SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
7,617
22-10-2017 09:54:25
ట్విట్టర్‌లో బాధను వ్యక్తం చేసిన అనిల్ రావిపుడి
ఎంతో కష్టపడి.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఓ సినిమాను తెరకెక్కిస్తే.. ఆ సినిమా పైరసీ పాలైతే ఆ బాధ వర్ణనాతీతం. అదే బాధను ప్రస్తుతం రాజా ది గ్రేట్ చిత్ర బృందం అనుభవిస్తోంది. తాజాగా ఎయిర్ పోర్టు లాంజ్‌లో ఓ మహిళ ట్యాబ్‌లో రాజా ది గ్రేట్ సినిమా చూస్తుండటాన్ని ఓ నెటిజన్ ఫోటో చేసి దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై రాజా దిగ్రేట్ మూవీ డైరెక్టర్ అనిల్ రావిపుడి స్పందించారు. "ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో మేడమ్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరీ రాజా ది గ్రేట్ ఫిలిం చూస్తున్నారు, చాలా బ్యాడ్‌గా ఫీల్ అవుతున్నాను. సినిమాలను బతికించండి ప్లీజ్.. కిల్ పైరసీ" అంటూ ఓ మహిళ ట్యాబ్‌లో మూవీ చూస్తున్న పిక్‌‌తో ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన అనిల్.. "ఫేస్‌బుక్‌లో మూవీని చాలా మంది షేర్ చేశారు. ప్లీజ్ ఫ్రెండ్స్ పైరసీని ఎంకరేజ్ చేయకండి." థియేటర్స్‌లో మాత్రమే చూడండి. "థాంక్యూ బ్రదర్".. అని రీ ట్వీట్ చేశారు. పవన్‌కల్యాణ్, చిరంజీవి సినిమాల్లో దేవి శ్రీ ప్రసాద్? సింగర్‌గా మారిన ఎన్టీఆర్..
entertainment
8,605
14-05-2017 00:15:53
అమ్మ సినిమాలు
తెలుగు సినిమా ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ అమ్మ గొప్పదనాన్నీ, మాతృత్వపు మమకారాన్ని చాటే చిత్రాలు చాలానే వచ్చాయి. అయితే ‘అమ్మ’ పేరుతో, టైటిల్‌లో ‘తల్లి’ పదాన్ని కలిగిన సినిమాలు మాత్రం కొన్నే ఉన్నాయి. వాటి వివరాలు..  అమ్మ (1939)అమ్మ గురించి వచ్చిన సినిమాల్లో ఇదే మొదటిది. నిరంజన పాల్‌ దర్శకత్వంలో ఆరోరా ఫిల్మ్‌ కార్పొరేషన నిర్మించిన ఈ చిత్రం 1939లో విడుదలైంది. నవీన ఫిల్మ్స్‌ సమర్పణలో రూపుదిద్దుకొన్న ఈ సినిమాలో రాజకుమారి, లక్ష్మీరాజ్యం, కాశీనాథుని తదితరులు నటించారు. తల్లిప్రేమ (1941)నటి కన్నాంబ సొంత సంస్థ శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్స్‌ నిర్మించిన సినిమా ఇది. ఉత్తర భారతానికి చెందిన జ్యోతిష్‌ చంద్రసిన్హా దర్శకత్వం వహించారు. 1941లో విడుదలైన ఈ చిత్రంలో సి.ఎ్‌స.ఆర్‌. ఆంజనేయులు హీరో, కన్నాంబ హీరోయిన. కన్నాంబకు మంచి పేరు, డబ్బు తెచ్చిన సినిమా ఇది.   కన్నతల్లి (1953)అక్కినేని నాగేశ్వరరావు, నంబియార్‌ అన్నదమ్ములుగా నటించిన సినిమా ఇది. జి.వరలక్ష్మి తల్లి పాత్రను పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకొన్న ఈ చిత్రానికి కె.ఎ్‌స.ప్రకాశరావు (దర్శకుడు రాఘవేంద్రరావు తండ్రి) దర్శకనిర్మాత. ఈ సినిమాతోనే గాయని పి.సుశీల పరిచయమయ్యారు. తల్లీబిడ్డలు (1963)నటుడు బాలయ్య హీరోగా నటించిన సినిమాల్లో ‘తల్లీబిడ్డలు’ ఒకటి. ఇందులో కృష్ణకుమారి కథానాయికగా నటించారు. హరనాథ్‌, రాజశ్రీ మరో జంట. హేమలత తల్లి పాత్ర పోషించారు. పి.ఎ్‌స.శ్రీనివాసరావు దర్శకుడు. తల్లిప్రేమ (1968)ఎన్టీఆర్‌, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎం.ఆజమ్‌ నిర్మాత. శ్రీకాంత దర్శకుడు.  మాతృదేవత (1969)మహానటి సావిత్రి దర్శకత్వం వహించిన అతి కొద్ది చిత్రాల్లో ‘మాతృదేవత’ ఒకటి. ఈ సినిమాలో తన పాత్రకు అంత ప్రాధాన్యం లేకపోయినా, తన మాస్‌ ఇమేజ్‌కి భిన్నంగా ఉన్నా సావిత్రి అడగటంతో కాదనలేక నటించడానికి అంగీకరించారు ఎన్టీఆర్‌. చంద్రకళ ఎన్టీఆర్‌కు కూతురుగా నటించారు. శోభన బాబు కీలక పాత్ర పోషించారు. అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం.చంద్రశేఖర్‌ నిర్మాతలు. అమ్మకోసం (1970)అంజలీ పిక్చర్స్‌ బేనరుతో పాటు తన కుమారుడు పేరిట చిన్నీ బ్రదర్స్‌ సంస్థను నెలకొల్పి సినిమాలు తీసేవారు అంజలీదేవి, ఆదినారాయణరావు. ‘అమ్మ కోసం’ ఆ బేనరులో తీసిందే. కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా నటించిన ఈ సినిమాతోనే రేఖ హీరోయినగా పరిచయమయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి అగ్రనాయికగా ఎదిగారు. విజయనిర్మల కథానాయిక. బి.వి. ప్రసాద్‌ దర్శకుడు. చిన్నారావు నిర్మాత.  తల్లీకూతుళ్లు(1971)శోభనబాబు, కాంచన జంటగా నటించిన ఈ చిత్రంలో తల్లి పాత్రను సావిత్రి పోషించారు. జి. రామినీడు దర్శకత్వంలో క్రాంతికుమార్‌, వి.రాఘవరావు ఈ సినిమా నిర్మించారు.  అమ్మమాట (1972)శోభనబాబు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలో సావిత్రి తల్లిగా నటించారు. వి.రామచంద్రరావు దర్శకుడు. జి.వి.ఎ్‌స.రాజు నిర్మాత. ‘మాయదారి సిన్నోడు.. నా మనసే లాగేసిండు’ పాట ఈ చిత్రంలోదే.  కన్నతల్లి (1972)ఈ సినిమాలో కూడా శోభనబాబుకి తల్లిగానే నటించారు సావిత్రి. చంద్రకళ కథానాయిక. టి.మాధవరావు దర్శకుడు. డి.వివేకానందరెడ్డి, ఆర్‌.సీతారామరాజు నిర్మాతలు. తల్లీకొడుకులు(1973)కృష్ణ, చంద్రమోహన అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రంలో వారిద్దరికీ తల్లిగా అంజలీదేవి నటించారు. కృష్ణంరాజు కీలక పాత్రధారి. ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా మారకముందు నటించిన చిత్రాల్లో ఇదొకటి. కాంచన కథానాయిక. పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గుమ్మడి వీరయ్య, రామినేని కోటేశ్వరరావు నిర్మాతలు. అమ్మ మనసు (1974)కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో చలం హీరోగా నటించిన ఏకైక సినిమా ఇదే. భారతి కథానాయిక. జయంతి తల్లి పాత్ర పోషించారు. సత్యనారాయణ, శుభ మరో జంట. జి.విఎ్‌స.రాజు నిర్మాత.      తల్లే చల్లని దైవం (1978)మురళీమోహన, ప్రభ జంటగా నటించిన జి. వరలక్ష్మి తల్లిగా నటించారు. ఎం.రాధాదేవి, జి.కృష్ణమూర్తి నిర్మించిన ఈ చిత్రానికి ఎమ్మెస్‌ గోపీనాథ్‌ దర్శకుడు. అమ్మ ఎవరికైనా అమ్మ(1979)హిందీలో విజయవంతమైన ‘మా’ చిత్రం ఆధారంగా రూపుదిద్దుకొన్న చిత్రమిది. రజనీకాంత హీరోగా, మోహనబాబు విలనగా నటించారు. శ్రీప్రియ కథానాయిక. అంజలీదేవి తల్లి పాత్ర పోషించారు. సి.దండాయుధపాణి నిర్మించిన ఈ చిత్రానికి ఆర్‌. త్యాగరాజన దర్శకుడు. ‘అమ్మ నువ్వు లేని నేను ’ పాట పాపులర్‌ అయింది.   అమ్మ రాజీనామా (1991)ఓ వయసు దాటిన తర్వాత ప్రతి మగవాడికీ రిటైర్‌మెంట్‌, విశ్రాంతి ఉంటుంది. కానీ మహిళ విషయం అలా కాదు. మరణంతోనే ఆమెకు రిటైర్‌మెంట్‌. అయితే జీవితంలో తనకూ విశ్రాంతి కావాలని కోరుకొన్న ఓ అమ్మ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొంటే ఆ ఇంటి పరిస్థితి ఏమిటన్న విభిన్న కథాంశంతో రూపుదిద్దుకొన్న చిత్రం ‘అమ్మ రాజీనామా’ మరాఠిలో విజయవంతమైన ‘ఆయి రిటైర్‌ హోతి’ నాటకం ఆధారంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు. ముగ్గురు అగ్రనిర్మాతలు కె.దేవీవరప్రసాద్‌, సి.అశ్వనీదత, టి. త్రివిక్రమరావు. శారద ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో అమ్మ గొప్పదనాన్ని వివరించే రెండు అద్భుతమైన పాటలు ఉన్నాయి. మాతృదేవోభవ (1993)మలయాళంలో విజయవంతమైన ఓ చిత్రం ఆధారంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రంలో మాధవి కథానాయికగా నటించారు. నాజర్‌ హీరో. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం తర్వాత మళ్లీ ఈ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాటకు జాతీయ బహుమతి లభించింది. వేటూరి రాసిన ఈ పాటను సంగీత దర్శకుడు కీరవాణి పాడారు. వినాయకరావు
entertainment
13,904
18-11-2017 15:35:39
బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటుడు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారంనాడు పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ రోజు తన జీవితంలో గుర్తుండిపోయే రోజు అనీ, బీజేపీకి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని రాయ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్న తీరు ప్రశంసనీయమని, గత రెండేళ్లుగా భారత్ పట్ల ప్రపంచ దృష్టికోణంలో గణనీయమైన మార్పు వచ్చిందని ఆయన అన్నారు. దేశాభివృద్ధికి తన వంతు సేవలు అందిస్తానని, పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. రాహుల్ రాయ్ 1990లో విజయవంతమైన 'అషిఖి' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 'జునూన్', 'ఫిర్ తేరి కహాని యాద్ ఆయీ' వంటి చిత్రాల్లో నటించారు. 'బిగ్ బాస్' మొదటి సీజన్ టీవీ రియాల్టీ షోలో ఆయన విజేతగా నిలిచారు.
nation
18,963
08-02-2017 03:21:13
బంగ్లా సరిహద్దులో కంచెపై అఫిడవిట్‌
 కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: బంగ్లాదేశ్‌తో భారతకు 263 కిలోమీటర్ల సరిహద్దు పొడవునా కంచె నిర్మాణానికి మూడేళ్లకు మించి సమయం పడుతుందని పేర్కొంటూ కేంద్రం ఇచ్చిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్‌ చాలా అస్పష్టంగా ఉందని, గతంలో పలు ఉత్తర్వులిచ్చినప్పటికీ నిర్దిష్టమైన వివరాలేవీ ఇందులో లేవని పేర్కొంది. న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌లతోకూడిన బెంచి ముందు ఈ అంశం మంగళవారం విచారణకు వచ్చింది.
nation
7,369
03-10-2017 19:05:36
చిరంజీవి ‘సైరా’ పెద్ద భార్యగా నయనతార..!
బాయ్‌ఫ్రెండ్‌తో అమెరికాలో సందడి చేసిన నయనతార చెన్నై తిరిగొచ్చింది. ప్రస్తుతం సినిమాల మీద ఫోకస్ పెట్టింది. త్వరలో మొదలు కాబోతున్న రెండు టాప్ మూవీస్ కోసం రెడీ అవుతోంది. అమెరికా నుంచి తిరిగొచ్చిన నయన తార ఇప్పుడు రెండు తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రారంభమైన బాలయ్య, కె.యస్ రవికుమార్ సినిమాతో పాటు, చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'కి కూడా కాల్షీట్లు కేటాయించింది. బాలయ్య చిత్రం హైదరాబాద్ షెడ్యూల్‌లో నయన తార జాయిన్ కాబోతోంది. అలాగే ఈ నెల 20న ప్రారంభం కానున్న 'సైరా నరసింహారెడ్డి'లో కూడా నటించేందుకు సన్నద్ధమౌతోంది. 'సైరా నరసింహారెడ్డి'లో నరసింహారెడ్డి ముగ్గురు భార్యల్లో పెద్ద భార్యగా నయన తార నటిస్తుందట. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నేతృత్వంలో్ హైదరాబాద్‌లో  ఓ విలేజ్ సెట్ వేసారు. ఈ సెట్లోనే చిరు, నయన్‌పై కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నారట. ఈ రెండు చిత్రాలతో పాటు నయన తార తమిళంలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌లో కూడా నటించబోతోంది. మరి ఈ ఇద్దరు టాప్ హీరోల సినిమాలు నయనతారకు ఎలాంటి ఇమేజ్‌ను తెచ్చిపెడతాయో చూద్దాం.
entertainment
2,655
08-08-2017 23:27:26
కావేరి సీడ్స్‌ లాభం రూ.202.37 కోట్లు
ఒక్కో షేరుపై రూ.3 చొప్పున డివిడెండ్‌హైదరాబాద్‌: ప్రసుతత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం కావేరి సీడ్స్‌ కంపెనీకి బాగానే కలిసొచ్చింది. ఈ కాలానికి కంపెనీ రూ.594.84 కోట్ల నికర ఆదాయంపై రూ.202.37 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం రూ.95.43 కోట్లు పెరిగింది. నికర లాభం మాత్రం 31.10 శాతం పెరిగింది. దీంతో రూ.2 ముఖ విలువ ఉన్న ఒక్కో వాటాపై మూడు రూపాయల చొప్పున మధ్యంతర డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ డైరెక్ట్ల బోర్డు సిఫారసు చేసింది. సిద్దిపేట జిల్లా దేవక్కపల్లి గ్రామంలో కంపెనీకి చెందిన. 24.25 ఎకరాల భూమిని రూ.15 కోట్లకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
business
15,407
10-03-2017 19:26:15
భారత ఆర్మీ బలగాల్లో.. భారీగా అధికారులు, సిబ్బంది కొరత
న్యూఢిల్లీ: భారత ఆర్మీ బలగాల్లో భారీగా అధికారులు, సిబ్బంది కొరత ఉందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే శుక్రవారం లోక్‌సభకు తెలిపారు. ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. గత ఏడాది జులై నాటి గణాంకాల ప్రకారం అత్యధికంగా ఆర్మీలో 8,370 మంది అధికారులు, 35,174 మంది జవాన్ల కొరత ఉందన్నారు. నౌకాదళంలో 1,332 మంది అధికారులు, 10,982 మంది సిబ్బంది, ఎయిర్ ఫోర్స్‌లో 29 మంది ఆఫీసర్లు, 9,841 మంది ఎయిర్ మెన్లను భర్తీ చేయాల్సి ఉందని రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే లోక్‌సభకు తెలిపారు.
nation
12,358
02-04-2017 13:58:15
మహిళ బట్టలు విప్పించిన విమానాశ్రయ సిబ్బంది .... సుష్మా స్వరాజ్ స్పందన
బెంగళూరు : ఓ భారతీయ మహిళకు విమానాశ్రయంలో అవమానం జరిగినట్లు వచ్చిన మీడియా కథనాలపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఈ సంఘటనపై నివేదికను సమర్పించాలని ఫ్రాంక్‌ఫర్ట్‌లోని భారతీయ కాన్సుల్ జనరల్‌ రవీశ్ కుమార్‌ను ఆదేశించారు.  శ్రుతి బసప్ప అనే మహిళ తన ఫేస్‌బుక్ పేజీలో తన గోడును వెలిబుచ్చారు. ఇటీవల తాము భారతదేశం నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా ఐస్‌లాండ్ వెళ్తున్నట్లు, తమతో పాటు నాలుగేళ్ళ కుమార్తె ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది ర్యాండమ్ చెక్ చేస్తామని చెప్పి, తనను ఓ గదిలోకి తీసుకెళ్ళారని పేర్కొన్నారు. ఎటువంటి వివరణ ఇవ్వకుండా తన బట్టలను ఎత్తి పట్టుకోవాలని/విప్పాలని తనను ఆ సిబ్బంది అడిగినట్లు తెలిపారు. తన బట్టల క్రింద దేనినైనా పెట్టి రహస్యంగా తరలించడం లేదని నిర్థారించుకునేందుకు ఈ విధంగా చేశారని పేర్కొన్నారు. ఈ ఫేస్‌‌బుక్ పోస్ట్‌పై మీడియా స్పందించి, కథనాలను ప్రచురించింది. ఈ కథనాల ఆధారంగా సుష్మా స్వరాజ్ ఫ్రాంక్‌ఫర్ట్‌లోని భారత కాన్సుల్ జనరల్‌కు ట్వీట్ చేశారు.
nation
13,169
28-02-2017 02:31:15
ఆ రోజు రాత్రి ఏడింటికే ఇంటికొస్తానన్నారు!
లండన్‌, ఫిబ్రవరి 27: ‘‘ఆరోజు ఆస్టిన్‌ బార్‌(కాన్స్‌స)లో కాల్పులు జరిగిన విషయం నాకు తెలిసిందిగానీ.. చనిపోయింది నా భర్తేనన్న విషయం తెలియలేదు’’ అని శ్రీనివాస్‌ కూచిభొట్ల భార్య సునయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. భర్త మరణంతో తన లోకం ఒక్కసారిగా చీకటైపోయిందని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. ఫిబ్రవరి 22 ఉదయం ఆఫీసుకు వెళ్తూ తన భర్త తనకు బై చెప్పాడని.. ఆయన్ను ప్రాణాలతో చూడ్డం అదే ఆఖరుసారి అని సునయన కంటతడిపెట్టారు. అప్పటికి రెండు రోజులుగా రాత్రిపూట ఇంటికి ఆలస్యంగా వస్తుండడంతో.. ‘ఈరోజు వర్క్‌ ఏదైనా ఉంటే ఇంటికి తెచ్చుకో. ఇద్దరం కలిసి కాసేపు టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అని తాను మెసేజ్‌ పెట్టానని, ‘సరేన'టూ శ్రీనివాస్‌ తన మెసేజ్‌కు సానుకూలంగా స్పందించాడని వివరించారు.  రాత్రి 7 గంటలకల్లా ఇంట్లో ఉంటానని చెప్పాడని.. 8 గంటలైనా రాకపోవడంతో తాను ఆందోళన చెందానని వెల్లడించారు. అలోక్‌ భార్యకు ఇతర స్నేహితులకు కూడా ఫోన్‌ చేసినట్టు చెప్పారు. ‘‘తర్వాత నేను భోజనం చేస్తూ అలవాటుగా ఫేస్‌బుక్‌ చూస్తున్నా. అందులో ఒక వీడియో.. కాల్పులు జరిగాయని! ‘మళ్లీ ఎక్కడో ఏదో జరిగినట్టుంది.. ఎవరో గాయపడి ఉంటారు’ అనుకుంటుండగా.. ‘ఆస్టిన్స్‌’ పేరు కనిపించింది. కాల్పుల బాధితులను యూనివర్సిటీ ఆఫ్‌ కాన్సస్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారని అందులో చదివి వెంటనే బయల్దేరా.. గ్యారేజ్‌ దాకా వెళ్లి.. అక్కడే కుప్పకూలిపోయా. తర్వాత మా ఇంటికి ఇద్దరు పోలీసులు వచ్చారు. నా పేరు, ‘శ్రీని’ పేరు, ఆయన పుట్టినరోజు అడిగారు. ఆ తర్వాత వాళ్లు చాలా సింపుల్‌గా.. ‘వియ్‌ ఆర్‌ సారీ’ అని చెప్పారు’’ అని సునయన వివరించారు. తర్వాత ఆమె కంగారుగా ఆస్పత్రికి చేరుకోగా సెక్యూరిటీ వాళ్లు తనిఖీల కోసం ఆపారు. అవతల నా భర్త చనిపోయారని చెప్పినా లోపలికి పంపలేదు’’ అని సునయన ఆ సమయంలో తాను పడిన నరకయాతనను గుర్తుచేసుకున్నారు. శ్రీనివాస్‌ ఇటీవలే తన తండ్రికి ఒక కారు కొనిచ్చారని.. కొడుకు ఇచ్చిన ఆ బహుమతి చూసి తన మామగారు ఎంతో గర్వించారని పేర్కొన్నారు. నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఎంతగానో భయపడ్డానని.. భయంతో సరిగా నిద్ర కూడా పోయేదాన్ని కానని చెప్పారు. ‘ఈ దేశంలో మనం క్షేమంగా ఉండగలమా’ అని తాను ప్రశ్నిస్తే.. ‘ఏమీ భయం లేద’ంటూ తన భర్త భరోసాగా మాట్లాడేవాడని, అమెరికాను ఎంతగానో ప్రేమించేవాడని సునయన పేర్కొన్నారు. ‘‘మీరు నా ప్రేమను కోల్పోయేలా చేశారు. కానీ, నేను ఇక్కడ ప్రేమను పంచడానికి వచ్చానని అమెరికా ప్రజలకు తెలియజెప్పాలని ఉంది’’ అని సునయన పేర్కొన్నారు.
nation
4,423
10-01-2017 01:48:30
చేటు చేస్తూ విపరీత వ్యాఖ్యలా?
ఈమధ్య కేసీఆర్ గారు ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు, ‘‘కాలక్రమంలో కొన్ని వృత్తులు అంతరిస్తుంటాయి’’ అని. దానికి ఉదాహరణగా చేనేత వృత్తిని ఉదహరించారు. పవర్‌లూమ్‌ల పైన అవే డిజైన్లు తక్కువ ధరలకి దొరుకుతున్నప్పుడు, ఎక్కువ ధర పెట్టాల్సి వచ్చే చేనేతకి ఆదరణ తగ్గిందని అన్నారు. ప్రభుత్వం పెట్టించే ‘‘చేనేత వస్త్ర ప్రదర్శనలలో’’ చేనేత అని చెప్పి పవర్‌లూమ్‌ బట్టలు అమ్మి వినియోగదారులని మోసం చేస్తుంటే, అధికారులు లంచాలు తిని చూసి చూడనట్టు వ్యవహరిస్తుంటే, చేనేతకి ఆదరణ తక్కువ కాక ఏమవుతుంది? ఒరిజినల్ చేనేత కొంటున్నామని ప్రజలు అనుకుంటున్నారు. కానీ, నాసిరకం పవర్‌లూమ్‌ బట్టలు కొంటున్నామని వారికి తెలియదు. పవర్‌లూమ్‌ బట్టలని చేనేత బట్టలని చెప్పి అమ్మకుండా చేయించండి అప్పుడు చూద్దాం, ప్రజలు చేనేతని ఆదరిస్తున్నారో లేదో? చేనేత డిజైన్లు పవర్లూమ్లో తయారు చెయ్యకూడదని చేనేత రిజర్వేషన్ చట్టం ఒకటి వుంది. దాన్ని అమలు చేసే నిబద్ధత ప్రభుత్వాలకి వుంటే ఈ రోజు చేనేతకి వున్న అసలు డిమాండ్ ఏమిటో, చేనేత సత్తా ఏమిటో తెలిసేది. కాని అది చేసే చిత్తశుద్ధి ఎవరికి వుంది? పనిగట్టుకుని ప్రభుత్వాలు పవర్‌లూమ్‌కి పట్టం కట్టి, చేనేతకి మొండి చెయ్యి చూపిస్తే మరి ఆదరణ తగ్గక ఇంకేమవుతుంది? చేనేత సంఘాలు తయారు చేసిన సరుకుని ఆప్కో/ తెస్కో కొనడం లేదు. ఒక్కో సొసైటీలో లక్షల విలువ వున్న సరుకు మూలుగుతోంది. ఒక వేళ సరుకు కొన్నా నెలల తరబడి బకాయిలు చెల్లించటంలేదు. కొన్ని చేనేత సొసైటీలకి ఇప్పటికీ 6 నెలలుగా బకాయిలు తీర్చలేదు. మరి దీనికి సీఎం గారు ఏం సమాధానం చెప్తారో? ఒకసారైతే అసలు తెలంగాణలో చేనేత మగ్గాలే అతి తక్కువగా వున్నాయని తేల్చి పారేసారు. అప్పుడు ఒక సంస్థ వాళ్ళు అన్ని జిల్లాలు తిరిగి సర్వే చేసి ఎన్ని మగ్గాలున్నాయో లెక్కలు చెప్పారు. కనీసం 44,000 మగ్గాలున్నాయన్నారు. అంటే అన్ని చేనేత కుటుంబాలు ఇంకా ఈ వృత్తిని కొనసాగిస్తున్నాయి. ఇది ఒక కన్సర్వేటివ్ ఎస్టిమేట్. ఈ విషయమే ప్రభుత్వ దృష్టికి తెస్తే అబ్బే 20 వేలు కూడా లేవని కౌంటర్ వేసారు. నేటికీ జనగామ, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్నగర్, కొత్తకోట, చెన్నూరు, హుజూరాబాద్, వరంగల్, కమలాపూర్, జమ్మికుంట, కొత్తపల్లి, ఇలా ప్రతి జిల్లాలో మగ్గం మీద ఆధారపడి బతుకుతున్న వేలాది మంది ఉన్నారు. మరి ప్రభుత్వానికి వీరంతా కనిపించటం లేదా? సకల జనుల సర్వేలో వీరిని ఏ వృత్తి కింద జమకట్టారు మరి? వేల ఎకరాల భూములని తీసుకుని, అన్ని వేల రైతులని, రైతు కూలీలని, ఇతర వృత్తుల వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని నిర్వాసితులని చేసి, కంపెనీలకి వసతులన్నీ కల్పించి, టాక్స్ రిబేట్లు ఇచ్చి, విదేశాలన్నీ తిరిగి, మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అని అడగడం కోసం ప్రభుత్వం వద్ద పుష్కలంగా పైసలుంటాయి. కానీ తమ కాళ్ళ మీద స్వంత శక్తితో బ్రతుకుతున్న వ్యవసాయదారులకి, చేనేత వృత్తిదారులకి మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్నారు. ఆరు నెలల క్రితం, చేనేత బకాయిలు తీర్చాలని తెలంగాణా నేత కార్మికులు హైదరాబాద్లో ఆప్కో ముందు ధర్నా చేసారు. ‘బకాయిలు తీరుస్తాం’ అని ప్రభుత్వ అధికారులు మాట ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు బకాయిలు తీర్చలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు ‘‘కాలక్రమేణా కొన్ని వృత్తులు అంతరించి పోతాయి’’ అని చెబుతున్నారు. జనాలు తాగుబోతులై, ఇల్లు, వొళ్ళు గుల్ల చేసు కుంటే తప్ప, ఖజానా నిండదని భావిస్తున్న ప్రభుత్వాలు, ప్రజల పొట్టలు కొట్టే పనులు కాక వారిని గౌరవంగా వారి వృత్తిని చేసుకోనిస్తాయా? ఒక వైపు కేసీఆర్‌ మెట్ట వేదాంతం చెప్తుంటే, ఇంకో పక్క కేటీఆర్‌ ట్విట్టర్లో ‘నేను చేనేత వేస్తున్నా, మరి మీరో?’ అంటూ సెలబ్రిటీలకి ఛాలెంజ్ విసురుతున్నారు. అసలు ఇంతకీ ఈ ప్రభుత్వం చేనేత ఉండాలి అనుకుంటోందో లేదో అర్ధం కావటం లేదు! ‘చేనేతకి ప్రోత్సాహం ఇవ్వాలి’ అని కేటీఆర్ కలెక్టర్ ఆఫీసుల్లో, సెక్రటేరియట్లో చేనేత అమ్మకాలు జరిపిస్తున్నారు. సంతోషం. మరి ఇంతకీ ఈ ఎగ్జిబిషన్లలో చేనేత బట్టలు పెట్టారా, లేక పవర్‌లూమ్‌లో తయారైన వస్త్రాలే చేనేత అని చెప్పి అమ్ముతున్నారా? ఇంతకీ ముఖ్యమంత్రి గారు చేనేత వేస్తున్నారా లేక పవర్ లూమ్ బట్టలు వేస్తున్నారా? అసలు 120 కోట్ల మంది భారత ప్రజలందరికీ చేనేత ద్వారా బట్టలు తయారు చెయ్యగలమా? అందరికీ చేనేత వస్త్రాలు అందించగలమా అని ఛాలెంజ్ చేసారు కేసీఆర్‌ గారు. తప్పకుండా చెయ్యొచ్చు. కొన్ని కోట్ల మందికి ఉపాధి కల్పించవచ్చు. మనసుంటే మార్గం వుంటుంది. నిజంగా చేనేత బ్రతకాలంటే బ్రతికి ంచవచ్చు. ఒక్క పవర్ లూమ్ వల్ల కనీసం 20 మందికి ఉపాధి పోతుంది. దానికి కరెంటు కావాలి, శబ్ద కాలుష్యం కూడా ఎక్కువే. బట్ట కూడా చేనేత బట్టకు ఉన్నటువంటి మన్నిక వుండదు. చేనేత వస్త్రం మన ఆరోగ్యానికి మంచిది. ఎటువంటి కరెంట్ ఖర్చు లేకుండా, పర్యావరణానికి హాని లేకుండా, అతి తక్కువ మౌలిక వసతులతో, ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎవరి ఊళ్ళో వాళ్ళు కుటుంబ పరంగా కలిసి పనిచేసుకునే వృత్తి, చేనేత.ఇప్పటికీ మన వస్త్ర ఎగుమతుల్లో చేనేతదే పైచెయ్యి. మరి ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ జోన్స్ అని చెప్పి, ఉద్యోగాలు కల్పిస్తాయని టెక్స్‌టైల్‌ సెజ్లని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు, ‘నా మగ్గం నే నేస్కుంటా, నా బ్రతుకు నేను బ్రతుకుతా, నాకు ఒక 20 వేలు అప్పు ఇప్పించు సామి’ అని అడిగితే, అబ్బే సారీ అంటున్నారు. పోనీ నూలు ధరనైనా తగ్గించు అంటే అదీ చెయ్యరు.ఒక వైపు పత్తి పండిస్తున్న రైతులకి గిట్టిబాటు వుండదు. ఆ పత్తి, దారమై చేనేత వృత్తిదారులకు అందే సరికి నూలు ధర రోజు రోజుకీ పెరుగుతోంది.  నూలు దారం తయారు చేసే స్పిన్నింగ్ మిల్లులు మాత్రం బాగానే వున్నాయి. అటు రైతు ఇటు చేనేత కార్మికులు నానాటికి పేద వారు ఆవుతున్నారు. దేశంలోనే నెంబర్ వన్ క్వాలిటీ పత్తి తెలంగాణలో పండుతోంది. ఈ పత్తినంతా ఎగుమతి చేసి, నాసిరకం పత్తితో తయారైన నూలుని సూరత్, కోయంబత్తూర్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇక్కడ పండిన పత్తిని ఇక్కడే దారం చేయిస్తే మంచి నాణ్యమైన నూలు తక్కువ ధరకే లభిస్తుంది. నూలు ధరలని తగ్గించే చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటే చేనేత వస్త్రాల ధరలు తగ్గించవచ్చు. కానీ, నూలు ధర తగ్గించకుండా, పాలిస్టర్ దారం వేసి పోలి వస్త్రం తయారు చెయ్యమని ఆప్కో/ టేస్కో వంటి ప్రభుత్వ సంస్థలు చేనేత సంఘాలపై వత్తిడి పెడుతున్నాయి. దీనివల్ల ఎవరికి లాభం? ఇంకెవరికీ? పాలిస్టర్ తయారు చేసే రిలయన్స్ వంటి కంపెనీలకి! మరి ప్రభుత్వాలు సామాన్య ప్రజల కోసం పనిచేస్తున్నాయో, కార్పొరేట్ సంస్థలని బ్రతికించడానికి పనిచేస్తున్నాయో మంత్రివర్యులే తెలియ చెయ్యాలి.-కవుల సరస్వతిచేనేత చైతన్య వేదిక, ప్రజా ఉద్యమాల జాతీయ వేదికఈమధ్య కేసీఆర్ గారు ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు, ‘‘కాలక్రమంలో కొన్ని వృత్తులు అంతరిస్తుంటాయి’’ అని. దానికి ఉదాహరణగా చేనేత వృత్తిని ఉదహరించారు. పవర్‌లూమ్‌ల పైన అవే డిజైన్లు తక్కువ ధరలకి దొరుకుతున్నప్పుడు, ఎక్కువ ధర పెట్టాల్సి వచ్చే చేనేతకి ఆదరణ తగ్గిందని అన్నారు. ప్రభుత్వం పెట్టించే ‘‘చేనేత వస్త్ర ప్రదర్శనలలో’’ చేనేత అని చెప్పి పవర్‌లూమ్‌ బట్టలు అమ్మి వినియోగదారులని మోసం చేస్తుంటే, అధికారులు లంచాలు తిని చూసి చూడనట్టు వ్యవహరిస్తుంటే, చేనేతకి ఆదరణ తక్కువ కాక ఏమవుతుంది? ఒరిజినల్ చేనేత కొంటున్నామని ప్రజలు అనుకుంటున్నారు. కానీ, నాసిరకం పవర్‌లూమ్‌ బట్టలు కొంటున్నామని వారికి తెలియదు. పవర్‌లూమ్‌ బట్టలని చేనేత బట్టలని చెప్పి అమ్మకుండా చేయించండి అప్పుడు చూద్దాం, ప్రజలు చేనేతని ఆదరిస్తున్నారో లేదో? చేనేత డిజైన్లు పవర్లూమ్లో తయారు చెయ్యకూడదని చేనేత రిజర్వేషన్ చట్టం ఒకటి వుంది. దాన్ని అమలు చేసే నిబద్ధత ప్రభుత్వాలకి వుంటే ఈ రోజు చేనేతకి వున్న అసలు డిమాండ్ ఏమిటో, చేనేత సత్తా ఏమిటో తెలిసేది. కాని అది చేసే చిత్తశుద్ధి ఎవరికి వుంది? పనిగట్టుకుని ప్రభుత్వాలు పవర్‌లూమ్‌కి పట్టం కట్టి, చేనేతకి మొండి చెయ్యి చూపిస్తే మరి ఆదరణ తగ్గక ఇంకేమవుతుంది? చేనేత సంఘాలు తయారు చేసిన సరుకుని ఆప్కో/ తెస్కో కొనడం లేదు. ఒక్కో సొసైటీలో లక్షల విలువ వున్న సరుకు మూలుగుతోంది. ఒక వేళ సరుకు కొన్నా నెలల తరబడి బకాయిలు చెల్లించటంలేదు. కొన్ని చేనేత సొసైటీలకి ఇప్పటికీ 6 నెలలుగా బకాయిలు తీర్చలేదు. మరి దీనికి సీఎం గారు ఏం సమాధానం చెప్తారో? ఒకసారైతే అసలు తెలంగాణలో చేనేత మగ్గాలే అతి తక్కువగా వున్నాయని తేల్చి పారేసారు. అప్పుడు ఒక సంస్థ వాళ్ళు అన్ని జిల్లాలు తిరిగి సర్వే చేసి ఎన్ని మగ్గాలున్నాయో లెక్కలు చెప్పారు. కనీసం 44,000 మగ్గాలున్నాయన్నారు. అంటే అన్ని చేనేత కుటుంబాలు ఇంకా ఈ వృత్తిని కొనసాగిస్తున్నాయి. ఇది ఒక కన్సర్వేటివ్ ఎస్టిమేట్. ఈ విషయమే ప్రభుత్వ దృష్టికి తెస్తే అబ్బే 20 వేలు కూడా లేవని కౌంటర్ వేసారు. నేటికీ జనగామ, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్నగర్, కొత్తకోట, చెన్నూరు, హుజూరాబాద్, వరంగల్, కమలాపూర్, జమ్మికుంట, కొత్తపల్లి, ఇలా ప్రతి జిల్లాలో మగ్గం మీద ఆధారపడి బతుకుతున్న వేలాది మంది ఉన్నారు. మరి ప్రభుత్వానికి వీరంతా కనిపించటం లేదా? సకల జనుల సర్వేలో వీరిని ఏ వృత్తి కింద జమకట్టారు మరి? వేల ఎకరాల భూములని తీసుకుని, అన్ని వేల రైతులని, రైతు కూలీలని, ఇతర వృత్తుల వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని నిర్వాసితులని చేసి, కంపెనీలకి వసతులన్నీ కల్పించి, టాక్స్ రిబేట్లు ఇచ్చి, విదేశాలన్నీ తిరిగి, మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అని అడగడం కోసం ప్రభుత్వం వద్ద పుష్కలంగా పైసలుంటాయి. కానీ తమ కాళ్ళ మీద స్వంత శక్తితో బ్రతుకుతున్న వ్యవసాయదారులకి, చేనేత వృత్తిదారులకి మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్నారు. ఆరు నెలల క్రితం, చేనేత బకాయిలు తీర్చాలని తెలంగాణా నేత కార్మికులు హైదరాబాద్లో ఆప్కో ముందు ధర్నా చేసారు. ‘బకాయిలు తీరుస్తాం’ అని ప్రభుత్వ అధికారులు మాట ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు బకాయిలు తీర్చలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు ‘‘కాలక్రమేణా కొన్ని వృత్తులు అంతరించి పోతాయి’’ అని చెబుతున్నారు. జనాలు తాగుబోతులై, ఇల్లు, వొళ్ళు గుల్ల చేసు కుంటే తప్ప, ఖజానా నిండదని భావిస్తున్న ప్రభుత్వాలు, ప్రజల పొట్టలు కొట్టే పనులు కాక వారిని గౌరవంగా వారి వృత్తిని చేసుకోనిస్తాయా? ఒక వైపు కేసీఆర్‌ మెట్ట వేదాంతం చెప్తుంటే, ఇంకో పక్క కేటీఆర్‌ ట్విట్టర్లో ‘నేను చేనేత వేస్తున్నా, మరి మీరో?’ అంటూ సెలబ్రిటీలకి ఛాలెంజ్ విసురుతున్నారు. అసలు ఇంతకీ ఈ ప్రభుత్వం చేనేత ఉండాలి అనుకుంటోందో లేదో అర్ధం కావటం లేదు! ‘చేనేతకి ప్రోత్సాహం ఇవ్వాలి’ అని కేటీఆర్ కలెక్టర్ ఆఫీసుల్లో, సెక్రటేరియట్లో చేనేత అమ్మకాలు జరిపిస్తున్నారు. సంతోషం. మరి ఇంతకీ ఈ ఎగ్జిబిషన్లలో చేనేత బట్టలు పెట్టారా, లేక పవర్‌లూమ్‌లో తయారైన వస్త్రాలే చేనేత అని చెప్పి అమ్ముతున్నారా? ఇంతకీ ముఖ్యమంత్రి గారు చేనేత వేస్తున్నారా లేక పవర్ లూమ్ బట్టలు వేస్తున్నారా? అసలు 120 కోట్ల మంది భారత ప్రజలందరికీ చేనేత ద్వారా బట్టలు తయారు చెయ్యగలమా? అందరికీ చేనేత వస్త్రాలు అందించగలమా అని ఛాలెంజ్ చేసారు కేసీఆర్‌ గారు. తప్పకుండా చెయ్యొచ్చు. కొన్ని కోట్ల మందికి ఉపాధి కల్పించవచ్చు. మనసుంటే మార్గం వుంటుంది. నిజంగా చేనేత బ్రతకాలంటే బ్రతికి ంచవచ్చు. ఒక్క పవర్ లూమ్ వల్ల కనీసం 20 మందికి ఉపాధి పోతుంది. దానికి కరెంటు కావాలి, శబ్ద కాలుష్యం కూడా ఎక్కువే. బట్ట కూడా చేనేత బట్టకు ఉన్నటువంటి మన్నిక వుండదు. చేనేత వస్త్రం మన ఆరోగ్యానికి మంచిది. ఎటువంటి కరెంట్ ఖర్చు లేకుండా, పర్యావరణానికి హాని లేకుండా, అతి తక్కువ మౌలిక వసతులతో, ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎవరి ఊళ్ళో వాళ్ళు కుటుంబ పరంగా కలిసి పనిచేసుకునే వృత్తి, చేనేత.ఇప్పటికీ మన వస్త్ర ఎగుమతుల్లో చేనేతదే పైచెయ్యి. మరి ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ జోన్స్ అని చెప్పి, ఉద్యోగాలు కల్పిస్తాయని టెక్స్‌టైల్‌ సెజ్లని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు, ‘నా మగ్గం నే నేస్కుంటా, నా బ్రతుకు నేను బ్రతుకుతా, నాకు ఒక 20 వేలు అప్పు ఇప్పించు సామి’ అని అడిగితే, అబ్బే సారీ అంటున్నారు. పోనీ నూలు ధరనైనా తగ్గించు అంటే అదీ చెయ్యరు.ఒక వైపు పత్తి పండిస్తున్న రైతులకి గిట్టిబాటు వుండదు. ఆ పత్తి, దారమై చేనేత వృత్తిదారులకు అందే సరికి నూలు ధర రోజు రోజుకీ పెరుగుతోంది.  నూలు దారం తయారు చేసే స్పిన్నింగ్ మిల్లులు మాత్రం బాగానే వున్నాయి. అటు రైతు ఇటు చేనేత కార్మికులు నానాటికి పేద వారు ఆవుతున్నారు. దేశంలోనే నెంబర్ వన్ క్వాలిటీ పత్తి తెలంగాణలో పండుతోంది. ఈ పత్తినంతా ఎగుమతి చేసి, నాసిరకం పత్తితో తయారైన నూలుని సూరత్, కోయంబత్తూర్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇక్కడ పండిన పత్తిని ఇక్కడే దారం చేయిస్తే మంచి నాణ్యమైన నూలు తక్కువ ధరకే లభిస్తుంది. నూలు ధరలని తగ్గించే చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటే చేనేత వస్త్రాల ధరలు తగ్గించవచ్చు. కానీ, నూలు ధర తగ్గించకుండా, పాలిస్టర్ దారం వేసి పోలి వస్త్రం తయారు చెయ్యమని ఆప్కో/ టేస్కో వంటి ప్రభుత్వ సంస్థలు చేనేత సంఘాలపై వత్తిడి పెడుతున్నాయి. దీనివల్ల ఎవరికి లాభం? ఇంకెవరికీ? పాలిస్టర్ తయారు చేసే రిలయన్స్ వంటి కంపెనీలకి! మరి ప్రభుత్వాలు సామాన్య ప్రజల కోసం పనిచేస్తున్నాయో, కార్పొరేట్ సంస్థలని బ్రతికించడానికి పనిచేస్తున్నాయో మంత్రివర్యులే తెలియ చెయ్యాలి.-కవుల సరస్వతిచేనేత చైతన్య వేదిక, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక
editorial
19,747
07-06-2017 02:14:32
భారత హాకీ జట్టు ఓటమి
డసెల్‌డార్ఫ్‌: మూడు దేశాల ఇన్విటేషనల్‌ హాకీ టోర్నీలో భారత కథ ముగిసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 0-2తో జర్మనీ చేతిలో పరాజయం పాలైంది. ఈ టోర్నీలో భారత 4 పాయింట్లు మాత్రమే సాధించింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో భారత 1-2తో బెల్జియం చేతిలో ఓడగా, జర్మనీతో రెండో మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకుంది. తర్వాత 3-2తో బెల్జియంపై నెగ్గింది. కాగా, ఆట రెండో నిమిషంలో, తర్వాత 29వ నిమిషంలో భారతకు పెనాల్టీ కార్నర్ల చాన్స్‌ వచ్చినా మిస్‌ చేసింది. సెకండా్‌ఫలోనూ గోల్‌ అవకాశాలనూ వృథా చేసింది.
