SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
8,688
14-06-2017 19:32:30
దర్శకుడిపై ఒత్తిడి పెంచుతున్న ఎన్టీఆర్
స్టార్ హీరోలందరూ తమ సినిమా రిలీజ్ డేట్స్‌ను ముందుగానే ఫిక్స్ చేసుకుంటుండటంతో... ఆ క్రేజీ హీరో కూడా ఈ విషయంపై ఫోకస్ పెట్టాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తేదీన సినిమా విడుదల కావాల్సిందే అంటూ దర్శకుడిపై ఒత్తిడి తీసుకొస్తున్నాడట. స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు సెట్స్ మీదకు వెళతాయో... ఎప్పుడు విడుదలకు సిద్ధమవుతాయో చెప్పడం చాలా కష్టమైపోయింది. ముందుగా ఫిక్స్ చేసుకున్న సమయానికి సినిమాను విడుదల చేయడంతో దర్శకనిర్మాతలు పెద్దగా సక్సెస్ కావడం లేదు. లేటెస్ట్‌గా యంగ్ టైగర్ నయా మూవీ 'జై లవకుశ' విషయంలోనూ ఇదే జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతేడాది 'జనతా గ్యారేజ్' ఆడియెన్స్ ముందుకు వచ్చిన సెప్టెంబర్ 1 నాడు 'జై లవకుశ'ను విడుదల చేయాలని అనుకున్నారని... కానీ ఈ సినిమా అక్టోబర్‌కు వాయిదా పడిందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 1నే విడుదల చేయాలని దర్శకుడు బాబీపై ఎన్టీఆర్ ఒత్తిడి తీసుకొస్తున్నాడట. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం అవసరమైతే మరింత ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించేందుకు యంగ్ టైగర్ సిద్ధమైనట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా నిర్మాత, ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ సైతం... ఈ విషయంలో తమ్ముడి మాటకే జై కొట్టాడని తెలుస్తోంది. సెప్టెంబర్ 1న మిస్సయితే... మళ్లీ సరైన సీజన్ దొరకడం కష్టమని... దసరా స్లాట్‌ను బాలకృష్ణతో పాటు మహేశ్ బాబు ఆల్రెడీ బుక్ చేసుకోవడంతో... సెప్టెంబర్ 1న ఆడియెన్స్ ముందుకు రావడమే బెటర్ అని నందమూరి బ్రదర్స్ ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి... తన నయా మూవీని తొందరగా పూర్తి చేయడంతో పాటు... సెంటిమెంట్ డేట్ రోజునే ప్రేక్షకుల ముందుకు రావాలని టాలీవుడ్ క్రేజీ హీరో గట్టిగా ఫిక్స్ అయ్యాడని క్లియర్‌గా అర్థమవుతోంది.
entertainment
8,914
12-12-2017 18:54:09
విజయ్ సాయి గురించి ఆసక్తికర విషయం చెప్పిన రవిబాబు
హైదరాబాద్: ఒక మంచి ఆర్టిస్టు, మిత్రుడిని కోల్పోయామని నటుడు, నిర్మాత, డైరక్టర్ రవిబాబు అన్నారు. హాస్య నటుడు విజయ్ సాయి భౌతికకాయానికి మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రవిబాబు మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ తల్లిదండ్రులు చేతికి అందివచ్చిన బంగారు కొడుకును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ సినిమా ప్రస్తానం (అమ్మాయిలు అబ్బాయిలు) తనతోనే మొదలయ్యిందని అన్నారు. తన తొలి సినిమాకు పొట్టి వ్యక్తి కావాలని అనుకున్నామని, అందుకు విజయ్ వచ్చారని, అయితే తాను అనుకున్నదానికంటే విజయ్ అంగుళం ఎక్కువ ఉన్నాడని, దాంతో పనికిరావని చెప్పి పంపేశానని చెప్పారు. మరుసటి రోజు మళ్లీ విజయ్ తన కార్యాలయానికి వచ్చాడని, మళ్లీ ఎందుకు వచ్చావని ప్రశ్నించగా ‘‘సార్ నిన్న షూస్ వేసుకు వచ్చాను, ఇవాళ షూస్ లేకుండా వచ్చాను. ఇప్పుడు సరిపోతానేమో చూడండి అన్నాడు’’.. దాంతో మళ్లీ చూడగా తాను అనుకున్నదానికంటే కొంచెం తక్కువే ఉన్నాడని, దాంతో ఆ వేషం విజయ్‌కే ఇవ్వాలని చెప్పడం జరిగిందని, ఇది జరిగి సుమారు 13, 14 ఏళ్లు అయిందని రవిబాబు పేర్కొన్నారు. ఆ తర్వాత అతనితో చాలా సినిమాలు చేశానని సోగ్గాడు, పార్టీ తదితర సినిమాలు చేశానని రవిబాబు చెప్పారు. విజయ్ బయట ఉన్నా తనతో ప్రతి విషయం మాట్లాడేవాడని రవిబాబు తెలిపారు.
entertainment
15,022
22-02-2017 23:37:11
బీర్‌ బాటిళ్లపై వినాయకుని బొమ్మలు
అమెరికాలోని ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థ ఒకటి హిందూ దేవుడు గణపతి బొమ్మలతో ఉన్న బీర్లను అమ్మకానికి పెట్టింది. దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. లాస్ట్‌కా్‌స్ట.కామ్‌ అనే ఈ ఆన్‌లైన్‌ సంస్థ వినాయకుని బొమ్మలు ముద్రించిన బీర్లను విక్రయానికి పెట్టడంతో హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే, మరో సంస్థ ఓం గుర్తును ముద్రించిన షూలను విక్రయానికి ఉంచింది. ఈ రెండు సంస్థలపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు.
nation
13,634
11-09-2017 03:51:45
భారతీయ అమెరికన్లకు ఆపన్నహస్తం
వాషింగ్టన్‌, సెప్టెంబరు 10: అత్యంత శక్తివంతమైన ఇర్మా హరికేన్‌ పడగెత్తిన ఫ్లోరిడావ్యాప్తంగా దాదాపు 1,20,000 మంది భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు. వీరిలో వేలాది మంది ప్రస్తుతం డేంజర్‌ జోన్లు అయిన మియామీ, ఫోర్ట్‌ లాడర్‌డేల్‌, తంపాలో ఉన్నారు. బలహీనపడిందనుకున్న ఇర్మా మళ్లీ ప్రచండంగా మారడంతో ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు నానా పాట్లు పడ్డారు. అమెరికాలో భారతీయ రాయబార కార్యాలయం 24 గంటలూ పనిచేసే విధంగా హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ప్రారంభించింది. సీనియర్‌ అధికారులను హుటాహుటీన అట్లాంటాకు పంపింది. వీరి ఆధ్వర్యంలో భారతీయ అమెరికన్లకు సహాయ పునరావాస కార్య క్రమాలు చేపట్టారు. భారత రాయబారి నవతేజ్‌ సర్న అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.  న్యూయార్క్‌లో భారత కాన్సుల్‌ జనరల్‌ సందీప్‌ చక్రవర్తి అట్లాంటాలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లో ఉండి తక్షణ సహాయ సహకారాలు అందే విధంగా చూస్తున్నారు. కింగ్‌స్టన్‌లోని భారత్‌ హైకమిషన్‌ కార్యాలయంలో కూడా 24/7 హెల్ప్‌లైన్‌ ప్రారంభించినట్లు విదేశాంగ శాఖ మంత్రి ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ ట్వీట్‌ ద్వారా తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు ఈమెయిల్‌ ఐడీలను ఆయన తెలియజేశారు. ఇండియన్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ అట్లాంటా, గుజరాత్‌ సమాజ్‌ అట్లాంటా, హిందూ టెంపుల్‌ ఆఫ్‌ అట్లాంటా మూడు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశాయి. పలువురు ప్రవాస భారతీయ వ్యాపారులు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు.
nation
19,232
01-04-2017 15:54:47
ఆరెస్సెస్ చీఫ్‌ భగవత్‌కు కాంగ్రెస్ నేత మద్దతు
న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్‌‌ను రాష్ట్రపతిగా ఎన్నుకోవాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రైల్వే మంత్రి సీకే జాఫర్ షరీఫ్ మద్దతు పలికారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన రాసిన లేఖలో రాష్ట్రపతి పదవికి భగవత్‌ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలన్న ప్రతిపాదనను తప్పుబట్టాల్సిందేమీ లేదని పేర్కొన్నారు. భగవత్ భారత దేశ రాజ్యాంగానికి కట్టుబడి ఉండటాన్ని ప్రశంసించారు. ఆయన దేశభక్తి పట్ల ఎటువంటి సందేహాలు అవసరం లేదన్నారు. భారతీయుల పట్ల ఆయన ప్రదర్శించే ప్రేమను శంకించవలసిన అవసరం లేదని తెలిపారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యాలకు ఆయన కట్టుబడి ఉంటున్నారన్నారు. బంగ్లాదేశ్ యుద్ధం అనంతరం అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆరెస్సెస్ బలపరిచిందని షరీఫ్ గుర్తు చేశారు. దేశభక్తుడు, ప్రజాస్వామ్యానికి కట్టుబడిన వ్యక్తి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న నేత పట్ల నమ్మకం లేదని చెప్పేంత సంకుచిత భావం ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించారు.
nation
1,248
08-12-2017 01:08:32
విజయవాడ-ముంబై-దుబాయ్‌ విమాన సర్వీసు
ఫిబ్రవరిలో ప్రారంభించనున్న ఎయిర్‌ ఇండియా విజయవాడ (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి తలమానికమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మరికొద్ది రోజుల్లో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ నుంచి ముంబై, అక్కడి నుంచి దుబాయి, షార్జాలకు విమాన సర్వీసులను నడపాలని నిర్ణయించింది.  అంతర్జాతీయ సర్వీసు నడపటానికి వీలుగా ఇప్పటి కే విజయవాడ విమానాశ్రయంలో అంతర్జాతీయ టెర్మినల్‌ రూపుదిద్దుకుంది. ఈ టెర్మినల్‌ నుంచి ఇమ్మిగ్రేషన్‌ కార్యకలాపాలు జనవరి 15 నుంచి ప్రారంభం కావచ్చని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ విమాన సర్వీసు ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విజయవాడ నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడపటానికి విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు ఎయిర్‌ ఇండియాతో కొద్ది కాలం నుంచి సంప్రదింపులు సాగించటంతో విమాన సర్వీసును ప్రారంభించేదుకు సుముఖత వ్యక్తంచేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగపూర్‌ ప్రభుత్వంతో మరో విమానయాన సర్వీసు కోసం కృషి చేస్తోంది. మినిమం గ్యారంటీ కల్పిస్తామన్న హామీని కూడా ప్రభుత్వం ఇచ్చింది.
business
14,275
13-01-2017 02:56:31
పెట్రోలు బంకుల్లో కార్డు చార్జీలు బ్యాంకులు, కంపెనీలదే: కేంద్రం
న్యూఢిల్లీ, జనవరి 12: పెట్రోలు బంకుల్లో కార్డుల ద్వారా జరిపే లావాదేవీలపై వేసే చార్జీలను ఇకపై బ్యాంకులు, చమురు కంపెనీలు భరించనున్నాయి. కార్డు లావాదేవీల చార్జీలు రద్దు చేయకుంటే కార్డులను అంగీకరించబోమని బంకుల యజమానులు హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ, ఆర్థిక సేవల విభాగం గురువారం సమీక్షా సమావేశం నిర్వహించాయి. కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ పాల్గొన్నారు. ‘కార్డుల ద్వారా లావాదేవీలు జరిపే వినియోగదారులపై భారం పడటానికి వీల్లేదు. ఈ భారాన్ని బ్యాంకులు, చమురు కంపెనీలే భరిస్తాయి. బంకుల యజమానులు కూడా వాటిని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ భారాన్ని ఏ నిష్పత్తిలో భరించాలో ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారు’ అని ఆయన వివరించారు.
nation
19,785
10-02-2017 00:01:55
బాక్సర్‌కు గౌతీ సాయం
న్యూఢిల్లీ: కేన్సర్‌తో పోరాడుతున్న బాక్సర్‌ డింకో సిం గ్‌కు క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆర్థిక సహా యం చేశాడు. 1998 ఆసియా క్రీడల్లో డింకో స్వర్ణ పతకం సాధించాడు. అర్జున, పద్మశ్రీ అవార్డులు కూడా డింకోను వరించాయి. సాయ్‌ లో కోచ్‌గా పని చేస్తున్న సింగ్‌ లివర్‌ కేన్సర్‌ బారినపడ్డాడు. దీంతో ఆపరేషన్‌ చేసి 70 శాతం లివర్‌ను తొలగించారు. గంభీర్‌ ఆర్థిక సాయంతో ఇంఫాల్‌లో ఉన్న డింకోకు కీమోథెరపీ చేయించనున్నారు. అయితే డింకో దీనావస్థ తనను ఎంతో కదిలించిందని గంభీర్‌ చెప్పాడు. దీంతో తాను చేయగలిగిన సాయం చేసినట్టు తెలిపాడు. డింకోకు తాను కూడా సాయం చేస్తానని ప్రముఖ ప్రొ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ ముం దుకొచ్చాడు.
sports
9,626
29-08-2017 23:18:45
ఫస్ట్‌లుక్‌ ‘మళ్లీ వచ్చిందా..!’
