‌ను మైదానంలో తిలకించడానికి ఉవ్విళ్లూరుతున్న అభిమానుల బలహీనతను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. రూ.1500 టికెట్‌ను బ్లాక్‌లో కొందరు రూ.9వేలకు పైగా విక్రయించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, అనుమానాస్పదంగా కనిపిస్తున్న కొందరు వ్యక్తులు టికెట్లు అమ్ముతుండడంతో వారికి అసలు టికెట్లు ఎలా వచ్చాయనే విషయమై శనివారం జింఖానా మైదానం పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది. కౌంటర్ల వద్ద ప్రత్యేక క్యూ మ్యాచ్‌కోసం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని టికెట్ల కోసం జింఖానా మైదానానికి వస్తున్న వారి కోసం క్యూలను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పికెటింగ్‌లను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ కోడ్‌, ఆధార్‌ కార్డును పరిశీలించిన తర్వాతే అభిమానులను పోలీసులు లోపలికి అనుమతించారు. బ్లాక్‌లో విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్‌ హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న నలుగురిని ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు, ఎల్‌బీనగర్‌ పోలీసులు వేర్వేరుగా అరెస్ట్‌ చేశారు. బోడుప్పల్‌కు చెందిన మచ్చేంద్ర, ఉప్పల్‌కు చెందిన భరత్‌రెడ్డి చైతన్యపురి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి రూ.1500 మ్యాచ్‌ టికెట్లను రూ.6వేలకు విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు వారిని పట్టుకున్నారు. రెండు టికెట్లతోపాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. మరో ఘటనలో నాగోల్‌ వంతెన వద్ద శనివారం రాత్రి వెయ్యి రూపాయల టికెట్‌ను బ్లాకులో రూ.5వేలకు విక్రయిస్తున్నట్లు ఎల్‌బీనగర్‌ పోలీసులకు సమాచారం అందింది. వంతెన వద్ద నిఘా పెట్టి నిందితులైన ఉప్పల్‌, రామంతాపూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వడ్డేపల్లి రాహుల్‌(25)ను, ఎస్‌.గోపీ(26)లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 4 వెయ్యి రూపాయల టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. నేడు అర్ధరాత్రి వరకు బస్సులు, మెట్రో రైళ్లు హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం జరిగే క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చే క్రీడాభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, మెట్రో రైళ్లు నడవనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్ధరాత్రి వరకు బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ యాదగిరి తెలిపారు. బస్సుల సమాచారం కోసం 9959226140, 7893088433 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు. మరోవైపు మ్యాచ్‌ను పురస్కరించుకుని నగరంలో ఆదివారం అర్ధరాత్రి 1.00 గంట వరకు మెట్రో రైళ్లను నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.
మీరు సెల్ ఫోన్ బాగా వాడుతున్నారా ? దీని వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. సెల్ ఫోన్ అతిగా రాత్రి వాడినపుడు మన ఆరోగ్యానికి ప్రమాదం కూడా. దీని వల్ల కాళ్ళు మంటలు ,ఒళ్ళు నొప్పులు, రాత్రుళ్ళు నిద్ర రాకపోవడం మరియు ఉదయం నిద్ర లెవలేకపోవడం మరియు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఎన్నో జబ్బులకు దూరంగా ఉండాలి అంటే ఒకటే మెడిసిన్ ఉంది. అది ఏంటి అంటే మీరు తొందరగా పడుకోవాలి.నిద్ర సరిగా లేకుంటే, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ సరిలేక, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిస్తుందని అది అధిక రక్తపోటుకు దారితీస్తుందని తెలిపారు.ఈ విషయం చాలా మందికి తెలియదు. * పగటి పూట అస్సలు పడుకోకండి. ఎక్కువసేపు కూడా నిద్రపోకూడదు.దీని వల్ల తలపోటు వస్తుంది. * ప్రతీ రోజు ఒకే సమయానికి నిద్ర పోవాలి. మీరు సమయం మారిస్తే అది మీకే ప్రమాదం. * నిద్ర పోయే ముందర టీవీలో సినిమాలూ, సీరియళ్ళు చూడకూడదు. ఎందుకంటే ఇవి చూడటం వల్ల మీ నిద్ర తొందరగా రాదు. * రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కొంచం సేపు ఐన వెలుగులో ఉండాలి. చీకటిలో ఉండే వాళ్ళకి రాత్రి వేళల్లో సరిగా నిద్రపట్టదు. * నిద్రకు ముందు మంచి పాటలను వినాలి. * గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్రపడుతుంది. పాలు తాగండం మర్చిపోకండి. * నిద్రకు ముందు పుస్తకాలు చదవడం వంటివి చేయకూడదు. పుస్తకం చదువుతూ వుంటే అలా మనకు తెలియకుండానే నిద్రపడుతుందని చాలా మంది అంటారు. నిజానికి అది కొంత వరకు మంచి పద్ధతే కానీ ఎక్కువ సేపు చదవకండి.
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ Wycliffe Bible (1395) Prev Next 1. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమియు చెప్పక తన ఆయుధములను మోయు పడుచువానిని పిలిచి అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలివారిని హతముచేయ పోదము రమ్మనెను. 1. And it bifelde in a day, that Jonathas, the sone of Saul, seide to his squyer, a yong man, Come thou, and passe we to the staciouns of the Filisteis, which is biyende that place; `sotheli he schewide not this same thing to his fadir. 2. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మచెట్టు క్రింద దిగియుండెను, అతని యొద్దనున్న జనులు దాదాపు ఆరు వందలమంది. 2. Sotheli Saul dwellide in the laste part of Gabaa, vndur a pumgarnarde tre, that was in the feeld of Gabaa; and the puple as of sixe hundrid men was with hym. 3. షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలీయొక్క కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహీయా ఏఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్లిన సంగతి జనులకు తెలియకయుండెను. 3. And Achias, sone of Achitob, brother of Icaboth, sone of Fynees, that was gendrid of Ely, preest of the Lord in Silo, bar ephod, `that is, the preestis cloth; but also the puple wiste not whidur Jonathas hadde go. 4. యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలివారున్న స్థలము నకు పో జూచిన దారియగు కనుమల నడుమ ఇవతల ఒక సూది గట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను, వాటిలో ఒకదాని పేరు బొస్సేసు రెండవదానిపేరు సెనే. 4. Sotheli bitwixe the stiyngis, bi whiche Jonathas enforside to passe to the stacioun of Filisteis, weren stonys stondynge forth on euer either side, and scarris brokun bifore bi the maner of teeth on ech syde; name to oon was Boses, and name to `the tother was Sene; 5. ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తరపువైపునను, రెండవదాని కొమ్ము గిబియా యెదుట దక్షిణపువైపునను ఉండెను. 5. o scarre was stondynge forth to the north ayens Machynas, and the tother scarre to the south ayens Gabaa. 6. యోనాతానుఈ సున్నతిలేని వారి దండు కాపరులమీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధ ములు మోయువానితో చెప్పగా 6. Forsothe Jonathas seide to his yong squyer, Come thou, passe we to the stacioun of these vncircumcisid men, if in hap the Lord do for vs; for it is not hard to the Lord to saue, ethir in manye ethir in fewe. 7. అతడునీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము. నీ యిష్టాను సారముగా నేను నీకు తోడుగా నున్నానని అతనితో చెప్పెను. 7. And his squyer seide to hym, Do thou alle thingis that plesen thi soule; go whidur thou coueitist, Y schal be with thee, where euer thou wolt. 8. అప్పుడు యోనాతానుమనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకొందము. 8. And Jonathas seide, Lo! we passen to these men; and whanne we apperen to hem, 9. వారు మనలను చూచిమేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన యెడల వారియొద్దకు పోక మనమున్నచోట నిలుచుదము. 9. if thei speken thus to vs, Dwelle ye, til we comen to you; stonde we in oure place, and stie we not to hem. 10. మాయొద్దకు రండని వారు చెప్పినయెడల యెహోవా వారిని మనచేతికి అప్ప గించెనని దానిచేత గుర్తించి మనము పోదమని చెప్పగా 10. Sotheli if thei seien, Stye ye to vs; stie we, for the Lord hath bitake hem in oure hondis; this schal be a signe to vs. 11. వీరిద్దరు తమ్మును తాము ఫిలిష్తీయుల దండుకాపరులకు అగుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిష్తీయులుచూడుడి, తాము దాగియుండిన గుహలలోనుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు 11. `Therfor euer either apperide to the stacioun of Filisteis; and Filisteis seiden, Lo! Ebreis goen out of caues, in whiche thei weren hid. 12. యోనా తానును అతని ఆయుధములను మోయువానిని పిలిచిమేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతానునా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీ యుల చేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయు వానితో చెప్పి 12. And men of the stacioun spaken to Jonathas and to his squyer, and seiden, Stie ye to vs, and we schulen schewe to you a thing. And Jonathas seide to his squyer, `Stie we, sue thou me; for the Lord hath bitake hem in to the hondis of Israel. 13. అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోను కాళ్లతోను ప్రాకి యెక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతనివెనుక వచ్చు అతని ఆయుధములు మోయు వాడు వారిని చంపెను. 13. Forsothe Jonathas stiede crepynge on hondis and feet, and his squyer after hym; and whanne thei hadden seyn the face of Jonathas, summe felden doun bifor Jonathas, his squier killed othere, and suede hym. 14. యోనాతానును అతని ఆయు ధములు మోయు వాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరువదిమంది పడిరి; ఒక దినమున ఒక కాడి యెడ్లు దున్ను అరయెకరము నేల పొడుగున అది జరిగెను. 14. And the firste wounde was maad, which Jonathas and his squyer smoot, as of twenti men, in `the myddil part of lond which a peire of oxun was wont to ere in the dai. 15. దండులోను పొలములోను జనులందరిలోను మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడు గాండ్రును భీతినొందిరి; నేలయదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. 15. And a myracle was don in the castels, and bi the feeldis, but also al the puple of the `stacioun of hem that yeden out to take prey, dredde, and `the castels weren disturblid; and it bifelde as a myracle of God. 16. దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో నున్న సౌలు యొక్క వేగులవారికి కనబడగా 16. And aspyeris of Saul bihelden, that weren in Gabaa of Beniamyn, and lo! a multitude cast doun, and fleynge awei hidur and thidur. 17. సౌలుమీరు లెక పెట్టి మనయొద్ద లేనివారెవరో చూడుడని తనయొద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడును లేరని తెలిసికొనిరి. 17. And Saul seide to the puple that weren with hym, Seke ye, and se ye, who yede awei fro vs. And whanne thei hadden souyt, it was foundun, that Jonathas and his squyer weren not present. 18. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయులయొద్ద ఉండగాదేవుని మందసమును ఇక్కడికి తీసికొనిరమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను. 18. And Saul seide to Achias, Brynge the arke of the Lord; for the arke of God was there in that dai with the sones of Israel. 19. సౌలు యాజకునితో మాటలాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి యెక్కువగా వినబడెను; కాబట్టి సౌలు యాజకునితోనీ చెయ్యి వెనుకకు తీయుమని చెప్పి 19. And whanne Saul spak to the preest, a grete noise roos in the castelis of Filisteis; and it encresside litil and litil, and sownede cleerliere. And Saul seide to the preest, Withdraw thin hond. 20. తానును తనయొద్ద నున్న జనులందరును కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసికొనుచుండిరి. 20. Therfor Saul criede, and al the puple that was with hym; and thei camen `til to the place of batel, and, lo! the swerd of ech man was turned to his neiybore, and a ful grete sleynge was. 21. మరియు అంతకుమునుపు ఫిలిష్తీయుల వశముననున్నవారై చుట్టునున్న ప్రాంతములలో నుండి వారితోకూడ దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలు నొద్దను యోనాతానునొద్దను ఉన్న ఇశ్రాయేలీ యులతో కలిసికొనవలెనని ఫిలిష్తీయులను విడిచిరి. 21. But also Ebreis that weren with Filisteis yistirday and the thridde dai ago, and hadde stied with hem in castels, turneden ayen to be with Israel, that weren with Saul and Jonathas. 22. అదియు గాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. 22. Also alle men of Israel, that hadden hid hem silf in the hil of Effraym, herden that Filisteis hadden fled; and thei felouschipiden hem silf with her men in batel, and as ten thousynde of men weren with Saul. 23. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించెను. యుద్ధము బేతావెను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలిక నొందిరి. 23. And the Lord sauyde Israel in that day. Sotheli the batel cam til to Bethauen. 24. నేను నా శత్రువులమీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అనిసౌలు జనులచేత ప్రమాణము చేయించెను, అందువలన జనులు ఏమియు తినకుండిరి. 24. And men of Israel weren felouschipid to hem silf in that dai; forsothe Saul swoor to the puple, and seide, Cursid be the man, that etith breed `til to euentid, til `Y venge me of myn enemyes. 25. జనులందరు ఒక అడవిలోనికి రాగా అక్కడ నేలమీద తేనె కనబడెను. 25. And al the puple ete not breed. And al the comyn puple of the lond cam in to a forest, in which was hony on the `face of erthe. 26. జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోటపెట్టలేదు. 26. And so the puple entride in to the forest, and flowynge hony apperide; and no man puttide hond to his mouth, for the puple dredde the ooth. 27. అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము వినలేదు. గనుక తన చేతికఱ్ఱ చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. 27. Forsothe Jonathas herde not, whanne his fadir swoor to the puple; and he helde forth the ende of a litil yerde, whiche he hadde in the hond, and dippide in to `a coomb of hony; and he turnede his hond to his mouth, and hise iyen weren liytned. 28. జనులలో ఒకడునీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించిఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు; అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను. 28. And oon of the puple answeride, and seide, Thi fader boond the puple with an ooth, and seide, Cursid be the man that etith breed to dai. Forsothe the puple was feynt. 29. అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయెను; నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి 29. And Jonathas seide, My fadir hath disturblid the lond; ye sien, that myn iyen ben liytned, for Y tastide a litil of this hony; 30. జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్లవలన బాగుగా భోజనము చేసినయెడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసియుందురనెను. 30. hou myche more if the puple hadde ete the prey of hise enemyes, which `prey it foond; whether not gretter veniaunce hadde be maad in Filisteis? 31. ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషునుండి అయ్యాలోను వరకు హతముచేయగా జనులు బహు బడలిక నొందిరి. 31. Therfore thei smytiden Filisteis in that dai fro Machynas `til in to Hailon. Forsothe the puple was maad ful wery; 32. జనులు దోపుడుమీద ఎగబడి, గొఱ్ఱెలను ఎడ్లను పెయ్యలను తీసికొని నేలమీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున 32. and the puple turnede to prey, and took scheep and oxun, and calues; and thei killiden in the erthe; and the puple eet with blood. 33. జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు మీరు విశ్వాస ఘాతకులైతిరి; పెద్ద రాయి యొకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి 33. And thei telden to Saul, and seiden, that the puple etynge with blood hadde synned to the Lord. And Saul seide, Ye han trespassid; walewe ye to me `riyt now a greet stoon. 34. మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి, అందరు తమ యెద్దులను తమ గొఱ్ఱెలను నాయొద్దకు తీసికొనివచ్చి యిక్కడ వధించి భక్షింపవలెను; రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకుడని వారితో చప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరు ఆ రాత్రి తమ తమ యెద్దులను తీసికొని వచ్చి అక్కడ వధిం చిరి. 34. And Saul seyde, `Be ye spred abrood in to the comyn puple, and seie ye to hem, that ech man brynge to me his oxe and ram; and sle ye on this stoon, and ete ye, and ye schulen not do synne to the Lord, `and ete with blood. Therfor al the puple brouyte ech man an oxe in his hond `til to nyyt, and thei killiden there. 35. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. 35. Sotheli Saul bildide an auter to the Lord; and thanne firste he bigan to bilde an auter to the Lord. 36. అంతటమనము రాత్రియందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారువరకు వారిని కలతపెట్టి, శేషించువా డొకడును లేకుండ చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులునీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతట సౌలుయాజకుడు ఇక్కడనే యున్నాడు, దేవునియొద్ద విచారణ చేయుదము రండని చెప్పి 36. And Saul seide, Falle we on the Filisteis in the nyyt, and waste we hem til the morewtid schyne; and leeue we not of hem a man. And the puple seide, Do thou al thing that semeth good to thee in thin iyen. And the preest seide, Neiye we hidur to God. 37. సౌలుఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన యెడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవునియొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక యుండెను. 37. And Saul counselide the Lord, and seide, Whether Y schal pursue Filisteis? whether thou schalt bitake hem in to the hondis of Israel? And the Lord answeride not to him in that dai. 38. అందువలన సౌలుజనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరివలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను. 38. And Saul seide, Brynge ye hidur alle the corneris of the puple, and wite ye, and se, bi whom this synne bifelde to dai. 39. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీ యులను రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమా ణము చేయుచున్నాననెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చిన వాడు ఒకడును లేకపోయెను. 39. The Lord sauyour of Israel lyueth; for if `it is don bi Jonathas my sone, he schal die with out ayen drawyng. At which ooth no man of al the puple ayenseide hym. 40. మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులునీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి. 40. And he seide to al Israel, Be ye departid in to o part, and Y with my sone Jonathas schal be in the tothir part. And the puple answeride to Saul, Do thou that, that semeth good in thin iyen. 41. అప్పుడు సౌలుఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా, దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెను గాని జనులు తప్పించుకొనిరి. 41. And Saul seide to the Lord God of Israel, Lord God of Israel, yyue thou doom, what is, that thou answerist not to dai to thi seruaunt? If this wickidness is in me, ether in Jonathas my sone, yyue thou schewyng; ether if this wickidnesse is in thi puple, yyue thou hoolynesse. And Jonathas was takun, and Saul; forsothe the puple yede out. 42. నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటి పడెను. 42. And Saule seide, Sende ye lot bitwixe me and Jonathas my sone. And Jonathas was takun `bi lot. 43. నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతానునా చేతికఱ్ఱకొనతో కొంచెము తేనె పుచ్చుకొన్న మాట వాస్తవమే; కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను. 43. Forsothe Saul seide to Jonathas, Schewe thou to me, what thou didist. And Jonathas schewide to hym, and seide, Y tastynge tastide a litil of hony `in the ende of the yerde, that was in myn hond; and lo! 44. అందుకు సౌలుయోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు, నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. 44. Y die. And Saul seide, God do to me these thingis, and adde `these thingis, for thou, Jonathas, schalt die bi deeth. 45. అయితే జనులు సౌలుతోఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగ జేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవము తోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి. మత్తయి 10:30, లూకా 21:18, అపో. కార్యములు 27:34 45. And the puple seide to Saul, `Therfor whethir Jonathas schal die, that dide this greet helthe in Israel? this is vnleueful; the Lord lyueth; noon heer of his heed schal falle in to erthe; for he wrouyte with God to dai. Therfor the puple delyuerede Jonathas, that he diede not. 46. అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్లిపోగా ఫిలిష్తీయులు తమ స్థలమునకు వెళ్లిరి. 46. And Saul yede a wey, and pursuede not Filisteis; sotheli Filisteys yeden in to her places. 47. ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధి కారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మాయాబీయులతోను అమ్మోనీయులతోను ఎదోమీ యులతోను సోబాదేశపు రాజులతోను ఫిలిష్తీయులతోను యుద్ధము చేసెను. ఎవరిమీదికి అతడు పోయెనో వారి నందరిని ఓడించెను. 47. And Saul, whanne the rewme was `confermyd on Israel, fauyt bi cumpas ayens alle hise enemyes, ayens Moab, and the sones of Amon, and Edom, and ayens the kyngis of Soba, and ayens Filisteis; and whidur euer he turnede hym, he ouercam. 48. మరియు అతడు దండునుకూర్చి అమాలేకీయులను హతముచేసి ఇశ్రాయేలీయులను కొల్ల సొమ్ముగా పెట్టినవారి చేతిలో నుండి వారిని విడిపించెను. 48. And whanne the oost was gaderid, he smoot Amalech; and delyuerede Israel fro the hond of hise distrieris. 49. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా, యోనా తాను ఇష్వీ మెల్కీషూవ; అతని యిద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదానిపేరు మేరబు చిన్న దానిపేరు మీకాలు. 49. Forsothe the sones of Saul weren Jonathas, and Jesuy, and Melchisua; the names of hise twei douytris, name of the firste gendrid douyter was Merob, and name `of the lesse douyter was Mycol. 50. సౌలుయొక్క భార్యకు అహీనోయమని పేరు, ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు, ఇతడు సౌలునకు పిన తండ్రియైన నేరు కుమారుడు. 50. And name of `the wijf of Saul was Achynoem, the douytir of Achymaas; and the name of the prince of his chyualrye was Abner, sone of Ner, brother of the fadir of Saul. 51. సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రి యగు నేరును అబీయేలు కుమారులు. 51. Forsothe Cys was the fadir of Saul; and Ner, the sone of Abiel, was fadir of Abner. 52. సౌలు బ్రదికిన దినములన్నియు ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరుగగా తాను చూచిన బలాఢ్యుల నందరిని పరాక్రమశాలులనందరిని తనయొద్దకు చేర్చుకొనెను. 52. Sotheli myyti batel was ayens Filisteis in alle the daies of Saul; for whom euere Saul siy a strong man and schapli to batel, Saul felouschipide to him silf that man. Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
బాలీవుడ్ ఇండస్ట్రీ పని అయిపోయిదంటూ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్న వార్తలపై నిర్మాత కరణ్ జోహర్ స్పందించారు. అవి కేవలం పనికిరాని మాటలు మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడమనేది పెద్ద సవాలుగా మారిందని.. కానీ మంచి చిత్రాలు మాత్రం ఎప్పటికీ హిట్ అవుతాయని తెలిపారు. Karan Johar Comments On Bollywood: 'పుష్ప', 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'కేజీయఫ్‌-2' సినిమాలు బాలీవుడ్‌పై దండయాత్ర చేశాయి. అక్కడి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టి కోట్ల రూపాయలను వసూలు చేశాయి. కానీ హిందీ సినిమాలు మాత్రం ఒకట్రెండు మినహా అన్నీ బోల్తా కొట్టాయి. పెద్ద హీరోల సినిమాలకు కూడా ప్రేక్షకాదరణ పెద్దగా దక్కలేదు. దీంతో ఇక బాలీవుడ్‌ పని అయిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ స్పందించారు. "పనికిరాని చెత్త​ మాటలు మాట్లాడుతున్నారు. మంచి సినిమాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయి. 'గంగూబాయ్​ కతియావాడి', 'భూల్‌ భులాయా 2' సినిమాలు భారీ హిట్‌ కొట్టాయి. అలాగే 'జుగ్‌ జుగ్‌ జియో' మూవీ కూడా బాగానే ఆడింది. సరైన కంటెంట్‌ లేని సినిమాలు మాత్రమే బెడిసికొడతాయి. అయినా ఇప్పుడు మన దగ్గర చాలా సినిమాలు లైన్‌లో ఉన్నాయి. 'లాల్‌ సింగ్‌ చడ్డా', 'రక్షా బంధన్‌', 'బ్రహ్మాస్త్ర', రోహిత్‌ శెట్టి మూవీ, ఏడాది చివర్లో సల్మాన్‌ సినిమా ఉంది. ఈ చిత్రాల కోసం మనం ఎదురుచూడాలి." -- కరణ్​ జోహర్​, ప్రముఖ నిర్మాత ప్రస్తుత రోజుల్లో థియేటర్లకు జనాలను రప్పించడం అంత సులువేమీ కాదని కరణ్​ జోహర్​ అన్నారు. "సినిమా ట్రైలర్‌, ప్రచారం అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అంతే కాకుండా మనం మన పేరుప్రతిష్ఠలపై బతుకుతున్నాం. కొన్నిసార్లు అది ఒత్తిడిగా అనిపిస్తుంటుంది" అంటూ చెప్పుకొచ్చారు కరణ్‌ జోహార్‌. 'జుగ్‌ జుగ్‌ జియో' చిత్రం కరణ్‌ జోహార్‌ సొంత బ్యానర్‌లోనే తెరకెక్కింది. గత నెలలో విడుదల​ అయిన ఈ మూవీ దాదాపు రూ.84 కోట్లు వసూళ్లు రాబట్టింది. 'గంగూబాయ్‌ కతియావాడి'కి రూ.180 కోట్లు రాగా 'భూల్‌ భులాయా 2' రూ.250 కోట్లను కొల్లగొట్టింది. ఇదే సమయంలో భారీ సినిమాలు సల్మాన్‌ ఖాన్‌ 'అంతిమ్‌', అజయ్‌ దేవ్‌గణ్‌ 'రన్‌వే 34', అక్షయ్‌ కుమార్‌ 'సామ్రాట్‌ పృథ్వీరాజ్‌', రణ్‌బీర్‌ కపూర్‌ 'షంషేరా' చిత్రాలు బోల్తా కొట్టాయి.
2 దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతి యును శుభమనిచెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. 3 పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణనుబట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమను గూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, 4 మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 5 మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు ఇంతకుముందు వింటిరి. 6 ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్నది. 7 ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసునివలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. 8 అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు; అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. 9 అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముగనులవారును, 10 ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, 11 ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, 12 తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము. 13 ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను. 14 ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. 15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. 16 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. 17 ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 18 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను. 19 ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, 20 ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొన వలెననియు తండ్రి అభీష్టమాయెను. 21 మరియు గతకాల మందు దేవునికి దూరస్థులును, మీ దుష్‌క్రియలవలన మీ మనస్సులో విరోధభావముగలవారునై యుండిన మిమ్మును కూడ 22 తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. 23 పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచి యుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. 24 ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. 25 దేవుని వాక్యమును, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రక టించుటకు, 26 మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యేర్పాటు5 ప్రకారము, నేను ఆ సంఘమునకు పరిచార కుడనైతిని. 27 అన్యజనులలో ఈ మర్మముయొక్క మహి మైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను6 సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ం 28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. 29 అందు నిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.
శుభోద‌యం సుబ్బారావు, అజ‌య్ ఘోష్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘రుద్ర‌మాంబ‌పురం’. మూల‌వాసుల క‌థ అనేది ట్యాగ్‌లైన్‌. ఎన్‌వీఎల్ ఆర్ట్స్ ప‌తాకం పై నందూరి రాము నిర్మిస్తున్నారు. మ‌హేష్ బంటు ద‌ర్శ‌కుడు. కథే ఏ […] Category: సినిమా by Veerni Srinivasa RaoLeave a Comment on ‘రుద్ర‌మాంబ‌పురం’ ఫ‌స్ట్‌ లుక్‌, మోష‌న్‌ పోస్ట‌ర్‌ విడుదల ఆంధ్ర ప్రదేశ్ 4 hours ago Ambati Counter: ఇదేం ఖర్మ చంద్రబాబుకు: అంబటి ఫైర్ ప్రతిపక్ష నేత చంద్రబాబు పద్దతిగా మాట్లాడాలని, నాలుక అదుపులో ఉంచుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు....
మహిళల్లోని అమితమైన శక్తిని వెలికి తీసేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమమే బాలిక శక్తి సంగమం అని శ్రీ సరస్వతీ విద్యా పీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400 దాకా విద్యాలయాలను సేవ భావనతో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. స్వర్ణోత్సవాల్లో భాగంగా బాలికా శక్తి సంగమం పేరుతో వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి వేలాది […] దేశ ప్ర‌జ‌లంద‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగం ముఖ్య‌ ఉద్దేశం – శ్రీ ఇంద్రేష్ జీ దేశ ప్ర‌జ‌లంద‌ర‌నీ ఒక్క‌టిగా చేయ‌డ‌మే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశ‌మ‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ కార్య కారిణి సభ్యులు శ్రీ ఇంద్రేష్ జీ అన్నారు. సామాజిక సమరసతా వేదిక, ముస్లిం రాష్ట్రీయ మంచ్, SC/ST హక్కుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాకిర్ హుస్సేన్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 న ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా సామాజిక సమరసతా వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ జి స్వయంగా రాసిన […] 26/11 ముంబై ఉగ్ర‌దాడి: “హిందూ తీవ్రవాద” కుట్ర‌ను వ‌మ్ము చేసిన తుకారం ఓంబ్లే తెగువ‌ స‌రిగ్గా 14ఏళ్ల క్రితం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో పాకిస్తాన్ తీవ్ర‌వాదుల జ‌రిగిన‌ ఎడతెగని కాల్పుల్లో 58 మంది చనిపోయారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. AK-47 రైఫిల్స్‌తో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వారిలో పాకిస్తాన్‌కు చెందిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్ద‌రు తీవ్ర‌వాదులు హిందువుల‌కు వ్యతిరేకంగా జిహాద్ చేయడానికి ప్రేరేపించబడ్డారు. వీరిద్ద‌రూ పాదచారులను, పోలీసులను చంపడం ద్వారా వీధుల్లోకి వెళ్లారు. రోగులను చంపాలనే ఉద్దేశ్యంతో కామా ఆస్ప‌త్రిని […] మన రాజ్యాంగంలోకి `లౌకితత్వం’ ఎలా వచ్చింది? ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రగతిశీలమైన రాజ్యాంగం మనదేశ రాజ్యాంగం. దీన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజే నవంబర్ 26. 1949 నవంబర్ 15న రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు డా. బి. ఆర్ అంబేద్కర్. ఆ మరుసటి రోజున రాజ్యాంగ సభ రాజ్యాంగ ప్రతికి ఆమోదం తెలిపింది. అయితే భారత ప్రభుత్వం నవంబర్ 19, 2015న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి అధికారికంగా 2015 నుంచి నవంబర్ 26ను సంవిధాన్ […] భారత రాజ్యాంగం హిందూ హృదయం వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్‌లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు. ఈ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతి నిత్యం నిర్థారణ అవుతున్నా దానిని కాదనడం సెక్యులరిస్టులమని చెప్పుకునే వారికి అలవాటు. అయితే హిందుత్వపు ప్రాతిపదికను స్వాతంత్య్రోద్యమ నాయకులు అందరూ గుర్తించారు, గౌరవించారు. […] FIFA ప్రపంచ కప్ ప్రారంభోత్స‌వానికి జాకీర్ నాయక్ కు అధికారిక ఆహ్వానం పంపలేదు – ఖ‌తర్ `మత నిష్టను’ ప్రదర్శించడంలో చాలా చురుకుగా ఉండే ఖతార్ ఇప్పుడు అదే విషయంలో ఇరుకున పడింది. ప్రపంచ ఫుట్ బాల్ పోటీల ప్రారంభోత్సవానికి మతమౌఢ్య బోధకుడు జాకీర్ నాయక్ కు ఆహ్వానం పలికిన ఆ దేశం భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపడంతో వివరణ ఇచ్చుకుంది. జాకీర్ నాయక్ ను అధికారికంగా ఆహ్వానించలేదని సంజాయిషీ తెలుపుకుంది. మ‌నీలాండ‌రింగ్ , తీవ్రవాద కార్యకలాపాలకు పాల్ప‌డి భారత నుంచి పారిపోయిన, రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్‌కు నవంబర్ 20, 2022న […] VIDEO: కేర‌ళ వ‌న‌వాసీ వీరుడు “తలక్కల్ చందు” ప్రథమ స్వతంత్య్ర సంగ్రామానికి పూర్వమే సుమారు ఐదు దశాబ్దాల క్రితం కేరళలోని వాయనాడ్ ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ వారికి, కురిచ్చా వనవాసీ వీరులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. గెరిల్లా పద్ధతిలో కొనసాగించిన ఈ యుద్ధంలో వీరమరణం పొందిన నాయకుడు తలక్కల్ చందు. సుమారు పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్థంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక జమిందారులు, రాజులు పలువురు పోరాడారు. ఆ క్రమంలోనే ఈస్టిండియా కంపెనీ ఆగడాలకు కేరళ వనవాసీ […] “మ‌న అస‌లు చ‌రిత్ర‌ను యువ‌త తెలుసుకోవాలి” యువ‌స‌మ్మెళ‌నంలో వ‌క్త‌లు నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల్లో భాగంగా ఏడాది పాటు జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల్లో న‌వంబ‌ర్ 24 గురువారం రోజున భువ‌న‌గిరి ప‌ట్ట‌ణంలోని సాయి క‌న్వేన్ష‌న్ హాల్‌లో యువ స‌మ్మెళ‌నం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమానికి వ‌చ్చిన వ‌క్త‌ల‌లో ఒక‌రైన ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ గారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం కోసం అనేక మంది బలిదానాలు చేశార‌న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రాలేదని, ఈ […] రాయ‌గూడెంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వ‌ర్యంలో “కార్తీక దీపోత్సవం” సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేల కొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 21 సోమవారం ఘనంగా జరిగింది. సుమారు చుట్టు ప్రక్కల 10 గ్రామాల నుండి 3000 పైగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలా నంద భారతి స్వామీజీ ఆశీ:ప్రసంగం చేస్తూ, కులభేదాలు లేకుండానే 5 వేల సంవత్సరాల క్రితం అందరూ గాయత్రి మంత్రం చదివే వారని గుర్తు […] హైదరాబాద్ వేదికగా అద్భుతమైన బాలికా సంగమం వేలాది బాలికల అరుదైన శక్తి సంగమం కార్యక్రమానికి హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చిన బాలికలతో శక్తి సంగమం నిర్వహించబోతున్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని కాన్హా శాంతివనంలో జరిగే ఈ కార్యక్రమానికి అనేక వేల మంది బాలికలు […]
నేను నా పాత కంపెనీ లో పని చేసేప్పుడు , విజయ్ కుమారు గారని ఉండేవారు . ఆయన స్వతః తమిళుడు . చిన్నపుడే వచ్చి వరంగల్ లో స్థిరపడ్డారు. ఆయన చుట్టాలు అంతా తమిళనాడు లో ఉన్నారు. అవి పోయిన ఏడాది జనవరి రోజులు. తెలంగాణా ఉద్యమం రాజకీయ నాయకుల నుంచి విద్యార్ధులకి పాకుతున్నది. కెసిఆర్ గారు ఆంధ్రులని(తెలుగు వాళ్ళని కాదు కోస్త ఆంధ్ర వాళ్ళని) మాటలతో నరకడం , బొంద పెట్టడం చేస్తున్నారు.ఆ పిచ్చి ని (బహుశా పిచ్చి మాకేనేమో ) చూసి అంతా నవ్వుకునే వాళ్ళం. విజయ్ గారు కూడా “ఎంటండి వీళ్ళు చెప్పేది , ప్ర్రత్యేక రాష్ట్రము వస్తే చదువు లేని వాడికి ఉద్యోగం ఇస్తారా , పెట్రోలు ,రెంట్లు తగ్గిస్తారా . మద్య తరగతి , బీదవాడి బ్రతుకులు ఎప్పటికి మారవు ” అనే వారు.ఆయన ప్రతి వారాంతం హైదరాబాద్ నుంచి వరంగల్ కి రైల్లో ప్రయాణం చేసేవారు.ఓ సోమ వారం అందరం భోజనం చేస్తున్నాం. ఆ రోజు వార్తల్లో “తెలంగాణా కోసమని ఓ విద్యార్ధి బలి ”అని చదివాను.మనసు వికలమైంది. వీళ్ళని ఎందుకు ఉద్యమం లోకి లాగారండి అన్నాను.విజయ్ గారి గొంతులో మార్పు “మాది మాకు కావాలండి.తెలంగాణా ఇవ్వల్సినదే.” ఎందుకు సర్ అంటే అదంతా తెలీదు కావాలి అంతే. అన్నారు.పోను పోను ఆఫీసు లో మనం అనే మాట కన్నా మీరు మేము అనే మాట వినపడడం సాధారణం అయింది. నాకు ఓ స్నేహితుడు ఉన్నాడు. తను నల్గొండకి చెందినవాడు. మమ్మల్ని సరదాగా ఆట పట్టించే వాడు “మీరంతా అన్నీ సర్దుకొని ఉండండి రోయ్” అని. తను అప్పుడు బెంగుళూరు లో ఓ పెద్ద కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఓ రోజు విజయవాడ లో రైలు ఎక్కాము . వైజాగ్ నుంచి కిక్కిరిసి వస్తుంది. వరంగల్లు రాగానే ఓ ఆమె ఎక్కి “ఈ ఆంధ్ర , సీమ వాళ్ళని దిన్చేస్తే సరిపోద్ది ఫ్రీ గ వెళ్ళ వచ్చు ” అంది. ఎవ్వరు కిక్కురుమనలేదు. గొడవ జరిగేప్పుడు , ఎవ్వరు బండి ఆపి AP అని చెరిపి TG అని రాస్తారో అని భయం. మళ్ళి traffic వాడు పట్టుకుంటే చలానా కట్టలిగా. నిన్న శనివారం బయటకి వెళ్తున్నా. ఓ ౩౦ మంది విద్యార్దులు నినాదాలు చేసుకుంటూ వెళ్తున్నారు. “తెలంగాణాకి అడ్డం వస్తే అడ్డం గ నరికేస్తం ”అని . “ఆంధ్ర వాళ్ళని ” అని తగిలించాడో పసుపు చొక్క వేసుకున్న విద్యార్ధి. కొబ్బరి బొండం తాగాలని ఓ బండి దగ్గర ఆగాను.భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళది రాజమండ్రి ల ఉంది,యాస అలానే ఉంది. ఒక తాగు బోతువాడు వచ్చి విసిగిస్తున్నాడు.ఒక సారి ఇక్కడే తాగుతాను, ఇంటికి తీసుకెళ్త అని. సర్ది చెప్పేందుకు ఇబ్బంది పడుతుంది ఆమె.పక్కన ఉన్న ఓ కుర్రవాడు “ఎందుకయ్య గొడవ వెళ్ళు ” అని సర్ది చెప్పబోయాడు. “జై తెలంగాణా వస్తుంది, మీరు మొత్తం వెళ్లి పోతారు, నాకు ఇక్కడ MLA తెల్సు ” అన్నాడు. పాపం ఆ దంపతులు తమ భాష దాచుకునేందుకు పడే బాధ చూసి జాలనిపించింది. “అయ్యా, మా ఊర్లో మంచి ఆసుపత్రి లేదు, మంచి కాలేజి లేదు , ఉద్యోగం చేయడానికి పెద్ద కంపెనీ లు లేవు, వ్యవసాయం చేస్తే గిట్టు బాటు ధర లేదు.పొట్ట చేత బట్టుకుని వచ్చాం.
అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు సుప్రీం తీర్పు తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు గుంటూరు కు బయలు దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌లాస‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యం ప్రారంభం టీడీపీని నడిపేది ఆ రెండు పత్రికలు, టీవీలే మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం నీ మాట‌లు తెలుగువారందరినీ అవమానించినట్టేనయ్యా.. లోకయ్యా! You are here హోం » టాప్ స్టోరీస్ » గడప గడపకూ వెళ్లే ధైర్యం చంద్రబాబుకు ఉందా..? గడప గడపకూ వెళ్లే ధైర్యం చంద్రబాబుకు ఉందా..? 01 Oct 2022 1:27 PM టీడీపీ వాగ్దానాల అమలుపై రాసే ధైర్యం ఎల్లోమీడియాకు ఉందా..? ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై బురదజల్లే రాతలు ఎందుకు..? మూడేళ్లలో మేనిఫెస్టోలోని అంశాలు 94 శాతానికిపైగా అమలు చేశాం మేనిఫెస్టోను గడప గడపకూ తీసుకెళ్తున్న ఏకైక ప్రభుత్వం మాది రాష్ట్రం, పోలవరం సర్వనాశనం కావాల‌ని, అమరావతి దేదీప్యమానంగా వెలగాలని బాబు, ఎల్లోమీడియా కుట్ర పోలవరంంతో ఎవ్వరికీ ఏ విధమైన పేచీలు లేవు ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లి: టీడీపీ హయాంలో ప్రజలకు ఇంత మేలు చేశామని గడప గడపకూ వెళ్లి చెప్పే ధైర్యం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ఉందా..? 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుపై రాసే దమ్ము ఎల్లో మీడియాకు ఉందా..? అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎంతసేపూ ప్రజలకు మేలు చేస్తున్న వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై బురదజల్లే ప్రయత్నం.. పోలవరం నాశనమైపోయింది.. రాష్ట్రం శ్రీలంకలా మారిపోతుందని దుష్ప్రచారం చేయడం చేయడమే చంద్రబాబు, రామోజీరావు వారికి సంబంధించిన గ్యాంగ్‌ పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 వాగ్దానాలపై రాసే దమ్ము ఎల్లో మీడియాకు ఉందా..? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి ఏం మాట్లాడారంటే.. ‘ప్రతీ ఇంటికి ప్రభుత్వం ఏ విధంగా సహాయపడిందో గడప గడపకూ వెళ్లి చెబుతున్నాం. మాకు ఓటు వేసిన వారి ఇంటికీ, ఓటు వేయని వారి ఇంటికీ, మమ్మల్ని ఓడించాలని ప్రయత్నం చేసిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తల ఇళ్ల ముందుకు వెళ్లి కూడా చెబుతున్నాం. మా ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల కాలంలో మేనిఫెస్టోలోని 94 శాతం పైచిలుకు వాగ్దానాలను అమలు చేసింది. అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, ఆసరా, చేయూత, వాహన మిత్ర, చేదోడు ఇలా వరుసగా లెక్కగట్టి ఇంటింటికీ వెళ్లి చెబుతున్నాం. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇంత జవాబుదారీతనంగా ప్రజల ముందుకు వెళ్లి చెప్పిన సంఘటన గతంలో ఎప్పుడూ లేదు. అంతటి గొప్ప కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ రూపుదిద్ది అధికారులను, ప్రజాప్రతినిధులను ఇంటింటికీ పంపిస్తున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం రివ్యూ చేసి.. అనేక విషయాలను చర్చించారు. మా రాజకీయ శత్రువర్గం ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ దానికి అనుగుణంగా ఉన్న రాజకీయ పక్షాలు వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు 600లకు పైగా వాగ్దానాలు చేశాడు.. మా ప్రభుత్వంలో ఇన్ని పథకాలు అమలు చేశామని, సీఎం వైయస్‌ జగన్‌ కంటే గొప్పగా పరిపాలన చేశామని చంద్రబాబు ఇంటింటికీ వెళ్లి చెప్పగలడా..? రైతు రుణమాఫీ చేస్తామని చెప్పాం.. తాకట్టుపెట్టిన బంగారం ఇంటికి చేరుస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చామని చంద్రబాబు చెప్పగలడా..? ఇలాంటి విషయాలను ఎల్లో మీడియా ఎందుకు ఎక్కడా ప్రస్తావించదు. మేనిఫెస్టోను గడప గడపకూ తీసుకెళ్తున్న మా ప్రభుత్వం మీద ఎందుకు బురదజల్లుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి గురించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఎల్లో మీడియా ఎక్కడా రాయదు. రామోజీరావు, ఆంధ్రజ్యోతి పోలవరం సర్వనాశనం అయిపోయిందని రాస్తారు.. ఆంధ్రప్రదేశ్‌ శ్రీలంకలా అయిపోవాలని వారి కోరిక. గుంటూరుకు, విజయవాడకు సంబంధం లేకుండా వారి బినామీ భూముల్లో పెట్టిన అమరావతి దేదీప్యమానంగా వెలిగిపోవాలి.. దాని మీద లక్షల కోట్లు ఖర్చు చేసి ఈ ప్రభుత్వం బాగుచేయాలి.. ఒక్కో గజం లక్ష రూపాయలకు అమ్మేలా చేస్తే.. డబ్బు సంపాదించుకునే కార్యక్రమం మా నాయకులు, కార్యకర్తలు చేస్తారనే స్థాయికి చంద్రబాబు, ఎల్లో మీడియా వెళ్లిపోయింది. చంద్రబాబు 600పైగా వాగ్దానాలు చేసి.. ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. పోలవరం గురించి ఎల్లో మీడియా పిచ్చిపిచ్చిగా రాతలు రాస్తోంది. ఉమ్మడి సర్వేకు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా అని ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ఒకాయన రాశాడు. పోలవరం గురించి కేంద్రం ఎందుకు సమావేశం ఏర్పాటు చేసిందంటే.. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాయి. అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్‌ వేస్తే.. కేంద్రం జోక్యం చేసుకోవాలని కోర్టు సూచించింది. కేంద్రం సమావేశం ఏర్పాటు చేసింది. ఉమ్మడి సర్వే చేయాల్సిన అవసరం లేదు. భద్రాచలానికి ముప్పే లేదు అని కేంద్రం స్పష్టంగా చెప్పింది. 2009, 2011లోనే అన్నింటికీ క్లియరెన్స్‌లు వచ్చాయి. కేంద్ర జలవనరుల శాఖ, సీడబ్ల్యూసీ స్టడీ చేసి అన్ని క్లియరెన్స్‌లు ఇచ్చేశాయి. అయినా పోలవరంలో ఏదో జరిగిపోతుందని ఉమ్మడి సర్వేకు పట్టు.. పోలవరంపై కేంద్రాన్ని కోరిన పొరుగు రాష్ట్రాలు అని హెడ్డింగ్‌ పెట్టి గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. పోలవరంపై ఎవ్వరికీ ఏ విధమైన పేచీలు లేవు’ అని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
Sarva Sambhavam P.V.R.K.Prasad Emesco సర్వసంభవామ్ పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌ ఎమెస్కో Spiritual Religious స్పిరిచ్యువాలిటి ఆధ్యాత్మికం Aadhyatmikam రెలిజియస్ డెవోషనల్ Devotion మతం Religion Tirupati Tirumala T.T.D. Let your friends know Description Reviews (4) తిరుమలేశుని సన్నిధిలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నప్పుడు పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ గారు పొందిన దివ్యానుభవాల మాలిక ఈ పుస్తకం. మహిమాన్వితమైన సంకల్పం, ప్రగాఢమైన విశ్వాసం ఈ అనుభవాలకు ఆధారాలు. భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, మహానుభావులైన మన పూర్వ కవులు మనకు సంపూర్ణ వ్యక్తిత్వంగల ఒక రాముణ్ణి, ఒక కృష్ణుడిని అందించారు. ద్వైత, అద్వైత, విశిష్ఠాద్వైత, శాక్తేయాది సర్వ భారతీయ మత శాఖలు ఒకరేమిటి అందరూ తమవాడిగా, తమకు ఆరాధ్యుడుగా భావించే తిరుమలేశుడు భారతీయుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచాడు. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ప్రస్తావనకురాని శ్రీ వేంకటేశ్వరుడు భారతీయులందరి విశ్వాసాన్ని చూరగొన్న ఆరాధ్య దైవం.