sports
19,658
27-06-2017 00:26:30
త్వరలో ఏదో ఒకటి తేల్చేస్తా..!
రిటైర్మెంట్‌పై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ డివిల్లీర్స్‌కార్డిఫ్‌: దక్షిణాఫ్రికా స్టార్‌ ప్లేయ ర్‌ ఏబీ డివిల్లీర్స్‌ క్రికెట్‌కు త్వరలో గుడ్‌బై చెప్పనున్నాడా? అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే అని పిస్తోంది! తన క్రికెట్‌ భవితవ్యంపై ఆగస్టులో నిర్ణయం తీసుకుంటానని డివిల్లీర్స్‌ ప్రకటించాడు. మరికొన్నేళ్ల తన కెరీర్‌పై క్రికెట్‌ సౌతాఫ్రికాతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తానని ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 అనంతరం ఏబీ చెప్పాడు. ‘ఉభయులకు ఏది ఆమోదయోగ్యమో తేల్చాలి. కొన్నింట్లో ఆడడం.. కొన్నింటికి దూరం కావడం ఉండదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తుది ని ర్ణయం తీసుకుంటామ’ని డివిల్లీర్స్‌ చెప్పాడు. ఇంగ్లండ్‌ టూర్‌లో ఏబీ సారథ్యం వహించిన సౌతాఫ్రికా జట్టు వన్డే, టీ20 సిరీస్‌లు కోల్పోయింది. చాంపియన్స్‌ ట్రోఫీలో లీగ్‌ దశలోనే ఇంటిదారి పట్టింది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ అనంతరం డివిల్లీర్స్‌ బ్రేక్‌ తీసుకున్నాడు. కీలక టెస్ట్‌ సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదు. 2019 వరల్డ్‌కప్‌ కోసం తనను తాను ఫిట్‌గా ఉంచుకోవాలనే ఉద్దేశంతో వర్క్‌ లోడ్‌ తగ్గించుకోవాలని అనుకుంటున్నట్టు ఏబీ తెలిపాడు.
sports
9,523
25-10-2017 12:19:21
నేను ఆ సినిమాను ఛస్తే చెయ్యను: నాని
ఇటీవల జరిగిన గృహం సినిమా ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హారో నాని హాజరయ్యారు. అంతే కాకుండా హీరో సిద్దార్ధ్‌ని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా గృహం సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు నాని. అయితే ఈ ఇంటర్వ్యూలో నానిని సిద్దార్ధ్ "నాని ఎప్పుడు హారర్ ఫిలింలో చేస్తాడు? చేస్తే ఎందుకు చేస్తాడు? చెయ్యకపోతే ఎందుకు చెయ్యడు?" అని ప్రశ్నించారు.  దీనికి సమాధానంగా నాని "నేను హారర్ ఫిలిం లైఫ్‌లో చెయ్యను. ఛస్తే చెయ్యను. ఎందుకు చెయ్యను అనడానికి కూడా నా దగ్గర లాజిక్ ఉంది. నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. ప్రతి హారర్ సినిమా చూస్తాను. ఆ సినిమాలు చూస్తూ నెక్ట్స్ ఏం జరగబోతోందన్న టెన్షన్‌ను నేను ఎంజాయ్ చేస్తాను. నేను హారర్ ఫిలిం చేయడం వల్ల నేను హారర్ ఫిలింని ఎంజాయ్ చేయడం మిస్ అవుతాను. అందుకే నేను హారర్ ఫిలిం చెయ్యను" అని తెలిపారు.
entertainment
1,592
18-01-2017 23:58:11
మంత్రదండమేమీ లేదు : లగార్డె
ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న తీవ్ర ఆదాయ అసమానతలపై విధాన నిర్ణేతలు దృష్టి సారించాల్సిన అవసరముందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టినా లగార్డ్డె సూచించారు. అయితే.. ఈ అసమానతలను సులభంగా రూపుమాపేందుకు మంత్రదండమేమీ లేదని అభిప్రాయపడ్డారు. దావోస్‌ సదస్సులో బుధవారం ‘సంక్షోభంలో మధ్య తరగతి’ అనే అంశంపై ఆమె ప్రసంగించారు.
business
3,458
30-05-2017 03:00:32
ఎంఎస్‌ఎఫ్‌ పల్లెపల్లెకు పాదయాత్ర
వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ఆమోదింపచేయాలని కోరుతూ మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (ఎం.ఎస్‌.ఎఫ్‌) ఆధ్వర్యంలో నేటి నుంచి భువనగిరిలో పల్లెపల్లెకు పాదయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది. జూన్‌ 25న నకిరేకల్‌లో ముగింపు సభ ఉంటుంది. 23 యేండ్ల చారిత్రాత్మక సుదీర్ఘ పోరాటం జూలై 7, 2017న 24వ వసంతంలోకి అడుగిడుతుంది. ఎస్సీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలని న్యాయమైన లక్ష్యం కోసం ఏర్పడ్డ ఎమ్మార్పీఎస్‌ ఒక గొప్ప అధ్యయనం. నవంబర్‌ 27, 2016న హైదరాబాద్‌, పరేడ్‌గ్రౌండ్‌లో లక్షలాదిమందితో జరిగిన ధర్మయుద్ధం ఒక చారిత్రాత్మక సభ. ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పార్లమెంటులో చర్చ జరిగింది. ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణకు అనుకూలంగా సమాజంలో అన్ని వర్గాల మేధావులు మరోసారి మద్దతు ప్రకటించారు. జాతి చిరకాల స్వప్నానికి ముగింపు పలకాలి, వర్గీకరణ సాధించి జాతి భవిష్యత్తుకు బాటలు వేయాలి. జిల్లాలవారీగా మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ విద్యార్థి చైతన్య పాదయాత్రలను చేస్తుంది. విజయమో వీర త్యాగమో తేల్చుకోవడానికి సన్నద్ధమవుతుంది. రుద్రవరం లింగస్వామి మాదిగ పాదయాత్ర బృందం సారథి. చేకూరి గణేష్‌ మాదిగ, కందుల మోహన్‌ మాదిగ, బోడ సునీల్‌ మాదిగ, ముదిగొండ వెంకటేష్‌ మాదిగ, ఇటుకాల దేవేందర్‌ మాదిగ, దుబ్బ రామకృష్ణ మాదిగ, బుషిపాక గణేష్‌ మాదిగ, నల్లస్వామి మాదిగ, ఎర్రస్వామి మాదిగ... తదితరులు పాదయాత్ర సభ్యులు. కావున మాదిగ, ఉపకులాల విద్యార్థులు పాదయాత్రలో పాల్గొనాలి. ఊరూరా జాతిని కూడగట్టి మీటింగులు నిర్వహించాలి. మన ఐక్యతను, బలాన్ని చాటాలి.- మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (ఎంఎస్‌ఎఫ్‌)
editorial
7,218
07-08-2017 18:49:08
కాజల్ షార్ట్‌ ఫిలిం..
సినీ నటి కాజల్ షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించింది. రక్తదానం చేయండనే ఇతివృత్తంతో ఆమె ఈ లఘుచిత్రంలో నటించింది. కుష్ శతృఘన్ సిన్హా దర్శకత్వంలో హిందీలో రూపొందిన ఈ షార్ట్‌ఫిలింలో అపర్‌శక్తి ఖురానా కూడా నటించాడు. నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ లఘు చిత్రం మంచి సందేశం ఇచ్చేదిగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
entertainment
18,869
28-01-2017 00:15:15
ఆధార్‌ పే వచ్చేసింది!
భీమ్‌ యాప్‌లో అందుబాటులోకి..త్వరలోనే దేశమంతటా విస్తరణ..ఇప్పటికే సిద్ధమైన 14 బ్యాంకులుఏపీలో ప్రయోగత్మకంగా అమలు!ఆధార్‌పే డివైస్‌కు 50% రాయితీ!లావాదేవీల చార్జీలూ ఇక రద్దు! బ్యాంకు ఖాతా పోర్టబిలిటీకీ కసరత్తు న్యూఢిల్లీ, జనవరి 27: నగదు రహిత లావాదేవీలవైపు దేశం శరవేగంగా ముందుకు కదులుతోంది. క్యాష్‌లెస్‌ లావాదేవీలను సులభంగా నిర్వహించుకొనేందుకు వీలుగా గతంలో ప్రతిపాదించిన ఆధార్‌ ఆధారిత చెల్లింపుల విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ యూపీఐ యాప్‌ ‘భీమ్‌’లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. త్వరలోనే దేశ మంతటా దుకాణాలు.. ఇతర యాప్‌లలో ఇది అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఇప్పటికే 14 బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఇతర బ్యాంకులు కూడా ఇప్పుడు ఆధార్‌ పేకి అనుసంధానమవుతున్నాయి. ఈ ఆధార్‌ చెల్లింపు విధానం అమల్లోకి వస్తే.. ప్రజలు దుకాణాల్లో తమ ఆధార్‌ నంబరును వెల్లడించి.. చేతి వేలును స్కాన్‌ చేసి చెల్లింపులు చేయొచ్చు. దీనికి ఫోన్‌, ఇంటర్నెట్‌.. అవసరం లేదు. డబ్బులు తీసుకొనేవారికి ఉంటే చాలు. ఈ మేరకు ఎలక్ర్టానిక్స్‌, ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ శుక్రవారం వెల్లడించారు. కొన్ని బ్యాంకులు ఆధార్‌ పే యాప్‌లను సొంతంగా అభివృద్ధి చేసుకుని.. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షిస్తున్నాయి.  దేశంలో ప్రస్తుతం 111 కోట్ల మందికి ఆధార్‌ ఉందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం రోజూ ఆరు నుంచి ఎనిమిది లక్షల మందికి ఆధార్‌ నంబర్లు ఇస్తున్నామని.. ఇప్పటి దాకా 49 కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్‌కు అనుసంధానమయ్యాయని వివరించారు. మరోవెపు దేశ వ్యాప్తంగా ఆధార్‌ పే వ్యవస్థలు బాగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఐడీఎ్‌ఫసీ బ్యాంకు, ఇతర బ్యాంకులు రైతు బజార్లు, ఇతర ప్రాంతాల్లో ఆధార్‌ ఆధారిత చెల్లింపులను అందుబాటులోకి తీసుకురాగా.. ప్రతి దుకాణంలోనూ ఇలాంటి వ్యవస్థలు ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆధార్‌ పే వినియోగానికి అవసరమయ్యే వేలి ముద్రల స్కానర్లు, ఇతర చిన్న పరికరాలకు 50 శాతం రాయితీ ఇవ్వాలని ఇటీవల ‘నగదు రహిత వినియోగంపై ఏర్పాటైన సీఎంల కమిటీ సూచించింది. ఆధార్‌ పేలో డబ్బులు తీసుకునే.. లేదా చెల్లించే వారికి ఎండీఆర్‌ చార్జీలను రద్దు చేసి పూర్తిగా ఉచితం చేయాలనీ పేర్కొంది. దీంతో ప్రభుత్వం వీటిపై కసరత్తు చేస్తోంది. ఎండీఆర్‌ చార్జీల రద్దుపై ప్రభుత్వం ఇప్పటికే ఒకటి రెండు సార్లు ప్రకటనలు చేసినా.. అవి అమల్లోకి రాలేదు. వాటి రద్దుకు బ్యాంకులు అంగీకరించలేదు. కానీ ఈ సారి వీటిని కచ్చితంగా రద్దు చేసి.. ఆధార్‌ పేని పూర్తిగా ఉచితంగా చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించి రాబోయే బడ్జెట్‌లోనూ ఒక ప్రకటన ఉండొచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఆధార్‌ అనుసంధానం వల్ల గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.36,144 కోట్లు ఆదా అయ్యాయి.  ఆధార్‌ను చెల్లింపులకూ సమర్థంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో బ్యాంకులు.. ప్రభుత్వానికి మరిన్ని నిధులు ఆదా అయ్యే అవకాశముంది. ప్రస్తుతం మొబైల్‌ నంబర్ల పోర్టబిలిటీ లాగా.. త్వరలో బ్యాంకు ఖాతాలను కూడా పోర్ట్‌ చేసుకునే సౌలభ్యం రానుంది. దీంతో ఒక బ్యాంకు సేవలు నచ్చకుంటే ఆ ఖాతాను మరో బ్యాంకుకు మార్చుకోవచ్చు. దీనిపై ఆర్బీఐ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ పోరబిలిటీ సేవలు అందుబాటులోకి రావాలంటే ఆధార్‌ నంబర్‌ కీలకం కానుంది. బ్యాంకు ఖాతాలతో పాటు.. ఇతర లోన్‌లు, డీ మాట్‌ ఖాతాలు, మ్యూచువల్‌ ఫండ్లు, ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ ఆధార్‌కు అనుసంధానం కావాలి. అప్పుడే బ్యాంకు ఖాతాల పోర్టబిలిటీ సులభమవుతంది. ప్రస్తుతం చాలా మంది జీతాలు, డివిడెంట్లు, ఇతర ఆర్థిక లావాదేవీలకు బ్యాంకు ఖాతాలను ఇచ్చి ఉంటారు. ఈ ఖాతాను మరో బ్యాంకుకు మార్చితే.. ఆ లావాదేవీలన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ముందుగా అన్ని ఆర్థిక వ్యవహారాలనూ ఆధార్‌కు అనుసంధానం చేస్తే.. బ్యాంకు ఖాతాతో పాటు ఈ లావాదేవీలు కూడా బదిలీ అయ్యేలా చేయొచ్చని ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆధార్‌తో ఏటీఎం కార్డులకు చెక్‌..!!సైబర్‌ మోసాలూ తగ్గుతాయి
nation
8,549
04-12-2017 14:04:03
సైలెంట్‌గా స్టార్ట్ అయిన వెంకీ సినిమా!
`గురు` సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన విక్ట‌రీ వెంక‌టేష్ డైరెక్ట‌ర్ తేజ‌తో ఓ సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యారు. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా ఎన్టీయార్ బ‌యోపిక్ తీయాల‌నుకున్న తేజ ముందుగా వెంకీ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోలో సోమ‌వారం ఉద‌యం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. రానా, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, అనిల్ సుంక‌ర‌, రాజా ర‌వీంద్ర‌ వంటి అతికొద్ది ప్ర‌ముఖుల మధ్య నిరాడంబ‌రంగా, సైలెంట్‌గా ఈ సినిమా ప్రారంభోత్స‌వం జ‌రిగిపోయింది. నిజానికి వెంకీ పుట్టిన‌రోజునాడైన డిసెంబ‌ర్ 13న ఈ సినిమాను ప్రారంభించాల‌నుకున్నారు. అయితే త‌న పుట్టినరోజును విదేశాల్లో కుటుంబ స‌భ్యులతో క‌లిసి చేసుకోవాల‌ని వెంకీ డిసైడ్ అవ‌డంతో ఇప్పుడు ఇలా ప్రారంభోత్సవం కానిచ్చేశారు. జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానున్న‌ట్టు స‌మాచారం.
entertainment
10,792
27-02-2017 17:56:20
చాన్స్ ఇస్తాం కాని, కొన్ని ‘అడ్జెస్ట్ మెంట్స్’ చేసుకోమన్నారు: రెజీనా
నటి భావనపై జరిగిన ఉదంతంతో.. సినిమా స్టార్లు కూడా ఇలాంటి వేధింపులకు మినహాయింపేం కాదని స్పష్టమవుతోంది. తనపై జరిగిన దాడికి బెదరకుండా పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పెట్టింది భావన. ఇలాంటి వేధింపులను తాము కూడా ఎదుర్కొన్నామని అంటున్నారు నటీమనులు. ఒక్కొక్కరుగా వారి జీవితాల్లో ఎదుర్కొన్న విపత్కర సంఘటనల గురించి ఇప్పుడిప్పుడే వెల్లడిస్తున్నారు. ప్రముఖ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి కూడా తనపై జరిగిన వేధింపులను వివరించింది. మీడియాకు సంబంధించిన ఓ వ్యక్తి తనతో ప్రవర్తించిన విధానాన్ని బయటపెట్టేసింది ఈ భామ. టాలీవుడ్ నటి రెజీనా సైతం తనపై జరిగిన వేధింపులను బయటపెట్టింది. తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లలో (ఏడేళ్ల క్రీతం), ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి తమిళంలో తీయబోతున్న సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పాడని, అయితే అందుకోసం తనను కొంత ‘అడ్జెస్ట్ మెంట్స్’ చేసుకోవాలని అన్నాడట. ‘మీరున్న రంగం ఏదైనప్పటికీ, చుట్టు పక్కల పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు. ఎవరైనా సరే.. చాలా జాగ్రత్తగా ఉండండి’ అంటూ నేటి యువతులకు సలహా కూడా ఇస్తోంది.
entertainment
19,988
10-01-2017 01:07:25
మరోసారి డబుల్‌ ధమాకా..!
ధోనీ నిర్ణయం సరైనదే వెటరన్‌ యువరాజ్‌ న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ద్వారా ధోనీ సరైన నిర్ణయమే తీసుకున్నాడని వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌ ప్రశంసించాడు. ఇద్దరం కలసి దుమ్ముదులిపే బ్యాటింగ్‌తో పాత రోజులను మరోసారి గుర్తుకు తేగలమనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ధోనీతో కలసి ఇలా ఆడడం కెరీర్‌ ఆరంభించిన రోజులను గుర్తుకు తెస్తోంది. మా ఇద్దరిలో నేనే ముందుగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాను. అయినా ఎటువంటి భేషజాలకు పోకుండా ఇద్దరం కలసి బెదురులేని క్రికెట్‌ ఆడేవాళ్లం. రాబోయే సిరీ్‌సలోనూ గతంలోలా మెరుపులు మెరిపిస్తామ’ని యువీ చెప్పాడు. మహీ కెప్టెన్సీలో నెగ్గిన 2007 వరల్డ్‌ టీ20, 2011 ప్రపంచ కప్‌ టీమ్‌ల్లో యువరాజ్‌ కీలక పాత్ర పోషించాడు. ‘అగ్రశ్రేణి జట్టుగా రెండు ప్రపంచ కప్‌లు నెగ్గాం. ఎంత మంది కెప్టెన్లు ఇంతటి ఘనతను సాధించారనేది కచ్చితంగా చెప్పలేను. ధోనీ ఎంతో కూల్‌గా ఉంటూనే తన పని తాను చేసుకు పోతాడ’ని యువీ అన్నాడు. మహీ సారథ్యానికి రాజీనామా చేసి సరైన నిర్ణయం తీసుకున్నాడని అభిప్రాయపడ్డాడు. ‘2019 వరల్డ్‌కప్‌ కోసం జట్టును తయారు చేసుకోవడానికి తర్వాతి కెప్టెన్‌కు తగిన సమయం ఇవ్వాలని ధోనీ భావించాడు. విరాట్‌లో తర్వాతి నాయకుడిని చూశాడు. ఆటగాడిగా జట్టుకు సేవలందించడానికి అతడిలో ఎంతో క్రికెట్‌ మిగిలుంద’ని యువరాజ్‌ అన్నాడు. ఇక, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన ఆటతో మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడని చెప్పాడు.
sports
1,053
16-03-2017 23:14:43
ప్రపంచ మార్కెట్లకు పరేషాన్‌
భారత్ పై ప్రభావం ఫెడ్‌ తాజా వడ్డీ రేట్ల పెంపు ప్రభావం ప్రస్తుతానికి భారత స్టాక్‌ మార్కెట్‌పై పెద్దగా ఉండదని భావిస్తున్నారు. ఆ అంచనాతోనే గురువారం సెన్సెక్స్‌, నిఫ్టీ మరో ఆల్‌టైమ్‌ హై స్థాయికి చేరాయి. ‘మన మార్కెట్‌ అమెరికా వడ్డీ రేట్ల పెంపును తట్టుకునేందుకు సిద్ధంగానే ఉంది. అమెరికాలో వడ్డీ రేట్లు నిదానంగా పెరగడం వర్థమాన దేశాలకు ఒక విధంగా మంచిదే’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ ట్వీట్‌ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థపైనా ఫెడ్‌ వడ్డీ రేట్ల ప్రభావం పెద్దగా ఉండదని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఈ) అరవింద్‌ సుబ్రమణియన్‌ చెప్పారు. ‘అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు ఊహించిందే. మన దేశంపై దీని ప్రభావం పెద్దగా ఉండదు’ అన్నారు. అయితే దీని వలన డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరిగితే మాత్రం ఎగుమతులపై ఆ ప్రభావం కొద్దిగా ఉండే అవకాశం ఉందన్నారు. రేట్లు తగ్గకపోవచ్చు... ఫెడ్‌ చర్యతో దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు మూసుకుపోయాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఆర్‌బిఐ ఇప్పటికే ఆందోళన చెందుతోంది. తాజా పరిణామాలతో వచ్చే నెల 4-5 తేదీల్లో జరిగే ద్రవ్య, పరపతి సమీక్షలోనూ ఆర్‌బిఐ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదని ఆర్థికవేత్తలంటున్నారు. ‘ఆర్‌బిఐ ఇక వడ్డీ రేట్లు తగ్గించదు. వడ్డీ రేట్ల తగ్గింపు రోజులు అయిపోయాయి’ అని క్రిసిల్‌ ప్రధాన ఆర్థికవేత్త డికె జోషి అన్నారు.
business
5,417
22-05-2017 13:20:04
అనుష్కతో పాటు ఆకట్టుకున్న ఈమె ఎవరో తెలుసా?
బాహుబలి2 సినిమా ఘన విజయం సాధించింది. రికార్డుల దిశగా కలెక్షన్ల కుంభవృష్టి కురుస్తోంది. ఈ సినిమాతో రాజమౌళి టాలీవుడ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడంటూ ప్రశంసలు అందుకున్నాడు. సినిమాలో నటించిన వారందరికీ మంచి పేరొచ్చింది. ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. కానీ చాలామందికి తెలియని ఓ డ్యాన్సర్ బాహుబలి2లో అనుష్కతో కలిసి ఆడి పాడింది. తనదైన అభినయంతో మెప్పించి ప్రేక్షకుల మదిలో ఎవరీ అమ్మాయి అనే ప్రశ్నను రేకెత్తేలా చేసింది. ఆమె మరెవరో కాదు అనుష్కతో కలిసి ‘‘కన్నా నిదురించరా... నా కన్నా నిదురించరా’’ అనే పాటలో కాలు కదిపిన అశ్రిత వేముగంటి. బాహుబలి2 సినిమాలో నటించక ముందు కూడా ఈమె చాలామందికి సుపరిచితురాలే. భరతనాట్యం, కూచిపూడి నాట్యకారిణిగా ఆమెకంటూ ఓ గుర్తింపు ఉంది. 2013లో ఓ సినిమా ఆడియో వేడుకలో ఈమె సెమీ క్లాసికల్ డ్యాన్స్‌‌తో మెప్పించింది. ఆ ఆడియో వేడుకకు రాజమౌళి కుటుంబంతో సహా హాజరయ్యాడు. ఆమె నాట్యానికి రాజమౌళి కుటుంబం ఫిదా అయింది. ఒక నెల తర్వాత రాజమౌళి కొడుకు కార్తికేయ నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. సినిమాల్లో నటించడానికి ఆసక్తి ఉందా అని కార్తికేయ అడిగాడు. ఆమె ఒప్పుకుంది. అలా ఆమెకు సినిమా చాన్స్ దక్కింది. అంతేకాదు, ఈమె పలు టీవీ చానల్స్‌లో యాంకర్‌గా కూడా మెప్పించారు.
entertainment
645
23-01-2017 23:51:06
ఎలక్ర్టానిక్‌ చెల్లింపులపై నియంత్రణ వ్యవస్థ
న్యూ‌ఢిల్లీ : దేశంలో డిజిటల్‌ లావాదేవీలు జోరందుకుంటున్న నేపథ్యంలో ఎలక్ర్టానిక్‌ చెల్లింపుల లావాదేవీల చార్జీలను నియంత్రించేందుకు ఒక రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేసే విషయం ప్రభుత్వం పరిశీలిస్తోంది. చెల్లింపుల వ్యవస్థకు సంబంధించిన నియంత్రణలను కేంద్రబ్యాంకు విధుల్లో భాగంగా కాకుండా ఒక ప్రత్యేక వ్యవస్థగా ఉంచాలని డిజిటల్‌ చెల్లింపులపై పరిశీలనకు ఏర్పాటైన రతన్‌ వటల్‌ కమిటీ సిఫారసు చేసింది. అయితే చెల్లింపుల వ్యవస్థపై అదుపును వదిలించుకునేందుకు ఆర్‌బిఐ సిద్ధంగా లేదంటున్నారు.      ఇదే విషయాన్ని వటల్‌ కమిటీకి ఆర్‌బిఐ తెలియచేసింది. కానీ ఆర్‌బిఐ బ్యాంకింగ్‌ రంగానికి మేలు చేసే అంశాలపై దృష్టి పెడుతుంది గనుక చెల్లింపుల వ్యవస్థలో పోటీని, నవ్యవతను తీసుకువచ్చేందుకు ప్రత్యేక రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేయడం వల్ల డిజిటల్‌ చెల్లింపులు ఉత్తేజం కలుగుతుందని అధికారులంటున్నారు. చెల్లింపుల నియంత్రణలు బ్యాంకింగ్‌ నియంత్రణలకన్నా భిన్నమైనవని ఆ కమిటీ అభిప్రాయపడింది.
business
17,880
12-11-2017 15:26:21
జీఎస్‌టీ సవరణల వెనుక ఎవరున్నారు?
లక్నో: ఇటీవల జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో వస్తు సేవల పన్ను రేట్లను సవరించడం వెనుక ప్రధాని మోదీ ఉన్నారట. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారనాడు తెలిపారు. జీఎస్‌టీకి సంబంధించిన అంశాలన్నీ ప్రధానికి తెలుసునని, తప్పనిసరి సవరణలు చేయాల్సిందిగా ఆయన నిర్ద్వంద్వంగా తెలియజేయారని ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ రాజ్‌నాథ్ తెలిపారు. ప్రధాని స్పష్టత ఇచ్చిన తర్వాతే జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం జరిగిందని, సమావేశంలో ఏకాభిప్రాయంతో చేసిన మార్పుల పట్ల వ్యాపారులు కూడా సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. 'ఒకదేశం...ఒకే పన్ను' విధానంతో అమలు చేసిన జీఎస్‌టీ పట్ల వర్తక, వాణిజ్య వర్గాలన్నీ సంతోషంగా ఉన్నట్టు రాజ్‌నాథ్ చెప్పారు.  కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ 23 శాతం పన్ను ఉన్న 178 ఐటెమ్స్‌ను 18 శాతం పన్ను పరిధిలోకి తెస్తున్నట్టు గత శుక్రవారం ప్రకటించారు. గౌహతిలో జరిగిన 23వ జీఎస్‌టీ కౌన్సిల్‌లో తీసుకున్న ఈ నిర్ణయం ఈనెల 15 నుంచి అమల్లోకి రానుంది.
nation
19,372
04-02-2017 01:05:04
ట్రోఫీ నెగ్గాక.. రాత్రంతా డ్యాన్స్‌లే..