కిరణ్‌, దివ్యరావు జంటగా నటిస్తున్న చిత్రం ‘మళ్లీ వచ్చిందా’. కె.నరేంద్రబాబు దర్శకుడు. వెంకటేశ్‌. సి నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. దర్శకుడు నరేంద్రబాబు మాట్లాడుతూ ‘‘ఓ దెయ్యం ఫోన్‌ నుంచి ఫోన్‌కి కూడా వెళ్లి మనుషుల్ని భయపెట్టగలదని తెలిపే సినిమా ఇది. ఆద్యంతం ఉత్కంగా సాగుతుంది’’ అని తెలిపారు.
entertainment
19,835
06-01-2017 18:39:10
అక్కడ మాత్రం కెప్టెన్‌గా కోహ్లీ కాదట ధోనీనే..: ప్రకటించిన సెలక్టర్లు
ముంబై: పరిమిత ఓవర్ల కెప్టెన్ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌కు కోహ్లీనే సారధిగా ప్రకటించారు సెలక్టర్లు. ధోనీ మాత్రం ఈ రెండు ఫార్మెట్లలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా కొనగనున్నాడు. అయితే ధోనికి మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు సెలక్టర్లు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇరుదేశాల ‘ఏ’ జట్ల మధ్య రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో మొదటి మ్యాచ్‌కు ధోనీనే కెప్టెన్‌గా జట్టును నడిపంచనున్నాడరి సెలక్షన్ కమిటీ తెలిపింది. అయితే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రహానే సారధిగా ఉండనున్నాడు. జనవరి 15న ఇంగ్లండ్‌తో జరగబోయే మొదటి వన్డే నుంచి కోహ్లీ కెప్టెన్‌‌గా వ్యవహరిస్తాడు. మొదటి వార్మప్ మ్యాచ్‌కు భారత ‘ఏ’ జట్టుధోనీ(కెప్టెన్), మన్దీప్ సింగ్, అంబటి రాయుడు, యువరాజ్ సింగ్, హర్ధిక్ పాండ్యా, సంజూ శాంమ్సన్, కుల్దీప్ యాదవ్, యుజ్‌వేంద్ర చహల్, నెహ్రా, మోహిత్ శర్మ, సిద్ధార్ద్ కౌల్. రెండో వార్మప్ మ్యాచ్‌కు భారత ‘ఏ’ జట్టురహానే(కెప్టెన్), రిషబ్ పంత్, సురేష్ రైనా, దీపక్ హుడా, ఇషాన్ కిషన్, షెల్డన్ జాక్సన్, విజయ్ శంకర్, షెహ్బజ్ నదీమ్, పర్వేజ్ రశూల్, వినయ్ కుమార్, ప్రదీప్, అశోక్ దిండా. మొదటి వార్మప్ మ్యాచ్‌కు భారత ‘ఏ’ జట్టుధోనీ(కెప్టెన్), మన్దీప్ సింగ్, అంబటి రాయుడు, యువరాజ్ సింగ్, హర్ధిక్ పాండ్యా, సంజూ శాంమ్సన్, కుల్దీప్ యాదవ్, యుజ్‌వేంద్ర చహల్, నెహ్రా, మోహిత్ శర్మ, సిద్ధార్ద్ కౌల్. రెండో వార్మప్ మ్యాచ్‌కు భారత ‘ఏ’ జట్టురహానే(కెప్టెన్), రిషబ్ పంత్, సురేష్ రైనా, దీపక్ హుడా, ఇషాన్ కిషన్, షెల్డన్ జాక్సన్, విజయ్ శంకర్, షెహ్బజ్ నదీమ్, పర్వేజ్ రశూల్, వినయ్ కుమార్, ప్రదీప్, అశోక్ దిండా. ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు..వన్డే టీం : విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఎమ్మెస్ ధోనీ(వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, యువరాజ్ సింగ్, అజింక్యా రహానే, హార్ధిక్ పాండ్యా, అశ్విన్, జడేజా, అమిత్ మిశ్రా, జస్ప్రిత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్.  టీ20 టీం : విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఎమ్మెస్ ధోనీ(వికెట్ కీపర్), మన్దీప్, కెఎల్ రాహుల్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, అశ్విన్, జడేజా, చహల్, మనీష్ పాండే, బూమ్రా, భువనేశ్వర్, ఆశిస్ నెహ్రా ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు..వన్డే టీం : విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఎమ్మెస్ ధోనీ(వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, యువరాజ్ సింగ్, అజింక్యా రహానే, హార్ధిక్ పాండ్యా, అశ్విన్, జడేజా, అమిత్ మిశ్రా, జస్ప్రిత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్.  టీ20 టీం : విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఎమ్మెస్ ధోనీ(వికెట్ కీపర్), మన్దీప్, కెఎల్ రాహుల్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, అశ్విన్, జడేజా, చహల్, మనీష్ పాండే, బూమ్రా, భువనేశ్వర్, ఆశిస్ నెహ్రా
sports
12,898
20-11-2017 17:44:59
రాష్ట్రపతి అరుణాచల్ పర్యటనపై చైనా పుల్లవిరుపు...
బీజింగ్: చైనా మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అరుణాచల్ ప్రదేశ్‌లో ఆదివారం పర్యటించడంపై అక్కసు వెళ్లగక్కింది. ఇండో-చైనా సంబంధాలు కీలక దశలో ఉన్న తరుణంలో సమస్యను న్యూఢిల్లీ మరింత జఠిలం చేయడం సరికాదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లు కాంగ్ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. 'అరుణాచల్ ప్రదేశ్‌గా చెప్పుకునే ప్రాంతాన్ని చైనా ఎప్పుడూ గుర్తించలేదు' అని ఓ ప్రశ్నకు సమాధానంగా లు కాంగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చైనా చాలాకాలంగా మొండిగా వాదిస్తూనే ఉంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించడంపై కూడా చైనా అభ్యంతరం తెలిపింది. ఆ సందర్భంలో చైనా అభ్యంతరాన్ని భారత్ తోసిపుచ్చింది. తమదైన అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నిసార్లైనా పర్యటిస్తామని తేల్చిచెప్పింది. కాగా, ఆదివారంనాడు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాధాన్యాన్ని మరింత నొక్కి చెప్పారు. దేశానికి ఈశాన్య భారతం కిరీటమైతే, అరుణాచల్ ప్రదేశ్ ఆ కిరీటంలో మణిహారమని కొనియాడారు.
nation
12,100
09-07-2017 02:29:19
ముంబైలో బాలికపై గ్యాంగ్‌ రేప్‌
ముంబై, జూలై 8: తండ్రి స్నేహితుడే కదా అని నమ్మి వెళ్లిన పాపానికి ఓ బాలిక జీవితం బలైపోయింది. ఆమెను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిన ఆ మానవమృగం మరో ముగ్గురితో కలిసి 24 గంటలపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన ముంబై భందూప్‌ ప్రాంతంలో జరిగింది. అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు ట్రోంబే పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులు ఆనంద కాన్పూరే, కేవల్‌ తివార్‌, సాయి బత్తేను అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు భరత్‌ ఓవ్హల్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
nation
6,004
12-10-2017 11:39:07
బాలకృష్ణ సంచలన నిర్ణయం..
ఇటీవల హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ.. అభిమానులపై చేయి చేసుకుంటారన్న ఆరోపణలు బాగా వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకు అభిమానులంటే ప్రాణం అని తెలిపారు. వారికి దగ్గరగా ఉంటానని చెప్పారు. కానీ తాను అభిమానుల మధ్యకు వెళ్లినపుడు కొందరి పనులు తనను ఇబ్బంది పెడతాయనీ.. అవి ఇతరులకు కనిపించవన్నారు. ఆ తర్వాత బాలయ్య కొట్టాడంటూ న్యూస్ వైరల్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.  తనకు బౌన్సర్లను ఉపయోగించుకోవడం నచ్చదని.. చాలా కాలం క్రితం ఓ ఈవెంట్‌లో తన బౌన్సర్లు తన అభిమానులపై చేయి చేసుకున్నారని అప్పటి నుంచి బౌన్సర్లు వద్దని నిర్ణయించుకున్నానని తెలిపారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారని టాక్. తన సన్నిహితుల సలహా మేరకు ఇక మీదట తిరిగి బౌన్సర్లను నియమించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
entertainment
21,283
16-01-2017 10:05:26
అజర్‌కు ఎదురుదెబ్బ
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో ఉత్కంఠ రేపిన భారత మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌కు గట్టి షాగిలింది. అధ్యక్ష పదవికి అతని నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి కె. రాజీవ్‌ రెడ్డి తిరస్కరించారు. మ్యాచ్‌-ఫిక్సింగ్‌ కుంభకోణంలో అజర్‌పై బీసీసీఐ ఇంకా నిషేధం ఎత్తివేయలేదని, దీనిపై అతను సరైన ఆధారాలు చూపలేదని రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌ రెడ్డి తెలిపారు. నిషేధం విషయంలో కోర్టు ఉత్వర్వులు చూపాడని, కానీ, బోర్డు నుంచి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని, హెచ్‌సీఏలో ఓటు హక్కు ఉన్నట్టు సరైన ఆధారాలు చూపని కారణంగా అజర్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు శనివారం ఆయన చెప్పారు. దీంతో క్రికెట్‌ పాలకుడిగా కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించాలన్న అజర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. అదే విధంగా, వివిధ పోస్టులకు ప్రస్తుత కార్యవర్గ సభ్యులు వేసిన నామినేషన్లను ‘కూలింగ్‌ ఆఫ్‌ పిరియడ్‌’ నిబంధన కారణంగా తిరస్కరించారు. అజర్‌ లేకపోవడంతో.. ఇక అధ్యక్ష రేసులో ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి. వివేకానంద్‌, విద్యుత జయసింహ బరిలో నిలిచారు. కార్యదర్శి పోస్టుకు మాజీ సభ్యుడు శేష్‌ నారాయణ ఒక్కరే బరిలో మిగలడంతో ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. మొత్తంగా, ఆరు పోస్టుల (అధ్యక్షుడు, కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, ఈసీ సభ్యుడు)కు 18 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఉపాధ్యక్ష పదవి కోసం కె.అనిల్‌ కుమార్‌, ఇమ్రాన్‌ మహమూద్‌, సంయుక్త కార్యదర్శికి ఇ.వెంకట్‌రామ్‌ రెడ్డి, అజ్మల్‌ అసద్‌, కోశాధికారి కోసం మహేందర్‌, పి.అనురాధ, శ్రీనివాస్‌ పట్టపు, ఈసీ సభ్యుడి కోసం రాకేశ్‌ సింగ్‌, యోగేశ్‌ మోహతా, ధరమ్‌చంద్‌, మహ్మద్‌ ఇమాదుద్దుమ్‌ ఫరూఖి, జి.రామకృష్ణ, సతీ్‌షచంద్ర, వంకా మహేందర్‌, కె.హన్మంత రెడ్డి బరిలో నిలిచారు. వివేక్‌ వర్గం నుంచి అనిల్‌ కుమార్‌, అజ్మల్‌ అసద్‌, వెంకట్‌రామ్‌ రెడ్డి, మహేందర్‌, హనుమంత రెడ్డి పోటీలో ఉన్నారు. మరో వర్గంగా ఉన్న విద్యుత జయసింహ నుంచి వివేక్‌ ప్యానెల్‌కు తీవ్ర పోటీ ఉండకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. మంగళవారం జరుగనున్న ఎన్నికల ఫలితాలను.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ప్రకటించొద్దని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
sports
10,442
11-07-2017 15:59:04
దిల్‌రాజును డాడీ అనేసిన హీరోయిన్!
మలయాళంలో ప్రేమమ్‌తో ఆకట్టుకున్న సాయిపల్లవి.. తెలుగులో తొలిసారిగా వరుణ్‌తేజ్‌తో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఫిదా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకను సోమవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమంలో నేర్చుకున్న కొద్దిపాటి తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు సాయిపల్లవి. సినిమాలో భావోద్వేగాలు, చాలా జ్ఞాపకాలు ఉన్నాయని ఆమె చెప్పారు. మాట్లాడుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపిన సాయిపల్లవి.. ఆ సినిమా నిర్మాత దిల్ రాజు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.           సినిమా షూటింగ్ సమయంలో దిల్ రాజు గారు ఎంతో ఓపికగా ఉన్నారని, తనతో ఆయనెప్పుడూ ఓ నిర్మాతలా వ్యవహరించలేదని చెప్పారు. ఒక తండ్రిలా తనతో వ్యవహరించారని చెప్పారు. ఆయన ఓ డాడీలా నడుచుకున్నారని, ఫాదర్ ఫిగర్ అంటూ వ్యాఖ్యానించారు. సినిమా ఆడియో ఫంక్షన్లో తెలుగులోనే మాట్లాడతానని షూటింగ్ మొదలైనప్పుడే చెప్పానని, కానీ, ఇప్పుడు మాట్లాడదామన్నా భయమేస్తోందని చెప్పారు. షూటింగ్‌లో పాల్గొన్నన్ని రోజులూ ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆమె చెప్పారు.
entertainment
15,044
16-03-2017 23:39:02
ఓపీఎస్‌ ఆరోపణలు పట్టించుకోవద్దు
ఎన్నికల సంఘానికి తంబిదురై వినతి చెన్నై, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేలో ఎలాంటి చీలికలు లేవని, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గీయులు పార్టీ చిహ్నం కోసం చేసిన ఆరోపణలను పట్టించుకోవద్దని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకేపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వం నాయకత్వంలో ప్రతినిధుల బృందం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నజీమ్‌జైదీని కలిసి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని, తమదే నిజమైన అన్నాడీఎంకే పార్టీ అనీ, తమకే రెండాకుల గుర్తు కేటాయించాలని వినతి పత్రాలను సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తంబిదురై నాయకత్వంలో అన్నాడీఎంకే ఎంపీలు, పార్టీ సీనియర్ల బృందం గురువారం ఎన్నికల సంఘం అధికారులను కలిసి తమ వాదనలను వినిపించింది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభ్యంతరాలు తెలియజేయవచ్చని, అయితే అందులోని నిజనిజాలను పరిశీలించాల్సి ఉంటుందన్నారు. అన్నాడీఎంకేలో ప్రస్తుతం చీలికలు ఏర్పడలేదని, అలాంటప్పుడు ప్రత్యర్థి వర్గం చేస్తున్న ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. శశికళను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం పార్టీ నియమాలకు వ్యతిరేకం కాదని, పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ మృతి చెందినప్పుడు కూడా తక్షణ చర్యల్లో భాగంగానే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిని, ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ దాఖలు, ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక జరుగుతుందన్నారు. ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయిన తర్వాత ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరంకుండ్రం ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన పార్టీ అభ్యర్థుల జమాఖర్చుల వివరాలపై శశికళ సంతకాలు చేశారని, వాటిని కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదించిందనీ చెప్పారు. ప్రస్తుతం శశికళ ఎంపికను సవాలు చేస్తున్నవారే ఆమెను ఆ పదవికి సిఫారసు చేస్తూ సంతకాలు చేశారన్న విషయాన్ని మరువకూడదని తంబిదురై అన్నారు.
nation
169
14-08-2017 00:24:15
ఆర్థిక స్వాతంత్య్రం లభించాలంటే..