సాక్షి, హైదరాబాద్ : 2016-17 రాష్ట్ర బడ్జెట్ మొత్తం అభూత కల్పనలేనని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభలో ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్‌పై తన చాంబర్‌లో విలేకరులడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానమిచ్చారు. బడ్జెట్ అంత ఆశాజనకంగా ఏమీ లేదని పెదవి విరిచారు. ఇది ప్రజా బడ్జెట్ అని అధికారపక్షం పేర్కొనడం సరికాదన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడి రుణం తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు (జీఎస్‌డీపీ)ని 10.99గా చూపించారని ఆక్షేపించారు. జీడీపీ రూ.6 లక్షల కోట్లు చూపించారని, దానివల్ల రూ. 20 వేల కోట్ల మేరకు రుణం తెచ్చుకునే సదుపాయం ఉంటుందని తెలిపారు. అందుకే రాబడులకు సంబంధించిన వివరాలను కూడా లేనివి ఉన్నట్లుగా చూపించారని విమర్శించారు. జీఎస్‌డీపీ ఎక్కువ చూపిస్తే రుణాలు ఎక్కువ తెచ్చుకోవచ్చని ఆశపడ్డారని తెలిపారు. వడ్డీలేని, పావలా వడ్డీ రుణాలకు రూ.177 కోట్లా? రైతులకు ఇచ్చే వడ్డీలేని, పావలా వడ్డీ రుణాలకు రూ. 177 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమని జగన్ దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ పథకానికి ఈ ఏడాది కూడా రూ.3,500 కోట్లు మాత్రమే కేటాయించడం మరీ అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబునాయుడు సీఎం అయ్యేనాటికి ఉండిన రైతుల రుణాలు రూ.87,612 కోట్లు. ఈ రెండేళ్లకే ఆ మొత్తం మీద వడ్డీయే రూ.25,000 కోట్లు అయ్యింది. ఈ ఏడాది కూడా కలుపుకుంటే మొత్తం 36 నెలలకు గాను సుమారు రూ 40,000 కోట్లకు అటూ ఇటూగా వడ్డీ పెరుగుతుంది. వడ్డీయే ఇంత మొత్తం ఉంటే ైరె తుల రుణమాఫీకి గాను ఇప్పటివరకూ ప్రభుత్వం ఇచ్చింది మొత్తం రూ.7,400 కోట్లే. ఈ ఏడాది రూ. 3,500 కోట్లు ఇస్తామంటున్నారు’’ అని చెప్పారు. ఇదంతా కలిపినా రుణాలపై వడ్డీలో మూడో వంతు మొత్తం కూడా కాదని ఆయన విమర్శించారు. అంచనాలు.. సవరించిన అంచనాలు రెండూ మారలేదు కోర్ డాష్ బోర్డులో పెట్టిన దాంట్లోనే సగటున నెలకు రూ.3,500 కోట్లు రాబడులుంటాయని పేర్కొన్నారని, ఆ ప్రకారం పన్నుల ద్వారా వచ్చే రాబడి, పన్నేతర మార్గాల నుంచి వచ్చే రాష్ట్ర రాబడి మొత్తం రూ.42వేల కోట్లుగా ఉంటుందని జగన్ తెలిపారు. 2015-16 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాల్లో మార్పే లేదన్నారు. కేంద్ర పన్నుల నుంచి వచ్చే రాష్ట్ర వాటా మాత్రమే మారిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో రూ.22,637 కోట్లు చూపిస్తే... రాష్ట్రంలో రూ.21,893 కోట్లు చూపించారని, మిగిలిన వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి మార్చలేదని విమర్శించారు. కోర్ డాష్‌బోర్డులో ఏ మేరకు రాబడులు (రెవెన్యూ) వచ్చాయనేది కనిపిస్తూ ఉన్నా, సవరించిన అంచనాల్లో సుమారు రూ.50 వేల కోట్లు చూపించారని చెప్పారు. ఈ మొత్తం రూ.44,423 కోట్లు (ట్యాక్స్), రూ.5,341 కోట్లు (నాన్‌ట్యాక్స్) రెవెన్యూగా ఉందన్నారు. బడ్జెట్ పుస్తకాన్ని విలేకరులకు చూపిస్తూ... ఇందులో 2014-15 సంబంధించిన కార్యాచరణను కూడా చూపించలేదన్నారు. ఎంతయితే రాబడులు వచ్చాయో అవే చూపించాల్సి ఉంటుంది కనుక ఆ కాలమే ఎత్తేశారని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తప్ప బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలు రెండూ ఒకే మాదిరిగా ఉన్నాయని ఆయన తెలిపారు. బీసీలకు కేటాయింపులు తక్కువే... వెనుకబడిన తరగతుల వారికి రూ.30 వేల కోట్లు ఇవ్వాలని జగన్ అభిప్రాయపడ్డారు. ‘‘అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర తొలి ఏడాది బీసీల సంక్షేమానికి రూ 2,200 కోట్లు కేటాయించామన్నారు. రెండో సంవత్సరం రూ 2,700 కోట్లు కేటాయించామన్నారు. ఈ రెండూ కలిపితే రూ 5,000 కోట్లు అవుతుంది. ఈ ఏడాదిలో రూ 4,800 కోట్లు పెట్టామని చెప్పారు. దీన్ని బట్టి బీసీల సంక్షేమంపై వారికెంత శ్రద్ధ ఉందో అర్థం అవుతుంది’’ అని ఆయన చెప్పారు.
ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా పలువురు వైసీపీ నేతల సరస సల్లాపాల ఆడియోలు వీడియోలు ఏపీని ముంచెత్తుతున్నాయి. ఒకాయన అయితే ఏకంగా బట్టలిప్పి మరీ బరితెగించాడని లోకం కోడై కూసింది. పొద్దుపొద్దున్నే ఆ వీడియో చూసి జనం జడుసుకున్నారు కానీ వారు మాత్రం హాయిగా తిరిగేస్తున్నారు. పైగా ఎదుటి వారి మీద నిందలు వేసి నవ్వుకుంటున్నారు. సంజన సుకన్యల ప్రియుడు అయితే అసలు తగ్గేదేలే అన్నట్లు సరసాలు ఆడుతుంటాడు. వైసీపీ నేతలకు ఇంత కామం ఎందుకో అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు… ఇంతలో గతంలో రచ్చ లేపిన రసిక ప్రియుడు మళ్లీ సరసాలు ఆడుతున్నట్లు ఒక ఆడియో లీక్ అయ్యింది. పొద్దున్నుంచి సోషల్ మీడియా నిండా అదే ఆడియో రచ్చ లేపుతోంది. అయితే ఆడియో సాక్ష్యాలను కోర్టులు నమ్మవు కాబట్టి యథేచ్ఛగా యవ్వారం సాగుతోంది. అయినా వీడియో దొరికినా అధినాయకుడు వేటు వేయడం లేదు, ఇక ఆడియో దొరికితే లాభమేంటి? అని తర్వాత అనుకుందురు గాని ఆ ఆడియోలో ఏముందో వినండి.
మనలో కొంతమంది "నేను యేసు క్రీస్తును నమ్ముకున్నానండి " అని గర్వంగా చెప్పుకోవచ్చు! లేదా ఇతరుల అభిప్రాయాలకు భయపడి చెప్పుకోకపోవచ్చు. ఎవరికీ భయపడకుండా చెప్పుకోవటం గొప్ప విశ్వాసమే! ఇతరుల అభిపాయలకు ప్రాధాన్యత ఇచ్చి చెప్పుకోక పోవటం ఖచ్చితంగా అల్ప విశ్వాసమే. కానీ యేసు క్రీస్తును నీవు ఎందుకు నమ్ముకున్నావు? క్రీస్తునందు విశ్వాసం ప్రతి ఒక్కరికి ఒక్కో సందర్భంలో కలుగుతుంది. కానీ దాని కొనసాగింపు దేని మూలంగా కలుగుతోంది అన్నది చాల ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రాథమికమయిన సువార్త ఏమిటీ? "సృష్టి కారకుడయినా దేవుడు మనుష్యులు పాపాలు చేసి, తన మహిమను కోల్పోతు, పాపం ద్వారా వచ్చే జీతము మరణమును పొంది, నిత్య నరకమునకు వెళ్లిపోతుంటే, వారిని ఆ పాపపు జీవితం నుండి రక్షించటానికి, తానూ మనిషిగా అవతరించి పాపం లేకుండా బ్రతికి, తన పవిత్ర రక్తమును క్రయధనముగా కార్చి, తన యందు విశ్వాసం ఉంచి తమ పాపములు ఒప్పుకొన్న వారిని క్షమించి, తన నీతిని ఆపాదించుట ద్వారా, వారికి నిత్య జీవమును అనగా తన సన్నిధిని అనుగ్రహిస్తాడు" విశ్వాసము యొక్క ఆరంభము అనారోగ్యము నుండి స్వస్థత కావచ్చు, ఆర్థిక సమస్య నుండి విడుదల కావచ్చు, లేదా చదువు, ఉద్యోగం, పెళ్ళి ఇలా ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఆ మొదటి మెట్టు దాటినా తర్వాత అసలు విశ్వాసపు యాత్ర మొదలవుతుంది. దేవుడు సమస్యలను తీరుస్తాడు కనుక ఇంకా విశ్వాసంగా ఉన్నామా? లేదా దేవుడు ఆగ్రహిస్తాడని, తానూ చేసిన మేలులు తీసివేస్తాడేమోనని భయపడి కొనసాగుతున్నామా? లేదా మనం నిత్యం చేసే పాపాలను క్షమించాలి కాబట్టి విశ్వసిస్తున్నామా? పైన చెప్పుకున్నట్లుగా యేసు క్రీస్తు తనయందు విశ్వాసము ఉంచి పాపములు ఒప్పుకొన్న వారికి తన నీతిని ఆపాదించి నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఇది చాలామంది విశ్వాసము కొనసాగించటానికి కారణము. ఇందులో ఎంత మాత్రమూ తప్పులేదు, అనుమానం అసలు లేదు. యేసు క్రీస్తు ప్రేమకు అవధులు లేవు, అయన క్షమాపణకు హద్దులు లేవు. యోహాను 6: "37. తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయును." ఈ వచనములో యేసయ్య ఏమంటున్నాడు! తన యొద్దకు వచ్చిన ఎవరిని కూడా త్రోసివేయను అని సెలవిస్తున్నాడు. అయన ప్రేమకు షరతులు లేవు, అయన కరుణకు కొలమానం లేదు (మత్తయి 18:22 లో చదవండి). నిత్యమూ పాపములు ఒప్పుకుంటూ, క్షమాపణ కోరుతూ, అయన నీతిని వెతకటమే క్రైస్తవ విశ్వాసముగా పరిగణింపబడుతోంది. పాపములు ఒప్పుకున్నా వారినెల్ల క్షమిస్తూ కేవలం నీతిని ఇవ్వటానికే, దేవుడు క్రీస్తుగా భూమి మీదకి వచ్చి, 33 సంవత్సరాలు మనిషిగా బ్రతికి, పాపం లేకుండా జీవించి, ధర్మ శాస్త్రమును నెరవేర్చి, అన్ని బోధలు చేయవలసిన అవసరం ఏమిటి? మనిషిగా క్రిందికి వచ్చి, రక్తం కార్చి, మరణమును జయించి వెళితే సరిపోతుంది కదా? హనోకు, ఏలీయా వంటి వారిని దేహముతో పరలోకం తీసుకుని వెళ్ళిన దేవునికి దేహంతో భూలోకం రావటం అసాధ్యం కాదు కదా! ఆయన క్షమించు వానిగానే కాదు నిజానికి రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. దేని నుండి రక్షించటానికి? మనలో ఉన్న ఆదాము స్వభావము నుండి అనగా సాతాను మాట వినటం ద్వారా మనిషికి సంక్రమించిన సాతాను యొక్క లక్షణముల నుండి. దేవుని ఆజ్ఞను దిక్కరింప జేసే శరీర క్రియలనుండి రక్షించటానికి వచ్చాడు. మనవలె అన్నింట శోధించబడి కూడ దేవుని ఆజ్ఞలు అన్ని నెరవేర్చాడు అనగా పాపంలేని వాడిగా జీవించాడు. అందుకే మనకు బోధించాడు. అవి సాధ్యము కనుకనే వాటిని పాటించుమని నిబంధన పెట్టాడు. కానీ మనం ప్రతిసారి పడిపోతూ, క్షమించు తండ్రి అన్న దగ్గరే ఆగిపోతున్నాము. దేవుడు తన కుమారుడయినా క్రీస్తును లోకానికి పరిచయం చేసింది, కేవలం అద్భుతాలు చేయటానికి, మేలులు చేయటానికి మాత్రం కాదు. అద్భుతములు చేసింది ఆయన మహిమను, ఆధిక్యతను తెలిపి మానవాళిని తన వైపు నడిపించటానికి. పాపం లేకుండా 33 సంవత్సరాలు జీవించింది వారికి మార్గదర్శిగా నిలవటానికి. కేవలం క్షమించటానికే అయితే, క్రీస్తు పరలోకం వెళుతూ ఆదరణ కర్తను అనగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించటం దేనికి? అయన బోధనలు హృదయంలో నిలుపుకొని, ఒక్కొక్క శరీర క్రియ నుండి విడుదల పొందుతూ వాటి నుండి క్రీస్తు శక్తి ద్వారా రక్షించబడటానికి. కనుకనే అయన రక్షకుడిగా అవతరించాడు. లేదంటే క్షమాపణ కర్తగా మాత్రమే అవతరించేవాడు. క్రీస్తులో మన విశ్వాసం కొనసాగుతున్న కొలది మన హృదయాలలో అయన మేలులు చేసేవాడినుండి మొదలు పెట్టి మనకు క్షమాపణ కర్తవలే ఉంటూ రక్షకుడిగా రూపాంతరం చెందాలి. ఎందుకంటే చాల మంది విశ్వాసులు యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించుకున్న తర్వాత కూడా ఆయనను పాపములు క్షమించే వానిగానే చూస్తున్నారు కానీ ఆ పాపములో పడిపోకుండా కాపాడే రక్షకుడిగా చూడటం లేదు. గలతీయులకు 5: "19. శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, 20. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, 21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను." ఈ వచనములలో మన పితరుడు ఆదాము నుండి మనకు సంక్రమించిన సర్వ అవలక్షణాలు పేర్కొనబడ్డాయి. వీటిని నిత్యం చేస్తూ, అయ్యో నన్ను క్షమించు ప్రభువా అనుకుంటూ ఉంటే, అది విశ్వాసమా? యేసయ్యను నువ్వు రక్షకుడిగా నమ్ముకున్నావా? వీటిని చేస్తూ ఇతరుల ముందు నేను యేసయ్యను నమ్ముకున్నాను అని చెప్పి అయన నామమునకు అవమానం చేయటం కన్న, అయన గురించి చెప్పక పోవటమే ఉత్తమం. క్రీస్తు ఇచ్చిన పరిశుద్దాత్మ శక్తి ద్వారా ప్రతి శరీర క్రియనుండి రక్షించబడుతూ నెమ్మదిగా ఆయన స్వభావమును పొందుకోవటమే యేసునందు విశ్వాసము కొనసాగటానికి కారణం కావాలి. ఎదుకంటే అయన వాటి నుండి మనలను రక్షించే రక్షకుడిగా అవతరించాడు, కానీ కేవలం క్షమించే వాడిగా మాత్రమే కాదు! క్షమాపణ పొందుకోవటం అన్నది ప్రాథమిక విషయము. మన యుద్ధము శరీర క్రియల పైన సాగాలి, అయన యందు విశ్వాసము ద్వారా, శక్తిని పొందుకొని వాటిని జయించాలి. తద్వారా మన పాపముల నుండి అయన ద్వారా రక్షించబడాలి. యేసయ్య నీ పాపములు క్షమించబడ్డాయి అని చెపుతూ ఏమని చెప్పేవాడు, మళ్ళి వాటిని చేయవద్దు అని కదా. అంటే పాపం లో ఎప్పటికి పడిపోమా? పడిపోవచ్చు, కానీ మన ప్రయత్నం ఎలా ఉంది? కేవలం క్షమాపణ ఉంది కనుక పర్వాలేదు అనుకుని పాపం చేస్తున్నావా? లేక శరీరము బలహీనతను బట్టి పడిపోతున్నావా? శరీర బలహీనత అయితే తండ్రి నాకు ఈ పాపం నుండి విడుదల ఇవ్వు, పాపంలో పడిపోకుండా నీ కృపను ఇవ్వు ప్రభువా అని పట్టుదలతో ప్రార్థిస్తే, తప్పక నీకు దేవుడు దాని మీద విజయం ఇస్తాడు. కానీ కావాలని, దేవుడు క్షమిస్తాడులే అని పాపం చేస్తే ఎప్పటికి దాని మీద విజయం పొందుకోలేవు, దేవుడు కోరుకుంటున్నా సంపూర్ణ విశ్వాసిగా మారలేవు. పడిపోయిన ప్రతిసారి లేవాలి, మళ్ళి పడిపోకూడదు అన్న పట్టుదల రావాలి. కేవలం ఆలా అనుకుంటే సరిపోతుందా? ముమ్మాటికీ కాదు. పాపముల నుండి రక్షించే ఆయన సహవాసంలో ఉండాలి! వాక్యపు వెలుగులో మనలను మనం సరిద్దిదుకోవాలి, ప్రార్థన శక్తితో శోధనలు ఎదుర్కొనే బలం పొందుకోవాలి. "నేను ద్రాక్షావళిని, నాలో ద్రాక్ష తీగలవలె ఫలించమని" ఆయనే కదా చెప్పాడు. అందుకే ఎప్పుడు ఆయనను అంటి పెట్టుకుని ఉండాలి. అప్పుడే ఆయనలో ఉన్న శక్తి మనకు అనుగ్రహింపబడి వాటి మీద విజయం సాధిస్తాం. సంపూర్ణ విశ్వాసిగా మారటానికి, యేసయ్యను నువ్వు క్షమాపణ కర్తగా చూస్తున్నావా లేదా దాన్ని దాటి రక్షణ కర్తగా చూస్తున్నావా? అనగా ప్రతి శరీర క్రియనుండి విజయాన్ని ఇచ్చే రక్షకుడిగా చూస్తున్నావా? ఈ ప్రశ్నకు సమాధానం నీ ఆత్మీయ స్థితిని తెలుపుతుంది, సంపూర్ణ విశ్వాసిగా అయనలో నిన్ను నిలుపుతుంది. దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్ !! https://youtu.be/5RfJJ9XNu0U Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
ఆగండి, ఆగండి, ఇదేదో సంక్లిష్టమైన విషయం అని ఈ సందేశాన్ని చదవకుండా పక్కన పెట్టేయకండి. నేను హామీ ఇస్తున్నాను. సరీగ్గా మరో మూడు నిముషాలలో మీకు వేద విజ్ఞానంపై ప్రాధమిక అవగాహన కలిగి తీరుతుంది. ​ మొదటి పాఠం - మనం ఎందుకు పుట్టాం? సృస్టిలోని ప్రతి ప్రాణీ, అంటే సూక్ష్మ జీవులు, చెట్లు, పక్షులు, జంతువులు, మనుషులు - అంతా కలసి ప్రతీ రోజూ కొన్ని కోట్ల కోరికలను కోరుకుంటాయి. వారి వారి కర్మానుసారం మరియూ ఆయా కోరికలను నెరవేర్చుకోవటం కోసం ఈ ప్రాణులన్నీ ఆ దిశగా చేసే ప్రయత్నాల ఫలితమే మన దైనందిన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకూ మూలం. వేదాన్ని సరీగ్గా అర్ధంచేసుకోలేకపోయిన ప్రవచనకారులు, అసలు కోరికలే లేని జీవితాన్ని గడపాలని ఉద్బోధిస్తుంటారు. ఇది అసాధ్యం. అందుకని, వీలైనన్ని తక్కువ కోరికలతో జీవితాన్ని గడపగలిగితే, జీవనం విజయవంతమౌతుంది. ​ వేదం ప్రకారం దేవుడు లేడు, కేవలం దైవశక్తి మాత్రమే వుంది. ఆ శక్తి ప్రాణుల యొక్క గత కర్మ మరియూ ప్రస్తుత కోరికల ప్రకారం సంఘటనలను ఆవిష్కరిస్తుంది. మనుషులతో సహా ప్రతి ప్రాణీ తమ కర్మను శూన్యం చేసుకొనేంతవరకూ, మరణించిన తరువాత కూడా ఏదో ఒక ప్రాణి రూపంలో పునర్జన్మించి, కష్టాలు అనుభవిస్తూ, తమ కర్మ శూన్యమయ్యేంతవరకూ ప్రయాసపడుతూ వుండాల్సిందే. ఈ దుర్భరమైన పునర్జన్మల చక్రాన్నుంచి బయటపడాలంటే, మోక్షం సాధించటం ఒక్కటే మార్గం. వీలైనన్ని ఎక్కువ కష్టాలను ఒక్క జన్మలోనే పూర్తిగా అనుభవించేసి మన కర్మను ఒకే జన్మలో ప్రయత్నపూర్వకంగా శూన్యం చేసుకోవటం కేవలం ఒక్క మానవ జన్మకే సాధ్యం. అందుకే అన్ని జన్మలలోకీ ఉత్తమమైనది మానవ జన్మ అని అంటారు. ఐతే, అరుదుగా లభించే ఈ మానవ జన్మను మోక్ష సాధనకు కాకుండా కేవలం కోరికలు తీర్చుకోవటానికి మాత్రమే ఉపయోగిస్తే అప్పుడు జంతు జన్మకూ, మానవ జన్మకూ ఎలాంటి బేధమూ ఉండదు. అందుకే, కుటుంబ పోషణార్ధం కొన్ని తప్పనిసరి కోరికలు నెరవేర్చుకున్న అనంతరమైనా మోక్షం వైపు అడుగులు వేసి తీరాలి. అన్ని కష్టాలకంటే అతి పెద్ద కష్టం తపస్సు చేయటం. తద్వారానే మోక్షం సాధ్యం. జంతువులు చేయలేనిదీ, కేవలం మనుష్యులు మాత్రమే చేయగలిగినది తపస్సు ఒక్కటే. సంసార భాధ్యతలన్నీ తీరిపోయిన తరువాత, అడవికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని కూడా తపస్వికుడిలా బ్రతకొచ్చు. ఒక ఇరవై యేళ్ళ తరువాత సంభవించే ఉద్యోగ విరమణానంతర జీవితం కోసం ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకొనే మనం, మరణం తరువాత వచ్చే వివిధ జన్మల గురించి కనీస ఆలోచన చేయకపోవటం దారుణం. ​ ఒక రోజు బ్రతకడం కోసం ఒక అర్ధకిలో బరువున్న తిండిగింజలు, కాయగూరలనూ తినవచ్చు. మన ఆహారంకోసం మనం హింసించే, చంపే మొక్కల ఉసురు వల్ల కొంత కర్మ మన ఖాతాలో జమ అవుతుంది. మనం బ్రతకాలి కనుక ఆ మాత్రం హింస చేయొచ్చు. కానీ, కొన్ని వందల వేల కిలోల ఆహారాన్ని నెలలూ, సంవత్సరాల తరబడి ఒక జంతువుచేత తినిపించి, బలిపించి, తరువాత దాన్ని చంపి కోయగా వచ్చే ఒకటి నుంచి 50 కిలోల మాంసాన్ని తినటం ద్వారా మనం ఎంత పెద్ద కర్మను పోగుచేస్తున్నామో తెలుసా? అంటే, కేవలం ఒక కిలో మాంసాన్ని ఉత్పత్తి చేయటానికి వంద నుంచి కొన్ని వందల కిలోల తిండి గింజలనూ, కాయగూరలనూ హత్యచేసి ఒక జంతువుతో తినిపించాలి. తిండి గింజలనూ, కాయగూరలనూ హత్యచేయటమేమిటి అని నవ్వుకోవద్దు. వాటికీ ప్రాణముంటుంది. ఇతర మతస్తులను ద్వేషిస్తూ మెస్సేజులు పెట్టడం వలన హిందూత్వం బ్రతుకుతుందనుకోవద్దు. ఊహకు కూడా అందనంత పెద్ద స్థాయిలో కర్మను మీ ఖాతాలో జమచేసే మాంసాహారాన్ని త్యజించటం ద్వారా మరణశయ్యపై వున్న హిందూత్వానికి మీరు నిజంగానే ఊపిరిలూదగలరు. తపస్సు వలన గత కర్మను దహించివేసి మీ ఖాతాలోని కర్మను తగ్గించుకోవచ్చు సరే. మాంసాహారాన్ని త్యజించటం ద్వారా కొత్తగా జమకూడే కర్మను అమాంతం తగ్గించివేయొచ్చు మరి. గత కర్మను తగ్గించుకోవటం ఎంత ముఖ్యమో, కొత్తగా కర్మను చేయటాన్ని తగ్గించుకోవటం కూడా అంతే ముఖ్యమని గ్రహించకపోవటం క్షమించరాని తప్పా కాదా? వేద విజ్ఞానం మొదటి పాఠం సమాప్తం. మరోసారి, మరో పాఠాన్ని చదువుకుందాం. మరింత విజ్ఞానం కోసం, ఆసక్తి కలవారు నేను నిర్వహించే ఈ క్రింది వెబ్ సైటు నుంచి నా పుస్తకాలను ఉచితంగానే చదువుకోవచ్చు లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. క్షమించాలి, అన్ని పుస్తకాలూ ఆంగ్లం లోనే వ్రాయబడినవి.
రాజధాని మాలెలో ప్రతిపక్షాల ‘ఇండియా అవుట్‌’ ర్యాలీపై నిషేధం విధిస్తూ.. మాల్దీవుల పార్లమెంట్‌ అత్యవసర తీర్మానాన్ని ఆమోదించింది. మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌, ఆయన పార్టీ ప్రొగ్రెసివ్‌ పార్టీ ఆఫ్‌ మాల్దీవ్స్‌, మిత్ర పక్షం పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లు ఈ ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఈ అత్యవసర తీర్మానాన్ని మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎండిపి) సభ్యుడు, మాజీ అధ్యక్షుడు మొహ్మద్‌ నషీద్‌ ప్రవేశపెట్టారు. ఈ ర్యాలీ దేశ భద్రతకు ప్రమాదం కలిగిస్తోందని, పొరుగుదేశాల మధ్య విభేదాలను పెంచుతుందని పేర్కొన్నారు. ర్యాలీని, సంబంధిత కార్యక్రమాలను మాల్దీవ్‌ రక్షణ బృందం అడ్డుకోవాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ‘ఇండియా అవుట్‌’ అనేది ఈ ర్యాలీ నేపథ్యం. అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్ నేతృత్వంలోని ఎండిపి ప్రభుత్వ మాల్దీవులను ఇండియాకు విక్రయించిందని రెండేళ్ల క్రితం నిరసనకారులు ఒక ఆందోళన చేపట్టారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జయశంకర్‌ మాల్దీవుల్లో పర్యటిండచంతో నిరసన చేపట్టేందుకు పోలీసులు అనుమతించలేదు. ఇతర ప్రాంతాల నుండి మాలె చేరుకునేందుకు యత్నించిన ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఐదులక్షల జనాభా కలిగిన అతిచిన్న దేశం మాల్దీవ్స్‌. 2005లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. హిందూ మహాసముద్రం వ్యూహాత్మక కూడలిగా ఉన్న ఈ దేశం దశాబ్దం కంటే ఎక్కువ కాలంగా భౌగోళిక , రాజకీయ పరిస్థితులతో ప్రభావితమౌతోంది. గత పదేళ్లుగా మాల్దీవులపై పట్టు సాధించేందుకు చైనా, భారత్‌లు పోటీపడుతున్నాయి. ఇస్లాం ప్రధాన మతంగా ఉన్న ఈ దేశంపై ఇస్లామీయులు కూడా సొంతం చేసుకునేందుకు యత్నించారు. దీంతో ప్రజాస్వామ్యం సాధించుకున్నప్పటికీ ఈ దేశం రాజకీయం ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంది. అత్యంత సన్నిహితంగా, పెద్ద దేశంగా ఉన్న భారత్‌ అన్ని రంగాల్లోనూ మాల్దీవులకు సహాయం అందిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు అధికారాన్ని గెలుచుకునేందుకు విదేశాంగ విధానం పెద్ద పాత్ర పోషించింది. మాజీ అధ్యక్షుడు మౌమూన్‌ అబ్దుల్‌ గయూమ్‌ 20వ శతాబ్దం చివరి వరకు దేశంలో ఎదురులేని నేతగా పరిపాలన కొనసాగించారు. మందుగుండు సామగ్రి కోసం శ్రీలంకకు చెందిన తమిళ మిలిటెంట్‌ గ్రూప్‌ పిఎల్‌ఒటిను నియమించుకున్న వ్యాపార వేత్త గయూమ్‌కి వ్యతిరేకంగా ప్రణాళికా బద్దంగా చేపట్టిన తిరుగుబాటును భారత్‌ సహకారంతో జాతీయ భద్రతా దళం అడ్డుకుంది. ఆ సమయంలో దేశం లోపల, వెలుపల చైనా తన ప్రాభవాన్ని పెంచుకునేందుకు యత్నిస్తూనే ఉంది. దీంతో హిందూ మహాసముద్ర భూభాగంలోని శ్రీలంకపై భారత్‌, మాల్దీవులపై చైనా ప్రభావంతో రాజకీయ ప్రత్యర్థిగా మారింది. ఎండిపి పార్టీ, నషీద్‌తో పాటు కీలక నేతలందరూ భారత్‌కు అనుకూలంగా వ్యవహరించగా, యమీన్‌ చైనాకి అనుకూలంగా వ్యవహరించారు. 2018లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎండిపి అధిక ఓట్లను గెలుచుకుంది. యమీన్‌ ప్రభుత్వ నేరారోపణల కారణంగా నషీద్‌ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ఇబ్రహీం సోలీహ్ అధ్యక్షడయ్యాడు. ఆ వెంటనే అవినీతి అరోపణలపై యమీన్‌కు శిక్ష ఖరారైంది. మాలేలో స్నేహపూర్వక ప్రభుత్వం ఏర్పడటంతో భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలను పునర్‌నిర్మించుకో గలిగింది. సోలిహ్ ప్రభుత్వ హయాంలో పలు భారత విధానాలను అవలంబించడంతో స్థానికంగా వ్యతిరేకత ఎదురైంది. మరోవైపు న్యూఢిల్లీ నుండి భారీ సైనిక బృందాన్ని మాల్దీవులకు పంపుతుందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ ఆరోపణలను సోలిహ్ ప్రభుత్వం ఖండించింది. మాల్దీవుల తీర రక్షక దళం ఉతురు తిలాఫల్హు (యుటిఎఫ్‌) అటాల్‌ నౌకాశ్రయానిన అభివృద్ధి చేసేందుకు ఇరు పక్షాల మధ్య సహకారంపై దృష్టి సారించింది. నిఘా, సహాయక చర్యల కోసం డోర్నియర్‌ యుద్ధ విమానాలను వినియోగిస్తున్నామని ప్రకటిస్తోంది. మాల్దీవుల సుప్రీంకోర్టు అతని నేరారోపణను రద్దు చేసిన అనంతరం సుదీర్ఘ గృహ నిర్బంధం నుండి డిసెంబర్‌ 2021లో యమీన్‌ విడుదలయ్యాడు. దీంతో భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ నిరసనలన్నింటికీ యమీన్‌ అధ్యక్షత వహించాడు. 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం యమీన్‌ నిరసనల ద్వారా మద్దతు పెంచుకునేందుకు యత్నిస్తున్నారు. అయితే ఈ నిరసనలను అడ్డుకునేందుకు నౌషద్‌ తీవ్రంగా యత్నిస్తున్నారు.
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది బీసీసీఐ. వచ్చే ఏడాది ఐపీఎల్​నూ దీనిని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. వచ్చే నెలలో ప్రారంభంకానున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ నుంచి 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌' అనే నిబంధనను అమల్లోకి తేనుంది. ఇది అమల్లోకి వస్తే ఇన్నింగ్స్‌ మధ్యలో ఆటగాడిని మార్చుకునే వెసులుబాటు లభిస్తుంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ప్రకారం.. ఇన్నింగ్స్‌ ప్రారంభమయ్యాక 14 ఓవర్ల లోపు ఇరు జట్లు ఒక్కో ఆటగాడిని మార్చుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా మ్యాచ్‌ మధ్యలో ఆటగాడికి గాయమైనా లేక ఆనారోగ్యం బారిన పడినా అతడి స్థానంలో మరో ఆటగాడు సబ్‌స్టిట్యూట్‌ విధానం ద్వారా బరిలోకి దిగుతాడు. ఇక్కడ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆటగాడు కేవలం ఫీల్డింగ్‌ చేయాల్సి ఉంటుంది. అదే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ప్రకారం​ అయితే బౌలింగ్‌ చేసే జట్టులో ఇన్నింగ్స్‌ 14 ఓవర్లలోపు ఆటగాడు గాయపడినా లేదా మ్యాచ్‌ అప్పటి స్థితిగతులను ఆధారంగా ఓ ఆటగాడిని మార్చుకోవాలని భావించినా ఓవర్‌ ముగిశాక కెప్టెన్‌, హెడ్‌ కోచ్‌, మేనేజర్‌లలో ఎవరో ఒకరు ఫీల్డ్‌ అంపైర్‌ లేదా ఫోర్త్‌ అంపైర్‌కు సమాచారం అందిస్తే​ ఆటగాడిని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్‌తో పాటు 4 ఓవర్ల పాటు బౌలింగ్ కూడా చేయవచ్చు. అదే బ్యాటింగ్‌ చేసే జట్టు వికెట్‌ పడ్డాక ఇన్నింగ్స్‌ బ్రేక్‌ సమయంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ గురించి అంపైర్‌కు సమాచారం అందిస్తే ఆటగాడిని మార్చుకునే వెసలుబాటు ఉంటుంది. ఇందుకోసం ఇరు జట్లు టాస్‌ సమయంలో ప్లేయింగ్‌ ఎలెవెన్‌తో పాటు నలుగురు ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. తప్పనిసరి కాని ఈ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఆప్షన్‌ ప్రకారం ఒక్కసారి జట్టును వీడిన ఆటగాడు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం (ఆ మ్యాచ్‌ వరకు) ఉండదు. ప్రస్తుతం బిగ్‌బాష్‌ లీగ్‌లో మాత్రమే అమల్లో ఉన్న ఈ రూల్‌ త్వరలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలోనూ అమల్లోకి రానుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌లో సైతం ప్రవేశ పెట్టాలని బీసీసీఐ యోచిస్తుంది. క్రికెట్‌తో పాటు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఆప్షన్‌ ఫుట్‌బాల్, రగ్బీ, బాస్కెట్ బాల్ వంటి క్రీడల్లో కూడా అమల్లో ఉంది. ఈ రూల్‌ అమల్లోకి వస్తే క్రికెట్‌ మరింత రసవత్తరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
– అభ్యర్థులు దొరక్కే.. సమైక్యవాదికి బీజేపీ టిక్కెట్ – టీఆర్‌ఎస్ అభ్యర్థికి భారీ మెజారిటీతో బ్రహ్మరథం పట్టండి : డిప్యూటీ సీఎం రాజయ్య మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఏ పార్టీ పోటీ కాదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సంగారెడ్డి నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి రాజయ్య పేర్కొన్నారు. అభ్యర్థులు దొరక్కపోవడంతోనే సమైక్యవాది, క్రిమినల్ అయిన జగ్గారెడ్డికి బీజేపీ, మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమకారులపై లాఠీచార్జి చేయించిన సునీతాలకా్ష్మరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. సంగారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం రాజయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాటలకు కేంద్ర మోడీ సర్కార్ తలొగ్గి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందన్నారు. జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా శాంతి భద్రతలు, రెవెన్యూ అంశాలపై గవర్నర్‌కు బాధ్యతలు అప్పగించే ప్రకటనపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం చేసిందని, దీంతోనే మోడీ సర్కార్ వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభలో ఆర్టికల్ 3 ప్రకారం చర్చించిన తర్వాతే పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపాలన్న సోయి కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. నాలుగున్నర కోట్ల ప్రజల హృదయాల్లో తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర పడిందన్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో పొందుపర్చిన 43 అంశాలే పార్టీకి వజ్రాయుధం లాంటివన్నారు. గడపగడపకు వెళ్లి కేసీఆర్ ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి ఎన్నికల్లో అధిక మెజార్టీ సాధించాలన్నారు. తెలంగాణవాదులు, పార్టీ కార్యకర్తలపై దాడి కేసుల్లో క్రిమినల్ అయిన జగ్గారెడ్డికి బీజేపీ టిక్కెట్ ఇవ్వడం దారుణమని రాజయ్య దుయ్యబట్టారు. మెదక్ ఉప ఎన్నికల్లో కార్యకర్తలు లేక ప్రచారం నిర్వహించలేని దుస్థితి బీజేపీకి దాపురించిందన్నారు. మంత్రిగా ఉండి కూడా అమరుల కుటుంబాలను పరామర్శించని సునీతాలకా్ష్మరెడ్డిని ప్రజలు తిరస్కరించడం ఖాయమన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు దక్కవని.. ప్రజలు టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి బ్రహ్మరథం పట్టి కేసీఆర్ కన్నా అధిక మెజారిటీతో గెలిపించడం ఖాయమన్నారు. మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం: బీబీ పాటిల్ బంగారు తెలంగాణ కల సాకారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. అన్నివర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు సమగ్ర సర్వేను నిర్వహించి విజయం సాధించారని పేర్కొన్నారు. రాజకీయాల్లో కిందిస్థాయి నాయకులను గుర్తించి రాములునాయక్, కర్నె ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ పదవులు అప్పగించి న్యాయం చేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీ వినోద్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ పాలనపై దేశవ్యాప్త చర్చ: బాల్క సుమన్ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. కేసీఆర్ పాలన అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలకు చెందిన ఎంపీలు ప్రశంసిస్తుండటం తమకు గర్వకారణంగా ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతో తెలంగాణలోని ఆ పార్టీ కార్యకర్తలు సిగ్గుతో ప్రచారం చేయడానికి ముఖాలు చాటేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణవాదులపై దాడిచేసిన సమైక్యవాది జగ్గారెడ్డికి టిక్కెట్ ఇచ్చి.. బీజేపీపై తెలంగాణ ప్రజలకు ఉన్న అభిమానాన్ని తెంచుకున్నారని విమర్శించారు. ఆంధ్రా పాలకుల చెప్పుచేతుల్లో కేంద్రంలోని మోడీ సర్కార్ నడుస్తుందనడానికి పోలవరం, గవర్నర్‌గిరి అంశాలే నిదర్శనమన్నారు. రైల్వే, సాధారణ బడ్జెట్‌లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపి నిధులు కేటాయించలేదని ఆరోపించారు. కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండి జాతీయ పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను మట్టికరిపించి కేసీఆర్‌కు బహుమతి ఇవ్వాలని ప్రజలను కోరారు.
జీవితంలో పెళ్లి అనేది మన భారత సాంప్రదాయపు ఘట్టం. తాము పెళ్లి చేసుకునే వ్యక్తి పట్ల కొన్ని ఆశలు ఎవరికైనా ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. చూడ్డానికి అందంగా ఉండడంతో పాటు మంచి సంపాదన కూడా ఉండాలనుకుంటారు. ఈ క్రమంలో ఓ యువతి ఇచ్చిన మ్యాట్రిమోని యాడ్ వైరల్ అవుతుంది. తనకు కాబోయే వాడి వయసు, జీతం, ఎత్తు ఎంత ఉండాలి, విద్యార్హతలు ఎలా ఉండాలనే విషయాలను ఓ రెజ్యూమేలా తయారు చేసి పెట్టింది. అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. సదరు యువతికి కాబోయే వాడు 1992 జున్‌ తర్వాతే జన్మించి ఉండాలంట. ఎంబీఏ, ఎంటెక్, ఎంఎస్‌, పీజీడీఎంలో ఏదో ఒకదానిలో పట్టా ఉండాలి. ఒకవేళ ఇంజినీర్ అయితే.. దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీలు, బిట్స్‌ పిలానీ, ఎన్‌ఐటీ వంటి వాటిల్లోనే ఆ పట్టా పొంది ఉండాలి. ఎంబీఏ అయితే.. ఐఐఎం, ఐఎస్‌బీల్లోనే పూర్తి చేసుండాలి. హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, బాంబే, ఢిల్లీ, రూర్కీ, ఖరగ్‌పూర్ ఇలా దేశంలోని ముఖ్య నగరాల యూనివర్సిటీల నుంచే డిగ్రీ పొంది ఉండాలట. ఈ కాలేజీల జాబితాను కూడా ఆ అమ్మాయి క్షుణ్నంగా ఫ్రొపైల్‌లో పొందుపరిచింది. అంతేకాదు జీతం ఏడాదికి కనీసం రూ.30లక్షలు ఉండాలి. అది కూడా కార్పొరేట్ సెక్టార్‌లోనే పనిచేసే వాడే కావాలట. అతడికి తోబుట్టువులు ఇద్దరికంటే ఎక్కువ ఉండకూడదు. బాగా చదువుకున్న కుటుంబానికి కాస్త ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుందట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వరుడి ఎత్తు 5.7 అడుగుల నుంచి 6 అడుగులు ఉండాలట. What is your take on this? pic.twitter.com/FWO1YGyxge — Dr.D G Chaiwala (@RetardedHurt) October 17, 2022 ఈ యాడ్‌పై నెటిజన్లు విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు.. కొందరైతే ఆ అమ్మాయికి భర్త కాదు.. బ్యాంకు కావాలని కామెంట్ చేయగా.. మరికొందరు పెళ్లి చేసుకుంటుందా..? భర్తను హైర్ చేసుకుంటుందా..? అని ప్రశ్నించారు. మరికొందరైతే ఆ అమ్మాయికి ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉండడం తప్పేం కాదంటూ మద్ధతు తెలుపుతున్నారు. మొత్తానికి ఈ పెళ్లి యాడ్.. ఓ రెజ్యూమ్‌లా ఉంది.