ఫ్రెండ్స్‌కు ఫెడరర్‌ గ్రాండ్‌ పార్టీ మెల్‌బోర్న్‌: ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ కెరీర్‌లో 18వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో రఫెల్‌ నడాల్‌ను ఓడించి ట్రోఫీ నెగ్గిన తర్వాత.. ఆ మధుర క్షణాలను మిత్రులతో కలిసి బాగా ఆస్వాదించానని ఫెడెక్స్‌ ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. టైటిల్‌ గెలిచాక మీడియా సమావేశం, డోపింగ్‌ టెస్ట్‌, ఇతర కార్యక్రమాలు ముగించుకుని తాను ఫ్రెండ్స్‌తో కలిసి నేరుగా బార్‌కు వెళ్లి తెల్లవారే వరకూ డ్యాన్స్‌లతో ఎంజాయ్‌ చేశానని ఫెడరర్‌ తెలిపాడు. ‘ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచాక స్టేడియం నుంచి బయటకు వచ్చే సరికి రాత్రి 3 గంటలైంది. వెంటనే మిత్రులతో కలిశాను. అక్కడి నుంచి నేరుగా బార్‌కు వెళ్లి డీజే సం గీత హోరులో డ్యాన్స్‌లతో సందడి చేశాం. ఇక ఉదయం 6.30కి ట్రోఫీతో రూమ్‌కు చేరుకున్నా. అప్పుడే మా పిల్లలు లేచారు. వాళ్లు నా దగ్గరకు వచ్చి.. నన్ను.. ట్రోఫీని తదేకంగా చూస్తుండి పోయారు. ఆ 12 గంటలు నాకు గొప్ప మధుర జ్ఞాపకమ’ని ఫెడెక్స్‌ తెలిపాడు.
sports
20,221
12-04-2017 03:11:52
బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌ బరిలో సింధు
న్యూఢిల్లీ: ఒలింపిక్‌ సిల్వర్‌ స్టార్‌, ప్రపంచ రెండో ర్యాంకర్‌ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికల బరిలో నిలిచింది. ఈ కమిషన్‌లో ఖాళీ అయ్యే నాలుగు స్థానాల కోసం సింధుతో పాటు మరో ఎనిమిది మంది పోటీపడుతున్నారు. అం దులో అంతగా పరిచయం లేని భారత షట్లర్‌ నిఖార్‌ గార్గ్‌ కూడా ఉన్నాడు. ఆటతో ఎవరికీ తెలియని గార్గ్‌ బ్యాడ్మింటన్‌ వర్గాల్లో వ్యతిరేక స్వరం వినిపిస్తూ గుర్తింపు పొందాడు. డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో జనవరిలో అతను 374వ స్థానంలో నిలిచాడు. మార్చి 27న నామినేషన్ల గడువు ముగియగా... బీడబ్ల్యూఎ్‌ఫలో ఆటగాళ్లకు ప్రాతినిథ్యం వహించే కమిషన్‌లో చోటు కోసం ఆరుగురు పు రుషులు, ముగ్గురు మహిళలు ఎన్నికల బరిలో నిలిచారు. నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోనున్న ముగ్గురు సభ్యులు మే నెలలో వైదొలగనున్నారు. నిబంధనల ప్రకారం ఇందులో ఒక మహిళ, ఒక పురుషుడు ఉండాలి. మూడో వ్యక్తి ఎవరైనా కావొచ్చు. ఒక మహిళా ప్రతినిధి రాజీనామాతో ఆ స్థానం ఏడాది నుంచి ఖాళీగా ఉంది.
sports
12,131
27-04-2017 02:24:26
మీడియా అతివల్లే ఓడిపోయాం
- మీడియాపై అఖిలేశ్‌ యాదవ్‌ గరంగరం
nation
3,617
21-10-2017 01:08:26
‘ఆజాంజాహి’ స్ఫూర్తితో ప్రభుత్వ జౌళి మిల్లులు
పత్తిపంట ముడి సరుకుగా ఆజాంజాహి మిల్లు లాంటి టెక్స్‌టైల్‌ మిల్లులను ప్రభుత్వ రంగంలోనే పదుల సంఖ్యలో స్థాపించాలి. ఆ మిల్లుల్లో నిరుద్యోగులకు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగాలు కల్పించి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. ఈ విషయమై ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. వరంగల్‌ పట్టణంలో నిజాం ప్రభుత్వం 1938లో స్థాపించిన ఆజాంజాహి మిల్లు ప్రజలకు బహుళ ప్రయోజనాలందించింది. తెలంగాణ పత్తి పండించని కాలంలో విదేశాల నుండి పత్తిని దిగుమతి చేసుకుని ఆజాంజాహి మిల్లును నడిపించారు. దాదాపు పదివేల మంది కార్మికులు మూడు షిప్టులలో రేయింబవళ్ళు పత్తి నుండి నూలును తయారు చేయడం, ఆ నూలుకు రంగులద్దడం, రంగులద్దిన నూలుతో అత్యంత నాణ్యమయిన బట్టను తయారు చేయడం, తయారైన బట్టను రంగురంగుల డిజైన్‌లు వేసి విదేశాలకు ఎగుమతి చేయడం జరిగింది. ఆజాంజాహి మిల్లు ద్వారా వరంగల్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాలయిన కాశిబుగ్గ, ధర్మారం, కరీమాబాద్‌, పుప్పాలగుట్ట, ఖీలా వరంగల్‌, గిర్మాజిపేట, చింతల్‌, గొర్రెకుంట, మొగిలిచర్ల, ఎనమాముల, కొత్తవాడ లాంటి ప్రాంతాలు కార్మికుల కుటుంబాలతో కళకళలాడేవి. మిల్లుకు అందించే మంచినీరు ద్వారా టర్బయిన్ల సహాయంతో విద్యుత్‌ను తయారు చేసేవారు. ఈ విద్యుత్కేంద్రం మిల్లు అవసరాలను తీర్చడంతో పాటు వరంగల్‌ నగరం మొత్తానికి విద్యుత్‌ అందించేది. ప్రతినెల 1న నెలసరి జీతాలు వచ్చే సమయానికి వెలిసే దుకాణాలు మిల్లు గ్రౌండ్‌ను ఆక్రమించేవి. ప్రతినెల 1నుండి 10వ తేదీ వరకు కార్మికులందరూ తమకు కావలసిన వస్తువులు కొనుక్కునేవారు. మిగతా రోజుల్లో వరంగల్‌ నగరంలోని దుకాణాలన్నీ మిల్లు కార్మికుల, ఉద్యోగుల అవసరాలు తీర్చేవి. ఇక చేతి వృత్తులయిన కుమ్మరి, చాకలి, మంగలి, దర్జీలతో పాటు, పాలు, పెరుగు అమ్ముకునే పాడి రైతులు మిల్లు కార్మిక కుటుంబాల మీద ఆధారపడి బతికేవారు. అటువంటి మిల్లు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది. నష్టాలబారిన పడిందనే నెపంతో 2002లో మొత్తం మిల్లును మూసివేసిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేసింది. తెలంగాణలో నేడు రైతాంగం పండిస్తున్న మొత్తం పంటలలో 50 శాతం పత్తి పంటే. ఈ సంవత్సరమైతే వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం రైతాంగం వేసిన మొత్తం పంటల్లో పత్తి పంట 56.7 శాతం మేరకు వున్నది. గత మూడున్నర దశాబ్దాలుగా పత్తిపంట దినదినాభివృద్ధి చెందుతూ రైతాంగానికి తెల్ల బంగారంగా మారిన రోజులున్నాయి. అలాగే సరైన గిట్టుబాటు ధర లేనపుడు, నకిలీ విత్తనాలు, పురుగు మందులు మార్కెట్లో నిరంతరంగా రైతాంగానికి సప్లయి చేసినప్పుడు, ‘రైతాంగానికి పురుగుల మందే పెరుగన్నం’ కూడా అయింది. 1995 నుండి 1998 వరకు పత్తి రైతులు దేశవ్యాప్తంగా లక్షలాదిగా ఆత్మహత్యలు చేసుకోగా, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో వేలమంది పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో వందలాది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా, ఇక్కడి భూమి స్వరూపం, వర్షాధార పరిస్థితులు, ఇతర సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని రైతాంగం మెజారిటీగా పత్తిపంటనే పండిస్తున్నది. ఈ పత్తి పంటను ఆధారం చేసుకుని ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లా కేంద్రాల చుట్టుపక్కల్లో వేలాది జిన్నింగ్‌ మిల్లులు వెలిసాయి. ఆయా మిల్లుల్లో శుద్ధి చేసిన పత్తి బేళ్ళు కోట్లాది టన్నులు ప్రతి సంవత్సరం ఉత్తర భారతదేశంతో పాటు, విదేశాలకు ఎగుమతి అవుతున్నది. తెలంగాణలో పత్తి పంట పండని కాలంలోనే అద్భుతమయిన మిల్లును నాటి నిజాం ప్రభుత్వం నడిపించగా, లక్షలాది ఎకరాలలో పత్తిని పండిస్తూ, కోట్లాది టన్నుల పత్తి ఎగుమతి అవుతున్న ప్రస్తుత తరుణంలో ఆజాంజాహి మిల్లు లాంటి మిల్లులను నేటి ప్రజాస్వామిక ప్రభుత్వం ఎందుకు స్థాపించడం లేదు? గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయడమే తమ ధ్యేయంగా ఎన్నికల హామీల్లో ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేడు వ్యవసాయంపై ఆధారపడిన, పత్తి ముడి సరుకుగా నూలు బట్టను నేయకలిగిన మిల్లులను ఎందుకు స్థాపించడం లేదు? నేడు ఉత్తర తెలంగాణలో పండిస్తున్న పత్తిపంటను ఉపయోగించుకుని దాదాపు 50 ఆజాంజాహి మిల్లులను స్థాపించవచ్చును. ప్రభుత్వం ఒక్క ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే దాదాపు 10 మిల్లులను స్థాపించవచ్చును, ప్రభుత్వ రంగంలోనే ఈ మిల్లులు స్థాపిస్తే, దశాబ్దాల క్రితం బొంబాయి, సూరత్‌, భీవండికి వెళ్ళిపోయిన కార్మిక కుటుంబాలన్నీ తిరిగి వచ్చి మళ్ళీ వారు పుట్టి పెరిగిన ప్రాంతాల్లోనే జీవిస్తూ ఇక్కడి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడవచ్చును. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మూసివేసిన పరిశ్రమలు తెరుస్తారని, కొత్త పరిశ్రమలు స్థాపిస్తారనే ఆశతో ఎదురుచూస్తున్న లక్షలాది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దొరికే అవకాశాలున్నాయి. వేలాది ఇంజనీర్లకు, సాంకేతిక నిపుణులకు కూడా ఈ మిల్లులు స్థాపించడం వలన ఉద్యోగాలు లభిస్తాయి. కానీ అటువంటి ప్రయత్నం చేయని ప్రభుత్వం నేడు టెక్స్‌టైల్స్‌ పార్క్‌ పేరు మీద దాదాపు రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఆయా సంస్థల యాజమాన్యాలకు కట్టబెట్టేందుకే టెక్స్‌టైల్‌ పార్క్‌ను అభివృద్ధి చేయపూనుకున్నది. ఇప్పటికే వరంగల్‌ నగరంలోని కొత్తవాడ, మట్టెవాడ, కరీమాబాద్‌, గిర్మాజిపేట, ఖీల వరంగల్‌లోని పవర్‌లూమ్స్‌, హేండ్లూమ్స్‌ మూతపడి వాటి యజమానుల జీవితాలు చిద్రమయినాయి. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, అంతర్‌గాం లాంటి ప్రాంతాలలోని చేనేత పార్కులు ఎంత దయనీయ పరిస్థితుల్లో వున్నాయో అందరికీ తెలిసిన విషయమే.  అక్కడి పార్క్‌ల నుండి వచ్చిన ఉత్పత్తులకు సరైన మార్కెట్టు సౌకర్యం లేక చేనేత కార్మికులు దశాబ్దాల తరబడిగా బతుకు ఛిద్రమై ఉరివేసుకుంటున్నారు. ఇక సిరిసిల్లయితే ‘ఉరిసిల్లగానే’ మారిన స్థితిని చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో టెక్స్‌టైల్‌ పార్క్‌ వరంగల్‌ నగరం పక్కనే ఏర్పరచే బదులు ప్రభుత్వరంగంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను పదుల సంఖ్యలో స్థాపించి లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించవచ్చును. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి పరిశ్రమలు అభివృద్ధి చేస్తామని ఉద్యమ సమయంలో ప్రకటించి, ఎన్నికల ప్రచారంలో చెప్పి ఒక్క వ్యవసాయాభివృద్ధి పరిశ్రమ కూడా స్థాపించకుండా, నిజాం ప్రభుత్వంలో స్థాపించిన నిజాం షుగర్స్‌ను మూసివేసి లక్షలాది చెరుకు రైతులను, వేలాది కార్మిక కుటుంబాలను రోడ్డున పడవేసింది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం స్థాపించే టెక్స్‌టైల్‌ పార్క్‌ వలన నాలుగైదు వందల మందికి మాత్రమే (టెక్స్‌టైల్‌ సంస్థల అభివృద్ధికి) స్థలం లభించవచ్చును. అందులో చిత్తశుద్ధితో ఏర్పరచే సంస్థలు ప్రారంభంలో కొంత మనుగడను సాధించవచ్చును. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుండి తీసుకువచ్చే నూలు, రంగులు, ఇతర సామాగ్రి అధిక ధరలకు దిగుమతి చేసుకుని, వారు తయారు చేసిన బట్టకు సరియైన గిట్టుబాటు ధర లభించక సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల టెక్స్‌టైల్స్‌ పార్క్‌ల యజమానుల లాగే దుర్భర జీవితం గడపాల్సి వస్తుంది. భవిష్యత్‌లో అంతిమంగా వరంగల్‌ నగరాన్ని మరో సిరిసిల్లగా లేదా ఉరిసిల్లగా మార్చడం తప్ప మరేమీ కాదు. ఇప్పటికైనా పత్తిపంట ముడి సరుకుగా వ్యవసాయాధారిత పరిశ్రమ కింద ఆజాంజాహి మిల్లు లాంటి పదుల సంఖ్యలో ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో టెక్స్‌టైల్‌ మిల్లులను ప్రభుత్వ రంగంలోనే స్థాపించాలి. ఆ మిల్లుల్లో నిరుద్యోగులకు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగాలు కల్పించి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. ఈ విషయమై ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది.చిక్కుడు ప్రభాకర్(రేపు వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌కు శంకుస్థాపన) వరంగల్‌ పట్టణంలో నిజాం ప్రభుత్వం 1938లో స్థాపించిన ఆజాంజాహి మిల్లు ప్రజలకు బహుళ ప్రయోజనాలందించింది. తెలంగాణ పత్తి పండించని కాలంలో విదేశాల నుండి పత్తిని దిగుమతి చేసుకుని ఆజాంజాహి మిల్లును నడిపించారు. దాదాపు పదివేల మంది కార్మికులు మూడు షిప్టులలో రేయింబవళ్ళు పత్తి నుండి నూలును తయారు చేయడం, ఆ నూలుకు రంగులద్దడం, రంగులద్దిన నూలుతో అత్యంత నాణ్యమయిన బట్టను తయారు చేయడం, తయారైన బట్టను రంగురంగుల డిజైన్‌లు వేసి విదేశాలకు ఎగుమతి చేయడం జరిగింది. ఆజాంజాహి మిల్లు ద్వారా వరంగల్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాలయిన కాశిబుగ్గ, ధర్మారం, కరీమాబాద్‌, పుప్పాలగుట్ట, ఖీలా వరంగల్‌, గిర్మాజిపేట, చింతల్‌, గొర్రెకుంట, మొగిలిచర్ల, ఎనమాముల, కొత్తవాడ లాంటి ప్రాంతాలు కార్మికుల కుటుంబాలతో కళకళలాడేవి. మిల్లుకు అందించే మంచినీరు ద్వారా టర్బయిన్ల సహాయంతో విద్యుత్‌ను తయారు చేసేవారు. ఈ విద్యుత్కేంద్రం మిల్లు అవసరాలను తీర్చడంతో పాటు వరంగల్‌ నగరం మొత్తానికి విద్యుత్‌ అందించేది. ప్రతినెల 1న నెలసరి జీతాలు వచ్చే సమయానికి వెలిసే దుకాణాలు మిల్లు గ్రౌండ్‌ను ఆక్రమించేవి. ప్రతినెల 1నుండి 10వ తేదీ వరకు కార్మికులందరూ తమకు కావలసిన వస్తువులు కొనుక్కునేవారు. మిగతా రోజుల్లో వరంగల్‌ నగరంలోని దుకాణాలన్నీ మిల్లు కార్మికుల, ఉద్యోగుల అవసరాలు తీర్చేవి. ఇక చేతి వృత్తులయిన కుమ్మరి, చాకలి, మంగలి, దర్జీలతో పాటు, పాలు, పెరుగు అమ్ముకునే పాడి రైతులు మిల్లు కార్మిక కుటుంబాల మీద ఆధారపడి బతికేవారు. అటువంటి మిల్లు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది. నష్టాలబారిన పడిందనే నెపంతో 2002లో మొత్తం మిల్లును మూసివేసిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేసింది. తెలంగాణలో నేడు రైతాంగం పండిస్తున్న మొత్తం పంటలలో 50 శాతం పత్తి పంటే. ఈ సంవత్సరమైతే వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం రైతాంగం వేసిన మొత్తం పంటల్లో పత్తి పంట 56.7 శాతం మేరకు వున్నది. గత మూడున్నర దశాబ్దాలుగా పత్తిపంట దినదినాభివృద్ధి చెందుతూ రైతాంగానికి తెల్ల బంగారంగా మారిన రోజులున్నాయి. అలాగే సరైన గిట్టుబాటు ధర లేనపుడు, నకిలీ విత్తనాలు, పురుగు మందులు మార్కెట్లో నిరంతరంగా రైతాంగానికి సప్లయి చేసినప్పుడు, ‘రైతాంగానికి పురుగుల మందే పెరుగన్నం’ కూడా అయింది. 1995 నుండి 1998 వరకు పత్తి రైతులు దేశవ్యాప్తంగా లక్షలాదిగా ఆత్మహత్యలు చేసుకోగా, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో వేలమంది పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో వందలాది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా, ఇక్కడి భూమి స్వరూపం, వర్షాధార పరిస్థితులు, ఇతర సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని రైతాంగం మెజారిటీగా పత్తిపంటనే పండిస్తున్నది. ఈ పత్తి పంటను ఆధారం చేసుకుని ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లా కేంద్రాల చుట్టుపక్కల్లో వేలాది జిన్నింగ్‌ మిల్లులు వెలిసాయి. ఆయా మిల్లుల్లో శుద్ధి చేసిన పత్తి బేళ్ళు కోట్లాది టన్నులు ప్రతి సంవత్సరం ఉత్తర భారతదేశంతో పాటు, విదేశాలకు ఎగుమతి అవుతున్నది. తెలంగాణలో పత్తి పంట పండని కాలంలోనే అద్భుతమయిన మిల్లును నాటి నిజాం ప్రభుత్వం నడిపించగా, లక్షలాది ఎకరాలలో పత్తిని పండిస్తూ, కోట్లాది టన్నుల పత్తి ఎగుమతి అవుతున్న ప్రస్తుత తరుణంలో ఆజాంజాహి మిల్లు లాంటి మిల్లులను నేటి ప్రజాస్వామిక ప్రభుత్వం ఎందుకు స్థాపించడం లేదు? గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయడమే తమ ధ్యేయంగా ఎన్నికల హామీల్లో ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేడు వ్యవసాయంపై ఆధారపడిన, పత్తి ముడి సరుకుగా నూలు బట్టను నేయకలిగిన మిల్లులను ఎందుకు స్థాపించడం లేదు? నేడు ఉత్తర తెలంగాణలో పండిస్తున్న పత్తిపంటను ఉపయోగించుకుని దాదాపు 50 ఆజాంజాహి మిల్లులను స్థాపించవచ్చును. ప్రభుత్వం ఒక్క ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే దాదాపు 10 మిల్లులను స్థాపించవచ్చును, ప్రభుత్వ రంగంలోనే ఈ మిల్లులు స్థాపిస్తే, దశాబ్దాల క్రితం బొంబాయి, సూరత్‌, భీవండికి వెళ్ళిపోయిన కార్మిక కుటుంబాలన్నీ తిరిగి వచ్చి మళ్ళీ వారు పుట్టి పెరిగిన ప్రాంతాల్లోనే జీవిస్తూ ఇక్కడి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడవచ్చును. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మూసివేసిన పరిశ్రమలు తెరుస్తారని, కొత్త పరిశ్రమలు స్థాపిస్తారనే ఆశతో ఎదురుచూస్తున్న లక్షలాది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దొరికే అవకాశాలున్నాయి. వేలాది ఇంజనీర్లకు, సాంకేతిక నిపుణులకు కూడా ఈ మిల్లులు స్థాపించడం వలన ఉద్యోగాలు లభిస్తాయి. కానీ అటువంటి ప్రయత్నం చేయని ప్రభుత్వం నేడు టెక్స్‌టైల్స్‌ పార్క్‌ పేరు మీద దాదాపు రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఆయా సంస్థల యాజమాన్యాలకు కట్టబెట్టేందుకే టెక్స్‌టైల్‌ పార్క్‌ను అభివృద్ధి చేయపూనుకున్నది. ఇప్పటికే వరంగల్‌ నగరంలోని కొత్తవాడ, మట్టెవాడ, కరీమాబాద్‌, గిర్మాజిపేట, ఖీల వరంగల్‌లోని పవర్‌లూమ్స్‌, హేండ్లూమ్స్‌ మూతపడి వాటి యజమానుల జీవితాలు చిద్రమయినాయి. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, అంతర్‌గాం లాంటి ప్రాంతాలలోని చేనేత పార్కులు ఎంత దయనీయ పరిస్థితుల్లో వున్నాయో అందరికీ తెలిసిన విషయమే.  అక్కడి పార్క్‌ల నుండి వచ్చిన ఉత్పత్తులకు సరైన మార్కెట్టు సౌకర్యం లేక చేనేత కార్మికులు దశాబ్దాల తరబడిగా బతుకు ఛిద్రమై ఉరివేసుకుంటున్నారు. ఇక సిరిసిల్లయితే ‘ఉరిసిల్లగానే’ మారిన స్థితిని చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో టెక్స్‌టైల్‌ పార్క్‌ వరంగల్‌ నగరం పక్కనే ఏర్పరచే బదులు ప్రభుత్వరంగంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను పదుల సంఖ్యలో స్థాపించి లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించవచ్చును. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి పరిశ్రమలు అభివృద్ధి చేస్తామని ఉద్యమ సమయంలో ప్రకటించి, ఎన్నికల ప్రచారంలో చెప్పి ఒక్క వ్యవసాయాభివృద్ధి పరిశ్రమ కూడా స్థాపించకుండా, నిజాం ప్రభుత్వంలో స్థాపించిన నిజాం షుగర్స్‌ను మూసివేసి లక్షలాది చెరుకు రైతులను, వేలాది కార్మిక కుటుంబాలను రోడ్డున పడవేసింది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం స్థాపించే టెక్స్‌టైల్‌ పార్క్‌ వలన నాలుగైదు వందల మందికి మాత్రమే (టెక్స్‌టైల్‌ సంస్థల అభివృద్ధికి) స్థలం లభించవచ్చును. అందులో చిత్తశుద్ధితో ఏర్పరచే సంస్థలు ప్రారంభంలో కొంత మనుగడను సాధించవచ్చును. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుండి తీసుకువచ్చే నూలు, రంగులు, ఇతర సామాగ్రి అధిక ధరలకు దిగుమతి చేసుకుని, వారు తయారు చేసిన బట్టకు సరియైన గిట్టుబాటు ధర లభించక సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల టెక్స్‌టైల్స్‌ పార్క్‌ల యజమానుల లాగే దుర్భర జీవితం గడపాల్సి వస్తుంది. భవిష్యత్‌లో అంతిమంగా వరంగల్‌ నగరాన్ని మరో సిరిసిల్లగా లేదా ఉరిసిల్లగా మార్చడం తప్ప మరేమీ కాదు. ఇప్పటికైనా పత్తిపంట ముడి సరుకుగా వ్యవసాయాధారిత పరిశ్రమ కింద ఆజాంజాహి మిల్లు లాంటి పదుల సంఖ్యలో ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో టెక్స్‌టైల్‌ మిల్లులను ప్రభుత్వ రంగంలోనే స్థాపించాలి. ఆ మిల్లుల్లో నిరుద్యోగులకు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగాలు కల్పించి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. ఈ విషయమై ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది.చిక్కుడు ప్రభాకర్(రేపు వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌కు శంకుస్థాపన)
editorial
16,374
25-05-2017 03:16:26
చెరుకు గిట్టుబాటు ధర క్వింటాల్‌కు రూ.25 పెంపు
న్యూఢిల్లీ, మే 24: అక్టోబర్‌ నుంచి ఆరంభమయ్యే సీజన్‌(2917-18)లో చెరుకుకు న్యాయమైన గిట్టుబాటు ధర(ఎఫ్ఆర్పీ)ను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. క్వింటాల్‌కు రూ.25 పెంచుతూ బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాలప కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) భేటీలో నిర్ణయం తీసుకున్నారు. చెరుకు ఎఫ్‌ఆర్పీ ఈ ఏడాది రూ.230 ఉండగా.. తాజా పెంపుతో రూ.255కు చేరనుంది.
nation
12,352
30-04-2017 12:09:13
త‌మిళ‌నాడులో మిస్ట‌రీగా మిగులుతున్న మ‌ర‌ణాలు..!
చెన్నైః త‌మిళ‌నాడులో దివంగిత ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌కు చెందిన ఎస్టేట్‌లో ఏం జ‌రుగుతోంది? గార్డు హ‌త్య కేసులో నిందితుడు ప్ర‌మాదంలోనే చ‌నిపోయాడా? రాష్ట్రంలోని నీల‌గిరిస్ జిల్లాలో జ‌య‌కు 800 ఎక‌రాల విశాల‌మైన ఎస్టేట్ ఉంది. దీని మ‌ధ్య‌లో ఓ బంగ్లా ఉంది. జ‌య బ‌తికున్న రోజుల్లో త‌న నెచ్చెలి శ‌శిక‌ళ‌తో క‌లిసి ఈ ఎస్టేట్‌కు వ‌చ్చేవారు. అధికారంలో ఉన్నా లేకున్నా వేస‌విలో కొంత కాలం ఇక్క‌డే గ‌డిపేవారు. జ‌య మ‌ర‌ణించిన త‌ర్వాత అప్పుడ‌ప్పుడు శ‌శి బంధులు ఇక్క‌డ‌కు వ‌చ్చి చూసి వెళుతుండేవారు. అయితే శ‌శి జైలుకు వెళ్లిన త‌ర్వాత ఈ ఎస్టేట్‌కు ఎవ‌రూ రావ‌డంలేదు. ఐదు రోజుల క్రితం రాత్రి 1-30 గంట‌ల స‌మ‌యంలో ఈ ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డును హ‌త్య చేసి, మ‌రో గార్డును గాయ‌ప‌రిచిన సంఘ‌ట‌న సంచ‌లనం రేపింది. ఆ భ‌వ‌నంలో జ‌య‌కు సంబంధించిన విలువైన ఆస్తుల ప‌త్రాలు, కొంత న‌గ‌దు దోచుకు వెళ్లార‌ని తేలింది. ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు జ‌య మాజీ డ్రైవ‌ర్ క‌న‌క‌రాజు పాత్ర ఉంద‌ని గుర్తించారు. అత‌డికి స‌హ‌క‌రించార‌ని అనుమానంతో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.క‌న‌క రాజు కోసం పోలీసులు గాలిస్తున్న త‌రుణంలోనే అత్తూరువ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో క‌న‌క‌రాజు మ‌ర‌ణించాడు. మ‌రిన్ని వివ‌రాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
nation
2,571
11-07-2017 18:24:49
కొత్త ఆఫర్లను ప్రకటించిన జియో!
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో.. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం తన టారిఫ్‌లను సవరించింది. ఈనెలాఖరుకు ధన్ ధనా ధన్, సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్లు ముగియనుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.309 ప్లాన్‌లో భాగంగా రోజుకు 1 జీబీ పరిమితితో 84 జీబీని 84 రోజులపాటు అందించగా ప్రస్తుతం 56 జీబీని 56ల కాలపరిమితితో రోజుకు 1జీబీ నిబంధనతో ఆఫర్ చేస్తోంది. అలాగే రూ.309, రూ.349, రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్ల కాలపరిమితి కూడా 56 రోజులుగా నిర్ణయించింది. జియో ధన్ ధనా ధన్ ఆఫర్‌లో భాగంగా మొదటిసారి రూ.509తో రీచార్జ్ చేసుకున్న వారికి రోజుకు 2జీబీ 4జీ డేటాను 84 రోజుల పాటు అందించగా ప్రస్తుతం రోజుకు 2జీబీ పరిమితితో 112 జీబీని 56 రోజులు అందించనున్నట్టు ప్రకటించింది. రూ.999 ప్లాన్‌లో గతంలో 120 జీబీ డేటాను ఆఫర్ చేయగా ప్రస్తుతం 90 జీబీల డేటాను 90 రోజుల పాటు అందించనున్నట్టు తెలిపింది.  పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో ఉన్నవాటికి కొద్దిపాటి మార్పులు చేసింది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో రూ.399తో ప్రారంభయ్యే ప్లాన్‌కు మాత్రమే మూడు నెలల కాలపరిమితి ఉంది. మిగతావాటిని మాత్రం రెండు నెలల కాలపరిమితి విధించింది. వీటితోపాటు కొత్తగా రూ.349, రూ.399తో రెండు సరికొత్త ప్లాన్లను జియో ప్రకటించింది. రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 10+10 జీబీ డేటాను 54 రోజుల పాటు అందిస్తోంది. ఇదే ప్లాన్‌ను పోస్ట్ పెయిడ్‌లో రెండు నెలలపాటు అంతే మొత్తం డేటాతో ఆఫర్ చేస్తోంది. వీటిలో రోజువారి డేటా నిబంధన లేదు. రూ.399 ప్లాన్‌లో 84 జీబీ డేటాను 84 రోజులపాటు అందిస్తోంది. ఇందులో రోజుకు 1జీబీ నిబంధన ఉంది. ఇదే ప్లాన్‌ను పోస్ట్ పెయిడ్ యూజర్లు 90 జీబీ డేటాను మూడు నెలలు ఉపయోగించుకోవచ్చు. రోజుకు 1జీబీ డేటా పరిమితి ఉంది.
business
5,037
18-03-2017 11:15:48
తన నిర్ణయంతో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తోన్న అమీ జాక్సన్!
క్రేజీ ఆఫర్లు అందుకుంటూ సూపర్ స్టార్‌డమ్‌కు చేరువవుతున్న అమీ జాక్సన్ మరింత స్పీడ్ పెంచబోతోందట. బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్ ప్రస్తుతం మాంచి ఊపు మీద ఉందనే చెప్పాలి. ఇటీవలే 'రోబో 2.0' మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న అమీకి.. ఇప్పుడు క్రేజీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు బాలీవుడ్‌లోనూ బడా ఆఫర్లకు గేలం వేస్తున్న ఈ స్లిమ్ బ్యూటీ... మరోవైపు విభిన్నమైన కాన్సెప్ట్‌లకూ పెద్ద పీట వేస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటోంది. తాజాగా కోలీవుడ్‌లో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ చిన్నది. రొటీన్‌కు భిన్నమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న తమిళ హీరో విజయ్ సేతుపతి... తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. త్వరలో దర్శకుడు గోకుల్ తెరకెక్కిస్తున్న 'ఆసైపట్టై బాలకుమారా 2' చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలోనే అమీ జాక్సన్ హీరోయిన్‌గా ఫైనలైజ్ అయింది. ఇందులో నాయిక పాత్రకు భీభత్సమైన వెయిటేజీ ఉండటంతో అమ్మడు ఇన్స్‌టెంట్‌గా ఈ ఆఫర్‌కు ఓకే చేసిందట. మరి అటు గ్లామరస్ క్యారెక్టర్లతో పాటూ, ఇటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లకూ పెద్ద పీట వేస్తున్న అమీ ముందు ముందు ఇంకెంతగా సప్రైజ్ చేస్తుందో చూడాలి.
entertainment
5,166
02-05-2017 00:18:56
‘ఆచారి అమెరికా యాత్ర’ ముచ్చట్లు
మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య అమెరికా యాత్ర’. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. డా.మంచు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న ఈ సినిమా ముహూర్తం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 5నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. పద్మజ పిక్చర్స్‌ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం.ఎల్‌.కుమార్‌చౌదరి సమర్పిస్తున్నారు. చిత్ర నిర్మాతలు కీర్తి చౌదరి, కిట్టు మాట్లాడుతూ ‘‘మంచు విష్ణు సరసన ప్రగ్యా జైశ్వాల్‌ను ఎంపిక చేశాం. ఈ నెల 5 నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. హైదరాబాద్‌ షెడ్యూల్‌ అనంతరం అమెరికా షెడ్యూల్‌ ప్రారంభమవుతుంది. మల్లిడి వెంకట కృష్ణమూర్తి ఓ మంచి కథను సమకూర్చారు. కడుపుచెక్కలయ్యేలా నవ్వు తెప్పించే స్ర్కిప్ట్‌ ఇది. మంచు విష్ణు - బ్రహ్మానందం కాంబినేషన్ హైలైట్‌ అవుతుంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన, కెమెరా: సిద్ధార్థ్‌.
entertainment
14,453
23-10-2017 21:11:44
మత సామరస్యాన్ని చాటిన 'మతాంతర వివాహం'
తిరువనంతపురం: మతాంతర వివాహాలపై కేరళలో వాడివేడి చర్చ జరుగుతున్న తరుణంలో మలప్పురం జిల్లాలో జరిగిన ఓ మతాంతర వివాహానికి పెద్దఎత్తున ఇరుమతాల వారు హాజరై మతసామరస్యాన్ని చాటుకున్నారు. ఈ మతాంతర వివాహానికి హాజరుకావద్దంటూ మదరుల్ ఇస్లాం సంఘానికి చెందిన మహల్లూ కమిటీ (మసీదు నిర్వాహక కమిటీ) ఇచ్చిన 'సామూహిక బహిష్కరణ' పిలుపును కూడా బేఖాతరు చేసి ముస్లిం సోదరులు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం ఈ వివాహ ప్రత్యేకత. కున్నుమల్ యూసుఫ్‌, ఆయన కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలు ఉండరాదంటూ ఈనెల 19న మసీదు కమిటీ కార్యదర్శి ఓ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేశారు. ఇంతకూ యూసుఫ్ కుటుంబం చేసిన తప్పల్లా...తన కుమార్తెకు నచ్చిన వేరే మతస్తుడితో వివాహానికి అంగీకరించడమే. 'యూసుప్ తన కుమార్తె వివాహాన్ని ముస్లిమేతరుడికి ఇచ్చి చేసేందుకు అంగీకరించినందున ఆయన కుటుంబానికి ఏ విధంగానూ సహకరించరాదు' అని మలయాళంలో ప్రచురించిన ఒక పేజీ సర్క్యులర్‌ను మసీదు కమిటీ జారీ చేసింది. మసీదుకు చెందిన మహల్లా కమిటీలు ఇలాంటి 'ఆదేశాలు' ఇవ్వడం ఇదే మొదటి సారి కాదు. అయితే ఈసారి ఆ ఆదేశాలను ముస్లిం సోదరులు లెక్కచేయలేదు. ఈనెల 20న యూసుఫ్ కుమార్తె జసీలా (26) ప్రత్యేక వివాహాల చట్టం కింద క్రైస్తవ మతస్తుడైన టిసో టోమీని వివాహం చేసుకుంది. ఆ మరుసటి రోజే పెరింతాళ్‌మన్నాలో ఇచ్చిన రెసెప్షన్‌కు ఆ చుట్టుపక్కల వారంతా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వివాహాన్ని జసీలా మేనమామ రషీద్ 'ఫేస్‌బుక్ పోస్ట్‌'లో అందరితో పంచుకున్నారు. 'తన ఇష్టమొచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఆమెకు ఉంది. జసీలా-టిసో వివాహం తొలి మతాంతర వివాహమేమీ కాదు. కాలానుగుణమైన ఈ మార్పులను మసీదు కమిటీ గ్రహించి ఇలాంటి ఆదేశాలకు ఇప్పటికైనా ముగింపు పలుకుతుందా?' అంటూ రషీద్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ లెక్కకు మిక్కిలిగా షేర్ అయింది.
nation
466
10-04-2017 23:29:17
ఆశాజనకంగా కొలువుల మార్కెట్‌
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కొలువుల మార్కెట్‌ ఆశాజనకంగానే ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రిక్రూట్‌మెంట్లు 1-15 శాతం పెరిగే అవకాశం ఉందని ‘జీనియస్‌ కన్సల్టెంట్స్‌’ అనే సంస్థ జరిపిన సర్వేలో తేలింది. మొత్తం 734 కంపెనీల ప్రధాన అధికారులతో మాట్లాడి ఈ సంస్థ ఈ సర్వే రూపొందించింది. సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 62 శాతం కంపెనీల సిఇఒలు కొత్త నియామకాలు 1-15 శాతం పెరుగుతాయని చెప్పారు. జీతాల పెరుగుదలా 5-10 శాతం మధ్య ఉంటుందని సగం మంది పేర్కొన్నట్టు జీనియస్‌ కన్సల్టెంట్స్‌ సిఎండి ఆర్‌పి యాదవ్‌ చెప్పారు. కొత్త కొలువుల భర్తీపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏ మాత్రం లేదని 73 శాతం కంపెనీల సిఇఒలు తెలిపారు. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ సంవత్సరం దక్షిణాది రాష్ట్రాల్లోనే కొత్త నియామకాలు ఎక్కువగా ఉంటాయని సర్వేలో తేలింది. నాలుగు నుంచి ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు బయట మంచి అవకాశాలున్నట్టు సర్వే పేర్కొంది. దీంతో కంపెనీల్లో 5-10 శాతం మంది ఉద్యోగులు ముఖ్యంగా జూనియర్‌ ఉద్యోగులు మంచి అవకాశాల కోసం గోడ దూకే అవకాశం ఉందని అంచనా వేసింది.