‘ఆర్థిక భద్రత, స్వాత్రంత్యం లేని చోట నిజమైన వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు’ అని ఫ్రాంక్లిన్‌ రూజ్‌ వెల్ట్‌ ఎప్పుడో చెప్పారు. ప్రస్తుతం మన దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి చూస్తే ఇది ఎంత నిజమో అర్థమవుతుంది. ఏళ్ల పోరాటం, ఎంతో మంది మహామహుల ప్రాణత్యాగం ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. రేపు మనమంతా 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపు కోనున్నాం. వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొంద డానికి అనేక రకాల వ్యూహాలు అనుసరించారు మన స్వాతంత్య్ర సమరయోధులు. ఇవన్నీ భారత పౌరులకు అవగతమే. ఆర్థికంగా స్వాతంత్య్రం పొందడానికి కూడా వ్యక్తులు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే తమ లక్ష్యాన్ని చేరుకోవడం ఎంతో సులభం. ఫలితంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. అదెలాగంటే.. అస్తమానం డబ్బు గురించి ఆందోళన వద్దు..డబ్బు చేతిలో లేని సమయంలో ఎప్పుడూ దాని గురిం చే ఆలోచిస్తుంటారు చాలామంది. ఇలాంటి ఆలోచనతో కాలం గడిపేస్తే వచ్చే ప్రయోజనం శూన్యం. అందుకే ఈ రకం ఆలోచనలను మనసులోంచి తీసివేయడం ఆర్థిక స్వాతంత్య్రం సాధించడంలో ముఖ్యమైన అంశం. గతంలో చేసిన తప్పుల గురించి చింతిస్తూ.. భవిష్యత్‌లో ఆర్థిక పరిస్థితి ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందోనని మదన పడుతుండ టం వల్ల అడుగు ముందుకుపడదు. ఇదేజరిగితే విలువైన కాలం కరిగిపోయి ఆర్థిక స్వాతం త్య్రం పొందడం మరింత కష్టంగా మారిపోతుంది.  ఆర్థిక లక్ష్యాల నిర్దేశం..భవిష్యత్‌కు సంబంధించిన ఆర్థిక లక్ష్యాలను ముందే నిర్దేశించుకోవడం మంచిది. పదవీ విరమణ, ఇంటి కొనుగోలు, పిల్లల పెళ్లిళ్లు వంటి వాటి విషయంలో ఒక స్పష్టతను కలిగి ఉండాలి.  ఆచితూచి షాపింగ్‌..స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డిస్కౌంట్లు, ఆఫర్ల హోరు మొదలైంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో విపరీ తంగా ఆఫర్లను ఇస్తున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని చాలా మంది అవసరం లేని ఉత్పత్తులను కూడా కొనేస్తుంటారు. ఫలితంగా బడ్జెట్‌ కట్టుతప్పుతుంది. అందుకే అవసరం ఉన్న ఉత్పత్తుల జాబితాను ముందుగా తయారు చేసుకోవాలి. తర్వాత అలాంటి వాటిపై ఎంత మేరకు ఆఫర్లు లభిస్తున్నాయో చూసుకుని కొనుగోళ్లు చేస్తే కొన్ని ఖర్చులనైనా తగ్గించుకోవచ్చు. పొదుపే మంత్రం..రోజుకు రూపాయి పొదుపు చేసినా నెల రోజులు తిరిగే సరికి రూ.30 అవుతుంది. అదే రూ.100 అయితే నెలకు రూ.3,000, ఏడాదికి రూ.36,000 అవుతుంది. ఇలా తెలియకుండానే పెద్దమొత్తంలో సొమ్ము జమ అవుతుంది. ఇలాంటి సొమ్ము అత్యవసర సమయంలో ఆపద్భాం ధవుడిగా ఆదుకుంటుంది. అందుకే పొదుపు మీరు పాటిస్తూనే మీ పిల్లలకూ నేర్పండి. మీ అవసరాలు తీరగా మిగిలిన మొత్తాన్ని స్టాక్‌ మార్కెట్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా సంపదను వృద్ధి పరచుకోవచ్చు. ఫలితంగా మీకు ఆర్థిక స్వాతంత్య్రం త్వరగానే వస్తుంది. ఆరోగ్య ఖర్చులపై జాగ్రత్త..నేటి కాలంలో ఏ వ్యాధులు ఎప్పుడు అంటుకుంటాయో చెప్పడం కష్టం. ఆరోగ్యపరంగా ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా దురదృష్టవశాత్తు ఏదైనా వ్యాధి సోకితే చేతి చమురు వదులుతుంది. చిన్న రోగానికి చికిత్స చేయిం చుకున్నా లక్షల్లో బిల్లులు చెల్లించే పరిస్థితి నెలకొంది. ఇలాంటప్పుడు మొత్తం కుటుంబ ఆర్థిక పరిస్థితే తలకిందులవుతుంది. అందుకే ఆరోగ్య బీమాను నిర్లక్ష్యం చేయవద్దు. బీమా కోసం చెల్లించే మొత్తం తక్కువే అయినా చాలా మంది దీనికి అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. అయితే ఇలాంటి బీమానే ఆపత్కాలంలో ఆదుకుం టుందన్న విషయం మరవొద్దు. ఆరోగ్య బీమా రక్షణను కొనసాగించడం వల్ల ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం మరింత సులభతరం అవుతుంది.  సమీక్ష..ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించడం అనేది ఓ సుదూర ప్రయాణంలాంటిది. మీ లక్ష్యాన్ని సాధించేందుకు చేసే పెట్టుబడులు, పొదుపు, ఆస్తుల కొనుగోలు వంటి వాటిని కొంత కాలం తర్వాత సమీక్షించుకోవాలి. అవసరం అయితే మీ ఆలోచనల్లో మార్పులు చేసుకోవాలి. మీ సొమ్మును ఏదో ఒక రంగానికే పరిమితం చేయకుండా విభిన్న రంగాలకు విస్తరించడం వల్ల అనుకోని ఉపద్రవాలు ఎదురైనా మీ లక్ష్యం చెక్కు చెదరకుండా ఉంటుంది. సో.. ఈ స్వాతంత్య్ర దినోత్సవం నుంచైనా మీరు మీ ఆర్థిక స్వాతంత్య్రం గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌..
business
653
29-10-2017 02:33:23
మార్కెట్లోకి జెఎల్‌ఆర్‌ 7 సీట్ల డిస్కవరీ
ముంబై: టాటా మోటార్స్‌.. బ్రిటిష్‌ లగ్జరీ కార్ల దిగ్గజం జెఎల్‌ఆర్‌ మార్కెట్లోకి ఏడు సీట్ల లాండ్‌ రోవర్‌ డిస్కవరీని తీసుకువచ్చింది. ఈ కారు ధర రూ.71.38 లక్షల నుంచి రూ.82 లక్షల మధ్యన ఉన్నాయి. ఏడు సీట్ల ప్రీమియం ఎస్‌యువి 3 లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్స్‌తో తీసుకువచ్చినట్లు జెఎల్‌ఆర్‌ తెలిపింది. ఆటోమెటిక్‌ టైర్‌ లిఫ్టింగ్‌తో ఫుల్‌ సైజ్‌ స్పేర్‌ వీల్‌, ఇంటలిజెంట్‌ సీట్‌ ఫోల్డ్‌ ఫంక్షనాలిటీ ఈ ఎస్‌యువి ప్రత్యేకతలు.
business
1,874
31-03-2017 00:06:41
5 విమాన సంస్థలకు 128 రూట్లు
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి) : కేంద్రప్రభుత్వం చిన్న నగరాలకు కూడా విమాన ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పథకం ఉడాన్‌ కింద ఐదు విమానయాన సంస్థలకు 128 రూట్లను గురువారం కేటాయించింది. ఈ విమానయాన సంస్థల్లో తెలుగు హీరో రామ్‌చరణ్‌ నిర్వహణలోని టర్బో మెఘా ఎయిర్‌లైన్స్‌ కూడా ఉంది. ఈ సంస్థకు 18 రూట్లు దక్కాయి. ట్రూజెట్‌ కడప నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ నగరాలకు విమానాలు నడుపుతుంది. ఎయిర్‌ ఒడిశా గరిష్ఠంగా 50 రూట్లు గెలుచుకుంది. ఈ సంస్థ ఇతర మార్గాలతో పాటు జగదల్‌పూర్‌ నుంచి చెన్నై, విజయవాడ నగరాలకు విమాన సర్వీసులు నడపనుంది. ఇవి కాకుండా ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ అలయన్స్‌ ఎయిర్‌ 15 రూట్లు, ఎయిర్‌దక్కన్‌ 34 రూట్లు, స్పైస్‌జెట్‌ 11 రూట్లు సాధించాయి. ఉడాన్‌ పథకం కింద గంట ప్రయాణానికి టికెట్‌ ధరను 2500 రూపాయలకే పరిమితం చేశామని, దీని కోసం ప్రతీ సర్వీసులోను 50 శాతం సీట్లను కేటాయిస్తారని ఉడాన్‌ సర్వీసుల తొలి జాబితాను విడుదల చేసిన సందర్భంగా పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు తెలిపారు. తదుపరి దశలో మరో 50 విమానాశ్రయాలకు ఉడాన్‌ను విస్తరిస్తామని, వాటిలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలుంటాయని ఆయన అన్నారు. ఈ పథకం అమలులోకి రావడంతో మరిన్ని నగరాలు హైదరాబాద్‌తో అనుసంధానం అవుతాయని ఆయన చెప్పారు. కొత్తగూడెం విమానాశ్రయానికి అనుమతులు మంజూరయ్యాయని, రాష్ట్రప్రభుత్వం ఆ విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తే అక్కడకు కూడా విమానాలు నడుపుతామని ఆయన అన్నారు. ఉడాన్‌ తొలి జాబితా ప్రకారం దేశంలోని 70 పట్టణాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఈ 70 విమానాశ్రయల్లో 31 అసలు విమాన సర్వీసులే నడవడంలేదు. 12 విమానాశ్రయాలు సామర్థ్యం మేరకు పని చేయలేకపోతున్నాయి. అయితే ఈ విమానాశ్రయాలన్నీ వినియోగానికి సిద్ధంగా ఉన్నవేనని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే చెప్పారు. ఎంపికైన సంస్థలు తమకు కేటాయించిన రూట్లలో 19 నుంచి 78 సీట్లు గల విమానాలను నడుపుతాయని ఆయన చెప్పారు. త్వరలోనే ఉడాన్‌ కింద తొలి విమానం గాలిలోకి ఎగురుతుందన్న ఆశాభావం ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌తో సహా మొత్తం 20 రాష్ర్టాల్లోని వివిధ గమ్యాలకు ఈ విమానాలు నడుస్తాయని ఆయన అన్నారు. ఉడాన్‌ కింద ఆపరేటర్లందరికీ వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ అందిస్తారు.  ఇందుకు అవసరం అయిన నిధులను ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు నడిచే విమానాలపై 8500 రూపాయల లెవీ విధించడం ద్వారా వసూలు చేస్తారు. అంటే ఒక్కో ప్రయాణికుడిపై 50 రూపాయలు అదనపు భారం పడుతుంది. తొలి విడత బిడ్డింగ్‌లో రూట్లు గెలుచుకున్న ఆపరేటర్లకు ఏడాదికి 205 కోట్ల రూపాయలు విజిఎ్‌ఫగా అందించాల్సి ఉంటుందని అంచనా అని చౌబే చెప్పారు. ఒక్కో సీటుకు వారు కోరిన విజిఎఫ్‌ ఆధారంగా ఈ విమాయాన సంస్థలను ఎంపిక చేసినట్టు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంతసిన్హా తెలిపారు.
business
13,538
26-05-2017 03:58:45
లోయలోకి పడ్డ స్కూల్‌ బస్సు.. అంతా క్షేమం
జమ్ము: జమ్ముకశ్మీర్‌లో 40 మంది విద్యార్థులున్న ఓ స్కూల్‌ బస్సు పెద్దలోయలోకి పల్టీలు కొట్టింది. గరీబ్‌ నవాజ్‌ స్కూల్‌కు చెందిన వారంతా మంజగాట్‌ నుంచి రాజౌరీకి పిక్‌నిక్‌కి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే విద్యార్థులందరూ ఈ ప్రమాదం సురక్షితంగా బయటపడ్డారు. విద్యార్థులు క్షేమంగా తిరిగొచ్చారని పూంఛ్‌ ఎస్పీ మస్రూర్‌ మీర్‌ తెలిపారు.
nation
11,878
13-08-2017 15:31:08
చైనాకు యుద్ధంతోనే జవాబు చెప్పాలి: రాందేవ్ బాబా
ముంబై: సిక్కిం సెక్టార్‌లోని డోక్లాంలో చైనా, భారత్ మధ్య తలెత్తిన ప్రతిష్టంభన‌పై యోగా గురు రాందేవ్ బాబా ఘాటుగా స్పందించారు. కుక్క కాటుకు చెప్పుదెబ్బే సరైన సమాధానమని అన్నారు. చైనాకు శాంతిపై నమ్మకం లేదని, యుద్ధ పరిభాషనే అది ఇష్టపడుతోందని అన్నారు. ముంబైలో జరిగిన ప్రపంచ శాంతి, సామరస్య సదస్సులో రాందేవ్ బాబా తన సందేశాన్ని ఇచ్చారు. ఈ సదస్సులో ప్రముఖ టిబెట్ ఆధ్యాత్మిక వేత్త దలైలామా కూడా పాల్గొన్నారు. రాందేవ్ బాబా తన ప్రసంగంలో చైనా వైఖరిని ఎండగట్టారు. శాంతిపై చైనాకు నమ్మకం లేకపోవడం వల్లే ఈ రోజు దలైలామా ఇక్కడ ఉన్నారని, కుక్కకాటుకు చెప్పుదెబ్బ రీతిలో మనం వ్యవహరించాల్సి ఉంటుందని సూచించారు. యోగా పరిభాషలో మనం మాట్లాడుతుంటే చైనాకు తలకెక్కడం లేదన్నారు. యుద్ధమంటూ కలవరిస్తోందంటూ ఎద్దేవా చేశారు. యోగా భాష అర్ధం కాకుంటే చైనాకు అర్ధమైన యుద్ధ పరిభాషలోనే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాందేవ్ బాబా అన్నారు. దలైలామా ఇటీవల డోక్లాం ప్రతిష్ఠంభనకు శాంతే పరిష్కారమని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లినప్పుడే శాంతి సాధ్యమని చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పక్కపక్క దేశాలైన చైనా, భారత్ 'హిందీ చీనీ భాయ్ భాయ్' అన్న రీతిలో ఉండాలంటూ హితవు పలికారు.
nation
12,176
12-09-2017 04:00:04
15లోపు పద్మ అవార్డులకు దరఖాస్తు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులు-2018కి ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ తెలిపింది. 15వ తేది అర్ధరాత్రి 12 గంటలకు దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుందని సోమవారం స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, మరే ఇతర మాధ్యమాల ద్వారా దరఖాస్తులను స్వీకరించబోమని తెలిపింది. వివరాలు, దరఖాస్తు కోసం www.padmaawards.gov.in ను సందర్శించాలని సూచించింది. కాగా, ఇప్పటిదాకా 15,700 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది.
nation
19,111
22-11-2017 23:59:42
2018ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలి
ఐక్యరాజ్యసమితికి భారత్‌ లేఖపోషక విలువలు సమృద్ధిగా ఉండే చిరుధాన్యాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం 2018ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని భారత్‌ కోరింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్‌సకు భారత వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ లేఖ రాశారు. చిరుధాన్యాలైన జొన్నలు, సజ్జలు, రాగులకు భారత్‌లో ఎంతో ప్రాముఖ్యం ఉందని, కానీ.. అంతర్జాతీయంగా వీటి కొనుగోలుదారుల్లో, విధాన రూపకర్తల్లో, రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ రంగంలో అవగాహన తక్కువగా ఉందని పేర్కొన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి, కొనుగోలును ప్రోత్సహించడం ద్వారా ప్రపంచంలో ఆకలి సమస్యనూ తీర్చవచ్చునన్నారు. చిరుధాన్యాలు ఆహార పదార్థంగా, జంతువుల మేతగా, జీవ ఇంధనంగా పలు రకాలుగా ఉపయోగపడతాయని రాధామోహన్‌సింగ్‌ తెలిపారు.