21వశతాబ్దంలో భారతీయ సమాజవాద (సోషలిస్ట్) సంప్రదాయం ఉపయుక్తత ఏమిటి? ములాయం సింగ్ యాదవ్ అస్తమయం ఈ గంభీర సమస్యపై ఆలోచనను పురికొల్పుతోంది.... అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 21వశతాబ్దంలో భారతీయ సమాజవాద (సోషలిస్ట్) సంప్రదాయం ఉపయుక్తత ఏమిటి? ములాయం సింగ్ యాదవ్ అస్తమయం ఈ గంభీర సమస్యపై ఆలోచనను పురికొల్పుతోంది. సోషలిస్టు ఉద్యమ వ్యవస్థాపకులలో అగ్రగణ్యుడు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ 120వ జయంతి రోజు (అక్టోబర్ 11)నే ములాయం పార్థివ శరీరానికి అంత్యక్రియలు జరగడం ఒక విశేషం. అలాగే ములాయం రాజకీయ గురువు రామ్ మనోహర్ లోహియా 55వ వర్ధంతికి ఒక రోజు ముందు ఆ కర్మకాండ జరిగిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవడం అసందర్భమేమీ కాదు. ములాయం రాజకీయ జీవితంలో స్థిరమైన విషయం ఏదైనా ఒకటి ఉందంటే అది ఆయన మొదటి నుంచీ చివరి వరకు సోషలిస్టు సంప్రదాయ బద్ధుడుగా ఉండడమే. ఆ విశిష్ట సంప్రదాయంతో ఆయన ఎంతగా మమేకమయ్యారంటే తాను స్థాపించిన రాజకీయ పార్టీకి ‘సమాజ్‌వాది’ అని నామకరణం చేశారు. సోషలిస్టు ఉద్యమ చిహ్నమైన ఎర్ర టోపీని పార్టీ శ్రేణులు నిత్యం ధరించి తీరాలని నిర్దేశించారు; ఆంగ్ల భాషా ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు; సమాజ్‌వాది పార్టీ విధానాలలో లోహియా స్ఫూర్తిని ప్రతిఫలింప చేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ములాయం జీవిత పర్యంతం ఒక ‘సోషలిస్టు’గా ఉన్నారు. అయితే ఆయన సోషలిజం సారరహితమైనదని పలువురు విమర్శించడం కద్దు. భారతీయ సోషలిస్టు సంప్రదాయం ప్రాసంగికత గురించి ఎందుకు చర్చించాలో ఆ విమర్శలూ ప్రేరేపిస్తున్నాయి మరి. వర్తమాన యువ భారతీయులకు సోషలిస్టు రాజకీయ సంప్రదాయాల గురించి ఏమైనా తెలుసా? సందేహమే. వారికి నిత్యం ఎల్లెడలా ‘హిందూత్వే’ తటస్థిస్తుంది కదా. ఉదారవాదులు, వామపక్షవాదులు, నక్సలైట్లు, స్త్రీ వాదులు, గాంధేయవాదులు, పర్యావరణ ఉద్యమకారుల గురించి వారు తప్పక వింటూంటారు. అయితే సోషలిస్టుల గురించి అడగండి. వారి నుంచి శూన్య దృక్కులే మీకు ఎదురవుతాయి. మహా అయితే సోషలిజం అనేది కమ్యూనిజంకు ఒక పర్యాయపదమని వారు భావిస్తూండవచ్చు. విద్యాధిక భారతీయులు అయితే బెర్నీ శాండర్స్ (అమెరికన్ రాజకీయవేత్త, రచయిత, ఉద్యమకారుడు)తో ముడివడివున్న విషయంగా భావించే అవకాశముంది. అంతేగానీ, ఆధునిక భారతదేశ నిర్మాణంలో మహోన్నత పాత్ర నిర్వహించిన రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్, ఆచార్య నరేంద్ర దేవ, యూసఫ్ మెహరాలీ, మధులిమాయె, జార్జి ఫెర్నాండెజ్, కిషన్ పట్నాయక్‌లు ప్రభవించిన దేశీయ రాజకీయ సంప్రదాయమే సోషలిజమని వారికి తెలియనే తెలియదు. కమ్యూనిజం కంటే సోషలిజం విలక్షణమైనదని గుర్తించిన వారు సైతం భారతీయ సోషలిస్టు ఉద్యమ విశిష్టతను అర్థం చేసుకున్న వారేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెమోక్రాటిక్ సోషలిస్టులవలే భారతీయ సోషలిస్టులు కూడా పెట్టుబడిదారీ అసమానతలు, కమ్యూనిస్టు నియంతృత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఐరోపాలోనూ మిగతా ప్రపంచంలోని డెమాక్రటిక్ సోషలిస్ట్ పార్టీల వలే భారతీయ సోషలిజం ఏ విధంగాను కమ్యూనిస్టు వామపక్షవాదం లాంటిది కానే కాదు. మహాత్మాగాంధీ నేతృత్వంలో భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న పోరాట యోధులు భారతీయ సోషలిస్టులు. వారి భావాలు, రాజకీయాలను గాంధీ మౌలికంగా ప్రభావితం చేశారు. ఆ స్ఫూర్తిదాయక ప్రభావంతోనే సామాజిక న్యాయంతో కూడిన ఆర్థిక సమానత్వం, రాజకీయ, ఆర్థిక వికేంద్రీకరణ, సాంస్కృతిక విముక్తి, అహింసాత్మక ప్రతిఘటన ఇత్యాది విశిష్ట లక్షణాలతో కూడిన ప్రత్యేక రాజకీయ భావజాలంగా భారతీయ సోషలిజం పరిఢవిల్లింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే దేశీయత దాని విశిష్టత. గతించిన కాలం విస్మృత చరిత్రను మనం ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాలి? రాజకీయంగా బలహీనమైన, చీలికలు పీలికలు అయిన సోషలిస్టు ఉద్యమం నేటి అనివార్య ప్రతిఘటనాత్మక రాజకీయాలకు తప్పక తోడ్పడగలిగేదిగా ఉంది. ఇప్పుడు మన ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య (రిపబ్లిక్) మనుగడకు ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు మూడు మార్గాలను సమకూరుస్తోంది. భారతీయ సోషలిస్టులు సునిశ్చిత జాతీయవాదులు. నిజానికి ఈ జాతీయ వాద దృక్పథమే వారికి, భారత కమ్యూనిస్టు పార్టీకి మధ్య ఉన్న మౌలిక వ్యత్యాసం. భారత స్వాతంత్ర్యోద్యమంతో కమ్యూనిస్టులది రాగద్వేషాల సంబంధం. అయితే సోషలిస్టులు కాంగ్రెస్ నాయకత్వంలో ఆ మహోజ్వల పోరాటంలో సంపూర్ణంగా పాల్గొన్నారు. సోషలిస్టులది ఎంతమాత్రం సంకుచిత జాతీయవాదం కానేకాదు. ప్రగతిశీల భారతీయ జాతీయవాదానికి వారు అగ్రగణ్య ప్రతినిధులు. ప్రపంచవ్యాప్తంగా వలసవాద వ్యతిరేక పోరాటాలతో సంపూర్ణంగా మమేకమయినవారు. స్వాతంత్ర్యానంతరం జాతి–నిర్మాణం, మత సామరస్యం, స్వతంత్ర విదేశాంగ విధానానికి సోషలిస్టుల జాతీయవాదం ప్రాధాన్యమిచ్చింది. అయితే 1962 పరాజయం సందర్భంలో నెహ్రూ విదేశాంగ విధానాన్ని విమర్శించేందుకు వారు సందేహించలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంటా బయటా ఊహాత్మక శత్రువులను చూపుతూ దురహంకార రాజకీయాలకు పాల్పడుతోంది. వాటిని సమర్థించుకునేందుకు జాతీయవాద భావోద్వేగాలను రెచ్చగొడుతోంది. ఉదారవాదులు, వామపక్షాల వారు ఈ సంకుచిత రాజకీయాలను సమర్థంగా ఎదుర్కోలేక పోతున్నారు. బీజేపీ కలహశీల జాతీయవాదాన్ని మీరు అమూర్త అంతర్జాతీయవాదంతో ఎదుర్కోలేరు. ఆ పార్టీ మతోన్మాద జాతీయవాదానికి ప్రభావశీల ప్రతిక్రియ భారతీయ సోషలిస్టుల వాస్తవిక జాతీయవాదమే. సాంస్కృతిక ఆత్మగౌరవ రాజకీయాలు ఆ వాస్తవిక జాతీయవాదానికి సంబంధించినవే. భారతీయ (హిందూ అని చదువుకోండి) నాగరికత, సంస్కృతి బీజేపీ జాతీయవాదానికి ప్రాతిపదికగా ఉన్నాయి. వలసవాద గతాన్ని తుడిచిపెట్టే ప్రతీకాత్మక చర్యల ద్వారా ప్రతి భారతీయుని మద్దతును పొందేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వలసవాద గతంలో ముస్లిం పాలకులను కూడా చేర్చింది! ఇదొక చారిత్రక వంచన. హేతుబద్ధత లేని చారిత్రక అక్రమం. పురాతన భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని కీర్తించేందుకు వాస్తవిక, ఊహాత్మక కారణాలను చూపుతోంది. ఆంగ్ల భాష ప్రాబల్యాన్ని త్రోసిపుచ్చడం ద్వారా ప్రజా మద్దతును మరింతగా సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ ప్రతీకాత్మకచర్యలు నిస్సారమైనవని, బూటకపు చరిత్రతో ప్రజలను మభ్య పెడుతుందని ఆ పార్టీ విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు. అయితే సాంస్కృతిక ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయ కారణాలను వారు చూపడం లేదు. ఆంగ్ల భాషను వారు సమర్థిస్తున్న తీరు వలసవాద ప్రయోజనాల ఆధారితమైనది కానప్పటికీ కులీన వర్గాల స్వప్రయోజనాలకు తార్కాణంగా ఉంటోంది. మన నాగరికతా వారసత్వాన్ని మన సొంత పద్ధతుల్లో బలోపేతం చేసే విధంగా భారతీయ సోషలిస్టులు ప్రతిస్పందించాలి. ఎలా? హిందీ ఆధిపత్యాన్ని అంగీకరించకుండానే ఇంగ్లీష్ ప్రాబల్యాన్ని విమర్శించాలి. ప్రత్యామ్నాయ సాంస్కృతిక రాజకీయాలకు ఇదే సరైన మార్గం. ఒక నాస్తికుడి వలే మతాన్ని తిరస్కరించడం కాకుండా ప్రజల మత మనోభావాలను అర్థం చేసుకుని గౌరవించాలి. సామాజిక న్యాయం సోషలిస్టు రాజకీయాల మరో విశిష్టత. ముఖ్యంగా కులాధారిత అసమానతలను వ్యతిరేకించడంలో వారి కృషి అవిస్మరణీయమైనది. భారతీయ సమాజంలో అసమానతలకు కుల వ్యవస్థే ప్రధాన కారణమన్న సత్యాన్ని తొట్ట తొలుతనే గుర్తించిన వారిలో బాబాసాహెబ్ అంబేడ్కర్‌తో పాటు భారతీయ సోషలిస్టులు కూడా ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాల వారు, మైనారిటీలు, మహిళల అభ్యున్నతికి ప్రత్యేక సానుకూల చర్యలు చేపట్టాలని సోషలిస్టులు డిమాండ్ చేశారు. మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు సోషలిస్టు పార్టీలు ఉద్యమించాయి. సోషలిస్టుల ఉద్యమాలు, ఆందోళనల వల్లే దళితులు, బహుజనుల మధ్య సమైక్యత సుసాధ్యమయింది. ఇప్పుడు మన రాజ్యాంగ బద్ధ ప్రజాస్వామ్యంపై జరుగుతోన్న దాడిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ సమైక్యత ఒక ఆలంబన అనడంలో సందేహం లేదు. మన సమాజంలోని సకల అణగారిన, ఆర్థిక, సామాజిక తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్న వర్గాల మధ్య ఐక్యతకు సైద్ధాంతిక, రాజకీయ ప్రాతిపదికను సోషలిస్టు ఉద్యమం సమకూర్చింది. సోషలిస్టు ఉద్యమ వారసత్వం ప్రస్తుతం నడుస్తున్న చరిత్రలో ఒక కీలక పాత్ర నిర్వర్తించగలదనడంలో సందేహం లేదు. అయితే ఆ ఉద్యమ వారసులు ఈ చారిత్రక కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించగలరా? స్వతంత్ర భారతదేశంలో అన్ని రకాల అణచివేతలను, నిరంకుశ విధానాలను ప్రతిఘటించిన ప్రశస్త చరిత్ర సోషలిస్టుల సొంతం. సోషలిస్టు ఉద్యమం ప్రభావశీలంగా ఉన్న కాలంలో అధికార వ్యవస్థకు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుండేది. ఈ కారణంగానే అధికార వ్యవస్థ వ్యతిరేకత కాంగ్రెస్ వ్యతిరేక వాదంగా రూపుదిద్దుకుంది. తన సమకాలికులు అయిన అనేక మంది సోషలిస్టుల వలే ములాయం సింగ్ యాదవ్ కూడా కాంగ్రెస్‌కు బద్ధ వ్యతిరేకి. సోషలిస్టు ఉద్యమ నేటి వారసులు కాంగ్రెస్ వ్యతిరేకతను విడనాడాలి. ఇప్పుడు అధికార వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ బద్ధ ప్రజాస్వామ్యాన్ని కాలరాచివేసి, భారతదేశ సమైక్యతా పునాదులను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నవ భారతదేశంలో తన చారిత్రక పాత్రను నిర్వర్తించేందుకు భారతీయ సోషలిస్టు ఉద్యమం ఒక కొత్త అవతారమెత్తాలి.
T20 World Cup 2022: భారత్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలం అవడమే గాక పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ చెత్త కెప్టెన్సీ నిర్ణయాలే తమ జట్టు ఓటమికి కారణమంటున్నారు ఆ జట్టు మాజీ క్రికెటర్లు. మూడు రోజుల క్రితం మెల్‌బోర్న్ వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య ముగిసిన ఉత్కంఠ పోరులో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటర్ గా విఫలమైన పాక్ సారథి బాబర్ ఆజమ్, కెప్టెన్ గా కూడా విఫలమయ్యాడని ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటే బెటరని సూచిస్తున్నారు. ఇదే విషయమై పాకిస్తాన్ మాజీ సారథి సలీమ్ మాలిక్ స్పందిస్తూ బాబర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సలీమ్ మాట్లాడుతూ.. ‘ఇటువంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్ లలో జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్ల సలహాలు తీసుకోవాలి. ఒత్తిడితో కెప్టెన్ సతమతమవుతుంటే సీనియర్లు అతడికి సలహాలిస్తారు. అతడు తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఆపుతారు. అందుకే నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. జట్టులో సీనియర్, జూనియర్ ప్లేయర్లు సమతూకంతో ఉండాలి. బౌలర్లకు సీనియర్ ప్లేయర్లు గైడ్ చేస్తారు. మరీ ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువగా ఉండే భారత్ తో మ్యాచ్ లో వారి సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ ప్రస్తుతం జట్టులో సీనియర్ ప్లేయర్లు ఎక్కడున్నారు..? అంతర్జాతీయంగా అత్యంత ఒత్తిడి మధ్య మ్యాచ్ లు ఆడిన అనుభవం వారికి ఉందా..? పాక్ జట్టుకు బాబర్ చాలాకాలం నుంచి సారథిగా ఉన్నాడు. ఇన్ని రోజులు గడుస్తున్నా అతడు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి ఇంతకాలమైనా నువ్వు నీ తప్పుల నుంచి ఏమీ నేర్చుకోలదంటే నువ్వు ఆ పోస్టుకు అర్హుడివి కావు. బాబర్ ఆజమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మంచిది. చాలా మంది కెప్టెన్సీని వదిలేశారు. దానిని పట్టుకునే వేలాడలేదు...’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సలీమ్ మాలిక్ తో పాటు పాక్ మాజీ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ కూడా బాబర్ కెప్టెన్సీపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘బాబర్ ఆజమ్ కెప్టెన్సీ పవిత్రమైన ఆవుతో సమానంగా ఉంది. దానిని (కెప్టెన్సీ) మనం విమర్శించడానికి వీళ్లేదు. బాబర్ కెప్టెన్సీ ఎంత అధ్వాన్నంగా ఉందనేది ఈ మ్యాచ్ ద్వారా మరోసారి స్పష్టమైంది. బాబర్ కెప్టెన్సీని విమర్శిస్తే అతడు ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడని, 32 ఏండ్లు వచ్చాక నేర్చుకుంటాడని సమాధానాలు వినిపిస్తున్నాయి. భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 7 నుంచి 11 ఓవర్ వరకు ఆ జట్టు పరుగులు చేయడానికే ఇబ్బంది పడింది. ఓవర్ కు కనీసం నాలుగు పరుగులు కూడా రాలేదు. మరి బాబర్ తన స్పిన్నర్లతో అప్పుడే నాలుగు ఓవర్ల కోటాను ఎందుకు పూర్తి చేయలేదు..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. Follow Us: Download App: --> RELATED STORIES భయమేసింది! ఇప్పుడు బాగానే ఉన్నా... కోలుకుని, కామెంటరీ బాక్సుకి తిరిగొచ్చిన రికీ పాంటింగ్... ఫుడ్డు లేదు, లగేజీ రాలేదు... బంగ్లాదేశ్ ప్రయాణంలో దీపక్ చాహార్‌కి ఇబ్బందులు... బోడ గుండు మీద గీకి... వికెట్ల కోసం ఇంగ్లాండ్ తిప్పలు! రావల్పిండి టెస్టులో వికెట్ల కోసం... ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడ్డ మహ్మద్ షమీ! ఉమ్రాన్ మాలిక్‌కి ఛాన్స్... బంగ్లాతో టెస్టు సిరీస్‌కి కూడా... రుతురాజ్ పోరాటం వృథా.. ఫైనల్లో ‘మహా’ పరాజయం.. 14 ఏండ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ సొంతం చేసుకున్న సౌరాష్ట్ర Recent Stories నడుమందాలు, నాటు సొగసులతో హీట్ పెంచుతున్న దీపికా పిల్లి, గ్లామర్ బాంబ్ పేల్చిన బుల్లితెర బ్యూటీ భారత్ లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు.. పీవోకేను స్వాధీనం చేసుకోలేదు - పాక్ ఆర్మీ కొత్త చీఫ్ సయ్యద్ అసిమ్ మునీర్
thesakshi.com : టాలీవుడ్ లెజెండరీ నటులు సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు మరియు కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్రను కలిగి ఉన్నారు మరియు తమ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినీ ప్రపంచానికి బంగారు దశను తీసుకువచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ గుండమ్మ కథ మరియు దాన వీర శూర కర్ణలో వినోదభరితమైన మరియు పౌరాణిక పాత్రలకు పేరుగాంచినట్లయితే, ANR తన దేవదాస్ సినిమా కోసం ఇష్టపడతారు. కృష్ణం రాజు విషయానికి వస్తే, అతని రంగూన్ రౌడీని మరియు ప్రధాన నటుడిగా అతని డామినేటింగ్ డైలాగ్‌లను ఎలా మర్చిపోగలరు? చివరగా, సూపర్ స్టార్ కృష్ణ మరియు పెద్ద తెరపై అతని మాయా ఉనికిని మనం ప్రస్తావించాలి. అది అల్లూరి సీతా రామరాజు పాత్ర అయినా, గూడాచారి 116 జేమ్స్ బాండ్ అప్పీల్ అయినా, సినీ ప్రపంచంలో ఆయన ముద్రను నిర్వచించాయి. అయితే ఇప్పుడు నలుగురు నటీనటులు కన్నుమూయడంతో స్వర్ణ దశ ముగిసినట్లే. ముఖ్యంగా కృష్ణం రాజు మరియు కృష్ణ 2022లోనే తుది శ్వాస విడిచారు మరియు టాలీవుడ్ మరియు సినీ అభిమానులకు షాక్ వేవ్‌లను పంపారు. టాలీవుడ్‌లో ఈ దిగ్గజ నటుల కెరీర్‌ల గురించి క్లుప్తంగా చర్చిద్దాం… సీనియర్ ఎన్టీఆర్ ఈ విలక్షణ నటుడు 1923 మే 28న జన్మించి 1996 జనవరి 18న కన్నుమూశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమకు సేవలందించిన ఆయన 300కు పైగా సినిమాల్లో నటించారు. 1949లో మన దేశం సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ మరుసటి సంవత్సరంలోనే 3 సినిమాలను అందుకున్నారు. అతని అగ్గి రాముడు, భూకైలాస్, గుండమ్మ కథ మొదలైనవి పెద్ద తెరపై తన సత్తాను నిరూపించుకున్నాయి మరియు 1964 లో అతను పూర్తిగా 16 సినిమాల్లో నటించి తన కెరీర్‌లో బంగారు దశలో ఉన్నాడు. 1980లలో వలె, అతను రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టాడు, అతను 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. అతను చివరిసారిగా 1993లో బాపు దర్శకత్వం వహించిన శ్రీనాథ కవి సార్వభౌముడు చిత్రంలో కనిపించాడు. 1996లో ఆయన హఠాన్మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు పూర్తి షాక్! అక్కినేని నాగేశ్వరరావు.. తెలుగు చిత్ర పరిశ్రమకు మరో ప్రధాన స్తంభం వచ్చేసింది… పెద్ద స్క్రీన్‌లపై ANR ఉనికి ప్రేక్షకులను తమ సీట్లకు అతుక్కుపోయేలా చేసింది. దాదాపు 7 దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు సేవలందించిన ఆయన అనేక ప్రతిష్టాత్మక అవార్డులను కూడా అందుకున్నారు. అతను 1944లో శ్రీ సీతా రామ జననంతో తన కెరీర్‌ను ప్రారంభించాడు, 1953లో విడుదలైన దేవదాసు సినిమాతో కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. అతని దొంగ రాముడు, మాయాబజార్, భూకైలాస్ మరియు మరెన్నో సినిమాలు అతన్ని భారతీయ ఉత్తమ నటులలో ఒకరిగా మార్చాయి. చిత్ర పరిశ్రమ. తన కొడుకు నాగార్జున, మనవళ్లు సుమంత్, అఖిల్, నాగ చైతన్యతో కూడా నటించాడు. నాగార్జున, అఖిల్ మరియు చైతన్య సినిమా అభిమానులందరినీ మెస్మరైజ్ చేసిన వారి కుటుంబ చిత్రం మనంలో అతను చివరిగా కనిపించాడు. అతను 2013 లో కడుపు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు మరియు అతను మేజర్ లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స తర్వాత కూడా మనం సినిమా షూట్‌ను కొనసాగించాడు. అతను 2014లో 90 ఏళ్ల వయసులో మరణించాడు మరియు అతని అభిమానులను కంటతడి పెట్టించాడు! కృష్ణం రాజు.. తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అతని తిరుగుబాటు వేషధారణ, ఏస్ డైలాగ్ డెలివరీ మరియు అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ అతన్ని వెండితెరపై ప్రత్యేకమైన అప్పీల్‌ని సొంతం చేసుకున్నాయి. 1966లో చిలకా గోరింకతో కెరీర్ ప్రారంభించిన ఆయన 190కి పైగా సినిమాల్లో నటించారు. అతని ఉత్తమ సినిమాలు కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ, అమర దీపం మరియు జీవన తరంగాలు. అతను చివరిగా ప్రభాస్ యొక్క రాధే శ్యామ్‌లో నటించాడు మరియు గురు పరమహంసగా కనిపించాడు. అతను కొన్ని నెలల క్రితం అంటే సెప్టెంబర్ 11, 2022న కన్నుమూశారు. అతని మరణం దిగ్భ్రాంతి కలిగించింది మరియు సినిమా అభిమానులందరూ తప్పకుండా ఆయనను కోల్పోతారు. సూపర్ స్టార్ కృష్ణ ఎట్టకేలకు కృష్ణుడి మరణంతో స్వర్ణ దశకు తెరపడింది. పెద్ద స్క్రీన్‌లపై అతని ఉనికిని అతని అభిమానులు మరియు సినీ ప్రేమికులందరికీ వేడుకగా ఉన్నందున అతను నట శేఖర అని మరియు సూపర్ స్టార్ అని పిలుస్తారు. 1943 మే 31న బుర్రిపాలెంలో జన్మించిన ఆయన సినిమాలపై ఆసక్తితో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి చెన్నైకి మకాం మార్చారు. అతని మొదటి చిత్రం తేనే మనసులు మంచి ఓపెనింగ్‌ను పొందాయి మరియు అతని మూడవ చిత్రం గూఢచారి 116తో అతను స్టార్ హోదాను సొంతం చేసుకున్నాడు మరియు ఒకేసారి 20 సినిమాలకు సంతకం చేశాడు. అల్లూరి సీతా రామరాజు వేషధారణ అయినా, మోసగాళ్లకు మోసగాడు సినిమాలో జేమ్స్ బాండ్ అప్పీల్ కౌ బాయ్ పాత్ర అయినా అన్నీ ప్రత్యేకమైనవి. విజయ నిర్మలతో కలిసి 40కి పైగా సినిమాల్లో నటించి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా తనేంటో నిరూపించుకున్నాడు. అతను చివరిసారిగా 2016లో శ్రీశ్రీలో కనిపించాడు మరియు వయస్సు సంబంధిత సమస్యల కారణంగా అప్పటి నుండి పెద్ద స్క్రీన్‌లకు దూరంగా ఉన్నాడు. అతను బహుళ అవయవ వైఫల్యం కారణంగా 15 నవంబర్, 2022న మరణించాడు మరియు అతని అభిమానులందరికీ షాక్ ఇచ్చాడు. కానీ ఈ నలుగురు నటీనటులు తమ పిల్లలు మరియు మనవళ్లతో కూడా సినిమా పరిశ్రమ తన ప్రకాశాన్ని కొనసాగించేలా చేసారు. Tags: #Krishnam Raju#Telugu Film Indrustry#TOLLYWOODDr Akkineni Nageswara RaoSenior NTRsuperstar Krishna
ఏకైక రాజధాని కోసం రైతులు కలిసి చేసిన పోరాటమే ఈ పాదయాత్ర. ఎంతోమంది మహిళలు, చిన్నారులు ఈ యాత్రలో పాల్గొన్నారు. నడిచి నడిచి కాళ్లకు గాయాలైనా సరే పట్టించుకోకుండా పయనమయ్యారు. ఎండ, వాన అంటూ తేడా లేకుండా, కనీస మౌలిక సదుపాయాలు కరువైనా, అలుపెరగని ఉద్వేగంతో "జై అమరావతి", "జై ఆంధ్రప్రదేశ్" అంటూ ముందుకు కదిలారు. అందులో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంతోమంది రైతులు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న కూడా వాళ్లను ఎవరు ఆపలేకపోయారు. వారితోపాటు మార్గమధ్యలో మరికొంత మంది ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ ప్రయాణంలో రైతులు, మహిళలు కొన్ని రోజులపాటు వందల మైళ్ళు నడుస్తూ 'అమరావతి రాజధాని' గొప్పతనాన్ని అందరికి చెబుతూ, వారిలోనూ ఒకే రాజధాని ఉండాలనే నినాదాన్ని, స్ఫూర్తిని కలుగజేశారు. మహోద్యమ సభ:- 'ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని' అనే నినాదంతో రైతులందరూ కలిసి పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ యాత్ర 45 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో "న్యాయస్థానం టు దేవస్థానం" అనే మహోద్యమ సభను ఏర్పాటు చేసారు. దీనిని అమరావతి పరిరక్షణ సమితి చేపట్టింది. ఈ బహిరంగ సభకు పోలీసులు అనుమతిని ఇవ్వకపోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించగా పర్మిషన్ వచ్చింది. దాంతో ఈ కార్యక్రమంలో దాదాపు 50వేల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 17న మధ్యాహ్నం 1గంటకు మొదలై, సాయంత్రం 6 గంటలకు పూర్తవుతుంది. ఈ సభకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ●"ఈ కార్యక్రమంలో మాతోపాటు పాదయాత్రలో పాల్గొన్న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా ప్రజలకు పాదాభివందనం చేస్తున్నామంటూ" కొందరు మహిళలు వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. ●సభ మొదలవ్వగానే అన్ని పార్టీల నేతలతోపాటు, వివిధ మతాలకు చెందిన హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులను వేదికపైకి ఆహ్వానించారు. ఆయా మతాల వారు వాళ్లకు చెందిన దేవుళ్లను ప్రార్థించారు. ఆ తర్వాత వందేమాతరం గీతాన్ని ఆలపించి సభను కొనసాగించారు. సభలో మిగతా పార్టీ నేతలు... ●ఈ సభలో సీపీఐ పార్టీ నారాయణ, రామకృష్ణ, బీజేపీ పార్టీ కన్నా లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ తులసీ రెడ్డి, తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన పార్టీ నాదెండ్ల మనోహర్ సహా పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు. వీరితోపాటు వైసీపీ పార్టీ నుంచి ఎంపీ రఘురామకృష్ణంరాజు నేత పాలుపంచుకున్నారు. ●"అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. కానీ రాజధానిగా 'అమరావతే' ఉండాలి. జై అమరావతి జై జై అమరావతి" అంటూ వేదికపై చంద్రబాబునాయుడు నినాదాలు చేసారు. ●సభలో 'రాజధాని అమరావతి ఆంధ్ర ప్రజల ఊపిరి' అంటూ కళా బృందం చేసిన నృత్యాలకు అందరూ ఒక్కసారిగా నిల్చొని తమ మెడలో ఉన్న ఆకుపచ్చ కండువాలను ఊపుతూ ఉత్సాహన్ని నింపారు. ఉద్యమం వెనుక అసలు గాథ:- ఆంధ్రప్రదేశ్ మొదటి సీఎం చంద్రబాబు నాయుడు 2014లో సెప్టెంబర్ 4న కొత్త రాజధాని ఏర్పాటు చేయడానికి పలు ప్రాంతాలు సందర్శించి 2015లో గుంటూరు జిల్లాలోని నేలపాడు గ్రామంలో ఏపీ నూతన రాజధానిగా 'అమరావతి' పేరును ప్రతిపాదించి, అదే ఏడాదిలో పనులు కూడా మొదలుపెట్టారు. కానీ 2019 ఎన్నికలో జగన్ మోహన్ రెడ్డి గెలిచి రెండో ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. ఈయన అమరావతిని కాదని మూడు రాజధానుల ప్రతిపాదనను అందరి ముందుంచారు. అందులో భాగంగా ఎక్సుక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను, జ్యూడిషియల్ క్యాపిటల్ గా కర్నూల్ ను, లెజిస్లేటివ్‌ క్యాపిటల్ ను అమరావతిలో ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. దాంతో రాజధాని అమరావతి కోసం భూమిని సేకరించి ఇచ్చిన అక్కడి ప్రజలు ఈ వార్త విని ఆందోళన చెందారు. మూడు రాజధానులు ప్రతిపాదనకు వ్యతిరేకంగా నినాదాలు రేకెత్తించారు. నిరాహారదీక్ష నిర్వహించారు. అక్కడితో ఆగకుండా దానినొక ఉద్యమంలా చేపట్టాలనుకున్నారు. అందుకుగానూ రైతులు అందరు కలిసి పాదయాత్ర ప్రణాళికను రూపొంచి, యాత్రను మొదలుపెట్టారు. ●అమరావతి రాజధాని కోసం రెండేళ్లపాటు(అంటే ఇప్పటికి 701 రోజులు) సాగిన పోరులో దాదాపు 180మంది రైతులు చనిపోగా, 2,500 మంది రైతుల పైన కేసులు పెట్టారు. యాత్ర ప్రయాణం ఇలా... ●నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు ఈ యాత్ర సాగింది. ●రైతులందరూ కలిసి మొదటి రోజున తుళ్లూరు నుంచి తాటికొండ వరకు 14.5 కిలోమీటర్లు, అలా రోజుకు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం నడిచారు. ●మొదటి ఆరు రోజులు గుంటూరులో, నవంబర్ 8 నుంచి 17 వరకు ప్రకాశం జిల్లాలో, నవంబర్ 18 నుంచి డిసెంబర్ 3 వరకు నెల్లూరు చేరుకున్నారు. ●అక్కడ్నుంచి డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు, ఆ తర్వాత ఈ నెల 15న తిరుపతికి చేరుకోవాలని ముందుగా నిశ్చయించుకున్నారు. అలా దాదాపు 70 ప్రధాన గ్రామాల మీదగా రైతులు పాదయాత్రను కొనసాగించారు. ఈ నెల 17న మహోద్యమ సభను నిర్వహించి రైతులందరితోపాటు ప్రజలు ఈ బహిరంగ సభను విజయవంతం చేశారు. మరోసారి "జై అమరావతి" అంటూ అందరూ నినాదాన్ని మారుమోగించారు.
అమరావతి టు అరసవల్లి పాదయాత్రలో భాగంగా 13వ రోజు ఆదివారం అమరావతి రైతుల పాదయాత్ర నందివాడ మండలం టెలిఫోన్‌ నగర్‌ వద్ద మండల టీడీపీ నాయకులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని హాజరతులిచ్చి స్వాగతం పలికారు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 - కృష్ణా జిల్లాలో 106 కి.మీ సాగిన పాదయాత్ర గుడివాడ/నందివాడ, సెప్టెంబరు 25 : అమరావతి టు అరసవల్లి పాదయాత్రలో భాగంగా 13వ రోజు ఆదివారం అమరావతి రైతుల పాదయాత్ర నందివాడ మండలం టెలిఫోన్‌ నగర్‌ వద్ద మండల టీడీపీ నాయకులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని హాజరతులిచ్చి స్వాగతం పలికారు. గ్రామ గ్రామాన అమరావతి రైతులకు బిందెలతో నీళ్లు వారబోసి హారతులిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. నాలుగు కిలోమీటర్ల పొడవునా మండల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి ఽగజమాలతో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాట్రగడ్డ రవి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి అమరావతి రైతులకు మజ్జిగ ప్యాకెట్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు. దాతల విరాళాల వెల్లువ.. పెదపారుపూడి : అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ పెదపారుపూడి మండల వెంట్రప్రగడ గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ చలసాని వాసు, దోసపాడు గ్రామానికి చెందిన రైతులు రూ.75 వేలను పామర్రు టీడీపీ ఇన్‌చార్జ్‌ వర్ల కుమార్‌ రాజా ఆధ్వర్యంలో నేతల సమక్షంలో ఆదివారం అమరావతి రైతులకు అందజేసినట్టు మండల అధ్యక్షుడు చలసాని రమేశ్‌ చౌదరి తెలిపారు. గుడివాడ రూరల్‌: గుడివాడ రూరల్‌ మండలం దొండపాడు గ్రామానికి చెందిన రైతులు రూ. 35 వేల విరాళం అమరావతి రైతులకు అందజేశారు. బొమ్ములూరు గ్రామ రైతులు శనివారం రూ.50 వేల విరాళం అమరావతి జేఏసీకి అందజేశారు. బొమ్ములూరు గ్రామానికి చెందిన గుత్తా సుబ్రహ్మణ్యం రూ.50 వేలు అందజేశారు. గుడివాడ రూరల్‌ మండలం నుంచి అమరావతి పాదయాత్రకు వందలాది మంది తరలివచ్చారు. మహిళలు యాత్రలో పాల్గొని మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. తుమ్మలపల్లిలో యలమంచిలి సతీష్‌ అమరావతి రైతులకు రూ.56 వేల చెక్కును విరాళంగా అందజేశారు. అనంతరం వెన్ననపూడి సెంటర్‌ పులపర్రు గ్రామస్థుడు (వికలాంగుడు) అమరావతి రైతులకు రూ.20 వేల చెక్కును అందజేసి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం బొప్పిడి సుబ్రహ్మణ్యేశ్వరరావు దంపతులు రూ.50 వేలు విరాళం అందజేశారు. సూరపనేని నాగేశ్వరరావు కుమారులు మహేష్‌, సురే్‌షలు రూ.10,116లు అమరావతి రైతులకు అందజేశారు. కుదరవల్లి వంతెన వద్ద మాజీ ఎంపీటీసీ ఉప్పల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలుకొండ గ్రామ రైతులు రూ.36 వేలు విరాళంగా అందజేశారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలుపుతూ మలిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కొండపల్లి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జనార్థనపురం రైతులు 700 జతల బూట్లు పంపిణీ చేశారు. దద్దరిల్లిన కుదరవల్లి అమరావతి రైతుల మహాపాదయాత్రలో భాగంగా కృష్ణాజిల్లాలో నిర్వహించే పర్యటనలో ఆఖరి గ్రామం కుదరవల్లి కావటంతో ఆక్వా రైతు కొల్లూరి సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌ మసిముక్కు వేణు ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి అడుగడుగునా నీరాజనాలతో హోరెత్తించారు. అనంతరం పాదయాత్ర ముగియటంతో కేక్‌ కట్‌ చేసి రైతులకు పంచిపెట్టారు. అమరావతి రైతులు కృష్ణా జిల్లాను దాటి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్లారు. కార్యక్రమంలో మాజీ మంత్రి యర్నేని సీతాదేవి - రామచంద్రరావు, మండల టీడీపీ అధ్యక్షులు దానేటి సన్యాసిరావు, కార్యదర్శి నంబూరి రాకేష్‌, సీనియర్‌ నేతలు కాకరాల సురేష్‌, రాధాకృష్ణ, గూడపాటి రత్నప్రసాద్‌, గద్దె సురేష్‌, ఆరెకపూడి రామశాస్త్రి, ఉప్పల వెంకటేశ్వరరావు, యార్లగడ్డ రవి, జాన్‌, ప్రభాకర్‌, సోమరాజు, మసిమక్కు వేణు, కృష్ణయ్య స్వామి, శ్రీనివాసరావు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రైతులు సహకరించారు : రావి వెంకటేశ్వరరావు గుడివాడ, చుట్టుపక్కల మండలాల రైతులు మహాపాదయాత్రకు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. రాజధానిగా అమరావతే కావాలని, కోర్టు తీర్పును అమలు చేయాలని పాదయాత్రకు మద్దతు తెలిపారు. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన విధంగా బుద్దిచెబుతారన్నారు. మూర్ఖపు నిర్ణయాలతో వ్యవస్థలు నాశనం : సౌమ్య రాజధానికి భూములిచ్చిన రైతులు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని రెండో విడత పాదయాత్ర చేస్తున్నారు. హైకోర్టు తీర్పు అమలు వారి ప్రధాన డిమాండ్‌. రైతుల జీవితాలతో సీఎం ఆటలాడుకుంటున్నారు. మూర్ఖుడి పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి.అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతమవుతుంది. మీడియాలేకుంటే ప్రాణహాని : జయమంగళ రైతుల మహాపాదయాత్రకు రాకుండా శనివారం యాభైమంది పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ఉండటంతో ఎట్టకేలకు ప్రాణహానినుంచి బయటపడ్డా. రైతులు చేస్తున్న పాదయాత్రలో సంకల్ప బలం ఉంది. రైతుల వైపే న్యాయం ఉంటుంది. విజయంసాధిస్తారు. 70 మంది ఎమ్మెల్యేలు జగన్‌కు వ్యతిరేకం : ఉమా వైసీపీలోని 70మంది ఎమ్మేల్యేలు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. ఎమ్మేల్యేల పనితీరు గ్రాఫ్‌పేరుతో లెక్కలు చెబుతానని అన్న సీఎం ఈ కారణంతోనే కార్యక్రమాన్ని వాయిదా వేశారు. విశాఖపట్నంలో అఖిలపక్షంతో సీఎం రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తే ఏ పార్టీ సహకరించలేదు. చంద్రబాబునాయుడు కుటుంబంపై ఎవరైనా అవాకులు, చవాకులు పేలితే చూస్తూ ఊరుకోం. పాదయాత్రనుంచి ప్రజలను వేరుచేసేందుకు సీఎం జగన్‌ ఎత్తుగడలు వేస్తున్నాడు. బాలకృష్ణ ట్వీట్‌తో వైసీపీ ఎమ్యేల్యేలు కలవరపాటుకు గురవతున్నారు. పులివెందుల సీటు బీసీలకు ఇస్తారా : కొల్లు రవీంద్ర కుప్పం టీడీపీ ఎమ్మెల్యే సీటును బీసీలకు ఇమ్మని సీఎం జగన్‌ అంటున్నారు. పులివెందుల సీటు కూడా బీసీలకు ఎందుకివ్వరు. ఎన్నో సంవత్సరాలుగా పులివెందులలో వైఎస్‌ కుటుంబం జాగీరుగానే వస్తోంది. పులివెందుల సీటును బీసీలకు ఇచ్చేదమ్ముందా. జిల్లాలో వీకెండ్‌ మంత్రి ఒకరు ఉన్నారు. వారం చివరిలో వచ్చి మామూళ్లు వసూలు చేసుకుని పోతున్నాడు. అవినీతి పరుడైన మంత్రి చంద్రబాబునాయుడిపై, రైతులు చేస్తున్న మహాపాదయాత్రపై విమర్శలు చేస్తున్నాడు. అమరావతి రైతుల ఉద్యమంలో వాస్తవం ఉంది. విజయం వారినే వరిస్తుంది. రైతులే విజయం సాధించారు - అర్బన్‌బ్యాంకు చైర్మన్‌ పిన్నమనేని బాబ్జి గుడివాడలో అధికారపార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా మహపాదయాత్రను ఆపలేకపోయారు. రైతులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి మహాపాదయాత్రకు సంఘీభావం తెలియజేశారు. రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పునకు, ప్రజల అభిప్రాయానికి పాలకులు గౌరవం ఇవ్వాలి. బాపూజీ ఆశయాలు సాధిస్తాం : అమరావతి జేఏసీ రాష్ట్ర రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని, కోర్టు తీర్పుకు కట్టుబడి రాజధానిని అభివృద్ధిపరచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అమరావతి పరిరక్షణ సమితి నేత కొలికిపూడి శ్రీనివాసరావు అన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర గుడివాడ చేరుకోగా ఏలూరు రోడ్డులోని గాంధీ విగ్రహానికి కొలికిపూడి పూలమాలవేసి నివాళ్ళులర్పించారు. పాదయాత్ర విజయవంతం కావాలని, జగన్‌కు సద్భుద్ధి ప్రసాదించాలని గాంధీజీని కోరుకున్నట్టు తెలిపారు. టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి గోకవరపు సునీల్‌కుమార్‌, మాజీ కౌన్సిలర్‌ అడుసుమిల్లి శ్రీనివాసరావు, నాయకులు బ్రహ్మయ్య, కుందేటి ప్రసాద్‌, జోన్స్‌ తదితరులు పాల్గొన్నారు.
2. సంతాన ప్రాప్తికోసం గోధుమపిండి ఉండలు చేసి, వాటిలో కొద్దిగా శనగపప్పు, పసుపు కలిపి ఆవుకు తినిపించండి. 3. సంతానం కోసం బాధ పడుతుంటే, తోటపని చేయండి. కొత్తకొత్త మెుక్కలను నాటి, వాటి సంరక్షణ చేయండి. 4. ఇంటి బయటకు వచ్చి, నల్లని ఆవు చుట్టూ తలపై చెయ్యి ఉంచుకుని ప్రదక్షిణ చేయాలి. తప్పకుండా సంతానప్రాప్తి కలుగుతుంది. 5. స్త్రీలు ప్రతిరోజు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ, అక్కడ దీపారాధన చేస్తే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. 6. సంతాన ప్రాప్తి కలగాలంటే వెదురు మెులకలను తీసుకొని, దానితో శివలింగం చేసి పూజ చేయాలి. కొద్దికాలంలోనే సంతానప్రాప్తి కలుగుతుంది.