business
13,997
01-02-2017 01:59:51
వీసాలపై ట్రంప్‌ నజర్‌
వాషింగ్టన్‌, జనవరి 31: తీవ్రంగా దుర్వినియోగమవుతున్న వర్క్‌ వీసా (హెచ్‌-1బి, ఎల్‌-1) కార్యక్రమాన్ని ప్రక్షాళన చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమవుతున్నారా? ఈ మేరకు ఆయన త్వరలోనే కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయబోతున్నారా? విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమే అయితేగనక.. హెచ్‌-1బి వీసాలపై ఆధారపడిన పలు భారతీయ టెక్‌ కంపెనీలు, అమెరికాలో ఈ వీసాలపై పనిచేస్తున్న వృత్తినిపుణులకు పెద్ద దెబ్బేనని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌-1బి వీసాలకు సంబంధించి ట్రంప్‌ సంతకం చేయనున్న ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ఇదేనంటూ కొన్ని వెబ్‌సైట్లలో ప్రచురితమైన పత్రాన్ని పరిశీలిస్తే చాలా ఆంక్షలే విధించేటట్టు అర్థమవుతోంది. దాని ప్రకారం..  విదేశీ విద్యార్థులు అమెరికాలో తమ చదువు ముగిశాక కూడా మరికొన్ని రోజులు ఉండేందుకు ఉపకరించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ వర్క్‌ వీసాల గడువును పొడిగిస్తూ గతంలో ఒబామా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్నారు.  ఈ ఆదేశాలపై ట్రంప్‌ సంతకం చేసిన 90 రోజుల్లోపు.. విదేశీయులు అమెరికాలో పని చేయడానికి అనుమతించే అన్ని నిబంధనలనూ సమీక్షించాలి. జూ హెచ్‌-1బి, ఎల్‌-1 వంటి నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ ఉద్యోగ ఆధారిత వీసాలను ప్రవేశపెట్టిన ఉద్దేశాలు నిజంగా నెరవేరేలా.. అమెరికన్‌, విదేశీ ఉద్యోగుల హక్కులను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక, హోం శాఖల మంత్రులను ట్రంప్‌ తన ఆదేశాల్లో కోరతారు.  (నాన్‌ఇమ్మిగ్రెంట్‌) వీసాల కేటాయింపు ప్రక్రియ మరింత సమర్థంగా జరిగేలా.. ఆయా వీసాలను పొందేవారు నిజంగానే అత్యుత్తమ ప్రతిభావంతులు, నిపుణులు అయిఉండేలా చూడాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశిస్తారు.
nation
17,494
10-07-2017 18:16:16
సర్తాజ్ అజీజ్‌ని కడిగిపారేసిన సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ: 'ఉలూకూ లేదు. పలుకూ లేదు. స్వయానా నేనే లేఖ రాసినా ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదేం తీరు...ఇదేం వైఖరి' అంటూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ నిప్పులు చెరిగారు. కుల్‌భూషణ్ జాధవ్ తల్లి చేసిన విజ్ఞప్తి మేరకు వెంటనే ఆమెకు వీసా మంజూరు చేయాలని కోరుతూ సర్తాజ్‌కు తాను లేఖ రాసినట్టు సుష్మ వరుస ట్వీట్లలో తెలిపారు. ఆ లేఖను సర్తాజ్ గుర్తించనే లేదని తప్పుపట్టారు. భారత జాతీయుడైన కుల్‌భూషణ్ జాధవ్‌పై గూఢచర్యం నేరం మోపుతూ పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధిస్తూ ఇటీవల తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై భారత్, పాక్ మధ్య తీవ్ర వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తాను భారత్‌కు వచ్చేయాలనుకుంటున్నట్టు కుల్‌భూషణ్ తల్లి సుష్మకు ఓ ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు కూడా. కాగా, ఇండియాలో వైద్యం చేయించుకోవాలనుకుంటున్న వారికి అవసరమైన మెడికల్ వీసాలపై కూడా సుష్మ తన ట్వీట్లలో వివరణ ఇచ్చారు. మానవతా దృక్పథంతో తాము మెడికల్ వీసాలు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నప్పటికీ అందుకు సర్తాజ్ మోకాలడ్డుతున్నారని సుష్మ మండిపడ్డారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఇటీవల కాలంలో బాగా తెబ్బతిన్న నేపథ్యంలో మెడికల్ వీసా నిబంధనలను భారత్ ఇటీవల సవరించింది. భారత్‌లో మెడికల్ ట్రీట్‌మెంట్ కోరుకుంటున్న పాక్ జాతీయులు సర్తాజ్ అజీజ్ నుంచి లెటర్ తీసుకోవాలనే నిబంధనను చేర్చారు. దీనిపై సుష్మ మరింత వివరణ ఇస్తూ, అజీజ్ నుంచి అనుమతి తీసుకుంటే తక్షణం వీసా ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అనుమతి ఇవ్వకపోతే అది అజీజ్ తప్పే అవుతుందని సుష్మ తెగేసిచెప్పారు.
nation
2,761
26-06-2017 22:58:56
ఐఎంఇఐ నెంబర్‌ టాంపరింగ్‌ చేస్తే మూడేళ్ల జైలు
నిబంధనలను కఠినతరం చేయనున్న డాట్‌న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్‌లో ఉండే ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్ మెంట్‌ ఐడెంటిటీ నెంబర్‌ (ఐఎంఇఐ)ను టాంపరింగ్‌ చేసే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని టెలికాం విభాగం (డాట్‌) భావిస్తోంది. ఇందుకు సంబంధించిన నూతన నిబంధనలను రూపొందిస్తోంది. వీటిని అమల్లోకి తెస్తే 15 నెంబర్లు ఉండే ఐఎంఇఐ నెంబర్‌ను టాంపరింగ్‌ చేస్తే మూడేళ్ల వరకు జైలు శిక్షను విధించే అవకాశం ఉంది. దీని వల్ల నకిలీ ఐఎంఇఐ నెంబర్ల బెడద తప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొత్త నిబంధనలతో కస్టమర్లు కోల్పోయిన మొబైల్స్‌ను సులభంగా ట్రాక్‌ చేయవచ్చంటున్నారు. డూప్లికేట్‌ ఐఎంఇఐ నెంబర్లను వినియోగించడం వల్ల మొబైల్‌ ఫోన్ల ట్రాకింగ్‌ ఇబ్బందికరంగా మారిందని, ఇలాంటి పనులు చేసే వారిని ఇండియన్‌ టెలీగ్రాఫ్‌ చట్టం కింద శిక్షిస్తే పరిస్థితిలో మార్పు రావడానికి ఆస్కారం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఐఎంఇఐని ఆధారంగా చేసుకుని సెక్యూరిటీ ఏజెన్సీలు మొబైల్‌ ఫోన్లనేకాకుండా ఆయా ఫోన్ల నుంచి చేసిన కాల్స్‌ను ట్రాక్‌ చేసే అవకాశం ఉంటుంది. నకిలీ ఐఎంఇఐ నెంబర్‌ కలిగిన ఫోన్లకు సర్వీసులు నిలిపివేయాలని టెలికాం కంపెనీలను డాట్‌ ఇప్పటికే ఆదేశించింది. అయితే ఇలాంటి డూప్లికేట్‌ నెంబర్లను గుర్తించడం టెలికాం కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది.
business
16,679
24-08-2017 11:11:49
‘ఆధార్’ ప్రైవసీపై సుప్రీం సంచలన తీర్పు
ఢిల్లీ: ‘రైట్‌ టూ ప్రైవసీపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆధార్‌ ద్వారా వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘిస్తున్నారంటూ 2015లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తేల్చిచెప్పింది. మొత్తం 9 మంది జడ్జీల బెంచ్‌ ఏకగ్రీవ తీర్పునిచ్చింది. భారత దేశంలో ఆధార్‌ను తప్పని సరి చేస్తూ.. దేశ పౌరుల సమాచారాన్ని ఆధార్ కోసం ప్రభుత్వం సేకరించిన విషయం తెలిసిందే. వేలిముద్రలు, కళ్లు, ముఖం వంటి వివరాలు ఆధార్‌లో నిక్షిప్తం అయి ఉంటాయి. బ్యాంకులు, ఇతరత్రా వ్యక్తిగత లావాదేవీలకు వేలిముద్రలనే విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ప్రయివేటు సంస్థలకు కూడా ప్రభుత్వం ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అయిన విషయం తెలిసిందే. ఆధార్ వివరాలు బహిర్గతం చేయకూడదని, ప్రయివేటు వ్యక్తులకు, సంస్థలకు ఇవ్వకూడదని 2015లో దాఖలైన పిటీషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. వ్యక్తిగత వివరాలు గ్యోపంగా ఉంచుకోవడం కూడా ప్రాథమిక హక్కుల కిందికే వస్తుందని తీర్పునిచ్చింది.
nation
7,437
02-09-2017 11:44:18
పవన్ ఫస్ట్ లుక్ వెనుక కాన్సెప్ట్ ఇదే..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ఇంతకాలం అభిమాన గణం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. వారి ఆసక్తిని మరింత పెంచుతూ పవన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఇది ఓ వండర్. దాదాపు ఇంత వరకూ ఇలా జరగలేదు. పవన్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఫస్ట్‌ లుక్‌ను పవన్ బర్త్‌డే స్పెషల్‌గా రిలీజ్ చేశారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. రాజమౌళి బాహుబలి సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుంచి ప్రేక్షకుల మదిలో మెదిలిన ఫస్ట్ క్వశ్చన్ అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? దీనికి రకరకాల ఊహాగానాలు.. ఇందుకు చంపాడంటూ సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వెలుగు చూశాయి.  ప్రస్తుతం పవన్ పోస్టర్ చూసినా అంతే. సింపుల్‌గా అనిపిస్తోంది కానీ.. అసలు కాన్సెప్ట్ మాత్రం ఎవ్వరికీ అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేస్తోంది. దీనిపై కూడా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఒక యాంగిల్.. మరోవైపు ఎటో నడుస్తున్నారు ఇదీ అసలు మనకు పోస్టర్‌లో కనిపిస్తున్న సీన్. దీని కాన్సెప్ట్‌ని క్యాచ్ చేయడం కష్టమే. ఇంకేముంది అభిమానులు తమ బుర్రలకు పని చెప్తున్నారు. ఒక మనిషి తన ఆలోచనకు అనుగుణంగా చేసే ఒక జర్నీయే ఈ పోస్టర్ కాన్సెప్ట్‌గా ఒకరు.. తన జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఓ వ్యక్తి చేసే ప్రయాణం అని మరొకరు.. తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న ఒక వ్యక్తి కథ అని ఇంకొకరు.. ఇలా రకరకాలుగా పోస్టర్ కాన్సెప్ట్‌ని విశ్లేషిస్తున్నారు.
entertainment
4,053
13-03-2017 00:52:14
ముఖమే కనిపించనప్పుడు ఇక అస్తిత్వం ఎక్కడ?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న మహిళలను ఎంపిక చేసి సత్కరించింది. సాహిత్య విభాగంలో షాజహానా ఈ పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా ఆమెతో ఒక సంభాషణ:- స్త్రీవాద కవిత్వంలో ‘కొంగు’ను గుదిబండగా చూసి తగలబెట్టాలి అనే అగ్రవర్ణ స్త్రీవాదక్పథానికి వ్యతిరేకంగా, అది ‘బొచ్చె మీద కావలి ఉండే బొంత పేగు’ కాదన్న సుభద్రను మీరెలా చూస్తారు? అది స్త్రీవాద అవగా హనలో ఒక నిట్ట నిలువు చీలిక. సాంస్కృతిక వైరుధ్యాల నడకలో జరిగిన ఈ షిఫ్ట్‌ను ఎలా అర్థం చేసుకోవాలి? స్త్రీవాదంలో కొంగును తగులబెట్టడం అన్న ఆలోచన సరైందే. అలాగే దళితవాద కోణం నుంచి సుభద్ర రాసింది కూడా సరైందే. అగ్రవర్ణస్త్రీవాదలకు, దళిత, మైనారిటీ స్త్రీవాదలకు ఉన్న ఆకాశమంత తేడాని ఈ రెండు కవితలు ప్రతిబింబి స్తున్నాయి. రెండూ సమాంతరంగా ప్రవహిస్తున్న నదులు.. ఇవెప్పటికీ కలవవు అనిపిస్తుంది. ఎందుకంటే వీటి వెనక కులము, మతము, ప్రాంతాల బలమైన ప్రభావం ఉంది. వీరి వీరి సమస్యలు ఎంతో భిన్నంగా ఉన్నాయి. ఆర్థిక, సామాజిక, భావజాల రంగాల్లో ఎంతో తేడా ఉంది. నిజమే. ఇప్పుడిప్పుడే ఆ గడపలు దాటి వస్తోంది. అయినా ఇంకా సంపూర్ణంగా కాదు. వైరుధ్యాలు చాలా ఉన్నాయి...! ఇంకా బహుజనుల గురించి ముస్లింల గురించి ఇతర మైనారిటీల గురించి రాయాల్సిన అవసరం ఉంది. ‘మట్టిపూల’ గురించి ఎంతో చర్చ జరగాల్సిన అవసరముంది. ఎంతో సాహిత్యం వెలువడాలి. ముఖ్యంగా అగ్రవర్ణ స్త్రీవాదవాదులు తాము, తమ వారు, తమ వెనుకటితరాలు అణగారిన సీ్త్రలను చూసిన చిన్న చూపు, చూపెట్టిన వివక్ష, అణచివేతల గురించి రాయాల్సిన అవసరం ఉంది. పశ్చాత్తాపం వ్యక్తం చేయడమో మరోటో చేయడంతో పాటు ఆయా వర్గాల సీ్త్రలను ముందు నిలబెట్టి పని చేయాల్సిన అవసరముంది. తెలిసీ జవాబు చెప్పకపోతే తల పగిలిపోతుందంటారే! అలావుంది మీ ప్రశ్న. నిజమే, హిందూ అగ్రకుల స్త్రీవాదులు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దళిత, ముస్లిం, క్రిస్టియన్‌ వాదాలను అక్కునచేర్చుకుంటారో అప్పుడే వాళ్లను నమ్మేది. అప్పటివరకు ఇలాగే ఉంటుంది పరిస్థితి. కొందరు స్త్రీవాదులు దీనికి మినహాయింపు. బహుజన దృక్కోణమే ముస్లింవాద సాహిత్యానిది. కొన్ని ప్రత్యేకతలు అదనంగా ఉన్నాయి. హిందూయిజం అనేది వేరేగా ఉండదు. బ్రాహ్మణిజమే హిందూయిజం.  నేడు ఇస్లాం సమాజం ఉనికి, భద్రత, సాంస్కృతిక అస్తిత్వం ప్రశ్నార్థకం అయిన సంక్షుభిత నేపథ్యంలో పరదాను ఒక ఆత్మగౌరవ చిహ్నంగా రెహానా సుల్తానా చూశారు, కనీజ్‌ ఫాతిమా లాంటి వాళ్ళు చూస్తున్నారు. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ముస్లిం సమాజంలో సగం అయిన స్త్రీవాదకు బురఖాలు తొడిగి అదొక ఆత్మ గౌరవ చిహ్నం అంటే ఎలా? అసలు ముఖమే కనిపించనప్పుడు అస్తిత్వం ఎక్కడుంటుంది? మా ఉనికే లేనప్పుడు అది ఆత్మ గౌరవ చిహ్నం ఎలా అవుతుంది? ఫలానావాళ్ళు అలా చూస్తున్నారంటే వాళ్ళ ఇష్టం. పరదా, బురఖా మమ్మల్ని మాయం చేసే చీకటి తెరలు. మమ్మల్ని వెనక్కి నెట్టే పురుషుల ఆధిపత్యపు (పొరలు) బెత్తాలు. ఆత్మగౌరవ చిహ్నాలుగా నెగెటివ్‌ ప్రతీకల్ని కాకుండా పాజిటివ్‌ ప్రతీకల్ని వాడడం అవసరం. ఉదా: సెల్వార్‌ కమీజ్‌. ఇంకా అవసరం అనుకుంటే దుపట్టా చాలు. ప్రవాహమై పరుగెత్తి పరుగెత్తి ఒక విశాలమైన నీటి సరస్సు ఏర్పడుతుంది. ఇదీ అంతే! మొదట చాలా సాహిత్యం వచ్చింది--స్త్రీవాదంలోనైనా, దళితవాదంలోనైనా. కానీ చూస్తుం డగానే అవే పాత గొంతుకలు... అదే రామాయణ భారతాలను తీసుకుని వెరైటీగా రాయడం... ఇక్కడికే స్త్రీవాద ఆగిపోయిం దనిపిస్తుంది. ఇక జగజ్జట్టీలయిన దళితకవులు మరణించడం దళితవాదానికి తీరని లోటు. మన పిల్లల్లో ఒక్కోరు ఒక్కోరకంగా ఎదుగుతారు. అందరూ ఒక్కలాగే ఉండరు కదా! ఉండాలనుకోవడం కూడా సరి కాదు. ‘నఖాబ్‌’ అంటే నాక్కూడా చాలా ఇష్టం. ఇప్పటికీ చదువుకున్నప్పుడల్లా చలించిపోతాను. అయితే ‘చాంద్‌తార’ విలక్షణమైన కవిత్వం. కేవలం రెండులైన్లలో జీవిత సారాంశం మొత్తం ఇచ్చేది. దానికి ‘నఖాబ్‌’కి పొంతన లేదు. అలాగే ‘దర్దీ’ కూడా. ‘దర్దీ’లో సీ్త్రల పెయిన్‌ ఉంటుంది. అదే టైటిల్‌. ‘దర్దీ’ చదువుకున్నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ‘దర్దీ’ మీద ఒక్క సరైన రివ్యూ కూడా రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
editorial
18,569
11-02-2017 12:48:19
ఇమిగ్రేషన్‌పై త్వరలోనే కొత్త ఆదేశం: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా భద్రత, రక్షణ కోసం వచ్చే వారం చివరి నాటికి వలస విధానంపై కొత్త ఆదేశాన్ని తీసుకొస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. శుక్రవారం భార్య మెలానియాతో ఫ్లొరిడా వెళుతూ మీడియాతో మాట్లాడారు. దేశ భద్రతకోసం ఏడు దేశాల పౌరులను దేశంలోకి నిషేధిస్తూ తాము సరైన నిర్ణయమే తీసుకున్నామని తెలిపారు. నిషేధ కార్యనిర్వాహక ఆదేశాలను ఫెడరల్ కోర్టు నిలుపుదల చేయటాన్ని ప్రస్తావిస్తూ.. చట్టం ముందు కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీని నుంచి బయట పడటానికి తమ వద్ద ఇంకా చాలా దారులున్నాయని తెలిపారు. కొత్త వలస విధానంపై ప్రశ్నించగా.. దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని, అందుకే కొత్త పాలసీని తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. దేశానికి చాలా పెద్ద ముప్పు ఉందని, భద్రతకు అవసరమైన అన్ని విధానాలను పరిశీలిస్తామన్నారు.
nation
7,409
30-04-2017 23:33:19
మిలన్‌లో ‘రాధ’
శర్వానంద్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘రాధ’. బీవీయస్‌యన్‌ ప్రసాద్‌ సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై చంద్రమోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. భోగవల్లి బాపినీడు నిర్మాత. చిత్ర సమర్పకుడు బీవీయస్‌యన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘మా సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు, టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. ఇప్పటికే రెండు పాటలను మార్కెట్లోకి విడుదల చేశాం. ఇప్పుడు మిలన్‌ లో ఆఖరి పాట చిత్రీకరిస్తున్నాం. దీంతో నిర్మాణానంతర కార్యక్రమాలతో సహా సినిమా పూర్తవుతుంది. రథన్‌ సంగీతం హైలైట్‌ అవుతుంది. ఆడియో విడుదల కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహిస్తాం. మే 12న చిత్రాన్ని విడుదల చేస్తాం. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. దర్శకుడు చంద్రమోహన్‌కు ఇది తొలి సినిమా అయినా ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. రొమాన్స్‌, కామెడీ, యాక్షన్‌ సమపాళ్ళలో ఉంటుంది. క్లాస్‌ , మాస్‌ ప్రేక్షకులను అలరిస్తుంది. శర్వానంద్‌ కెరీర్‌లో రాధ మరో హిట్‌ సినిమా అవుతుంది’’ అని అన్నారు. లావణ్య త్రిపాఠి ఇందులో నాయిక.
entertainment
13,924
19-12-2017 04:24:38
ఆరంభంలోనే అదరగొట్టాం: కమల్‌నాథ్‌
అహ్మదాబాద్‌, సిమ్లా, డిసెంబరు 18: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆరంభంలోనే రాహుల్‌గాంధీ అదరగొట్టారని ఆ పార్టీ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ అన్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో ఓడినప్పటికీ గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించగలిగామని తెలిపారు. అదే సమయంలో బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గాయని గుర్తుచేశారు. రాహుల్‌ రాజకీయ చరిత్రలో ఇది ఆరంభం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.
nation
3,082
17-05-2017 00:06:03
ప్రభుత్వ బ్యాంకుల ‘బలవంతపు’ విలీనాలు
ఎన్‌పిఎలు, లాభాలే ప్రాతిపదిక..హిట్‌ లిస్టులో ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులు!ముంబై: దేశ బ్యాంకింగ్‌ రంగంలో కన్సాలిడేషన్‌ (పటిష్టీకరణ)కు రంగం సిద్ధమవుతోంది. మొండిబకాయిలు(ఎన్‌పిఎ), వరుస నష్టాలతో ఆర్థికంగా కుదేలవుతున్న ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎ్‌సబి)లను ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న ఇతర పిఎస్‌బిల్లో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల కట్టబెట్టిన అధికారాలతో ఆర్‌బిఐ ఇందుకోసం ఇప్పటికే ప్రాంప్ట్‌ కరెక్టివ్‌ యాక్షన్‌ (పిసిఎ) పేరుతో చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేని ఆరు పిఎ్‌సబిలను ఆర్‌బిఐ ఇప్పటికే గుర్తించింది. వీటిని ఆర్థికంగా బాగున్న ఏదో ఒక పిఎ్‌సబిలో లేదా పిఎ్‌సబిల్లో విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆర్‌బిఐ ఉన్నతాధికారులు గత వారం రోజులుగా ఇందుకోసం ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులతో పలు దఫాలు సమావేశమై వాటి ఆర్థిక పరిస్థితిపై చర్చించినట్టు సమాచారం. ఈ బలవంతపు విలీన ప్రయత్నాలు అమలుకు నోచుకుంటే ఈ బ్యాంకుల మేనేజ్‌మెంట్లపైనా వేటు పడినట్టేనని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదీ ప్రాతిపదికఒత్తిడిలో ఉన్న ఆస్తులు, మూలధనం పరిస్థితి, వరుస నష్టాలు, ఖర్చులు, భవిష్యత నిధుల అవసరాలపై ఆర్‌బిఐ అధికారులు గుచ్చిగుచ్చి అడుగుతున్నట్టు ఈ చర్చల్లో పాల్గొన్న కొన్ని బ్యాంకుల ఉన్నతాధికారులు చెప్పారు. ఈ ప్రమాణాల ప్రకారం చూస్తే ఐడిబిఐ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌తో పాటు దాదాపు 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి కష్టంగా ఉంది. దీంతో ముందుగా ఆర్థికంగా బాగా నీరసించిన పిఎ్‌సబిలను, పిసిఎ కింద గాడిలో పెట్టేందుకు వాటి రుణ వితరణ, శాఖల విస్తరణ, కొత్త నియామకాలపై ఆంక్షలు విధిస్తారు. ఈ ఆంక్షలతో ఖర్చులు తగ్గడంతో పాటు, వాటి రుణాల వసూళ్లూ పెరుగుతాయని ఆర్‌బిఐ అంచనా. వరు సగా రెండేళ్ల పాటు నష్టాలు, మొత్తం రుణాల్లో ఎన్‌పిఎలు ఆరు శాతం మించినా, సొంతంగా కనీస మూలధన అవసరాలు తీర్చుకోలేక పోయినా, అలాంటి పిఎ్‌సబిలకు పిసిఎ వర్తిస్తుందని ఆర్‌బిఐ గత నెలలో స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఆర్థిక ఫలితాలు ప్రకటించిన పిఎ్‌సబిలను పరిగణనలోకి తీసుకుంటే దేనా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ పరిధిలోకి వస్తాయి. ఈ రెండు బ్యాంకుల ఎన్‌పిఎలు ఆరు శాతం దాటడంతో పాటు, గత రెండేళ్లుగా నష్టాలు ప్రకటిస్తున్నాయి. జాబితాలో 15 బ్యాంకులుపిసిఎ కింద ఆర్‌బిఐ ప్రకటించిన ఎన్‌పిఎలనే పరిగణనలోకి తీసుకుంటే 15 పిఎ్‌సబిల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, దేనా బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ల ఎన్‌పిఎలు ఇప్పటికే ఆరు శాతం మించి పోయాయి. అయితే ఎన్‌పిఎల పరిస్థితి హద్దులు దాటినా, నిర్ణీత 10.25 శాతాని కంటే ఎక్కువ స్థాయిలో కనీస మూల ధన నిల్వలు ఉండడం, వరసపెట్టి లాభా లు సంపాదించడం వంటి కొన్ని సానుకూల చర్యలు తమను ‘బలవంతపు’ విలీనాల నుంచి బయటపడేస్తాయని కొన్ని పిఎ్‌సబిల మేనేజ్‌మెంట్‌లు భావిస్తున్నాయి.  లెక్కల్లో తేడాలు సమస్యేబ్యాంకింగ్‌ విశ్లేషకులు మాత్రం బ్యాంకులు చెప్పే మూల ధన నిల్వలు, లాభాల లెక్కల్లోనూ తిరకాసు ఉందని చెబుతున్నారు. వీటి అంచనా కోసం ఆర్‌బిఐ పాటించే లెక్కలకు, బ్యాంకులు పాటించే లెక్కలకు ప్రస్తుతం పొంతన లేదు. ఆర్‌బిఐ లెక్కల ప్రమాణాలు పాటిస్తే ఎన్‌పిఎల కోసం కేటాయించే మొత్తాన్ని పిఎ్‌సబిలు గణనీయంగా పెంచాల్సి ఉంటుంది. అదే జరిగితే పిఎ్‌సబిల లాభాలతో పాటు, వాటి మూలధన నిల్వలకూ భారీగా గండిపడుతుందని విశ్లేషకుల అంచనా. మొత్తం మీద పిసిఎ పేరుతో ఆర్‌బిఐ దేశంలో బ్యాంకింగ్‌ రంగ కన్సోలిడేషన్‌కు రంగం సిద్ధం చేస్తోంది. ప్రపంచ టెలికాం దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాషా్ట్రల్లో ప్రత్యేక డేటా రీచార్జ్‌ బొనాంజాను అందిస్తున్నట్లు టెలినార్‌ ఇండియా తెలిపింది. 57 రూపాయల స్పెషల్‌ టారిఫ్‌ వోచర్‌పై 17 వ తేదీన ఎలాంటి అదనపు వ్యయం లేకుండా 1జిబి.. 2జి డేటాను అందించనున్నట్లు టెలినార్‌ పేర్కొంది.
business
6,903
23-10-2017 12:18:11
ప్ర‌భాస్ క్రేజ్ చూస్తే షాకైపోవాల్సిందే!
యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌.. `బాహుబ‌లి` సినిమాతో ఒక్క‌సారిగా దేశ‌వ్యాప్తంగా సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ద‌క్షిణాదిన‌, ఉత్త‌రాదిన అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆమిర్‌ఖాన్‌, స‌ల్మాన్ కంటే కూడా ప్ర‌భాస్‌కే క్రేజ్ ఎక్కువ‌గా వుందంటే అతిశ‌యోక్తి కాదు. తాజాగా ప్ర‌భాస్ పుట్టిన రోజునాడు సోష‌ల్ మీడియా ద్వారా వెల్లువెత్తిన‌ సందేశాలే దీనికి నిద‌ర్శ‌నం. ప్ర‌భాస్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ నెటిజ‌న్లు ట్విట‌ర్‌ను హోరెత్తించారు. కేవ‌లం ప‌న్నెండు గంట‌ల్లోనే రెండు మిలియ‌న్ల సందేశాలు వ‌చ్చాయి. ఈ రేంజ్‌లో బ‌ర్త్‌డే విషెస్ రావ‌డ‌మంటే మాట‌లు కాదు. ఆ సందేశాల వెల్లువ ఇప్ప‌టికీ ఆగ‌లేదు.
entertainment
8,866
22-04-2017 23:29:42
బాక్సాఫీస్‌ రాముడు
1970ల తొలినాళ్ళలో ఎన్టీయార్‌ మీద ప్రత్యేక సంచిక వేస్తున్న ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ అప్పట్లో బి.ఎన్‌.రెడ్డి ఈ మాటలు అన్నారు. ఆ తరువాత కొన్నేళ్ళకు...ఎన్టీయార్‌కు అయిదున్నర పదుల ఏళ్ళు మీద పడ్డాయి. కెరీర్‌ జోరుగా సాగుతున్నా... ఎక్కడో చిన్న స్తబ్ధత. నవరసాల్లో ఏదైనా పండించగల అభినయ ప్రతిభ... అపారమైన మాస్‌ ఇమేజ్‌ ఉన్న ఒక స్టార్‌ హీరో ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? ఏది ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు? సరిగ్గా అదే టైమ్‌లో కేవలం మూడే సినిమాల అనుభవమున్న ఒక యువ దర్శకుడికి ఎన్టీయార్‌ సినిమా చేసే అరుదైన ఛాన్స్‌... ఇంకా చెప్పాలంటే అదృష్టం తలుపు తట్టింది. అంతే... అప్పటికి సరైన హిట్లు కూడా లేని ఆ యువకుడు బోలెడంత హోమ్‌ వర్క్‌ చేశాడు. ఒక స్టార్‌ హీరోకు ఎలాంటి కథ, కథనం, వాణిజ్య అంశాలున్న సినిమా అయితే కరెక్టో కసరత్తు చేశాడు. సినిమా నేపథ్యం నుంచి ఆట, పాట, డ్రెస్సులు అన్నీ మార్చాడు. ఎన్టీయార్‌ కూడా గిరి దాటి, బాక్సాఫీస్‌ బరిలో గర్జించారు.అంతే... ఏ థియేటర్‌ దగ్గర చూసినా కిటకిటలాడే జనం. ఆగకుండా వేస్తున్న షోలు వేస్తూనే ఉన్నారు... చూస్తున్న జనం చూస్తూనే ఉన్నారు... టికెట్లు దొరక్క అంతకు అంతమంది జనం వెనక్కి వెళుతూనే ఉన్నారు. టికెట్ల కోసం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నారు.వంద రోజులు... రెండొందలు... మూడొందలు... ఏకంగా ఏడాది ఆడిందా సినిమా.వెరసి... వసూళ్ళ సునామీ.... బాక్సాఫీస్‌ దగ్గర ఒక కొత్త చరిత్ర... హీరోగా ఎన్టీయార్‌ మాస్‌ ఇమేజ్‌కు మరో సరికొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం... అప్పటి ఆ యంగ్‌ డైరెక్టర్‌.... కె.రాఘవేంద్రరావు... కట్‌ చేస్తే... ఇప్పుడు ఆ సినిమాకు నాలుగు దశాబ్దాలు నిండాయి. అయినా సరే ఆరు పాటలు, అయిదు ఫైట్లు... మాస్‌ మెచ్చే వినోదం... స్టార్‌ హోదాను పెంచే చిత్రీకరణ... ఇలా కమర్షియల్‌ ఫార్ములాలన్నిటికీ ఇవాళ్టికీ ఆ సినిమాయే ఓ పెద్ద బాలశిక్ష.  పాట... ఫైటు... ఇంటర్వెల్‌ లాక్‌... బ్లాస్టింగ్‌, ఫైట్స్‌తో యాక్షన క్లైమాక్స్‌... ఇలా ఆ సినిమా రీలు రీలుకీ వేసిన కొలతల గీతలు దాటి రావడం నాలుగు దశాబ్దాలు గడిచినా తెలుగు సినిమా వల్ల కావడం లేదు. తెలుగు సినిమా బాక్సాఫీస్‌ గరిష్ఠ వసూళ్ళను తొలిసారిగా నాలుగింతలు చేసి, నాలుగు కోట్ల మార్కు తాకిందా సినిమా. మంచికో, చెడుకో తెలుగు సినిమా గ్రామర్‌నే మార్చేసింది.
entertainment
1,292
04-03-2017 22:58:12
జూలై 1 నుంచి జిఎస్‌టి
 40 శాతం పన్నుకు వీలు  రైతులు, చిరు వ్యాపారులకు ఊరట  రియల్టీని జిఎస్‌టిలోకి తేవాలి  చిన్న హోటళ్లపైనా పన్ను పోటు
business
3,032
15-12-2017 01:20:08
నాట్కో రూ.915 కోట్ల సమీకరణ
 6 శాతం లాభపడిన షేరుహైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : క్వాలిఫైడ్‌ సంస్థాగత ఇన్వెస్టర్లకు సెక్యూరిటీల జారీ ద్వారా 915 కోట్ల రూపాయలు సమీకరించినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. గురువారం నాడు సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల కమిటీ ఒక్కో షేరును 915 రూపాయల ఇష్యూ ధరతో కోటి షేర్లను కేటాయించాలని నిర్ణయించింది. క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యుఐపి) రూపంలో క్వాలిఫైడ్‌ సంస్థాగత కొనుగోలుదారులకు ఈ షేర్లను కేటాయించనున్నట్లు నాట్కో తెలిపింది. క్యుఐపి ద్వారా సమీకరించిన మొత్తాలను దేనికి కేటాయించనుందనేది మాత్రం నాట్కో వెల్లడించలేదు. కాగా క్యుఐపి రూపంలో నిధులను సమీకరించనున్నట్లు ఈ నెల 11న ప్రకటించనప్పటి నుంచి నాట్కో షేరు దూసుకుపోతోంది.  వరుసగా నాలుగు సెషన్లలో షేరు 10 శాతానికి పైగా లాభపడింది. గురువారం నాడు బిఎ్‌సఇలో నాట్కో షేరు 6.08 శాతం లాభంతో 1020.85 రూపాయల వద్ద స్థిరపడింది. కాగా క్యుఐపి, గ్లోబల్‌ డిపాజిటరీ రిసీట్స్‌ (జిడిఆర్‌), అమెరికన్‌ డిపాజిటరీ రిసీట్స్‌ (ఎడిఆర్‌) ఫారిన్‌ కన్వర్టబులిటీ బాండ్స్‌, ఫుల్లీ కన్వర్టబులిటీ/పాక్షిక కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా 1,500 ోట్ల రూపాయలు సమీకరించేందుకు నవంబరు 2న జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నాట్కో ఫార్మా ఆమోదం తెలిపింది.  సమీకరించిన మొత్తాలను మూలధన వ్యయాల కోసం వినియోగించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులోభాగంగానే 600 కోట్ల రూపాయలను తెలంగాణలోని కొత్తూరు, మేకగూడ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సెజ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీ, చెన్నైలోని ఉత్పత్తి కేంద్రాల్లో భవనాలు, ఇతర సివిల్‌ పనులు, ప్లాంట్‌, పరికరాల కోసం వెచ్చించాలని నాట్కో భావిస్తోంది.
business
4,279
03-08-2017 01:37:32
‘మూఢ నమ్మకాల’ చట్టం ఎప్పుడు?