nation
10,106
10-11-2017 22:41:08
దయచేసి అలా రాయకండి
‘‘నేను మొండివాడిని. నా గురించి ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోగలను. కానీ, మా ఇంట్లో వాళ్లను, నా అభిమాన, బంధుకోటిని ఇబ్బందిపెట్టే హక్కు ఎవరికీ లేదు. నిజానిజాలు తెలుసుకోకుండా నా ఆరోగ్యం విషమించిందని అబద్ధపు ప్రచారం చేయకండి’’ అని ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఊపిరితిత్తులు పాడయ్యానని, గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారనీ సోషల్‌ మీడియాలో వార్తలు ప్రచారమయ్యాయి. వాటిని ఖండిస్తూ కోట శ్రీనివాసరావు హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం విలేకరులతో సమావేశమయ్యారు.  ‘‘నాకిప్పుడు 74 ఏళ్లు. కాళ్లు నొప్పో, కంటి నొప్పో రాదా? అయినా నాకు తెలిసిన వాళ్లు హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్లనా? నేనే కాదు.. ఎవరైనా హాస్పిటల్‌కి వెళ్లరా? హాస్పిటల్‌కి వెళ్లినంత మాత్రాన ప్రాణాంతక వ్యాధులు ఉన్నట్టేనా? వార్తలు ప్రచారం చేయడానికి ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఇది నా ఒక్కడి విషయంలో జరుగుతున్నది కాదు. ఇటీవల గాయని సుశీలగారి విషయంలోనూ ఇదే జరిగింది. దయచేసి ఇలాంటి అబద్ధపు ప్రచారం చేయవద్దు. ఆర్టిస్టులు సున్నితమనస్కులు. వారినీ, వారి కుటుంబాన్ని ఆందోళనకు గురిచేయవద్దు’’ అని కోట అన్నారు. ప్రస్తుతం ‘బాలకృష్ణుడు’, ‘ఆచారి అమెరికా యాత్ర’, ‘జవాన్‌’లో నటించినట్టు తెలిపారు. త్వరలో ‘సామి స్క్వయర్‌’ సినిమా సెట్స్‌కు వెళ్లనున్నట్టు చెప్పారు.
entertainment
10,217
05-01-2017 18:42:24
బెంగళూరు కీచకంపై స్పందించిన రకుల్
బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో జరిగిన కీచకంపై సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు. మనిషిగా పుట్టినందుకు సిగ్గుగా ఉందని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందిచగా, తప్పు జరిగిన వెంటనే అరెస్ట్ చేస్తే ఆడపిల్లలపై కన్నెత్తి చూడడానికి కూడా భయపడతారని బాలీవుడ్ మరో హీరో ఆమిర్ ఖాన్ తన స్పందన తెలియజేశాడు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా బెంగళూరు కీచకంపై సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అవుతోందని ఓ చిత్రకారుడు చెప్పదలుచుకుంటే.. ఇంతకంటే బాగా చెప్పలేడేమో’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఒక ఫొటోను తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసి, ‘ఆడవాళ్లను వస్తువుగా చూడడం ఎప్పుడు మానేస్తారో.. మృగాళ్ల నుంచి మనకు ఎప్పడు విముక్తి కలుగుతుందో’ అని పోస్ట్ చేసింది.
entertainment
19,611
31-10-2017 04:44:54
కోహ్లీనే మళ్లీ నెంబర్‌ 1
కెరీర్‌లో అత్యధిక రేటింగ్‌ పాయింట్లుతొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌దుబాయ్‌: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హవా కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో అదరగొట్టిన విరాట్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకాడు. రెండు నుంచి నెంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరాడు. కెరీర్‌లో అత్యధిక రేటింగ్‌ (889) పాయింట్లు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ రికార్డు నెలకొల్పాడు. 1998లో సచిన్‌ అత్యధికంగా 887 రేటిం గ్‌ పాయింట్లు సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో కోహ్లీ మాస్టర్‌ను సమం చేశాడు. కాగా పది రోజుల వ్యవధిలోనే విరాట్‌కు మళ్లీ టాప్‌ ర్యాంక్‌ దక్కింది. డివిల్లీర్స్‌ (872 పాయింట్లు) టాప్‌ నుంచి రెం డో స్థానానికి పడిపోయాడు. రోహిత్‌ శర్మ కెరీర్‌లో అత్యధిక రేటింగ్‌ (799) పాయింట్లతో ఏడో ర్యాంక్‌ పదిలం చేసుకున్నాడు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా రెండు స్థానాలు ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. పాక్‌ బౌలర్‌ హసన్‌ అలీ టాప్‌లో ఉన్నాడు. కాగా, టీమ్‌ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా అగ్రస్థానం పదిలం చేసుకుంది. భారత్‌, ఆస్ర్టేలియా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మిథాలీకి టాప్‌ ర్యాంక్‌: భారత మహిళా వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ కూడా నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించింది. మిథాలీ 753 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌కు చేరింది. ఎలీస్‌ ఫెర్రీ (ఆస్ర్టేలియా), అమీ సాటెర్త్‌వైట్‌ (న్యూజిలాండ్‌) ఒక్కో స్థానం ఎగబాకి రెండు, మూడు ర్యాంకుల్లో నిలిచారు. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ను వెనక్కినెట్టి ఆస్ర్టేలియా టాప్‌ కు చేరుకుంది. టీమిండియా నాలుగో స్థానంలో ఉంది.
sports
3,246
21-08-2017 03:54:36
‘మిర్గం’ ఆవిష్కరణ
తెలంగాణ కవుల కవితా సంపుటి ‘మిర్గం’ ఆవి ష్కరణ, వనపట్ల సుబ్బయ్యకు తెలంగాణ సాహి త్య కళావేదిక పురస్కార ప్రదానోత్సవ సభ ఆగస్టు 27 సా.5.30గం.లకు దొడ్డి కొమరయ్య హాల్‌, సుంద రయ్య విజ్ఞానకేంద్రం, హైదరాబాద్‌ నందు జరుగు తుంది. అధ్యక్షులు ఏనుగు నరసింహారెడ్డి, ముఖ్య అతిథి ఘంటాచక్రపాణి, విశిష్ట అతిథి రాజేందర్‌జింబో.- అమ్మంగి వేణుగోపాల్‌
editorial
7,392
27-06-2017 22:32:59
రాజకుమారి ప్రేమకథ
నారా రోహిత్‌ కథానాయకుడిగా మహేశ్‌ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కథలో రాజకుమారి’. నమితా ప్రమోద్‌ కథానాయిక. నాగశౌర్య కీలకపాత్ర పోషిస్తున్నారు. సౌందర్య నర్రా, సుధాకర్‌రెడ్డి, కృష్ణ విజయ్‌ నిర్మాతలు. ఇళయరాజా, విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల్ని, ట్రైలర్‌ను ఇటీవల ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘పరిణితి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగమైన ప్రేమకథ ఇది. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. నారా రోహిత్‌ క్యారెక్టర్‌ కొత్తగా ఉంటుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు స్పందన బావుంది. జూలై నెలాఖరులో సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు.
entertainment
20,075
27-07-2017 02:01:15
అందుకే.. ఆ రనౌట్‌
ముంబై : ఇంగ్లండ్‌తో గత ఆదివారం జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో మిథాలీరాజ్‌ రనౌట్‌ అయిన తీరుపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తా యి. ప్రతి పరుగూ కీలకమైన దశలో, విజయం ఊరిస్తున్న తరుణంలో సాక్షాత్తు కెప్టెన్‌ రనౌట్‌ కావడం జీర్ణించుకోలేని నెటిజన్లు..ఆమెపై విమర్శల జడివా న కురిపించారు. అయితే ఆ రనౌట్‌పై మిథాలీ వివరణ ఇచ్చింది. ప్రపంచకప్‌లో పాల్గొన్న భారత బృందం బుధవారం లండన్‌నుంచి ముంబై చేరుకుంది. భారత జట్టుకు విమానాశ్రయంలో పలువురు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మిథాలీ విలేకరులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆ రనౌట్‌, దానిపై విమర్శల పరంపర ప్రస్తావనకు వచ్చింది. దీనిపై మిథాలీ మాట్లాడుతూ ’పూనమ్‌ రౌత్‌ నన్ను పరుగుకోసం పిలిచింది. అయితే నా బూట్‌ స్పైక్‌ మైదానంలో కూరుకుపోయి వేగంగా పరుగు తీయలేకపోయాను. సగం దూరం వచ్చేసరికి ఈ సంఘటన జరిగింది. ఫలితంగా డైవింగ్‌ కోసం కూడా ప్రయత్నం చేయలేక నిస్సహా యురాలినయ్యాను’ అని వివరించింది. తన బూట్‌ స్పైక్‌ అలా గ్రౌండ్‌లో కూ రుకుపోయిన వైనాన్ని టీవీ కెమెరాలు పసిగట్టాయని తాను భావించడంలేదని చెప్పింది. వాస్తవం ఇది కాగా..తన రనౌట్‌ను సామాజిక మాధ్యమాల్లో తప్పుపడుతూ విమర్శించడంపై మిథాలీ ఆవేదన చెందింది. ప్రతి మహిళా క్రికెటరూ సెలెబ్రిటీనేఈ ప్రపంచకప్‌ భారత మహిళా క్రికెట్‌కు ఎంతో మేలు చేసిందని మిథాలీ చెప్పింది. ‘ప్రస్తుతం అభిమానులు మహిళల క్రికెట్‌ మ్యాచ్‌లను వీక్షించడమేకాదు వాటికి సంబంధించిన ప్రతి విషయాన్నీ గమనిస్తున్నా రు. అందువల్ల ఇప్పుడు మహిళా జట్టు ప్రతి క్రికెటర్‌ ఓ సెలెబ్రిటినే. జట్టులో తమ పాత్ర ఏమిటో వారందరికీ తెలుసు’ అని పేర్కొంది. ‘గతంలో ఒకరిద్దరిని తప్ప మిగిలిన మహిళా క్రికెటర్లను అభిమానులు గుర్తు పట్టేవారు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారడానికి కారణం అమ్మా యిలు అద్భుతంగా ఆడడమే. ఖ్యాతి అంతా వారిదే. ఇక ప్రపంచకప్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసినందుకు ఐసీసీకి కృతజ్ఞతలు. ప్రత్యక్ష ప్రసారాలతో పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది’ అని వివరించింది. ‘ఫైనల్‌కు భారీగా అభిమానులు హాజరవడం ప్రత్యేక అనుభూతి కలిగించింది. మహిళల మ్యాచ్‌కు ఆ స్థాయిలో ప్రేక్షకులు రావడం అదే తొలిసారి. వారిని మేం నిరాశ పరచలేదు. ఫైనల్‌ను ఏకపక్షం కానివ్వలేదు. ఇంగ్లండ్‌తో హోరాహోరీగా పోరాడాం’ అని గుర్తు చేసింది. ‘మహిళా క్రికెట్‌ను పురుషుల క్రికెట్‌తో పోల్చి చూడవద్దని ఈ సందర్భంగా అభిమానులను కోరుతున్నా. ఎందుకంటే మహిళా క్రికెట్‌కు దాని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి’ అని వివరించింది.
sports
2,774
16-01-2017 00:13:12
కీలక నిరోధం 8500
నిఫ్టీ గత వారం అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ 8300 వద్ద బ్రేకౌట్‌ సాధించి కీలక స్థాయి 8500 వరకు వెళ్ళి పటిష్ఠంగా క్లోజయింది. టెక్నికల్‌గా అప్‌ట్రెండ్‌లోనే ఉన్నప్పటికీ కీలక స్థాయికి చేరవవుతూ ఉండడం వల్ల స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. వీక్లీ చార్టుల్లో బ్రేకౌట్‌ నమోదయినందువల్ల మైనర్‌ పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌కు కూడా అవకాశం ఉంది. గత కొద్ది రోజుల్లో 500 పాయింట్ల మేరకు నిరంతర ర్యాలీ సాధించినందు వల్ల కన్సాలిడేషన్‌ ఏర్పడడం తప్పనిసరి. గత కొద్ది నెలలుగా ప్రధాన మద్దతు స్థాయిగా ఉన్న 8500 ఇప్పుడు ప్రధాన నిరోధంగా మారింది.8500 కన్నా పైన నిలదొక్కుకున్నప్పుడే 8400 దిగువన స్టాప్‌లా్‌సతో స్వల్పకాలిక బై పొజిషన్లను మరిన్ని తీసుకునే విషయం పరిశీలించవచ్చు. 8300 కన్నా దిగువన క్లోజయితే స్వల్పకాలిక కరెక్షన్‌గా భావించి స్వల్పకాలిక బై పొజిషన్లు హోల్డ్‌ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.పాటర్న్‌: మార్కెట్‌ ఓవర్‌బాట్‌ స్థితిని చేరడం కన్సాలిడేషన్‌ ఉండవచ్చుననడానికి సంకేతం. 50, 100, 200 డిఎంఏల వద్ద రికవరీ సాధించడం సానుకూలత సంకేతం. ఈ స్థాయిల్లో మరోసారి పరీక్షకు గురి కావచ్చు. ప్రస్తుతం ఇండెక్స్‌ 8500 వద్ద అడ్డంగా కనిపిస్తున్న రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌కు సమీపంలో ఉంది. 8300 వద్ద అడ్డంగా కనిపిస్తున్న సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌ వద్ద మద్దతు ఉంది. రివర్సల్‌లో పడినా భద్రత కోసం ఈ స్థాయిలో నిలదొక్కుకోవడం తప్పనిసరి.
business
9,387
17-05-2017 11:51:43
సింగపూర్‌లో బాహుబలికి సెన్సార్!
ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా దిగ్విజయంగా దూసుకెళుతోంది బాహుబలి-2. చిన్నా..పెద్ద అన్న తారతమ్యం లేకుండా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పెద్దల కంటే చిన్నపిల్లలే సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహమైతే లేదు. కానీ, సింగపూర్‌లో మాత్రం చిన్న పిల్లలు సినిమా చూడకుండా సెన్సార్ చేసేశారు. 16 ఏళ్లలోపు పిల్లలు సినిమా చూడకుండా ఎన్‌సీ-16 సెన్సార్ సర్టిఫికెట్‌ను ఇష్యూ చేశారు. 16 ఏళ్ల లోపు పిల్లలు సినిమా చూడకుండా చేయడానికి ఓ కారణం ఉందట. అదే.. సినిమా హింసను ప్రేరేపించే విధంగా ఉందట. అందుకే సినిమాకు ఎన్‌సీ16 సర్టిఫికెట్ ఇచ్చారట. దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ స్పందించారు.           ‘‘భారత్‌లో ఎలాంటి కోతలూ లేకుండా బాహుబలి-2 సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చాం. కానీ, సింగపూర్‌ వారికి మాత్రం ఆ సినిమా హింసాత్మకంగా కనిపించిందట. యుద్ధ సన్నివేశాలు.. మరీ ముఖ్యంగా ఆ యుద్ధాల్లో సైనికుల తలలను నరకడం వారికి హింసను ప్రేరేపించే దానిలా కనిపించిందట. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కోసం రాక్షసుల తలలను నరికినట్టు మన పురాణాలు చెబుతాయి. చిన్నప్పటి నుంచి వాటిని చూసే పెరిగారు మన పిల్లలు. అయినా.. వాటి నుంచి హింసను నేర్చుకోలేదు’’ అని అన్నారు.           ఇక, భారత్‌లో సెన్సార్ షిప్ ఎంత ఉదారంగా ఉంటుందో వివరించారు పహ్లాజ్ నిహ్లాని. ఆసియా, యూరప్‌లలోని అనేక దేశాల్లో బాలీవుడ్ సినిమాలకు ‘ఏ’ సర్టిఫికెట్‌నే ఇస్తున్నారని, కానీ, ఇండియాలో మాత్రం ఆ పరిస్థితి లేదని అన్నారు. ఇండియాలో సెన్సార్ షిప్ అనే అంశం సెంటిమెంట్లతో ముడిపడి ఉందన్నారు. తలను నరికే సీన్‌ను సెన్సార్ చేస్తే మత వ్యతిరేకి అని ముద్ర వేసేస్తారని, ముద్దు సన్నివేశ సమయాన్ని తగ్గిస్తే బిడియస్థులు అనేస్తారని చెప్పారు. ఇక, హోమోసెక్సువల్ సన్నివేశాలను కట్ చేస్తే.. హోమోఫోబియాతో భయపడిపోతున్నారంటూ రకరకాల ముద్రలు వేసేస్తారని పహ్లాజ్ నిహ్లాని అన్నారు.
entertainment
2,492
09-10-2017 14:10:21
అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న కోళ్ల పెంపకం దారులు
 త్రిశంకు స్వర్గంలో కోళ్ల పెంపకందారులు పరిశ్రమకు రాయితీ కల్పించని ప్రభుత్వాలు అధిక భారమవుతున్న కోళ్ల పెంపకం వాతావరణం అనుకూలిస్తేనే లాభాలు ప్రభుత్వం ఆదుకోవాలంటున్న పెంపకందారులు వరంగల్‌ అర్బన్‌ అగ్రికల్చర్‌:కోళ్ల పెంపకందారులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కోళ్ల పెంపకాన్ని పరిశ్రమగా గానీ, వ్యవసాయంగా గానీ ప్రభుత్వం గుర్తించకపోవడంతో పెంపకందారులకు ఎలాంటి రాయితీలు అందడంలేదు. దీంతో కోళ్ల పెంపకం చేపట్టే వ్యక్తులు స్వయంగా పెట్టుబడులు సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఒక వేళ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నా అధిక వడ్డీతో అసలు తడిసిమోపడువుతోంది. కేవలం ప్రకృతి మీదే భారం వేసి జీవనం పొందే కోళ్ల పెంపకందారులు వాతావరణం బాగా లేకపోతే తీవ్రంగా నష్టపోతున్నారు. భారంగా కోళ్ల పెంపకంఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు 80 మంది కోళ్ల పెంపకందారులుండగా.. సుమారుగా 20 లక్షల కోళ్లను పెంచుతున్నారు. వాటిలో సుమారు 80శాతం కోళ్లు ప్రతీ రోజు గుడ్లు పెడతాయి. కోడి జీవిత కాలం సుమారు 18 నెలలు కాగా, పిల్లదశ నుంచి 6 నెలల తర్వాత సంవత్సర కాలం పాటు గుడ్లు పెడతాయి. ఆ తర్వాత కోడిని రూ.70కి ఒకటి చొప్పున విక్రయిస్తారు. మేలుర కం కోడిపిల్లలను ఒక రోజు వయస్సు గల పిల్లను సుమారు రూ.35లకు కొనుగోలు చేస్తారు. వాటిని పిల్లలకు రూపొందించిన ప్రత్యేక షెడ్‌లో సుమారు 7వారాల కాలం పాటు బ్రూడర్‌ షెడ్‌లో పెంచుతారు. అనంతరం 8 నుంచి 20 వారాల పాటు గ్రోయర్‌ షెడ్‌లో పెంచుతారు. 20వారాల అనంతరం లేయర్‌ షెడ్‌లోకి మారుస్తారు. ఒక రోజు కోడిపిల్ల దశ నుంచి కోడి గుడ్డు పెట్టే దశ వ రకు ఒక్కొక్క దానికి వ్యాక్సినేషన్‌, పోషణ ఖర్చు సుమారుగా రూ.260 అవుతుంది. గిట్టుబాటుకాని గుడ్ల ధరదాణాలో నాణ్యత ఉండి, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఒక కోడి సంవత్సర కాలంలో సుమారు 320 దాకా గుడ్లు పెడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక గుడ్డుకు హోల్‌సేల్‌గా రూ.3.57 ధర పలికితే పెంపకందారుకు గిట్టుబాటుగా ఉంటుంది. ఖర్చులుపోను పెంపకందారుకు రూ.0.75పైసలు గుడ్డు ఒక్కంటికి మిగులుతాయి. కానీ సుమారు పక్షం రోజులుగా గుడ్డుకు రూ.3.25 మాత్రమే ధర పలుకుతోంది. సాధారణంగా నవంబర్‌, డిసెంబర్‌, జనవరి నెలల్లో చలికాలం అయినందున ప్రజలు గుడ్లను ఎక్కువగా తింటారు. గుడ్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్న కాలంలో రేట్లు కూడా పెరుగుతాయి. పెంపకందారులకు లాభాలు వస్తాయి. దేశం మొత్తంలో రోజుకు సుమారు 24కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతాయని అంచనా. కాగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే అందులో 40 శాతం వరకు ఉత్పత్తి అవుతున్నాయి. గుడ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తిలో సుమారు 30 శాతం మేరకు వినియోగం అవుతున్నాయి. మిగతా గుడ్లను ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. వినియోగానికి ప్రతిబంధకాలెన్నో..ఉత్పత్తి అయిన గుడ్ల వినియోగానికి ఎన్నో ప్రతి బంధకాలు ఎదురవుతున్నాయి. పండుగల రోజుల్లో ప్రజలు మాంసం వైపు మొగ్గు చూపుతారే తప్ప గుడ్లను ముట్టుకోరు. ఇంకా పలువురు దైవ భక్తులు శనివారం, గురువారం, మంగళవారం గుడ్లను దరి చేరనివ్వరు. ఇంకా దేవీ నవరాత్రులు, శ్రావణమాసంలలో గుడ్లను తినకుండా ఉంటారు. కోళ్లను కంటికి రెప్పలా కాపాడాలి..వాతావరణంలో సంభవించే ఎక్కువ వేడిని గానీ, చలినిగానీ కోళ్లు తట్టుకోలేవు. కోళ్ల మెటబాలిజం దెబ్బతిని చనిపోతాయి. కోళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ప్రతీ 10వేల కోళ్లకు ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పురుష కూలీలు అవసరమవుతారు. చలికాలంలో అతి చలిగా ఉండే రోజుల్లో చిన్న కోడి పిల్లలకు కృత్రిమ వేడిని కల్పించాలి. ఉష్ణోగ్రత సుమారు 31, 32 సెల్సియస్‌ డిగ్రీలు ఉండేలా బొగ్గుల కుంపటి, విద్యుత్‌ హీటర్లు, అధిక వేడిని ఇచ్చే హైవోల్టేజీ విద్యుత్‌ బల్బులను అమర్చాలి. పెద్ద కోళ్లు కూడా వేసవి కాలంలో 42 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే తట్టుకోలేవు. షెడ్లచుట్టూ నీటితో తడిసిన తట్లతో కప్పాలి. గత వేసవిలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 36 రోజుల పాటు 42 సెల్సియస్‌ డిగ్రీల నుంచి 45 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అధిక వేడిమికి సుమారు మూడున్నర లక్షల కోళ్లు చనిపోయి పెంపకందారులకు సుమారుగా రూ.7 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. చిన్న కోడి పిల్లలకు ప్రకృతి వైపరిత్యాల వల్ల కూడా నష్టం వాటిల్లుతుంది. ఉరుములు, మెరుపులు గాలి దుమారం వచ్చినప్పుడు చిన్నకోడి పిల్లలు భయంతో బెదిరి షెడ్డులో ఓ మూలన ఒదుగుతాయి. కుప్పగా ఒక దానిపై ఒకటి ఎక్కడంతో కింద ఉన్న పిల్లలు భారం భరించలేక చనిపోతాయి. రోజురోజుకు కొత్తకొత్త వైరల్‌ వ్యాధులు సోకి చనిపోకుండా ముందు జాగ్రత్త చర్యగా తరచూ వ్యాక్సినేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఇన్ని వ్యయ, ప్రయాసాల కోర్చి కోళ్ల పెంపకం చేపడితే పరిస్థితులు అనుకూలించినప్పుడు అప్పుడప్పుడు లాభాలు సమకూరి.. ప్రతికూల పరిస్థితుల్లో కొత్త కొత్త రకాల వైరస్‌ వ్యాధులు సోకి కోళ్లు చనిపోయి పెద్ద మొత్తంలో నష్టాల పాలవుతారు. వ్యవస్థీ కృతమైన ప్రభుత్వ విధానం ఉండాలికోళ్ల పెంపకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వ్యవస్థీకృతమైన విధానాన్ని అమలు చేయాలి. కోళ్ల పెంపకాన్ని కనీసం పరిశ్రమగా గానీ, వ్యవసాయంగా గానీ ప్రభుత్వం గుర్తించాలి. పరిశ్రమగా గుర్తిస్తే విద్యుత్‌ వినియోగ చార్జీల్లో రాయితీ, వ్యవసాయంగా గుర్తిస్తే బ్యాంకు రుణాల్లో వడ్డీ రాయితీ లభిస్తుంది. - మార్తినేని ధర్మారావు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోళ్ల పెంపకందారుల అసోసియేషన్‌ అధ్యక్షుడు
business
20,691
29-10-2017 03:00:49
పోల్‌ డ్యాన్స్‌కు మహర్దశ
పోల్‌ డ్యాన్స్‌ అంటే క్లబ్బుల్లో కనిపించే విన్యాసాలుగానే మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడీ పోల్‌ డ్యాన్సింగ్‌ ఒలింపిక్‌ క్రీడగా ఎదిగేందుకు అడుగులు వేస్తోంది. గ్లోబల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ (జీఏఐఎస్‌ఎఫ్‌) గుర్తింపు పొందిన పోల్‌ డ్యాన్సింగ్‌ ఈ నెలలో అబ్జర్వర్‌ క్రీడ హోదా సాధించి ఒలింపిక్‌ క్రీడగా ఎదిగే దిశగా తొలి అడుగు వేసింది. ఈ క్రీడ ఒలింపిక్స్‌లో త్వరలో స్థానం సంపాదిస్తుందని పలు అంతర్జాతీయ క్రీడా సంఘాలు ఆశిస్తున్నాయి. అబ్జర్వర్‌ స్థాయిని పొందడం తమ గుర్తింపునకు తొలి మెట్టు అని ఇంటర్నేషనల్‌ పోల్‌ స్పోర్ట్స్‌ సమాఖ్య (ఐపీఎస్‌ఎఫ్‌) అధ్యక్షురాలు కేటీ కోట్స్‌ హర్షం వ్యక్తం చేసింది. జీఏఐఎస్‌ఎఫ్‌లో శాశ్వత సభ్యత్వం పొందాలంటే తొలుత అబ్జర్వర్‌ స్థాయిని పొందడం తప్పనిసరి. జాతీయ ఒలింపిక్‌ సంఘం గుర్తింపు పొందడమేకాక ప్రపంచ మాదక ద్రవ్య నిరోధక సంస్థ నిబంధనలను సైతం పాటించాల్సి ఉంటుంది. పోల్‌ డ్యాన్స్‌ చూస్తున్నంత సులభమైందేమీ కాదు. దానికి ఎంతో ఏకాగ్రత అవసరం. ఈ క్రీడను మరింత ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌, బ్యూనస్‌ఎయిర్స్‌లో నిర్వహించే యూత్‌ ఒలింపిక్స్‌లో ప్రదర్శన క్రీడగా అవకాశం దక్కించుకున్న పోల్‌ డ్యాన్సింగ్‌ ఒలింపిక్‌ క్రీడగా అవతరించేందుకు ఇంకెంతో దూరం లేదు.
sports
19,634
17-01-2017 00:35:44
అమ్మో.. అసాధ్యం..!