2020 యొక్క ఉత్తమ కొరియన్ డ్రామాలు, అవి ఇటావాన్ క్లాస్, హాయ్, బై మామా, ది కింగ్: ఈథర్నల్ మోనార్క్, క్రాష్ ల్యాండింగ్ ఆన్ యు మరియు ఈ కథనంలో మరిన్ని. వివిధ శైలుల నుండి 2020లో 15+ ఉత్తమ దక్షిణ కొరియా నాటకాలు ఇక్కడ ఉన్నాయి. దీన్ని మిస్ చేయవద్దు లేదా చూడటం మర్చిపోవద్దు. 1. ఇటావోన్ క్లాస్ Itaewon క్లాస్ అనేది అదే పేరుతో ఉన్న వెబ్‌టూన్ నుండి స్వీకరించబడిన ఒక ప్రసిద్ధ కొరియన్ నాటకం. ఈ నాటకాన్ని పార్ సియో-జూన్ ప్రధాన పాత్రలో పార్క్ సే రాయ్‌గా, కిమ్ డా-మి పాత్ర జో యి-సియోగా, యూ జే-మ్యూంగ్ జాంగ్ డే-హీగా మరియు క్వాన్ నారా ఓహ్ సూ-ఆహ్‌గా నటించారు. Itaewon క్లాస్ చాలా చర్చనీయాంశమైంది ఎందుకంటే ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కథను కలిగి ఉంది. అహేతుక ప్రపంచం యొక్క వాస్తవికతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే మొండి వైఖరి మరియు ధైర్యం ఉన్న యువకుల సమూహం యొక్క అనుభవాన్ని చెబుతుంది. పార్క్ సే రాయ్ ఎవరికీ భయపడడు. ఆమె తన స్వంత జీవితాన్ని గడపాలని నిశ్చయించుకుంది మరియు ఆమె కోరుకున్నదంతా పొందుతుంది. ఒకప్పుడు, పార్క్ సే రాయ్‌కి జైలు శిక్ష పడే వరకు జంగ్గా కుటుంబంతో వైరం ఏర్పడింది. జైలు నుండి బయటపడ్డ పార్క్ సే రాయ్ జంగా కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవడానికి 15 సంవత్సరాల ప్రణాళికను రూపొందించాలని నిశ్చయించుకున్నాడు. ఏడు సంవత్సరాల తర్వాత, పార్క్ సే రాయ్ ఇటావోన్ ప్రాంతంలో డాన్ బామ్ రెస్టారెంట్ వ్యాపారాన్ని స్థాపించారు, కాబట్టి అతను సోషల్ మీడియాలో ప్రముఖ సోషియోపాత్ అయిన జో యిసెయోను కలిశాడు. జో యిసెయో పార్క్ సే రాయ్ రెస్టారెంట్‌లో మరియు డాన్-బామ్ రెస్టారెంట్‌లో మేనేజర్‌లో చేరాడు. 2. ది వరల్డ్ ఆఫ్ ది మ్యారీడ్ టైటిల్ సూచించినట్లుగా, వివాహిత ప్రపంచం యొక్క నాటకం వివిధ పరీక్షలను ఎదుర్కొనే వైవాహిక జీవిత కథను పంచుకుంటుంది, వాటిలో ఒకటి ద్రోహం. ఈ డ్రామాలో సీనియర్ నటి కిమ్ హీ ఏ జీ సన్ వూగా, పార్క్ హే జోన్ లీ టే ఓగా, హాన్ సో హీ యెయో డా-క్యుంగ్‌గా నటించారు. జీ సన్-వూ ఒక కుటుంబ వైద్యుడు. ఆమె లీ టే ఓహ్‌ను వివాహం చేసుకుంది మరియు ఒక కుమారుడు ఉన్నాడు. జీ సన్-వూ విజయవంతమైన కెరీర్, సంతోషకరమైన కుటుంబం వంటి ప్రతిదీ కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే చివరికి భర్తతో పాటు చుట్టుపక్కల వారు కూడా మోసం చేశారు. ఇంతలో, Le Tae-oh ఒక వినోద వ్యాపారాన్ని నడుపుతున్నాడు మరియు ప్రసిద్ధ చలనచిత్ర దర్శకుడు కావాలని కలలుకంటున్నాడు. లీ టే-ఓహ్ తన భార్యను ప్రేమిస్తాడు, కానీ లీ టే-ఓహ్ తన భార్య యో డా-క్యుంగ్ కంటే చిన్న వయస్సులో ఉన్న స్త్రీతో ప్రేమలో పడతాడు. ఈ డ్రామాలో, ప్రేక్షకుల భావోద్వేగాలు విసుగు చెందని కథాంశంతో గొప్పగా హరించబడతాయి మరియు మొదటి ఎపిసోడ్‌లో వెల్లడి చేయబడ్డాయి, తద్వారా ఇంట్లో వీక్షకులు హాయిగా కూర్చోవడం మరియు కథ యొక్క ఉత్కంఠను కొనసాగించడం. 3. మీపై క్రాష్ ల్యాండింగ్ కామెడీ మరియు రొమాంటిక్ జోనర్‌లను మిళితం చేసిన ఈ డ్రామా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచడంలో విజయవంతమైంది. ఈ డ్రామా దక్షిణ కొరియా నుండి ఒక సమ్మేళనానికి వారసుడు యూన్ సే రి (సోన్ యే జిన్) మరియు ఉత్తర కొరియా ప్రాంతంలోని లీ జంగ్ హ్యోక్ (హ్యూన్ బిన్) మధ్య జరిగిన సమావేశం యొక్క కథను చెబుతుంది. ఒక రోజు, యూన్ సే రి పారాగ్లైడింగ్ చేస్తున్నప్పుడు, బలమైన గాలుల కారణంగా ఆమెకు ప్రమాదం జరిగింది, అది ఉత్తర కొరియాలో అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అదృష్టవశాత్తూ, అక్కడ అతను ఉత్తర కొరియా ఆర్మీ అధికారి అయిన లీ జంగ్ హియోక్‌ను కలుస్తాడు. లీ జంగ్ హైయోక్ యూన్ సే రిని రక్షించడానికి మరియు దాచడానికి ప్రయత్నిస్తాడు. మీపై క్రాష్ ల్యాండింగ్ మిస్ చేయకూడని ఉత్తమ కొరియన్ డ్రామాలలో ఇది ఒకటి. 4. హాయ్, బై మామా హాయ్ బై, మామా అనేది ఫ్యామిలీ డ్రామా జానర్ ఫాంటసీ మరియు ఫ్యామిలీ ఓరియెంటెడ్. డ్రామాలో కిమ్ టే-హీ, లీ క్యు-హ్యుంగ్, గో బో-గ్యుల్, షిన్ డాంగ్-మి, లీ షి-వూ మరియు సియో వూ-జిన్ నటించారు. హలో, బై మామా అనే డ్రామా ఒక విషాదకరమైన ప్రమాదంలో మరణించిన చాయోరి (కిమ్ తే హీ) అనే మహిళ గురించి చెబుతుంది. ఆసక్తికరంగా, అతను మరణించిన ఐదు సంవత్సరాల తర్వాత, చా యోరి తన భర్త జో కాంగ్వా (లీ క్యుహ్యూంగ్) మరియు కుమార్తెతో తిరిగి కలవడానికి 49 రోజుల పాటు మానవునిగా పునర్జన్మ పొందింది. అయితే, ఆ స‌మ‌యంలో చ‌యోరీకి త‌న భ‌ర్త మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న‌ట్లు తెలిసింది. 5. రొమాంటిక్ డాక్టర్ కిమ్ 2 రొమాంటిక్ డాక్టర్ కిమ్ 2 అనేది మునుపటి డ్రామాకు కొనసాగింపు మరియు ఇది హాన్ సుక్ క్యూ, లీ సంగ్ క్యుంగ్ మరియు అహ్న్ హ్యో సియోప్ నటించిన మెడికల్ డ్రామా. బూ యోంగ్-జూ (హాన్ సుక్-క్యూ) ఒక మేధావి వైద్యుడు మరియు సర్జన్. తనను తాను డా. రొమాంటిక్ మరియు అతన్ని గురు కిమ్ అంటారు. అతను ఇతరులతో సాంఘికం చేయడానికి ఇష్టపడని విచిత్రమైన వైద్యుడు. బూ యోంగ్-జూ డోల్డమ్ యొక్క చిరిగిన క్లినిక్‌ని నడుపుతున్నాడు. ఇది కూడా చదవండి: క్రెబ్స్ సైకిల్ - పూర్తి వివరణ + చిత్రాలు మరోవైపు, చా యున్ జే (లీ సుంగ్ క్యుంగ్) రెండవ సంవత్సరం సహచరుడు, అతను నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది మరియు నమ్మకంగా ఉంది. వాస్తవానికి, చా యున్ జా తన తెలివితేటల కారణంగా ఎల్లప్పుడూ ఉన్నత విద్యార్ధుల ర్యాంక్‌లో ఉంది. అప్పుడు, Seo Woo Jin (Ahn Hyo Seop) రెండవ సంవత్సరం సహచరుడు మరియు సర్జన్. Seo వూ జిన్ తన సహోద్యోగులతో కలిసి ఉండలేనంత వరకు, ప్రతి విషయంలో విరక్తిగా మరియు సందేహాస్పదంగా ఉంటాడు. అయినప్పటికీ, అతని నిర్వహణ నైపుణ్యం కోసం అతను ఎల్లప్పుడూ ప్రొఫెసర్చే ప్రశంసించబడ్డాడు. చా యున్-జే మరియు సియో వూ-జిన్ ఒక అసాధారణ వైద్యుడు, టీచర్ కిమ్‌ని కలుస్తారు. టీచర్ కిమ్‌తో వారి అనుభవాలతో వారు మానవులుగా మరియు వైద్యులుగా ఎదిగారు. 6. బ్లాక్ డాగ్ : ఉపాధ్యాయుడిగా ఉండటం డ్రామా బ్లాక్ డాగ్: బీయింగ్ ఎ టీచర్ అనేది కామెడీ జానర్ డ్రామా, ఇందులో సో హ్యూన్-జిన్, రా మి-రన్ మరియు హా-జూన్ నటించారు. టీచర్ కావాలనే తన కలను సాకారం చేసుకునే యువతి పోరాటాన్ని ఈ డ్రామా చెబుతుంది. చివరకు సౌత్ కొరియాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ అయ్యే అవకాశం వచ్చింది. ఒకరోజు, అతను బోధించే పాఠశాలలో కొన్ని సమస్యలు తలెత్తాయి. తలెత్తే వివిధ సమస్యలతో పాటు, అతను మెరుగైన సామర్థ్యాలతో ఉపాధ్యాయుడిగా ఎదుగుతాడు. 7. అందమైన ప్రేమ, అద్భుతమైన జీవితం కొరియన్ డ్రామా బ్యూటిఫుల్ లవ్, వండర్‌ఫుల్ లైఫ్ అనేది ఫ్యామిలీ జానర్ డ్రామా, ఇది వైఫల్యం మరియు ఆనందాన్ని కనుగొనడానికి జీవితాన్ని ప్రేమించడం నేర్చుకోవడం గురించి చెబుతుంది. ఈ డ్రామా ఒక జంట సోదరులు మరియు సోదరీమణుల సంక్లిష్ట జీవితాల గురించి చెప్పడంపై దృష్టి పెడుతుంది. కిమ్ సియోల్ ఎకి కిమ్ చియోంగ్ ఎ అనే తమ్ముడు ఉన్నాడు. అతని తమ్ముడు యుక్తవయసులోని బాలుడి హత్యకు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అదనంగా, కిమ్ సియోల్ A సమ్మేళనం యొక్క కొడుకుతో సంక్లిష్టమైన సంబంధాన్ని కలిగి ఉంది. ఈ డ్రామా చాలా ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే ఇది రోజువారీ జీవితానికి సంబంధించిన విభిన్న సమస్యలను ప్రదర్శిస్తుంది. 8. మనీ గేమ్స్ మీరు ఫైనాన్స్‌కి సంబంధించిన డ్రామాలను ఇష్టపడితే, ఈ డ్రామా మీరు చూడటానికి ఖచ్చితంగా సరిపోతుంది. ఈ నాటకాన్ని కో సూ చా యి-హున్‌గా, లీ సుంగ్-మిన్ హీయో జేగా మరియు షిమ్ యున్-క్యుంగ్ లీ హై-జోన్‌గా ఆడారు. దక్షిణ కొరియాలో దివాలా తీసిన బ్యాంక్ గురించి చెబుతుంది. ఏదో ఒక రోజు 1997లో ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటామని దేశాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో ఆర్థిక సేవల సంఘం వద్ద ప్రజలు అలాంటి సంఘటనలు జరగకుండా పోరాడుతున్నారు. 9. హాస్పిటల్ ప్లేజాబితా ఆరోగ్యం మరియు ఔషధం గురించి కొరియన్ నాటకం ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. జో జంగ్ సుక్, కిమ్ డే మ్యూంగ్, జంగ్ క్యుంగ్ హో మరియు జియోన్ మి దో నటించిన డ్రామా హాస్పిటల్ ప్లేలిస్ట్ తాజా వాటిలో ఒకటి. టైటిల్ సూచించినట్లుగా, ఈ డ్రామా ఒక ఆసుపత్రిలోని వైద్యుల బృందంలో జరుగుతుంది. హాస్పిటల్ ప్లేజాబితా 20 సంవత్సరాల క్రితం వైద్య పాఠశాలలో ప్రవేశించినప్పటి నుండి స్నేహితులుగా ఉన్న ఐదుగురు వైద్యుల కథను చెబుతుంది. వారు చాలా దగ్గరగా ఉన్నారు, వారు ఒకరి మనస్సులను మరొకరు చదవగలరు. వారి దైనందిన జీవితం క్లిష్టమైన వ్యక్తులకు సేవ చేయడానికి లేదా ఆసుపత్రిలో ఆగిపోవడానికి నిండి ఉంటుంది. అధికారికంగా కానప్పటికీ, సాంగ్-హ్వా సమూహానికి నాయకుడిగా వ్యవహరిస్తారు. సియోక్-హ్యోంగ్ ఒంటరివాడు అయితే, ఇక్-జున్ ఇతరులకన్నా తాను గొప్పవాడని తరచుగా భావిస్తాడు. అప్పుడు జున్-వాన్ ఉన్నాడు, అద్భుతమైన ఇంకా దయనీయమైన సర్జన్. జియోంగ్-వోన్ ఎల్లప్పుడూ మర్యాదగా మరియు పనిలో ఇతరుల పట్ల శ్రద్ధ వహిస్తాడు, కానీ వింత పాత్రను కలిగి ఉంటాడు. ఈ డ్రామా ప్రేక్షకుల దైనందిన జీవితానికి నిజంగా దగ్గరగా ఉండే తేలికపాటి కథను అందించాలనుకుంటున్నది. 10. రాజు : ఎటర్నల్ మోనార్క్ డిసెండెంట్ ఆఫ్ ది సన్, గోబ్లిన్ మరియు మిస్టర్. సూర్యరశ్మి. ది కింగ్: ఎథర్నల్ మోనార్క్ ఒక సమాంతర ప్రపంచానికి తలుపులు తెరిచే ఉద్దేశ్యంతో మానవ ప్రపంచానికి వచ్చిన ఒక రాక్షసుడి కథను చెబుతుంది. అయితే, దీనిని కొరియన్ చక్రవర్తి లీ గోన్ (లీ మిన్-హో) వ్యతిరేకించారు. అందువల్ల, చక్రవర్తి దక్షిణ కొరియా డిటెక్టివ్ జంగ్ టే-ఇయుల్ (కిమ్ గో-యూన్) సహాయంతో సమాంతర ప్రపంచానికి తలుపులు మూయడానికి ప్రయత్నిస్తాడు. 11. హైనాలు యూన్ హీ-జే మరియు జంగ్ జెమ్-జా అనే ఇద్దరు న్యాయవాదుల కథను హైనా చెబుతుంది. వారు దక్షిణ కొరియా అధికారులతో కూడిన ఉన్నత తరగతి కోసం పని చేస్తారు. యూన్ హీ-జే ఒక ఉన్నత న్యాయవాది, అతను తన పనిలో తెలివిగా మరియు నమ్మకంగా ఉంటాడు. ఇదిలా ఉంటే, జంగ్ గెయుమ్-జా చాలా డబ్బు సంపాదించడానికి అన్ని మార్గాలపై ఆధారపడే న్యాయవాది. జంగ్ జియుమ్-జా ఆమె చర్యలు ఎంత దుర్మార్గంగా ఉన్నా, అవసరమైన మార్గాలను ఉపయోగించి ఆమె కేసును గెలుచుకుంది. ఈ రెండూ ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి, కానీ తర్వాత అవి తమ హై-ఎండ్ క్లయింట్‌లకు సేవ చేయడానికి "హైనాలు"గా మారుతాయి. 12. నా హోలో లవ్ హోలో అనేది ఒక అధునాతన హోలోగ్రాఫిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనిని ప్రత్యేక అద్దాలను ఉపయోగించి చూడవచ్చు. అతను పరిపూర్ణ సహచరుడు, తెలివైనవాడు, దయగలవాడు మరియు యజమాని యొక్క కోరికల ప్రకారం సవరించవచ్చు. అతను తన సృష్టికర్త, నాండో వంటి రూపాన్ని కూడా కలిగి ఉన్నాడు, అతను మేధావి అయినప్పటికీ బాధించేవాడు. ఇది కూడా చదవండి: సజాతీయమైనది - అర్థం మరియు పూర్తి వివరణ (రసాయన) హోలో చూడటానికి, మానవుడు తప్పనిసరిగా హోలోగ్రాఫిక్ గ్లాసెస్ ధరించాలి. ఒక సారి, హోలో స్నేహపూర్వక వృత్తి ఉద్యోగి అయిన సో-యియోన్‌పై తన అద్దాలు జారాడు. అద్దాలు తప్పుడు చేతుల్లో పడకుండా ఉండటానికి ఇది జరుగుతుంది. 13. కింగ్‌డమ్ సీజన్ 2 డ్రామా సిరీస్ కింగ్‌డమ్ సీజన్ 2 మునుపటి సిరీస్, కింగ్‌డమ్ సీజన్ 1 యొక్క కొనసాగింపు. ఈ డ్రామాలో జు జి-హూన్, ర్యూ సెంగ్-రియోంగ్ మరియు బే డూనా నటించారు. ఈ నాటకం ఒక రాజ్యం యొక్క కథను చెబుతుంది. ఒక రహస్యమైన ప్లేగు జోసెయోన్‌ను గందరగోళంగా మార్చినప్పుడు, చో కుటుంబం యొక్క చెడు ప్రణాళికలు రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని భావిస్తుంది. జాంబీస్ దాడి నుండి ప్రజలను రక్షించే తీరని ప్రయత్నంలో, క్రౌన్ ప్రిన్స్ జీవించి ఉన్నవారితో పోరాడటానికి మరియు చనిపోయిన పౌరుల దాడులను ఆపడానికి రక్తపాత యుద్ధంలో పాల్గొంటాడు. 14. వాతావరణం బాగా ఉన్నప్పుడు ఈ కొరియన్ డ్రామా హై వోన్ (పార్క్ మిన్ యంగ్) అనే మంచి సాధారణ మహిళ కథను చెబుతుంది. హే వాన్ యొక్క బాల్యం ఆమెను మానసికంగా బాధపెట్టింది, ఇది ఆమె ఇతరులను విశ్వసించడం సులభం కాదు మరియు ఆమె హృదయాన్ని మూసివేసింది. ఒక రోజు, హై వాన్ సియోల్‌లో తన జీవితంతో విసుగు చెంది, బుక్‌యున్ విలేజ్‌లోని తన స్వగ్రామానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. గ్రామంలో, "గుడ్‌నైట్ బుక్‌స్టోర్" బుక్‌స్టోర్ నడుపుతున్న యూన్ సోబ్ (సియో కాంగ్-జూన్) అనే వ్యక్తిని హై వోన్ కలుస్తాడు. 15. ఎ పీస్ ఆఫ్ యువర్ మైండ్ మీరు ఉత్తమ రొమాంటిక్ కొరియన్ డ్రామా సిఫార్సుల కోసం చూస్తున్నట్లయితే, ఎ పీస్ ఆఫ్ యువర్ మైండ్ మీ ప్రత్యామ్నాయాలలో ఒకటి కావచ్చు. ఈ డ్రామా హా వాన్ (జంగ్ హే ఇన్) మరియు హన్ సే వూ (ఛే సూ బిన్)ల జీవితాన్ని చెబుతుంది. హా వాన్ స్థిరమైన మరియు దయగల AI ప్రోగ్రామర్. M&H పోర్టల్ సైట్ వ్యవస్థాపకుడిగా, అతను విజయవంతమైన వ్యక్తి అయ్యాడు. హా వాన్‌కు విరుద్ధంగా, Seo వూ అనిశ్చిత జీవితాన్ని కలిగి ఉంది. అతను క్లాసిక్ రికార్డుల ఉత్పత్తికి ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబం మరియు ఇల్లు లేకుండా ఏకాంతంగా జీవించడం వలన Seo వూ ఎల్లప్పుడూ సానుకూల దృష్టితో చూసేలా చేస్తుంది. 16. మియో ది సీక్రెట్ బాయ్ డ్రామా మౌ ది సీక్రెట్ బాయ్ అదే పేరుతో ఉన్న వెబ్‌టూన్ నుండి స్వీకరించబడిన సిరీస్. ఈ కామెడీ, రొమాంటిక్ మరియు ఫాంటసీ జానర్ డ్రామాను ఇన్ఫినిట్ యొక్క L మరియు షిన్ హే సన్ పోషించారు. ఈ సిరీస్ పిల్లి మనిషిగా మారే కథను చెబుతుంది. L హాంగ్ జో పాత్రలో మానవులు మరియు పిల్లులుగా మానవులతో కలిసి జీవించేవాడు. 16. మీ మెమరీలో నన్ను కనుగొనండి డ్రామా, ఫాంటసీ మరియు రొమాన్స్ జోనర్‌లను కలిపి, మీలో తాజా 2020 కొరియన్ డ్రామా కోసం వెతుకుతున్న వారికి మీ జ్ఞాపకంలో నన్ను కనుగొనండి ప్రత్యామ్నాయ ఎంపిక. ఈ డ్రామా వేర్వేరు విధి ఉన్న ఇద్దరు వ్యక్తుల కథను చెబుతుంది. లీ జంగ్ హూన్ (కిమ్ డౌన్ వూక్) కొరియాలో సుప్రసిద్ధ న్యూస్ యాంకర్. అతను హైపర్ థైమెసియాతో బాధపడుతుంటాడు, ఇది బాధితుడు ఒక సంఘటనను వివరంగా గుర్తుంచుకోవడానికి అనుమతిస్తుంది. మరోవైపు, యెయో హా జిన్ (మూన్ గా యంగ్) తన గతంలోని అత్యంత ముఖ్యమైన క్షణాలు మరియు జ్ఞాపకాలను తరచుగా మరచిపోయే అరుదైన పరిస్థితితో బాధపడుతున్న నటి. 17. ఎవరికీ తెలియదు ఇటీవలి కొరియన్ డ్రామా నోబడీ నోస్ మీరు చూడడానికి బాగానే ఉంది. దర్శకుడు లీ జంగ్ హ్యూమ్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ డ్రామా, వరుస హత్యల విషాదం కారణంగా చిన్నతనంలో తన ప్రాణ స్నేహితుడిని కోల్పోయిన పోలీసు డిటెక్టివ్ చా యంగ్ జిన్ (కిమ్ సే హ్యూంగ్) కథను చెబుతుంది. 19 సంవత్సరాలు గడిచిన తర్వాత, తన స్నేహితుడిని చంపిన కిల్లర్ ఫిగర్ మళ్లీ కనిపించాడు, యువ జిన్ అతనిని తన చేతులతో డిటెక్టివ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. 18. మరోసారి కొరియన్ నాటకాలు ఎల్లప్పుడూ నాటక శైలిలో ఉత్తమమైన వాటిని అందిస్తాయి. ఈ డ్రామా జంట సాంగ్ యంగ్ దల్ (చియోన్ హో జిన్) మరియు జాంగ్ ఓక్ బూన్ (చా హ్వా యెయోన్) జీవితం గురించి చెబుతుంది. వారు నలుగురు పిల్లలతో ఆశీర్వాదం పొందారు. అయితే పెళ్లయిన ముగ్గురు పిల్లలకు దురదృష్టం ఎదురైంది. వారు దురదృష్టవశాత్తు తమ భాగస్వాములతో విడాకులు తీసుకోవలసి వచ్చింది మరియు చివరికి వారి తల్లిదండ్రులతో నివసించడానికి తిరిగి వచ్చారు. మరోవైపు పెళ్లికాని చిన్న కొడుకు డే హీ వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందించిన కథ చాలా ఆసక్తికరంగా మరియు రోజువారీ జీవితానికి సంబంధించినదిగా ఉన్నందున ఈ డ్రామా విజయవంతంగా అధిక రేటింగ్‌ను సాధించింది. వాటిలో కొన్ని ఉత్తమమైన మరియు సరికొత్త కొరియన్ డ్రామా సారాంశం సమీక్షలు (2020) మీలో #స్టేహోమ్‌లో ఉన్న వారితో పాటు ఉత్సాహంగా ఉంటాయి.
దేవుడు మనుష్యలయిన మనందరిని తన సన్నిధిలో ఉండటానికి ఏర్పరచుకున్నాడు. తన ప్రియ కుమారుడు, మన రక్షకుడయినా యేసు క్రీస్తు పట్ల మన విశ్వాసము పెంపొందించటం ద్వారా అయన నీతిని మనకు ఆపాదించి పవిత్రులుగా చేసాడు. తద్వారా మనకు రక్షణ అనుభవం ఇచ్చాడు. అనగా మన పాపముల నుండి విమోచన కలిగించి, తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా, తన ఆజ్ఞలు మీరకుండా, తన వాక్యము అర్థం చేసుకొని జీవించటానికి కావలసిన తెలివిని, జ్ఞానమును దయచేస్తూ, మన రక్షకుడయినా యేసు క్రీస్తుల వారి స్వరూపములోకి మారటానికి ఆత్మీయ ఎదుగుదలను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ ఆత్మీయ ఎదుగుదల మన రక్షణ అనుభవమును బట్టి కాక మన యొక్క బైబిల్ జ్ఞానమును బట్టి, ప్రార్థన తడబడకుండా చేసే విధానమును బట్టి, లేదా వారికి తెలిసిన క్రైస్తవ గీతాల సంఖ్యను బట్టి మెండుగా ఉన్నట్లు సంఘాలలో భావిస్తారు, కానీ అది దేవుని కొలమానములో లేదు. కొత్తగా విశ్వాసములోనికి వచ్చిన సహోదరి, సహోదరులు ప్రతి విషయములో ప్రతిభ లేని వారిగా కనబడవచ్చు. వారి విశ్వాసం, మరీ అంత గొప్పగా లేకపోవచ్చు, అనర్గళంగా ప్రార్థన చేసే తత్వం వారిలో కానరాక పోవచ్చు, బైబిల్ లో వాక్యము తీయటానికి కష్టపడవచ్చు, కానీ దేవుడి దృష్టిలో వారు ఆత్మీయ జీవితంలో ఇంకను పాలు త్రాగే శిశువుల వలె ఉన్నారు. ఎందుకంటే వారికి ఇవ్వబడిన జ్ఞానము, క్రీస్తు దేహమయిన, సంఘములో అనుభవము బహు తక్కువ. అంటువంటి శిశువులతో, నడక నేర్చిన, పరుగు పెట్టే సాటి విశ్వాసులు పోల్చుకుంటూ "తాము వారికంటే గొప్ప" అనే ఆత్మీయ గర్వమునకు లోను కావటం దేవుని దృష్టిలో అంగీకారం కానేరదు. అదేవిధముగా వారి తడబాటును చూసి ఎగతాళి చేయటం, దేవుని దృష్టిలో నేరమే. దేవునికి అసహ్యమయిన విషయం గర్వము. దూరం ఎంతటిదయిన ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది, విశ్వాసి ఎంత నీతి పరుడయినా పాపిగానె ప్రారంభమవుతాడు. మన గొప్ప కోసం, మొగ్గ స్థాయిలో ఉన్న విశ్వాసులను చులకనగా చూడటం, సంఘంలో వారికి ఏవయినా బాధ్యతలు అప్పగిస్తే తట్టుకోలేక పోవటం ప్రభువు దేహములో భాగమయిన మనకు తగునా? బలహీనుడయినా సహోదరుని విశ్వాసమును దెబ్బ తీసే లాగున ప్రవర్తించు ప్రతి వాడును పాపము చేసినవాడేనని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని ఏమిదవ అధ్యాయం నుండి క్రింది వచనం చూడండి. 1 కొరింథీయులకు 8: "12 ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు." పై వాక్యము స్పష్టముగా చెబుతున్న సంగతులు గ్రహించి, సాటి విశ్వాసుల ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడిన వారిగా ఉండటం సంఘమునకు క్షేమకరం. దేవుడు తన సేవ కొరకు అల్పులు, అజ్ఞానులను ఎన్నుకొంటాడు. అయన దృష్టికి గర్వం కలవారు అసహ్యులు, పనికి రాని వారు. ప్రభువు ఇచ్చే ఫలము ప్రతి వారికి ఒకేలాగా ఉంటుంది. ప్రభువు ఎవరు ఎప్పుడు మొదలు పెట్టారొ చూడటం లేదు కాని విశ్వాసములో కొనసాగటమే చూస్తాడు. కనుక క్రొత్త విశ్వాసులను తేలికగా చూడటం లేదా వారికి ఇవ్వబడుతున్న తలాంతులను బట్టి, సంఘములో వారికి ఇవ్వబడుతున్న బాధ్యతలను బట్టి అసూయపడటం కడు దీనుడయినా యేసు క్రీస్తు విశ్వాసులుగా మనకు తగదు. ఈ విషయాలను బట్టి దేవుని వాక్యములో యేసు క్రీస్తు ప్రభువుల వారు మత్తయి సువార్తలో గొప్ప సంగతులను మనకు నేర్పించారు. మత్తయి 20: "8. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచిపనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. 9. దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి. 10. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారముచొప్పుననే దొరకెను. 11. ​వారది తీసికొని చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను, 12. పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజ మానునిమీద సణుగుకొనిరి. 13. అందుకతడు వారిలో ఒకని చూచిస్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయ లేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము; 14. నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది; 15. నాకిష్టమువచ్చి నట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా3 అని చెప్పెను. " ప్రభువు చెప్పిన ఈ ఉపమానమును గమనిస్తే సాటి సహోదరుల పట్ల, మరీ ముఖ్యంగా క్రొత్తగా వచ్చిన విశ్వాసుల పట్ల మన ధోరణి ఎలా ఉండకూడదో నేర్చుకోవచ్చు. ప్రభువు చెప్పిన ఈ ఉపమానంలో ఒక తోట యజమాని కొందరు కూలీలను పనికి కుదుర్చుకున్నాడు, కొన్ని గంటలు అయిన తర్వాత మరికొంత మంది పనిలోకి వచ్చారు. ఆపైన ఒక గంటలో పని గంటలు ముగుస్తాయనగా ఇంకొంతమంది పనివారు వచ్చి పనికి కుదిరారు. పని ఘడియలు ముగియగానే ఆ యజమాని తన గుమస్తాకు పనివారందరికి డబ్బులు ఇమ్మని చెప్పాడు. అప్పుడు ఒక గంట పని చేసిన వారికి, మరియు కొన్ని గంటలు పని చేసిన వారికి ఒక దినారము ఇవ్వటం చూసిన, రోజంతా పని చేసిన పనివారు తమకు ఇంకా ఎక్కువ లభిస్తుందని ఆశించారు. కానీ ఆ యజమాని వారికి కూడా మిగతా వారి లాగే ఒక్క దినారము ఇవ్వటం చుసిన ఆ పనివారు గొణుక్కుంటూ "ఒక గంట పనిచేసిన వారిని, రోజంతా కష్టపడిన మమల్ని సమానంగా చుస్తున్నావు" అని గొణుక్కున్నారు. ముందుగా వచ్చిన విశ్వాసి, నీ తర్వాత వచ్చిన విశ్వాసుల పట్ల నీ ఉద్దేశ్యం అలాగే ఉందా? అయితే ప్రభువు నీతో అనే మాటను, యేసయ్య ఆ యజమాని ద్వారా చెపుతున్నాడు. "నీకు ఇస్తానన్న కూలి ఇచ్చేసాను, నేను మిగతా వారికి ఎంత ఇస్తే నీకెందుకు, నేను మంచితనంతో ఉంటె నీ కడుపు మండిందా" అని. దేవుడు ప్రేమ స్వరూపి, ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. ప్రతి విశ్వాసికి తన కృపలను అనుగ్రహిస్తాడు, తన సంఘములో స్థానం కల్పించి ఆత్మీయంగా బలపరుస్తాడు. వారి విశ్వాసము చొప్పున, వారికి ఉన్న భారమును బట్టి తలాంతులు అనుగ్రహించి, తన పరిచర్యలో వాడుకుంటాడు. మన విశ్వాస పరుగును అందరి కన్న ముందు మొదలు పెట్టాము కదా! అని మన తర్వాత వచ్చిన వారిని దేవుడు తక్కువ చెయ్యాలను కోవటం వాక్యానుసారం కాదు. లోతుగా ఆలోచిస్తే, అటువంటి ఆలోచన విధానం, మన యొక్క అసూయను, మనకు లోకము పై ఆశను సూచిస్తుంది. "అయ్యో ! అనవసరంగా ముందే విశ్వాసంలోకి వచ్చాము! వీరి లాగే అన్ని అనుభవించి వస్తే బాగుండేది! అంతే దొరికే మేలులకు, ఇంత కాలం అన్ని సుఖాలు వదులుకున్నాను" అనుకున్నట్లు లేదా? ఇక్కడ ముందుగా వచ్చిన వారికి జరిగిన లాభం ఏమిటి? నిశ్చయత! ప్రశాంతత! ఆనందం! నమ్మకము! ఇతరుల వలె వారు పని గురించి ప్రయాస పడవలసిన అవసరం రాలేదు. తమకు ఈ రోజు కూలి దొరుకుతుంది కాబట్టి, తగిన ఆహారం తింటాము అన్న నిశ్చయత, దానితో ప్రశాంతత, అందువలన ఆనందం దాంతో పాటు రేపు కూడా పని దొరుకుతుందని నమ్మకము. అంటువంటి ప్రశాంతత ఎన్ని డబ్బులు ఇచ్చి కొనగలం? చివరి వారు ఎంత బాధ అనుభవించి ఉంటారు? కూలి దొరుకుతుందో లేదోనని ఎంత యాతన పడి ఉంటారు? అటువంటి యాతన మనకు తప్పినందుకు సంతోషంగా లేదా? దేవుని ప్రేమకు మనం హద్దులు నిర్ణయిస్తున్నామా? సాటి వారిని దేవుడు దీవిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి! మన అవసరమును, మన ఆశలను తన చిత్తానుసారముగా తీర్చేది కూడా ఆ దేవుడే అని గుర్తుంచుకొని మన విశ్వాసం కొనసాగించాలి. దేవునికి ఇష్టమయిన వారిగా మన విశ్వాసం కొసాగిస్తున్నందుకు ఎల్లప్పుడూ ఆనందించాలి. ఎందుకంటే మనం చెడ్డవారిగా ఉన్నప్పుడే మనలను ప్రేమించి అయన పట్ల మనకు విశ్వాసం అనుగ్రహించాడు కాబట్టి ఆనందించాలి. అంతే కాకుండా మన విశ్వాసము ఇతరులకు ఇబ్బంది కారాదు, వారి ఆశీర్వాదాలు మనకు అసూయా కారణం కారాదు. ఆత్మీయతలో దీనత్వం కనబడాలి, విశ్వాసంలో సహనం ఉండాలి. అటువంటి పరిశుద్దాత్మ నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!! Posted by Sayaram Gattu at 5:56:00 PM దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి వర్గం: సువార్తమానము కామెంట్‌లు లేవు: 19, మార్చి 2022, శనివారం నువ్వు కోరుతున్న మేలు దేవుని చిత్తమేనా? మన ప్రభువయిన యేసు క్రీస్తు చెప్పినట్లుగా "అడుగుడి మీకు ఇవ్వబడును, వేతకుడి మీకు దొరుకును మరియు తట్టుడి తియ్యబడును" అన్న వాక్యమును విశ్వాసించి, మనకు కావలిసిన మేలులను బట్టి ప్రార్థిస్తుంటాము. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవటం మరచిపోతాము! మనం కోరుకుంటున్న ఆ మేలు దేవుని చిత్తమేనా? ఆ మేలు కలుగుట వలన మనం ఆత్మీయంగా మరింతగా ఎదుగుతామా? లేదా దేవునికి దూరంగా లేదా విరోధంగా మారిపోతామా? అన్న భవిష్యత్ ప్రణాళిక మీద దేవుడు మనకు ఆ మేలులు అనుగ్రహిస్తాడు. కొన్ని సార్లు ఆ మేలులు పొందుకోవటం ద్వారా తాత్కలికంగా కలిగే మంచి కన్న శాశ్వతంగా జరిగే చెడు ఎక్కువగా ఉంటె వాటిని పొందుకోక పోవవటమే మనకు మేలు. మనం కోరుకుంటున్న మేలులు దేవుని చిత్తమును నెరవేర్చేవిగా ఉండాలి! అనగా దేవుని పరిచర్యలో భాగంగా మిళితం కావాలి. ఉదాహరణకు సమూయేలు తల్లి హన్నా ప్రార్థనను గమనించండి! 1 సమూయేలు 1: "11. సైన్యములకధి పతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. " ఇక్కడ హన్నా పిల్లలు లేనిదిగా అవమానము పొందుతోంది. దేవుని సన్నిధికి వచ్చి ఆమె ఏమని మొరపెడుతోంది! మగ బిడ్డను దయచేస్తే అతనిని దేవుని సేవకు వినియోగిస్తానని ప్రమాణం చేస్తోంది. తాను పొందుకొనే మేలును దేవుని పరిచర్యలో మిళితం చేస్తోంది. ఇక్కడ ఆమె స్వార్థం మచ్చుకయిన కనపడదు. కుమారుడు పుట్టిన తర్వాత మరల ఆమెకు పిల్లలు పుడుతారో లేదో కూడా తెలియదు కానీ దేవునికి ముందుగానే ప్రమాణం చేస్తోంది, కలిగిన ఒక్క బిడ్డను దేవుని సేవకు అంకితం చేస్తానని. ఆమె కోరుతున్న ఆశీర్వాదము దేవుని చిత్తములో ఉంది కనుక దేవుడు ఆమె కోరికను నెరవేర్చాడు. అన్ని సార్లు అలాగే ఉండాలని కాదు, కొన్నిసార్లు దేవుడు మన అవసరాల నిమిత్తం మనకు మేలులు దయచేస్తాడు. కానీ కొన్ని మేలులు మనకు మేలు చెయ్యక పోగా కీడును చేస్తాయి. అంటువంటి సమయంలో దేవుడు ఆ మేలులు మనకు అనుగ్రహించకుండా ఆపివేస్తాడు. ఉదాహరణకు ఒక్క కుర్రాడు బైక్ గురించి తండ్రిని పీడిస్తున్నాడు అనుకుందాం. ఆ కుర్రాడి శక్తి సామర్థ్యాలు పూర్తిగా తండ్రి ఎరిగి ఉన్నాడు కనుక అతనికి బైక్ కొనివ్వటమో, ఇవ్వకపోవటమో చేస్తాడు. తండ్రి తనకు బైక్ కొనివ్వటం లేదు కనుక తండ్రికి తనంటే ఇష్టంలేదు అనుకోవటం ఆ కుర్రాడి తెలివి తక్కువతనం అవుతుంది. దేవుడు మన మేలులు ఆపివేయటం కూడా అటువంటిదే! బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రాజయిన హిజ్కియా దేవుని చిత్తమును అంగీకరించక పోవటం వలన కలిగిన సంఘటనలు ఒక్కసారి చూద్దాం. 2 రాజులు 20: "1. ఆదినములలో హిజ్కియాకు మరణకరమైన.... రోగము కలుగగా, ఆమోజు కుమారుడును ప్రవక్త యునైన యెషయా అతనియొద్దకు వచ్చినీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా" పై వచనంలో దేవుడయినా యెహోవా రాజయిన హిజ్కియాకు ఆయువు తీరిందని సెలవిస్తున్నాడు. అప్పటివరకు ఆ రాజు దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుని దృష్టికి ఎన్నో మంచి పనులు చేసి ఉన్నాడు. కానీ మరణం వచ్చే సరికి దేవుని చిత్తమునకు విరుద్ధంగా ప్రార్థిస్తున్నాడు. 2 రాజులు 20: "3. యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను." పై వచనంలో హిజ్కియా ప్రార్థనను చూడవచ్చు. అప్పుడు దేవుడయినా యెహోవా తన యొక్క నిర్ణయమును మార్చుకున్నాడు. అప్పటి వరకు హిజ్కియాకు సంతానం లేదు. దేవుడు తనకు మరో పదిహేనేళ్ళు జీవితకాలం పొడిగించాడు (2 రాజులు 20: 5-6). దాని వలన జరిగిన అనర్థములు కూడా మనం తెలుసుకుందాం. అయుష్షూ పొడిగింపబడిన హిజ్కియా తనను పరామర్శించటానికి బబులోను నుండి వచ్చిన మనుష్యులను ఆహ్వానించి ఎంతో గర్వంగా తన యొద్ద ఉన్న సంపదను ప్రదర్శించాడు. తద్వారా భవిష్యత్తులో బబులోను వారు ఇశ్రాయేలు మీదికి దండెత్తి రావటానికి ప్రేరణ అయ్యాడు. అధేవిదంగా ఆ ఆయుష్షు ద్వారా మనష్షే అనే కుమారుణ్ణి కన్నాడు. అతను ఇశ్రాయేలు రాజులలో అత్యంత హీనుడని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. 2 రాజులూ 21: "1. మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడై యెరూషలేములో ఏబదియయిదు సంవత్సరములు ఏలెను; అతని తల్లిపేరు హెఫ్సిబా. 2. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు, ఇశ్రా యేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను." పన్నెండు ఏండ్ల నుండి పాలించటం మొదలు పెట్టిన అతను దేవుని దృష్టికి ఎన్నో దుష్ట కార్యములు చేసి ప్రజలను దేవుని నుండి తిప్పివేశాడు. ఇదంతా ఎలా జరిగిందని ఆలోచిస్తే, ఎం అర్థం అవుతుంది? హిజ్కియా రాజు దేవుని చిత్తమును అంగీకరించక తనకు ఇంకా ఎక్కువ అయుష్షూ కావాలని కోరుకున్నాడు. దేవుని చిత్తమునకు విరుద్ధముగా మరో పదిహేనేళ్ళు జీవితకాలము అనగా మేలులు పొంది ఈ కార్యములన్ని కలుగటానికి పరోక్షంగా కారణం అయ్యాడు. మనలను నడిపించవలసిన దేవుడు మరి మనకు కీడు చేయబోయే కోరికలను లేదా మేలులను ఎందుకు అనుగ్రహిస్తాడు అని మనం ప్రశ్నించుకోవచ్చు. ఇదివరకు ఎన్నో మారులు మనం చెప్పుకోనట్లు దేవుడు మనకు పూర్తీ స్వేచ్ఛను కూడా అనుగ్రహించాడు. మన క్రియలకు మనమే భాద్యత వహించాలి. ఎలా అంటే! దేవుడు హిజ్కియాకు స్వస్థత అనుగ్రహించాడు మరియు కుమారుణ్ణి దయచేసాడు. కానీ అతను గర్వపడి సంపదను ప్రదర్శించాడు మరియు కుమారునికి దేవుని మహిమను మరియు భక్తి శ్రద్ధలను నేర్పటంలో విఫలం అయ్యాడు. పన్నెండేళ్లకు రాజయిన అతను అంత హీనుడిగా మారటానికి కారణం ఎవరు? తండ్రిగా హిజ్కియా తన బాధ్యతను నెరవేర్చక పోవటమే అని అవగతమవుతుంది. మన ఉదాహరణలో చెప్పుకుంటే, తండ్రి కుర్రాడికి బైక్ కొనిచ్చాడు, కానీ వాడు దానిని తిన్నగా నడుపకుండా రకరకాల విన్యాసాలు చేసి ప్రమాదంలో పడితే తండ్రిని తప్పు పట్టటానికి లేదు. కనుక తండ్రి మాట విని బైక్ గురించి మంకుపట్టు పట్టకపోతే కొద్ది రోజులకు తండ్రి కారు కొని యిచ్చే వాడేమో కదా! దేవుడు మన పట్టుదలను బట్టి, కోరికల తీవ్రతను బట్టి మనకు కావలసినది అనుగ్రహిస్తాడు, కానీ మనం ఆత్మీయంగా బలహీనులుగా మారిపోతాము. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు క్రింది వచనంలో చూడండి! 2 కొరింథీయులకు 12: "9. అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందె 10. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను." పౌలు అయనకు ఉన్న అనారోగ్యమును బట్టి దేవుణ్ణి స్వస్థతకై వేడుకుంటున్నాడు. కానీ దేవుని నుండి తనకు వచ్చిన సమాధానం "నా కృప నీకు చాలునని" కనుక తనకు ఉన్న ఆ బలహీనతలోనూ అతను బలవంతుడనని సంతోషిస్తున్నాడు. బలహీనతలో బలం ఎలా కలిగింది! దేవుడు తనకు తోడై ఉన్నాడు, అతను పూర్తిగా దేవుని చిత్తములో నడుస్తున్నాడు. దేవుని నిర్ణయమును అంగీకరించాడు. తానూ కోరుకొనే మేలు అనగా స్వస్థత కన్నా దేవుని కృపలో మిక్కిలి సంతోషించాడు. కానీ ఇశ్రాయేలు వారు హిజ్కియా వలెనె తమ కోరికలు అణుచుకోలేక బలహీనులుగా మారిపోయారు. దేవుని చిత్తమును కనిపెట్టక తమకు కావలసిన మేలులకై ఆరాటపడి దేవునికి ఆగ్రహం తెప్పించారు. కీర్తనలు 106: "13. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి. 14. అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి 15. వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను." పై వచనం చూడండి! దేవుడు మన్నాను కురిపించి ఇశ్రాయేలును పోషిస్తుంటే వారు దానితో తృప్తి పడక, రుచులు మరిగి మాంసం కోసం అల్లాడినారు. అందు నిమిత్తమై తమ నాయకుడయినా మోషేతో వాదించి దేవుణ్ణి చులకనగా మాట్లాడారు. దేవుడు వారు కోరుకున్న మాంసం ఇచ్చాడు కానీ వారి ప్రాణములకు బలహీనత కలుగజేసాడు. పౌలు బలిహీనతలో కూడా బలంగా ఉన్నాడు, ఇక్కడ ఇశ్రాయేలు వారు బలంలో కూడా బల హీనులుగా మారిపోయారు. వారు కోరుకున్న మేలు పనికి రానిది, దేవుని చిత్తములో లేనిది. కనుక వారు బలహీనులుగా మారిపోయారు. కనుక సహోదరి, సహోదరుడా నువ్వు కోరుకొనే మేలు దేవుని పరిచర్యలో మిళితమయి ఉందా? అది దేవుని చిత్తములో ఉందా? ఒక్కసారి ఆలోచించుకో. గ్రామంలో ఉన్న ఒక్క దైవ సేవకుడు, అంతర్జాతీయంగా సేవ చేయాలనీ కోరుకోవటం తప్పుగా అనిపించక పోవచ్చు కానీ దానికి తగ్గ నైపుణ్యం తనకు ఉందా? దేవుని సేవను అంతటి స్థాయిలో జరిగించగలడా? అలాగే భవిష్యత్తులో గర్వపకుండా దేవుని సేవను నిస్వార్థంగా నడుపగలడా? అని తనను తాను అంచనా వేసుకోవాలి. దేవునికి మనలను దూరం చేసే గుర్తింపు లేదా మేలుల కన్నా గుర్తింపు లేని సాధారణ జీవితమే మనకు మేలు కదా! దేవుని మీద ఆధారపడి మేలులు కోరుకోవాలి. అప్పుడు ప్రభువే మనకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. తగు సమయంలో ఆ మేలులు మనకు దయచేస్తాడు. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!! Posted by Sayaram Gattu at 4:02:00 PM దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి వర్గం: సువార్తమానము కామెంట్‌లు లేవు: 12, మార్చి 2022, శనివారం లోకముతో సంబంధం ఉందా? ప్రభువయిన యేసు క్రీస్తును మన రక్షకునిగా చేసుకున్న తర్వాత, మారు మనసు పొందిన వారమయి, ఇది వరకు మనం చేసిన పాపపు కార్యములను చేయకుండా ఉండవలెనని దేవుని వాక్యం మనకు బోధిస్తోంది. మన శరీరములో నిత్యమూ లోక సంబంధమయిన, నీతి యుక్తము కానీ క్రియలు తారసిల్లుతుంటాయి. దేవుడు అతి పరిశుద్ధుడు, మనం ఆయనలో నిలవాలి అంటే, మనం కూడా పవిత్రంగా ఉండవలసిందే. అప్పుడే మనం విశ్వాసం లో కొసాగుతున్నట్లు. బాప్తిస్మము పొందగానే, ప్రతి ఆదివారం దేవుని మందిరమునకు వెళ్తుంటే తాము పవిత్రులుగా మారిపోయినట్లు భావిస్తారు చాల మంది. అటువంటి స్థితిలో మనం ఉంటె పశ్చాత్తాపమును మరచిపోయి, మనకు లోకముతో ఉన్న సంబంధమును గుర్తించని వారిగా ఉన్నాము. 1 పేతురు 4: "2. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొను నట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును. 3. మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును, 4. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు." అపొస్తలుడయిన పేతురు గారు రాసిన మొదటి పత్రికలో, యేసుక్రీస్తు విశ్వాసులము అయినా మనము ఇదివరకు చేసిన శరీర క్రియలు చెయ్యవలదని స్పష్టం చేస్తున్నారు. ఇంతకు ముందు అన్యజనులు చేయు కార్యములు, అనగా లోక రీతులు పాటించినది చాలునని, ఆ కార్యములన్నింటిని వివరిస్తున్నారు. అంతే కాకుండా లోకస్తులు తమ కార్యములలో, మనం పాల్గొననందుకు దూషించగలరు అని చెబుతున్నారు. అంటువంటి వారి స్నేహముకై, వారి మెప్పు కొరకై దేవునికి ఇష్టం లేని ఇటువంటి క్రియలు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం చేయతగదు. ఇటువంటి స్థితిలో మనం కొనసాగటానికి కారణం, మన స్థితిని మనం గుర్తించకపోవటమే. అనగా మనం చేస్తున్న లోక పరమయిన కార్యములను మనం చాల తేలికగా తీసుకోవటం వల్లనే. ఆదివారం చర్చ్ కు వెళ్ళి ఆరాధించి, ప్రభువు బల్లలో పాలుపంచుకుంటే సరిపోతుంది అని అనుకోవటమో లేదా రోజుకు ఒక గంట టీవీ లో వచ్చే ఎదో ప్రసంగం వింటే సరిపోతుంది అని అనుకోవటమే వీటికి కారణం. కానీ అన్నింటికన్నా ముఖ్యమయినది, పాపముల ఒప్పుకోలు, మరియు (Self Cleansing) ఆత్మశుద్ధి కలిగి ఉండటం. పాపములు ఒప్పోకోనే వారే తమ స్థితిని గుర్తించిన వారిగా ఉంటారు. అటువంటి వారే లోక రీతులకు దూరంగా ఉంటూ, తమ ఆత్మీయ జీవితంలో బలంగా ఎదుగుతారు. బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తుల వారు, మనకు ఎన్నో పాఠాలు నేర్పించారు. తన గొప్ప కోసం కాకుండా, తండ్రి నామమునకు ఘనతను తేవటముతో పాటు మనకు అమూల్యమయిన సంగతులు బోధించారు. మార్కు సువార్తలో 8 వ అధ్యాయం 22 వ వచనం నుండి 26 వ వచనము వరకు చదివితే ఆ సంగతులను చూడవచ్చు. మార్కు 8: "22. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయనయొద్దకు ఒక గ్రుడ్డివాని తోడు కొనివచ్చి, వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. 23. ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొని పోయి, వాని కన్నులమీద ఉమి్మవేసి, వాని మీద చేతులుంచినీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా, 24. వాడు కన్నులెత్తిమనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలెనుండి నడుచు చున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. 25. అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నులమీద నుంచగా, వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడ సాగెను. 26. అప్పుడు యేసునీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని యింటికి వానిని పంపివేసెను." పై వచనములలో యేసు క్రీస్తుల వారు బేత్సయిదా నుండి వచ్చిన ఒక గ్రుడ్డి మనుష్యుడిని స్వస్థపరిచారు. యేసు ప్రభువుల వారు స్వస్థతలు చేసే ముందు "నీకు విశ్వాసం ఉందా" అని అడిగి "నీ విశ్వాసము ప్రకారమే అవునుగాక" అని వారిని వెంటనే స్వస్థ పరుస్తారు. కానీ ఇక్కడ ప్రభువుల వారు ఆ వ్యక్తిని ఉరి బయటకు తీసుకొచ్చిన తర్వాత స్వస్థ పరిచారు. ఆశ్చర్యంగా ఎప్పుడు లేని విధంగా ప్రభువుల వారు ఆ గ్రుడ్డి వ్యక్తిని రెండు సార్లు ముడితే గాని స్వస్థత రాలేదు. దానికి కారణం ఏమిటి? గ్రుడ్డి వ్యక్తికి విశ్వాసం లేదా? అతను ప్రభువు తనను ముట్టుకున్న తర్వాత కూడా పూర్ణ స్వస్థత పొందలేదని ఎందుకు నిజం చెప్పాడు? యేసు క్రీస్తు ప్రభువుల వారు అతన్ని సంపూర్ణంగా స్వస్థ పరచిన తర్వాత ఎందుకు బేత్సయిదా ఊరిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మనకు లోకముతో సంభంధం ఉండటం వల్ల జరిగే నష్టములు, మరియు దానిలో నుండి బయటకు వస్తే జరిగే మేలులు అవగతం అవుతాయి. బేత్సయిదా ఉరిని బట్టి యేసు క్రీస్తుల వారు మత్తయి సువార్తలో హెచ్చరికలతో గద్దించారు. ఆ విషయాలను మనం చూసినట్లయితే ఈ ఉరి నుండి ప్రభువుల వారు అతన్ని ఎందుకు బయటకు తీసుకొచ్చారొ అర్థం అవుతుంది. మత్తయి 11: "20. పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను. 21. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారు 22. విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను." కోరాజీనా, బేత్సయిదా పట్టణముల వారు ప్రభువు చేసిన అద్భుత కార్యములు చుసిన కూడా మారు మనసు పొందని వారుగా ఉన్నారు. అనగా వారు లోక కార్యములు చేయుచు పశ్చాత్తాపము పొందక, దేవునికి ఇష్టంలేని పాపపు జీవితమునే కొనసాగిస్తున్నారు. కనుకనే ప్రభువుల వారు ఆ గ్రుడ్డి వ్యక్తిని ముందుగా ఉరి నుండి వేరు చేశారు. మనలో కూడా ఆత్మీయపరంగా అంధకారము తొలగి పోవాలంటే ముందుగా లోకమునకు వేరు కావాలి. ఆ తరువాత ప్రభువు అతన్ని ముట్టి "కనబడుతున్నదా" అని అడిగినప్పుడు గ్రుడ్డి వ్యక్తి చాల నిజాయితీగా పూర్తి స్వస్థత లేనట్లుగా, మనుష్యులకు, చెట్లకు తేడా తెలియటం లేదని చెప్పాడు. అతను ఇక్కడ ఎంతో మందిని బాగు చేసిన యేసు క్రీస్తు నన్ను స్వస్తపరుస్తున్నాడు గనుక "కనబడుతుంది ప్రభువా" అని చెప్పలేదు. అంతే కాకుండా వచ్చిన చూపు చాలులే అని అనుకోలేదు. నా ప్రియా సహోదరుడా, సహోదరి మనకు అలాంటి నిజాయితీ ఉందా? ఇంకా నాకు స్పష్టమయిన చూపు కావాలి, ఇంకా నేను ఆత్మీయతలో ఎదగాలి అన్న సంకల్పం ఉందా? నేను నమ్ముకున్నది పరిశుద్ధుడయినా యేసు క్రీస్తును గనుక నాకు ఎంటువంటి పాపమూ అంటదని నీ ఆత్మశుద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నావా? యేసయ్య రక్తం పవిత్రమయినది, శక్తివంతమయినదే, కానీ ఆయన సంబంధులమయిన మనం కూడా అంతే పవిత్రంగా ఉండాలి, పరిశుద్దాత్మ శక్తితో నిండి ఉండాలి. ఆ బేత్సయిదా ఉరి నుండి బయటకు రావాలి, ఆ మారు మనసు పొందని, పశ్చాత్తాప పడని స్థితి నుండి బయటకు రావాలి. మన ఆత్మీయ పరుగుకు అడ్డుపడే గ్రుడ్డి తనం నుండి స్వస్థత కావాలి, గొప్ప వెలుగుతో నిండిన చూపుతో యేసయ్య కోసం మన పరుగు కొనసాగాలి. ఒక వేళ పూర్తీ స్వస్థత పొందిన తర్వాత మరల ఆ బేత్సయిదా ఉరికి వెళుతున్నావా? యేసయ్య ఆ గ్రుడ్డి మనిషికి చెప్పినట్లు నువ్వు కూడా మరల ఆ ఊరిలోకి, ఈ లోకంలోకి వెళ్ళవద్దు. తిరిగి గ్రుడ్డి తనం నిన్ను ఆవరిస్తుంది. మరల దేవుడు నిన్ను స్వస్థపరచాలి. ఇలా వెనుకకు ముందుకు వెళ్తుంటే దేవుడు నిన్ను చూసి సంతోషించేది ఎప్పుడు? అయన నీకు ఇచ్చిన రక్షణకు నువ్విచ్చే ప్రాధాన్యత ఏపాటిది? ఆ పవిత్ర రక్తానికి నువ్వు ఇచ్చే విలువ ఏమిటి? సమయం మించి పోలేదు! మరోసారి ప్రభువును వేడుకో, నిజాయితీగా ఒప్పుకో! దేవా నాకు నీ వెలుగును చూసే స్పష్టత కావాలని, నాలో పాపం ఇంకా ఉందని పశ్చాత్తాప పడు. ఆ ఊరిలోకి, ఈ లోకం లోకి వెళ్ళే బలహీనత లేకుండా దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. ప్రసంగి 7: "5. బుద్ధిహీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల గద్దింపు వినుట మేలు. 6. ​ఏలయనగా బానక్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే; ఇదియు వ్యర్థము." ప్రసంగి గ్రంథంలో మహాజ్ఞాని అయినా సొలొమోను రాజు రాసిన పై వాక్యాలు చూడండి. లోకములో ఉండే సినిమాలు, నాటకాలు, కామెడీ షోలు, తాగుడు, వ్యభిచారము ఇంకా ఆటపాటలు అన్ని కూడా గడ్డి మంట లాగా ఉవ్వెత్తున్న ఎగిసి చల్లారిపోతాయి. దాని వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. ఆ తుచ్చమైన విషయాలు, మనలను శోదించటమే కాకుండా, మన అడుగులు పాపం వైపు వేయటానికి ప్రేరణ కల్పిస్తాయి. మనలను శోదించేది ఏదయినా సాతానుతో సంబంధం కలిగి ఉన్నదే. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తోంది, కానీ మనుష్యులైన మనము అయన ఆజ్ఞలు పాటించకుండా, పవిత్రతను కోల్పోయి అయన సన్నిధికి దూరం అయిపోతున్నాము. యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆ ఘోర సిలువలో నరక యాతన అనుభవించి, మనకు ఇచ్చిన పాప క్షమాపణను కోల్పోతున్నాము. 1 థెస్సలొనీకయులకు 4: "7. పరిశుద్ధు లగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. 8. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు." దేవుడు మనలను పిలుచుకుంది పవిత్రులుగా ఉండాలని, కానీ లోక రీతులతో నిత్యము చెడు తలంపులతో శోదించబడుతూ, సాతాను సంబంధులుగా ఉండటానికి కాదు. ఒక్క వెళ అలా ప్రవర్తించేవారు, పాస్టర్లు చెప్పే ప్రసంగాలు కాదు, మనుష్యులు చెప్పే నీతులు కాదు గాని దేవుడినే నిర్లక్యం చేస్తున్నారు. ప్రభువు నందు ప్రియమయిన మీకందరికి ఆయన పేరిట నేను చేస్తున్న మనవి, లోకముతో సంబంధం వదిలి పెట్టండి. సినిమాలు, టీవీ సీరియల్స్, మరియు మానసికంగా మనలను బలహీన పరచి శోధించే ప్రతి దానికి దూరంగా ఉండండి. అదే విధంగా తాగుడు, తిరుగుబోతు తనం, చెడ్డ స్నేహములు విడచి దేవునికి ఇష్టమయిన వారిగ ఉండండి. దావీదు "దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించు వాడు ధన్యుడు" అని రాశాడు. మరో కీర్తనలో "దేవుని వాక్యము తన పాదములకు దీపముగా ఉన్నదని" అంటాడు. అయన వాక్యము మన హృదయాంతరాలలో ఉన్న చీకట్లు తొలగించి క్రీస్తు వెలుగులోకి నడిపిస్తుంది. అయన సన్నిధి మనలను హృదయశుద్ధి గలవారిగా మార్చి దేవుణ్ణి చూచె తేట చూపును పొందుకునెలా చేస్తుంది. అనగా దేవుని చిత్తమును ఎరిగిన వారిగా ఉంటాము, అప్పుడు దేనికి చింతపడని వారిగా మారిపోతాము. ముఖ్యంగా దేవుణ్ణి సంతోష పెట్టె వారిగా మన నడక మారుతుంది. కొన్ని నిముషాలు లేదా ఒక గంట మహా అయితే ఒక పూట లోక పరమయిన సంతోషం కోసం, దేవుణ్ణి సంతోష పెట్టె గొప్ప అవకాశం వదులుకుంటామా! సందర్భానుసారమయిన ఈ క్రింది పాటను వినండి! ప్రేరణ పొందండి!! దేవుని చిత్తమయితే వచ్చే వారం మరొక వాక్య భాగంతో మీ ముందుకు వస్తాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!! Posted by Sayaram Gattu at 1:00:00 PM దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి వర్గం: సువార్తమానము కామెంట్‌లు లేవు: 5, మార్చి 2022, శనివారం ఇతరుల మెప్పుకై ఆశిస్తున్నావా? మనలో ప్రతి ఒక్కరం ఇతరుల ముందు ఘనత పొందాలని ఆశపడుతూ ఉంటాము. మనకున్న ప్రత్యేకతలను బట్టి, ఇతరుల కంటే మనం అన్ని విషయాలలో నైపుణ్యం ఉన్నవారిగా గుర్తింపు పొందటానికి ఆరాటపడుతూ ఉంటాము. ఎవరయినా మన ప్రతిభ గురించి పది మందిలో పొగడాలని ఎదురు చూస్తూ ఉంటాము. అందును బట్టి కొందరు ఇతరులను కాకా పట్టడం, వారు కోరుకున్నవి ఇవ్వటం చేస్తూ ఉంటారు. పూర్వ కాలం భట్రాజులు అనే వారిని పిలిపించుకొనేవారు, వారు దానం ఇచ్చిన వారిని అదే పనిగా పొగుడుతూనే ఉండెవారు. దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, కేవలం ఆ దానం చేసిన వారి అహం చల్లార్చుకోవటానికి తప్ప. అదేవిధముగా కొంతమంది క్రైస్తవ సహోదరులలో, సహోదరిలలో ఎవరయినా మన ప్రార్థన గురించి గాని, మనం పాడే పాట గురించిగాని ఇతరులు పొగడాలని ఎదురు చూస్తూ ఉంటారు. అంతే కాకుండా ఫలానా వ్యక్తి ఇంత దశమ భాగం ఇచ్చారు, అంత కానుక ఇచ్చారు అని సంఘములలో మైకు పెట్టి మరీ చెప్పించుకుంటారు. అంతే కాకుండా తమ ఆత్మీయ జీవితము ఎంతో ఉన్నతమయినదని, వారు ఎంతో గొప్పగా దేవునిలో ఎదుగుతున్నామని నిరూపించుకోవాలని చూస్తూ ఉంటారు. యేసు క్రీస్తు తన ఘనతను పక్కన పెట్టి, తండ్రి అయినా దేవుని నామముకు ఘనత రావటానికి, లోకమునకు తండ్రి ఉద్దేశ్యములు తెలపటానికి మాత్రమే ఆరాట పడ్డాడు. పొగడ్తలకై ఎదురు చూడలేదు, ఎవరు తిట్టినా పట్టించు కోలేదు. మత్తయి సువార్తలో యేసయ్య కొండ మీద ప్రసంగంలో చెప్పిన విషయాలు గమనించండి! మత్తయి 6: "1. మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు. 2. కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరముల లోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. " ఈ అధ్యాయంలో చూసినట్లయితే మనుష్యుల మెప్పు కోసము నీతి కార్యములు చేయటం, వారి ముందు ఘనత పొందటానికి దాన ధర్మములు చేయటం దేవునికి ఇష్టం లేని కార్యములు. వారు దేవుని నుండి ఎటువంటి ఘనతను పొందలేరని దేవుని వాక్యము సెలవిస్తోంది. అంతే కాకుండా లేని ఆత్మీయ జీవితమును నటించటము వేషధారణగా దేవుడు పరిగణిస్తాడు. వేషధారులయిన పరిసయ్యులను, శాస్త్రులను యేసు క్రీస్తు సున్నం కొట్టిన సమాధులతో పోల్చాడు. అంటువంటి వారిని అయన ఎన్నడూ అంగీకరించలేదు. కాబట్టి నా ప్రియా సోదరి సోదరులారా మీ ఆత్మీయ జీవితాన్ని ఇతరుల ముందు నిరూపించుకోవాలనే ఆరాటం వలదు. దేవుడు మీ జీవితం లో చేసిన మార్పులు చెప్పే తరుణంలో మీకు ఎక్కడయినా ఘనత కలుగుతుందేమో అలోచించి మీ సాక్ష్యములు పంచుకోండి. మనలో ఏ ఒక్కరం కూడా మన విశ్వాసమును బట్టి అతిశయ పడటానికి వీలు లేదు, ఏలయనగా మనకున్న విశ్వాసము అనాది కాలములో దేవుడి ఏర్పాటు చొప్పున కలిగినదే. "సోదరుడా నువ్వు ఆత్మీయంగా బాగా ఎదుగుతున్నావ్" అని ఎవరయినా అంటే గర్వపడకండి కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం ఇతరుల ముందు ఎక్కువ ఆత్మీయంగా ఉంటున్నామా? నిజానికి సంఘములో కాకుండా మనం ఇంటిలో కూడా అంతే ఆత్మీయంగా ఉంటున్నామా? ఒంటరిగా ఉన్నప్పుడు మన తలంపులు దేవుని చుట్టే ఉంటున్నాయా? ఒక వేళ మన ఆత్మ సాక్షి లేదని చెపితే మాత్రం ఖచ్చితంగా మనం వేషధారణ వైపు పరుగు పెడుతున్నాము గాని ఆత్మీయత వైపు కాదు. మనుష్యులు మనలను ఘనత చేయాలని ఎదురు చూడటం, దేవుడి నుండి పొందే ఫలమును నిర్లక్ష్యం చేయటమే అవుతుంది. మన గురించి సాక్ష్యములు దేవుడు చెప్పాలి గాని, మనలాంటి మనుష్యులు కాదని ఎలా వేళల గుర్తుంచు కోవాలి. యోబు గురించి సాతాను ముందు దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు తెలుసుగా! అంటువంటి సాక్ష్యం దేవుడు నీ గురించి కూడా చెప్పాలని ఆశపడుతున్నావా? అయితే మనుష్యుల పొగడ్తలకు దూరంగా ఉండు, ఎలా వేళల నీతిని జరిగిస్తూ, దేవుని యందు భయ భక్తులు కలిగిఉండు, తగిన సమయంలో దేవుడు నీ సాక్ష్యమును బయలు పరుస్తాడు. తగిన ఘనతను, ఆశీర్వాదాలను నీ జీవితంలో కురిపిస్తాడు. మన రక్షకుడయినా యేసయ్య జీవితంలో జరిగిన ఈ సంఘటనను ఒక్కసారి చూద్దాం, మనం దేవుని చిత్తమును జరిగించినప్పుడు ఎలాగా మనకు ఘనతను తెస్తాడో తెలుస్తుంది మత్తయి 3: "13. ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను. 14. అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని 15. యేసుఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. " ఇక్కడ ప్రజలకు యోహాను నీళ్ళతో బాప్తీస్మం ఇస్తున్నాడు, ఆ సమయంలో వారు తమ పాపములు ఒప్పుకొని, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందుతున్నారు. ఏ పాపం లేని యేసయ్య వారిలాగే వరుస క్రమములో నిలబడి బాప్తీస్మం పొందటానికి వెనుకాడలేదు. ఈ జనమంతా తన గురించి ఏమనుకుంటారు, తనను కూడా పాపి కింద జమకడుతారెమో అని ఆలోచించలేదు. ప్రవచనములు నెరవేరడానికి, దేవుని చిత్తము జరిగించటానికి తన యొక్క సొంత ప్రతిష్టను లెక్క చెయ్యలేదు. ఇక్కడ అయన ఆలోచన విధానం ఇతరుల అభిప్రాయం పట్ల భయం లేదు, వారి పొగడ్తలకు, లేదా వారి తిట్లను లెక్క చేయని స్వభావం కనబడుతోంది. అయన ఆనాడు తన గురించి ఆలోచించుకొలేదు గనుకనే ఈనాడు మన రక్షణ అనుభవంలో ఎంతో ప్రాముఖ్యమయిన బాప్తీస్మం ప్రవేశ పెట్టబడింది. సంఘము క్షేమము కోసం మనం అటువంటి త్యాగము చేయటానికి సిద్ధమా? నాకు వాక్యం చెప్పే అవకాశం ఇవ్వలేదని ఒక్కరూ, పాడేటప్పుడు మైకు ఇవ్వలేదని మరోకరు, అన్నింటా నేనే ఉండాలి, అన్ని నా నుండే జరగాలి అని ఆత్మనూన్యతతో బాధపడుతూ సంఘమును ఎదగనివ్వని సంఘ పెద్దలు కొందరు. కానీ ఒక్క విషయం మరచి పోతున్నారు, దేవుని చిత్తమును జరిగిస్తే, సంఘము అభివృద్ధికి పాటుపడితే దేవుడే మన ఘనతను ఇతరుల ముందు చాటుతాడు, మన సాక్ష్యమును పెంచి ఇతరులకు ఆదర్శంగా నిలుపుతాడు. యేసయ్య బాప్తీస్మం పొందిన తర్వాత జరిగిన గొప్ప సంగతులు చూడండి. "16. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. 17. మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను." దేవుని గ్రంథమయిన బైబిల్ ప్రకారం యేసయ్య అప్పటివరకు ఎటువంటి అద్భుతాలు చెయ్యలేదు, ఎంటువంటి ప్రసంగాలు చెయ్యలేదు, ఎటువంటి పాటలు రాయలేదు, పాడలేదు, ఎటువంటి అన్య భాషలు మాట్లాడలేదు. కానీ దేవుడు అయన యందు ఆనందించుచున్నాడు! ఏలా సాధ్యం అయింది. దేవుని ఆత్మ ఆకాశం నుండి సాక్ష్యం ఇస్తోంది. దేనిని బట్టి? ఆయనలో వేషధారణ లేదు. ఇతరుల మెప్పుకోసం ఆరాటం లేదు, తన ఘనత కోసం పాకులాడటం లేదు. కేవలం దేవుని చిత్తమును జరిగించటం, సంఘము క్షేమాభివృద్ధిని కాంక్షించటం మాత్రమే ఉన్నాయి. అందుకే దేవుడు ఆయనయందు ఆనందించుచున్నాడు. అంతే కానీ యోహాను ఆయనను పొగిడినందుకు కాదు, అయన చెప్పులు ఎత్తటానికి కూడా నేను సరిపోను అని యేసయ్యను గురించి సాక్ష్యం ఇచ్చినందుకు కాదు. మత్తయి 6: "5. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 6. నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును." పై వచనములలో మనకు తెలుస్తున్న సంగతులు ఏమిటీ? మన ఆత్మీయతను ఇతరుల ముందు ప్రదర్శించటం వాక్యానుసారం కాదు. దానిని బట్టి దేవుడు మన ప్రార్థనలు అంగీకరింపడు. ఇవిధంగా ప్రదర్శించటం వలన మనం వారి పొగడ్తల కోసం ఎదురు చూసినట్లే. పొగడ్తల కోసం ఎదురు చూసేవారు, దేవుని చిత్తము కన్న కూడా మనుష్యులకు ఏది ఇష్టమో అది చేయటానికి ఇష్టపడుతారు. మరియు మన హృదయమును దేవుని ముందు చూపించుకోవటానికి అవకాశం ఉండదు తద్వారా మనలో ఆత్మీయ ఎదుగుదల కుంటుపడుతుంది. కనుక అంటువంటి ఆత్మీయ జీవితం ఎన్నటికి దేవుణ్ణి సంతోషపెట్టదు, అది వేషధారణను పెంచి పోషిస్తుంది. ఇతరుల మెప్పును కోరటం ఆపివేయండి, దేవుని చిత్తమును చెయ్యండి. దేవుడే తగిన సమయంలో మన సాక్ష్యమును బయలు పరచి సంఘములో మనుష్యుల ముందు ఘన పరుస్తాడు. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!
కాలరీల గురించి లక్ష్యపెట్టకుండా బంగాళాదుంపలను ఇష్టంగా తినేవారిలో నేను ఒకదానిని. వాటి మీద ఉన్న ఇష్టం వల్లనేమో పొటాటో ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అనే పోటీ జరుగుతుందని తెలిసి ఎంతో ఆనందపడ్డాను. 2020 లో ఈ పోటీలు ప్రారంభమయితే 2021 సంవత్సరానికి పోటీల ఫలితాలు మొన్న ఆగస్టులో వెలువడ్డాయి. గెలుపొందిన ఫోటోలను చూస్తే ఆ ఫోటోగ్రాఫర్ లు కూడా ఆ కూరగాయపట్ల ఎంతో ప్రేమతో, అభిమానంతో ఫోటోలు తీశారు అనిపించింది. కంటితో కవిత్వాన్ని చూస్తున్నట్లు అనిపించాయి. One of the winners of the Potato Photo Competition 2021! ఈ పొటాటో ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీకి మార్టిన్ పార్ వంటి ప్రసిద్ధి చెందిన ఫోటోగ్రాఫర్ లు జడ్జీలుగా ఉన్నారు. దాదాపు రెండువేల పౌండ్ల విలువ గల బహుమతులు (ఒక లెన్స్ కిట్, కెమెరా కేసు, బ్యాక్ ప్యాక్, ఒక ఫోటోగ్రఫీ వర్కుషాప్ లో ఉచితంగా పాల్గొనే అవకాశం, కొన్ని ఫోటోగ్రఫీ కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్) విజేతలకు అందించారు. బంగాళాదుంపల మీద ప్రేమను ఇలా ఫోటోల రూపంలో వ్యక్తపరచడమే కాకుండా ఈ పోటీలో పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజు గా ఔత్సాహికులు చెల్లించిన మొత్తాన్ని (ఒక్కొక్కరు ఐదు పౌండ్లు) బ్రిటన్లో పేదల కోసం ఫుడ్ బ్యాంకు ను నిర్వహిస్తున్న ట్రుస్సెల్ ట్రస్ట్ కు విరాళంగా ఇవ్వడం మరొక మంచి విషయం. దుంప జాతికి చెందిన ఈ మొక్కకు సోలనుమ్ ట్యూబేరోసుమ్ అనేది శాస్త్రీయనామం. నైట్ షేడ్ కుటుంబానికి చెందిన మొక్క. దీని మూలాలు పెరూవియన్-బొలీవియన్ ఆండిస్ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో ప్రధాన ఆహార పంటలలో ఒకటిగా ఉంది. బంగాళాదుంపలో శరీరానికి అవసరమైన విటమిన్ సి, ప్రోటీన్, థయామిన్, నియాసిన్ అధికంగా లభిస్తాయి. దాదాపు 1800 సంవత్సరాలకు పూర్వమే దక్షిణ అమెరికాలో ఇంకాలు బంగాళాదుంపల సాగును భారీస్థాయిలో ప్రారంభించారు. 16 వ శతాబ్దపు రెండవ భాగంలో దక్షిణ అమెరికాను ఆక్రమించుకున్న స్పానియార్డ్ లు వాటిని యూరప్ కు పరిచయం చేశారు. 17 వ శతాబ్దం చివరి నాటికి ఐర్లాండ్ లో బంగాళాదుంపలే ప్రధాన పంటగా మారాయి. 18 వ శతాబ్దం చివరినాటికి జర్మనీ, పశ్చిమ ఇంగ్లాండ్ తో సహా ఐరోపా ఖండంలోని అనేక ప్రాంతాలలో దుంపలను భారీ స్థాయిలో పండించడం ప్రారంభించారు. ఐరిష్ ఆర్ధికవ్యవస్థ దాదాపుగా బంగాళాదుంపల సాగుపైనే ఆధారపడి ఉంది. 19 వ శతాబ్దం మధ్యలో దుంప చెట్లకు సోకే లేట్ బ్లెయిట్ వ్యాధి కారణంగా ఆ దేశం మొత్తం మీద బంగాళా దుంపలు ఎక్కువగా పండకపోవడంతో ఏర్పడిన బంగాళాదుంపల కరువు అక్కడి ఆర్ధిక వ్యవస్థను, జనజీవనాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 16 వ శతాబ్దం చివరిలో లేదా 17 వ శతాబ్దపు తొలినాళ్లలో మనదేశంలోకి ప్రవేశించిన పోర్చుగీసు, డచ్ ఓడల ద్వారా మనదేశంలోకి కూడా బంగాళాదుంపలు మొదటిసారి ప్రవేశించాయి. ఇప్పుడు ప్రపంచంలో బంగాళాదుంపల సాగులో మనదేశం మూడవస్థానంలో ఉంది. 2017 సంవత్సరంలో దేశంలో దాదాపు 4.9 కోట్ల టన్నుల దుంపలు సాగు అయ్యాయి. ఈ బంగాళాదుంపలు మనకి ఆహారపదార్ధంగా ఉపయోగపడటమే కాక స్థానిక, అంతర్జాతీయ మార్కెట్ లలో మంచి ధరను అందిస్తూ రైతులకు మంచి ఆదాయమార్గంగా మారాయి. పోర్చుగీసు, డచ్ ఓడల ద్వారా దేశంలో ప్రవేశించిన దుంపల సాగు మొదట్లో మలబారు తీర ప్రాంతానికే పరిమితమయ్యింది. బ్రిటిష్ వారి పరిపాలనలోనే దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ సాగు విస్తరించింది. దేశంలో అప్పటివరకు స్థానికంగా సాగు అవుతున్న కూరగాయల స్థానంలో బ్రిటిష్ వారి ఆహారంలో ఎప్పటి నుండో భాగంగా ఉన్న బంగాళాదుంపల వంటి కూరగాయల సాగును ప్రోత్సహించాలని అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ భావించింది. దానితో వారు దుంపల సాగు గురించి ఎంతో ప్రచారం చేసి దేశంలోని మూలమూలకు దానిని చేర్చారు. రైతులకు విత్తనాలు ఉచితంగా ఇచ్చి మరి దుంపల సాగుకు ప్రోత్సహించారు. అప్పట్లో దేశంలో వరిసాగులో తరచుగా సమస్యలు తలెత్తి పంటలు దెబ్బతింటుండటంతో రైతుల సమస్యలు తీరేందుకు వరి స్థానంలో బంగాళాదుంపల సాగు చేయడమే సరైన ప్రత్యామ్నాయం అని కూడా వారు విస్తృతంగా ప్రచారం చేశారు. ఏదేమైనా ఇప్పుడు బంగాళాదుంపలు లేని ప్రపంచాన్ని ఊహించడం అసాధ్యం. అలా ఊహించడానికి ఇష్టపడను కూడా. ఒకవైపు పొటాటో ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అని పోటీలు నిర్వహిస్తూ దుంపలపై అభిమానాన్ని చాటుకుంటుంటే లక్కీ అడ్కిన్స్ వంటి కొందరు రచయితలు బంగాళాదుంపలపై కవిత్వాన్ని కూడా రాశారు. మన దేశంలో పండే వివిధరకాల బంగాళాదుంపల జాతుల పేర్లు కూడా కవిత్వానికి తక్కువగా లేవు. కుఫ్రి జవహర్, కుఫ్రి చంద్రముఖి, కుఫ్రి సట్లెజ్, కుఫ్రి బాహర్, కుఫ్రి ఆనంద్, కుఫ్రి అశోక, కుఫ్రి ఫుఖ్రాజ్, కుఫ్రి సింధూరి, కుఫ్రి జ్యోతి, కుఫ్రి మేఘ, కుఫ్రి లువకర్, కుఫ్రి స్వర్ణ వంటివి ఆ పేర్లలో కొన్ని. ఈ కుఫ్రి అనే పేరు హిమాచల్ ప్రదేశ్ లో అత్యధికంగా బంగాళాదుంపలు పండించే కుఫ్రి ప్రాంతం నుండి వచ్చింది అనుకుంటాను. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన పరిశోధనా కేంద్రం కూడా ఈ కుఫ్రి ప్రాంతంలోనే ఉంది. మన ఆహారంలో ఇంతగా భాగమయ్యి మన జిహ్వకి ఆహ్లాదాన్నందిస్తున్న ఈ బంగాళాదుంపల ప్రస్థానం మానవజాతి కొనసాగినంతకాలం కొనసాగుతూనే ఉంటుందని ఆశిస్తాను. Post 40 Based on a piece by Meena millennialmatriarchs Bharathi Kode, Health, Nutrition, Sanitation, Language, literature, poetry, Telugu Leave a comment October 31, 2021 1 Minute కాఫీ, బోర్నవిటా, హార్లిక్స్: Coffee, Bournvita or Horlicks? ఏమి తీసుకుంటారు? ఒక సాయంత్రం మా ఇంటికి వచ్చిన స్నేహితులు కిరణ్, జగదీప్ లను మా అమ్మ అడిగింది వాళ్ళ ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. ఇంటికి వచ్చిన అతిధులకు ఇలా బోర్నవిటా, హార్లిక్స్ వంటి పానీయాలను ఇవ్వడం మనకి దక్షిణ భారతదేశంలో కొంత సహజమే కానీ ఉత్తర భారతదేశంలో అది కొంచెం అసహజంగా కనిపించే విషయమే. చివరకి వారు హార్లిక్స్ కావాలని అడిగి తాగారు. దానిని బాగా ఇష్టపడ్డారు. వారికి అది ఎంతగా నచ్చిందంటే అది మళ్ళీ తాగాలనిపించి ఇంట్లో రోజూ తాగేందుకు వీలుగా ఒక పెద్ద హార్లిక్స్ సీసా కొనుక్కుని ఇంటికి వెళ్ళారు. ఇటువంటి పానీయాలన్నీ మన చిన్న నాటినుండీ అలవాటుగా తాగుతూ వస్తున్నవే. అవి శారీరక, మానసిక ఎదుగుదలకు, ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనకి ఎంత నమ్మకం అంటే వీటిలో ఏదో ఒకటి మన వంటింట్లోని అలమరలలో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అవి పిల్లలకు ఇవ్వడం మాత్రమే కాదు. ఇంట్లోని ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఏదైనా కొంచెం నలతగా ఉన్నా, కాఫీ,టీ లు కాకుండా వేరే ఏదైనా తాగాలనిపించినా వీటినే తాగడం సర్వసాధారణం. అంతేకాకుండా, కొన్ని రాష్ట్రాలలో ఇంటికి వచ్చిన అతిధులకు కూడా ఈ పానీయాలను ఇవ్వడం సాధారణంగా జరిగేదే. మన జీవితాలలో ఇంతగా భాగమయిపోయిన ఈ పానీయాలు అసలేమిటి? భారతదేశంలో అన్నిటికిన్నా విరివిగా వినియోగంలో ఉన్నది హార్లిక్స్. హార్లిక్స్ కు ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ మనదేశం. ఈ పానీయం యొక్క మూలాలు తెలుసుకోవాలంటే మనం 150 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1873 లో జేమ్స్ హార్లిక్స్ అనే ఫార్మసిస్ట్ తన సోదరుడు విలియం తో కలిసి చికాగోలో జె&డబ్ల్యు హార్లిక్స్ అనే కంపెనీ ని స్థాపించాడు. ఈ కంపెనీ పేటెంట్ పొందిన మాల్టెడ్ డ్రింక్ ను తయారు చేసేది. మొదట్లో ఇది పసి పిల్లలకు మాత్రమే ఇచ్చే ఆహారంగా మార్కెట్ చేయబడిన తర్వాత కాలంలో ముసలి వారికి, ప్రయాణాలు చేసేవారికి కూడా శక్తి నిచ్చే పానీయంగా మార్కెట్ చేయడం జరిగింది. 20 వ శతాబ్దం మొదట్లో దీనిని ఆహారానికి బదులుగా తీసుకోగలిగిన పానీయంగా ప్రచారం చేశారు. మన దేశం విషయానికి వస్తే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటిష్ ఆర్మీ తరపున యూరప్ కి పంపబడిన మన సైనికులు తిరిగి వస్తూ ఈ హార్లిక్స్ ను మనదేశానికి తీసుకు వచ్చారు. పంజాబ్, బెంగాల్, మద్రాస్ రాష్ట్రాల ప్రజలు దీనిని ఎక్కువగా ఇష్టపడి ఆదరించారు. 1940, 50 లలో ఇది ఇంట్లో ఉండడం ఒక స్టేటస్ సింబల్ గా భావించేవారు. ఆ తర్వాత ఎన్నో దశాబ్దాలుగా ఒకే ఫ్లేవర్ లో దొరికే హార్లిక్స్ మన జీవితాలలో భాగం అయిపొయింది. ఇప్పుడు ఇలాచీ, కేసర్ బాదం వంటి ఎన్నో ఫ్లేవర్ లలో హార్లిక్స్ లభిస్తుంది. అలాగే ఇప్పుడు వివిధ వయసుల వారికి, వివిధ జెండర్ లకు తగినట్లు వేరు వేరు రకాల హార్లిక్స్ ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. హార్లిక్స్ లో ఉండే ఒక ప్రత్యేక గుణం ఏమిటంటే ఇది అంత తేలికగా కరగదు. ఎంత ప్రయత్నం అవసరమని! ఒక స్పూన్ తో కొంచెం పొడిని గ్లాస్ లో వేసి వేడి వేడి నీళ్ళు కొంచెం పోసి బాగా కలిపితే కొంచెం కరుగుతుంది. మధ్యమధ్యలో అక్కడక్కడా ఉండలు కనిపిస్తే స్పూన్ ని వెనక్కి తిప్పి ఉండలను గ్లాస్ అంచుకు వేసి నొక్కితేనే అవి పూర్తిగా కరుగుతాయి. అప్పుడు వేడి పాలను పోసుకుని కలుపుకుని తాగాలి. ఇంత చేసినా ఒక్కోసారి గ్లాస్ చివరిలో ఉండలు కనిపిస్తూనే ఉంటాయి. హార్లిక్స్ వంటి ఇతర పానీయాలతో మరీ ఇంత సమస్య ఉండదు. హార్లిక్స్ తో పోలిస్తే బోర్నవిటా ఇటీవల మార్కెట్ లోకి వచ్చిన పానీయం అనే చెప్పాలి దీనిని 1920 లలో ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తే మన దేశ మార్కెట్ లోకి 1948 మాత్రమే ఈ పానీయం అడుగుపెట్టింది. ఈ మాల్టెడ్ చాక్లెట్ మిక్స్ ను క్యాడ్బరీ తయారు చేసింది. వారి ఫ్యాక్టరీ అభివృద్ధి చేసిన ఆదర్శగ్రామం బోర్నవిల్లే పేరు మీద దానికి బోర్నవిటా అనే పేరు పెట్టడం జరిగింది. వెన్న తీయని పాలు, తాజా గుడ్లు, మాల్ట్, చాక్లెట్ లతో తయారయిన ఈ పానీయాన్ని ఆరోగ్యానికి మేలు చేసే పానీయంగా మార్కెట్ చేశారు. ఇక ఓవాల్టిన్ విషయానికి వస్తే ఇది స్విట్జర్లాండ్ లో తయారయ్యింది. అక్కడ దీనిని వోవోమల్టిన్ అని పిలుస్తారు. ఓవం (గుడ్లు), మాల్ట్ అనే రెండు పదాల కలయికతో దానికి ఆ పేరు వచ్చింది. 1909 లో అది యుకె మార్కెట్ లో ప్రవేశపెట్టబడింది. అక్కడ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయించే క్రమంలో అప్లికేషన్ మీద పేరు తప్పుగా రాయడంతో దానిపేరు ఓవాల్టిన్ గా మారిపోయింది. ఇక ఇంగ్లీష్ మార్కెట్ లో అదే పేరుతో స్థిరపడిపోయింది మొదట్లో మాల్ట్, గుడ్లు, కోకో తో తయారుచేయడిన ఈ ఉత్పత్తి తర్వాత కాలంలో అనేక ఇతర రకాల ఫ్లేవర్ లలో, రుచులలో కూడా లభిస్తుంది. భారతదేశంలో, యుకె లో అమ్ముడయ్యే ఓవాల్టిన్ లో ఇప్పుడు గుడ్లు ఉండడం లేదు. వీటన్నింటికీ భిన్నంగా కాంప్లెన్ పూర్తిగా మిల్క్ ప్రోటీన్ తో తయారవుతుంది. 1942 లో యుకె లో దీనిని రూపొందించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకు కేవలం కొద్దిపాటి రేషన్ మాత్రమే తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చేవారు. దీనితో వారికి తేలికగా తీసుకువెళ్లగలిగేలా, తొందరగా శక్తినివ్వగలిగేలా ఉండే పానీయం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో దీనిని తయారు చేయడం జరిగింది. భారత దేశపు మార్కెట్ లో 1964 లో దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. చాలామందికి అంతగా పరిచయం లేని మరొక పానీయం రాగిమాల్ట్. ఇప్పుడైతే నాకు మార్కెట్ లో దొరకడం లేదు. నారింజ రంగులో ఉండే ఈ పానీయం పిల్లలకోసం అని ఉద్దేశించబడినప్పటికీ అందరూ ఇష్టపడేంత తీయగా ఉండేది. వీటిలో చాలా పానీయాలు ఇప్పుడు అనేక దేశాలలో లభించడం లేదు. ఉదాహరణకు 2008 నుండి యుకె లో బోర్నవిటా ను అమ్మడం లేదు. ఇప్పుడు అందరి అభిప్రాయాలు అభిరుచులు మారిపోవడం, పోషణ పట్ల ప్రజలకు ఉన్న అవగాహనలో వస్తున్న మార్పు, ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులు, వేగనిజం వంటి కొత్త ధోరణుల మధ్య ఈ పానీయాలు ఎంత కాలం ఇంకా మనుగడలో ఉంటాయో అనిపిస్తుంది. వెళ్ళి ఇప్పుడే ఒక బాటిల్ తెచ్చుకుందామా? –From a piece by Meena millennialmatriarchs Bharathi Kode, Health, Nutrition, Sanitation, History, Telugu Leave a comment March 26, 2021 1 Minute మహిళలు-టాయిలెట్లు: Toilet Travails పట్టణాలలో మనం చూసే పే అండ్ యూజ్ టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణలోని కొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకున్నాను. అవి నిజంగా ఎంతో ఆసక్తికరమైనవి. అయితే వాటి గురించి మరొక సందర్భంలో మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం హైదరాబాద్ లో తొలిసారిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ లో పే అండ్ యూజ్ టాయిలెట్ల నిర్మాణం గురించి ఆలోచన చేసినప్పుడు మేము చేసిన ఒక సర్వే గురించిన వివరాలు తెలియచేస్తాను. ఈ సర్వే నిర్వహించి దాదాపు దశాబ్దం గడిచింది. అయినా ఈ సర్వే ద్వారా మేము తెలుసుకున్న సమస్యలు ఇప్పటికీ దాదాపు అలాగే ఉండడం విచారకరం. దాదాపు 400 మంది మహిళలతో నిర్వహించిన ఆ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. దాదాపు నాలుగింట ఒక వంతు మందికి మహిళలకోసం పే అండ్ యూజ్ టాయిలెట్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న విషయమే తెలియదు. బయటకు వెళ్ళినప్పుడు టాయిలెట్ కు వెళ్ళవలసిన అవసరం వచ్చినా ఆపుకుని ఇంటికి చేరే వరకూ ఎదురు చూస్తామని దాదాపు సగం మంది మహిళలు తెలియచేసారు. పేద మహిళలు, ప్రతిరోజూ బయట పనికి వెళ్ళే మహిళల కన్నా ధనికులైన మహిళలు, గృహిణులు, విద్యార్థినులు ఈ టాయిలెట్ లను చాలా తక్కువగా వినియోగిస్తున్నారు. ఈ టాయిలెట్లు వినియోగించిన వారిలో 64.2 శాతం మంది తమకు చాలా అసౌకర్య అనుభవం ఎదురైందని చెప్పారు. వారు పేర్కొన్న అసౌకర్యాల వివరాలు ఇలా ఉన్నాయి. అసౌకర్య కారణం పేర్కొన్న మహిళల శాతం అపరిశుభ్రత 92.5 తగినన్ని నీరు లేకపోవడం 69.2 దుర్గంధం 62.8 కేర్ టేకర్ గా మగవారు ఉండడం 57 మగవారి, ఆడవారి టాయిలెట్లు ఒకే చోట ఉండడం 53 అభద్రతా భావం 36.4 ఈ సమస్యలను పేర్కొన్న మహిళలంతా కొన్ని విలువైన సూచనలు కూడా చేశారు. మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉండాలి అని 53% మహిళలు చెప్పారు టాయిలెట్ల ను నిర్వహించే కేర్ టేకర్ కు మర్యాదపూర్వకంగా ప్రవర్తించేలా తగిన శిక్షణ ఉండాలని, వారు చదువుకుని ఉండి, మధ్య వయసులో ఉన్నవారైతే బాగుంటుందనీ 57% మంది మహిళలు అభిప్రాయపడ్డారు టాయిలెట్లలో సానిటరీ నాప్కిన్ల వంటివి పారవేయడానికి డస్ట్ బిన్లు, మహిళలు తీసుకువెళ్ళే వస్తువులు పెట్టుకోవడానికి చిన్న అరలు, మగ్గు, బకెట్లు, మంచి వెలుతురు ఉండాలని అనేక మంది మహిళల అభిప్రాయం రకరకాల నేపధ్యాల నుండి వచ్చిన వారి అలవాట్లను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ టాయిలెట్లు, వెస్ట్రన్ టాయిలెట్లు రెండూ ఉండాలనేది మరొక అభిప్రాయం. భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలి సరైన నిర్వహణ, ఎప్పటికప్పడు శుభ్రం చేస్తుండడంతో పాటు సమగ్ర పర్యవేక్షణ ఉండాలి కొన్ని చోట్ల టాయిలెట్ల చుట్టూ ఉండే కొద్దిపాటి స్థలాన్ని మగవారు టాయిలెట్ల లాగా ఉపయోగిస్తున్నారు. దానివలన దుర్వాసన తో పాటు టాయిలెట్లో కి అడుగుపెట్టడానికి కూడా మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుంది చాలా చోట్ల “మగవారి”, “ఆడవారి” టాయిలెట్ల ను సూచించే గుర్తులు సరిగా సూచించబడి లేవు. దానివలన కూడా మహిళలు ఇబ్బంది పడుతున్నారు. దశాబ్దం క్రితం మేము ఈ సర్వే నిర్వహించినప్పటికన్నా ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్ల సంఖ్యా బాగా పెరిగింది. వాటి నిర్వహణ కూడా మెరుగయ్యింది. అయినా ఇంకా చాలా విషయాలలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ మెరుగుపడవల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అన్ని సమస్యలపై దృష్టి పెట్టి పని చేస్తే కానీ మన టాయిలెట్లు మెరుగుపడి మహిళల ఇబ్బందులు తీరే అవకాశం లేదు. –From a piece by Meena millennialmatriarchs Bharathi Kode, Health, Nutrition, Sanitation, Telugu Leave a comment March 19, 2021 March 19, 2021 1 Minute ఫ్రూట్ సలాడ్: Fruit Salad గత వారం ఎవరో మాకు రూపం మరియు రంగులో పరిపూర్ణంగాఉన్న ఒక పండు ఇచ్చారు. దానిపేరు పెర్సిమోన్ అని చెప్పారు.. నేనుజపనీస్ సాహిత్యంలో పెర్సిమోన్ యొక్క వర్ణనలను, దాని పైన అనేకకవితలను చదివాను. కానీ ఇంతకు ముందు ఎప్పుడూ ఈ విదేశీపండును చూడలేదు, దాని రుచి గురించి అసలు తెలియదు. ఇప్పుడు భారతదేశంలో విక్రయించబడుతున్న అనేక అన్యదేశపండ్లలో ఇది ఒకటి. మనం ఒకప్పుడు తింటూ పెరిగిన నేరేడు, సీతాఫలం, జామ, అరటిపండ్లు వంటి పండ్ల కన్నా మన పిల్లలకుకివి, డ్రాగన్ ఫ్రూట్ వంటి వాటి రుచి ఎక్కువగా తెలుసు. ఇప్పుడు ఎన్నో కొత్త రకాల పండ్లను మన దేశంలోనే పండిస్తుండడం, ఇతర దేశాల నుండి అనేక రకాల పండ్లను దిగుమతిచేస్తుండడంతో ఏవి స్థానికమైనవి, ఏవి ఇతర దేశాలకు చెందినవిఅనే విభజన రేఖ చిన్నగా చెరిగిపోతూ ఉంది. ఇప్పుడు పండ్లనునిల్వ చేసే సదుపాయాలు కూడా మెరుగుపడడంతో అన్ని పండ్లుఅన్ని సీజన్ లలోనూ దొరుకుతున్నాయి. మన పండ్లను గురించి, వాటి మూలాల గురించి తెలుసుకోవాల్సినఅవసరం బహుశా ఇప్పుడు ఎక్కువగా ఉంది. ‘ఎ హిస్టారికల్ డిక్షనరీఆఫ్ ఇండియన్ ఫుడ్’ అనే పుస్తకం సహాయంతో నేను పండ్లగురించి చాలా వివరాలు తెలుసుకున్నాను. వాటిలో కొన్నిఆసక్తికరమైన వివరాలు మీకోసం. మనకి లభించే ఆహార పదార్ధాలలో పండ్లు ‘ఫల’ అనే వర్గానికిచెందినవి. దీని అర్ధం వరి, పప్పు ధాన్యాల లాగా నాగలితో దున్నిపండించవలసిన అవసరం లేనివి. దా నిమ్మ, నేరేడు, ఉసిరి, నిమ్మ, మామిడి, చెరుకు, ద్రాక్ష, అరటి, కొబ్బరి, పనస వంటివి చారిత్రాత్మకంగా భారతదేశానికి చెందినఫలాలు. వీటి గురించిన ప్రస్తావన మన వేద సాహిత్యంలోఉండడమే కాకుండా అనేక పురాతన వైద్య విధానాలలో కూడా ఈపండ్లను వినియోగించే పద్దతి ప్రస్తావించబడి ఉంది. వీటిలో అనేక రకాల పండ్లు ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో వండర్ఫుడ్స్ గా గుర్తించబడ్డాయి. ఉసిరి, రేగు పండ్ల వంటివి విటమిన్ సిఅధికంగా ఉండే పండ్లుగా ప్రపంచ ఖ్యాతి పొందాయి. ఇటీవల కాలంలో ఆపిల్, మల్బరీ, ఆప్రికాట్ వంటి పండ్లు కూడాఆరోగ్యానికి మేలు చేసేవిగా గుర్తింపు పొందాయి. ఇవి గతంలో అంతనాణ్యమైనవిగా లేకున్నప్పటికీ మొఘలుల కాలంలో గ్రాఫ్టింగ్ ద్వారావీటి నాణ్యతను మెరుగుపరచడం జరిగింది. క్రీస్తు శకం 1500 సంవత్సరం తర్వాత బొప్పాయి, సపోటా, జామ, అనాస, సీతాఫలం, అవొకాడో వంటి పండ్లు దక్షిణ, మధ్య అమెరికాదేశాల నుండి దిగుమతి చేసుకోబడ్డాయి. అయితే ఇక్కడ కూడావీటిని విస్తృతంగా పండించడం మొదలయ్యాక ఇవి కూడా స్థానికపండ్లుగా మారిపోయాయి. పురాతన వైద్య విధానాలపై మనకు లభిస్తున్న తొలిపుస్తకమైనసుశ్రుత సంహితలో పండ్లను ఆహారంలో భాగంగా ఏ విధంగామార్చుకోవాలో వివరంగా ఉంది. భోజనం చేసేటప్పుడు తొలిగాపండ్లను తీసుకోవాలని అందులో మొదటగా దానిమ్మ, ద్రాక్ష వంటినమిలి తినవలసిన పండ్లను, తర్వాత చెరకు, ఖర్జూరం, మామిడివంటి పండ్లను తీసుకోవాలని ఈ పుస్తకం సూచిస్తుంది. మామిడి, నిమ్మ వంటి పండ్లను పచ్చళ్ళ రూపంలో నిల్వ చేయడంమన దేశంలో సాంప్రదాయంగా వస్తున్న అలవాటు. గుజరాత్ వంటిరాష్ట్రాలలో తీయటి, పుల్లటి పచ్చళ్ళ రూపంలో కూడా నిల్వ చేస్తారు. ముస్లింల యునాని వైద్య పద్దతి ప్రాచుర్యం లోకి వచ్చాక పండ్లనుచిక్కటి పంచదార పాకం రూపంలోకి మార్చి వాటికి అల్లం, చెక్క, లవంగాల రుచిని అద్ది చేసే మురబ్బాలు పండ్లను నిల్వ చేసేపద్దతిగా వెలుగులోకి వచ్చింది. పండ్లను పులియబెట్టి మద్య పానీయాల తయారీకి వాడడం కూడాఅధికంగా ప్రాచుర్యంలో ఉంది. ఆయుర్వేద వైద్య విధానాలపైఅందుబాటులో ఉన్న అత్యంత ప్రాచీన పుస్తకం చరక సంహితలో ఈమద్యం యొక్క తయారీకి వాడదగిన పండ్లుగా చెరకు (దానిఅనుబంధ ఉత్పత్తులైన మొలాసిస్, బెల్లం), ద్రాక్ష, మామిడి, వెలగపండు, ఖర్జూరాలు, అరటి, పనస, దానిమ్మ వంటి పండ్లుసూచించబడి ఉన్నాయి. ఈ పచ్చళ్ళు, పండ్లతో చేసిన వైన్ లను ఏ ఋతువులోవినియోగించినా బాగుంటుంది కానీ మామిడి, పుచ్చకాయ వంటిపండ్లు శీతాకాలంలో దొరికితే కొంత వింతగానే అనిపిస్తుంది. మండువేసవిలో తొలిసారిగా మామిడి ముక్కని కొరకడం, దీపావళిసమయంలో వచ్చే సీతాఫలాలకై ఎదురు చూడడం మనందరిజీవితంలో భాగంగా మారిపోయాయి. ఈ స్థానికంగా ఋతువులవారీగా దొరికే పండ్లను తినడంలోని ఆనందం ఎప్పుడైనా దొరికే ఈడ్రాగన్ ఫ్రూట్, పెర్సిమ్మోన్స్ వంటి విదేశీ పండ్లను తినడంలో ఎప్పటికీదొరకదు అని నాకు అనిపిస్తుంది. 