మూఢ నమ్మకాల నిర్మూలనా చట్టం అంటూ కేంద్ర ప్రకటించడం సంతోషం. ఆ వెంటనే మేమూ రడీ అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం చకాచకా జరిగిపోయింది. కానీ, నెలలు గుడుస్తున్నా మళ్లీ ఆ ఊసు ఎత్తకపోవడంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే మతతత్వ ముద్ర పడిన బీజేపీ ప్రభుత్వం, యజ్ఞ యాగాదులతోనే అన్ని విజయాలు సాధించాలని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల గతాన్ని పరిశీలిస్తే ఇవి వట్టి ప్రకటనలుగానే మిగిలిపోతాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఒక వైపు అంతరిక్షానికి రాకెట్‌ ప్రయోగాలు చేస్తూ ప్రపంచంలోనే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకువెళుతూనే, ఆ ప్రయోగాలు విజయవంతం కావాలని దేవుళ్ళు, దేవతలకు మన శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థలు అధికారికంగా మొక్కులు చెల్లిస్తుండడం దురదృష్టకరం. ఎలా చేస్తే ఏమి? ప్రయోగాలు విజయవంతమయ్యాయి కదా అని వాదించే వారికి కొదవలేదు. కానీ దీనివల్ల మూఢనమ్మకాలు సమాజంలో రెండింతలై ప్రగతి కుంటుపడడమే కాక, మూఢ భక్తి, నమ్మకాల పేరున అనేక అన్యాయాలు, అక్రమాలు, అకృత్యాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. గుప్తనిధుల కోసం అక్కడక్కడా నరబలులు చోటుచేసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన వర్గాలు చేతబడి, బాణామతి పేరున అమాయకులెంతోమంది బలైపోతున్నారు. మూఢనమ్మకాలు, ఆచారాలు, క్షుద్రపూజలను నమ్మవద్దన్నందుకు మహారాష్ట్రలో నరేంద్ర దభోల్కర్‌ను, గోవింద పన్సారేను హత మార్చారు.  మూఢనమ్మకాలు, మత మూఢ త్వం పెరిగిపోతున్న నేపథ్యంలో మూఢ నమ్మకాల నిర్మూలనా చట్టం ఎంతో అవసరమని కేంద్రం, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ఆస్తికవాద, హేతువాద, నాస్తిక, భౌతికవాద సంఘాలు, వ్యక్తులతో జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి.- కన్నెబోయిన అంజయ్యహేతువాద సంఘం, ఖమ్మం జిల్లా
editorial
5,903
03-11-2017 23:34:44
లెట్స్‌ రాక్‌ రామూ
నాగార్జున, రాంగోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ‘‘వర్మ దర్శకత్వంలో పోలీస్‌ డ్రామా కథాంశంతో స్టైలిష్‌ యాక్షన్‌తో రాబోతున్న సినిమా కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా’’ అని శుక్రవారం ట్విట్టర్‌లో రాసుకొచ్చారు నాగ్‌. ఆ ట్వీట్‌ చేసిన నాలుగు గంటల తేడాతో నాగార్జున మరో ట్వీట్‌ చేశారు. ‘‘1988లో వర్మతో ‘శివ’ సినిమా అంగీకరించినప్పుడు చాలామంది షాక్‌ అయ్యారు. వారి అంచనాలు తప్పని రామూ నిరూపించాడు. మళ్లీ 2017లో రామూతో సినిమా అనగాన కొందరు హ్యాపీగా ఉంటే మరికొందరు అదే షాక్‌లో ఉన్నారు. లెట్స్‌ రాక్‌ రామూ’’ అని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌ను వర్మ స్ర్కీన్‌షాట్‌ తీసి తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసి ‘‘హే నాగ్‌ మీరెప్పుడూ తక్కువ మాట్లాడుతుంటారు. నేను ఎక్కువగా మాట్లాడుతుంటా. ఇప్పుడు మనిద్దరి భిన్న స్వభావాలతో రాక్‌ చేద్దాం’’ అని వర్మ ట్వీటారు. ఈ నెల 20న ప్రారంభంకానున్న ఈ సినిమాకు వర్మ ఆయన తల్లితో క్లాప్‌ కొట్టిస్తానని అంటున్నారు. అందుకు కారణాన్ని కూడా ఎఫ్‌బీలో రాశారు. చిన్నప్పుడు తను ఎందుకూ పనికిరాడని వర్మ తల్లి అనుకునేవారట. ఇప్పుడు ఆయన సక్స్‌సఫుల్‌ దర్శకుడు కాబట్టి నాగ్‌ సినిమాకు అమ్మతో క్లాప్‌ కొట్టించి పగ తీర్చుకుంటాననీ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా చిన్నప్పుడు తన తల్లితో దిగిన ఫొటోని ఆయన షేర్‌ చేశారు.
entertainment
9,748
10-08-2017 17:43:47
కళ్ళుచెదిరే ధరకు 2.0 తెలుగు హక్కులు
రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రోబో సినిమాకు సీక్వల్ గా '2.0' తెరకెక్కుతోంది. రాజుమహాలింగం నిర్మాతగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీబడ్జెట్‌తో ఈసినిమా నిర్మాణపనులు జరుగుతున్నాయి. అయితే ఈసినిమా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ హక్కులు కళ్ళుచెదిరే ధరకు అమ్ముడుపోయాయని నిర్మాత రాజుమహాలింగం తెలిపాడు. డిస్ట్రిబ్యూటర్‌లతో కలిసి దిగిన ఫోటోలను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ ఈవిషయాన్ని తెలిపాడు. 'లైకా ప్రొడక్షన్స్ గ్లోబల్ సినిమా భాగస్వామ్యంలో చరిత్ర సృష్టిస్తాం..' అని రాసి పోస్ట్ పెట్టాడు.ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. వచ్చేఏడాది సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
entertainment
19,976
02-01-2017 09:51:45
ఆ క్యాచ్ లు అలా పట్టేశా : ఎమ్మెస్కే ప్రసాద్‌
గుంటూరు : మేడికొండూరులో పుట్టి పెరిగి గుంటూరు నగరంలో బ్యాట్‌, కీపింగ్‌ గ్లౌస్‌ చేతబట్టి క్రికెట్‌లో ఓనమాలు దిద్ది అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా భారత జట్టుని ఎంపికచేసే సెలక్షన్ కమిటీకి చైర్మన్ అయ్యారు ఎమ్మెస్కే ప్రసాద్‌. తెలుగు రాష్ఠ్రాల నుంచి ఇంతటి అత్యున్నతస్థాయికి ఎదిగిన తొలివ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. తెలుగుజాతి గర్వపడేలా చేసిన ఎమ్మెస్కే టెస్టు, వన్డే, టీ 20 ఫార్మాట్లలో టీం ఇండియాని నంబర్‌ వన స్థానంలో నిలపడమే తన ముందున్న లక్ష్యాలుగా చెబుతారు. ప్రతిష్టాత్మకమైన పదవిని చేపట్టినప్పటికీ తనకు గుర్తింపు తీసుకొచ్చిన ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషనను మరిచిపోకుండా ఎప్పుడు ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా బిజీషెడ్యూల్‌లోనూ తీరిక చేసుకొని వచ్చి భావి క్రికెటర్లలో ఉత్తేజాన్ని నింపుతున్న ఎమ్మెస్కే తానీస్థాయికి చేరేందుకు దాటిన మలుపులను ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు. ప్రతీ ఆటగాడు కలలు కనాలని, ఆ కలలు సాకారమయ్యేవరకు కష్టపడాలంటున్న ఎమ్మెస్కే ఇంకా ఏమేంచెప్పారంటే..మాది గుంటూరు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడికొండూరు గ్రామం. నాన్న రవిప్రసాద్‌ గుంటూరులోని కేంద్రప్రభుత్వ రంగసంస్థ లేబొరేటరీలో పనిచేసేవారు. నాకు ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. మా ఊళ్లో ప్రతీ మూడిళ్లలో ఒక డాక్టరో, ఇంజనీరో ఉండేవారు. అలానే నా సోదరుడు ఇంజనీర్‌ కాగా, సోదరి డాక్టర్‌. నా ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరు లోని కేంద్రీయ విద్యాలయలో పూర్తయింది. గ్రాడ్యుయేషన్ హిందూ కళాశాలలో చేశా. పాఠశాల దశలోనే క్రికెట్‌పై ఆసక్తి కలిగింది. ఇంట్లో కూడా ప్రోత్సాహం లభించడంతో గుంటూరు వచ్చి పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో గంటల తరబడి ప్రాక్టీసు చేసేవాడిని. వికెట్‌ కీపింగ్‌ నాకు సహజసిద్ధంగానే అబ్బింది. గుంటూరులో జరిగిన కోచింగ్‌ క్యాంపునకు తొలిరో జు వెళ్లినప్పుడు సెలెక్షన్సుకు 200 మంది పిల్లలు వచ్చా రు. అందులో వికెట్‌కీపర్‌ నేనొక్కడినే. ఆ రోజున కోచ్ నాకు కష్టమైన క్యాచ్ లు ఇస్తుండగా వాటన్నింటినీ ఆరితేరినవాడిలా ఒడిసిపట్టుకొన్నాను. ఆరోజు నుంచి నాకోచ్ పూర్ణచంద్రరావు వికెట్‌ కీపింగ్‌లో సానపెట్టారు. దాంతో మూడు నెలల్లోనే ఆంధ్ర రంజీ జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఇంటర్‌ జోనల్‌ మ్యాచ్ లు ఆడే రోజుల్లో గౌరవ కార్యదర్శి ఎన.వెంకటరామ్‌ నా ఆటతీరుచూసి ఈ కుర్రాడు ఏరోజుకైనా భారత క్రికెట్‌ జట్టులో చోటు సంపాదిస్తాడన్నారు. అందరి ప్రోత్సాహంతో... నా కోచ్ తోపాటు స్నేహితులు, కుటుంబసభ్యులంతా ప్రోత్సాహం అందించడంతో క్రికెట్‌లో ఉన్నతశిఖరాలకు చేరుకోవడానికి బాగా కష్టపడ్డా. నేను, ఫాస్టుబౌలర్‌ అజిత అగార్కర్‌ పాకిస్థాన్ ఏ టూర్‌ నుంచి దేశానికి వచ్చాం. ఆ వెంటనే ముక్కోణపు సిరీస్‌కు అగార్కర్‌ ఎంపికయ్యాడు. నాకు కూడా పిలుపు వస్తుందని ఎదురు చూశా. ఊహించినట్లుగానే 1998లో వికెట్‌కీపర్‌ నయన మోంగియా గాయపడటంతో భారతజట్టులో ఆడే అవకాశం లభించింది. కోకాకోలా ముక్కోణపు సిరీస్‌లో మొహాలీ క్రికెట్‌ గ్రౌండ్‌లో బంగ్లాదేశపై వన్డే మ్యాచతో నా అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం ప్రారంభమైంది. అది నా జీవితంలో మరిచిపోలేని రోజు. అంతకుముందు ఇండియా-ఏ తరపున ఐదువిదేశీ టూర్లలో పాల్గొన్నప్పటికీ తొలివన్డే మ్యాచ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఆ మ్యాచలో ఎక్కడా ఒత్తిడికి గురికాలేదు. అంతర్జాతీయ వేదికపై మనం ఆడుతోంది ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తోనా బంగ్లాదేశతోనా అన్న వ్యత్యాసం ఉండదు. గట్టి ప్రత్యర్థులైతే చిన్నదేశాలతో పోల్చితే కొంచెంకష్టంగా ఉంటుంది. నా టెస్టు కెరీర్‌ ప్రస్థానం న్యూజిల్యాండ్‌తో ప్రారంభ మైంది. ఆ మ్యాచ్ లో భారతజట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 83పరుగులకే కుప్పకూలింది. నేను ఆ రోజున ఏడో నెంబర్‌ బ్యాట్స్‌మెనగా క్రీజులోకి వెళ్లా. అప్పటికే 43పరుగులకు ఆరువికెట్లు కోల్పోయింది. నా ఆరాధ్య క్రికెటర్‌ సచిన టెండుల్కర్‌ క్రీజ్‌లో ఉన్నారు. ఆయన మ్యాచ్ లో పరిస్థితి ఎలా చూస్తున్నావని ప్ర శ్నించారు. నేను ఒక్కటే సమాధానం చెప్పా. రోజం తా వికెట్ల ఎదుట పాతుకు పోయేందుకు ప్రయత్నిస్తానన్నా. ఆ జవాబు నా నుంచి వచ్చినందుకు సచిన్ సంతోషపడ్డారు. అయితే కొ ద్దిసేపటికే సచిన అవుట్‌కాగా ఆ తర్వాత శ్రీనాథ్‌, టెయిల్‌ ఎండర్లు క్యూకట్టారు. దాంతో 16 పరుగులతో నాటౌట్‌గా మిగిలిపోయా. నేను తొలిటెస్టు ఆడకముందే ఇండియా సిమెంట్స్‌లో పనిచేస్తున్నా. దాంతో తమిళనాడుకు చెందిన రంజీబౌలర్లు దేవానంద్‌, గోపీకృష్ణన్ బౌలింగ్‌లో కీపింగ్‌చేసిన అనుభవం ఉంది. ప్రపంచస్థాయి బౌలర్లు అనిల్‌కుంబ్లే, జవగళ్‌ శ్రీనాథ్‌, హర్భజన్ సింగ్‌ లాంటి బౌలర్లకు కీపింగ్‌చేయలేదు. స్పిన్ తిరిగే పిచలపై బంతిని గింగరాలు తిప్పడంతోపాటు అధికబౌన్స రాబట్టేందుకు కుంబ్లే, హర్భజన్ ప్రయత్నిస్తారు. కుంబ్లే కంటే హర్భజన్ కు కీపింగ్‌ చేయడం చాలా కష్టం. అప్పట్లో బంతి భారీగా బౌన్స అవుతుండటంతో నేను తొలిసారిగా కీపింగ్‌ చేస్తూ హెల్మెట్‌ ధరించాను. అప్పట్లో కీపర్లు హెల్మెట్లు ధరించేవారు కాదు. ఒకసారి సచిన ఈ విషయంలో నన్ను ప్రశ్నించగా కొన్ని సందర్భాల్లో మన తల కంటే ఎక్కువ ఎత్తులో స్పిన్నర్‌ వేసిన బాల్‌ బౌన్సు అవుతుందని చెప్పా. నేడు కీపర్లంతా హెల్మెట్లు వాడుతున్నారు.  నైరోబీలో జరిగిన ఆ టోర్నమెంట్‌లో ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా 235 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్యఛేదనలో నన్ను నాల్గో నం బర్‌ బ్యాట్స్‌మెనగా ప్రమోట్‌చేశారు. నేనుఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీ దాటించా. అలవోకగా షాట్‌లు కొడుతూ లక్ష్యం వైపు వెళుతుండగా ఒక్కసారిగా కండరాలు పట్టేశాయి. అప్పటికి నేను 63పరుగులు చేశా. తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచనుంచి రిటైర్‌ హర్ట్‌ కావాల్సి వచ్చింది. చివరికి మళ్లీ బ్యాటింగ్‌కు రాగా ఆఖరి ఓవర్‌లో 12పరుగులు కొట్టాలి. నాకు బైరన్నర్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ వచ్చారు. ఫస్టు బాల్‌ని నేను బాదగా రెండో పరుగు తీసే క్రమంలో రనౌట్‌ కావడంతో మ్యాచ ఓడిపోయాం.  వెస్టిండిస్‌లోని టొరాంటోలో జరిగిన మ్యాచ్ లో ఆ దేశ దిగ్గజ బ్యా ట్స్‌మెచ్ బ్రియాన్ లారా క్యాచ్ ని ఎడమ పక్కకు డైవింగ్‌ చేస్తూ ప ట్టుకొన్నది నా కెరీర్‌లో మరిచిపోలేనిది. అది కళ్లుచెదిరిపోయే క్యాచ్ గా కా మెంటేటర్లు అభివర్ణించారు. నేను పట్టుకొన్న క్యాచ్ ల్లో అదే టాప్‌. ఆస్ట్రేలియా టూ ర్‌కు వెళ్లేటప్పుడు కౌలాలంపూర్‌లో లగేజ్‌ తీసు కుని వెళుతుండగా అది నా మోకాలుకు కొట్టు కొన్నది. దానిని నేను తేలికగా తీసుకున్నా. తీరా ఆసే్ట్రలియా వెళ్లాక చూస్తే నడవలేని పరిస్థితి. బాగా వాపు రావడంతో జట్టు ఫిజియో నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. దాంతో నయన మోంగియాను అప్పటికప్పుడు పిలిపిం చారు. ఆ తర్వాత వన్డే జట్టులో నేను ఉంటానని ఆశించా. అయితే నన్ను టీం నుంచి తొలగించి నట్లుగా కెప్టెన్ చెప్పడంతో షాక్‌కు గురయ్యా.ఏసీఏతో అవినాభావ సంబంధంటెస్టు టీంలో స్థానం కోల్పోయిన తర్వాత ఐదేళ్లపాటు ఆంధ్రా రంజీ జట్టులో ఆడా. మళ్లీ జట్టులో స్థానం పొందుతానని ఆశించారు. నాతోపాటు మరో ఇద్దరికి కూడా చోటు లభిస్తుందనుకున్నారు. ఆ అవకాశం రాకపోవడంతో 33 ఏళ్ల వయస్సులోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాశా. ఆ వెంటనే ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్ (ఏసీఏ)లో కీలక పదవులు చేపట్టా. జాగర్లమూడి నరేంద్రనాథ్‌ సహకారంతో జేకేసీ కళాశాలలో ఆంధ్రా ఉమెన్సు క్రికెట్‌ అసోసియేషన్ స్థాపించా. ఇక్కడే కోచింగ్‌ క్యాంపు ప్రారంభింపచేశారు. నా ఆలోచనలకు రూపుఇచ్చారు. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ జేకేసీ కళాశాల గ్రౌండ్స్‌ని సందర్శించి ఇదొక రోల్‌మోడల్‌ అని కితాబిచ్చారంటే దానివెనక ఎమ్మెస్కే కఠోరశ్రమ ఎంతవుందో అంచనా వేయొచ్చు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజుతో సాన్నిహిత్యం పెరిగింది. రికీ భుయ్‌ వంటి వర్థమాన క్రికెటర్లను వెలుగులోకి తెచ్చా. గంగరాజుతో సాన్నిహిత్యం మేలు చేసింది. సెలెక్షన కమిటీ చైర్మన్ పదవికి ముందే సెలెక్టర్‌గా ఎంపికయ్యా. ఏదో ఒక రోజు సెలెక్షన్ కమిటీ చైర్మన పదవి వస్తుందని ఆశించారు. అయితే నా కంటే సీనియర్‌ క్రికెటర్లు ఉన్నప్పటికీ గతేడాది సెప్టెంబర్‌లో నన్ను బీసీసీఐ సెలెక్షన కమిటీ చైర్మన్ గా నియమించింది. ఈ పదవిని ముందే ఊహించానని, ఎమ్మెస్కే క్రికెటర్‌గా భారత జట్టులోకి వచ్చి ఇప్పుడీ స్థాయికి ఎదగడం ఎంతో సంతోషంగా ఉంది. పదవితోపాటు కొన్ని బాధ్యతలు కూడా వస్తాయి. ఇది సవాలుతో కూడిన పని. వేలాదిమంది కలలను సాకారం చేసే పదవి ఇది. ఏసీఏలో ఏవిధంగా అయితే కష్టపడి ఒకస్థాయికి వచ్చానో అదే విధంగా భారతకు మంచి జట్టును అందించడంలో తోడ్పాటునందిస్తా. జాతీయ సీనియర్‌ సెలక్షన్ కమిటీకి తెలుగువాడు చైర్మన్ గా ఉండటం తెలుగురాష్ట్రాల క్రికెటర్లలో స్ఫూర్తిని నింపేదే. బాగా ఆడితే మనకు అవకాశం లభిస్తుందన్న నమ్మకం వారిలో పెరుగుతుంది. రెండు రాష్ట్రాల్లోని క్రికెటర్లు కష్టపడుతూ బాగా ఆడితే తప్పకుండా న్యాయం జరుగుతుంది. మన దగ్గర ప్రతిభావంతులకు కొదవలేదు. అలాంటివాళ్లకు నేను చెప్పేదొక్కటే. ప్రతిభను నమ్ముకుంటే తప్పక ఫలితం ఉంటుందని. పూర్తి పేరు : మన్నవ శ్రీ కాంత్ ప్రసాద్‌
sports
2,491
16-06-2017 00:46:03
విమానయానం సిద్ధంగా లేదు..
జిఎస్టి వాయిదాకు వినతివిమానయాన రంగం జిఎస్టికి సిద్ధంగా లేదని అందువల్ల అమలును మరో రెండు నెలలు వాయిదా వేయాలన పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. జిఎస్టికి అనుగుణంగా ఇప్పుడున్న వ్యవస్థను మార్చుకునేందుకు ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు సమయం పడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటి నుంచి జిఎ్‌సటి అమల్లోకి తెచ్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సన్నాహాలు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఇప్పుడు జిఎస్టి సందడి తప్ప మరొకటి కనిపించడంలేదు. అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రతినిత్యం ప్రభుత్వ పరంగా, ప్రైవేట్‌ సంస్థల సారధ్యంలో జిఎస్టిపై సదస్సులు, సమావేశాలు, వర్క్‌షాప్ లు జరుగుతున్నాయి. జిఎస్‌టి వాయిదా సమస్యే లేదని పుకార్లను నమ్మవద్దని ఆర్థిక శాఖ పలుమార్లు ప్రకటించింది కూడా. పైగా అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్‌ సంస్థలు జిఎస్టికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆఖరు క్షణంలో తాము సిద్ధంగా లేమంటూ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ప్రకటించడం గమనార్హం. జిఎస్టిలోని కొన్ని అంశాలపై ఎయిర్‌ఇండియాతో సహా పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.
business
12,109
04-05-2017 17:24:57
పాక్ పైశాచికంపై.. వినూత్న నిరసన
ఆనంద్: సరిహద్దులో భారత జవాన్ల శరీరాలను ఛిద్రం చేసిన పాకిస్థాన్ ఆర్మీ పైశాచికత్వంపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. గుజరాత్‌లోని ఆనంద్‌లో కొందరు వినూత్నంగా నిరసన తెలిపారు.  ఓ రోడ్డుపై రంగులతో పాకిస్థాన్ జెండా వేశారు. ఆ తర్వాత దానిపై నుల్చొని, తొక్కుతూ పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు. భారత్ జెండాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే దీనిపై స్పందించిన పోలీసులు పాక్ జెండా పెయింటింగ్‌ను చెరిపేశారు. స్థానికులపై కేసులు కూడా నమోదు చేశారు.
nation
13,029
28-10-2017 12:10:44
జయ వేలిముద్ర వివాదం
హైకోర్టులో డాక్టర్‌ సాక్ష్యంచెన్నై: తిరుప్పరంకుండ్రం ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి బిఫామ్‌లో ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో వేసిన వేలిముద్రకు సాక్షిగా వ్యవహరించిన ప్రభుత్వ డాక్టర్‌ బాలాజీ హైకోర్టులో శుక్రవారం జరిగిన విచారణకు హాజరయ్యారు. తిరుప్పరంకుండ్రం ఎన్నికల్లో పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి డాక్టర్‌ శరవణన్‌ ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి ఏకే బోస్‌ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు జయలలిత బిఫామ్‌పై వేలిముద్రను స్పృహలో ఉన్నప్పుడు వేసారా లేదా అనే అనుమానం కలుగుతోందని పిటిషనర్‌ ఆరోపించారు. జయలలిత చికిత్సకు సంబంధించిన అన్ని పత్రాలను సైతం కోర్టులో సమర్పించేలా ఉత్తర్వులివ్వాలని కూడా పిటిషనర్‌ కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ నెల 13న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్‌ సెక్రటరీ విల్‌ఫోర్డ్‌ సాక్ష్యాన్ని నమోదు చేశారు. పార్టీ ప్రిసీడియం చేర్మన్‌ మధుసూదనన్‌ జయ వేలిముద్రలున్న బిఫామ్‌ను అంగీకరించమంటూ చేసిన సిఫారస్సు పరిగణనలోకి తీసుకునే అన్నాడీఎంకే అభ్యర్థికి గుర్తును కేటాయించినట్లు ఆయన పేర్కొన్నా రు. ఇక జయ వేలిముద్ర వేసినప్పుడు సాక్షిగా వ్యవహరించిన ఆ బిఫామ్‌పై సంతకం చేసిన ప్రభుత్వ వైద్యుడు బాలాజీ శుక్రవారం కోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే డాక్టర్‌ బాలాజీ ఇచ్చిన సమాధానాలు, ఇతర వివరాలను ప్రసారమాధ్యమాల్లో ప్రచురించకూడదని కోర్టు ఆంక్షలు విధించింది.
nation
254
09-03-2017 23:46:49
ఆస్తుల జాబితా నిజమేనా ?
న్యూఢిల్లీ : మీ ఆస్తుల వివరాలన్నీ న్యాయస్థానానికి సత్య ప్రమాణంగా వెల్లడించారా? కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి 4 కోట్ల డాలర్లను మీ పిల్లలకు బదిలీ చేసినమాట నిజమేనా? బ్యాంకు రుణాల ఎగవేత కేసులో లిక్కర్‌ కింగ్‌ మాల్యాకు అత్యున్నత న్యాయస్థానం గురువారం నాడు సంధించిన ప్రశ్నలివి. తన చేతిలో బ్యాంకులకు చెల్లించేందుకు పైసా కూడా లేదని ప్రకటించిన మాల్యాను జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌, జస్టిస్‌ యుయు లలితతో కూడిన ధర్మాసనం తీవ్రంగా నిలదీసింది. మాల్యాపై దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఉన్న కేసులన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేసే ప్రతిపాదన కూడా న్యాయమూర్తులు ముం దుకు తెచ్చారు. బ్యాంకుల తరఫు న్యాయవాదులను కూడా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. తీవ్రస్థాయిలో సుదీర్ఘంగా జరిగిన వాదోపవాదాల సందర్భంగా మాల్యా తరఫు న్యాయవాది కూడా కోర్టుపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే మాల్యా తరఫు న్యాయవాది వైద్యనాధన్‌ మాత్రం, తన క్లయింటు కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తే అక్కడే కోర్టు ధిక్కారణ కేసు నమోదుచేయాలని వాదించారు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కారణ అభియోగం చేపడితే తన క్లయింటుకు అప్పీల్‌ చేసుకునే హక్కు లేకుండా పోతుందని పేర్కొన్నారు. వ్యాపారంలో వచ్చిన నష్టాలకు తన క్లయింటును టార్గెట్‌ చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. దేశంలో 7 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల ఎగవేతలుండగా కేవలం మాల్యా వెనక బడటం ఏమిటని ప్రశ్నించారు. మాల్యాను టెర్రిరిస్టు కంటే దారుణంగా ట్రీట్‌ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
business
2,438
01-12-2017 01:00:06
ద్రవ్య లోటు భయాలతో సెన్సెక్స్‌ ఢమాల్‌
 సెన్సెక్స్‌ 453 పాయింట్ల పతనం రూ.1.06 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లుముంబై : స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 453.41 పాయింట్ల నష్టంతో 33149 వద్ద, 134.75 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 10226 వద్ద ముగిశాయి. గత ఏడాది కాలంలో సెన్సెక్స్‌, నిఫ్టీ ఇంత భారీగా నష్టపోవడం ఇదే మొదటిసారి. బ్యాంకింగ్‌, ఎనర్జీ, మెటల్‌, పిఎస్‌ యు, ఆటో, ఐటి, పవర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, టెక్నాలజీ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. రియల్టీ, కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ కంపెనీల షేర్లు మాత్రమే కొద్దిపాటి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ షేర్లలో డాక్టర్‌ రెడ్డీస్‌, ఎన్‌టిపిసి లాభాలతో క్లోజయ్యాయి. నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 10300 దిగువకు రావడంతో మరింత ఒత్తిడి తప్పక పోవచ్చని టెక్నికల్‌ అనలిస్టుల అంచనా. గురువారంనాటి పతనం తో రూ.1.06 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచి పెట్టుకుపోయింది. స్టాక్‌ మార్కెట్‌ పతనానికి కారణమేమంటే.. ద్రవ్య లోటు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లోనే ద్రవ్య లోటు బడ్జెట్‌లో నిర్ణయించిన లక్ష్యంలో 96 శాతానికి చేరడం మార్కెట్‌ను భయపెడుతోంది. గత ఏడాది ఇదే సమయంలో ఇది 91.3 శాతం మాత్రమే. దీంతో ఈ సంవత్సరం ద్రవ్య లోటును జిడిపిలో 3.2 శాతం వద్ద కట్టడి చేయాలన్న ప్రఽభుత్వ లక్ష్యం సాధ్యంకాకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.జిడిపి అంచనాలు గురువారం మార్కెట్‌ ట్రేడింగ్‌ ముగిశాక వెలువడనున్న రెండో త్రైమాసిక జిడిపి గణాంకాలూ మార్కెట్‌ గమనాన్ని ప్రభావితం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక జిడిపి వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రెండో త్రైమాసిక జిడిపి గణాంకాలు ఎలా ఉంటాయోనని మార్కెట్‌వర్గాలు ఆచితూచి వ్యవహరించాయి. ఎఫ్‌ అండ్‌ ఒ సెటిల్‌మెంట్‌ నవంబరు నెల ఆఖరి గురువారంకావడంతో చాలా మంది ఆపరేటర్లు ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఒ) సెగ్మెంట్‌లో తమ కాంట్రాక్ట్‌లు సెటిల్‌ చేసుకునేందుకు తమ పొజిషన్లను స్క్వేర్‌ ఆఫ్‌ చేసుకోవడమూ మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఒపెక్‌ సమావేశంచమురు ధరల సెగ మార్కెట్‌ను భయపెట్టింది. త్వరలో జరిగే సమావేశంలో ఒపెక్‌ దేశాలు, నాన్‌ ఒపెక్‌ దేశాలు ముడి చమురు ఉత్పత్తిలో కోతను వచ్చే ఏడాది చివరి వరకు పొడిగించేందుకు అంగీకరించబోతున్నాయన్న వార్త లు మార్కెట్‌ను భయపెట్టాయి. చమురు ధర పెరిగితే ద్రవ్య లోటు పెరగడంతో పాటు ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భయపెడుతున్నాయి.రూపాయి డీలాస్టాక్‌ మార్కెట్‌తో పాటు గురువారం రూపాయి మార కం రేటు నీరసించింది. గత మూడు రోజుల్లో డాలర్‌ మారకంలో 39 పైసలు పెరిగిన రూపాయి ఒక దశలో రూ.64.63 పైసలకు పడిపోయింది. చివరికి 15 పైసల నష్టంతో రూ.64.46 వద్ద ముగిసింది. ద్రవ్య లోటు భయంతో పాటు చమురు ధరల పెరుగుదల రూపాయిని భయ పెడతున్నాయి. దిగుమతిదారుల నుంచి డిమాండ్‌ పెరగడమూ డాలర్‌కు కలిసొచ్చింది. రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపిఒకు గ్రీన్‌ సిగ్నల్‌రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు సెబి ఆమోదం తెలిపింది. తాజా షేర్లలో పాటు ఈ కంపెనీ 6.7 కోట్ల షేర్లను పబ్లిక్‌ ఇష్యూ ద్వారా జారీ చేయబోతోంది. ఇష్యూ ధర, సమీకరించే మొత్తాన్ని త్వరలో నిర్ణయిస్తారు.
business
4,259
29-05-2017 01:07:40
గుదిమెళ్ళ రామానుజాచార్య పురస్కారం
కవిరత్న గుదిమెళ్ళ రామానుజాచార్య కవితా పురస్కారాన్ని డా.అద్దంకి శ్రీనివాస్‌గారికి మే 29న సా.5గం.లకు ప్రదానం చేస్తున్నాం. వేదిక హైదరా బాద్‌ బిహెచ్‌ఈల్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయం.- కవిరత్న గుదిమెళ్ళ ఫౌండేషన్‌
editorial
3,494
19-02-2017 23:54:17
భారతీయ సాహిత్యం - యువత
- జి. ధనలక్ష్మి
editorial
5,766
09-03-2017 19:42:51
మెగా ఫ్యాన్స్‌పై సెటైర్ వేసిన అనసూయ
స్మాల్ స్క్రీన్ యాంకర్లకు గ్లామర్ పాఠాలు నేర్పిన అనసూయ సిల్వర్ స్క్రీన్‌పై అదే రేంజ్‌లో చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. బుల్లితెరను, వెండితెరను సమానంగా బ్యా‌లెన్స్ చేసుకుంటూ అల్లల్లాడిస్తున్న సెక్సీ సుందరి మరోసారి మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయింది. గతంలో ఓ సారి ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ఐటమ్ సాంగ్‌ను రిజెక్ట్ చేసి, మెగా ఫాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొన్న అనసూయ సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’ చిత్రంలో తళుక్కుమనడంతో దాని నుంచి బయటపడుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ సారి నేరుగా మెగా ఫ్యామిలీపైనే సెటైర్ వేసిన అనసూయ మరోసారి కొరివితో తలగొక్కున్నట్లయింది. ఇటీవల విన్నర్ టీంతో ఇంటర్వూ నిర్వహించింది అనసూయ. మాటల మధ్యలో మెగా అభిమానుల ప్రస్తావన రావడంతో వారెప్పుడు పొంగిపొర్లుతూ ఉంటారని కామెంట్ చేసింది. అసలే తనపై కత్తి ఎక్కుపెట్టారని నోటితో చెప్పకపోయనా సైగలతో అదే అర్థం వచ్చేటట్లు స్పష్టం చేసింది. ఇంతలో ధరమ్‌తేజ్ కల్పించుకుని మ్యాటర్‌ను పక్కకు తప్పించాడు.
entertainment
19,555
10-01-2017 19:23:37
ధోనీ మాస్టర్ మైండ్ స్కెచ్‌కు వెంటవెంటనే వికెట్లు డౌన్
ముంబై: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోనీ చివరిగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి వార్మప్ మ్యాచ్‌కు సారధిగా వ్యవహరిస్తున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధోనీ సేన ఐదు వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. అయితే తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ దూకుడుగా ఆట మెదలుపెట్టారు. 95 పరుగుల వరకూ ఒక్క వికెట్ పడలేదు. నెహ్రా, హార్ధిక్ పాండ్యా, మోహిత్ శర్మలు 15 ఓవర్లపాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.  దీంతో కూల్ కెప్టెన్ ధోనీ తన స్కెచ్ మార్చి కుల్దీప్ యాదవ్, చహల్‌లను రంగంలోకి దించాడు. అంతే వెంట వెంటనే వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడ్డాయి. దీంతో మ్యాచ్ అదుపు తప్పుతున్న పరిస్థితి భారత్ చేతిలోకి మారింది. ఓపెనర్లు జాసన్ రాయ్ 62, అలెక్స్ హేల్స్ ‌40 పరుగుల వద్ద ఉండగా కుల్దీప్ యాదవ్ తన మొదటి రెండు ఓవర్లలోనే ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లేనే చహల్ మూడో వికెట్‌గా ఇయాన్ మోర్గాన్‌ను 3 పరుగుల వద్ద పెవీలియన్‌కు పంపాడు. అయితే ఇక్కడ ధోనీ ఏం చేశాడంటే కుల్దీప్ యాదవ్‌ను మూడు ఓవర్లు మాత్రమ వేయించి మళ్లీ మోహిత్ శర్మను రంగంలోకి దించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ లెవన్ జట్టు స్కోర్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 122/3. మ్యాచ్ గెలిచేందుకు ఇంకా 183 పరుగులు చేయాల్సి ఉంది. స్కోర్ వివరాలు..ఇండియా ఏ బ్యాటింగ్ : మన్దీప్ సింగ్ 8, శిఖర్ ధావన్ 63, అంబటి రాయుడు 100, యువరాజ్ సింగ్ 56, ధోనీ 68(నాటౌట్), సంజూ శాంమ్సన్ 0, హర్ధిక్ పాండ్యా 4(నాటౌట్). మొత్తం 50 ఓవర్లకు 304/5.  ఇంగ్లండ్ లెవన్ బ్యాటింగ్ : జాసన్ రాయ్ 62, అలెక్స్ హేల్స్ 40, శ్యామ్ బిల్లింగ్స్ 12(బ్యాటింగ్) , ఇయాన్ మోర్గాన్ 3, జోస్ బట్లర్ 5 బ్యాటింగ్..
sports
5,284
04-03-2017 10:46:58
సమంత కోసం బ్రేక్‌ఫాస్ట్‌ రెడీ చేసే బయటకు వెళ్తాడట!
 తాజాగా చైతూకు సంబంధించిన ఓ కొత్త విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్‌ ద్వారా తెలియజేసింది. చైతూ గ్యాస్‌ స్టౌవ్‌ దగ్గర నిల్చుని తన కోసం బ్రేక్‌ఫాస్ట్‌ రెడీ చేస్తున్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. ‘తను నాకోసం బ్రేక్‌ఫాస్ట్‌ రెడీ చేసిన తర్వాతే బయటకు వెళ్తాడు. ఈ ప్రపంచానికి నేనే మహారాణి అనుకునేలా చేసిన దేవుడికి మోకాళ్లపై కూర్చుని అభివాదం చేస్తున్నాన’ని సమంత పోస్ట్ చేసింది.
entertainment
15,812
15-05-2017 17:59:55
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో.. తొలి రోజే విపక్షాల రగడ
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే తొలి రోజే విపక్షాలు సభలో గొడవ చేశాయి. ఆ రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి. సమాజ్‌వాదీ, బీఎస్సీ సభ్యులు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. స్పీకర్‌తో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విపక్ష పార్టీల సభ్యులను సముదాయించేందుకు ప్రయత్నించారు.
nation
16,265
07-06-2017 02:32:03
లౌకిక విలువల్ని కాపాడే వ్యక్తే రాష్ట్రపతి: సీపీఎం
న్యూఢిల్లీ, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): లౌకిక, రాజ్యాంగ విలువల్ని కాపాడే వ్యక్తిని రాష్ట్రపతిగా నియమించాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో నిర్ణయించిందని బీవీ రాఘవులు తెలిపారు. పొలిట్‌ బ్యూరో రెండ్రోజుల సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికపై ప్రముఖంగా చర్చించామని, లౌకికవాదినే రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించామని రాఘవులు తెలిపారు.
nation
15,650
01-09-2017 02:27:52
టీచర్‌ కాదు.. శాడిస్ట్‌!