 భారత క్రికెట్‌లో ఇప్పుడు విరాట్‌శకం నడుస్తోంది! ఫార్మాట్‌ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. పోటీ ఎక్కడైనా.. విరాట్‌ వీరంగానికి హద్దుల్లేకుండా పోతోంది..! అతని విధ్వంసానికి బలికాని బౌలర్లు కనిపించడంలేదు! కోహ్లీ కమాల్‌తో భారత జట్టు ఖాతాలో అపురూప విజయాలు చేరుతున్నాయి..! అతని మాయాజాలానికి ఎన్నో రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి..! అందుకే, అతణ్ణి అభినవ సచిన్‌ అంటున్నారు..! మాస్టర్‌ బ్లాస్టర్‌ను మించినోడంటూ కితాబిస్తున్నారు..! దిగ్గజ క్రికెటర్‌ రికార్డులన్నీ బద్దలుకొడతాడంటున్నారు..! కానీ, అది అసాఽధ్యం అంటున్నాడు విరాట్‌. మాస్టర్‌ ఘనతలను దాటడం అంత తేలిక కాదని చెబుతున్నాడు. టెండూల్కర్‌లా సుదీర్ఘ కాలం ఆడలేనంటూనే.. క్రికెట్‌పై తనదైన ముద్ర వేసే వెళ్తానని చెబుతున్నాడు. అలాగే ఎక్కువ మంది సన్నిహితులు లేకపోవడం కూడా తన విజయ రహస్యాల్లో ఒకటంటున్న కోహ్లీ పలు విషయాలపై తన మనసు విప్పాడు. న్యూఢిల్లీ: ఛేదనలో మొనగాడన్న పేరును నిజం చేస్తూ టీమిండియా కెప్టెన్‌ మరోసారి రెచ్చిపోయాడు. పుణెలో ఆదివారం పరుగుల విధ్వసం సృష్టించి ఛేదనలో 17వ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా ఛేజింగ్‌లో అత్యధిక శతకాలు చేసిన తన ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును సమం చేశాడు..! ఇందుకు సచిన్‌కు 232 వన్డేలు అవసరమైతే విరాట్‌ 96 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మార్కు చేరుకున్నాడు. అంతేనా వన్డేల్లో విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక శతకాలు చేసిన క్రికెటర్‌గా మాస్టర్‌ (14 సెంచరీలు)ను విరాట్‌ (15) దాటేశాడు. రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో మాస్టర్‌ 463 వన్డేలు ఆడితే.. కోహ్లీ తన 177వ మ్యాచ్‌లోనే ఈ రికార్డు బద్దలు కొట్టేశాడు. అందుకే, విరాట్‌ను సచిన్‌తో పోలుస్తున్నారు..! మాస్టర్‌ను మించినోడని కిదాబిస్తున్నారు. కానీ, కోహ్లీ మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నాడు. ‘మాస్టర్‌ బ్లాస్టర్‌’ గణాంకాలను అందుకోవడం చాలా కష్టమని చెబుతున్నాడు. అలాగే.. 2014లో ఇంగ్లండ్‌ పర్యటనలో చాలా ఒత్తిడికి గురయ్యానని చెప్పాడు. ఆ టూర్‌ తర్వాత బ్యాటింగ్‌ టెక్నిక్‌తోపాటు తన మైండ్‌సెట్‌ను కూడా మార్చుకున్నానని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసర్‌ హుస్సేన్‌తో బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇంకా వివిధ అంశాలపై కోహ్లీ చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే...  సచిన్‌ సాధించిన ఘనతలను చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ముందుగా నేను అంత సుదీర్ఘ కాలం (24 ఏళ్లు) ఆడలేనేమో. 200 టెస్టులు, 100 అంతర్జాతీయ శతకాలంటే మాటలా! ఇలాంటి అద్భుత ఘనతలను అధిగమించడం అసాధ్యం. కానీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో నా ప్రత్యేకతను తప్పకుండా చాటుతా. అత్యుత్తమ స్థాయి లో ఆటను వదిలేయాలని నేనెప్పుడూ నమ్ముతా.  అందుకే ఇంగ్లండ్‌లో ఇబ్బంది పడ్డా 2014లో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లేముందు నాపై నేను ఎంతో ఒత్తిడి పెంచుకున్నా. అక్కడ కచ్చితంగా రాణించాలనుకున్నా. అయినా, ఉపఖండ క్రికెటర్లకు ఫలానా దేశాల్లో రాణించాలన్న ప్రత్యేక బెంచ్‌మార్క్‌లు ఎందుకు పెడతారో అర్థం కాదు. అక్కడ బాగా ఆడకపోతే మంచి ఆటగాడు కాదన్న అభిప్రాయానికి వచ్చేస్తారు. అందుకే నేను కూడా ఇంగ్లండ్‌లో బాగా ఆడాలని అంతా ఆశించారు. కానీ, మంచి ఆరంభం దక్కకపోతే మానోస్థయిర్యం దెబ్బతింటుంది. ఇంగ్లండ్‌లో నా సమస్య ఏంటంటే... నేను ఎక్కువ ఇన్‌స్వింగర్లు ఆశించా. దీంతో అవుట్‌ స్వింగర్లకు సరైన సమాధానం ఇవ్వలేకపోయా. ఆఫ్‌-స్టం్‌పనకు అవతల పడ్డ బంతులను వెంటాడి మూల్యం చెల్లించుకున్నా. తర్వాత ఈ లోపాన్ని అధిగమించేందుకు కృషి చేశా. నా బ్యాటింగ్‌ను రికార్డు చేయిస్తూ డ్రిల్స్‌ చేశా. బ్యాలెన్స్‌ కోసం స్టాన్స్‌నూ కాస్త మార్చుకున్నా. ఫలితం సాధించా.  ఆస్ర్టేలియాలో అలా దంచేశా.. ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత టెక్నిక్‌ సరిదిద్దుకోవడం ఆస్ర్టేలియాలో మంచి ఫలితాన్నిచ్చింది. స్టాన్స్‌ మధ్య అంతరం పెంచడం నాకు చాలా ఉపయోగపడింది. ఇదిప్పుడు సులభంగానే ఉంది కానీ, ఆరంభంలో చాలా కష్టంగా అనిపించింది. దీని కోసం రోజుకు మూడు గంటలు బ్యాటింగ్‌ సాధన చేసేవాడిని. ఆరంభంలో చేతులు తిమ్మిరెక్కాయి. అయినా, వెరవకుండా దాదాపు పది రోజులు అలానే ప్రాక్టీస్‌ చేశా. నా టెక్నిక్‌ విషయంలో సచిన్‌ సలహా కూడా ఉపకరించింది.
sports
2,613
27-10-2017 01:59:18
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇఒ చాప్టర్లు
హైదరాబాద్‌ సదస్సుకు భారీగా ప్రతినిధులుహైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార, పారిశ్రామికవర్గాలను దగ్గరికి చేర్చే అంత్రప్రెన్యూర్స్‌ ఆర్గనైజేషన్‌ (ఇఒ) భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా గోవా, నవి ముంబైతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ, వైజాగ్‌లో కొత్త చాప్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘2017 ఇఒ హైదరాబాద్‌ యూనివర్సిటీ’ సదస్సు సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఇఒ దక్షిణాసియా రీజినల్‌ డైరెక్టర్‌ చిరంజీవి పటేల్‌ ఈ విషయం చెప్పారు. వచ్చే ఏడాది చివరికల్లా విజయవాడ, వైజాగ్‌లో చాప్టర్ల ఏర్పాటు పూర్తవుతుందన్నారు.  దీంతో ఆ ప్రాంతాల్లోని స్థానిక పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకూ అంతర్జాతీయ నైపుణ్యాలు, అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. బుధవారం ప్రారంభమైన ‘2017 ఇఒ హైదరాబాద్‌ యూనివర్సిటీ’ సదస్సుకు 35 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు ఇఒ గ్లోబల్‌ యూనివర్సిటీ లీడ్‌ మైకేల్‌ రాస్‌ చెప్పారు. అంతర్జాతీయంగా పేరొందిన తమ సంస్థ స్టార్టప్‌ కంపెనీల నిర్వాహకులతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకూ అవసరమైన శిక్షణ సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రతి చాప్టర్‌లో ఒక్కో పారిశ్రామిక రంగం నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే ఇఒ సభ్యత్వం ఉంటుందని మైకేల్‌ రాస్‌ చెప్పారు.   అది కూడా వార్షిక టర్నోవర్‌ కనీసం 10 లక్షల డాలర్లు మించిన కంపెనీల ప్రమోటర్లు, సిఇఒలు మాత్రమే తమ సంస్థలో సభ్యత్వం పొందేందుకు అర్హులని చెప్పారు. ప్రస్తుతం స్థానికంగా తమ చాప్టర్‌లో 86 మంది పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు సభ్యులుగా ఉన్నట్టు హైదరాబాద్‌ చాప్టర్‌ లోకల్‌ లీడ్‌ జివి కుమార్‌ తెలిపారు. ఇందులో 17 శాతం మంది మహిళలన్నారు.
business
2,253
30-12-2017 23:55:00
తుప్పు వదులుతున్న ఉక్కు
కొన్నేళ్లపాటు మందకొడిగా సాగిన దేశీయ ఉక్కు తయారీ రంగం ఈ ఏడాది పునరుద్ధరణ బాట పట్టింది. భారీ నష్టాల నుంచి సంస్థలు క్రమంగా తేరుకుంటున్నాయి. వచ్చే సంవత్సరంలో ప్రభుత్వ స్టీల్‌ కంపెనీలు మళ్లీ పుంజుకోనున్నాయని, ఈ రంగంలోని ప్రైవేట్‌ సంస్థలకు ధీటుగా పనితీరు కనబర్చనున్నాయని ఉక్కు శాఖ కార్యదర్శి అరుణ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ స్టీల్‌ పాలసీ, ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాలు ఇందుకు దోహదపడనున్నాయని శర్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ స్టీల్‌ సెక్టార్‌ క్రమంగా కోలుకుంటుండటం, ధరల్లో పెరుగుదల సంస్థలకు కలిసి రానుందని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. వచ్చే ఏడాది మౌలిక వసతుల అభివృద్ధి, నిర్మాణ విభాగాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ పెట్టుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, దాంతో స్టీల్‌, టిఎంటి బార్స్‌కు డిమాండ్‌తోపాటు ధరలు కూడా పుంజుకునే అవకాశం ఉందని మెస్కో స్టీల్‌ సిఎండి రీటా సింగ్‌ అన్నారు. ఈ ఏడాదిలో రెండు కీలక పాలసీల ప్రకటన ఈ ఏడాది మే నెలలో మోదీ సర్కారు నేషనల్‌ స్టీల్‌ పాలసీని విడుదల చేసింది. 2030-31కల్లా వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 కోట్ల టన్నులకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ రంగంలోకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. మే నెలలోనే కేంద్రం పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీని కూడా విడుదల చేసింది. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి దన్నుగా ఉక్కు సేకరణలో దేశీయ సంస్థలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆ పాలసీ ఉద్దేశం. పెరగనున్న ఉత్పత్తి సామర్థ్యం దేశీయ స్టీల్‌ కంపెనీలు 2018లో వ్యాపారాన్ని మరింత విస్తరించడంతో పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలని భావిస్తునట్లు అరుణ శర్మ తెలిపారు. అలాగే, వచ్చే సంవత్సరం మరిన్ని కొత్త సంస్థలు ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. దాంతో వచ్చే 2-3 ఏళ్లలో స్టీల్‌ సెక్టార్‌ ఉత్పత్తి సామర్థ్యం భారీగా పుంజుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఈ రంగ ప్రొడక్షన్‌ కెపాసిటీ 12.6 కోట్ల టన్నులుగా ఉంది. దివాలా కోడ్‌తో కొట్టాయ్‌.. పలు స్టీల్‌ సంస్థలపై బ్యాంకులు దివాలా కోడ్‌ను ప్రయోగించాయి. అందులో ఎస్సార్‌ స్టీల్‌, ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్స్‌, భూషణ్‌ స్టీల్స్‌ ఉన్నాయి. దేశీయ సంస్థలకు ప్రభుత్వం బాసట చైనాతో పాటు జపాన్‌, కొరియా దిగుమతుల నుంచి దేశీయ స్టీల్‌ ఉత్పత్తిదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఈ ఏడాది కేంద్రం పలు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా కనీస దిగుమతి ధర (ఎంఐపి) నిబంధన విధించడంతోపాటు యాంటీ డంపింగ్‌ ఆంక్షలు విధించింది.
business
9,432
19-05-2017 12:53:36
కూతుళ్లకు కమల్ వీలునామా!
విశ్వనటుడు, విలక్షణ నటుడు కమల్ హాసన్ వీలునామా రాసిచ్చారట. ఇప్పుడు తమిళనాట జోరుగా సాగుతున్న ప్రచారమిది. తన కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్‌లకు తన ఆస్తులు చెందేలా వీలునామాను రాసిచ్చినట్టు జోరుగా ప్రచారం చేస్తున్నాయి కోలీవుడ్ వర్గాలు. వాస్తవానికి నటుడిగా, నిర్మాతగా తనను తాను ప్రూవ్ చేసుకున్న కమల్ హాసన్.. పెద్దగా ఆస్తులేమీ కూడబెట్టుకోలేదన్న ప్రచారం తమిళనాడులో జరుగుతుంటుంది. దానికి తగ్గట్టుగానే.. కమల్ పెద్దగా డబ్బేమీ సంపాదించలేదని తలైవా రజనీకాంత్ బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. కలమ్ వీలునామా రాసిచ్చాడన్న దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. శ్రుతికి, అక్షరకు సమానంగా ఆస్తులను పంచినట్టు, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఇలా ముందే వీలునామా రాశాడంలూ చెవులు కొరుక్కుంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. దీనిపై కమల్ హాసన్ స్పందన ఎలా ఉంటుందో..!!
entertainment
3,789
04-02-2017 04:19:16
ఉపాధ్యాయ ఎంపికలో లొసుగులు
ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియలో అనేక లొసుగులున్నాయని పలువురు భావిస్తున్నారు. అభ్యర్థి బోధనా సామర్థ్యాన్ని గుర్తించే విధంగా ఎంపిక పరీక్ష లేకపోవడం, టెట్‌ పరీక్ష అంతిమ నిర్ణాయక అంశం కాకపోవడం; ఉపాధ్యాయ అభ్యర్థికి అకడమిక్‌ జ్ఞానం ఏ స్థాయిలో ఉందో గుర్తించే విధానం ఏదీ లేకపోవడం తదితర లొసుగులు ఉపాధ్యాయ ఎంపిక ప్రక్రియలో ఉన్నాయి. వీటిని సవరించి ఎంపిక ప్రక్రియను మరింత హేతుబద్ధంగా చేపట్టాలి. టెట్‌ నిర్వహించి అందులో వచ్చిన మెరిట్‌, అకడమిక్‌ (ఎస్సెస్సీ, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, బీఈడీ)లో వచ్చిన మెరిట్‌ను కలిపి ఎంపిక చేస్తే అభ్యర్థుల్లో ఆయా కేటగిరీల్లో ఉన్నత ప్రతిభ కలిగినవారు ఉపాధ్యాయులుగా ఎంపికవుతారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి రాష్ట్రాలు పై పద్ధతిలో ఉపాధ్యాయులను ఎంపిక చేస్తున్నాయి. కేవలం చివరి పరీక్షను (డీఎస్సీ, లేదా టీఎస్‌పీఎస్‌సీ) ఆధారం చేసుకొని ఎంపిక నిర్వహించడంవల్ల అభ్యర్థులు అప్పటి వరకు వివిధస్థాయిల్లో ప్రతిభ కనబరిచినా, ఈ ఒక్క పరీక్ష సరిగా రాయకపోతే అతడు ఉపాధ్యాయ ఉద్యోగానికి అనర్హుడవుతున్నాడు. దేశంలో ఉపాధ్యాయుల ఎంపికలో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను ఎంపిక చేసి అమలు చేయాలి.- జి. రాజు, హైదరాబాద్‌
editorial
19,253
26-03-2017 03:26:55
దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కన్ను
ఏప్రిల్‌ 15,16న పార్టీ జాతీయ కార్యవర్గం భువనేశ్వర్‌ భేటీలో వ్యూహం ఖరారు వచ్చే సార్వత్రిక ఎన్నికల గెలుపునకు తీర్మానం న్యూఢిల్లీ,మార్చి 25(ఆంధ్రజ్యోతి): వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఇప్పటినుంచే సమాయత్తమవుతోంది. ఏప్రిల్‌ 15,16 తేదీల్లో భువనేశ్వర్‌లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలు దక్షిణాది రాష్ట్రాలలో విజయ వ్యూహాలను ఖరారు చేయనున్నారు. గత ఎన్నికల్లో యూపీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్ లతో పాటు ఉత్తరాదిన పలు రాష్ర్టాలలో అత్యధిక ఎంపీ స్థానాలను సాధించిన బీజేపీ... ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని తీర్మానించుకుంది. ఒడిసా ఇటీవల స్థానిక ఎన్నికల్లో కొన్ని స్థానాలను గెలుపొందగా, కాంగ్రెస్‌ మూడో స్థానంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. దాదాపు 20 ఏళ్లు ఒడిసా సీఎంగా కొనసాగుతున్న నవీన్‌పట్నాయక్‌ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలకు మోజు తగ్గినట్లు బీజేపీ నేతలు భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిసాను కైవసం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను సీఎం అభ్యర్ధిగా ప్రతిపాదించి, ఇప్పటినుంచే అక్కడ బీజేపీకి అనుకూల వాతావరణాన్ని కలిగించే వ్యూహంలో భాగంగానే భువనేశ్వర్‌లో పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. కాగా, కర్ణాటకలో వక్కలిగ వర్గానికి చెందిన ఎస్‌ఎం కృష్ణను చేర్చుకొని గెలుపును ఖాయం చేసుకున్న బీజేపీ రాబోయే రోజుల్లో తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కేరళలతో పాటు ఒడిసా, పశ్చిమబెంగాల్‌లపైనే ఎక్కువ దృష్టి సారించనుంది. కోరమండల్‌ బెల్ట్‌లోని రాష్ర్టాల్లో గెలుపుకోసం ఇప్పటినుంచే అహర్నిశలు కృషి చేయాల్సి ఉంటుందని, ఉత్తరాదిలో పాతుకుపోయినట్లుగా కోరమండల్‌ రాష్ర్టాల్లో చొచ్చుకుపోలేమన్న నిజాన్ని దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా వ్యూహరచనకు పదునుపెడుతున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమితషాలు వివిధ రాష్ట్రాల ఎంపీలతో భేటీలు మొదలు పెట్టి 2019 ఎన్నికలకు టార్గెట్లను నిర్దేశిస్తున్నారు. ఇటీవల యూపీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ప్రతి రాష్ట్రంలో అనుసరించాలనీ, మోదీ అభివృద్ధి ఎజెండాతో పాటు కుల సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని దాదాపు నిర్ణయించిన అధిష్ఠానం ఈ మేరకు భువనేశ్వర్‌ తీర్మానాన్ని కూడా ఆమోదించనున్నట్లు సమాచారం.