2021 ని అంతర్జాతీయ పండ్లు మరియు కూరగాయల సంవత్సరంగాప్రకటించారు. ఈ ఏడాదైనా మనం తింటున్న పండ్లు ఏమిటి, వాటిమూలం ఏమిటి, ఎక్కడ నుండి వచ్చాయి, మనకు అందుబాటులోకిఎలా వస్తున్నాయి, వాటిని ఎలా తింటున్నాం, ఎంత ఆస్వాదిస్తున్నాంఅని ఆలోచిస్తే బాగుంటుందేమో. పండ్లకి ఇంగ్లీష్ పదమైన ఫ్రూట్ కిమూలం లాటిన్ పదం ఫ్రూక్టస్. దీనికి అర్ధం ఆస్వాదించడం. మనంతింటున్న ప్రతి ఒక్క పండును దాని గురించి తెలుసుకుంటూఆస్వాదించే ప్రయత్నం చేద్దాం. —Based on a piece by Mamata millennialmatriarchs Bharathi Kode, Health, Nutrition, Sanitation, Telugu 2 Comments March 12, 2021 2 Minutes మహిళలు-వాక్సిన్లు: Women and the Vaccine మొత్తానికి కోవిద్ వాక్సిన్ వచ్చింది. వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది మొదటగా వాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ వాక్సిన్ రూపకల్పనకు ఎన్నో దేశాలు ఎంతో మంది శాస్త్రవేత్తలు రేయింబవళ్ళు శ్రమించిన విషయం మనకు తెలుసు. అందులో ఎంతోమంది మహిళలు కూడా ఉన్నారు. ఈ 21 వ శతాబ్దంలో సైన్స్ లో మహిళల పాత్ర గురించి మనం పెద్దగా చర్చించుకోనవసరం లేదు. అన్ని రంగాలలోనూ మహిళలు దూసుకుపోతున్న ఈ కాలంలో వాక్సిన్ ల తయారీలో కూడా మహిళలు ప్రముఖ పాత్రనే పోషించారు. ప్రొఫెసర్ సారా గిల్బర్ట్, డాక్టర్ కిజ్మెకియా కార్బెట్, డాక్టర్ నీతా పటేల్ కోవిద్ వాక్సిన్ తయారీలో ప్రముఖంగా వినిపించిన పేర్లు. నీతా పటేల్ మాటల్లో చెప్పాలంటే సైన్స్ లాబ్ లో చాలా వరకు పనిని మహిళలే నిర్వహిస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే వాక్సిన్ తయారీలో మహిళల పేర్లు ప్రధానంగా వినిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే గతంలో పరిస్థితి ఇలా లేదు. మహిళలు వాక్సిన్ ల తయారీలో ప్రముఖ పాత్ర పోషించినప్పటికీ వారికి ఎప్పుడూ తగినంత గురింపు రాలేదు. ఇరవై శతాబ్దపు తొలినాళ్లలో పోలియో అతి భయంకరమైన వ్యాధి. అది సోకితే కొందరు చనిపోవడం, మరెంతో మందికి కాళ్ళు చచ్చుబడిపోవడం జరిగేది. ఇప్పటికీ ఈ వ్యాధికి మందు లేదు. వాక్సినేషన్ ద్వారా వ్యాధి సోకకుండా అరికట్టడం మాత్రమే చేయగలం. పోలియో వాక్సిన్ ను కనిపెట్టిన ఘనత జోనస్ సాక్ దే అనడంలో ఏ సందేహమూ లేదు. అయితే ఈ వాక్సిన్ కనిపెట్టడంలో మరొక ఇద్దరు మహిళలు చేసిన కృషి మాత్రం ఏ గుర్తింపుకు నోచుకోలేదు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ ఇసాబెల్ మోర్గాన్ వారిలో ఒకరు. పోలియో కు సంబంధించిన హోస్ట్ ఇమ్మ్యూనిటి ని, వాక్సిన్ రూపకల్పనలో జీవించి ఉన్న వైరస్ కి బదులుగా మరణించిన వైరస్ ను వాడే ప్రక్రియను అర్ధం చేసుకోవడంలో ఆమె చేసిన కృషి ఈ వాక్సిన్ పరిశోధనలను పెద్ద మలుపు తిప్పింది. గుర్తింపుకు నోచుకోని రెండవ మహిళ యేల్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ డొరొతి హోస్టమన్. ఆమె తన బృందంతో కలిసి చేసిన కృషి వల్లనే పోలియో కు చుక్కల మందు కనిపెట్టడం సాధ్యమయ్యింది. Suchitra Ella. Co-founder, Joint MD. Bharat Biotech, Manufacturers of Covaxin. ఈ రోజున మనం అనేక వ్యాధులను నిర్మూలించి ఒక భద్రమైన ప్రపంచంలో జీవిస్తున్నామంటే అందుకు అనేక మంది మహిళలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. డిప్తీరియా కు వాక్సిన్ కనుగొన్న డాక్టర్ అన్నా వెస్సెల్స్ విలియమ్స్; కోరింత దగ్గుకి వాక్సిన్ కనుగొన్న డాక్టర్ పెర్ల్ కెండ్రిక్ మరియు గ్రేస్ ఎల్డరింగ్; మెనింజైటిస్, న్యుమోనియా వాక్సిన్ల తయారీలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ మార్గెరిట్ పిట్మాన్; గర్భాశయ కాన్సర్ కు వాక్సిన్ ల అభివృద్ధికి తోడ్పడిన డాక్టర్ అన్నే సరెవ్స్కి, పిల్లలలో తరచుగా వచ్చే డయేరియా కు కారణమైన రోటా వైరస్ కు వాక్సిన్ తయారు చేసిన బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ రూత్ బిషప్ వీరిలో కొందరు మాత్రమే. అయితే వీరందరికన్నా అద్భుతమైన కథ మరొకటి ఉంది. అది పాశ్చాత్య ప్రపంచానికి రోగనిరోధక శక్తి అనే భావనను తొలిసారిగా పరిచయం చేసిన లేడీ మేరీ మాంటాగ్ కథ. 1689 లో జన్మించిన ఈమె సాధించిన విజయాలు అనేకం. అయితే వాక్సిన్ ల రూపకల్పనలో ఆమె పాత్ర గురించి మాత్రమే ఇక్కడ చర్చించబోతున్నాం. ఆమె చాలా తెలివైన, అందమైన స్త్రీ. అయితే 1715 లో మశూచి సోకి ఆమె అందమైన మొహం అంతా స్ఫోటకపు మచ్చలతో వికారంగా మారింది. దానికి ముందు ఆమె సోదరుడు కూడా మశూచి సోకి చనిపోయాడు.దానితో సహజంగానే ఆమె తన పిల్లలు ఎవరికీ ఈ వ్యాధి సోకకూడదని ఎంతో ఆందోళన పడింది. 1716 లో లేడీ మేరీ భర్త లార్డ్ ఎడ్వర్డ్ మాంటాగ్ కాన్స్టాంటినోపుల్ కు రాయబారిగా నియమించబడ్డారు. అక్కడ ఆమె టర్కిష్ మహిళలతో సన్నిహితంగా ఉండి వారి సంప్రదాయాలు, ఆచారాలను గురించి తెలుసుకున్నారు. వారిలో ఆమె ఒక ఆసక్తికరమైన విషయం గమనించారు. అక్కడ ఎవరైనా పిల్లలకు మశూచి సోకినట్లైతే ఆ కురుపు నుండి కారే రసిక ను తీసి మశూచి సోకని పిల్లల చర్మంపై ఎక్కడైనా గీరి ఆ రసిక ను రాసేవారు (Variolation). అలా చేసిన పిల్లలకు ఎప్పటికీ మశూచి సోకకపోవడం లేడీ మేరీ గమనించారు. ఆ ప్రక్రియపై ఎంతో నమ్మకం కలిగి ఆమె తమ ఎంబసీ సర్జన్ ను అడిగి తన ఐదేళ్ళ కొడుకుకి అదే పద్దతిలో టీకా వేయించారు. ఆమె ఇంగ్లాండ్ కు తిరిగి వెళ్ళాక అక్కడ కూడా ఈ పద్దతి గురించి విస్తృతంగా కానీ అక్కడి వైద్య వ్యవస్థ దీనిని అశాస్త్రీయమైన పురాతన విధానమని, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలకు తగిన పద్ధతి కాదనీ తిప్పికోట్టింది. వారు వ్యతిరేకించడానికి మరొక ముఖ్య కారణం ఈ పద్దతిని ప్రతిపాదించింది ఒక మహిళ కావడం. 1721 లో ఇంగ్లాండ్ లో మశూచి విజృభించింది. లేడీ మేరీ తన కుమార్తెకు కూడా టర్కిష్ పద్దతిలో టీకా వేయించింది. ఆమె ఈ పద్దతి ఎంత ప్రభావవంతమైనదో చెప్పి వేల్స్ యువరాణిని కూడా తన ఇద్దరు కుమార్తెలకు ఈ టీకా వేయించేందుకు ఒప్పించింది. మనుషులలో వచ్చే మశూచి వైరస్ తో కాకుండా పశువులకు సోకే మశూచి వైరస్ తో మరింత సురక్షితమైన వాక్సిన్ ను జెన్నర్ అనే వ్యక్తి రూపొందించేవరకూ కూడా ఇదే పద్దతిలో మశూచి టీకాలు వేసేవారు. అసలు వ్యాధులు రాకుండా నివారించే టీకాలు కనుగొనవచ్చు అనే ఆలోచనకు బీజం పడింది దీనివల్లనే! Translated from Meena’s Piece millennialmatriarchs Bharathi Kode, Health, Nutrition, Sanitation, Inspirations, Telugu Leave a comment February 5, 2021 1 Minute ది లేడీ విత్ ది గ్రాఫ్స్ : The Lady with the Graphs ఈ ఏడాది లేడీ విత్ ది లాంప్ గా మనందరికీ తెలిసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ ద్విశత జయంతి సంవత్సరం. ఫ్లోరెన్స్ నైటింగేల్ పేరు వినగానే మన పుస్తకాలలో చదువుకున్నట్లు చేతిలో ఒక దీపం పట్టుకుని యుద్ధంలో గాయపడిన, జ్వరంతో బాధపడుతున్న సైనికులకు సేవలందించిన ఒక సేవామూర్తి రూపం మాత్రమే మన కళ్ళ ముందు మెదులుతుంది. ఆమె ఈ అరుదైన సేవలందించింది అనడంలో సందేహం ఏమీ లేదు. ఆమె దీపం పట్టుకుని రాత్రనక, పగలనక సైనికుల క్యాంపులలో తిరిగి వారికి ఎనలేని సేవ చేసింది. అయితే ఆమె అంతకు మించి చేసిన సేవ మాత్రం ఎక్కువ గుర్తింపుకు నోచుకోలేదు. ఆమె అద్భుతమైన గణాంకవేత్త. 1860 లో స్టాటిస్టికల్ సొసైటీ కి ఎంపికయిన మొదటి మహిళా ఫెలో. ఆమె పనిచేసే యుద్ధ ప్రాంతపు ఆసుపత్రిలో మరణాలను కూడా సరిగా నమోదు చేయని సందర్భంలో ఆమె ఎంతో శ్రమకోర్చి వివిధ గణాంకాలను సేకరించి, వాటిని విశ్లేషించడం వలన పరిస్థితిని సరిగా అర్ధం చేసుకుని మరణాలను తగ్గించగలిగారు. ఉదాహరణకు ఆమె బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఇతర గణాంకవేత్తలతో కలిసి ఆ ఆసుపత్రిలో సంభవించిన 18000 మరణాలలో 16000 వరకు యుద్ధంలో గాయపడటం వలన సంభవించినవి కావని, పారిశుధ్య వసతులు సరిగా లేక వివిధ వ్యాధులు వ్యాపించి వాటి వలన సంభవించినవే అని గణాంకాలతో సహా నిరూపించారు. అప్లైడ్ స్టాటిస్టికల్ పద్దతులను ఉపయోగించి సరైన పారిశుధ్య వసతులు కల్పించడం ఎంత అవసరమో సోదాహరణంగా వివరించగలిగారు. దీని వలన ఎన్నో జీవితాలు కాపాడబడ్డాయి (ఈ ఏడాది నోబెల్ బహుమతి వచ్చిన ఎవిడెన్స్ బేస్డ్ పాలసీస్ కు ఇది తొలి ఉదాహరణగా చెప్పుకోవచ్చు) అప్పటి వ్యవస్థలను కదిలించి సంస్థాగతమైన మార్పులు సాధించగలిగింది ఫ్లోరెన్స్. ఈ మార్పులు సాధించడానికి తన ఉద్యోగ జీవితమంతా ప్రభుత్వాలతో పోరాటం చేస్తూనే ఉంది. మార్పు ఎంత అవసరమో అధికారులకు చెప్పి ఒప్పించడం అంత సులువు కాదని ఆమెకు తెలుసు. బహుశా అందుకే గణాంక శాస్త్రంలోనే పెద్ద మలుపుగా చెప్పుకోదగిన ఇన్ఫోగ్రాఫిక్స్ ను తొలిసారిగా రూపొందించింది. ఆమె రూపొందించిన ఇన్ఫోగ్రాఫిక్స్ లో అన్నిటికన్నా పేరు పొందింది “కాక్స్ కోమ్బ్” డయాగ్రమ్. ఇవి సాధారణ ప్రజలు కూడా సులువుగా అర్ధం చేసుకోగలిగినవి. ఈ కాక్స్ కోమ్బ్ అనేది గణాంకశాస్త్రంలో ఉపయోగించే “పై చార్ట్” ల వంటిదే కానీ మరింత లోతుగా సమాచారాన్ని విశదపరుస్తుంది. పై చార్ట్ లో ఒక్కొక్క భాగం యొక్క పరిమాణం ఆ డేటా పాయింట్ యొక్క మొత్తాన్ని సూచిస్తుంది. అయితే ఈ కాక్స్ కోమ్బ్ లో కేంద్రం నుండి ఒక్కొక్క భాగం యొక్క పొడవు వివిధ స్థాయిలలో ఉండి సమాచారాన్ని వివిధ పొరలుగా విశదపరుస్తుంది. నైటింగేల్ ఈ చార్ట్ ను ఇలా విభిన్నంగా అమర్చడం వలన వివిధ స్థాయిలలో ఉన్న సంక్లిష్ట సమాచారాన్నిఒకే చార్ట్ పై వివరంగా చూపించగలిగింది. క్రిమియన్ యుద్ధ సమయంలో ఆమె తయారు చేసిన కాక్స్ కోమ్బ్ డయాగ్రమ్ ఒక ఏడాదిలోని 12 నెలలను సూచించే విధంగా 12 భాగాలుగా ఉండి ప్రతి భాగంలోనూ రంగు వేయబడిన భాగం ఆ నెలలో సంభవించిన మరణాలను సూచించేలా రూపొందించబడింది. ఆమె ఉపయోగించిన వివిధ రంగులు ఆ మరణాలకు గల వివిధ కారణాలను సూచించేలా ఉన్నాయి. ఆమె కనుక ఇప్పుడు జీవించి ఉన్నట్లయితే ఇప్పటి కోవిద్ వ్యాప్తికి కూడా గణాంకాల విశ్లేషణ జరిపి వాటి ఆధారంగా వ్యాధి యొక్క వ్యాప్తిని అరికట్టడానికి పరిష్కార మార్గాలు సూచించగలిగే వారని చాలా మంది నమ్మకం. అయితే ఇటువంటి నమ్మకాలు, ఆశల వలన ఒనగూరేదేమీ లేదు. ఇటువంటి మార్గదర్శకులు చూపిన బాటలో నడవాల్సిన బాధ్యత ఇప్పటి తరంపై ఉన్నది. తాను సేకరించిన గణాంకాలు, సమాచారం ఆధారంగా మన దేశంలో పరిశుభ్రమైన త్రాగునీరు, కరువు భత్యం, మెరుగైన పారిశుధ్య వసతులు కల్పించవలసిన అవసరం గురించి ఆమె చేసిన కృషికి కూడా మనం ఆమెకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. *https://thisisstatistics.org/florence-nightingale-the-lady-with-the-data/ Translated by Bharathi Kode from Meena’s piece ‘The Lady With the Graph’ http://www.millennialmatriarchs.com millennialmatriarchs Bharathi Kode, Health, Nutrition, Sanitation, Telugu Leave a comment January 22, 2021 1 Minute పౌష్టికాహారం-ఒక విజయవంతమైన కార్యక్రమం: Focus on a Nutrition Success Story గర్భిణీలు, బాలింతల కోసం పోషకాహార కేంద్రాలు గర్భిణీలు, బాలింతలకు సరైన పోషకాహారం యొక్క అవసరం గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశంలో మహిళలలో పోషకాహార లోపాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంగన్వాడీ ల ద్వారా ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలకు పోషకాహారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ అంగన్వాడీలలో ఇచ్చే ఆహార పదార్ధాలను మహిళలు తీసుకువెళ్ళడం, ఇంటిలోని కుటుంబ సభ్యులందరితో పంచుకుంటున్నారనేది మేము క్షేత్ర స్థాయిలో గమనించిన అంశం. బహుశా పిల్లలు, మగవారు తిన్నాక మిగిలిన కొద్ది మొత్తం వారు తీసుకుంటుండవచ్చు. ఇంట్లో ఎవరికీ పెట్టకుండా కోడళ్ళు తమకు ఇచ్చిన ఆహారాన్ని దాచుకుని తినడం ఇంకా చాలా కుటుంబాలలో ఆమోదయోగ్యమైన విషయం కాదు. దీనితో వారికోసం ఉద్దేశించి ఇచ్చిన పోషకాహారం నిజానికి వారికి అందడం లేదు. కొన్ని రాష్ట్రాలలో ఈ అనుభవాలను చూసాక, మేము జి.ఎం.ఆర్. వరలక్ష్మి ఫౌండేషన్ లో ఈ కార్యక్రమాన్ని మరొక విధంగా అమలు చేసి చూద్దామనే ఆలోచన చేసాము. పోషకాహారాన్ని మహిళల ఇంటికి పంపే బదులుగా మహిళలే ఒక చోటకి చేరి ఆహారం తీసుకుంటే ఎలా ఉంటుందనేదే ఆ ఆలోచన. ఈ ఆలోచనతో కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని గర్భిణీలు, బాలింతలకు అనువుగా ఉండే ప్రదేశాలలో వారికోసం పోషకాహార కేంద్రాలను ప్రారంభించాము. ప్రతిరోజూ నిర్దేశించిన సమయానికి ఒక అరగంట సమయం గడిపేలా వారంతా కేంద్రానికి రావాల్సి ఉంటుంది. పోషకాహారంపై పనిచేసే ఒక జాతీయ స్థాయి సంస్థ సహాయంతో ఏ రోజు ఏ ఆహారం ఇవ్వాలి అని ఒక మెనూ తయారుచేశాము. ఇక్కడ మేము ఇచ్చేది పూర్తి భోజనం కాదు. కానీ సహజంగా మహిళలలో ఎటువంటి పోషకాలు లోపిస్తాయో వాటిని అందించేందుకు తగిన అదనపు ఆహారం ఈ కేంద్రాలలో ఇవ్వడం జరుగుతుంది. ఆయా సీజన్ లలో దొరికే ఆహార పదార్ధాలకు తగినట్లు ఎక్కువ వంట చేయవల్సిన అవసరం లేకుండా ఉండేలా ఈ మెనూ రూపొందించాము. ఈ కేంద్రాలకు వచ్చే మహిళలు అంగన్వాడీ నుండి కూడా తమకు రావాల్సిన రేషన్ ను తీసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న మహిళలు ప్రతిరోజూ ఈ కేంద్రాలకు వస్తారు. ఒక చిన్న కిట్టి పార్టీ లాగా ఉంటుందక్కడ. వారంతా కలిసి తింటారు. ముచ్చట్లు చెప్పుకుంటారు. గర్భిణీలుగా, బాలింతలుగా తమ అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. అప్పుడప్పుడు టీకాలు వేయించుకోవాల్సిన అవసరం గురించి, కుటుంబ నియంత్రణ గురించి, ఇతర ఆరోగ్య, పోషకాహార అంశాల గురించి అనుభవజ్ఞులైన ఆరోగ్య కార్యకర్తలతో అవగాహన సదస్సులు నిర్వహించడం, ఆహారం, బిడ్డల సంరక్షణకు సంబంధించి చిన్న చిన్న ఆటలు ఆడించడం, పరిశుభ్రత, ఆరోగ్య అంశాలపై డాక్యుమెంటరీ ల వంటివి చూపించడం వంటి అనేక కార్యక్రమాలు ఈ కేంద్రాలలో నిర్వహిస్తారు. వారి బరువు, హిమోగ్లోబిన్ శాతం, డాక్టర్ ఇచ్చిన సలహాలు అన్నీ రికార్డు చేయడం జరుగుతుంది. బలహీనంగా ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికి దాదాపు ఒక దశాబ్దం అయింది. ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న మహిళలు వందకి వంద శాతం ఆసుపత్రులలోనే ప్రసవం చేయించుకుంటుండగా బిడ్డల సగటు బరువు 2.5 కేజీల కన్నా అధికంగా ఉంటుంది. మరి ఖర్చు ఎంత అంటారా? రోజుకు ఒక్కో మహిళకు కేవలం పదిహేను రూపాయలు. గర్భిణీగా మూడవ నెల ప్రారంభం అయినప్పటి నుండి ప్రసవం తర్వాత ఆరవ నెల వరకు మొత్తం మీద ఒక్కో మహిళకు 12 నెలల పాటు సహాయం అందించడం జరుగుతుంది. ప్రసవం అయిన వెంటనే కేంద్రానికి రాలేని మహిళలకు ఆహారాన్ని ఇంటికి పంపిస్తారు. మొత్తం మీద వారి ఆరోగ్యం కోసం, వారి బిడ్డల ఎదుగుదలకు బలమైన పునాది వేయడం కోసం ఒక్కో మహిళ మీద 5500 రూపాయిల వరకు ఖర్చు అవుతుంది. ఇది ఏ సంస్థ అయినా తేలికగా అమలు చేయగలిగిన కార్యక్రమం. ఆసక్తి ఉన్న వారు వ్యక్తిగతంగా కూడా ఈ సహాయం చేయవచ్చు. దేశం మొత్తం మీద చూస్తే స్వచ్చంద సంస్థలు అమలు చేస్తున్న ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఒకరితో ఒకరు పంచుకోవడం, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం, వాటిని మరింత పెద్ద స్థాయిలో అమలు చేయడం ఇప్పుడు ఎంతో కీలకం. Translated by Bharathi Kode from Meena’s piece Focus on a Nutrition Success Story millennialmatriarchs Bharathi Kode, Health, Nutrition, Sanitation, Telugu 1 Comment January 7, 2021 January 7, 2021 1 Minute
ఏపీలోని పేద ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీ లోని ప్రైవేట్ లే ఔట్ల నిర్మాణంలో.. కచ్చితంగా పేదల ఇళ్ల కు ఐదు శాతం భూమి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ లే ఔట్ల నిర్మిస్తే ఐదు శాతం భూమిని జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఈ మేరకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మించే లే ఔట్లో భూమిని ఇవ్వలేకుంటే.. 3 కిలో మీటర్ల పరిధిలో అంతే విస్తీరణం కల భూమిని ప్రభుత్వానికి అప్ప జెప్పాలని ఆదేశాలు జారీ చేసింది జగన్ సర్కార్‌. భూమి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో భూమి విలువను చెల్లించవచ్చని ప్రభుత్వం సూచనలు చేసింది. లే ఔట్ల డెవలపర్ల ద్వారా వచ్చే భూమిని.. నగదును పేదల కోసం నిర్మించే జగనన్న కాలనీలకు వినియోగించనున్నట్టు వెల్లడించి ప్రభుత్వం. ఈ మేరకు నిబంధనలను సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. Tags: News News No comments Subscribe to: Post Comments ( Atom ) Education Info Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health General Info Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health Education Jobs Health
టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు.. పార్టీని లైన్‌లో పెట్టుకునేందుకు అనేక సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని ఎట్టి ప‌రిస్థి తిలోనూ.. అధికారంలోకి తీసుకురావ‌డమే ధ్యేయంగా.. చంద్ర‌బాబు ఆలోచ‌న చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఆయ‌న స‌మీక్ష‌లు చేస్తున్నారు. నాయ‌కుల‌ను హెచ్చ‌రిస్తున్నారు. పార్టీని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేసేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్టు చెబుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ పార్టీ కోసం.. ప‌నిచేయాల‌ని కూడా.. చంద్ర‌బాబు సూచిస్తున్నారు. ఇక‌, తాను కూడా.. త్వ‌ర‌లోనే బ‌స్సు యాత్ర చేయ‌నున్న‌ట్టు కొన్నాళ్ల కింద‌ట సంకేతాలిచ్చారు. గ‌తం ప్ర‌భుత్వంలో అమ‌లు చేసిన‌.. అన్న‌క్యాంటీన్ల‌ను ప్ర‌స్తుతం టీడీపీ నాయ‌కులు సొంత సొమ్ము ఖ‌ర్చు చేసి మ‌రీ నిర్వ‌హిస్తున్నారు. వీటికి ఆద‌ర‌ణ బాగానే ఉంది. సో.. దీనిని బ‌ట్టి.. పాత ప‌థ‌కాలైన రంజాన్ తోఫా.. సంక్రాంతి కానుక‌.. క్రిస్మ‌స్ కానుక వంటివాటిని అమ‌లు చేయ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు పంపించిన‌ట్టు అయింది. కానీ, వీటి క‌న్నా మెరుగైన ప‌థ‌కాలుగా.. ప్ర‌స్తుతం వైసీపీ ఇస్తున్న కానుక‌ల‌ను ప్ర‌జ‌లు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ అమ‌లు చేసే సంక్షేమం, కార్య‌క్ర‌మాల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. కానీ, వీటిని చంద్ర‌బాబు ఇప్పుడే కాదు.. ఎన్నిక‌ల‌కు ముందు మాత్రమే వెల్ల‌డించ‌నున్న‌ట్టు కొంద‌రు చెబుతున్నారు. ఇది కీల‌క‌మైన విష‌యం. రాజ‌కీయంగా. చంద్ర‌బాబు, జ‌గ‌న్‌లు తిట్టుకున్నా.. వ్యూహ ప్ర‌తివ్యూహాలు వేసుకుని.. ముందుకు సాగినా.. పార్టీత‌ర‌ఫున ప్ర‌జల కు ఏం చేయ‌నున్నారు? వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తే.. అమ‌లు చేయ‌నున్న ప‌థ‌కాలు ఏంటి? ఏ వ‌ర్గానికి ఎలాంటి మేలు చేస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. దీనిపైనే చంద్ర‌బాబు టీం ప్ర‌శ్నిస్తోంది. మాకు ఏమీ చెప్ప‌లేదు. నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ప‌ర్య‌టించ‌మ‌ని కోరుతున్నారు. ఇలా అయితే.. ఎలా వెళ్ల‌గ‌లం.. అని కొంద‌రు నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో.. పార్టీ చూసుకుంటుంద‌నేది చంద్ర‌బాబు వాద‌న‌. స‌రే.. ఏది ఎలా.. ఉన్నా.. చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం మాత్రం చాలా బాగుంద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంలో పార్టీ నేత‌లు స‌క్ర‌మంగా లేక‌పోతే.. న‌ష్ట‌పోయేది వారేన‌నే వాదన కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇంత చేసినా.. చంద్ర‌బాబు కొన్ని విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టార‌నే వాద‌న త‌మ్ముళ్ల మ‌ధ్య చ‌ర్చ‌కు దారితీస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌ని అనుకున్న‌ప్పుడు.. దానికి త‌గిన విధంగా ప్ర‌ణాళిక‌లు వేసుకుని ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ముఖ్యంగా ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాలు కోరుతున్నార‌ని.. వాటిపై క్లారిటీ ఇవ్వ‌లేద‌ని.. పేర్కొంటున్నారు.
పరిస్థితులు బాగా లేనప్పుడు మనల్ని ఒక మూలన కూర్చోబెడితే మనకి అది ఏమాత్రం నచ్చదు. గెత్సెమనే తోటలో పదకొండుమందిలో ఎనిమిదిమందిని అలా ఊరికే కూర్చోమన్నాడు ప్రభువు. ఆయన బాగా ముందుకు వెళ్ళాడు ప్రార్ధించడానికి. పేతురు యాకోబు యోహానులకు మధ్యలో ఉండి కనిపెట్టమని చెప్పాడు. మిగతా వాళ్ళంతా దూరంగా ఒకచోట కూర్చున్నారు. ఆ ఎనిమిదిమంది చాలా సణుగుకుని ఉంటారను కుంటాను. వాళ్ళు తోటలో ఉన్నారన్న పేరు మాత్రం ఉంది. అంతే దాన్లోని పూలు పూయించే విషయంలో వాళ్ళ పాత్ర ఏమాత్రం లేదు. అది అత్యవసర పరిస్థితి. అందరూ అనేక రకాలైన వత్తిడులకి లోనై ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళకి యేసు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే "ఏమీ చెయ్యకుండా అక్కడ కూర్చోండి." ఇలాటి అనుభవమే చాలాసార్లు నీకూ నాకూ వచ్చింది కదా. ఆ నైరాశ్యతను మనం చవిచూశాం. సేవ చెయ్యడానికి ఎన్నో అవకాశాలు మనకి కనబడినాయి. మన తోటివాళ్ళు కొందరు బాగా ముందుకు వెళ్ళారు. మరికొందరు మధ్యను ఉన్నారు. మనం మాత్రం వెనకాల పండుకుని ఉండవలసివచ్చింది. అస్వస్థతో, పేదరికమో, లేక మరో విధంగా పరిస్థితులు తలక్రిందులు కావడమే జరిగి మనం వెనకాల ఉండవలసివచ్చింది. మనం చిన్నబుచ్చుకున్నాం. క్రైస్తవులుగా మన పాత్ర మనం నిర్వహించకుండా ఈ అడ్డంకులేమిటో మనకి అర్థం కాదు. తోటలోకి మనం ప్రవేశించిన తరువాత కూడా చెయ్యడానికి ఏ పనీ లేకపోతే అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. "హృదయమా మేదలకుండా ఉండు. నీకర్థమయ్యేదే ఎప్పుడూ వాస్తవం అనుకోకు. క్రైస్తవ జీవితంలో పాలుపంపులు నీకు తప్పకుండా ఉన్నాయి. దేవుని తోటలో నడిచేవాళ్ళే, నిలబడేవాళ్ళే నిజమైన సేవకులు అనుకోకు. నువ్వు కూర్చుని ఉండవలసివచ్చిన స్థలం కూడా పరిశుద్దమైనదే.” క్రీస్తులో జీవించి ఉండడంలో మూడు రకాలున్నాయి. ముందుకి వెళ్ళి పనిచేస్తూ కనిపెడుతూ తెల్లవారేదాకా పోరాడుతూ ఉండే ఆత్మలు కొన్ని. మరికొన్ని ఆత్మలు మధ్యలో ఉండి ముందు జరుగుతున్నవాటిని ఇతరులకు తెలియజేస్తుంటాయి. ఇవి రెండూ కాక మూడో రకం పోరాడలేనివి, పోరాటాన్ని చూడలేనివి ఉంటాయి. ఆ ఆత్మలకి ప్రస్తుతం దేవుడిచ్చే ఆజ్ఞ "ఇక్కడే కూర్చుని ఉండండి." నీకిలాటి అనుభవం తటస్థించినప్పుడు దేవుడు నిన్ను కించపరుస్తున్నాడనుకో వద్దు. "ఇక్కడ కూర్చోండి" అని యేసు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోండి. తోటలో నువ్వు కూర్చుని ఉన్న స్థలం కూడా పరిశుద్దమైనదే. దాని పేరు "వేచియుండే చోటు" కొన్ని ఆత్మలు గొప్ప పనులు చెయ్యడానికి గాని, గొప్ప భారాలు వహించడానికి గాని ఈ లోకానికి రావు. అవి కేవలం అలా ఉండడం కోసమే నియమించబడినాయి. అవి మనుషులు ఎప్పుడూ ఉపగించని పూలు. వాటిని ఎవరూ దండగా గుచ్చలేదు. ఏ బల్లమీదా అవి అలంకారం ఉండలేవు. పరిశీలకుల దృష్టిలోకి ఎప్పుడూ అవి రాలేదు. కాని క్రీస్తు హృదయాన్ని అవి సంతోషపెట్టినాయి. వాటి పరిమ వల్ల, వాటి అందం పట్ల అవి క్రీస్తుకి ప్రియమైనవైనాయి. తన అందాన్ని చూసేవాళ్ళెవరు లేకపోయినా అవి అందాన్ని నింపుకుస్నందువల్ల దేవుడు చూసి సంతోషిస్తున్నాడు. నువ్వు ఇలాటి పువ్వువైతే సణుక్కోవద్దు. Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
ఫ్యాన్ ఛాయిస్ అవార్డులలో ఈ సంవత్సరం ఉత్తమ టీవీ జంట పోల్‌లో మంత్రగత్తె మరియు పిశాచాల మధ్య శృంగారం మా పాఠకులపై గెలిచింది. కె-పాప్‌లో సంవత్సరపు ఉత్తమానికి ఓటు వేయండి మా సరికొత్త కొరియన్ పాప్ మ్యూజిక్ అవార్డులలో భాగంగా పాప్‌క్రష్ సంవత్సరంలో అత్యుత్తమమైన K- పాప్ చర్యలను అందిస్తుంది. నామినీలను పరిశీలించి, మీకు ఇష్టమైన వారికి ఓటు వేయండి! పాప్‌క్రష్ ఫ్యాన్ ఛాయిస్ అవార్డులలో బిటిఎస్ 2016 యొక్క ఉత్తమ ఆల్బమ్‌ను గెలుచుకుంది 300,000 ఓట్ల తరువాత, దక్షిణ కొరియా సంచలనాలు వారి తాజా ఆల్బమ్ 'వింగ్స్' తో పాప్‌క్రష్ ఫ్యాన్ ఛాయిస్ అవార్డుల పోల్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి. 2016 యొక్క అత్యంత విశ్వసనీయ ఫ్యాన్‌బేస్: ఫ్యాన్ ఛాయిస్ అవార్డులు సెలెనా గోమెజ్ యొక్క ఉద్వేగభరితమైన సెలెనేటర్స్ నుండి బెయోన్స్ యొక్క ఎప్పటికప్పుడు సందడి చేసే బేహైవ్ వరకు, వారి అభిమానులతో 2016 ను ఏ అభిమానుల స్థావరం పాలించింది? 1 మా గురించి ఫన్ మరియు బోల్డ్ పాప్ సంగీతం, ప్రముఖ వార్తలు మరియు వినోద కోసం డిజిటల్ గమ్యం, తాజా మరియు సానుకూల దృక్పథం పనిచేశారు
అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు, ఉన్నట్లుండి వాతావరణంలో వస్తున్న మార్పులు, సీజనల్‌గా వచ్చే సమస్యలతో ప్రధాన పంటలు చీడపీడల బారినపడుతున్నాయి. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 వరి, పత్తి, కంది, మొక్కజొన్నలకు చీడపీడలు.. అన్నదాతల్లో ఆందోళన.. అస్థిర వర్షాలు, వాతావరణ పరిస్థితులతోనే రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువ హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు, ఉన్నట్లుండి వాతావరణంలో వస్తున్న మార్పులు, సీజనల్‌గా వచ్చే సమస్యలతో ప్రధాన పంటలు చీడపీడల బారినపడుతున్నాయి. వరి పంట పిలకలు వేసే దశలో, చిరుపొట్ట దశలో, మొక్కజొన్న కంకి వేసే దశలో, పత్తి.. పూత, కాత దశలో ఉన్న సమయంలో చీడపీడలు దాడిచేస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరు జిల్లాల్లో చీడ పీడల ప్రభావం ఎక్కువగా ఉంది. జూలైలో 121 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. అధిక వర్షాల తాకిడికి సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆగస్టులో సాధారణం కన్నా 15శాతం తక్కువ వర్షపాతం నమోదైతే, సెప్టెంబరులో సాధారణం కన్నా 89శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లో అధిక వర్ష పాతం నమోదైంది. ఇలా కొన్ని రోజులు అధిక వర్షాలు, మరికొన్ని రోజులు వర్షాభావ పరిస్థితులతో పంటల ఎదుగుదలపై దెబ్బ పడింది. ఈ వానాకాలంలో వరి పంట రికార్డుస్థాయిలో 64.32 లక్షల ఎకరాల్లో సాగైంది. కాస్త ఆలస్యంగా వరి నాట్లు వేసిన చోట్ల మినహా రాష్ట్రమంతటా పిలకలు వేసే దశ, చిరు పొట్టదశ, ఈనేదశలో వరి పైరు ఉంది. కాండం తొలిచే పురుగు, రసంపీల్చే పురుగులు వరి పంటపై దాడి చేస్తున్నాయి. వరంగల్‌, సూర్యాపేట, వికారాబాద్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. కాండం తొలిపే పురుగు దెబ్బకు తెల్లకంకి ఎక్కువ అవుతోంది. రసంపీల్చే పురుగు దెబ్బకు దోమ ఎక్కువగా వస్తోందని, వరి మొగి పాడవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న 6.21 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇప్పుడు కంకిదశలో ఉంది. కాండంతొలిచే పురుగు, కత్తెర పురుగు ప్రభావం వికారాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈసారి రైతులు 5.62 లక్షల ఎకరాల్లో కంది వేశారు. పూత దశలో ఉన్న కందిచేను పెరగకుండా దోమలు ప్రభావం చూపిస్తున్నాయి. ఆసిఫాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో కందిచేలలో చీడపీడలు ఆశిస్తున్నాయి. పత్తి 49.98 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తిపై నాలుగైదు రకాల చీడపీడలు దాడి చేస్తున్నాయి. సూర్యాపేట, వికారాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి, భువనగిరి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో రసంపీల్చే పురుగులు, ఆకు మచ్చ తెగులు, ఆకు ఎరుపు తెగులు, పొగాకు వెర్రి తెగులు, రకరకాల దోమలు పత్తి పంటను దెబ్బకొడుతున్నాయి. తొలుత ఆకులపై మచ్చలు ఏర్పడి అవి పెద్దగా మారుతున్నాయి. తర్వాత ఆకు ఎండిపోతోంది. ఇది ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చెందుతోంది. వర్షాల బెడదతో ఆకులపై రకరకాల మచ్చలు ఏర్పడుతున్నాయి. రసంపీల్చే పురుగులు కాయలను పీల్చేస్తున్నాయి. పొగాకు వెర్రి తెగులు ప్రభావంతో చిన్న ఆకులు ముడుచుకు పోతున్నట్లు రైతులు, శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగించడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు అన్నారు ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న టీడీపీ నేతలు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఎన్టీఆర్‌ పేరు తొలగించడం దుర్మార్గం పాయకాపురం, సెప్టెంబరు 26 : ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగించడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు అన్నారు. 63వ డివిజన్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి సోమవారం పాలాభిషేకం చేసి అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విజయవాడకు ఎన్టీఆర్‌ జిల్లాగా పేరు పెట్టి ఎన్టీఆర్‌పై గౌరవం ఉన్నట్లు నటించిన జగన్‌ రెడ్డి యూనివర్సిటీకి ఆయన పేరును తొలగించి కపటబుద్ధిని బయటపెటుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచ రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారని పేర్కోన్నారు. డివిజన్‌ టీడీపీ నేతలు లబ్బా వైకుంఠం, బత్తుల కొండ, కోలా శ్రీను, లబ్బా దుర్గ, బెజ్జం జైపాల్‌, ఎస్‌కె. బచ్చా, పాల్గొన్నారు.
భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైనప్పుడు, ప్రతిపక్ష పార్టీలు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి అనూహ్యమైన రీతిలో మద్దతుగా నిలిచాయి. యుద్ధంలో పాకిస్థానీ సేనలు బేషరతుగా లొంగిపోయిన్నట్లు ప్రధాని దిగువసభలో ప్రకటించిన సందర్భంలో పార్టీలకు అతీతంగా, సభ్యులంతా నిలబడి, చప్పట్లు కొడుతూ “జోయ్ బంగ్లా”, “బంగ్లాదేశ్ లాంగ్ లివ్”, “ఇందిరా గాంధీ లాంగ్ లివ్” అని నినాదాలు చేస్తూ కాగితాలను గాలిలోకి విసురుతూ ప్రశంసలు కురిపించారు. బహుశా 75 ఏళ్ళ భారత పార్లమెంట్ చరిత్రలో అవి చాలా అరుదైన దృశ్యాలు అని చెప్పవచ్చు. అదే సంవత్సరం మార్చిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆమె ఐక్య ప్రతిపక్షాన్ని ఓడించి తిరిగి అధికారంలోకి వచ్చారు. అధికార – ప్రతిపక్షాల మధ్య విధానాల పరంగా తీవ్రమైన రాజకీయ విబేధాలు కొనసాగుతున్న సమయం. ఎన్నికలు జరిగి కేవలం ఎనిమిది నెలలైనా తర్వాత ప్రతిపక్షాలు ఆమెకు ఆ విధంగా బాసటగా నిలబడటం కూడా అపూర్వం. “క్లిష్ట సమయంలో అన్ని పార్టీల మద్దతుకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అంటూ ఆమె అఖిలపక్ష సమావేశంలో ప్రసంగిస్తూ తన కృతజ్ఞతలను వ్యక్తం చేశారు. సిపిఐ, డిఎంకె నాయకులతో పాటు, జనసంఘ్‌కి చెందిన పితాంబర్ దాస్, ఆమెతో విబేధం కారణంగా కాంగ్రెస్ నుండి విడిపోయిన కాంగ్రెస్ (ఓ) మొరార్జీ దేశాయ్ వంటి వారు ప్రధానమంత్రిని ప్రశంసించడంలో ఒకరితో ఒకరు పోటీపడ్డారు .ప్రతిపక్ష నాయకులందరిలో సిపిఎం మాత్రమే వ్యక్తిగతంగా పొగడ్తలు లేకుండా కొంచెం గంభీరంగా వ్యవహరించింది. భారతీయ ఎయిర్‌ఫీల్డ్‌పై పాక్ వైమానికదళం దాడి జాతీయ అత్యవసర పరిస్థితిని సృష్టించిందనే వాస్తవం గుర్తించిన ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని ఆ కాలంలోని ఇతర వార్తా కధనాలు స్పష్టం చేస్తున్నాయి. “ప్రధానమంత్రి ఇప్పుడు దేశాన్ని శత్రువుపై పూర్తి విజయానికి నడిపించాలి. పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం మరిన్ని అధికారాలను పొందాలనుకుంటే, మా పార్టీ తన పూర్తి సహకారాన్ని అందించడానికి వెనుకాడదు” అని తర్వాత బిజెపిగా పరిణామం చెందిన నాటి ప్రధాన ప్రతిపక్షం జనసంఘ్ అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్‌పేయి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐతో పాటు ఆ పార్టీతో విభేదించి, చీలిక పార్టీగా ఏర్పాటై అప్పుడప్పుడే పుంజుకొంటున్న సిపిఎం కూడా ప్రభుత్వానికి మద్దహతు పలికాయి. జవహర్ లాల్ నెహ్రు విధానాలతో విభేదించి సి రాజగోపాలాచారి ఏర్పాటు చేసిన స్వతంత్ర పార్టీ సహితం అండగా నిలిచింది. డిఎంకెతో సహా ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. భారత్ – పాక్ ల మధ్య 13 రోజుల యుద్ధం జరగడంతో డిసెంబర్ 3న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. బంగ్లాదేశ్‌కు మద్దతు అందించడంలో ఆమె స్థిరంగా ఉన్నారు. భారత్‌ను కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించేందుకు అమెరికా ఎంతగా ప్రయత్నించినప్పటికీ. ప్రతిపక్షాలు సహితం అమెరికాకు వ్యతిరేకంగా ఐక్యంగానే ఉన్నాయి. లోక్‌సభలో వాజ్‌పేయి, రాజ్యసభలో ఎస్‌ఎన్ మిశ్రాతో సహా ప్రతిపక్ష నాయకులు పార్లమెంటులో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ “భారత వ్యతిరేక ప్రకటనలను” ముక్తకంఠంతో ఖండించారు. బాలరాజ్ మధోక్, ఎల్ కె అద్వానీ, కేడర్ నాథ్ సహానీ లతో సహా ఇతర జనసంఘ్ నాయకులు అమెరికా రాయబార కార్యాలయం వెలుపల ప్రదర్శనలకు నాయకత్వం వహించారు. సిపిఐ, డీఎంకే లతో సహా ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా అమెరికాకు వ్యతిరేకంగా నిరసనల ప్రదర్శనలు నిర్వహించాయి. ఆసక్తికరంగా, 1971లో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా, జనసంఘ్ నాయకుడు వాజ్‌పేయి, స్వతంత్ర పార్టీ అధినేత పి.కె డియో, ప్రధానమంత్రికి “గట్టిగా మద్దతు” ఇచ్చారు. అసెంబ్లీల కాలపరిమితిని ఒక సంవత్సరం పాటు కొనసాగించాలని వాదించారు. అయితే సిపిఎం నాయకులు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మాత్రమే ప్రతిపక్షం ప్రభుత్వ విధానాల పట్ల తమ అసమ్మతిని తెలియజేయడం ప్రారంభించాయి. కాల్పుల విరమణ ప్రకటించాలన్న ప్రభుత్వ నిర్ణయం.. ఏకపక్ష కాల్పుల విరమణ నిర్ణయంతో తాను పూర్తిగా ఏకీభవించడం లేదని, ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలని కోరుతూ ముఖ్యంగా జనసంఘ్ అధ్యక్షుడు వాజ్‌పేయి నుంచి ప్రధాన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. “మన జవాన్లు యుద్ధ భూమిలో గెలుపొందిన విజయాలను దేశం చర్చల సమయంలో నష్టపోవడానికి సిద్ధంగా లేదు” అంటూ స్పష్టం చేశారు. “పశ్చిమ ఫ్రంట్‌లో యథాతథ స్థితిని మేము అనుమతించము. ప్రతి ఐదేళ్లకోసారి చెలరేగుతున్న పాకిస్థాన్ దురాక్రమణకు ఈ యుద్ధం ఒక్కసారిగా ముగింపు పలకాలి” అంటూ ఆయన గర్జించారు.