చిన్నారిని 40సార్లు కొట్టిన ఉపాధ్యాయినిహాజరు చెప్పనందుకే..లఖ్‌నవ్‌, ఆగస్టు 31: మితిమీరిన కోపంతో మానవత్వం మరిచి ఓ చిన్నారిపై ప్రతాపం చూపించింది ఓ ఉపాధ్యాయురాలు. హాజరు పలకలేదని బాలుడిని 40 సార్లు కొట్టింది. లఖ్‌నవ్‌లోని ఓ పాఠశాల క్లాస్‌రూమ్‌లో జరిగిన ఈ ఉదంతాన్ని సీసీటీవీ రికార్డు చేసింది. హాజరుపలకలేదనే కారణంతో రేతిక వి జాన్‌ అనే ఉపాధ్యాయురాలు మూడో తరగతి చదువుతున్న చిన్నారిని టై పట్టుకుని లాక్కొచ్చి రెండు చేతులతోనూ ఆపకుండా ఏడాపెడా 40 సార్లు కొట్టింది.  దీంతో ఆ చిన్నారి బుగ్గలు కమిలిపోయాయి. బాలుడు ఇంటికొచ్చాక స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల యజమాన్యానికి ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ చూసిన ప్రిన్సిపాల్‌ ఆ టీచర్‌ను విధుల్లోంచి తొలగించారు. బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదుతో ఆమెను పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఇటీవల అంకెలు సరిగ్గా చదవడం లేదని ఓ చిన్నారిని ఆమె తల్లి కొట్టిన వీడియో కూడా వైరల్‌ అయిన విషయం తెలిసిందే.
nation
3,602
09-09-2017 04:34:08
మృత్యుబాటలు!
దేశంలో రోడ్డు ప్రమాదాలు నాలుగుశాతం మేరకు తగ్గినందుకు సంతోషించాలో, ఇప్పటికీ రోజుకు నాలుగువందల మంది మరణిస్తున్నందుకు విచారించాలో అర్థంకావడం లేదు. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ‘భారత్‌లో రోడ్డు ప్రమాదాలు– 2016’ నివేదిక అటు ప్రభుత్వమూ, ఇటు ప్రజలూ ఎంతో మారవలసిన అవసరం తెలియచెబుతున్నది. ఈ నివేదిక ప్రకారం గత ఏడాది నాలుగు లక్షల ఎనభైవేల ప్రమాదాలు జరిగితే, అందులో లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ 5 లక్షల మంది తీవ్రంగా గాయపడ్డారు. రికార్డుల్లోకి ఎక్కని ప్రమాదాలు అధికసంఖ్యలోనే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న నాలుగువందల మందిలో దాదాపు సగం 18 నుంచి 35 ఏళ్ళలోపు వారే కావడం సమస్య తీవ్రతను తెలియ చెబుతున్నది. ఈ నివేదిక ప్రకారం 86 శాతం ప్రమాదాలు 13 రాష్ట్రాల్లోనే జరిగాయి. అధిక రోడ్డుప్రమాదాలు జరుగుతున్న వాటిలో తెలుగురాష్ట్రాలు రెండూ ఉన్నాయి. తొలిస్థానాల్లో కాకున్నా జాగ్రత్తపడాల్సిన ర్యాంకుల్లోనే ఉన్నాయి. 85 శాతం రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని నివేదిక తేల్చింది. 80 శాతం మరణాలకు, 83 శాతం మంది గాయపడ్డానికీ డ్రైవర్ల అలసత్వం, తప్పిదాలే కారణమట. గంటకు 17 మందిని బలితీసుకుంటున్న ఈ ప్రమాదాలకు ప్రధానకారణాలు అతివేగం, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. 2015తో పోల్చినప్పుడు రోడ్డుప్రమాదాల సంఖ్య నాలుగుశాతం తగ్గినా, మృతుల సంఖ్య మాత్రం బాగా హెచ్చిందంటే దానర్థం ప్రమాదాల్లో అధికం ప్రాణాంతకంగా మారినట్టు. నడుపుతున్న వాహనం సమర్థతతోగానీ, రోడ్డు స్థితిగతులతో గానీ, వేగచిహ్నాలతో గానీ నిమిత్తం లేకుండా దూసుకుపోతున్నందునే మరణాలు హెచ్చుతున్నాయన్నది నిర్వివాదాంశం. అతివేగమే 70 శాతం ప్రాణాలను తీస్తున్నదని నివేదిక తెలియచెబుతున్నది. 1970ల తరువాత అత్యధిక మరణాలు నమోదైన సంవత్సరం ఇదే. నిజానికి రోడ్ల నిర్మాణంలో నాణ్యత పెరుగుతూ, నిర్వహణలో అధునాతన సాంకేతిక వినియోగం హెచ్చుతున్నప్పుడు ప్రమాదాలు, మరణాల సంఖ్య వేగంగా పడిపోవాలి. కానీ, ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తూండటమే భయం కలిగిస్తున్నది. దేశంలోని మొత్తం రోడ్లలో జాతీయరహదారులు కేవలం 2 శాతమే అయినా 30 శాతం ప్రమాదాలు వీటిమీదే జరుగుతున్నాయి. రాష్ట్ర రోడ్లను కూడా కలిపిచూస్తే ఈ ప్రమాదాల సంఖ్య 65 శాతానికి పెరుగుతున్నది. అంటే, రోడ్డు కాస్తంత విశాలంగా, ఖాళీగా కనిపిస్తే అనేకులకు ఒళ్ళు తెలియడం లేదని అర్థం. ద్విచక్రవాహనాల ప్రమాదాల్లో సంభవించిన మరణాల్లో అధికం హెల్మెట్‌ లేని కారణంగానే జరిగినట్టు నివేదికను బట్టి అర్థమవుతున్నది.  మొబైల్‌ పిచ్చి బాగా ముదిరిపోయినందున అది కూడా ప్రాణాలు తీస్తున్నది. వాహనం మీద వెడుతూ మొబైల్‌ వాడినందున రెండున్నర వేలమంది మరణించారు. మొబైల్‌ మాట్లాడుతూ వాహనం నడుపుతున్న వారిపై విధిస్తున్న వెయ్యి రూపాయల పెనాల్టీని ఐదువేలకు పెంచేందుకు వీలుగా మోటారువాహనాల చట్టాన్ని కేంద్రప్రభుత్వం సవరించబోతున్నది. నిర్లక్ష్యం మూర్తీభవించిన వారిలో ఇది ఎంతమేరకు మార్పు తీసుకువస్తుందో చూడాలి. ప్రమాదాల సంఖ్యలో తమిళనాడు, మరణాల సంఖ్యలో ఉత్తర్‌ప్రదేశ్‌ ఈ నివేదికలో ప్రథమస్థానాలు సంపాదించుకున్నాయి. రోడ్డుమీద బాధ్యతారాహిత్యంగా వాహనాన్ని నడిపి, దారినపోతున్న వారి ప్రాణాలు తీయడం ఇటీవలి కాలంలో బాగా హెచ్చింది. వీరి నిర్లక్ష్యం కారణంగా స్కూలు పిల్లల్లో, వాకింగ్‌కు వచ్చిన వృద్ధులో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఖాతరు చేయకపోవడం, తప్పుడుదారుల్లో ప్రయాణించడం ఫ్యాషన్‌గా మారిపోయింది. రాంగ్‌రూట్‌ ప్రయాణాలు 17వేలకు పైగా ప్రమాదాలకు, 5వేలకు మించిన మరణాలకు కారణమని ఈ నివేదిక చెబుతున్నది. మద్యం సేవించి వాహనాలు నడపడం గతంలో సుదీర్ఘ ప్రయణాలు చేసే లారీ డ్రైవర్లలోనే ఉండేది. కానీ, అది ఇప్పుడు అందరిలోనూ హెచ్చింది. పట్టపగలు పబ్బులో పూటుగా తాగి, ఆ మత్తులో కారును వేగంగా నడిపి కొందరు యువకులు ఓ చక్కని కుటుంబాన్ని నాశనం చేసిన ఘటన ఈ మధ్య హైదరాబాద్‌లో చూశాం. ఇక, వాహనదారుల నిర్లక్ష్యం ఒక్కటే ప్రమాదాలకు, మరణాలకు కారణం కాదని నితిన్‌ గడ్కరీ అంగీకరించినందుకు సంతోషం. వచ్చే రెండేళ్ళలో ప్రమాద మరణాల సంఖ్యను యాభైశాతం తగ్గిస్తామని ఆయన మాట ఇస్తున్నారు. పార్లమెంటులో ఆమోదం కోసం ఎదురుచూస్తున్న రోడ్‌సేఫ్టీ బిల్లు ఆమోదం పొందగానే ప్రభుత్వం రంగంలోకి దిగుతుందనీ, 12వేల కోట్లతో రహదారులను మెరుగుపరచే పని చేపడుతుందనీ అంటున్నారు. విశాలంగా, నునుపుగా కనిపించే చాలా రహదారులు ఇంజనీరింగ్‌ లోపాల కారణంగా ప్రాణాంతంగా పరిణమించిన విషయం తెలిసిందే. జాతీయ రహదారుల్లో ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించి సరిదిద్దడం, ఎక్కడికక్కడ బారికేడ్లను, హెచ్చరిక లైట్లను ఏర్పాటు చేయడం వంటివి ప్రధానంగా జరగాలి.  జాతీయ రహదారుల్లో వాహనదారులు వేగాన్ని నియంత్రించుకోకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణం కనుక వేగనియంత్రణ వ్యవస్థలు విస్తృతంగా ఏర్పాటు కావాలి. రిపేరుకొచ్చి రోడ్డుమీద నిలిచిపోయిన వాహనాలను తక్షణమే పక్కకు తరలించే ఏర్పాట్లు అధికం కావాలి. పార్కింగ్‌ జోన్లంటూ ఉన్నా అక్కడిదాకా పోకుండా వాహనాలను రోడ్డుమీదే నిలిపివేస్తున్న డ్రైవర్ల నుంచి వాటిని స్వాధీనం చేసుకొని, భారీ పెనాల్టీ విధించాలి. ఇక, రాష్ట్ర రహదారుల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత శ్రద్ధగా ఉన్నాయో కనిపిస్తూనే ఉన్నది. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు వద్దని సుప్రీంకోర్టు అనగానే, అతివేగంగా వాటిని రాష్ట్ర రహదారులుగా మార్చివేసి మద్యం దుకాణదారులను, మద్యం వ్యాపారాన్నీ కాపాడుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డుప్రమాదాలనుంచి ప్రజలను కాపాడటానికి ఎంతోకొంత చేస్తే సంతోషం.
editorial
9,183
04-11-2017 19:04:49
కాజల్ కామెడీ స్పూన్..
కామెడీ చేయడం మాకు కూడా వచ్చంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఓ సెన్సేషనల్ పోస్ట్ చేసింది. తన ఇన్‌స్ట్రాగ్రమ్ పేజీలో ఓ పెద్ద స్పూన్ పట్టుకుని తినబోతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో చూస్తే ఎవరికైనా నవ్వు రావాల్సిందే. అంతేకాదు 'స్పూన్ నిండుగా సుగర్. మరి ఈ స్పూన్ సైజ్ ఎంతో ఎవరైనా చెప్పగలరా?' అంటూ ఓ ప్రశ్న కూడా సంధించింది కాజల్. మరి ఇంత పెద్ద స్పూన్‌తో కాజల్ కామెడీ చేయాలని చూస్తే.. కాజల్‌పై అదిరిపోయే కామెంట్స్‌తో నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఓ కామెంట్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'అంత పెద్ద స్పూన్‌తో తింటే లావైపోతావ్ జాగ్రత్త' అంటూ నెటిజన్ పెట్టిన కామెంట్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'ఓ మై గాడ్' అంటూ ఈ ఫొటో చూసిన వారంతా రిప్లైలు ఇస్తుండటం విశేషం.
entertainment
7,591
15-12-2017 10:13:24
రాజమౌళి సూచనపై కత్తి మహేశ్ సంచలన కామెంట్..!
ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఏదో ఒక అంశంపై సందర్భానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న కత్తి మహేశ్.. రాజమౌళి సూచన(తెలుగుతల్లిపై సూర్య కిరణాలు)పై సంచలన కామెంట్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.       అమరావతిలో జరగబోయే నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లపై కొన్ని సూచనలు చేయాలంటూ రాజమౌళిని చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అసెంబ్లీ భవన డిజైన్‌పై రాజమౌళి ఒక సూచన చేశాడు. ఏపీలో నిర్మించనున్న అసెంబ్లీ భవనానికి సంబంధించిన డిజైన్లలో ఒక దానిని దాదాపు ఖరారు చేశారు. అందులో ఎత్తైన టవర్‌ నుంచి అసెంబ్లీ సెంట్రల్‌ హాలులోకి సూర్యకిరణాలు పడేలా నార్మన్‌ ఫోస్టర్‌ డిజైన్‌ రూపొందించింది. అయితే దర్శకుడు రాజమౌళి తన మార్కు కళాత్మకతకు పదును పెట్టి, అసెంబ్లీ సెంట్రల్‌ హాలులో తెలుగు తల్లి విగ్రహంపై సరిగ్గా ఉదయం 9.15 గంటలకు కిరణాలు పడేలా ఏర్పాటు చేయాలని సూచించారు. అలా సూర్య కిరణాలు పడుతున్న తెలుగుతల్లి గ్రాఫిక్‌ వీడియోను రూపొందించిన రాజమౌళి దానిని విడుదల చేశాడు.           దీనిపై కత్తి మహేశ్ సోషల్ మీడియాలో స్పందించాడు. ‘‘తొలి కిరణం.. తెలుగు తల్లి పాదాలను తాకకపోతే వచ్చే నష్టం ఏదైనా ఉందా..?’’ అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే అతడు పెట్టిన పోస్టుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన వాదనను సమర్ధిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.   రాజమౌళి గురించి కొన్ని సరికొత్త సంగతులు  పవన్ ఫ్యాన్స్ మహేశ్‌పైకి ఎందుకు ‘కత్తి’ దూశారు?
entertainment
19,573
15-11-2017 00:53:45
సైనాకు అనుష్క సర్‌‘ప్రైజ్‌’..!
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ను బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ ప్రత్యేక గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్‌ చేసింది. ఇటీవలే అనుష్క ‘నుష్‌’ పేరుతో దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కొన్ని షర్ట్‌లను సైనాకు బహుమతిగా ఇచ్చింది. అనూహ్య బహుమానంతో సంభ్రమాశ్చ ర్యాలకు లోనైన సైనా.. ట్విటర్‌ వేదికగా అనుష్కకు ధన్యవాదాలు తెలిపింది. ‘వ్యాపారంలోకి అడుగుపెట్టినందుకు శుభాకాంక్షలు.. త్వరలో ఈ షర్ట్‌లను ధరిస్తాన’ని ట్వీట్‌ చేసింది. విరాట్‌ కోహ్లీ ఫౌండేషన్‌.. గత వారం నిర్వహించిన ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఆనర్‌ అవార్డుల కార్యక్రమంలో అనుష్క శర్మను సైనా కలుసుకుంది.
sports
18,806
22-01-2017 13:56:34
హర్షాతిరేకాలతో జల్లికట్టు... విజేతలకు నగదు బహుమతులు
చెన్నై : తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆదివారం జల్లికట్టును నిర్వహించారు. తిరుచిరాపల్లి సహా చాలా చోట్ల సంప్రదాయబద్ధంగా ఎద్దులతో పోరాడారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి అళంగనళ్ళూరులో జల్లికట్టును ప్రారంభించవలసి ఉంది. కానీ అక్కడి ప్రజలు తమకు శాశ్వత పరిష్కారం కావాలని, తాత్కాలిక ఆర్డినెన్స్‌ కాదని పట్టుబట్టడంతో జల్లికట్టు రద్దయింది. దీంతో ఆయన దిండిగల్లులో జల్లికట్టును ప్రారంభిస్తారని సమాచారం. తిరుచిరాపల్లిలోని మనపురాయ్‌లో జల్లికట్టు ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమైంది. వేలాది మంది ప్రజలు సంతోషంతో కేరింతలు కొట్టారు. దూసుకొస్తున్న ఎద్దును అదుపు చేసేందుకు యువకులు సాహసోపేతంగా ప్రయత్నించారు. వందలాది ఎద్దులతోపాటు యువత ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గెలిచిన ఎద్దులకు, యువతకు నగదు బహుమతులు ఇచ్చారు. జల్లికట్టుకు మరో రూపమైన మంజువిరాట్టును ధర్మపురి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో నిర్వహించారు.
nation
15,439
18-07-2017 15:03:48
వ్యక్తిగత గోప్యతపై ప్రత్యేక ధర్మాసనం
న్యూఢిల్లీ : వ్యక్తిగత గోప్యతకు రక్షణ ఉండాలా? ఈ హక్కు రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల్లో భాగమేనా? అనే అంశాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని మంగళవారం ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనంలో 9 మంది న్యాయమూర్తులు ఉంటారు. ఆధార్‌ సంఖ్యను పాన్‌ సంఖ్యతో అనుసంధానం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఈ 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం నుంచి విచారణ ప్రారంభిస్తుంది. 1954లో 8 మంది న్యాయమూర్తుల ధర్మాసనం, 1962లో ఆరుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుల్లో ప్రైవసీ హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదని స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఈ తీర్పులపై ఆధారపడింది. వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ) హక్కు అనేది సాధారణ చట్టం ప్రకారం లభించినదని, దానిని ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం గుర్తించలేదని కేంద్ర ప్రభుత్వం వాదించింది.
nation
3,310
06-06-2017 01:17:47
ధ‌ర్మ‌కాంట‌ దండి కొట్టొద్దు!
తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయంగా ఎద‌గాల‌నుకున్న భారతీయ జనతా పార్టీ కేసీఆర్‌కు, తెరాస‌కు వ్య‌తిరేకంగా మాట్లాడడంలో అభ్యంత‌రం లేదు. కానీ, యావ‌త్ దేశం, అంత‌ర్జాతీయ య‌వ‌నిక‌పై తెలంగాణ రాష్ట్రం కీర్తి ప్ర‌తిష్ట‌లకు మ‌స‌క‌బారే విధంగా మాట్లాడ‌టంపైనే అభ్యంత‌రం. తెలంగాణ‌ను, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను అవ‌మానించే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం వల్ల ఒక రాజ‌కీయ‌ పార్టీగా ఎంత న‌ష్ట‌పోతుందో బీజేపీ తెలుసుకోవాలి. అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌తో భార‌తీయ జ‌న‌తా పార్టీ వైఖ‌రి అయిన‌వారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో పెట్టిన‌ట్టుగా ఉందని మ‌రోసారి రుజువ‌యింది. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవ‌త‌రించినా కేంద్రం వివ‌క్ష మాత్రం కొన‌సాగుతూనే ఉంది. ఆంధ్రానాయ‌కుల‌ అభీష్టానికి వ్య‌తిరేకంగా ఏర్ప‌డిన రాష్ట్రం ప‌ట్ల కేంద్రం వివ‌క్ష భాజ‌పా పాల‌న‌లోనూ తారాస్థాయికి చేరింది. అర‌వై ఏండ్ల ఆంధ్ర‌ పాల‌న‌లో అన్ని రకాల దోపిడీకి, వివ‌క్షకు, అవ‌మానాల‌కు, అణ‌చివేతల‌కు గురైన ప్రాంతం స‌త్వ‌ర అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో కేంద్రం స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూపుతున్న‌ది. కేంద్రంలో ధ‌ర్మ‌పీఠంపై కూర్చున్న పార్టీ ఇరు ప్రాంతాల‌ను స‌మ‌దృష్టితో చూడాలి. కానీ, ఒక ప్రాంతం వైపే త్రాసు దండి (మొగ్గు చూప‌డం) కొడుతున్న‌ది. భార‌తీయ జ‌న‌తాపార్టీ మొద‌టి నుంచీ పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టుగా, ఉరికేటోని కాళ్ల‌ల్ల క‌ట్టె పెట్టిన‌ట్టుగా తెలంగాణ‌ కాలుపట్టి గుంజే య‌త్నం ఎవ‌రి ప్రోద్బలంతో చేస్తున్నదో తెలుసుకోలేని తెలివి త‌క్కువవారు కారు ప్రజలు. ఉద్య‌మంలో రాటు దేలిన ప్ర‌జ‌లు ప్ర‌తి ప‌రిణామాన్ని సులువుగా, శీఘ్రంగా విశ్లేషించి, అవ‌గ‌తం చేసుకుంటారు. దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి అన్ని ప్రాంతాల‌ను, ముఖ్యంగా ఇటీవ‌ల‌నే వేరుపడ్డ ఇరు రాష్ట్రాల‌ను స‌మదృష్టితో చూడాల‌నే సోయి ఉండాలి. కానీ, భాజ‌పా అధ్య‌క్షుని మూడు రోజుల తెలంగాణ ప‌ర్య‌ట‌న ఆంధ్రావైపు దండి గొట్టే విధంగా ఉంది. పైగా కావాల‌నే దండి కొట్టినట్టు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలిసే విధంగా న‌డుచుకోవ‌డం ఆగ్ర‌హం తెప్పించే అంశం. తెలుగుదేశం పార్టీతో అంట‌కాగ‌డం వ‌ల్ల‌, తెలంగాణ‌లోనే కాదు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా భాజ‌పాకు న‌ష్ట‌దాయ‌క‌మ‌ని గ్ర‌హించే ఇంగితం ఆ పార్టీ నాయ‌కుల‌కు కొర‌వ‌డింది. లీవ్ టీడీపీ, సేవ్ బీజేపీ అని అమ‌రావ‌తిలో వినిపించిన నినా దాల‌ను బ‌ట్టి రాష్ట్ర‌, జిల్లా నాయ‌క‌త్వం భాజ‌పా అధిష్టానం దృష్టిలో పిపీలికంతో స‌మాన‌మ‌ని తేలింది. తెలంగాణ ప‌ర్య‌ట‌న పూర్త‌యిన మ‌రునాడే చంద్ర‌ బాబు నాయుడుతో అమిత్ షా జ‌త‌క‌ట్టి భుజం భుజం రాసుకొని తిరుగ‌డంతో క‌థ ఏమిటో బ‌య‌ట ప‌డింది. అమిత్ షా, చంద్ర‌బాబు నాయుడు ఒకే విమా నంలో ప‌య‌న‌మై విజ‌య‌వాడ‌లో క‌లిసి లంచ్ చేశారు. క‌ల‌సి వేదిక‌లు పంచు కున్న‌ స‌భ‌లు, స‌మావేశాల్లో చంద్ర‌బాబు ప్రభుత్వంపై ఒక్క నెగ‌టివ్‌ మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌డం, పైసా లెక్క అడుగ‌క‌ పోవ‌డం వంటి ప‌రిణామాలు మాంత్రి కుని మాట‌లు చిలుక నోటి నుంచి వ‌చ్చినట్టు తెలంగాణలో అమిత్ షా ప‌లుకులు ఏ మాంత్రికునివో ఇక్క‌డి ప్ర‌జ‌లు అర్థం చేసుకోలేర‌నే భ్ర‌మ‌ల్లో భాజ‌పా నాయ‌త్వం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయంగా ఎద‌గాల‌నుకున్న పార్టీ కేసీఆర్‌కు, తెరాస‌కు వ్య‌తిరేకంగా మాట్లాడడంలో అభ్యంత‌రం లేదు. కానీ, యావ‌త్ దేశం, అంత‌ర్జాతీయ య‌వ‌నిక‌పై తెలంగాణ రాష్ట్రం కీర్తి ప్ర‌తిష్ట‌లకు మ‌స‌క‌బారే విధంగా మాట్లాడ‌టంపైనే అభ్యంత‌రం. తెలంగాణ‌ను, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను అవ‌మానించే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఒక రాజ‌కీయ‌ పార్టీగా తానూ ఎంత న‌ష్ట‌పోతుందో బీజేపీ తెలుసుకోవాలి. ఈత రానోన్ని న‌మ్ముకొని ఈతొచ్చినోడూ మునిగిన‌ట్టు తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించి న‌ష్ట‌పోయిన‌ పార్టీల వెంటపోయి ఉన్న ఊపిరినీ ఉఫ్‌ మ‌నిపించే కాడికి తెచ్చుకుంటున్న‌ది. నీళ్లు, నిధులు, నియామ‌కాల పునాదిగా ఏర్ప‌డిన తెలంగాణకు అన్ని ర‌కాలుగా న‌ష్టం క‌లిగించే పోల‌వ‌రం ప్రాజెక్టును కేంద్రంలో ఉన్న‌ భాజ‌పా స‌ర్కార్‌ జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి యుద్ద‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేస్తున్నది. మ‌రి విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణకూ జాతీయ ప్రాజెక్టు ఇస్తామ‌న్న హామీ కేంద్ర నాయ‌క‌త్వానికి గుర్తులేదా? రాష్ట్ర నాయ‌క‌త్వమూ మ‌ర్చిపోయిందా ? ఎన్నిక‌ల పొత్తు పెట్టుకున్న తేదేపాను సంతోష పెట్ట‌డానికి అన్యాయంగా ఏడు మండ‌లాల‌ను తెలంగాణ నుంచి దూరం చేసి, ఆంధ్ర‌లో విలీనం చేయ‌డం ఇంకా ప్ర‌జ‌ల మ‌దిలో తాజాగా ఉన్న‌ది. పోలవ‌రం ప్రాజెక్టు కింద మునుగుతున్న అనేక‌ గ్రామాలు, ల‌క్ష‌లాది మంది ఆదివాసి నిర్వాసితుల గురించి తెలంగాణ నాయ‌కుల‌తో స‌హా ఏ ఒక్క‌రూ మాట్లాడ‌రు. న్యాయ వ్య‌వ‌స్థతో పాటు రాష్ట్రంలోని ఆస్తుల పంప‌కాలు జ‌రిగితేనే రాష్ట్ర విభ‌జ‌న ప‌రిపూర్ణం అవుత‌ద‌న్న‌ రాజ్యాంగ‌ప‌ర‌మైన‌ సోయి కేంద్రానికి ఉండొద్దా? పైగా హైకోర్టు విభ‌జ‌న గురించి అడిగితే ‘‘హైకోర్టు హైద‌రాబాద్ లోనే ఉంది క‌దా?’’ అని ఆంధ్రపార్టీల మాదిరిగా మాట్లాడ‌టం భాజ‌పా ప‌క్ష‌పాతానికి నిద‌ర్శ‌నం. న‌ష్ట‌పోయిన వాటిని ద‌క్కించుకునేందుకు, రాజ్యాంగ‌ హ‌క్కులు రాబ‌ట్టుకునేందుకు ఇప్ప‌టికైనా తెలంగాణ పౌర‌స‌మాజం అంతా క‌లిసి ఉద్య‌మించాల్సిన అవ‌స‌రం ఉంది. భార‌తీయ జ‌న‌తాపార్టీలో తెలంగాణ నుంచి ఉన్న ఏకైక ఎం.పిద‌త్త‌న్న. అడుక్కోంగా అడుక్కోంగా ఒక్క ప‌ద‌వి ఇచ్చారు. అదీ కూడా క్యాబినెట్ ర్యాంకు లేకుండా. అందుకేనేమో ఆయ‌న అస‌లే మాట్లాడ‌డు, మాట్లాడితే విన‌టోడే ఉండ‌డు. ఆంధ్రలో మాత్రం వెంక‌య్య‌నాయుడు, సృజ‌నా చౌద‌రి, నిర్మలా సీతారామ‌న్ ముగ్గురికి క్యాబినెట్ ర్యాంకే. మోదీ త‌ర్వాతి స్థానంలోని వెంక‌య్య నాయుడైతే చ‌క్రం తిప్ప‌ని చోటు లేదు. ఇది తెలంగాణ ప‌ట్ల వివ‌క్ష కాక మ‌రేమైత‌ది? తెలంగాణ ఏర్ప‌డిన మూడేండ్ల‌లో కేంద్రం తీరుతో రాష్ట్ర అభివృద్ధి మూరెడు ముందుకు, బారెడు వెనుక‌కు పోయింది. ఆంధ్ర అవ‌స‌రాల‌కు కావ‌లసిన‌వి ప్ర‌పంచంలో ఎక్క‌డున్నా కొని పెడుతారు. లెక్క‌లు మాత్రం అడుగరు. తెలంగాణ‌లో అమిత్ షా ఉన్న మూడు రోజుల్లో ముప్పై సార్లు పొంక‌నాలు కొట్టే ల‌క్ష‌కోట్లు ఇచ్చినామ‌ని. ఇదంతా తెలం గాణ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్త‌లేర‌ని అనుకోవ‌టం ఇక్క‌డ ఉన్న కాస్త ప‌ర‌ప‌తిని బొంద‌పెట్టుకోవ‌డ‌మే అవుతుంది. రాష్ట్రం కోసం ఉద్య‌మాలు చేసిన ప్ర‌జ‌లు తెలంగాణ‌ను అవ‌మానించే ఏ విష‌యాన్నైనా తొంద‌ర‌గా గుర్తిస్తారు. అధికారం కోసం రాజ‌కీయం చేసే హ‌క్కు రాజ‌కీయ పార్టీగా భాజ‌పాకు ఉన్న‌ది గానీ, తెలంగాణ ఆర్థిక అభివృద్ధిని మాత్రం అన్యాయంగా అడ్డుకునే హ‌క్కు లేదు. ‘‘ద‌క్షుడు లేని ఇంట వేల‌క్ష‌లు వ‌చ్చిప‌డిన నిలువ నేరునే?’’ అన్న‌ట్లు, అమిత్ షా ఆంధ్ర పెట్టుబ‌డిదారుల‌తో క‌లిసి ఊరేగడం తెలంగాణ‌లో న‌ష్ట‌దాయ‌కంగా మారింది. ఒక్క త‌ప్పుడు మాట మాట్లాడినందుకు క‌ల్వ‌కుర్తిలో స్వ‌యానా ఎన్టీఆర్‌నే ఓడించిన చైత‌న్యం తెలంగాణ ప్ర‌జ‌ల‌ది. అమిత్ షాలను మించిన పాదుషాల‌ను సైతం మ‌ట్టి క‌రిపించిన చైత‌న్యం తెలంగాణ‌కు ఉంద‌ని భాజ‌పా యాదుంచుకుంటే మంచిది.-కౌడె స‌మ్మ‌య్య‌ అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌తో భార‌తీయ జ‌న‌తా పార్టీ వైఖ‌రి అయిన‌వారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో పెట్టిన‌ట్టుగా ఉందని మ‌రోసారి రుజువ‌యింది. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవ‌త‌రించినా కేంద్రం వివ‌క్ష మాత్రం కొన‌సాగుతూనే ఉంది. ఆంధ్రానాయ‌కుల‌ అభీష్టానికి వ్య‌తిరేకంగా ఏర్ప‌డిన రాష్ట్రం ప‌ట్ల కేంద్రం వివ‌క్ష భాజ‌పా పాల‌న‌లోనూ తారాస్థాయికి చేరింది. అర‌వై ఏండ్ల ఆంధ్ర‌ పాల‌న‌లో అన్ని రకాల దోపిడీకి, వివ‌క్షకు, అవ‌మానాల‌కు, అణ‌చివేతల‌కు గురైన ప్రాంతం స‌త్వ‌ర అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో కేంద్రం స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూపుతున్న‌ది. కేంద్రంలో ధ‌ర్మ‌పీఠంపై కూర్చున్న పార్టీ ఇరు ప్రాంతాల‌ను స‌మ‌దృష్టితో చూడాలి. కానీ, ఒక ప్రాంతం వైపే త్రాసు దండి (మొగ్గు చూప‌డం) కొడుతున్న‌ది. భార‌తీయ జ‌న‌తాపార్టీ మొద‌టి నుంచీ పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టుగా, ఉరికేటోని కాళ్ల‌ల్ల క‌ట్టె పెట్టిన‌ట్టుగా తెలంగాణ‌ కాలుపట్టి గుంజే య‌త్నం ఎవ‌రి ప్రోద్బలంతో చేస్తున్నదో తెలుసుకోలేని తెలివి త‌క్కువవారు కారు ప్రజలు. ఉద్య‌మంలో రాటు దేలిన ప్ర‌జ‌లు ప్ర‌తి ప‌రిణామాన్ని సులువుగా, శీఘ్రంగా విశ్లేషించి, అవ‌గ‌తం చేసుకుంటారు. దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి అన్ని ప్రాంతాల‌ను, ముఖ్యంగా ఇటీవ‌ల‌నే వేరుపడ్డ ఇరు రాష్ట్రాల‌ను స‌మదృష్టితో చూడాల‌నే సోయి ఉండాలి. కానీ, భాజ‌పా అధ్య‌క్షుని మూడు రోజుల తెలంగాణ ప‌ర్య‌ట‌న ఆంధ్రావైపు దండి గొట్టే విధంగా ఉంది. పైగా కావాల‌నే దండి కొట్టినట్టు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలిసే విధంగా న‌డుచుకోవ‌డం ఆగ్ర‌హం తెప్పించే అంశం. తెలుగుదేశం పార్టీతో అంట‌కాగ‌డం వ‌ల్ల‌, తెలంగాణ‌లోనే కాదు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా భాజ‌పాకు న‌ష్ట‌దాయ‌క‌మ‌ని గ్ర‌హించే ఇంగితం ఆ పార్టీ నాయ‌కుల‌కు కొర‌వ‌డింది. లీవ్ టీడీపీ, సేవ్ బీజేపీ అని అమ‌రావ‌తిలో వినిపించిన నినా దాల‌ను బ‌ట్టి రాష్ట్ర‌, జిల్లా నాయ‌క‌త్వం భాజ‌పా అధిష్టానం దృష్టిలో పిపీలికంతో స‌మాన‌మ‌ని తేలింది. తెలంగాణ ప‌ర్య‌ట‌న పూర్త‌యిన మ‌రునాడే చంద్ర‌ బాబు నాయుడుతో అమిత్ షా జ‌త‌క‌ట్టి భుజం భుజం రాసుకొని తిరుగ‌డంతో క‌థ ఏమిటో బ‌య‌ట ప‌డింది. అమిత్ షా, చంద్ర‌బాబు నాయుడు ఒకే విమా నంలో ప‌య‌న‌మై విజ‌య‌వాడ‌లో క‌లిసి లంచ్ చేశారు. క‌ల‌సి వేదిక‌లు పంచు కున్న‌ స‌భ‌లు, స‌మావేశాల్లో చంద్ర‌బాబు ప్రభుత్వంపై ఒక్క నెగ‌టివ్‌ మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌డం, పైసా లెక్క అడుగ‌క‌ పోవ‌డం వంటి ప‌రిణామాలు మాంత్రి కుని మాట‌లు చిలుక నోటి నుంచి వ‌చ్చినట్టు తెలంగాణలో అమిత్ షా ప‌లుకులు ఏ మాంత్రికునివో ఇక్క‌డి ప్ర‌జ‌లు అర్థం చేసుకోలేర‌నే భ్ర‌మ‌ల్లో భాజ‌పా నాయ‌త్వం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయంగా ఎద‌గాల‌నుకున్న పార్టీ కేసీఆర్‌కు, తెరాస‌కు వ్య‌తిరేకంగా మాట్లాడడంలో అభ్యంత‌రం లేదు. కానీ, యావ‌త్ దేశం, అంత‌ర్జాతీయ య‌వ‌నిక‌పై తెలంగాణ రాష్ట్రం కీర్తి ప్ర‌తిష్ట‌లకు మ‌స‌క‌బారే విధంగా మాట్లాడ‌టంపైనే అభ్యంత‌రం. తెలంగాణ‌ను, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను అవ‌మానించే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఒక రాజ‌కీయ‌ పార్టీగా తానూ ఎంత న‌ష్ట‌పోతుందో బీజేపీ తెలుసుకోవాలి. ఈత రానోన్ని న‌మ్ముకొని ఈతొచ్చినోడూ మునిగిన‌ట్టు తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించి న‌ష్ట‌పోయిన‌ పార్టీల వెంటపోయి ఉన్న ఊపిరినీ ఉఫ్‌ మ‌నిపించే కాడికి తెచ్చుకుంటున్న‌ది. నీళ్లు, నిధులు, నియామ‌కాల పునాదిగా ఏర్ప‌డిన తెలంగాణకు అన్ని ర‌కాలుగా న‌ష్టం క‌లిగించే పోల‌వ‌రం ప్రాజెక్టును కేంద్రంలో ఉన్న‌ భాజ‌పా స‌ర్కార్‌ జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి యుద్ద‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేస్తున్నది. మ‌రి విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణకూ జాతీయ ప్రాజెక్టు ఇస్తామ‌న్న హామీ కేంద్ర నాయ‌క‌త్వానికి గుర్తులేదా? రాష్ట్ర నాయ‌క‌త్వమూ మ‌ర్చిపోయిందా ? ఎన్నిక‌ల పొత్తు పెట్టుకున్న తేదేపాను సంతోష పెట్ట‌డానికి అన్యాయంగా ఏడు మండ‌లాల‌ను తెలంగాణ నుంచి దూరం చేసి, ఆంధ్ర‌లో విలీనం చేయ‌డం ఇంకా ప్ర‌జ‌ల మ‌దిలో తాజాగా ఉన్న‌ది. పోలవ‌రం ప్రాజెక్టు కింద మునుగుతున్న అనేక‌ గ్రామాలు, ల‌క్ష‌లాది మంది ఆదివాసి నిర్వాసితుల గురించి తెలంగాణ నాయ‌కుల‌తో స‌హా ఏ ఒక్క‌రూ మాట్లాడ‌రు. న్యాయ వ్య‌వ‌స్థతో పాటు రాష్ట్రంలోని ఆస్తుల పంప‌కాలు జ‌రిగితేనే రాష్ట్ర విభ‌జ‌న ప‌రిపూర్ణం అవుత‌ద‌న్న‌ రాజ్యాంగ‌ప‌ర‌మైన‌ సోయి కేంద్రానికి ఉండొద్దా? పైగా హైకోర్టు విభ‌జ‌న గురించి అడిగితే ‘‘హైకోర్టు హైద‌రాబాద్ లోనే ఉంది క‌దా?’’ అని ఆంధ్రపార్టీల మాదిరిగా మాట్లాడ‌టం భాజ‌పా ప‌క్ష‌పాతానికి నిద‌ర్శ‌నం. న‌ష్ట‌పోయిన వాటిని ద‌క్కించుకునేందుకు, రాజ్యాంగ‌ హ‌క్కులు రాబ‌ట్టుకునేందుకు ఇప్ప‌టికైనా తెలంగాణ పౌర‌స‌మాజం అంతా క‌లిసి ఉద్య‌మించాల్సిన అవ‌స‌రం ఉంది. భార‌తీయ జ‌న‌తాపార్టీలో తెలంగాణ నుంచి ఉన్న ఏకైక ఎం.పిద‌త్త‌న్న. అడుక్కోంగా అడుక్కోంగా ఒక్క ప‌ద‌వి ఇచ్చారు. అదీ కూడా క్యాబినెట్ ర్యాంకు లేకుండా. అందుకేనేమో ఆయ‌న అస‌లే మాట్లాడ‌డు, మాట్లాడితే విన‌టోడే ఉండ‌డు. ఆంధ్రలో మాత్రం వెంక‌య్య‌నాయుడు, సృజ‌నా చౌద‌రి, నిర్మలా సీతారామ‌న్ ముగ్గురికి క్యాబినెట్ ర్యాంకే. మోదీ త‌ర్వాతి స్థానంలోని వెంక‌య్య నాయుడైతే చ‌క్రం తిప్ప‌ని చోటు లేదు. ఇది తెలంగాణ ప‌ట్ల వివ‌క్ష కాక మ‌రేమైత‌ది? తెలంగాణ ఏర్ప‌డిన మూడేండ్ల‌లో కేంద్రం తీరుతో రాష్ట్ర అభివృద్ధి మూరెడు ముందుకు, బారెడు వెనుక‌కు పోయింది. ఆంధ్ర అవ‌స‌రాల‌కు కావ‌లసిన‌వి ప్ర‌పంచంలో ఎక్క‌డున్నా కొని పెడుతారు. లెక్క‌లు మాత్రం అడుగరు. తెలంగాణ‌లో అమిత్ షా ఉన్న మూడు రోజుల్లో ముప్పై సార్లు పొంక‌నాలు కొట్టే ల‌క్ష‌కోట్లు ఇచ్చినామ‌ని. ఇదంతా తెలం గాణ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్త‌లేర‌ని అనుకోవ‌టం ఇక్క‌డ ఉన్న కాస్త ప‌ర‌ప‌తిని బొంద‌పెట్టుకోవ‌డ‌మే అవుతుంది. రాష్ట్రం కోసం ఉద్య‌మాలు చేసిన ప్ర‌జ‌లు తెలంగాణ‌ను అవ‌మానించే ఏ విష‌యాన్నైనా తొంద‌ర‌గా గుర్తిస్తారు. అధికారం కోసం రాజ‌కీయం చేసే హ‌క్కు రాజ‌కీయ పార్టీగా భాజ‌పాకు ఉన్న‌ది గానీ, తెలంగాణ ఆర్థిక అభివృద్ధిని మాత్రం అన్యాయంగా అడ్డుకునే హ‌క్కు లేదు. ‘‘ద‌క్షుడు లేని ఇంట వేల‌క్ష‌లు వ‌చ్చిప‌డిన నిలువ నేరునే?’’ అన్న‌ట్లు, అమిత్ షా ఆంధ్ర పెట్టుబ‌డిదారుల‌తో క‌లిసి ఊరేగడం తెలంగాణ‌లో న‌ష్ట‌దాయ‌కంగా మారింది. ఒక్క త‌ప్పుడు మాట మాట్లాడినందుకు క‌ల్వ‌కుర్తిలో స్వ‌యానా ఎన్టీఆర్‌నే ఓడించిన చైత‌న్యం తెలంగాణ ప్ర‌జ‌ల‌ది. అమిత్ షాలను మించిన పాదుషాల‌ను సైతం మ‌ట్టి క‌రిపించిన చైత‌న్యం తెలంగాణ‌కు ఉంద‌ని భాజ‌పా యాదుంచుకుంటే మంచిది.-కౌడె స‌మ్మ‌య్య‌
editorial
19,536
17-09-2017 01:19:02
ప్రాంజల జోడీకి టైటిల్‌
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌లో జరిగిన ఐటీఎఫ్‌ మహిళల టెన్నిస్‌ టోర్నీలో తెలుగు క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్‌ టైటిల్‌ గెలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ప్రాంజల-జీల్‌ దేశాయ్‌ జోడీ 6-2, 7-5తో వరుస సెట్లలో రుతుజా బోస్లే (భారత్‌)-వాల్టర్స్‌ అలెగ్జాండ్రా (ఆస్ర్టేలియా) ద్వయంపై నెగ్గింది.
sports
12,763
12-11-2017 20:30:47
ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటాం...