nation
20,807
01-01-2017 04:08:13
స్పోర్ట్స్ కేలెండర్ 2017
  బ్యాడ్మింటన్‌   హాకీ   ఫుట్‌బాల్‌   ఆర్చరీ   టేబుల్‌ టెన్నిస్‌     చెస్‌   రెజ్లింగ్‌   అథ్లెటిక్స్‌ నవంబర్‌ 5: న్యూయార్క్‌ సిటీ మారథాన్‌   వెయిట్‌ లిఫ్టింగ్‌   ఫార్ములా వన్‌   షూటింగ్‌
sports
1,577
12-10-2017 02:03:20
గోద్రెజ్‌ నుంచి ‘ఎలర్జీ ప్రొటెక్ట్‌’ వాషింగ్‌ మెషీన్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గృహోపకరణాల రంగంలోని గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ గోద్రెజ్‌ అయాన్‌ శ్రేణిలో ‘ఎలర్జీ ప్రొటెక్ట్‌ ’ ఫీచర్‌ గల కొత్త వాషింగ్‌ మెషీన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మనం నివశిస్తున్న కాలుష్యపూరిత వాతావరణంలో దుస్తులు దుమ్ముధూళి మాత్రమే కాకుండా వాటితో పాటు వచ్చే బాక్టీరియాను కూడా ఆకర్షిస్తున్నాయని, ఆ బాక్టీరియా పలు రకాల ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలకు కారణం అవుతున్నదని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది అన్నారు. ఇలాంటి బాక్టీరియాను తొలగించడం ద్వారా ఎలర్జీల నుంచి పిల్లలు, పెద్దలకు రక్షణ కల్పించడం ఈ ఫీచర్‌ లక్షణమని ఆయన తెలిపారు. ఏడు రకాల ఎలర్జీల నుంచి ఈ వాషింగ్‌ మెషీన్లు రక్షణ కల్పిస్తాయంటూ ఈ టెక్నాలజీని ఎలర్జీ యుకె సంస్థ సర్టిఫై చేసిందని ఆయన చెప్పారు. ఇవి పూర్తిగా ఫ్రంట్‌ లోడింగ్‌ ఆటోమేటిక్‌ వాషింగ్‌ మెషీన్లని, కస్టమర్లు వాషింగ్‌ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకునేందుకు వాటిలో 15 రకాల వాషింగ్‌ ప్రోగ్రామ్‌లుంటాయని వాషింగ్‌ మెషీన్ల విభాగం హెడ్‌ రాకేశ్‌ సియాల్‌ తెలిపారు. ఎలర్జీ ప్రొటెక్ట్‌ను తొలిసారిగా ఈ వాషింగ్‌ మెషీన్లలో పొందుపరిచామని, అలాగే దుస్తులపై వాషింగ్‌ పౌడర్‌ నురగ మరకలు పూర్తిగా తొలగించడానికి మూడు రకాల స్టెయిన్‌ తొలగింపు సదుపాయం ఉంటుందని ఆయన చెప్పారు. 6 కిలోల సామర్థ్యం గల వాషింగ్‌ మెషీన్‌ ధర 27 వేల రూపాయలు కాగా 7 కిలోల సామర్థ్యం గల మెషీన్‌ ధర 34,500 రూపాయలని ఆయన ప్రకటించారు. అమ్మకాలపై జిఎస్‌టి ప్రభావంగత ఏడాది నవంబరులో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు, ఈ ఏడాది జూలైలో ప్రవేశపెట్టిన జిఎ్‌సటి ప్రభావం వల్ల ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో అమ్మకాలు భారీగా తగ్గాయని కమల్‌ నంది తెలిపారు. గత ఏడాది పరిశ్రమ మొత్తం 15 శాతం వృద్ధిని సాధించగా ఈ ఏడాది ప్రథమార్ధంలో 7 నుంచి 8 శాతం వృద్ధిని మాత్రమే సాధించిందని ఆయన చెప్పారు.  అయితే రుతుపవనాలు సానుకూలంగా ఉండడంతో పాటు పైన పేర్కొన్న రెండు సంస్కరణల ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ద్వితీయార్ధంలో అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నామని, ఏడాది మొత్తానికి వృద్ధిరేటు 10 నుంచి 12 శాతానికి చేరవచ్చునని ఆయన అంచనా వేశారు. గృహోపకరణాలను ప్రభుత్వం 28 శాతం జిఎ్‌సటి శ్లాబ్‌లో పెట్టిందని, ఎసి, ఫ్రిజ్‌ వంటివి ఇప్పుడు నిత్యావసరాలుగా మారిపోయినందు వల్ల వాటిని తక్కువ శ్లాబ్‌లో పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలోని పన్నులతో పోల్చితే జిఎ్‌సటిలో వాటిపై సగటున 3.5 శాతం పన్ను భారం పడిందని ఆయన చెప్పారు. గృహోపకరణాలపై పన్ను రేటు తగ్గించాలంటూ తమ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని, సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
business
2,782
16-05-2017 00:39:22
మార్కెట్లోకి డాక్టర్‌ రెడ్డీస్‌ హెపటైటిస్‌ సి ఔషధం
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ హెపటైటిస్‌ సి చికిత్సలో వినియోగించే జెనరిక్‌ ఔషధం సోఫోసుబువిర్‌ 40 ఎంజి, వెల్పాటస్విర్‌ 100 ఎంజి.. ఫిక్స్‌డ్‌ డోసేజ్‌ కాంబినేషన్‌ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. రెసోఫ్‌ టోటల్‌ పేరుతో దేశీ మార్కెట్లో ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. గిలీడ్‌ జెనరిక్‌ వెర్షన్‌ అయిన ఎప్‌క్లూజాకు ఈ ఔషధం సమానమైనదని పేర్కొంది. రెసోఫ్‌ టోటల్‌ 28 టాబ్లెట్లతో కూడిన బాటిల్‌తో లభ్యమవుతుందని తెలిపింది.
business
5,790
18-01-2017 09:53:57
దక్షిణాదిన నేను చేసిన పొరపాటు ఒక్కటే..!
 ‘పింక్‌’ సక్సెస్‌ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టుంది?  బాలీవుడ్‌లో త్వరగానే సెటిల్‌ అయినట్టున్నారు?  ఉత్తరాదిన మంచి గుర్తింపు వచ్చినా స్పీడు పెంచకపోవడానికి కారణం?  దక్షిణాదిన సినిమా చేయబోతున్నారట?  సినిమాల్లోకి ఇష్టపడి రాలేదట? నిజమేనా?  పెళ్ళి?  మీ ‘వెడ్డింగ్‌ ప్లానర్‌’ వ్యాపారం ఎలా ఉంది?
entertainment
13,771
03-08-2017 16:20:01
కేంద్రంతో రాష్ట్రం ఢీ
బెంగళూరు : ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కర్ణాటక మంత్రి డీ కే శివకుమార్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. తమ రాష్ట్రంలో సీఆర్‌పీఎఫ్‌ దళాలను ఎందుకు వినియోగిస్తున్నారని ప్రశ్నించింది. ఈ విషయంపై తమకు ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు రెండు పేజీల లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం సంప్రదాయాలను తుంగలో తొక్కిందని ఈ లేఖలో ఆరోపించారు. ఈ చర్య ద్వారా తప్పుడు అభిప్రాయాలకు తావిచ్చినట్లయిందని పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బుదవారం విలేకర్లతో మాట్లాడుతూ శివకుమార్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులను ఖండించారు. బీజేపీ వ్యతిరేక గళాలను అణచివేసేందుకే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
nation
980
22-03-2017 23:33:56
‘మేకిన్‌ ఇండియా’పాత ఆలోచనే
అహ్మదాబాద్‌: మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారతలో తయారీ’ (మేకిన్‌ ఇండియా) కార్యక్రమాన్ని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ సి రంగరాజన్‌ తేలిగ్గా తీసిపారేశారు. ఇది పాత ఆలోచనేనన్నారు. అయితే ఈ పథకం విజయం సరైన మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవడంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో రంగరాజన్‌ ఈ విషయాలు తెలిపారు.
business
5,171
11-09-2017 17:57:04
నాగార్జున 'అంతం' చిత్రానికి పాతికేళ్లు పూర్తి
నాగార్జున 'శివ'తో తానేమిటో రుజువు చేసుకున్న రామ్ గోపాల్ వర్మ, నాగ్‌తో తెరకెక్కించిన రెండో చిత్రం 'అంతం'. ఈ సినిమా నేటితో పాతికేళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం. రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం 'శివ'తోనే తాండవం చేశాడు. తన తొలి హీరో నాగార్జునతో రాము తరువాత ఎలాంటి చిత్రం రూపొందిస్తాడోననే ఆసక్తి అందరిలోనే ఉండేది. 1989లో 'శివ' రాగా, 'అంతం' 1992 సెప్టెంబర్ 11న జనం ముందు నిలచింది. దాదాపు మూడేళ్ళ తరువాత నాగ్, వర్మ కాంబినేషన్‌లో వచ్చిన 'అంతం' చిత్రం తొలి రోజున థియేటర్లలో సందడే సందడి. అయితే ఈ చిత్ర కథ హిందీ సూపర్ హిట్ మూవీ 'హీరో' లాగే ఉంది. అదే చిత్రం రీమేక్ 'విక్రమ్'తోనే నాగార్జున హీరోగా పరిచయం కావడమూ జరిగింది. ఈ నేపథ్యంలో కథలో కొత్తదనం లేదని జనం తేల్చేశారు. అయితే ఇందులోని పాటలు మాత్రం జనాన్ని పరవశింపచేశాయి. 'అంతం' చిత్రంలో మొత్తం ఆరు పాటలున్నాయి. వాటిలో 'చలెక్కి ఉందనుకో...' పాటను మణిశర్మ కంపోజ్ చేయగా, 'గుండెల్లో దడ దడ...' పాటను కీరవాణి స్వరకల్పన చేశారు. మిగిలిన నాలుగు పాటలకు విఖ్యాత హిందీ సంగీతదర్శకుడు ఆర్.డి.బర్మన్ స్వరాలు అందించారు. అన్ని పాటలను సీతారామశాస్త్రి రాశారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం మణిశర్మ సమకూర్చడం విశేషం. మణిశర్మకు టైటిల్ కార్డ్ పడ్డ తొలి చిత్రం కూడా ఇదే కావడం మరింత విశేషం. ఈ చిత్రంలో క్లబ్ సాంగ్ ఉన్నప్పటికీ, అందులో ఎక్కడా కురచదుస్తులు ఉపయోగించకుండా పాత పద్ధతుల్లోనే చీరకట్టులో సిల్క్ స్మిత అందాన్ని రాము తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఊర్మిళ నాయికగా నటించిన ఈ చిత్రంలో డానీ, సలీమ్ గౌస్, ఆకాశ్ ఖురానా, రాళ్లపల్లి, గోకిన రామారావు, డబ్బింగ్ జానకి తదితరులు నటించారు. ఈ సినిమాను హిందీలో నాగార్జునతోనే 'ద్రోహి'గా రూపొందించారు. ఈ సినిమా శ్రీలంకలోనూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్రానికి ప్రస్తుతం దర్శకునిగా ఉన్న తేజ సినిమాటోగ్రాఫర్, బోనీకపూర్ సమర్పణలో దృశ్య క్రియేషన్స్ పతాకంపై కె.ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలోని పాటలు విశేషంగా ఆకట్టుకున్నా సినిమా అంతగా అలరించలేకపోయింది.
entertainment
8,009
18-04-2017 22:30:10
అమెరికా కష్టాలు...
శత్రుఘ్న రాయపాటి, జోసెలిన్, స్టెఫనీ, రెబెకా కీలక పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ‘గ్రీన్‌కార్డ్‌’. ‘లైఫ్‌ ఇన్ అమెరికా’ అన్నది ఉపశీర్షిక. రమ్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నాగ శ్రీనివాసరెడ్డి, నరసింహ, శ్రీనివాస్‌ గుప్త, మోహన్.ఆర్‌ నిర్మాతలు. దర్శకుడు రమ్స్‌ మాట్లాడుతూ ‘‘అమెరికాలో గ్యాస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న భారతీయ యువకుడిపై తుపాకీ గురిపెట్టిన ఫలితంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సాగే చిత్రమిది. మా వాళ్లు అమెరికాలో ఉన్నారని గొప్పగా చెప్పుకోవడమే కానీ అక్కడ ఉన్నవాళ్లంతా పూలపాన్పు మీద జీవించడంలేదు. ఎన్నో ఇబ్బందులకు గురవుతూ జీవితం కొనసాగిస్తున్నారు. వాటినే సినిమాగా తీశా. 90 శాతం అమెరికాలోనే చిత్రీకరించాం. పాటల్ని కూడా అక్కడే విడుదల చేస్తాం’’ అని అన్నారు.
entertainment
14,127
14-02-2017 01:34:43
కేన్సర్‌ ఔషధ నిరోధకతకు కారణం తెలిసింది!