బాబూ.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేస్తావా..? ఆక్వా రైతులను ఆదుకోండి పార్టీ నేతల సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కీలక ప్రకటన నిషేధిత ప్లాస్టిక్ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత శ్రీ‌నాథ్‌రెడ్డి పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్ సమావేశం ప్రారంభం కాసేపట్లో పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం బడుగు, బలహీనవర్గాలకు వెన్నుపోటే బాబు డీఎన్ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం You are here హోం » టాప్ స్టోరీస్ » మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేద్దాం మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేద్దాం 31 Oct 2022 1:25 PM పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం పోరాటం చేయలేనివారు నోరుమూసుకొని కూర్చోండి.. అచ్చెన్నాయుడికి అవగాహనుందా..? అమరావతి వెనకున్న కుట్ర గురించి తెలుసా..? మన విశాఖ– మన రాజధాని సదస్సులో మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం: పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ‘‘తరాలుగా వెనుకబాటుకు గురవుతూ వస్తున్న ఉత్తరాంధ్రకు చేయూతనివ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయానికి అండగా నిలబడాల్సిన బాధ్యత, అవసరం మనపై ఉంది. మన ప్రాంత ప్రజల కోరికను తీర్చుకోవడానికి గొంతెత్తి వీధులోకి వచ్చి అందరినీ చైతన్యవంతులను చేద్దాం. మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేద్దాం’’ అని మంత్రి ధర్మాన పిలుపునిచ్చారు. వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ‘మన విశాఖ – మన రాజధాని సదస్సు’కు మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమరావతి పాదయాత్ర ముసుగులో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దాగి ఉంది. రాజధాని కోసం కేంద్ర కమిటీ అందజేసిన నివేదికను చంద్రబాబు విస్మరించారు. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండొచ్చని విభజన చట్టంలో చెప్పినా రెండేళ్లకే హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చాడు. ఏపీకి ఒకే రాజధాని పెట్టడం మంచిది కాదని కేంద్ర కమిటీ చెప్పింది. ఒడిశాలోని కటక్‌లో హైకోర్టు, భువనేశ్వర్‌లో పాలన రాజధాని ఉంది. మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వికేంద్రీకరణ జరుగుతోంది. విశాఖపట్నం పరిపాలన రాజధాని అయితే ఇనిస్టిట్యూషన్స్‌ వస్తాయి.. ఇన్వెస్టిమెంట్స్‌ వస్తాయి. మన పిల్లలకు ఉన్నత చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. మన ఆస్తుల విలువలతో పాటు మన ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. దీని గురించి మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు నోరురావడం లేదు. మన ప్రాంతం కోసం పోరాటం చేస్తున్న మనల్ని దద్దమ్మలు అని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు. అచ్చెన్నాయుడుకు సరైన అవగాహనుందా..? అమరావతి వెనుక ఉన్న కుట్ర గురించి తెలుసా..? చేతగాకపోతే నోరు మూసుకొని కూర్చొండి.. ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మేము పోటీ చేస్తాం. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా మాట్లాడితే అవమానించినట్టే’’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
రాజకీయ చదరంగ క్రీడలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని మించినవారు లేరని ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు నిరూపించాయి. సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ కూడా తక్కువ ఎత్తుగడలు వేయలేదు. ఆయన పూర్తిగా అంకగణితాన్ని నమ్ముకుని... అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 రాజకీయ చదరంగ క్రీడలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని మించినవారు లేరని ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు నిరూపించాయి. సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ కూడా తక్కువ ఎత్తుగడలు వేయలేదు. ఆయన పూర్తిగా అంకగణితాన్ని నమ్ముకుని పావులు కదిపారు. యాదవులు, ముస్లింలు సంఘటితంగా ఓటు వేస్తే 30 శాతం ఓట్లు లభిస్తాయని, మరో 15 శాతం తనకు లభిస్తే ఎన్నికల్లో విజయం తనదేనని ఆయన ప్రగాఢంగా నమ్మారు. రాష్ట్రం నలుమూలలా ఏడు చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. రకరకాల కులసమీకరణలు చేశారు. వాటివల్ల కనీసం 15 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేశారు. అక్కడితో ఆగకుండా బిజెపి శిబిరంలో ఉన్న స్వామిప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్ లాంటి వారికి వల వేశారు. అసంతృప్తులపై ఒక కన్ను వేసి ఉంచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బిజెపి సీటు నిరాకరిస్తే తమవైపు లాగడానికి వీలుగా చివరి నిమిషం వరకూ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా ఆగారు, యాదవేతర బీసీల్లో కుర్మీలకు అధిక సీట్లు ఇచ్చారు. ముస్లిం ఆధిపత్యం ఉన్న చోట్ల కూడా వారికి సీట్లు ఇచ్చి బిజెపి అభ్యర్థి ఓట్లను చీల్చేందుకు ప్రయత్నించారు. అఖిలేశ్ యాదవ్ ఎత్తుగడలను ఎదుర్కోవడం కోసం బిజెపి చాలా చోట్ల తప్పని సరిగా సిట్టింగ్ అభ్యర్థులకు సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఆలస్యంగా ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ అఖిలేశ్ పన్నాల్సిన ఎత్తుగడలనన్నీ పన్నారు. అంతకంటే ఆయన చేయగలిగింది ఏమీ లేకపోయింది. అయినప్పటికీ సమాజ్‌వాది పార్టీ కేవలం 32 శాతం మాత్రమే ఓట్లు సాధించగలిగింది. కేవలం, ముస్లింలు, యాదవులు బలంగా ఉన్న చోట మాత్రమే అది ఎక్కువ సీట్లను గెలుచుకోగలిగింది. ఎంత కష్టపడ్డప్పటికీ ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా సమాజ్‌వాది పార్టీ ప్రభావం చూపలేదన్న విషయం స్పష్టమైంది. భారతీయ జనతా పార్టీ కూడా అంకగణితాన్ని ప్రయోగించింది. యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళితులపై గతంలో మాదిరే బలమైన సామాజిక సమీకరణలను ఉపయోగించుకుంది. కాని అంకగణితంతో పాటు అనేక ఇతర కారణాలు, ప్రధానంగా మోదీ, యోగీ రసాయనం బిజెపికి ఎక్కువ ఉపయోగపడింది. బహుజన సమాజ్ పార్టీకి చెందిన జాతవులు, జాతవేతర ఓట్లు బిజెపివైపు మొగ్గాయి. బిజెపిని మనువాద పార్టీగా భావించే బలమైన కాన్షీరాం వాదులు తప్ప అంబేడ్కరిస్టులు, మిగతా వారు బిజెపి వైపు మొగ్గు చూపారు, వారిలో యువకులను గుర్తించి బిజెపి వైపు తీసుకువచ్చే ప్రయత్నం చాల కాలం నుంచి జరిగింది, బిఎస్‌పి ఓట్లు 22 శాతం నుంచి 12 శాతానికి పడిపోవడమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 6.3 నుంచి 2.3 శాతానికి పడిపోయింది. ‘మై లడ్కీ హూ, లడ్ సక్తాహూ’ (నేను ఒక బాలికను, నేను పోరాడగలను) అంటూ ప్రియాంకాగాంధీ 40 శాతం మహిళలకు సీట్లు ఇచ్చినప్పటికీ మహిళలు అత్యధిక శాతం బిజెపికి ఓటు వేశారని సిఎస్ డిఎస్ అంచనాలు వెల్లడించాయి. ఆమె గంగా యాత్రలు కూడా ఫలించలేదు, రాయబరేలీ, అమేథీల్లో కూడా ఆమె పార్టీని గెలిపించలేకపోయారు. ప్రియాంక హవా ఏమీ లేదని తెలిసిన జితిన్ ప్రసాద, ఆర్‌పీఎన్ సింగ్ లాంటి నేతలు బిజెపి వైపు మొగ్గు చూపారు. రైతులపై హింసాకాండ అమలు జరిగిన లఖీంపూర్ ఖేరీలో 8 సీట్లలో ఆరు గెలుస్తామని బిజెపి భావించింది, కాని మొత్తం సీట్లను ఆ పార్టీ గెలుచుకోగలిగింది, ముస్లింలు 30 శాతం ఉన్న చోట్ల కూడా బిజెపికి ఢోకా లేకుండా పోయింది, జాట్‌లలో 50 శాతం పైగా బిజెపివైపు మొగ్గు చూపారని గణాంకాలు చెబుతున్నాయి. బిజెపి ఏఏ వర్గాలను లక్ష్యంగా ఎంచుకుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. గత ఎనిమిది సంవత్సరాల్లో నాలుగు ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం చిన్న విషయం కాదు. మళ్లీ మళ్లీ బిజెపికి ఓటు ఎందుకులే అన్న నిరాసక్తత జనంలో రాకుండా బిజెపి చూసుకుంది. ఓటింగ్‌కు వెళ్లాలి, బిజెపిని గెలిపించాలి అన్న టెంపోను నిలబెట్టారు. కేవలం సామాజిక సమీకరణాలే కాదు, క్రింది స్థాయి నుంచి పనిచేసే బలమైన సంస్థాగత శక్తి బిజెపికి ఉన్నది. ఎంత అభివృద్ధి జరిగినా తమకేమి ఒరిగిందిలే అని సామాన్య ప్రజలు భావిస్తారని తెలిసినందువల్ల లబ్ధిదారులపై దృష్టి కేంద్రీకరించారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయమేమిటంటే బిజెపిలో లుకలుకలు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, జాతీయ, రాష్ట్ర పార్టీలు కూడా కలిసికట్టుగా పనిచేసేలా చూశారు. ప్రతి రాష్ట్రం నుంచీ 2వేల మంది కార్యకర్తల్ని రప్పించారు, మిగతా పార్టీలకంటే బిజెపిలో తిరుగుబాటు అభ్యర్థులు తక్కువే ఉన్నారు. ఆరుగురు తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేస్తే వారిలో ఇద్దరు మాత్రమే చివరకు మిగిలారు, మిగతా వారు ఎన్నికల ప్రచారం చేయకుండా నాయకులు చూసుకున్నారు. 30 మంది ఎమ్మెల్యేలు యోగీ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉంటే వారు మోదీ ముఖం చూసి పార్టీకోసం పనిచేసేలా చూశారు. అన్నిటికన్నా బిజెపి నేతలందర్నీ కట్టిపడేసేది అధికంగా సంఘ్‌తో అనుబంధం, ఒక సైద్ధాంతిక బంధం. ఈ విషయంలో మిగతా పార్టీలు బిజెపితో పోటీ పడలేవు. అంతర్గత అంచనాల ప్రకారం ముస్లింలు పూర్తిగా అఖిలేశ్ యాదవ్ వైపు మొగ్గలేదు, కేవలం 0.49 శాతం ఓట్లు వచ్చినప్పటికీ ఎంఐఎం ఏడు సీట్లలో ఎస్‌పికి నష్టం చేయగలిగింది, తాను పోటీ చేసిన సీట్లలో కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు, సాధించింది మంచి పనితీరే కనపరిచింది, ఆసక్తికరమైన విషయం ఏమంటే 8 నుంచి 16 శాతం వరకు ముస్లింలు ప్రధానంగా ముస్లిం మహిళలు బిజెపికి ఓటు వేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఉజ్వల్, పక్కా ఇళ్ల విషయంలో ముస్లింల పట్ల వివక్షత చూపలేదని, 33 శాతం ఇళ్లు ముస్లింలకే కేటాయించామని బిజెపి నేతలు చెబుతున్నారు. ఏ ఎన్నికకైనా కొన్ని సంవత్సరాల ముందే పకడ్బందీగా ప్రణాళికా బద్దంగా పనిచేయడం బిజెపి తత్వం. ముఖ్యంగా నరేంద్రమోదీకి ఎన్నికలంటే ఎంతో ఇష్టం. ఉత్తరప్రదేశ్‌లో ఏడాది ముందు నుంచే ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు, ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆయన రెండో దశలో ప్రచారంలో ఉండేవారు. యూపీ ఎన్నికల ఫలితాలు ప్రకటించి 24 గంటలు కాకముందే నరేంద్రమోదీ గుజరాత్‌కు వెళ్లి రెండు రోజులు అక్కడే గడిపారు. అహ్మదాబాద్‌లో రోడ్ షోలో పాల్గొన్నారు. పంచాయతి మహా సమ్మేళన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీని ప్రారంభించారు. అన్నిటికంటే ఎక్కువగా అందర్నీ ఆకర్షించింది మోదీ తన తల్లి ఇంటికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకోవడం. ఈ సన్నివేశాలన్నీ డిసెంబర్‌లో గుజరాత్‌లో జరిగే ఎన్నికలకు నాందీ ప్రస్తావనలుగా భావించినప్పటికీ, మోదీని నవ రస నటనా సార్వభౌముడిగా అనేక మంది అభివర్ణించినప్పటికీ ప్రజలు తన హావభావాలను సహజంగా భావించేలా చేయడమే ఆయన ప్రత్యేకత. మోదీ చేసిన పనులే రాహుల్ గాంధీ చేస్తే చాలా కృత్రిమంగా కనిపిస్తుంది, ప్రియాంక ‘హరహర మహదేవ’ అని నినాదం చేస్తే జనం వింతగా చూశారు. అందువల్ల 2019 చివరి దశ పోలింగ్ సమయంలో నరేంద్రమోదీ కేదార్‌నాథ్ గుహకు వెళ్లి తపోధ్యానంలో మునిగిపోయినా, యూపీ ఎన్నికల చివరి ఘట్టంలో వారణాసిలో రైల్వే స్టేషన్‌కు వెళ్లి సామాన్యులతో సంభాషించినా జనం మనసుల్లో బలమైన ముద్ర వేయడానికే అని అర్థమైనప్పటికీ ఆయనను ఈ విషయంలో అధిగమించగలిగిన నేత విపక్షాల్లో లేరని మాత్రం చెప్పక తప్పదు, మోదీ రసాయనానికి అంకగణితం తోడైతే ఏమవుతుందో ఈ ఎన్నికలు నిరూపించాయి. అయితే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్షాలు మోదీని ఎదుర్కొనే విషయంలో వెనక్కు తగ్గుతాయా? వెనక్కి తగ్గినంత మాత్రాన బిజెపి ఆ పార్టీలను కబళించకుండా ఉంటుందనుకోవడానికి వీల్లేదు, కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేస్తున్న బిజెపి ప్రాంతీయ పార్టీలను నిర్మూలించడంపై ఏనాడో దృష్టి సారించింది. కనుక అవి తమ అస్తిత్వం కాపాడుకోవడానికైనా పోరాడక తప్పదు. ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలను కాపాడుకోవడానికైనా కలిసికట్టుగా కార్యాచరణ చేయక తప్పదు. అంతేకాదు, యూపీ ఎన్నికలను సెమిఫైనల్స్‌గా భావించడానికి వీలు లేదు. ఈ ఏడాది గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలోనూ, వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. బిజెపి జగన్నాథ రథచక్రాలను అడ్డుకోవాలంటే ముందుగా ఆ పార్టీ ప్రత్యర్థులు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సుపరిపాలనపై దృష్టి కేంద్రీకరించాలి. బిజెపి తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఏ విధంగా అధిగమించిందో గ్రహించాలి. బిజెపిని ఎదుర్కోవడానికి వాటికి సైద్ధాంతిక స్పష్టత కూడా అవసరం. అఖిలేశ్ యాదవ్ అనుభవం నుంచి ఆయా ప్రాంతీయ పార్టీలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది. మోదీకి మాత్రమే కాదు, నిజానికి ప్రపంచంలో చాలా మంది నేతలకు ఎన్నికలంటే చాలా ఇష్టం. ఎన్నికలు జరిగితే ప్రజల్లో తమ జనాకర్షణ నిరూపించుకోవచ్చునని వారు అతి ఉత్సాహంతో భావిస్తారు. ఆధునిక ప్రపంచంలో రష్యాలో వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ యున్, బెలారస్‌లో అలెగ్జాండర్ లుకషెంకో మొదలైన వారు ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్యంలో తమ వంటి ప్రజానాయకులకు తిరుగులేదని భావిస్తారు. ఎమర్జెన్సీలో అరాచక పాలన చేసిన ఇందిరాగాంధీ కూడా రెండేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చి తన విధానాలకు ప్రజలు తిరిగి ఆమోద ముద్ర వేశారని భావించారు. రాజీవ్ గాంధీ అత్యంత భారీ మెజారిటీతో గెలిచారు. అయినా ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేకం దురదృష్టకర పరిణామాలకు దారితీశాయి. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉండడం, విధానాలు సవ్యంగా ఉండడం వేర్వేరు విషయాలు. గెలుపు ఓటములతో ప్రమేయం లేకుండా నిర్ణయాలు, వ్యవహారశైలి, విధానాలు, పనితీరు ఆధారంగా చేసే విమర్శలే కాలపరీక్షకు నిలబడతాయి. వందిమాగధులే సరైన వారనే అభిప్రాయానికి ఎలాంటి విలువా ఉండదు.
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ A Conservative Version Prev Next 1. అప్పుడు రాజు యూదా పెద్దలనందరినియెరూషలేము పెద్దలనందరిని తనయొద్దకు పిలువనంపించి 1. And the king sent, and they gathered to him all the elders of Judah and of Jerusalem. 2. యూదావారినందరిని యెరూషలేము కాపురస్థులనందరిని, యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమి జనులందరిని పిలుచుకొని, యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా, యెహోవా మందిరమందు దొరకిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటిని చదివించెను. 2. And the king went up to the house of LORD, and all the men of Judah and all the inhabitants of Jerusalem with him, and the priests, and the prophets, and all the people, both small and great. And he read in their ears all the words of the book of the covenant which was found in the house of LORD. 3. రాజు ఒక స్తంభముదగ్గర నిలిచియెహోవా మార్గములయందు నడచి, ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణహృదయముతోను పూర్ణాత్మ తోను గైకొని, యీ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరు ఆ నిబంధనకు సమ్మతించిరి. 3. And the king stood by the pillar, and made a covenant before LORD to walk after LORD, and to keep his commandments, and his testimonies, and his statutes, with all his heart, and all his soul, to confirm the words of this covenant that were written in this book. And all the people stood to the covenant. 4. రాజుబయలు దేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణము లన్నిటి యెహోవా ఆలయములోనుండి ఇవతలకు తీసికొని రావలెనని ప్రధానయాజకుడైన హిల్కీయాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి, బూడిదెను బేతేలు ఊరికి పంపి వేసెను. 4. And the king commanded Hilkiah the high priest, and the priests of the second order, and the keepers of the threshold, to bring forth out of the temple of LORD all the vessels that were made for Baal, and for the Asherah, and for all the host of heaven, and he burned them outside Jerusalem in the fields of the Kidron, and carried the ashes of them to Bethel. 5. మరియు యూదా పట్టణములయం దున్న ఉన్నతస్థలములలోను యెరూషలేము చుట్టునున్న చోట్లలోను ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకును సూర్యచంద్రు లకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి, అతడు అందరిని నిలిపి వేసెను. 5. And he put down the idolatrous priests, whom the kings of Judah had ordained to burn incense in the high places in the cities of Judah, and in the places round about Jerusalem; those also who burned incense to Baal, to the sun, and to the moon, and to the planets, and to all the host of heaven. 6. యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను. 6. And he brought out the Asherah from the house of LORD, outside Jerusalem, to the brook Kidron, and burned it at the brook Kidron, and beat it to dust, and cast the dust of it upon the graves of the common people. 7. మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల యిండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి. 7. And he broke down the houses of the sodomites that were in the house of LORD where the women wove hangings for the Asherah. 8. యూదా పట్టణము లోనున్న యాజకులనందరిని అతడు అవతలికి వెళ్లగొట్టెను, గెబా మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపమువేసిన ఉన్నతస్థలములను అతడు అపవిత్ర పరచి, పట్టణములో ప్రవేశించువాని యెడమపార్శ్వమున పట్టణపు అధికారియైన యెహోషువ గుమ్మముదగ్గరనుండు ఉన్నతస్థలములను పడగొట్టించెను. 8. And he brought all the priests out of the cities of Judah, and defiled the high places where the priests had burned incense, from Geba to Beersheba. And he broke down the high places of the gates that were at the entrance of the gate of Joshua the governor of the city, which were on a man's left hand at the gate of the city. 9. అయినప్పటికి ఆ ఉన్నతస్థలములమీద నియమింపబడిన యాజకులు యెరూ షలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరులయొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు. 9. Nevertheless the priests of the high places did not come up to the altar of LORD in Jerusalem, but they ate unleavened bread among their brothers. 10. మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్‌ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశ మును అతడు అపవిత్రము చేసెను. 10. And he defiled Topheth, which is in the valley of the sons of Hinnom, that no man might make his son or his daughter to pass through the fire to Molech. 11. ఇదియుగాక అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుఱ్ఱములను మంట పములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకుయొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్దనుండి తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చి వేసెను. 11. And he took away the horses that the kings of Judah had given to the sun, at the entrance of the house of LORD, by the chamber of Nathan-melech the chamberlain, which was in the suburbs. And he burned the chariots of the sun with fire. 12. మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములను, యెహోవా మందిరపు రెండు సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడ గొట్టించి ఛిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను. 12. And the altars that were on the roof of the upper chamber of Ahaz, which the kings of Judah had made, and the altars which Manasseh had made in the two courts of the house of LORD, the king broke down, and beat them down from there, and cast the dust of them into the brook Kidron. 13. యెరూషలేము ఎదుట నున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అష్తా రోతు అను సీదోనీయుల విగ్రహమునకును, కెమోషు అను మోయాబీయుల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేలురాజైన సొలొ మోను కట్టించిన ఉన్నతస్థలములను రాజు అపవిత్రపరచి 13. And the king defiled the high places that were before Jerusalem, which were on the right hand of the mount of corruption, which Solomon the king of Israel had built for Ashtoreth the abomination of the Sidonians, and for Chemosh the abomination of Moab, and for Milcom the abomination of the sons of Ammon. 14. ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను. 14. And he broke in pieces the pillars, and cut down the Asherim, and filled their places with the bones of men. 15. బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నతస్థలమును, అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి, ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను. 15. Moreover the altar that was at Bethel, and the high place which Jeroboam the son of Nebat, who made Israel to sin, had made, even that altar and the high place he broke down. And he burned the high place and beat it to dust, and burned the Asherah. 16. యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి, దైవ జనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠముమీద కాల్చి దాని అపవిత్రపరచెను. 16. And as Josiah turned himself, he noticed the sepulchers that were there in the mount. And he sent, and took the bones out of the sepulchers, and burned them upon the altar, and defiled it, according to the word of LORD which the man of God proclaimed, who proclaimed these things. 17. అంతట అతడునాకు కనబడుచున్న ఆ సమాధి యెవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదాదేశమునుండి వచ్చి నీవు, బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధియని చెప్పిరి. 17. Then he said, What monument is that which I see? And the men of the city told him, It is the sepulcher of the man of God who came from Judah, and proclaimed these things that thou have done against the altar of Bethel. 18. అందు కతడుదానిని తప్పించుడి, యెవడును అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణమునుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి. 18. And he said, Let him be; let no man move his bones. So they let his bones alone, with the bones of the prophet who came out of Samaria. 19. మరియు ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నతస్థలములలో మందిర ములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటిని యోషీయా తీసివేసి, తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను. 19. And Josiah also took away all the houses of the high places that were in the cities of Samaria, which the kings of Israel had made to provoke LORD to anger. And he did to them according to all the acts that he had done in Bethel. 20. అచ్చట అతడు ఉన్నతస్థలములకు నియమింపబడిన యాజ కులనందరిని బలిపీఠముల మీద చంపించి వాటిమీద నరశల్య ములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను. 20. And he killed all the priests of the high places that were there, upon the altars, and burned men's bones upon them. And he returned to Jerusalem. 21. అంతట రాజునిబంధన గ్రంథమునందు వ్రాసి యున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగను ఆచరించుడని జనులకందరికి ఆజ్ఞా పింపగా 21. And the king commanded all the people, saying, Keep the Passover to LORD your God, as it is written in this book of the covenant. 22. ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినములనుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదారాజులయొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడును జరుగనంత గొప్పగా ఆ సమయమందు పస్కాపండుగ ఆచరింపబడెను. 22. Surely such a Passover was not kept from the days of the judges who judged Israel, nor in all the days of the kings of Israel, nor of the kings of Judah. 23. ఈ పండుగ రాజైన యోషీయా యేలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను. 23. But in the eighteenth year of king Josiah this Passover was kept to LORD in Jerusalem. 24. మరియు కర్ణపిశాచి గలవారిని సోదెచెప్పువారిని గృహ దేవతలను విగ్రహ ములను, యూదాదేశమందును యెరూష లేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషీయా తీసివేసి, యెహోవామందిరమందు యాజకుడైన హిల్కీ యాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను. 24. Moreover Josiah put away the psychics, and the wizards, and the teraphim, and the idols, and all the abominations that were seen in the land of Judah and in Jerusalem, that he might perform the words of the law which were written in the book that Hilkiah the priest found in the house of LORD. 25. అతనికి పూర్వమున్న రాజులలో అతనివలె పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణబలముతోను యెహోవావైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రముచొప్పున చేసినవాడు ఒకడును లేడు; అతని తరువాతనైనను అతనివంటివాడు ఒకడును లేడు. 25. And there was no king before him like him, who turned to LORD with all his heart, and with all his soul, and with all his might, according to all the law of Moses; neither arose any like him after him. 26. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమునుబట్టి ఆయన కోపాగ్ని యింకను చల్లారకుండ యూదామీద మండుచునే యుండెను. 26. Notwithstanding, LORD did not turn from the fierceness of his great wrath, with which his anger was kindled against Judah, because of all the provocations with which Manasseh had provoked him. 27. కాబట్టి యెహోవానేను ఇశ్రాయేలువారిని వెళ్లగొట్టినట్లు యూదావారిని నా సముఖమునకు దూరముగా చేసి, నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును, నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించెదనని అనుకొనియుండెను. 27. And LORD said, I will remove Judah also out of my sight as I have removed Israel, and I will cast off this city which I have chosen, even Jerusalem, and the house of which I said, My name shall be there. 28. యోషీయా చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంత ముల గ్రంథమందు వ్రాయబడియున్నది. 28. Now the rest of the acts of Josiah, and all that he did, are they not written in the book of the chronicles of the kings of Judah? 29. అతని దినముల యందు ఐగుప్తురాజైన ఫరోనెకో అష్షూరురాజుతో యుద్ధముచేయుటకై యూఫ్రటీసునది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను. ప్రకటన గ్రంథం 16:16 29. In his days Pharaoh-necoh king of Egypt went up against the king of Assyria to the river Euphrates, and king Josiah went against him. And Pharaoh-necoh killed him at Megiddo when he had seen him. 30. అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూష లేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహో యాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి. 30. And his servants carried him in a chariot dead from Megiddo, and brought him to Jerusalem, and buried him in his own sepulcher. And the people of the land took Jehoahaz the son of Josiah, and anointed him, and made him king in his father's stead. 31. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె యగు హమూటలు. 31. Jehoahaz was twenty-three years old when he began to reign, and he reigned three months in Jerusalem. And his mother's name was Hamutal the daughter of Jeremiah of Libnah. 32. ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను. 32. And he did that which was evil in the sight of LORD, according to all that his fathers had done. 33. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండ ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధక ములలో ఉంచి, దేశముమీద ఏబది మణుగుల వెండిని, రెండు మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి 33. And Pharaoh-necoh put him in bonds at Riblah in the land of Hamath, that he might not reign in Jerusalem. And he put the land to a tribute of a hundred talents of silver, and a talent of gold. 34. యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారుపేరుపెట్టి యెహోయాహాజు ఐగుప్తుదేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను. 34. And Pharaoh-necoh made Eliakim the son of Josiah king in the place of Josiah his father, and changed his name to Jehoiakim. But he took Jehoahaz away, and he came to Egypt, and died there. 35. యెహోయాకీము ఫరో యిచ్చిన ఆజ్ఞచొప్పున దేశముమీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచువచ్చెను. దేశపు జనులయొద్దనుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున వసూలుచేసి అతడు ఫరోనెకోకు చెల్లించెను. 35. And Jehoiakim gave the silver and the gold to Pharaoh, but he taxed the land to give the money according to the commandment of Pharaoh. He exacted the silver and the gold from the people of the land, of every one according to his taxation, to give it to Pharaoh-necoh. 36. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమున పదకొండు సంవత్సర ములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివా డైన పెదాయా కుమార్తెయగు జెబూదా. 36. Jehoiakim was twenty-five years old when he began to reign, and he reigned eleven years in Jerusalem. And his mother's name was Zebidah the daughter of Pedaiah of Rumah. 37. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడతనడిచెను. 37. And he did that which was evil in the sight of LORD, according to all that his fathers had done. Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
రాజధాని అంశంపై అమరావతి ప్రాంత రైతులు సాగిస్తున్న పోరాటం అంతా టిడిపి పోరాటం అంటూ ఒకవంక అధికార వైసిపి నేతలు ఆరోపణలు చేస్తుంటే, ప్రస్తుతం అమరావతి రైతులు జరుపుతున్న అమరావతి నుంచి అరసవెల్లికి మహాపాదయాత్రను తిరిగి కొనసాగించడం పట్ల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పాదయాత్రకు వ్యతిరేకంగా అధికార వైసిపి ఉత్తరాంధ్రలో నిరసనలు, ఆందోళనలు చేస్తుండడంతో మొత్తం ప్రజల దృష్టి అటువైపు మరలుతుందని, దానితో జనవరి 27 నుండి తాను చేబట్టబోయే పాదయాత్ర ప్రాధాన్యత తగ్గిపోయే అవకాశం ఉన్నదని లోకేష్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకనే, స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని, పాదయాత్రను ఇంతటితో ఆపివేయమని అమరావతి రైతులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేశారు. అయితే అందుకు రైతులు విముఖత వ్యక్తం చేయడమే కాకుండా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాలో పాదయాత్ర ఎక్కడి ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభమవుతందని ప్రకటించారు. నవంబర్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు ఆగిన చోట నుండే పాదయాత్ర పునః ప్రారంభం అవుతుందని అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగడానికి వ్యతిరేకంగా ఉన్నారని, విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా కావాలని కోరుతున్నారని వైసిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతుల పాదయాత్ర జరిగితే వైసిపి శ్రేణులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నదని చంద్రబాబు నాయుడు వారించినట్లు తెలిసింది. గతంలో తిరుపతి వరకు పాదయాత్ర జరిపినప్పుడు ఆయా జిల్లాల ప్రజలలో ఎక్కడా నిరసనలు ఎదురు కాలేదని, కానీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో పరిస్థితులు వేరని వాదిస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రలో కూడా దిగ్విజయంగా పాదయాత్రను పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు సహితం అమరావతికి మద్దతుగా ఉన్నారనే సందేశం వ్యక్తం చేయాలనీ అమరావతి రైతులు పట్టుదలగా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ వాదనలు మరో రకంగా ఉన్నాయి. మొన్నటి వరకు `మూడు రాజధానులు’ అంశంపై మౌనంగా ఉంటూ వచ్చిన వైసిపి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్ర వైపుకు వచ్చే సరికి వీధులలోకి వచ్చి హడావుడి చేయడం ప్రారంభించిందని గుర్తు చేస్తున్నారు. మూడు రాజధానుల గురించి వైసిపి విస్తృతంగా హడావుడి చేస్తే లోకేష్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కొంత ప్రభావం చూపడమే కాకుండా, అమరావతి రైతుల ఉద్యమం కుదించును పోతుందని కొందరు టిడిపి నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే, మధ్యలో పాదయాత్రను ఆపివేస్తే `వెన్ను చూపిన్నట్లు’ కాగలదని అమరావతి జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అందుకనే ఏది, ఏమైనా పాదయాత్ర అనుకున్న విధంగా జరగవలసిందే అని భీష్మించుకు కూర్చున్నారు. అయితే టిడిపి అధినేతలను కాదని పాదయాత్రను కొనసాగిస్తే పాదయాత్ర తిరిగి గ్రామాలలో స్థానిక టిడిపి శ్రేణుల నుండి గతంలో వలే మద్దతు లభిస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. పాదయాత్రకు అవసరమైన వసతులు ఏర్పాటు చేయడంలో ఇప్పటి వరకు సహకరిస్తూ వచ్చిన టిడిపి శ్రేణులు మౌనంగా ఉంటె కొంతమేరకు ఇబ్బందికరం కాగలదని భావిస్తున్నారు. బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి సహితం ఈ విషయమై అమరావతి జేఏసీ నేతలను పిలిపించి చర్చించినట్లు తెలిసింది. టీడీపీ నాయకత్వం ఈ పాదయాత్ర కొనసాగింపు పట్ల విముఖంగా ఉన్నప్పటికీ, బీజేపీ, జనసేన, వామపక్షాల శ్రేణులు మాత్రం ఉత్సాహంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత పాదయాత్ర సెప్టెంబరు 12 ప్రారంభమైంది. హైకోర్టు తీర్పు తర్వాతి పరిణామాలతో అక్టోబరు 20 వరకు కొనసాగింది. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రాపురం దగ్గర పాదయాత్ర ఆగిపోయింది. పోలీసులు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని స్పష్టం చేయడం, అందరూ గుర్తింపు కార్డులు చూపించాలని చెబుతూ ఉండడంతో ఆ తర్వాత పాదయాత్రను నిలిపి వేస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. అనంతరం పాదయాత్ర వ్యవహారం హైకోర్టుకు చేరింది. రైతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్లు దాఖలు చేశారు. పాదయాత్రను నిలుపుదల చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అలాగే పాదయాత్రలో 600 రైతులు మాత్రమే పాల్గొనాలని తేల్చి చెప్పింది. పాదయాత్రకు విధించిన షరతులను తీసివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కొట్టేసింది. గతంలో ఇచ్చిన షరతులను మార్చేది లేదని, కచ్చితంగా షరతలకు లోబడే యాత్ర కొనసాగాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఐడీ కార్డులు ఉన్న రైతులే పాదయాత్రలో పాల్గొనాలని, పాదయాత్రకు ఏ రూపంలోనైనా సంఘీభావం తెలియజేయవచ్చింది. అమరావతి రైతుల పాదయాత్ర సమయంలో వైసిపి శ్రేణులు మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర చేస్తున్న సమయంలో నల్ల బెలూన్లతో ఆందోళణకు దిగడంతో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఉత్తరాంధ్ర జిల్లాలోకి పాదయాత్ర చేరేసరికి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారవచ్చని పోలీసులు సహితం అనుమానిస్తున్నారు.