భోపాల్: చిత్రకూట్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో 14 వేల పైచిలుకు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఓటమిపాలవడంపై ఆ పార్టీలో అంతర్మథనం మొదలైంది. కాంగ్రెస్ అభ్యర్థి నీలాంశు చతుర్వేది తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి శంకర్ దయాళ్ త్రిపాఠిపై 14,133 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. దీనిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని తెలిపారు. ఉప ఎన్నికల్లో స్వీప్ చేసేందుకు బీజేపీ శక్తివంచన లేకుండా కృషి చేసినప్పటికీ ఫలితం నిరాశపరిచిందని అన్నారు. కారణాలను విశ్లేషించుకుంటామని, ఆత్మపరిశీలన చేసుకుంటామని ఆయన మీడియాకు తెలిపారు. నవంబర్ 9న జరిగిన పోలింగ్‌లో 65 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ మరణించడంతో ఈ ఉపఎన్నికను నిర్వహించారు.
nation
3,080
07-01-2017 01:33:33
నీతి ఆయోగ్‌ పరిధి పెంచండి
 కేంద్రానికి స్థాయీ సంఘ సూచన న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్‌ పరిధిని విస్తరించాలని కేంద్ర ప్రణాళికా శాఖకు పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసింది. ఈ సంస్థ విధివిధానాలపై మరింత స్పష్టతనివ్వాలని తెలిపింది. కాంగ్రెస్‌ సభ్యుడు వీరప్ప మొయిలీ అధ్యక్షతన స్థాయీ సంఘం నీతిఆయోగ్‌ పనితీరుపై అధ్యయనం చేసి, పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. నీతి ఆయోగ్‌ సంస్థ ఆవిర్భవించి ఇటీవల రెండేళ్లు పూర్తయ్యింది. ప్రణాళికా సంఘం పాత్ర, బాధ్యతల్లో ఉపయోగకరమైనవి, ఇప్పుడు కూడా ఆచరించతగినవి ఏమేమిఉన్నాయో వాటన్నింటినీ వ్యవస్థీకరించి, మెరుగైన ఫలితాల సాధనకు వాడుకోవాలని కమిటీ సిఫారసు చేసింది.
business
8,949
28-10-2017 17:16:55
విక్రమ్ ను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ!
ఒకే ఒక్క సినిమాతో తన రేంజ్ పెంచుకున్న టాలీవుడ్ అప్‎కమింగ్ స్టార్‎కు అనుకోని ఆహ్వానం లభించిందట. కోలీవుడ్ స్టార్ హీరో నుంచి పిలుపు రావడంతో ఎగిరి గంతేసి కలిసొచ్చాడట మన యంగ్ హీరో. 'అర్జున్ రెడ్డి' తరువాత హీరో విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోయింది. ఈ సినిమా ఎవరూ ఊహించనంత బిగ్ సక్సెస్ కావడంతో రెండేళ్ల పాటు ఈ యంగ్ హీరో కాల్షీట్స్ బుక్ అయిపోయాయి. అంతలా తన కొత్త సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, అతడి తనయుడు ధ్రువ్‎తో కలసి ఒక రోజు గడిపాడని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 'అర్జున్ రెడ్డి' కోలీవుడ్ రీమేక్ ద్వారా తన తనయుడు ధ్రువ్‎ను వెండితెరకు పరిచయం చేయాలని నిర్ణయించుకున్న హీరో విక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతను దర్శకుడు బాలాకు అప్పగించాడు. అయితే 'అర్జున్ రెడ్డి'గా అదరగొట్టిన విజయ్ దేవరకొండ ఇచ్చే సలహాలు, సూచనలు తన కుమారుడికి ఎంతగానో పనికొస్తాయని భావించిన విక్రమ్ ఒక రోజు తమతో మాట్లాడేందుకు రావాలని విజయ్ దేవరకొండను ఇన్వైట్ చేశాడట. విక్రమ్ వంటి టాలెంటెడ్ స్టార్ నుంచి ఆహ్వానం అందగానే వీలు చూసుకుని చెన్నైలో వాలిపోయిన టాలీవుడ్ 'అర్జున్ రెడ్డి' విక్రమ్, ధ్రువ్‎తో కలిసి అర్జున్ రెడ్డి సినిమా అనుభవాలను పంచుకున్నాడట. దర్శకుడు బాలా కూడా అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్ దేవరకొండను అభినందించినట్టు వినికిడి. విక్రమ్ తనయుడు ధ్రువ్‎కు కొన్ని సలహాలు ఇచ్చిన విజయ్ దేవరకొండ స్టార్ గా జాతీయ అవార్డు అందుకున్న విక్రమ్ నుంచి సలహాలు తీసుకున్నాడని సమాచారం. 'అర్జున్ రెడ్డి'గా నేచురల్ పెర్ఫామెన్స్ ఇచ్చిన విజయ్ టాలెంటెడ్ స్టార్‎గా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్‎ను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడట. మరి విజయ్ సలహాలు విక్రమ్ కుమారుడికి ఏ మేరకు ఉపయోగపడతాయో చూద్దాం.
entertainment
5,585
18-12-2017 16:40:41
కొత్త సినిమాకు సన్నీ లియోన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
హైదరాబాద్‌: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ బాషలో ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు వడి వుడయన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నీ యువరాణి పాత్రలో నటిస్తున్నారు. ఇందుకు సన్నీలియోన్ రూ.3.25 కోట్ల రెమ్యూనరేషన్ అడిగారట. నాలుగు భాషల్లో ఈ సినిమా తీస్తున్నారు కాబట్టి ఆమె అడిగిన డబ్బు ఇచ్చేందుకు నిర్మాత కూడా అంగీకరించారట. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 2018 ఫిబ్రవరి నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుంది. తెలుగులో సన్నీలియోన్ యువరాణి పాత్రలో నటించడం ఇదే తొలిసారి. సన్నీ లియోన్ తెలుగులో కరెంట్ తీగ, గరుడవేగ మూవీల్లో నటించిన విషయం తెలిసిందే.
entertainment
11,683
02-01-2017 02:05:29
ఒక ‘క్షణం’ ఆలస్యం!
మన గడియారాల్లోనూ లీప్‌ సెకన్‌ను కలిపిన శాస్త్రవేత్తలున్యూఢిల్లీ: భారత గడియారంలో ఆదివారం ఒక అదనపు సెకనును కలిపారు. లీప్‌ సెకనుగా పిలిచే ఈ అదనపు క్షణాన్ని ఉదయం 5 గంటల 29 నిమిషాల 29 సెకన్లపుడు కలిపారు. జాతీయ భౌతిక ప్రయోగశాలలోని అటామిక్‌ గడియారం శనివారం రాత్రి 23 గంటల 59 నిమిషాల 59 సెకన్లపుడు ఆగిపోయింది. ఈ గడియారాన్ని 2017లో ఒక అదనపు క్షణం యాడ్‌ చేసేలా ప్రోగ్రామ్‌ చేశారు. భూ స్వయ భ్రమణంలో వేగం మందగించినపుడు ప్రపంచ వ్యాప్తంగా గడియారాల్లో ఇలా ఒక లీప్‌ సెకనును కలుపుతుంటారు. ఒక క్షణం నిజజీవితంలో ఎలాంటి ప్రభావం చూపదు. కానీ అంతరిక్షం, కమ్యూనికేషన్‌, ఖగోళ రంగాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జాతీయ భౌతికశాస్త్ర ప్రయోగశాలలో అరుదైన 5 అటామిక్‌ గడియారాలున్నాయని.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటివి 300 మాత్రమే ఉంటాయని ప్రయోగశాల అధికారులు తెలిపారు. ఈ గడియారాలు అత్యంత కచ్చితత్వంతో పని చేస్తాయని.. 10 కోట్ల సంవత్సరాలకు ఒక సెకన్‌ తేడా రావొచ్చని వివరించారు.
nation
21,041
13-08-2017 10:02:39
భగవాన్... జీసెస్... అల్లా... థాంక్స్
జకర్తా: జీవితంలో ఏ రంగంలో రాణించాలన్నా భగవంతునిపై నమ్మకం కూడా అవసరమని అన్ని మతాలు బోధిస్తుంటాయి. దీనిని నమ్మేవారు అందుకు అనుగుణంగా నడుచుకుంటుంటారు. ఇటువంటి ఘటనే ఇటీవల ఇండోనేషియా ఫుట్‌బాల్ క్లబ్ మైదానంలో దర్శనమిచ్చింది. ఇప్పుడు ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఫొటోలో మూడు మతాల క్రీడాకారులు వారి పద్దతుల్లో భగవంతుణ్ని ప్రార్థిస్తున్నదృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చిత్రంలో హిందూ మతానికి చెందిన ఢిఫెండర్ నుగ్రహ్ నానక్, క్రైస్తవ మతానికి చెందిన ఫార్వర్డ్ ఆటగాడు యెబస్ రోనీ, ముస్లిం వర్గానికి చెందిన హమ్దీలు.. తాము గోల్ చేసిన తరువాత భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ ఫొటోను ఇండోనేషియాకు చెందిన బాలీ యునైటెడ్ క్లబ్ ఇంటర్నెట్‌లో షేర్‌చేసింది. దీనిని నెటిజన్లు అమితంగా ఇష్టపడుతున్నారు.
sports
4,103
07-01-2017 02:17:53
సరికొత్త అధ్యాయం
భారత్‌లోనే కాదు ప్రపంచ క్రికెట్‌లోనే తమకు తిరుగులేదని, తామేం చేసినా చెల్లుతుందని తలబిరుసుగా వ్యవహరించిన బీసీసీఐకి సుప్రీం తీర్పు గొడ్డలిపెట్టు. ఈ తీర్పుతో భారత క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. జస్టిస్‌ ఆర్‌ఎం లోధా కమిటీ సిఫారసులను అమలు చేయాల్సిందేనని ఎన్నిసార్లు చెప్పినా, ఎంత సమయమిచ్చినా ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. బీసీసీఐలో పాలనాపరమైన సంస్కరణల కోసం సుప్రీం కోర్టు ఆమోదించిన లోధా కమిటీ ప్రతిపాదనల్లో కొన్నింటిని వ్యతిరేకిస్తున్న బోర్డు అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌, కార్యదర్శి అజయ్‌ షిర్కేలను పదవుల నుంచి తొలగించింది. ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని జస్టిస్‌ ఏఎం ఖన్విల్కార్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పునిచ్చింది.  లోధా కమిటీ ప్రతిపాదించిన సంస్కరణల అమలును అడ్డుకోవడం కోర్టు ధిక్కారం కింద పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఠాకూర్‌, షిర్కేలకు నోటీసులు కూడా జారీ చేసింది. కాగ్‌ సభ్యుడిని బీసీసీఐకి నామినేట్‌ చేయడంపై ఠాకూర్‌ అసత్య ప్రమాణం చేశాడని, దానికతను క్షమాపణ కోరని పక్షంలో చర్యలు తప్పవని సుప్రీం కోర్టు తీవ్రస్వరంతో హెచ్చరించింది. అలాగే బీసీసీఐతోపాటు రాష్ట్ర సంఘాలన్నీ తాము ఆమోదించిన లోధా సిఫారసులను అమలు చేసి తీరాల్సిందేనని లేకుంటే కార్యవర్గ సభ్యులందరూ పదవుల్ని వదులుకోక తప్పదని కోర్టు స్పష్టం చేసింది. లోధా కమిటీ సిఫారసుల ప్రకారం 70 ఏళ్లకు పైబడినవాళ్లు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, నేరారోపణలు రుజువైనవాళ్లు, తొమ్మిదేళ్లపాటు పదవులు అనుభవించిన వాళ్లు బీసీసీఐ, రాష్ట్ర సంఘాల పదవుల్లో కొనసాగడానికి వీల్లేదు. ఒక రాష్ట్రానికి ఒకే ఓటు హక్కు. ఒకవేళ ఒక రాష్ట్రంలో ఒకటికంటే ఎక్కువ సంఘాలుంటే రొటేషన్‌ పద్ధతిలో ఓటు హక్కు కేటాయించాలి. ఒక పర్యాయం పదవి చేపట్టాక మరో పర్యాయం విరామం తీసుకుని ఆ తర్వాతే బోర్డులో, రాష్ట్ర సంఘాల్లో పదవులు చేపట్టాలి. అలా గరిష్ఠంగా తొమ్మిదేళ్లు మాత్రమే పదవిలో ఉండాలి.  బీసీసీఐ ఈ మూడు సిఫారసులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. చివరకు తగిన మూల్యం చెల్లించుకుంది. 2013 ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంతో రంగంలోకి దిగిన లోధా కమిటీ దానిపై విచారణ జరిపి చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై వేటు వేసి హెచ్చరికలు పంపినా బీసీసీఐ మేలుకోలేదు. ఆ తర్వాత లోధా కమిటీనే బోర్డులో విప్లవాత్మక మార్పులు చేపట్టకపోతే క్రికెట్‌ మనుగడకే ప్రమాదమని గుర్తించి పలు సిఫారసులు చేసింది. వాటిని ఆమోదించిన సుప్రీంకోర్టు అమలు చేసి తీరాల్సిందేనని బోర్డుకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.మొండిగా వ్యవహరించిన బోర్డుకు తగిన గుణపాఠం చెప్పింది. ఇది ఇంతటి తో ఆగేది కాదు. బీసీసీఐ ఇకనైనా సంస్కరణలు అమలు చేసి తీరాల్సిందే. లేకపోతే మరింత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కోర్టు వ్యవహారం అటుంచితే వన్డే, టీ20 కెప్టెన్సీని వదులుకుని జట్టులో మాత్రం కొనసాగుతానని ప్రకటించి మహేంద్ర సింగ్‌ ధోనీ అందర్నీ విస్మయానికి గురిచేశాడు. 2017లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ వరకు ధోనీనే కెప్టెన్‌ అని సెలెక్టర్లు గతంలోనే ప్రకటించినా మహీ అప్పటి వరకూ ఆగలేదు. మైదానంలో అతను వేసే ఎత్తుగడలాగే ఇది కూడా సాహసోపేతమైనదే. కానీ 2014లోనే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహీ నేడు పరిమిత ఓవర్ల కెప్టెన్సీని త్యజించేందుకు సైతం వెనకాడలేదు. టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ నిరూపించుకున్న తరుణంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇదే సరైన సమయమని భావించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమిది. కాస్త ముందుగానే ప్రకటించినా ఇది సరైనదే. క్రికెట్‌లో ధోనీ అందుకోని ఘనతలు లేవు. 2007 వన్డే వరల్డ్‌కప్‌ వైఫల్యంతో భారత్‌ సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో పగ్గాలు అందుకున్న మహేంద్రుడు.. దాదాపు పదేళ్లపాటు జట్టును సజావుగా నడిపించాడు. టీ20, వన్డే వరల్డ్‌కప్‌లతోపాటు చాంపియన్స్‌ ట్రోఫీని కూడా దేశానికి అందించిన సారథి. అతని హయాంలోనే భారత్‌ నెంబర్‌వన్‌ టెస్టు టీమ్‌గా వెలుగొందింది. భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గానూ ధోనీ ఘనత వహించాడు. ఇవన్నీ అతనికి అంత తేలిగ్గా దక్కలేదు. సీనియర్లు, జూనియర్లతో కూడిన జట్టును అతడు ఎంతో నేర్పుగా నడిపించాడు. తన వల్లే జట్టు గెలిచిందని గొప్పలు చెప్పుకోలేదు కానీ.. ఓటమికి మాత్రం తానే బాధ్యుడినని చెప్పుకునే గొప్ప గుణమే అతన్ని శిఖరాగ్రాన నిలబెట్టింది. సంధికాలంలోనూ టీమిండియాను సరైన దిశలో నడిపించిన మహీ ఒక పరిపూర్ణమైన జట్టును తన వారసుడు విరాట్‌కు అందించాడు. ఇన్నాళ్లూ టెస్టులకు మాత్రమే పరిమితమైన విరాట్‌ కోహ్లీ సారథ్యం ఇకపై మూడు ఫార్మాట్లకూ విస్తరించనుంది. సవాళ్లకు ఎదురెళ్లే కోహ్లీకి ఇది అతిపెద్ద సవాల్‌. దాన్ని ఎలా అధిగమిస్తాడన్న ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2014లో ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న కోహ్లీ తన కర్తవ్యానికి సంపూర్ణ న్యాయం చేశాడు. ఈ రెండేళ్లకాలంలో ఆటగాడికానే కాదు సారథిగానూ ఎంతో పరిణతి సాధించాడు. ఓ పక్క జట్టుని విజయపథంలో నడుపుతూనే మరోపక్క బ్యాట్స్‌మన్‌గా పరుగుల వరద పారించాడు. వరుసగా ఐదు టెస్టు సిరీస్‌లు నెగ్గి ధోనీకి తగ్గ వారసుడని నిరూపించుకున్నాడు. పైగా అన్ని విభాగాల్లోనూ అదరగొడుతున్న యువ జట్టుతోపాటు కెప్టెన్‌గా వైదొలిగినా ఆటగాడిగా కొనసాగుతానన్న ధోనీ అండ కూడా కోహ్లీకి ఉంది. కాబట్టి విరాట్‌కు తిరుగుండకపోవచ్చు!
editorial
12,730
11-08-2017 02:09:47
రిటైర్‌ కాబోతున్న ఏచూరికి ప్రశంసలు
రిటైర్‌ కాబోతున్న సీతారాం ఏచూరి(సీపీఎం) మరో ఇద్దరు సభ్యులకు రాజ్యసభ గురువారం వీడ్కోలు పలికింది. వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు శుక్రవారం ముగుస్తున్న నేపథ్యంలో...వారి సేవలను ఘనంగా కొనియాడుతూ ప్రసంగా లు కొనసాగాయి. ఏచూరి గొప్ప పార్లమెంటేరియన్‌ అని డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ అన్నారు.
nation
18,036
19-03-2017 19:09:56
మోదీ అభివృద్ధి మంత్రమే ప్రభుత్వ ఎజెండా
లక్నో: ఉత్తరప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి బాటలోనే పయనించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని వాగ్దానం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం తొలిసారి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడారు. యూపీలో శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. మహిళా భద్రతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. గ్రామీణాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేస్తామని, ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం జవాబుదారీగా ఉంటుందని చెప్పారు.
nation
19,721
08-02-2017 19:20:58
కోహ్లీ, అశ్విన్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ ఎవరికి ఎక్కువ భయపడుతున్నాడో తెలుసా?
హైదరాబాద్: రేపటి నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్ మ్యాచ్ మొదలు కానుంది. అయితే ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ మీడియాతో మాట్లాడాడు. కోహ్లీ, అశ్విన్‌లలో ఎవరంటే ఎక్కువగా టెన్షన్ పడుతున్నారని విలేకర్లు అడగ్గా రహీమ్ ఏం చెప్పాడో తెలుసా? నిజాయితీగా చెప్పాలంటే ఒక జట్టు నెంబర్ వన్ అయ్యిందంటే అది ఒకరిద్దరి వల్ల కాదన్నాడు. కోహ్లీ, అశ్విన్‌లతో పాటు పుజారా, రాహుల్, నాయిర్ వంటి ఆటగాళ్లు ఇంగ్లండ్‌పై బాగా ఆడారు. అశ్విన్ అన్ని సార్లు ఐదు వికెట్లు తీయలేకపోయినప్పటికీ అద్భుతమైన బౌలర్. ఇక విరాట్ కోహ్లీ అయితే ప్రపంచ ఉత్తమ బ్యాట్స్‌మన్‌లో ఒకడు. ఇద్దరూ మాకు టెన్షన్ పెట్టే ఆటగాళ్లే, కానీ ఇతర ఆటగాళ్లు కూడా బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా బౌలర్లు కూడా బ్యాటింగ్ చేయగలుగుతున్నారని అన్నాడు బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్. టెస్ట్ బ్యాటింగ్‌ ర్యాంకింగ్‌లో కోహ్లీ రెండో స్థానంలో ఉంటే బౌలింగ్‌లో అశ్విన్ మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
sports
2,993
16-04-2017 23:33:37
ఇపిఎఫ్‌లో ఈ మార్పులు గమనించారా?
రిటైర్‌మెంట్‌ తర్వాత ఉద్యోగులకు ప్రధాన ఆసరా ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్‌). ఈ భవిష్య నిధికి సంబంధించి ఇటీవల ఐదు ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటంటే... బీమా కంపెనీలు అపుడపుడు పాలసీదారులకు లాయల్టీ బోనస్‌ చెల్లిస్తుంటాయి. అయితే ఉద్యోగం చేసినన్నాళ్లూ క్రమం తప్పకుండా నెలనెలా ఇపిఎఫ్‌ చెల్లించే ఉద్యోగులకు మాత్రం ఇప్పటివరకు అలాంటి ప్రయోజనం లేదు. ఇక కొత్తగా 20 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఇపిఎఫ్‌లో చందాదారులుగా ఉన్న ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌ సమయంలో రూ.50,000 వరకు లాయల్టీ కమ్‌ లైఫ్‌ బెనిఫిట్‌గా చెల్లిస్తారు. ఏదైనా అంగవైకల్యం ఏర్పడి చందాదారుడు 20 ఏళ్ల కంటే తక్కువ కాలం ఇపిఎఫ్‌ చందా చెల్లించివారికీ ఈ పథకాన్ని వర్తింప చేయాలని ఇపిఎఫ్‌ఒ బోర్డు నిర్ణయించింది. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ఇపిఎఫ్‌ చందాదారులకు ఈ పథకం అమలులోకి వస్తుంది. ఇప్పటి వరకు ఇపిఎఫ్‌ చందాదారుడు చనిపోతే, వారి వారసులకు రూ.6 లక్షల వరకు బీమా కింద నష్ట పరిహారంగా లభిస్తోంది. అయితే దీనికి కనీస పరిమితి అంటూ లేదు. శాశ్వత అంగవైకల్యం పొందిన ఇపిఎఫ్‌ సభ్యులకూ ఎలాంటి సర్వైవింగ్‌ ప్రయోజనాలూ లేవు. ఇక నుంచి ఎవరైనా ఇపిఎఫ్‌ చందాదారుడు చనిపోతే, వారి కుటుంబ సభ్యులకు బీమా కింద కనీసం రూ.2.5 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని ఇపిఎఫ్‌ఒ సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ (సిబిటి) సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనకూ కేంద్ర ప్రభుత్వ ఆమోద ముద్ర పడాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పిఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ చెల్లిస్తారు. గత ఏడాది డిసెంబర్‌లోనే ఇపిఎఫ్‌ఒ ట్రస్టీలు దీనిపై నిర్ణయం తీసుకున్నారు. నిజానికి పిఎఫ్‌ వడ్డీ రేటు అర శాతమైనా తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి కార్మిక శాఖపై ఒత్తిడి వచ్చింది. ట్రస్టీలు మాత్రం అందుకు తలొగ్గకుండా 8.65 శాతం వడ్డీ రేటుకు ఓటేశారు. ఈ వడ్డీ రేటు చెల్లించినా ఇపిఎఫ్‌ఒ దగ్గర ఇంకా రూ.158 కోట్ల మిగులు ఉంటుందని కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పడం విశేషం. ఇప్పటి వరకు ఏటా పిఎఫ్‌ ద్వారా సమకూరే నిధుల్లో 10 శాతం నిధులను ఇటిఎఫ్‌ల ద్వారా స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని 15 శాతానికి పెంచాలని ప్రతిపాదించినా, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనను తాత్కాలింగా పక్కన పెట్టారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.18,069 కోట్ల నిధులను స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. ఈ పెట్టుబడులపై సగటున 18.13 శాతం రాబడులు వచ్చాయి. రాబడులు బాగానే ఉన్నా, స్టాక్‌ మార్కెట్‌ ఆటుపోట్లతో అసలుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
business
21,559
12-02-2017 00:44:30
పోరాటమే ఆయుధం
తొలి రెండ్రోజులూ టీమిండియా బ్యాట్స్‌మెన్‌ జోరు ప్రదర్శిస్తుంటే.. బంగ్లాదేశ్‌ నిస్సహాయతను చూసిన భారత అభిమానులు మ్యాచ్‌ మూడ్రోజులా.. నాలుగు రోజులా అని లెక్కలేసుకున్నారు. కానీ.. మూడోరోజు బంగ్లా పోరాటంతో అంచనాలన్నీ తారుమారయ్యాయి. బౌలర్లు విఫలమైనంత మాత్రాన తమ పనైపోలేదు.. బ్యాటింగ్‌లో తమ పోరాటం ఇంకా మిగిలే ఉందని పర్యాటక జట్టు నిరూపించింది! కాస్త లేటైనా.. లేటె్‌స్టగా రేసులోకొచ్చి మ్యాచ్‌ను ఆసక్తిగా మార్చింది! సీనియర్‌ ఆటగాళ్లు షకీబల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌ బాధ్యతగా ఆడడం.. స్పిన్‌ సంచలనం మెహ్దీ హసన్‌ మిరాజ్‌ కూడా బ్యాట్‌తో మెరవడంతో.. మ్యాచ్‌ రసపట్టులో పడింది. వాస్తవానికి బౌలింగ్‌లో స్వయం తప్పిదాలతో అవకాశాలు చేజార్చుకున్న పర్యాటక జట్టు వాటిని పునరావృతం చేసి మూడో రోజునూ పేలవంగానే ఆరంభించింది. అవసరం లేని చోట రన్‌కు వెళ్లిన తమీమ్‌ ఇక్బాల్‌ ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో పరుగైనా జోడించకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వెంటవెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయి 104/4తో నిలిచిన బంగ్లా ఇన్నింగ్స్‌ ఇక ఎంతోసేపు సాగదనిపిం చింది. కానీ.. కీలక సమయంలో షకీబల్‌ సత్తా చాటాడు. 103 బంతుల్లోనే 14 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. మరోఎండ్‌లో కెప్టెన్‌ రహీమ్‌ ఇబ్బంది పడుతున్నా ఎదురుదాడి అస్త్రంతో ఆతిథ్య బౌలర్లపై పైచేయి సాధించే ప్రయత్నం చేశాడు.  షకీబల్‌, రహీమ్‌ క్రీజు లో ఉన్నంత సేపూ ఆటలో బంగ్లాదే పైచే యి. అయితే, అవసరం లేని సమయంలో ఆవేశానికి పోయిన షకీబల్‌ వికెట్‌ పారేసుకున్నాడు. ఆ వెంటనే.. షబ్బీర్‌ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో మరో వికెట్‌ పడితే బంగ్లా కోలుకోవడం కష్టమయ్యేది. అయితే ఈ ప్రభావం జట్టుపై పడకుండా చూసిన ఘనత ముష్ఫికర్‌దే! తన అనుభవాన్నంతా రంగరించి.. మెహ్దీ హసన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించాడు. దాదాపు ఐదు గంటలపాటు క్రీజులో నిలిచి భారత బౌలర్లకు ఎదురొడ్డి పోరాడాడు. ఒక దశలో 65 బంతుల వరకూ బౌండ్రీల జోలికెళ్లలేదంటే అతనెంత సహనంతో బ్యాటింగ్‌ చేశాడో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో హసన్‌ పోరాటాన్ని తక్కువ చేయలేం. ఈ టెస్టుకు ముందు అతణ్ని నాణ్యమైన స్పిన్నర్‌గానే పరిగణించిన భారత్‌.. అతనిలా బ్యాట్‌తో రెచ్చిపోయి ఆడగలడని ఊహించి ఉండదు. ఈ మ్యాచ్‌కు ముం దు నాలుగు టెస్టులే ఆడిన మిరాజ్‌ వాటిలో చేసింది 20 పరుగులే. కానీ, ఫస్ట్‌క్లాస్‌లో ఐదు అర్ధ సెంచరీలు చేసిన అనుభవం ఈ మ్యాచ్‌లో అక్కరకొచ్చింది. ఆడుతుంది నెంబర్‌వన్‌ జట్టుతో అయి నా.. అతని గుండె నిబ్బరం ముచ్చటగొలిపింది. రెండు గంటలకు పైగా క్రీజులో నిలిచిన మెహ్దీ తానెదుర్కొన్న 103 బంతుల్లో ఎక్కడా ఇబ్బంది పడలేదు. పేసర్లు సంధించిన బౌన్సర్లు, షార్ట్‌పిచ్‌ బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్న హసన్‌.. స్పిన్నర్లకు తన డిఫెన్స్‌ను ఛేదించే అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా అశ్విన్‌ బౌలింగ్‌లోనే అతను నాలుగు ఫోర్లు కొట్టడం విశేషం. మన స్పిన్‌ ద్వయం మెహ్దీని ఇబ్బంది పెట్టలేకపోయింది. బంగ్లా ఎంత పోరాడినా భారత స్కోరుకి ఇంకా 350 పైచిలుకు పరుగుల దూరంలోనే ఉంది. గెలుపు అసాధ్యమే. డ్రా చేసుకోవాలంటే మరో రెండు రోజులు పోరాడాలి. మూడో రోజు అజేయంగా నిలిచిన ముష్ఫికర్‌, మిరాజ్‌ జోడీ ఆదివారం ఎంత సేపు నిలుస్తుందన్నదానిపైనే ఫలితం ఆధారపడనుంది.
sports
15,254
14-05-2017 02:16:38
రాన్సమ్‌వేర్‌ అంటే?
రాన్సమ్‌వేర్‌ అనేది మాల్‌వేర్లలో ఒకరకం. చెడు చేసే ఉద్దేశంతో రాసేదేదైనా మాల్‌వేరే. ‘వైరస్‌’ కూడా మాల్‌వేర్‌లో ఒకరకం. ఇంకా.. యాడ్‌వేర్‌, స్పైవేర్‌, న్యాగ్‌వేర్‌ ఇలా మాల్‌వేర్లు చాలా రకాలుంటాయి. వీటిలో ఒక్కోదాన్ని వ్యాపింపజేయడం వెనుక ఒక్కో ఉద్దేశముంటుంది. యాడ్‌వేర్‌ మన సిస్టమ్‌లోకి ప్రవేశిస్తే ఇంటర్‌నెట్‌లో మన వినియోగాన్ని బట్టి మనకు ఇష్టమైన అంశాలకు సంబంధించిన యాడ్‌లు మాత్రమే కనబడేలా చేస్తుంది. అదే స్పైవేర్‌ ప్రవేశిస్తే.. కంప్యూటర్‌ ద్వారా మనం చేసే పనులన్నిటిపైనా నిఘా వేస్తుందన్నమాట. ఇక హ్యాకర్లు రాన్సమ్‌వేర్‌ను వ్యాపింపజేయడం వెనుక ప్రధాన ఉద్దేశం.. కేవలం డబ్బు దోచుకోవడమే. రాన్సమ్‌ అంటే.. డబ్బులిచ్చి చెర నుంచి విడిపించుకోవడం అని అర్థం. ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది ఈ తరహా మాల్‌వేరే. తాజాగా వ్యాపిస్తున్నది వాన్నా క్రై అనే రాన్సమ్‌వేర్‌. దీని అసలు పేరు.. వాన్నా క్రిప్ట్‌. ఏడిపించే ఉద్దేశంతో రూపొందించింది కాబట్టి ‘క్రిప్ట్‌’ అనే పదంలో పీటీ అక్షరాలను తొలగించి ‘వాన్నా క్రై’గా వ్యవహరిస్తున్నారు. వ్యాప్తి ఇలా..ఒకేసారి కొన్ని వేల మందికి ఈమెయిల్స్‌ను పంపే సాఫ్ట్‌వేర్‌లు చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా.. ‘మీకు జాబ్‌ వచ్చింది’.. ‘మీకు లాటరీ వచ్చింది’.. అంటూ ఊరించే మెయిల్స్‌ను పంపారు. అందులోని లింకులను క్లిక్‌ చేయగానే రాన్సమ్‌వేర్‌ తనపని తాను చేయడం మొదలుపెట్టింది. సిస్టమ్‌లోని ఫైల్స్‌ అన్నీ లాక్‌ అయిపోయి, ఒక హెచ్చరిక విండో ప్రత్యక్షమవుతోంది. హ్యాకర్లు అడిగిన 300 డాలర్ల సొమ్మును బిట్‌కాయిన్లలో చెల్లించిన తర్వాత డీక్రిప్ట్‌ చేయడానికి అవసరమైన కీవర్డ్స్‌ పంపుతున్నారు. వాన్నాక్రై రాన్సమ్‌వేర్‌ వ్యాప్తి.. గుర్తుతెలియని ఒక క్రిమినల్‌ నెట్‌వర్క్‌ చేసిన నిర్వాకంగా టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. మన దేశంలో ఎన్ని ఐటీ కంపెనీలపై ఈ దాడులు జరిగాయో కచ్చితమైన సమాచారం లేదు. విప్రో కంపెనీలోని కొన్ని సిస్టమ్స్‌పై దాడులు జరిగాయనే వార్తలు వచ్చాయి.  ఇలా భద్రంయాంటీవైర్‌స ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. తెలియని వ్యక్తుల దగ్గర నుంచి వచ్చే మెయిల్స్‌ను, వెబ్‌సైట్‌ లింక్‌లను ఓపెన్‌ చేయకూడదు.కంప్యూటర్‌లో ఉన్న ఫైళ్లన్నిటినీ బ్యాకప్‌ చేయడం కష్టం కానీ.. కీలకం అనుకున్న ఫైళ్లకు మాత్రం తప్పనిసరిగా వేరే చోట కూడా ఒక కాపీ పెట్టుకోవడం చాలా ముఖ్యం. క్లౌడ్‌ సర్వీసులను వినియోగించుకోవడం మరో మార్గం.
nation
15,307
20-03-2017 03:44:26
యూపీ పీఠంపై బీజేపీ యోగి
లఖ్‌నవ్‌, మార్చి 19: ఉత్తరప్రదేశ్‌లో 14 ఏళ్ల వనవాసాన్ని ముగించుకుని బీజేపీ మళ్లీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. గోరఖ్‌నాథ్‌ దేవాలయ ప్రధాన పూజారి, గోరఖ్‌నాథ్‌ మఠాధిపతి, గోరఖ్‌పూర్‌ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ (44) రాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేశారు. కాషాయ వస్త్రాలను ధరించే ఆయన ప్రమాణం చేశారు. ఆదివారం మధ్యాహ్నం లఖ్‌నవ్‌లోని కాన్షీరాం స్మృతి ఉపవన్‌ మైదానంలో.. ప్రధాని మోదీ సమక్షంలో.. బీజేపీ, ఎన్డీఏలకు చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల నడుమ.. యోగితో గవర్నర్‌ రామ్‌నాయక్‌ ప్రమాణం చేయించారు. ఉపముఖ్యమంత్రులుగా కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, దినేశ్‌ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. మరో 44 మందిని యోగి తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. 22 మంది కేబినెట్‌ మంత్రులు, 9 మంది స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, ఇంకో 13 మంది సహాయ మంత్రులతోనూ గవర్నర్‌ ప్రమాణం చేయించారు. వీరిలో సూర్యప్రతాప్‌ షాహి, సురేశ్‌ ఖన్నా, స్వామి ప్రసాద్‌ మౌర్య, సతీశ్‌ మహానా, రీటా బహుగుణ జోషీ, ధరంపాల్‌సింగ్‌, బ్రిజేశ్‌ పాఠక్‌, బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత శర్మ, పార్టీ ఏపీ ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు. అనంతరం కొత్తగా నిర్మించిన లోక్‌భవన్‌లో ఆదిత్యనాథ్‌ పదవీబాధ్యతలు స్వీకరించారు.
nation
14,299
15-09-2017 13:21:27
అన్నా డీఎంకే గుర్తుపై హైకోర్టు ఆదేశాలు
చెన్నై : అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు ‘రెండు ఆకులు’ కోసం వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మద్రాస్ హైకోర్టు గడువు విధించింది. వచ్చే నెల 31లోగా ఈ సమస్యను పరిష్కరించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అన్నాడీఎంకేలోని పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు ఎన్నికల గుర్తు కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘రెండు ఆకులు’ గుర్తు తమదంటే తమదంటూ ఈ వర్గాలు ఎన్నికల సంఘానికి అఫిడవిట్లు సమర్పించాయి. వీరిలో ఏ వర్గానికి ‘రెండు ఆకులు’ గుర్తును కేటాయించాలో వచ్చే నెల 31 లోగా నిర్ణయించాలని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని శుక్రవారం ఆదేశించింది.
nation
16,883
13-12-2017 18:57:52
మరో కేజ్రీవాల్ పుట్టకూడదు : అన్నా హజారే
న్యూఢిల్లీ : అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఉద్యమం ద్వారా మరో అరవింద్ కేజ్రీవాల్ ఉద్భవించకూడదన్నారు. మంగళవారం ఆగ్రాలో షాహిద్ స్మారక్ వద్ద బహిరంగ సభలో హజారే మాట్లాడారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ మార్చి 23న న్యూఢిల్లీలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. పెద్ద ఎత్తున రైతులు ఈ సభకు హాజరు కావాలని కోరారు. రైతుల కోసం పని చేసే ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. అన్నా హజారే 2011లో నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్న సంగతి తెలిసిందే. హజారేతో కేజ్రీవాల్‌కు 2012లో విభేదాలు వచ్చాయి. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. అనంతరం ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.
nation
18,447
18-12-2017 02:32:07
ఆలూ కిలో 20పైసలే!
ఆగ్రా, డిసెంబరు 17: ఆలూ రైతుకు గడ్డుకాలం దాపురించింది. ఎన్నడూ లేనివిధంగా ఆలుగడ్డల ధర ఒక్కసారిగా పతనమైంది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో 50 కేజీల బ్యాగ్‌ కేవలం రూ.10 మాత్రమే పలుకుతోంది. అంటే కిలో ధర కేవలం 20పైసలే అన్నమాట. గత జూలైలో ఇదే బ్యాగ్‌ రూ.400 వరకూ పలికింది. నాటినుంచీ ధర పతనమవుతూనే వస్తోంది. ఇదిలా ఉండగా, కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన పంట దిగుబడిని మార్కెట్‌కు తరలించాలంటే అక్కడి నిర్వాహకులకు ఒక్కో బ్యాగ్‌కు రూ.110 చొప్పున చెల్లించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో స్టోరేజీ, రవాణా చార్జీలు భరించలేని రైతులు ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో ఒక్క ఆగ్రా జిల్లాలోనే 240 వరకూ కోల్డ్‌స్టోరేజ్‌లుండగా, అధిక శాతం తమ ప్రిజర్వేషన్‌ మిషన్లను స్విచ్‌ ఆఫ్‌ చేసేశాయి. వాటిలో ఉంచిన సరుకు కుళ్లిపోతుండటంతో ఇప్పటి వరకూ 2.5లక్షల టన్నులకు పైగా ఆలుగడ్డలను పశువులకు మేతకోసం రోడ్ల వెంబడి పారబోశారు.
nation
4,506
03-06-2017 03:44:48
నవజాగృతిలో ‘విద్యావంతులు’
తెలంగాణ సాధన కోసం ఒక పోరాటం, అభివృద్ధికై మరో పోరాటం అని జయశంకర్‌ అందించిన సిద్ధాంత బలంతో ప్రజలు కేంద్రంగా ప్రజాస్వామిక సూత్రాల ఆధారంగా అభివృద్ధి జరగాలి. ఒక విజయం మరో ఉదయం కోసమంటూ సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ సాధనకై కొత్త ఉద్యమ ప్రస్థానాన్ని తెలంగాణ విద్యావంతుల వేదిక ఆరంభించింది. దశాబ్దాలుగా కొనసాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజాస్వామిక, ప్రజాసంఘాలు ఒకవైపు రాజకీయపార్టీలు మరొకవైపు వేర్వేరు పాయలుగా అందోళనలు జరిపాయి. ప్రధానంగా 90వ దశకంలో ప్రజాస్వామిక శక్తుల, ప్రజాసంఘాల ఉద్యమాలతో తెలంగాణ పోరాటం గుణాత్మక మార్పు తీసుకుంది. ఉద్యమం తన పరిధిని, విస్తృతిని పెంచుకుంటున్న సందర్భంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం సాగించిన తీవ్ర నిర్బంధం, అణచివేతలను ఎదుర్కొంటూనే 2000 సంవత్సరంలో తెలంగాణ గడ్డమీద మరొక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అదే టీఆర్‌ఎస్‌ పార్టీ. ఓట్లు, సీట్లు, లాబీయింగ్‌ల పేరుతో కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలపై జరుగుతున్న దాడిని ఎదుర్కోవడానికి సమర్థమైన వ్యూహాన్ని గాని నిర్మాణాన్ని గాని టీఆర్‌ఎస్‌ రూపొందించుకోలేక పోవడంతో ప్రజలలో నిరాశ పెరిగింది.ఆనాటి పరిస్థితులలో తెలంగాణకు విద్యావంతుల మీద తెలంగాణ ఉద్యమ గురుతర బాధ్యత ఉన్నదని భావించి ప్రొఫెసర్‌ జయశంకర్‌ సర్‌ ఏర్పాటుచేసిన సంస్థ తెలంగాణ విద్యావంతుల వేదిక. టీఆర్‌ఎస్‌లో భాగం కాకుండా ఉద్యమానికి దోహదపడాలి అనుకొని వైయక్తికంగా ఎవరికి వారు కృషి చేస్తున్న సందర్భంలో ఆ వ్యక్తుల, శక్తుల కలయికతో 2004లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆవిర్భవించింది. ఆధునిక తెలంగాణ చరిత్ర అన్ని ప్రధాన ఘట్టాల్లో విద్యావంతులు ప్రధాన పాత్ర పోషించారు. అది వందేమాతరం ఉద్యమం కావచ్చు, ఆర్యసమాజం ఆవిర్భావం కావచ్చు, అంటరాని తనానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ముల్కీ ఉద్యమం, తెలంగాణ సాయుధపోరాటం, ప్రాతినిధ్య ప్రభుత్వం కొరకు ఆందోళన, స్టేట్‌ కాంగ్రెస్‌ నిర్మాణం, సోషలిస్టు ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, నక్సల్బరీ పోరాటం... ఇలా ప్రతి ఘట్టంలోను ప్రజా చైతన్యాన్ని వ్యక్తీకరించడం, ప్రజాసమస్యలను వెలుగులోనికి తేవడం, ఆ సమస్యల పరిష్కారానికై తలెత్తిన ఉద్యమాలకు మార్గదర్శకం చేయడం మనం చూశాం. ఈ నేపథ్యంలో ఆ చారిత్రక వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ సాధన మలిదశ ఉద్యమంలో తన కార్యాచరణను రూపొందించుకొని ఉద్యమంలో భాగమైంది. తెలంగాణ భావజాల వ్యాప్తి నుంచి లక్ష్యసాధన దిశగా ఉద్యమ సంస్థగా అన్ని శక్తులను ఏకం చేసింది తెలంగాణ విద్యావంతుల వేదిక. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు సానుకూలంగా, క్రీయాశీలకంగా రాజకీయపార్టీలు పనిచేసే విధంగా ఒత్తిడి తెచ్చింది. తెలంగాణ భాష, చరిత్ర, సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తూ, సీమాంధ్ర వలసవాద పెట్టుబడిదారీ రాజకీయ శక్తులపై ప్రజాప్రతిఘటన ఉద్యమాలను బలోపేతం చేసింది తెలంగాణ విద్యావంతుల వేదిక. సకల జనుల గొంతుక తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీలో ప్రధాన భాగస్వామిగా ఉంటూ ఉత్తుంగ తరంగ కెరటంలా సాగుతున్న తెలంగాణ పోరులో వెల్లడవుతున్న ప్రజా ఆకాంక్షలను పోగుపడుతున్న ప్రజా చైతన్యాన్ని అర్థం చేసుకుంటూ 2013లో సాగర సమాలోచన జరిపి ఏర్పడబోయే రాష్ట్రం ఎలా అభివృద్ధి జరగాలో ప్రాథమిక చర్చను జరిపి దిశా నిర్దేశం చేసింది. 2014 ఎన్నికల సందర్భంలో తెలంగాణ ప్రజా సమస్యలపై పీపుల్స్‌ ఎజెండాను రూపొందించి అన్ని పార్టీలు ఈ ఎజెండాను తమ ఎన్నికల మ్యానిఫెస్టోగా అమలుచేయాలని కోరింది. తెలంగాణ సాధన కోసం ఒక పోరాటం, అభివృద్ధికై మరో పోరాటం అని జయశంకర్‌ సర్‌ అందించిన సిద్ధాంత బలంతో ప్రజలు కేంద్రంగా సామాజిక న్యాయం, సమన్యాయం, ప్రజాస్వామిక సూత్రాల ఆధారంగా అభివృద్ధి జరగాలని కోరింది. ఒక విజయం మరో ఉదయం కోసమంటూ సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ సాధనకై కొత్త ఉద్యమ ప్రస్థానంలోకి తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రవేశించింది. తెలంగాణ గడ్డ సీమాంధ్ర రాజకీయ నాయకత్వం నుంచి విముక్తమై స్వీయ రాజకీయ శక్తులే రాజ్యమేలుతున్నప్పటికి సీమాంధ్ర పెట్టుబడిదారీ రాజకీయ సంస్కృతిలో ఒదిగి ఎదిగిన నాయకత్వం కాబట్టి అదే పాలనా సంస్కృతిని కొనసాగిస్తుంది. ప్రభుత్వాన్ని తమ సొంత ఆస్తిగా భావిస్తూ అప్రజాస్వామిక నిర్ణయాలతో కాంట్రాక్టులు, కమీషన్లు, ఓట్లు, సీట్లు, మానవీయ ముసుగు ఓటు బ్యాంకు పథకాలతో ప్రచార ఆర్భాటాలు చేస్తుంది. ఉద్యమ ఆకాంక్షను మరిచి తెలంగాణ నిర్మాణాత్మక అభివృద్ధికి బదులుగా తెలంగాణ సంపదను కార్పోరేట్లకు, కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నది. తెలంగాణ అభివృద్ధికై స్వీయ అస్తిత్వ కోణంలో ప్రణాళికను, పథకాలను రూపొందించకుండా సీమాంధ్ర పాలకులు రూపొందించి అమలు చేసిన విధ్వంసకర అభివృద్ధి నమూనానే అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీమాంధ్ర రాజకీయ నాయకత్వం నుంచి విముక్తమైన తెలంగాణను ఆ రాజకీయ సంస్కృతికి భిన్నమైన ప్రత్యామ్నాయ, ప్రజాస్వామిక రాజకీయ విలువల కోసం భావజాల వ్యాప్తిని తెలంగాణ విద్యావంతుల వేదిక కొనసాగిస్తుంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల విలువ ఆధారంగా ఆర్థిక రాజకీయ, సామాజిక సమానత్వం రావాలని, పాలనలో, పైసాలో ప్రజా భాగస్వామ్యాన్ని, పారదర్శకత్వాన్ని కోరుతూ, సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ పోరు సమరశంకం పూరిస్తూ తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకే చెందాలని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్‌ చేస్తోంది.ధర్మార్జున్‌రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ విద్యావంతుల వేదిక(నేడు, రేపు వరంగల్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక 6వ మహాసభ) దశాబ్దాలుగా కొనసాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజాస్వామిక, ప్రజాసంఘాలు ఒకవైపు రాజకీయపార్టీలు మరొకవైపు వేర్వేరు పాయలుగా అందోళనలు జరిపాయి. ప్రధానంగా 90వ దశకంలో ప్రజాస్వామిక శక్తుల, ప్రజాసంఘాల ఉద్యమాలతో తెలంగాణ పోరాటం గుణాత్మక మార్పు తీసుకుంది. ఉద్యమం తన పరిధిని, విస్తృతిని పెంచుకుంటున్న సందర్భంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం సాగించిన తీవ్ర నిర్బంధం, అణచివేతలను ఎదుర్కొంటూనే 2000 సంవత్సరంలో తెలంగాణ గడ్డమీద మరొక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అదే టీఆర్‌ఎస్‌ పార్టీ. ఓట్లు, సీట్లు, లాబీయింగ్‌ల పేరుతో కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలపై జరుగుతున్న దాడిని ఎదుర్కోవడానికి సమర్థమైన వ్యూహాన్ని గాని నిర్మాణాన్ని గాని టీఆర్‌ఎస్‌ రూపొందించుకోలేక పోవడంతో ప్రజలలో నిరాశ పెరిగింది.ఆనాటి పరిస్థితులలో తెలంగాణకు విద్యావంతుల మీద తెలంగాణ ఉద్యమ గురుతర బాధ్యత ఉన్నదని భావించి ప్రొఫెసర్‌ జయశంకర్‌ సర్‌ ఏర్పాటుచేసిన సంస్థ తెలంగాణ విద్యావంతుల వేదిక. టీఆర్‌ఎస్‌లో భాగం కాకుండా ఉద్యమానికి దోహదపడాలి అనుకొని వైయక్తికంగా ఎవరికి వారు కృషి చేస్తున్న సందర్భంలో ఆ వ్యక్తుల, శక్తుల కలయికతో 2004లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆవిర్భవించింది. ఆధునిక తెలంగాణ చరిత్ర అన్ని ప్రధాన ఘట్టాల్లో విద్యావంతులు ప్రధాన పాత్ర పోషించారు. అది వందేమాతరం ఉద్యమం కావచ్చు, ఆర్యసమాజం ఆవిర్భావం కావచ్చు, అంటరాని తనానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ముల్కీ ఉద్యమం, తెలంగాణ సాయుధపోరాటం, ప్రాతినిధ్య ప్రభుత్వం కొరకు ఆందోళన, స్టేట్‌ కాంగ్రెస్‌ నిర్మాణం, సోషలిస్టు ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, నక్సల్బరీ పోరాటం... ఇలా ప్రతి ఘట్టంలోను ప్రజా చైతన్యాన్ని వ్యక్తీకరించడం, ప్రజాసమస్యలను వెలుగులోనికి తేవడం, ఆ సమస్యల పరిష్కారానికై తలెత్తిన ఉద్యమాలకు మార్గదర్శకం చేయడం మనం చూశాం. ఈ నేపథ్యంలో ఆ చారిత్రక వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ సాధన మలిదశ ఉద్యమంలో తన కార్యాచరణను రూపొందించుకొని ఉద్యమంలో భాగమైంది. తెలంగాణ భావజాల వ్యాప్తి నుంచి లక్ష్యసాధన దిశగా ఉద్యమ సంస్థగా అన్ని శక్తులను ఏకం చేసింది తెలంగాణ విద్యావంతుల వేదిక. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు సానుకూలంగా, క్రీయాశీలకంగా రాజకీయపార్టీలు పనిచేసే విధంగా ఒత్తిడి తెచ్చింది. తెలంగాణ భాష, చరిత్ర, సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తూ, సీమాంధ్ర వలసవాద పెట్టుబడిదారీ రాజకీయ శక్తులపై ప్రజాప్రతిఘటన ఉద్యమాలను బలోపేతం చేసింది తెలంగాణ విద్యావంతుల వేదిక. సకల జనుల గొంతుక తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీలో ప్రధాన భాగస్వామిగా ఉంటూ ఉత్తుంగ తరంగ కెరటంలా సాగుతున్న తెలంగాణ పోరులో వెల్లడవుతున్న ప్రజా ఆకాంక్షలను పోగుపడుతున్న ప్రజా చైతన్యాన్ని అర్థం చేసుకుంటూ 2013లో సాగర సమాలోచన జరిపి ఏర్పడబోయే రాష్ట్రం ఎలా అభివృద్ధి జరగాలో ప్రాథమిక చర్చను జరిపి దిశా నిర్దేశం చేసింది. 2014 ఎన్నికల సందర్భంలో తెలంగాణ ప్రజా సమస్యలపై పీపుల్స్‌ ఎజెండాను రూపొందించి అన్ని పార్టీలు ఈ ఎజెండాను తమ ఎన్నికల మ్యానిఫెస్టోగా అమలుచేయాలని కోరింది. తెలంగాణ సాధన కోసం ఒక పోరాటం, అభివృద్ధికై మరో పోరాటం అని జయశంకర్‌ సర్‌ అందించిన సిద్ధాంత బలంతో ప్రజలు కేంద్రంగా సామాజిక న్యాయం, సమన్యాయం, ప్రజాస్వామిక సూత్రాల ఆధారంగా అభివృద్ధి జరగాలని కోరింది. ఒక విజయం మరో ఉదయం కోసమంటూ సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ సాధనకై కొత్త ఉద్యమ ప్రస్థానంలోకి తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రవేశించింది. తెలంగాణ గడ్డ సీమాంధ్ర రాజకీయ నాయకత్వం నుంచి విముక్తమై స్వీయ రాజకీయ శక్తులే రాజ్యమేలుతున్నప్పటికి సీమాంధ్ర పెట్టుబడిదారీ రాజకీయ సంస్కృతిలో ఒదిగి ఎదిగిన నాయకత్వం కాబట్టి అదే పాలనా సంస్కృతిని కొనసాగిస్తుంది. ప్రభుత్వాన్ని తమ సొంత ఆస్తిగా భావిస్తూ అప్రజాస్వామిక నిర్ణయాలతో కాంట్రాక్టులు, కమీషన్లు, ఓట్లు, సీట్లు, మానవీయ ముసుగు ఓటు బ్యాంకు పథకాలతో ప్రచార ఆర్భాటాలు చేస్తుంది. ఉద్యమ ఆకాంక్షను మరిచి తెలంగాణ నిర్మాణాత్మక అభివృద్ధికి బదులుగా తెలంగాణ సంపదను కార్పోరేట్లకు, కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నది. తెలంగాణ అభివృద్ధికై స్వీయ అస్తిత్వ కోణంలో ప్రణాళికను, పథకాలను రూపొందించకుండా సీమాంధ్ర పాలకులు రూపొందించి అమలు చేసిన విధ్వంసకర అభివృద్ధి నమూనానే అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీమాంధ్ర రాజకీయ నాయకత్వం నుంచి విముక్తమైన తెలంగాణను ఆ రాజకీయ సంస్కృతికి భిన్నమైన ప్రత్యామ్నాయ, ప్రజాస్వామిక రాజకీయ విలువల కోసం భావజాల వ్యాప్తిని తెలంగాణ విద్యావంతుల వేదిక కొనసాగిస్తుంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల విలువ ఆధారంగా ఆర్థిక రాజకీయ, సామాజిక సమానత్వం రావాలని, పాలనలో, పైసాలో ప్రజా భాగస్వామ్యాన్ని, పారదర్శకత్వాన్ని కోరుతూ, సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ పోరు సమరశంకం పూరిస్తూ తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకే చెందాలని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్‌ చేస్తోంది.ధర్మార్జున్‌రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ విద్యావంతుల వేదిక(నేడు, రేపు వరంగల్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక 6వ మహాసభ)
editorial
19,176
08-02-2017 02:33:15
అన్నాడీఎంకేలో చీలిక !
చెన్నై, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మూడు దశాబ్దాల తరువాత వరుసగా రెండుమార్లు అధికారం సంపాదించిన అన్నాడీఎంకే చివరికి చీలిక దిశగా పయనిస్తోంది. ఆ పార్టీ అధినేత్రి జయలలిత మరణానంతరం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ ముక్కయ్యేలా కనిపిస్తోంది. రెండు నెలలు సీఎంగా ఉన్న తనతో శశికళ బలవంతంగా రాజీనామా చేయించడంతో తీవ్రమనస్తాపానికి గురైన పన్నీర్‌సెల్వం అధిష్టానంపై ధిక్కారస్వరం వినిపించారు. దీంతో ఒక్కసారిగా దిగ్ర్భాంతికి లోనైన శశికళ బృందం ఆయనపై చర్యలకు సిద్ధమైంది. మంగళవారం రాత్రి పొద్దుపోయేవరకూ పోయె్‌సగార్డెన్‌లో సీనియర్‌ నేతలు, మంత్రులతో మంతనాలు జరిపిన శశికళ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పన్నీర్‌సెల్వంపై వేటు వేస్తే దాని పర్యవసానాలు, ఎదురయ్యే పరిణామాలు, పార్టీ స్థితిగతులు గురించి ఆమె ఆలోచనలో పడినట్లు సమాచారం.ఏదేమైనా 1, 2 రోజుల్లో ఆమె ఈ మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోగా పన్నీర్‌సెల్వంపై ఎదురుదాడి చేయాలని, ఆయన విమర్శలను తిప్పికొట్టాలని తన అనుచరులకు ఆమె ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు పలువురు నేతలు పన్నీర్‌సెల్వంపై విమర్శలు కురిపించారు. జయ మరణానంతరం ఆయన్ను సీఎం పీఠంపై కూర్చోబెడితే, అందుకు కృతజ్ఞతగా ఆయన చిన్నమ్మనే ధిక్కరించారంటూ పలువురు సీనియర్లు ఎద్దేవా చేశారు.
nation
18,295
13-11-2017 16:33:06
ఇంట్లో పరిస్థితుల వల్లే హంతకుడినయ్యా.. రియాన్ స్కూల్ టీనేజర్!
న్యూఢిల్లీ: ఓ టీనేజ్ పిల్లాడు రియాన్ స్కూల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అతడు అలా మారేందుకు గల కారణాలపైనా సీబీఐ అధికారులు లోతుగా విచారణ జరిపారు. స్కూల్లో జరిగే ఇంటర్నల్ పరీక్షలు, తర్వాత జరిగే పేరెంట్స్ మీటింగ్ వాయిదా పడేందుకే రెండో తరగతి విద్యార్ధి ప్రద్యుమన్‌ను చంపానని 11వ తరగతి విద్యార్ధి ఒప్పుకున్నాడు. తక్కువ మార్కులు వచ్చినందుకు తిడతారన్న కారణంతోనే తానీ ఘాతుకానికి పాల్పినట్టు చెప్పాడు. ఇంతకీ తక్కువ మార్కులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తే... విస్మయం కలిగించే పలు కారణాలు వెల్లడించాడు.  ‘‘మా ఇంట్లో వాతావరణం అస్సలు బాగోదు. అమ్మానాన్న ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు. అందుకే చదువు మీద నాకు ఆసక్తి తగ్గిపోయింది...’’ అని టీనేజర్ పేర్కొన్నట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా జిల్లా బాలల భద్రతా విభాగం అధికారులు ప్రస్తుతం అతడి తల్లిదండ్రులు, పొరుగువారు, నిందితుడి స్నేహితులను కూడా కలుసుకోనున్నారు. ఈ కేసులో కీలకమైన ‘సామాజిక విచారణ నివేదిక’ను తయారుచేయడంలో భాగంగా వీరందర్నీ ప్రశ్నించనున్నట్టు చెబుతున్నారు. మరోవైపు సదరు విద్యార్ధి ప్రవర్తన ఎప్పుడూ హింసాత్మకంగా ఉండేదనీ... సెల్‌ఫోన్‌లో వీడియోలు చూస్తూ అల్లరిగా తిరిగేవాడని పలువురు తోటి విద్యార్ధులు అధికారుల విచారణలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే నిందితుడిపై విచారణ పూర్తి చేసిన సీబీఐ.. మళ్లీ కస్టడీ పొడిగింపు కోరలేదు. దీంతో అతడిని ఈ నెల 22 వరకు ఫరీదాబాద్ అబ్జర్వేషన్ హోమ్‌‌లో ఉంచాలని బాలల న్యాయస్థానం ఆదేశించింది.
nation
13,852
28-02-2017 16:39:00
ఆశలు అమెరికాలో... ప్రాణాలు గాల్లో... తొమ్మిదేళ్లలో 30 మంది!
అమెరికాలో హత్యకు గురైన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల ఉదంతం తెలుగు వారిలో ఒక విధమైన భయాందోళనకు కారణమైంది. అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో కూడా అభద్రతా భావం పెరిగిపోయింది. ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర్నుంచి అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారిలో కల్లోలం మొదలైంది. మన ఉద్యోగాలు మనకే అని ట్రంప్ ఇచ్చిన ఒక్క పిలుపు ఆయనను అధ్యక్షుడిని చేసింది. ఇన్నాళ్లు ఉద్యోగాల విషయంలో బెంగ పెట్టుకున్న ఎన్నారైలు ఇప్పుడు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. శ్రీనివాస్‌పై కాల్పుల అనంతరం అమెరికాలోని భారతీయుల్లో భయందోళనలు మరింత పెరిగాయి.  ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. అయితే ఈ హత్య తర్వాత గతంలో జరిగిన పలు చేదు ఘటనలను అక్కడి భారతీయులు గుర్తుచేసుకుంటున్నారు. 2008వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ, అంటే గడిచిన 9 సంవత్సరాల్లో దాదాపు 30 మందికి పైగా తెలుగు వాళ్లు అమెరికాలో చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది కాల్పుల బాధితులే. ఫిబ్రవరి 10న వరంగల్ జిల్లాకు చెందిన వంశీ రెడ్డి కాలిఫోర్నియా జరిగిన కాల్పుల్లో మరణించాడు.  గత డిసెంబర్‌లో విజయవాడకు చెందిన చుండూరి సాయి తేజస్వి కారు ప్రమాదంలో చనిపోయింది. 2016 జులైలో సంకీర్త్ అనే హైద్రాబాద్‌కు చెందిన యువకుడిని రూమ్‌మేట్ హత్య చేశాడు. టెక్సాస్‌లో జరిగిన ఈ ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. 2016 జూన్‌లో అరిజోనాలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉద్యోగం చేస్తున్న నంబూరి శ్రీదత్త ప్రమాదవశాత్తు జలపాతంలో మునిగి చనిపోయాడు. హైద్రాబాద్‌కు చెందిన శివ కిరణ్ అనే యువకుడు డిప్రెషన్‌కు లోనై అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. 2015లో సాయి కిరణ్ అనే హైద్రాబాద్ యువకుడు ఓ దొంగ జరిపిన కాల్పుల్లో చనిపోయాడు. టెక్సాస్‌లో ఎలప్రోలు జయచంద్ర అనే యువకుడు కూడా ఇదే తరహాలో ఓ స్టోర్‌లో దొంగ జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా దాదాపు 30 మంది తెలుగు వాళ్లు వేర్వేరు కారణాల వల్ల అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో దాదాపు 6లక్షల మంది తెలుగు వాళ్లే కావడం గమనార్హం.
nation
7,895
25-11-2017 21:41:59
జీసస్‌ జీవితం...
సువర్ణ క్రియేషన్స్‌ పతాకంపై ఎ.జాన్‌బాబు దర్శకత్వంలో సుధాకర్‌ నిర్మించిన ‘తొలి కిరణం’ చిత్రం డిసెంబర్‌ 22న విడుదల కానుంది. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చిత్ర దర్శకుడు ఈ విషయాన్ని తెలియజేశారు. పి.డి.రాజు జీస్‌సగా, అభినయ మేరీమాతగా నటించిన చిత్రమిది. ‘‘జీసస్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. 40 నిమిషాల గ్రాఫిక్స్‌ సినిమాకు హైలైట్‌ అవుతాయి’’ అని దర్శకుడు చెప్పారు.
entertainment
15,539
28-09-2017 17:53:43
రేపు ఈసీ చెంతకు పళని, పన్నీర్ వర్గాలు
న్యూఢిల్లీ : అన్నా డీఎంకే ఎన్నికల గుర్తు ‘రెండు ఆకులు’ కోసం జరుగుతున్న పోరాటంలో సమైక్య అన్నా డీఎంకే వాదనను శుక్రవారం ఎన్నికల సంఘానికి సమర్పించబోతోంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల ప్రతినిథులు న్యూఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో అఫిడవిట్‌ను సమర్పిస్తారు. టీటీవీ దినకరన్‌ తన వాదనను వినిపించేందుకు 15 రోజుల అదనపు గడువును ఇవ్వాలని కోరినప్పటికీ ఎన్నికల సంఘం తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈసీ వర్గాల కథనం ప్రకారం మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 31లోగా ఈ సమస్యను పరిష్కరించాలని ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించినట్లుగానే వచ్చే నెల 6న ఎన్నికల సంఘం ‘రెండు ఆకులు’ గుర్తుపై విచారణ జరుపుతుంది.
nation
19,593
28-08-2017 18:46:17
అతివేగంగా కారు నడిపి వాహనాలను ఢీకొట్టిన క్రికెటర్.. కేసు నమోదు
కటక్: అతివేగంగా కారు నడిపి వాహనాలను ఢీకొట్టిన మాజీ క్రికెటర్‌పై కేసు నమోదైంది. ఒడిశాలోని కటక్ బైపాస్ రోడ్డులోని చాహతాఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రంజీ జట్టుకు గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన హలధర్ దాస్ కారును అతివేగంగా నడుపుతూ ఇతర వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో హలధర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని విచారించారు.
sports
7,757
07-07-2017 15:50:03
షారూక్‌ వల్లే సినిమా ఫ్లాపైందంటున్న సల్మాన్‌ ఫ్యాన్స్‌!
బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు ఇటీవలి కాలంలో అన్నీ వరుస విజయాలే. యావరేజ్‌ అనిపించుకున్న సినిమాలు కూడా వందల కోట్ల కలెక్షన్లు సాధించి సల్మాన్‌ స్టామినాను చాటాయి. అయితే తాజా చిత్రం ‘ట్యూబ్‌లైట్‌’ మాత్రం సల్మాన్‌కు ఘోర పరాజయాన్ని అందించింది. ఈ చిత్ర పరాజయాన్ని తేలికగా తీసుకోలేకపోతున్నారు సల్మాన్‌ అభిమానులు. అందుకే ‘ట్యూబ్‌లైట్‌’ ఫ్లాపవడానికి గల కారణాన్ని కనిపెట్టారు. ‘ట్యూబ్‌లైట్‌’ సినిమాలో మరో స్టార్‌ హీరో షారూక్‌ ఖాన్‌ ఓ క్యామియో రోల్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇలా షారూక్‌ కనిపించడం వల్లే తమ హీరో సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసిందని సోషల్‌ మీడియా ద్వారా ఆరోపిస్తున్నారు సల్మాన్‌ అభిమానులు. ఈ ఆరోపణలు శృతిమించడంతో షారూక్‌ అభిమానులు కూడా కౌంటర్‌ ఇస్తున్నారు. తమ హీరో కాసేపైనా తెరపై కనిపించడం వల్లే ‘ట్యూబ్‌లైట్‌’ ఆ మాత్రం కలెక్షన్లనైనా రాబట్టుకోగలిగిందని సమాధానమిస్తున్నారు షారూక్‌ ఫ్యాన్స్‌.
entertainment
17,978
09-02-2017 01:34:59
చిన్నమ్మకు ఈసీ షాక్‌!
చెన్నై, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం పీఠాన్ని అధిష్ఠించేందుకు తపిస్తున్న శశికళకు ఎన్నికల కమిషన్‌ షాకిచ్చింది. అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ ఎంపికలో ఎలాంటి నిబంధనలూ పాటించలేదని అభిప్రాయపడుతోంది. ఈ విషయమై త్వరలో అన్నాడీఎంకేకు నోటీసు జారీచేసే అవకాశం ఉంది. జయ మృతి తర్వాత జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో శశికళను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ తీర్మానం చేశారు. ప్రస్తుతం శాసనసభపక్ష నాయకురాలిగా కూడా ఎన్నికైన ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్న తరుణంలో.. పార్టీ నేతగా ఆమె ఎంపిక కావడమే పార్టీ నియమాలకు విరుద్ధమని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడుతోంది. అన్నాడీఎంకే నుండి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఇచ్చిన పిటీషన మేరకు ఈ వ్యవహారంపై ఈసీ విచారణ జరిపింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎంపిక గురించిగానీ, నియామకం గురించి గానీ అన్నాడీఎంకే పార్టీ నియమనిబంధనలలో ఎక్కడా పేర్కొనలేదని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలో వెల్లడైంది. దీంతో.. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎవరినైనా నియమించాలంటే అందుకు తగినట్లుగా పార్టీ నియమ నిబంధనలను సవరించాల్సి ఉంటుందని, అలాంటి సవరణలు చేపట్టకుండా జరిగిన శశికళ నియామకం చెల్లదని ఈసీ చెబుతోంది. ఈ విషయమై త్వరలో అన్నాడీఎంకే అధిష్టానానికి సంజాయిషీ కోరుతూ నోటీసును జారీచేయనుంది. చిన్నమ్మ పదోన్నతికి సంబంధించిన పత్రాలను, తీర్మానం ప్రతిని ఇవ్వాల్సిందిగా.. శశికళాపుష్ప ఫిర్యాదుపై స్పందించాల్సిందిగా అన్నాడీఎంకేను ఈసీ ఆదేశించింది.
nation