సినిమా స్క్రిప్ట్ & రివ్యూ : 08/23/16 .Header h1 { font: normal normal 90px Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; color: #ffff00; } .Header h1 a { color: #ffff00; } .Header .description { font-size: 130%; } /* Tabs ----------------------------------------------- */ .tabs-inner { margin: 1em 0 0; padding: 0; } .tabs-inner .section { margin: 0; } .tabs-inner .widget ul { padding: 0; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; } .tabs-inner .widget li { border: none; } .tabs-inner .widget li a { display: inline-block; padding: 1em 1.5em; color: #ffffff; font: normal bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; } .tabs-inner .widget li.selected a, .tabs-inner .widget li a:hover { position: relative; z-index: 1; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } /* Headings ----------------------------------------------- */ h2 { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #00ffff; } .main-inner h2.date-header { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #0f0e0c; } .footer-inner .widget h2, .sidebar .widget h2 { padding-bottom: .5em; } /* Main ----------------------------------------------- */ .main-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner .section { margin: 0 20px; } .main-inner .column-right-inner { margin-left: 20px; } .main-inner .fauxcolumn-right-outer .fauxcolumn-inner { margin-left: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner { margin-right: 20px; } .main-inner .fauxcolumn-left-outer .fauxcolumn-inner { margin-right: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner, .main-inner .column-right-inner { padding: 15px 0; } /* Posts ----------------------------------------------- */ h3.post-title { margin-top: 20px; } h3.post-title a { font: italic bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #b02ef1; } h3.post-title a:hover { text-decoration: underline; } .main-inner .column-center-outer { background: #ffffff none repeat scroll top left; _background-image: none; } .post-body { line-height: 1.4; position: relative; } .post-header { margin: 0 0 1em; line-height: 1.6; } .post-footer { margin: .5em 0; line-height: 1.6; } #blog-pager { font-size: 140%; } #comments { background: #cccccc none repeat scroll top center; padding: 15px; } #comments .comment-author { padding-top: 1.5em; } #comments h4, #comments .comment-author a, #comments .comment-timestamp a { color: #b02ef1; } #comments .comment-author:first-child { padding-top: 0; border-top: none; } .avatar-image-container { margin: .2em 0 0; } /* Comments ----------------------------------------------- */ #comments a { color: #b02ef1; } .comments .comments-content .icon.blog-author { background-repeat: no-repeat; background-image: url(); } .comments .comments-content .loadmore a { border-top: 1px solid #b02ef1; border-bottom: 1px solid #b02ef1; } .comments .comment-thread.inline-thread { background: #ffffff; } .comments .continue { border-top: 2px solid #b02ef1; } /* Widgets ----------------------------------------------- */ .sidebar .widget { border-bottom: 2px solid #f1d08f; padding-bottom: 10px; margin: 10px 0; } .sidebar .widget:first-child { margin-top: 0; } .sidebar .widget:last-child { border-bottom: none; margin-bottom: 0; padding-bottom: 0; } .footer-inner .widget, .sidebar .widget { font: normal normal 14px Georgia, Utopia, 'Palatino Linotype', Palatino, serif; color: #ffe599; } .sidebar .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .sidebar .widget a:visited { color: #6ef12e; } .sidebar .widget a:hover { color: #c1c1c1; text-decoration: underline; } .footer-inner .widget a:link { color: #3630f4; text-decoration: none; } .footer-inner .widget a:visited { color: #000000; } .footer-inner .widget a:hover { color: #3630f4; text-decoration: underline; } .widget .zippy { color: #ffffff; } .footer-inner { background: transparent none repeat scroll top center; } /* Mobile ----------------------------------------------- */ body.mobile { background-size: 100% auto; } body.mobile .AdSense { margin: 0 -10px; } .mobile .body-fauxcolumn-outer { background: transparent none repeat scroll top left; } .mobile .footer-inner .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .mobile .footer-inner .widget a:visited { color: #6ef12e; } .mobile-post-outer a { color: #b02ef1; } .mobile-link-button { background-color: #3630f4; } .mobile-link-button a:link, .mobile-link-button a:visited { color: #ffffff; } .mobile-index-contents { color: #444444; } .mobile .tabs-inner .PageList .widget-content { background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } .mobile .tabs-inner .PageList .widget-content .pagelist-arrow { border-left: 1px solid #ffffff; } sikander777 --> సినిమా స్క్రిప్ట్ & రివ్యూ రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు... టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం! Tuesday, August 23, 2016 ‘రుస్తుం’ రీ- పోస్ట్ మార్టం బేతాళ కథల్లా సాగేట్టుంది... ఒక్కో శవాన్ని చెట్టుమీద నుంచి దించి భుజాన వేసుకు వెళ్తూండడమే... శవాల్లోని బేతాళుడు అడిగే ప్రశ్నలకి చచ్చినట్టూ సమాధానాలు చెప్పుకోవడమే. కొందరు కళాకారులు ఎంతో తెలివిగా కళా సృష్టి గావిస్తారు. దాంట్లోని సంక్లిష్టతకి ఎన్ని వెబ్ పేజీలైనా చాలవు విశ్లేషణలకి. ‘రుస్తుం’ కి 1) అసలు నిజ కథ, 2) దీని ఆధారంగా దర్శకుడు రచయితల సొంత కథ, 3) మళ్ళీ ఈ సొంత కథలో a ) భార్య ద్రోహ కథ- b) భర్త దేశభక్తి కథా, 4) ఇంకా వేరే రెండు సినిమాల్లో వచ్చిన కథలూ ముందేసుకుని, పీహెచ్ డీ పట్టాకోసం కృషి చేస్తున్నట్టు ఎంతకీ ముగియని తులనాత్మక పరిశీలన చేయాల్సిందే...కళా పోషణ కరాళ నృత్యం చేస్తూంటే ఇంతే!! ఇంకా మనం బిగినింగ్ విభాగం దగ్గరే వున్నాం. అసలు విక్రం అనేవాడు నేవీ అధికారులతో కలిసి స్కామ్ చేస్తూ, స్కామ్ కి లొంగదీయాలని రుస్తుం మీద వొత్తిడి తెస్తున్నప్పుడు, ఈ సంగతి రుస్తుం తన భార్య సింథియాకి చెప్పకుండా వుంటాడా? తామిద్దరికీ విక్రం, అతడి చెల్లెలూ పరిచయస్థులే కదా? ఒకవేళ స్కామ్ విషయాలు సింథియాకి తెలియనివ్వ కూడదనుకుంటే- స్కామ్ మూలంగా తనతో సంబంధాలు చెడిన విక్రంనీ అతడి చెల్లెల్నీ ఇక కలవొద్దని మాత్రమైనా రుస్తుం సింథియాకి చెప్పి వెళ్ళాలిగా? అలా చెప్పి వెళ్తే సింథియా విక్రం వలలో పడేది కాదుగా? పోనీ, తను డ్యూటీ నుంచి తిరిగి వచ్చాకైనా సింథియా వ్యవహారం మీద నిలదీసినప్పుడు- తను తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేశానని ఆమె చెప్పినప్పుడైనా తను అప్రమత్తమై - స్కామ్ సంగతి నీకు తెలిసిపోయిందా? వాడేం చెప్పాడు? స్కామ్ కి నన్ను ఒప్పించమని నిన్ను బలవంత పెట్టాడా?- అని అడగలిగా? స్కామ్ విషయంలో విక్రం తో ఆమె ఏదో కుమ్మక్కయినట్టూ, తనకేదో ద్రోహం చేస్తున్నట్టూ అలా చూస్తాడేమిటి? రెండోది- స్కామ్ కి సంబంధించి విక్రం మాట రుస్తుం వినలేదే అనుకుందాం, అలాంటప్పుడు ఓ ప్లేయ్ బాయ్ లా సింథియాతో ఎందుకు ఎంజాయ్ చేస్తాడు విక్రం? మాట వినని రుస్తుంకి ఇలా బుద్ధి చెప్ప వచ్చనా? ఇలా రుస్తుం భార్యని వాడుకుని వదిలేస్తే, జీవితాంతం రుస్తుం కుమిలి పోవాలనా? ఇదేనా అతడి ఉద్దేశం? ఇది అతికినట్టు వుందా? ఇలాటి ఉద్దేశం ఎప్పుడు పెట్టుకోవాలి విక్రం? రుస్తుం వల్ల ఇక స్కామ్ కి పూర్తిగా తెర పడి, ఆశ వదులుకున్నప్పుడు కదా? స్కామ్ వ్యవహారం ఇంకా నలుగుతూండగానే సింథియాని వూరికే వాడుకుని వదిలెయ్యడంలో అర్ధముందా- తనతో ఫోటోలు తీసుకుని బ్లాక్ మెయిల్ చేయడానికైతే ఆమెని ట్రాప్ చేయాలిగాని! ఇంకొక సంగతేమిటంటే, ఫ్లాష్ బ్యాక్ లో చూపించే దాని ప్రకారం అసలు సింథియాని విక్రం కి సెట్ చేసేది అతడి చెల్లెలు ప్రీతీనే. అప్పుడామె తన ప్లే బాయ్ అన్నకి అమ్మాయిల్ని సమకూర్చి పట్టే మనిషిలాగే అన్పిస్తుంది తప్ప, స్కామ్ లో ట్రాప్ చేయడానికి సింథియాని సెట్ చేస్తున్నట్టు అన్పించదు. ఇలా ఏ పాత్ర ఉద్దేశాలూ లక్ష్యాలూ అక్కడ నెలకొన్న పరిస్థితిని బట్టి గాక, అనాలోచితంగా అడ్డగోలుగా చిత్రణ చేశారు. కారణం- మామూలు భార్యా- భర్త- ప్రియుడు అనే కథకి స్కామ్ ని తెచ్చి కలపడమే. సెకండాఫ్ లో స్కామ్ సంగతులు ఓపెన్ చేస్తూ పోయారే గానీ, అది రుస్తుం- సింథియా- విక్రం ల ట్రయాంగిల్లో పొసగాలని ఆలోచించ లేదు. కాబట్టి నేవీ స్కామ్ అనే ఫ్లాష్ బ్యాక్ తో కలిపి చూస్తే, ఈ బిగినింగ్ విభాగంలో కథ- ప్రాబ్లం సెటప్, తద్వారా ప్లాట్ పాయింట్ వన్ అన్నీ తప్పుల తడకగానే, తప్పుదోవ పట్టించడంగానే తేలిపోతాయి. *** స్కామ్ కోణాన్ని పక్కన బెట్టి కాసేపు మామూలు భార్య- భర్త- మధ్యలో ప్రియుడు కథలా చూసినా కూడా ‘రుస్తుం’ లో చిత్రణ ఎంత అమెచ్యూరిష్ గా వుందో గత వ్యాసంలోనే చూశాం. రుస్తుం ఇంటికి వస్తే సింథియా రెండు రోజులుగా లేకపోవడం, ఆమె ఉత్తరాల వ్యవహారం, విక్రం బంగాళా కెళ్ళి రుస్తుం కేవలం వాళ్ళిద్దర్నీ చూసి రావడం, సింథియా వచ్చాక ఆమెని నిలదీయడం, అప్పుడు మాత్రమే వెళ్లి విక్రంని చంపడం అనే సీక్వెన్సు లో రుస్తుం వెళ్లి విక్రంని చంపడం అనే చర్య మినహా మిగతావన్నీ అర్ధం లేనివి. వీటిలో విక్రం బంగాళా కెళ్ళి విక్రంతో వున్న సింథియాని దీనంగా చూసి రావడమనే ఘట్టమైతే సహజ రియాక్షన్ కాదు. నానావతి కేసు ఆధారంగానే 1973 లో గుల్జార్ తీసిన ‘అచానక్’ లో హీరో వినోద్ ఖన్నాది ఆర్మీ మేజర్ రంజిత్ పాత్ర. ఈ కథలో నాన్చుడు లేదు. మేజర్ రంజిత్ ఇంటికి తిరిగి రాగానే ప్రియుడితో భార్య కలిసి ఉండడాన్ని చూసి వాళ్ళిద్దర్నీ చంపేస్తాడు! డ్రామాలు, మెలోడ్రామాలు లేవు. నానావతి కేసు ఆధారంగానే 1963లో ఆర్కే నయ్యర్ తీసిన ‘యే రాస్తే హై ప్యార్ కే’ లో సునీల్ దత్ ది పైలట్ అనిల్ సహానీ పాత్ర. నానావతికి ముగ్గురు పిల్లలుంటే సహానీకి ఇద్దరు పిల్లలుంటారు. నానావతి లాగే అనిల్ ఇంటికి తిరిగి వస్తే, నానావతి భార్య సిల్వియాలాగే అనిల్ భార్య ఆశ (లీలా నాయుడు) కూడా ముభావంగా వుంటుంది. ఆమెని మూడ్ లోకి తెచ్చుకునేందుకు నానా కామెడీలు చేస్తాడు అనిల్. మధ్యలో ఫోన్ మోగుతుంది. అనిల్ తీస్తే అవతలి గొంతు పలకదు. పెద్దగా పట్టించుకోడు. ఆశా కోసం తను తెచ్చిన బహుమతి బొమ్మ తాజ్ మహల్ ఇవ్వబోతే తీసుకోదు. అలమారలో పెట్టబోతే అడ్డుపడి ఆ బహుమతి తీసేసుకుంటుంది. అతను పిల్లల దగ్గరికి వెళ్లి పోతే అలమార తెరుస్తుంది. అందులో అలాటిదే బహుమతి ఇంకోటి వుంటుంది. దాన్ని తీసి కిటికీలోంచి పారేసి దీన్ని పెడుతుంది. మళ్ళీ ఫోన్ మోగితే తనే తీస్తుంది. ఇందాక ఫోన్ చేసిన ఆమె ప్రియుడే (రెహమాన్) ఆమెతో మాట్లాడేస్తాడు. వింటూ వుండి పోతే, ఒక్కసారి పిల్లల అరుపులు వినబడతాయి. ఫోన్ పక్కన పెట్టేసి పిల్లల దగ్గరికి వురుకుతుంది. అక్కడ బొమ్మ తుపాకీతో కూతురి మీద కొడుకు కాలుస్తాడు. కూతురు చచ్చిపోయినట్టు నటిస్తుంది- తల్లికి కంప్లెయింట్ చేస్తుంది. ఇటు అనిల్ వచ్చి ఇంకా ఎంగేజ్ లో వున్న ఆ ఫోనెత్తి వినేస్తాడు ...ఆశా ప్రియుడి మాటలు... అప్పుడు దాదాపు ఆశా గొంతు నులిమి చంపినంత పనిచేస్తాడు అనిల్. ‘వాణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా?వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా?’ అనడిగితే, ‘ముజే కుచ్ నహీ మాలూం’ (నాకేమీ తెలీదు) - అంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలని తండ్రిని అడుగుతాడు- పిల్లల కోసం కలిసి వుండమంటాడు తండ్రి. కానీ ఇంత ద్రోహం చేసిన స్నేహితుణ్ణి సహించలేక వెళ్లి చంపేస్తాడు అనిల్. ‘అచానక్’ లో చూసిన దృశ్యానికి సహజ రియాక్షన్ తో తక్షణ చర్య తీసుకుని ఇద్దర్నీ చంపేస్తే, ‘యే రాస్తే హై ప్యార్ కే’ లో- సహజ రియాక్షన్ గా భార్య గొంతు నులిమి చంపబోతాడు, తర్వాత వెళ్లి ప్రియుణ్ణి చంపేస్తాడు. ‘రుస్తుం’ లో, సింథియా విక్రం తో కలిసి వుండగా చూసిన రుస్తుం ఎలాటి సహజ రియాక్షనూ లేక వెలవెల బోతాడు. సహజ రియాక్షన్ కి పాత్రకి అవకాశమీయక పోతే అలాటి పరిస్థితిలోకి నెట్టనే కూడదు. ఇక ‘రుస్తుం’ లో సింథియా ఉత్తరాలూ, ‘యే రాస్తే హై ప్యార్ కే’ లో ఆశా బొమ్మ తాజ్ మహల్ బహుమతుల సంగతి చూస్తే- సింథియా ఇంట్లో పెట్టకున్న బోల్డు ఉత్తరాలతో, బహుమానాలతో సన్నివేశాలూ పాత్రలూ ఎంత అయోమయంగా తయారయ్యాయో క్రితం వ్యాసంలో చూశాం. కానీ ఆశాకి ప్రియుడి నుంచి అన్నేసి బహుమతులూ వగైరా అందుకున్నట్టు వుండదు. ఒక్క తాజ్ బొమ్మే ఆమె అందుకుంది. భర్త ఇంటికి వచ్చే ముందు పెళ్లి చేసుకోనన్న ప్రియుడితో ఘర్షణ కూడా పడి -నీ సంగతి చూస్తా - అని తెగతెంపులు చేసుకుని వచ్చింది. ఈ నేపధ్యంలో భర్త ఇంటికి వచ్చినప్పుడు ప్రియుణ్ణి వదిలించుకుంది గనుక ఇక ఏమీ ఎరగనట్టు కాపురం చేసెయ్యొచ్చు భర్తతో. కానీ ఆమె అంతరాత్మ ఒప్పుకోలేదు. అందుకే భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆ అపరాధ భావంతో మధన పడింది. విషయం తెలీని అతడెన్ని కామెడీలు చేసినా, సరే జరిగిందేదో జరిగిపోయింది మనం కూడా భర్తతో కామెడీగా బతికేద్దా మనుకోలేదు. సింథియా లాగా డబుల్ గేమ్ ఆడదల్చుకోలేదు. సిల్వియాలాగా ఒక నీతితో వుంది. అలమార లోని ప్రియుడి బహుమతి తీసి పారేసి, భర్త బహుమతినే పెట్టుకోవడంలో ఇది తేటతెల్ల మవుతోంది. అంటే నానావతి భార్య సిల్వియా ప్రియుడితోనే ఫిక్స్ అయిపోయి భర్తకి చెప్పేస్తే, ఆశా భర్త తోనే ఫిక్స్ అయిపోయి భర్తకి చెప్పలేక మధనపడింది. ఆ ఫోన్ కాలే ఆమెని భర్తకి పట్టించింది. ఇక్కడకూడా సన్నివేశ సృష్టిలో లోపముంది. ప్రియుడు మొదటి సారి కాల్ చేస్తే భర్త తీశాడు. రెండో సారి చేస్తే తనే తీసింది. భర్త ఇంట్లోవున్న అలాటి సమయంలో తను ప్రియుడి కాల్ అందుకో కూడదు కదా? కట్ చేయాలి. పైగా అతడితో తెగతెంపులు చేసుకున్నాక రెస్పాన్సే ఇవ్వకూడదు. అతనేదో చెప్తూంటే వింటూ వుంటుంది. అంతలో పిల్లల కేకలు విన్పిస్తే ఫోన్ ని అలాగే వదిలేసి వెళ్ళిపోతుంది- ఇలా ఎవరైనా చేస్తారా? అంటే, పాత్ర బదులు ఇక్కడ కథకుడు ఎంటర్ అయ్యాడన్న మాట. ఆమె చేత కావాలని ఇలా చేయించాడు- ఆమెని భర్తకి పట్టించడానికి ఇంతకంటే మార్గం తోచలేదు కాబోలు. ఇక ఈ రెండు పాత హిందీ సినిమాల్లోనూ హీరో వెళ్లి చంపినప్పుడు, ప్రియుడు టవల్ మీద వుండడు. ‘రుస్తుం’ లో మాత్రం నిజ ఘటనలాగే టవల్ మీద వుంటాడు. నానావతి ఎలా చంపాడో అలాగే చంపుతాడు. ఆతర్వాత పోలీసులకి లొంగిపోతాడు. ఇక్కడ పాయింటేమిటంటే, ఆ రెండు పాత సినిమాల్లో హత్యకి మోటివ్ వివాహేతర సంబంధమే. ఇంకెలాటి స్కాములూ వగైరాలతో తికమక లేని సూటి పాయింటే. నానావతి చంపడానికి కూడా మోటివ్ వివాహేతర సంబంధం ఒక్కటే. కానీ రుస్తుం విషయానికొస్తే, అతడి మోటివ్ అనుమానాస్పదం. వివాహేతర సంబంధమా, స్కామా? దేనికోసం చంపాడు? చంపినప్పుడు వెల్లడైన కథ వరకూ చూస్తే, వివాహేతర సంబంధమే కారణమన్పిస్తుంది. కానీ సెకండాఫ్ లో వెల్లడయ్యే స్కామ్ రీత్యా చూస్తే మాత్రం స్కామ్ గురించి కూడా చంపాడా అన్న కొత్త ప్రశ్న తలెత్తుతుంది. వివాహేతర సంబంధం- స్కామ్ రెండూ తోడై చంపాడనడం సరికాదు. ఒక కథకి రెండు పాయింట్లు, రెండు సమస్యలు వుండవు. కాబట్టి రెండు కారణాలూ తోడై చంపాడనడం ఎలాటి కథా సూత్రాలకీ వ్యతిరేకం. ఒకవేళ రెండు కారణాలూ తోడై చంపడం కూడా కథా సూత్రమే అనుకుంటే, దీనికి వ్యతిరేకంగా దొరికిపోయే చిత్రణ సన్నివేశంలోనే వుంది. నేవీ స్కామ్ కి సంబంధించి చంపితే దేశభక్తి కిందికి రావచ్చు. వివాహేతర సంబంధం దృష్ట్యా చంపితే దేశభక్తి ఎలా అన్పించుకుంటుంది? చివరికి దేశ భక్తుడి కలరిస్తూనే కథ ముగించారు. మొదటిది వృత్తిగతమైతే, రెండోది వ్యక్తిగతం. చంపడం నేవీ యూనీఫాం వేసుకెళ్ళి చంపాడు. వ్యక్తిగత కక్ష, అందునా వివాహేతర సంబంధమనే కారణానికి యూనిఫాం వేసుకెళ్ళి చంపి -తన యూనిఫాంకి చెడ్డ పేరు తెచ్చుకోడు బాధ్యత గల అధికారి అయిన హీరో. విలన్ అయితే ఇలాటి పాడు పన్లు చేస్తాడు. రుస్తుంకి యూనిఫాం వేసుకెళ్ళి మరీ చంపాలనిపించిందంటే, అతను భార్యా ద్రోహం కంటే కూడా విక్రం దేశద్రోహాన్నే ఎక్కువ ఫీలైనట్టని అర్ధం వస్తోంది. కాబట్టి రెండు కారణాలతోనూ చంపాడనే మాట నిలబడదు. పోను పోనూ సెకండాఫ్ లో భార్యా ద్రోహమనే అసలు పాయింటు మరగున పడిపోయి- విక్రం దేశద్రోహం తద్వారా రుస్తుం దేశభక్తీ అనే పాయింటే ఎలివేట్ అవుతుంది. సెకండాఫ్ లో రివీలయ్యే దాని ప్రకారం, చంపే ముందు ఢిల్లీ కి కాల్ చేసి విక్రంని వదలనని డిఫెన్స్ సెక్రెటరీతో అనడం, స్విస్ బ్యాంక్ ఎక్కౌంట్ ఓపెన్ చేయడం వగైరా చర్యలన్నీ వివాహేతర సంబంధానికి సంబంధించినవి కావుగా? ఇలా మొదలెట్టిన భార్య వివాహేతర సంబంధం కథ కాస్తా భర్త దేశభక్తి కథగా మారి పోయిందన్న మాట! ఇది కూడా ఒక కథా సూత్రమే నంటే ఇక చెప్పేదేమీ వుండదు. కాబట్టి కథకి కీలక మలుపు అనదగిన, అసలు కథ ప్రారంభ మయ్యే మజిలీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర – రెండు కారణాల్లో ఏదో ఒక్కటే ఎక్కువ ఫీలయ్యి చంపాడను కోవాలి- అప్పుడది దేశభక్తి. ఎందుకంటే యూనిఫాంలో వెళ్లి చంపాడు. అంటే విక్రంతో తన భార్య అలా తిరగడాన్ని రుస్తుం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదా? *** ఇప్పుడు మిడిల్ కొస్తే, సింథియా పాత్రని ఎలాగైనా బాధితురాల్ని చేసి బయటపడెయ్యాలని విఫల యత్నం చేశారు కథలో. ఏమంటే విక్రమే ఆమెని మాయమాటలతో లొంగదీసుకున్నాడని చిత్రీకరణలు. ఈ చిత్రీకరణలో వర్షపు రాత్రి కారులో అతను హద్దుమీరుతూంటే తను ప్రతిఘటించాలి సింథియా. కానీ అలా చెయ్యదు. శుభ్రంగా మైకం కమ్మి లొంగిపోతుంది. ‘యే రాస్తే హై ప్యార్ కే’ లో మత్తు మందు ఇచ్చి లొంగ దీసుకుంటాడు. కాబట్టి ఆశా తప్పేం కన్పించదు. బాధితురాలని చెప్పొచ్చు. సింథియా ఎలా బాధితురాలవుతుంది? ప్లాట్ పాయింట్ వన్ దగ్గర రుస్తుం భార్య బాధితురాలనే ఫీలయ్యి వెళ్లి దేశభక్తితో విక్రం ని చంపివుంటే భార్యని క్షమిస్తున్నట్టే. కానీ అప్పట్నించీ ఆమెతో మాటలుండవు. మిడిల్ విభాగంలో ఆమె జైలు కొచ్చి కలిస్తే – ఈమెని నేను రిసీవ్ చేసుకోలేననే బాడీ లాంగ్వేజ్ తో, చేతులు వెనక కట్టుకుని బిగుసుకుపోయి నిలబడి ఉంటాడు. అప్పుడామె చెప్పే ఫ్లాష్ బ్యాక్ లో విక్రంతో ఆ వర్షపు రాత్రి ఏం జరిగిందో తెలుసుకుని గొప్ప సానుభూతితో, ప్రేమతో, చేతులు ముందుకు తెచ్చి ‘అన్యాయ మైపోయిన’ సింథియాని కావలించుకుంటాడు. ఇది సిల్లీగా అన్పించడం లేదూ - ఫ్లాష్ బ్యాక్ లో చూపించేది ఆమె ఏమాత్రం ప్రతిఘటించకుండా లొంగిపోవడం...నిజానికి అతణ్ణి నెట్టేసి కారు దిగిపోయి పరిగెత్తాలి వర్షం పడ్డా, పిడుగులు పడ్డా! కానీ అలా చెయ్యలేదు. తమకంతో శుభ్రంగా లొంగిపోయింది. దీనికి రుస్తుం ఈమె బాధితురాలని శుభ్రంగా నమ్మి ఫిక్స్ అయిపోయాడు- ఆమె చెప్పే కహానీలు ఇప్పుడెలా నమ్మాలన్పించిందో! మిడిల్ లో భార్యా భర్తల కథ ఇలా కొలిక్కి వచ్చి, అంతా స్కామ్ కథగానే సాగుతుంది. భార్యాభర్తల మధ్య సమస్య మొదలై కొలిక్కి వచ్చే వరకూ ఇద్దరి మధ్యా దాని తాలూకు మానసిక సంఘర్షణే కన్పించదు. ‘యే రాస్తే హై ప్యార్ కే’ లో ప్రధాన కథ ఇదే. భార్యాభర్తల సంబంధం ఇప్పుడేమవుతుందన్నదే. వాళ్ళు తమ సంబంధాన్ని పునర్నిర్వచించుకునేందుకు పడే మానసిక సంఘర్షణే. ఇంతా చేసి ముగింపుని ‘చెడిన’ ఆడదానికి స్థానం లేదనే అర్ధంలోనే పాత్రని తప్పించారు. కోర్టులో భర్త నిర్దోషి అని తేలడంతో, భార్య తను చేసిన మోసం తట్టుకోలేకో మరెందుకో గుండాగి చనిపోతుంది. 'చెత్త' అనుకుని ఊడ్చేశాడన్న మాట దర్శకుడు! ‘అచానక్’ లో ప్రియుడితో సహా భార్యనీ చంపెయ్యడంలో కూడా ఇదే అర్ధం కన్పిస్తుంది- ‘చెడిన’ ఆడదానికి స్థానం లేదని. చంపిన హీరోకి ఉరి శిక్ష వేస్తారు. కానీ దర్శకుడు గుల్జార్ సాబ్ మరీ ఇంత పురుషపక్షపాతి అంటే లోకం నమ్మదు. కనుక కాస్త పురుషాధిక్య భావాన్ని సడలిస్తున్నట్టు- హతురాలైన భార్య పాత్రకి కొంచెం సెంటిమెంటు జోడించి తన ఇమేజిని బ్యాలెన్సు చేసుకున్నారు గుల్జార్ సాబ్. చనిపోతూ భార్య - ఈ పవిత్ర మంగళ సూత్రాన్ని గంగానదిలో నిమజ్జనం చేయమని చివరి కోరిక కోరుతుంది భర్తని. కాబట్టి ఇప్పడు ఉరి శిక్ష పడ్డ భర్త జైల్లోంచి తప్పించుకుని, మంగళ సూత్రాన్ని గంగానదిలో నిమజ్జనం చేయడానికి పారిపోతాడు. పోలీసులు వెంట పడతారు. ఇలా చట్టం- సెంటి మెంటు అనే బలమైన డ్రామాతో సినిమా హిట్టయ్యింది. ‘రుస్తుం’ లో ‘చెడిన’ ఆడదాన్ని శిక్షించలేదని, ఈ సినిమా మహిళల్ని ఆకట్టుకుంటుందనీ హీరో అక్షయ్ కుమార్ సెలవిచ్చాడు. చాలా హిందీ సినిమాల్లో భర్త తప్పు చేస్తే భార్య క్షమిస్తుందనీ, కానీ ‘రుస్తుం’ లో తప్పు చేసిన భార్యని భర్త క్షమిస్తాడనీ, ఇందుకే ఈ సినిమాని మహిళలు బాగా ఇష్టపడి మరొక్క సారీ చూస్తారనీ, కాపురాలు ముక్కలవకుండా, విడాకులకి దారితీయకుండా ఈ సినిమా పరిష్కారం చూపిస్తుందనీ స్టేట్ మెంట్ ఇచ్చి పారేశారు! దీనికి రకరకాల అర్ధాలు తీసి ఎంజాయ్ చేస్తున్నారు నెటిజనులు! -సికిందర్ (next : నేవీ స్కామ్ నడక) http://www.cinemabazaar.in Posted by సికిందర్ at 10:11:00 AM Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Newer Posts Older Posts Home Subscribe to: Posts (Atom) ఈ కాన్సెప్ట్ కి బాధితురాలి కథ అవసరం! స్క్రీన్ ప్లే సంగతులు...? Search This Blog contact msikander35@gmail.com, whatsapp : 9247347511 Popular Posts 1255 : రివ్యూ! రచన- దర్శకత్వం : శైలేష్ కొలను తారాగణం : అడివి శేష్ , మీనా క్షీ చౌదరి , కోమలీ ప్రసాద్ , రావు రమేష్ , శ్రీకాంత్ అయ్యంగార్ , తనికెళ్ళ భర... 1257 : రివ్యూ! 2023 లో జరిగే 95 వ ఆస్కార్ అవార్డ్స్ కి మన దేశం తరపున అధికారిక ఎంట్రీ పొందిన గుజరాతీ చలన చిత్రం ‘ చెల్లో షో ’ (చివరి షో) అక్టోబర్... 1258 : సండే స్పెషల్ రివ్యూ! ‘ చాం దినీ బార్ ’ (ముంబాయి బార్ గర్ల్స్ జీవితాలు) , ‘ పేజ్ త్రీ ’ (ఉన్నత వర్గాల హిపోక్రసీ ) , ‘ కార్పొరేట్ ’ (కార్పొరేట్ రంగం... 1260 : రివ్యూ! దర్శకత్వం : అమర్ కౌషిక్ తారాగణం : వరుణ్ ధావన్ , కృతీ సానన్ , దీపక్ దోబ్రియాల్ , పాలిన్ కబాక్ , అభిషేక్ బెనర్జీ తదితరులు. రచన : నీరేన్ భట్ , ... 1259 : రివ్యూ! రచన - దర్శకత్వం : చెల్లా అయ్యావు తారాగణం : విష్ణు విశాల్ , ఐశ్వ ర్యా లక్ష్మి , కరుణాస్ , శ్రీజా రవి , మునిష్కాంత్ తదితరులు సంగీతం : జస్... రైటర్స్ కార్నర్ హై కాన్సెప్ట్ స్క్రిప్ట్ అంటే బిగ్ కలెక్షన్స్ ని రాబట్టే స్క్రిప్ట్. ఈ ఆర్టికల్ లో మీకు బిగ్ కలెక్షన్స్ ని సాధించి పెట్టే హై కాన్స... 1254 : రివ్యూ! రచన - దర్శక త్వం : ప్రదీప్ రంగనాథన్ తారాగణం : ప్రదీప్ రంగనాథన్ , సత్యరాజ్ , యోగి బాబు , ఇవానా , రాధి కా శరత్‌కుమార్ , రవీనా తదితరులు సంగీ త... (no title) ప్ర తిభ నిరూపించుకోవడానికి షార్ట్ ఫిలిమ్సే కాదు, డాక్యుమెంటరీ లనే విభాగం కూడా వుంది. ఐతే ఇది సామాజిక బాధ్యతలతో కూడుకున్నది. వివ... తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17 స్క్రీ న్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసల... 1256 : రివ్యూ! రచ న -దర్శక త్వం : ఆనంద్ జె తారాగణం: రావణ్ రెడ్డి , శ్రీ ని ఖి త , లహ రీ గుడివాడ , రవీంద్ర బొమ్మకంటి , అమృత వర్షిణి తదిత తరులు సంగీతం: ఫ...
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి. ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. ఎలకూచి బాలసరస్వతి వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 02 వ వారంలో ప్రదర్శించారు. ఏలకూచి బాలసరస్వతి (వ్యాస ప్రారంభంలో ఎలకూచి బాలసరస్వతి) వ్యాసంలోని సమాచారం ఈ వ్యాసంలో విలీనం చేయబడినది. సమాచారం తొలగించిన వ్యాసంలోని దిద్దుబాట్ల చరిత్ర దిగువ ఇవ్వబడింది. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:30, 29 డిసెంబర్ 2013 (UTC) (ప్రస్తు • గత) 19:24, 29 డిసెంబర్ 2013‎ C.Chandra Kanth Rao (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (85 బైట్లు) (-7,449)‎ . . (ఎలకూచి బాలసరస్వతికు దారిమళ్ళించారు) (5 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి) (ప్రస్తు • గత) 19:18, 29 డిసెంబర్ 2013‎ C.Chandra Kanth Rao (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (7,534 బైట్లు) (0)‎ . . (C.Chandra Kanth Rao ఎలకూచి బాలసరస్వతి2 పేజీని ఏలకూచి బాలసరస్వతికి దారిమార్పు లేకుండా తరలించారు) (దిద్దుబాటు రద్దుచెయ్యి) (ప్రస్తు • గత) 19:16, 29 డిసెంబర్ 2013‎ C.Chandra Kanth Rao (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (7,534 బైట్లు) (0)‎ . . (C.Chandra Kanth Rao ఎలకూచి బాలసరస్వతి పేజీని ఎలకూచి బాలసరస్వతి2కి దారిమార్పు లేకుండా తరలించారు: నిర్వ...) (దిద్దుబాటు రద్దుచెయ్యి) (ప్రస్తు • గత) 10:41, 29 డిసెంబర్ 2013‎ C.Chandra Kanth Rao (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (7,534 బైట్లు) (0)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి) (ప్రస్తు • గత) 10:41, 29 డిసెంబర్ 2013‎ C.Chandra Kanth Rao (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (7,534 బైట్లు) (+183)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి) (ప్రస్తు • గత) 13:21, 4 డిసెంబర్ 2013‎ Naidugari Jayanna (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (7,351 బైట్లు) (+223)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ప్రస్తు • గత) 03:42, 4 డిసెంబర్ 2013‎ Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (7,128 బైట్లు) (+73)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ప్రస్తు • గత) 21:08, 3 డిసెంబర్ 2013‎ C.Chandra Kanth Rao (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (7,055 బైట్లు) (0)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి) (ప్రస్తు • గత) 21:05, 3 డిసెంబర్ 2013‎ C.Chandra Kanth Rao (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (7,055 బైట్లు) (+19)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి) (ప్రస్తు • గత) 21:04, 3 డిసెంబర్ 2013‎ C.Chandra Kanth Rao (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (7,036 బైట్లు) (+111)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి) (ప్రస్తు • గత) 20:58, 3 డిసెంబర్ 2013‎ C.Chandra Kanth Rao (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (6,925 బైట్లు) (+3)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి) (ప్రస్తు • గత) 20:58, 3 డిసెంబర్ 2013‎ C.Chandra Kanth Rao (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (6,922 బైట్లు) (+401)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి) (ప్రస్తు • గత) 17:59, 3 డిసెంబర్ 2013‎ Naidugari Jayanna (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (6,521 బైట్లు) (+5,568)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు) (ప్రస్తు • గత) 15:30, 3 డిసెంబర్ 2013‎ Naidugari Jayanna (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (953 బైట్లు) (+953)‎ . . (కొత్త పేజీ: ఎలకూచి బాల సరస్వతి జన్మతా పాలమూరు జిల్లా వాడు కాకపోయినా, కాకల...) (కృతజ్ఞత తెలుపు)
జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం అధికారులంతా అప్రమత్తంగా ఉండండి మ‌రోసారి గొప్ప‌ మ‌న‌సు చాటుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు You are here హోం » పత్రికా ప్రకటనలు » కొత్త ఏడాది ఏపీలో నూతన అధ్యాయానికి శ్రీకారం.. కొత్త ఏడాది ఏపీలో నూతన అధ్యాయానికి శ్రీకారం.. 31 Dec 2018 2:53 PM వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 తెలుగు ప్రజలకు ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, సంపద, సమృద్ధి కలుగాలని వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవితాల్లో మంచి మార్పులకు దారి తీయాలని ఆయన కోరుకున్నారు. ఈ నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన అందుతుందని, విలువలు లేని అవకాశవాదుల నుంచి రాష్ట్రానికి విముక్తి కలుగుతుందన్నారు. రాజకీయాల్లో, పరిపాలనలో కొత్త ధోరణికి నూతన సంవత్సరం శ్రీకారం చుడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పృశించేలా ఉంటాయన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
Telugu News » Spiritual » Chanakya niti never disturb five person from sleep harmful for you know the details Chanakya Niti: ఈ ఐదుగురి నిద్రను అస్సలు డిస్ట్రబ్ చేయొద్దు.. ప్రాణాలే పోయే ఛాన్స్..! Chanakya Niti: ఆచార్య చాణక్యుడి విధానాలు ప్రతీ ఒక్కరి జీవితానికి మార్గదర్శకాలు. మంచి, సురక్షితమైన జీవితాన్ని గడపడానికి చాణక్యుడు నీతి శాస్త్రంలో అనేక ముఖ్యమైన.. Chanakya Niti Shiva Prajapati | Aug 15, 2022 | 8:23 PM Chanakya Niti: ఆచార్య చాణక్యుడి విధానాలు ప్రతీ ఒక్కరి జీవితానికి మార్గదర్శకాలు. మంచి, సురక్షితమైన జీవితాన్ని గడపడానికి చాణక్యుడు నీతి శాస్త్రంలో అనేక ముఖ్యమైన విషయాలను పేర్కొన్నారు. మంచి, చెడు మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. అయితే, మనుషుల్లో ఒకరికి మరొకరు భిన్నంగా ఉంటారు. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది. వ్యక్తుల నిద్ర గురించి కూడా చాణక్యుడు తన నీతిశాస్త్రం గ్రంధంలో పేర్కొన్నారు. ఐదు గురకాల వ్యక్తులు ఉంటారని, వారిని నిద్ర లేపకూడదని చాణక్యుడు తెలిపారు. అలాంటి వారి నిద్రకు భంగం కలిగించడం వలన ఇబ్బంది పడతారని, ఒక్కోసందర్భంలో జీవితానికే ప్రమాదకరం అని చెప్పారు. రాజు.. చాణక్యుడు ప్రకారం.. పురాతన కాలంలో రాజును నిద్ర లేపడం పెద్ద సాహసమే. అంతేకాదు నేరంగా కూడా పరిగణించేవారు. ఇక ప్రస్తుత కాలంలోకి వస్తే.. పై అధికారి, పాలకుడిని నిద్రలేపితే వారి కోపానికి గురికావడం తప్పదు. మూర్ఖుడు.. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. మూర్ఖుడిని నిద్ర మేల్కొలపడం అంటే ఇబ్బందులను ఆహ్వానించడమే. మూర్ఖుడు ఎవరి మాటా వినడు. అలాంటి వారిని నిద్ర లేపితే.. హానీ తలపెట్టే ప్రమాదం ఉంది. శిశువు.. పిల్లలు అసంపూర్ణమైన నిద్రలో మేల్కొంటే చిరాకు పడతారు. దాంతో వారు రచ్చ రచ్చ చేస్తారు. వారిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే పిల్లలను నిద్ర మధ్యలో లేపకూడదు. అది వారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. సింహం.. నిద్రపోతున్న సింహాన్ని లేపడం అంత ప్రమాదకరం మరోటి ఉండదు. ఇలాంటి తప్పును ఎవరూ చేయొద్దు. నిద్రిస్తున్న సింహాన్ని లేపితే.. అది మిమ్మల్ని భక్షిస్తుంది. ప్రాణాలే పోతాయి. మదమెక్కి జంతువు.. ప్రమాదకరమైన, మదమెక్కిన జంతువు నిద్రిస్తున్నప్పుడు మేల్కొలపడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవద్దు. ఇది కోపంతో దాడి చేస్తే ప్రణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. అపరిచిత కుక్కను నిద్ర లేపడం కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది.
శిథిలాలూ, సమాధులే కాకుండా ఢిల్లీలో చూడవలసిన స్థలాల్లో మూజియాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు కొన్ని ప్రదర్శన శాలలు చూసేను కాబట్టి, ఈ సారి ఏవైనా కొత్త మూజియాలు చూడాలని ఒక టాక్సీ ఎక్కిన మాకు పురానా ఖిలా మలుపు తిరుగుతుండగానే క్రాఫ్ట్స్ మూజియం కనిపించింది. పక్కనే శిల్పసంగ్రహాలయమని దేవనాగరిలిపిలో అక్షరాలు. నేనెప్పుడూ వినిఉండని ఆ సంగ్రహాలయమెట్లా ఉంటుందోనని లోపల అడుగుపెట్టినవాళ్ళం అక్కడే మూడు గంటల పాటు ఉండిపోయాం. శరత్కాలపు ప్రభాతం. లోపల వీథుల్లో చెట్లమీంచి, ఇళ్ళ కప్పులమీంచి వెలుగు పొడి చల్లుతున్నట్టు రాలుతున్న ఎండ. గోరువంకలు, ఉడతల కిచకిచలు, మహానగరం మధ్యంలోంచి ఒక గుహలో అడుగుపెట్టి అప్పుడే బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్న ఒక భారతీయగ్రామంలోకి మేలుకున్నట్టుగా అనిపించింది నాకు. రెండు రోజుల కిందట ఇండో-ఆఫ్రికన్ సమ్మిట్ లో భాగంగా ప్రధానమంత్రి అక్కడొక విందు ఏర్పాటు చేసారట. ఊళ్ళల్లో పెళ్ళినో, దేవుడి పండగనో అయిపోయిన మర్నాడు కనబడే అలసట, ఇంకా ఎత్తని చెత్త, తీరిగ్గా కూచుని జరిగిన సందడినే నెమరేసుకునే పల్లెటూరి పోకడ. జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ నేషనల్ హాండ్లూంస్ అండ్ హాండిక్రాప్ట్స్ మూజియం ఆలోచనకి 1950 ల్లోనే అంకురార్పణ పడింది. ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధురాలు కమలాదేవి ఛటోపాధ్యాయ ఊహల్లో రూపుదిద్దుకున్న మూజియం ఒక ఆకృతి సంతరించుకోవడానికి ముఫ్ఫై ఏళ్ళు పట్టింది. మూజియంలో అడుగుపెడుతూనే సవివరమైన లే ఔట్ పటం మనకు దర్శనమిస్తుంది. కాని మొదటిసారి చూసినప్పుడే మనకై మనంగా ఆ మూజియం మొత్తాన్ని ఆకళింపు చేసుకోవడం కష్టం. అందులో రెండు ముఖ్యమైన భాగాలున్నాయి. ఒకటి, 1972 లో గ్రామీణ భారతదేశాన్ని ప్రతిబింబించాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఒక ప్రదర్శనకు సాక్షిగా మిగిలిన గ్రామీణ నిర్మాణసముదాయం. రెండవది, ఛార్లెస్ కోరియా అనే వాస్తు శిల్పి రూపొందించిన సంగ్రహశాల. ట్రేడ్ ఫెయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా కోసం రూపొందించిన సంగ్రహశాల మొదటిదశ 1977 లో పూర్తయ్యింది. అందులో గ్రామీణప్రాంగణం, కార్యాలయ మందిరాలు ఉన్నాయి. తుదిదశ నిర్మాణం 1991 నాటికి పూర్తయ్యేటప్పటికి దేవాలయ ప్రాంగణాలు, దర్బాలు ప్రాంగణాలు కూడా వచ్చి చేరాయి. తన నిర్మాణ ఇతివృత్తాన్ని వివరిస్తూ ఛార్లెస్ కోరియా ఇట్లా రాసాడు: ‘ ప్రాచీన కాలానికి చెందిన మహాదేవాలయాలు (బాలి, బోరోబొదూరు, శ్రీరంగం మొదలైనవి) నడి ఆకాశానికి తెరుచుకున్న ఒక ఉత్సవవీథి చుట్టూ నిర్మితమై ఉంటాయి. ఉష్ణమండల దేశాల్లో వాస్తు నిర్మాణానికి ఈ విషయం ఇప్పటికీ మనం పాటించదగ్గదే.క్రాఫ్ట్స్ మూజియాన్ని కూడా గ్రామీణ కళాకారుల నిరాడంబర జీవితసరళిని అనుసరిస్తూ అటువంటి ఒక ప్రధానవీథి చుట్టూ నిర్మించడం జరిగింది. వెన్నెముకలాంటి ఆ వీథిలో నడుస్తూ సందర్శకుడు అటూ ఇటూ ఉన్న వివిధ ప్రాంగణాల్ని చూస్తూ, ఖాళీ స్థలాల దగ్గర ఆగుతూ, చూసింది నెమరువేసుకుంటూ పోవచ్చు. లేదా వరసగా ఒక్కొక్క ప్రాంగణాన్నే సవివరంగా అధ్యయనం చేసుకుంటూ కూడా పోవచ్చు.’ (ఆర్కిటెక్చర్: డిజైన్, సెప్టెంబర్-అక్టోబర్, 1991) క్రాఫ్ట్స్ మూజియంలో మేం రెండు పనులూ చేసాం. కాని పూర్తిగా చెయ్యలేకపోయాం. కాని తొలిసారి ఆ మూజియం మన మీద వెయ్యగల ముద్రలకి మనసప్పగించేసాం. ఆ ముద్రలెట్లాంటివో పోల్చుకునే ప్రయత్నంలో మనం చెప్పుకోగల మాటలు, ఆ మూజియంకి ఒకప్పుడు డైరక్టర్ గా పనిచేసిన జ్యోతీంద్ర జైన్ అనే ఆయన రాసిన మాటలే అనిపించింది. ఆర్కిటెక్చర్, డిజైన్ సెప్టెంబర్-అక్టోబర్, 1991 పత్రికలో Metaphor of an Indian Street అనే పేరిట ఆయన రాసిన వ్యాసంలో ఇలా రాసాడు: ‘… (క్రాఫ్ట్స్ మూజియం) ను మనం మూజియం అని పిలవడానికి కారణం చాలాకాలంగా దాన్నందరూ మూజియం అంటూండటమే. కాని వాస్తవానికి అది మూజియంలాగా కనిపించదు. అట్లాంటి ఒక సాంప్రదాయిక మైన పేరుని, పాత్రనీ అంగీకరించడానికి ఇష్టపడకపోగా, తన గురించి తనే చాలా ప్రశ్నలు వేసుకుంటూటుంది. తనేమిటో తాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అలాగని ఏదో ఒక నిర్వచనాన్ని ఇప్పటికిప్పుడు వెతుక్కోవాలన్న ఆతృత లేదు దానికి.’ ‘అక్కడి మందిరంలో నిల్చుని చాలామంది సందర్శకులు ‘ఇంతకీ మూజియం ఏది, ఎక్కడుంది? అని అడుగుతుంటారు. అట్లాంటి ప్రశ్న విన్నప్పుడల్లా, ఆ ప్రాంగణం నుంచి మూజియం అనే భూతాన్ని దాని సాంప్రదాయిక అర్థంలో బయటికి వెళ్ళగొట్టగలిగామని మేం గర్వపడుతుంటాం. అందుకు బదులుగా, ఏదో ఒక పేరుపెట్టి సులువుగా ఒక గాటన కట్టడానికి అనుమతించని ఒక వాతావరణాన్ని అక్కడ నిర్మించగలిగాం. గుజరాత్ నుంచీ, రాజస్థాన్ నుంచీ తెచ్చిన నగిషీ చెక్కిన పాతకాలపు తలుపులు, ద్వారబంధాలు, చంపకవృక్షాలతోనూ, తులసికోటలతోనూ కనవచ్చే ముంగిళ్ళు, ఈ ‘ఆధునిక’ నిర్మాణం మధ్యలో కనవచ్చే దేవాలయ రథం, అది కూడా ఏదో జీర్ణావశేషాన్ని పునరుద్ధరిస్తున్నట్టు కాకుండా, ఆధునిక, ప్రాచీన సంప్రదాయాల జమిలినేతలాగా కనిపిస్తుంటుంది. టెర్రకోటా ఇండ్లకప్పులు, కుడ్యచిత్రాలు, రాతికటాకటాలు, దారుశిల్పతోరణాలు, ఝరోకాలు, హవేలీలు, ప్రాచీన వృత్తికళాకారులకూ, వారి సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ వారికోసమొక దివ్యభవనాన్ని సమకూర్చిపెట్టాయి.’ ఆయనింకా ఇలా రాసాడు: ‘క్రాఫ్ట్స్ మూజియం లో సగం తెరుచుకున్న, పూర్తిగా తెరుచుకున్న దారుల్లో విభాత సంధ్యల్లో నడుస్తుంటే, నగిషీ చెక్కిన కొయ్య ఝరోకాలు, ఇండ్లపైకప్పులు, తలుపులు, గుమ్మాలు, రాగి పాత్రలు, కళాయిలు, ఇనుపకటకటాలు,తడకల్లాగా అల్లిన తోరణాల దిగువ, గోడల మధ్య పావురాళ్ళ గూళ్ళు, ఎర్రమట్టితో కట్టిన తులసికోటలు, దేవుడి పండగతేర్లు, సిందూరం జల్లిన అర్చావేదికలు కనిపిస్తుంటాయి. వాటి మధ్యనుంచి అటూ ఇటూ కిటికీలోంచో, కంతల్లోంచో తొంగిచూస్తే లోపల కథాచిత్రాలు, మణిపూర్ మృణ్మయపాత్రలు, రాక్షసప్రమాణాల భూతప్రతిమలు, మొక్కు చెల్లించడానికి కట్టుకున్న ముడుపులు కనిపిస్తాయి. వాటితో పాటు బహుభుజాలు కలిగిన దుర్గామాత, కాళీమాత విగ్రహాలొక తాంత్రిక ప్రపంచంలోకి తీసుకుపోతుంటే, నిర్వాణ దిశగా, కాయోత్సర్గ భంగిమలో నిల్చున్న జినమూర్తి కాలాతీత స్ఫూర్తిని కలిగిస్తుంటాడు… వివిధ ఆకృతుల ఈ వస్తుసముదాయం సందర్శకుణ్ణి కాలమధ్యం నుంచి కాలాతీత స్థితిలోకి, వాస్తవ ప్రదేశం నుంచి ఒక కాల్పనిక లోకం లోకి తీసుకుపోతుంది…’ ఈ మూజియం నిర్మాణపరంగా పూర్తయిందనీ, ఒక స్థిర రూపాన్ని సంతరించుకుందనీ చెప్పలేమని చెప్తూ జ్యోతీంద్ర జైన్ దాన్ని మన గ్రామాల్లోని వీథుల్తో పోలుస్తూ ఇట్లా అంటాడు: ‘..ఒక భారతీయ గ్రామవీథి ఎంత స్నేహపూర్వకంగా, సరళంగా, ఆత్మీయంగా, సాదాసీదాగా, ఉత్సాహపూరితంగా ఉంటుందో, ఈ నిర్మాణం కూడా అంతే. వాస్తుపరంగా చూస్తే ఏ వీథీ కూడా పూర్తిగా నిర్మాణం పూర్తయిపోయిందని చెప్పలేం. అది ఒక నిర్దిష్టాకృతికి చేరుకుందనీ, అది పూర్తిగా మన చెప్పుచేతల్లోకి వచ్చేసిందనీఅనుకోలేం. ఏ వీథైనా ఎప్పటికప్పుడు సంచలించే ఒక దృశ్యం. దాన్ని ఎవరో ఒక వాస్తు శిల్పి కాగితం మీద నమూనా గీసి రూపొందించాడని ఎప్పటికీ అనుకోలేం. క్రాఫ్ట్స్ మూజియం కూడా అంతే.’ ఆ మాటలు అక్షర సత్యాలు. ఆ మూజియం (లేదా ఆ కళాప్రాంగణం) ఒక చుట్టు తిరిగి వచ్చేటప్పటికి నాగాలాండ్ కోన్యక్ తెగల కుటీరాలనుంచి సౌరాష్ట్ర కుటుంబాల ముంగిళ్ళ దాకా ప్రయాణించినట్టు ఉంటుంది. తమిళనాడులో తోడా తెగల ప్రార్థనాలయాలనుండి బృందావనపు గోపగృహాలదాకా యాత్ర చేసినట్టు ఉంటుంది. అప్పుడు నీక్కూడా అట్లాంటి ఒక మట్టి ఇల్లూ, ఎత్తైన అరుగులూ, గోడల మీద మధువని, వర్లి చిత్రలేఖనాలు, ఇంటిముంగట ఒక వేపచెట్టు, దాని చుట్టూ ఎర్రమట్టి అలికిన ఒక వేదిక, పక్కన ఒక పిచికలగూడు.. అక్కడ, అప్పుడు ఆ ముంగిట్లో సాయం సంధ్యావేళ రామచరిత మానస్ నీ, వెన్నెలవేళ గీతగోవిందాన్నీ, సుప్రభాతవేళ త్యాగరాజస్వామినీ వింటూ గడపాలనే కోరిక రాకుండా ఉండటం అసాధ్యం. అట్లాంటి అరుగుమీద ఉష్ణమండలదేశాల మధ్యాహ్నవేళల సోమరి కునుకు తీస్తో, మల్లికార్జున మాన్సుర్ ఆలపించే ఒక అపరాహ్ణ రాగాన్ని వినడం- భారతదేశంలో పుట్టినందుకు నువ్వు కోరుకోగల గొప్ప వరదానం అంతకన్నా ఏముంటుంది?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం అధికారులంతా అప్రమత్తంగా ఉండండి మ‌రోసారి గొప్ప‌ మ‌న‌సు చాటుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ You are here హోం » టాప్ స్టోరీస్ » పులిచింతల సర్కిల్‌ ఆఫీస్‌ను ప్రాజెక్టు సమీపంలోకి మార్చాలి పులిచింతల సర్కిల్‌ ఆఫీస్‌ను ప్రాజెక్టు సమీపంలోకి మార్చాలి 24 Mar 2022 1:00 PM ప్రాజెక్టు సిబ్బందిని అవుట్‌సోర్సింగ్‌లోకి తీసుకోవాలి అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను అసెంబ్లీ: పులిచింతల ప్రాజెక్టు సర్కిల్‌ ఆఫీస్‌ ప్రాజెక్టు సమీప ప్రాంతంలోకి మార్చాలని, అదేవిధంగా ప్రాజెక్టు టెక్నీషియన్స్‌ను అవుట్‌సోర్సింగ్‌లో చేర్చి సరైన వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సామినేని ఉదయభాను మాట్లాడారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన పులిచింతల ప్రాజెక్టు కృష్ణాడెల్టాలోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోందన్నారు. 42 టీఎంసీల సామర్థ్యం గల పులిచింతల ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి సుమారు 24 మంది సిబ్బంది (ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్, టర్నర్స్‌) ఉన్నారన్నారు. వారంతా డైలీ బేసిస్‌ శాలరీ మీద పనిచేస్తున్నారని, వారిని అవుట్‌సోర్సింగ్‌ కింద నియమించి సరైన వేతనం ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు సర్కిల్‌ ఆఫీస్‌ గతంలో జగ్గయ్యపేటలో ఉండేదని, టీడీపీ హయాంలో తిరిగి వేరే ప్రాంతానికి మార్చారన్నారు. దీని వల్ల ప్రాజెక్టు మీద ఎస్‌ఈలు, ఈఈల పరిశీలన కొరవడిందని, సర్కిల్‌ ఆఫీస్‌ను ప్రాజెక్టు సమీప ప్రాంతంలోకి మార్చాలని కోరారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