వాషింగ్టన్‌, ఫిబ్రవరి 13: కేన్సర్‌ ఔషధ నిరోధకతకు గల ప్రధాన కారణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. కణితిల్లో ఉండే వృత్తాకార డీఎన్‌ఏలే అందులోని కణాలు వాటి రూపాన్ని మార్చుకొవడానికి సహకరిస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. దీంతో 17 రకాల కేన్సర్లకు మరింత సమర్థవంతమైన చికిత్సను కనుక్కొవడానికి అవకాశం కలుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారత శాస్త్రవేత్త వినీత బాఫ్నాతో కూడిన యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాండిగో పరిశోధక బృందం కేన్సర్‌ కణితి వృద్ధి, దానిలో వచ్చే మార్పులపై పరిశోధనలు చేశారు.
nation
5,818
17-09-2017 22:53:48
ఎస్వీఆర్‌గా మోహన్‌బాబు!
సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తోన్న ‘మహానటి’ చిత్రంలో ఎస్వీ రంగారావుగా విలక్షణ నటుడు మోహన్‌బాబు కనిపించనున్నారు. టైటిల్‌ రోల్‌ను కీర్తి సురేశ్‌, జెమిని గణేశన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ చేస్తున్న ఈ చిత్రంలో సమంత ఓ కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. ప్రకాశ్‌రాజ్‌, ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌ షాలినీ పాండే కూడా తారాగణంలో ఉన్నారు. తాజాగా ఎస్వీఆర్‌ పాత్రను మోహన్‌బాబు పోషించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఆయన సెట్స్‌పై అడుగుపెట్టనున్నారు. ప్రతినాయకుడి పాత్రయినా, పౌరాణిక పాత్రయినా, సాత్విక పాత్రయినా, ఎలాంటి పాత్రయినా అతి సునాయాసంగా చేసే గొప్ప నటుడిగా పేరు పొందిన ఎస్వీఆర్‌గా మోహన్‌బాబు ఎంపికపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తప్ప మరో నటుడ్ని ఎస్వీఆర్‌గా ఊహించలేమనేది నిజం. తెరపై ‘విశ్వనట చక్రవర్తి’ పాత్రలో మోహన్‌బాబు అభినయం ఎలా ఉంటుందో చూడాల్సిందే! ప్రస్తుతం ‘మహానటి’ సినిమా షూటింగ్‌ పాలకొల్లులో జరుగుతోంది. సి. అశ్వినీదత్‌ సమర్పిస్తోన్న ‘మహానటి’ చిత్రాన్ని స్వప్న సినిమా పతాకంపై స్వప్నాదత్‌ నిర్మిస్తున్నారు.
entertainment
4,819
05-04-2017 12:47:22
జూనియర్‌ ఎన్టీయార్‌కు నత్తి?
 రవితేజ, రాజ్‌తరుణ్‌లు తమ రాబోయే సినిమాల్లో అంధులుగా కనిపించనున్నారు. అలాగే సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో రామ్‌చరణ్‌ కూడా శారీరక లోపం ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడట. ఆ సినిమాలో చెర్రీ బధిరుడుగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇదే బాటలో యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ కూడా పయనిస్తున్నట్టు సమాచారం. బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘జై లవకుశ’ సినిమాలో ఎన్టీయార్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్ర నత్తితో ఇబ్బందిపడే రోల్‌ అని సమాచారం. ఇది వీల్‌ చైర్‌కే పరిమితమైన నెగిటివ్‌ రోల్‌ అని తెలుస్తోంది. ఏదేమైనా హీరోలు తమ ఇమేజ్‌ను విడిచిపెట్టి తెరపై విభిన్నంగా కనిపించడానికి సిద్ధపడడం మెచ్చుకోదగినదే.
entertainment
11,795
15-09-2017 02:35:00
హైకోర్టులో కొత్త జడ్జిల ప్రమాణం 21న?
న్యూఢిల్లీ, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి హైకోర్టుకు నియమితులు కానున్న ఆరుగురు కొత్త న్యాయమూర్తులు ఈనెల 21న ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. కొత్త జడ్జిల నియామకానికి సంబంధించిన ఫైలు రాష్ట్రపతి కోవింద్‌ కార్యాలయానికి గురువారం చేరింది. ప్రస్తుతం కాన్పూర్‌ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ఢిల్లీకి వచ్చిన వెంటనే ఈ ఫైలుపై సంతకం చేసే అవకాశాలున్నాయని, రెండు, మూడు రోజుల్లోనే కొత్త న్యాయమూర్తుల నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయని హోంశాఖ అధికారులు తెలిపారు. 3 నెలల క్రితం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల జాబితాకు బుధవారం ప్రధాని మోదీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.  న్యాయవాదులు కొంగర విజయలక్ష్మి, సోమయాజులు డీవీఎస్‌, అమర్‌నాథ్‌గౌడ్‌ టి, అభినంద్‌కుమార్‌, పి.కేశవరావు, ఎం.గంగారావులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు ప్రధాని మోదీ బుధవారం సంతకం చేసిన వెంటనే ఫైలును పీఎంవో న్యాయశాఖకు పంపింది. న్యాయశాఖ నుంచి హోంశాఖకు గురువారం చేరింది. ఈ ఫైలు వచ్చిన వెంటనే హోంశాఖ అధికారులు రాష్ట్రపతి కార్యాలయానికి పంపినట్లు సమాచారం. రాష్ట్రపతి కోవింద్‌ రాజముద్ర పడిన వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని హోంశాఖ అధికారులు తెలిపారు. ఈనెల 21న ఈ ఆరుగురు కొత్త న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి అందుబాటులో ఉండాలని కేంద్ర న్యాయశాఖ అధికారులు హైకోర్టు ఏసీజే రమేశ్‌ రంగనాథన్‌ను కోరినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
nation
14,249
28-10-2017 04:57:53
ప్రపంచ శాంతికి భారత్‌ తోడ్పాటు
న్యూఢిల్లీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన బహుపాక్షిక విధానానికి భారతదేశం కట్టుబడి ఉందని, దేశాల మధ్య తలెత్తుతున్న సమస్యలు, శాంతిని నెలకొల్పడం వంటివి నిజమైన ధ్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమైన ‘ఐక్యరాజ్య సమితి నిరాయుధీకరణ కమిషన్‌’ ఆధ్వర్యంలో నిరాయుధీకరణ యంత్రాంగం అనే అంశంపై జరిగిన సదస్సులో రామ్మోహన్‌నాయుడు ప్రసంగించారు. అంతర్జాతీయ శాంతికి, రక్షణకు భారతదేశం పాటుపడుతోందన్నారు.
nation
7,297
26-10-2017 07:05:27
అమితాబ్ బచ్చన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు
ముంబై : ముంబై నగరంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ అత్యంత విలాసవంతంగా నిర్మించిన స్వాంక్ లగ్జరీ బంగళా అక్రమ నిర్మాణమని...దాన్ని ఎందుకు కూల్చకూడదో తెలపాలని కోరుతూ సాక్షాత్తూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎంపీ కూడా అయిన అమితాబ్ బచ్చన్ గోరేగామ్ ఈస్ట్‌లో ఫిలిం సిటీకి సమీపంలో నిర్మించిన బంగళాను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తాము అనుమతి ఇచ్చిన ప్రకారం కాకుండా అడ్డగోలుగా నిర్మించారని మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు తమ తనిఖీల్లో తేల్చారు. బేస్‌మెంట్ పనులు సరిగా చేయలేదని, లిఫ్టు కూడా ఇంకా ఏర్పాటు చేయలేదని ప్రహరీ గోడ నిర్మాణం కూడా ఆమోదిత ప్లాన్‌కు విరుద్దంగా ఉందని అధికారులు బిగ్ బికి జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. అమితాబ్‌తోపాటు అక్రమంగా బంగళాలు నిర్మించుకున్న బాలీవుడ్ నిర్మాతలు రాజ్ కుమార్ హీరానీ, పంకజ్ బాలాజీ, సంజయ్ వ్యాస్, హరీష్ ఖండేల్ వాల్, హరీష్ జగిత్యాని, ఒబేరాయ్ రియల్టీలకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
entertainment
20,544
27-10-2017 01:51:10
ఒకే వేదికపై బ్యాడ్మింటన్‌ దిగ్గజాలు!
ముంబై: నాటి మేటి బ్యాడ్మింటన్‌ దిగ్గజాలు తమ ఆటతో అభిమానులను అలరించనున్నారు. వచ్చే నెలలో జరుగనున్న లెజెండ్స్‌ విజన్‌ వరల్డ్‌ టూర్‌ టోర్నీలో ఒలింపిక్‌ పతక విజేతలు, ప్రపంచ చాంపియన్లు పలువురు కనులపండువ చేయనున్నారు. బ్యాడ్మింటన్‌ అభిమానులకు ఆరాధ్యులైన లిన్‌ డాన్‌, లీ చోంగ్‌ వీ, పీటర్‌ గేడ్‌, తౌఫిక్‌ హిదాయత్‌, లీ యాంగ్‌ డేలతో పాటు భారత దిగ్గజాలు ప్రకాష్‌ పడుకోన్‌, పుల్లెల గోపీచంద్‌కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నారు. రెండేళ్లక్రితం ఆరంభించిన ఈ టోర్నీని నవంబర్‌ 4న స్థానిక నేషనల్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్మింటన్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వేదికపై భారత యువ క్రీడాకారులు రాణిస్తున్న నేపథ్యంలో లెజెండ్స్‌ టోర్నీని ఇక్కడ నిర్వహించనుండడం వారికి ఎంతో ఉత్తేజాన్నిస్తుందని కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు. దిగ్గజాల ఆటను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం భారతీయ యువ క్రీడాకారులకు ఈ టోర్నీద్వారా లభించనుండడం అదృష్టమన్నారు. భారత టాప్‌ ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్‌, సింధు, సైనా నెహ్వాల్‌ కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
sports
12,581
23-10-2017 14:31:28
గుజరాత్‌లో కాంగ్రెస్‌కు మరో పార్టీ అండదండలు
లక్నో : గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో 5 స్థానాల నుంచి పోటీ చేయాలని సమాజ్ వాదీ పార్టీ (ఎస్‌పీ) నిర్ణయించింది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు ముందుకొచ్చింది. ఎస్‌‌పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సోమవారం మాట్లాడుతూ తమకు సంస్థాగత బలం ఉన్నచోట మాత్రమే పోటీ చేస్తామన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లలో చీలిక రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని బలహీనపరచడం తమకు ఇష్టం లేదన్నారు. ఎన్నికలు జరిగే 182 స్థానాల్లో తాము 5 స్థానాల నుంచి పోటీ చేస్తామని, మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తామని స్పష్టం చేశారు.  ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ కూటమి పోటీ చేసి, పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
nation
9,462
12-07-2017 00:01:26
దర్శకుడి స్వార్థం
అశోక్‌, ఈషా జంటగా నటిస్తున్న చిత్రం ‘దర్శకుడు’. హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్‌, థామ్‌సరెడ్డి ఆదూరి, రవిచంద్రలతో కలిసి సుకుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయికార్తీక్‌ సంగీతంలో ‘సండే టు సాటర్డే’ అంటూ సాగే పాటను ఇటీవల సమంత విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ప్రేమకు, తపనకు మధ్య నలిగిపోయే ఓ దర్శకుడి కథ ఇది. స్వార్థపరుడైన దర్శకుడు ప్రేమలోపడితే ఏం జరుగుతుందనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. రకుల్‌ విడుదల చేసిన పాటకు చక్కని స్పందన బావుంది. తాజాగా విడుదల చేసిన పాట కూడా సంగీత ప్రియులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. 15న ప్రముఖ కథానాయకుడి చేతులమీదుగా పాటల్ని విడుదల చేసి, ఆగస్ట్‌ 4న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని తెలిపారు.
entertainment
6,696
15-11-2017 22:40:55
అందుకే ఆ సినిమాలు వదిలేశా!
దర్శకుల లైంగికపరమైన కోరికలు తీర్చడం ఇష్టం లేకే పది సినిమాలు వదిలేశానని ప్రియాంకా చోప్రా చెప్పారు. కెరీర్‌ బిగినింగ్‌లో ఇటువంటి వేధింపులు తనకూ తప్పలేదని ఆమె వివరించారు. ఓ ఆంగ్ల పత్రికకు ప్రియాంక తల్లి మధు చోప్రా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి చాలా వివరాలు వెల్లడించారు. ‘తన 17 ఏళ్ల వయసులో ప్రియాంక చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచీ మూడేళ్ల క్రితం వరకూ ఆమెని కంటికి రెప్పలాగా కాపాడా. ఓ పెద్దమనిషి ఆమె దగ్గరకు వచ్చి ‘ మీ అమ్మ కాసేపు బయట కూర్చుంటే నీకు కథ వినిపిస్తా’ అన్నాడు. ‘ మా అమ్మ వినలేకపోయే కథతో నేను సినిమా ఎలా చేస్తాను’ అని ప్రియాంక సున్నితంగా చెప్పేసింది. దాని వల్ల ఓ పెద్ద సినిమాలో నటించే అవకాశం కోల్పోయింది. అదొక్కటే కాదు.. అలా వాళ్ల కోరికలు తీర్చడానికి ఇష్టపడకపోవడంతో పది సినిమాలు కోల్పోయాం. అయితే ఇలాంటి లైంగిక వేధింపులు హాలీవుడ్‌లో మాత్రం లేవు’ అని చెప్పింది.
entertainment
18,289
24-03-2017 01:06:35
‘అమ్మ’ను చంపింది నువ్వే
చెన్నై, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో దోషిగా బెంగళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ లేఖలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. జైలులో తొలుత అన్నాడీఎంకే కార్యకర్తలు రాసే లేఖలను టైంపాస్‌ కోసం చదివిన ఆమె ఇప్పుడు వాటివంక చూడాలంటేనే భయపడుతున్నారు. ‘అమ్మ’ మరణానికి శశికళే కారణం అంటూ ఆమె పేరిట జైలుకు లేఖలు వెల్లువెత్తుతుండటమే ఇందుకు కారణం. తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అందుకు శశికళే బాధ్యురాలంటూ లేఖల్లో ప్రజలు ఆమెపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ.. శాపనార్థాలు పెడుతున్నారు. మొదట్లో ఇలాంటి లేఖల్లో కొన్నింటిని చదివిన శశికళ.. ఇప్పుడు లేఖలంటేనే విరక్తి చెందారని తెలిసింది. ఆమెతో కలిసి శిక్ష అనుభవిస్తున్న మరదలు ఇళవరసే ఆయా లేఖలను చదివి, వాటిల్లో శశికళ మనసు నొప్పించని వాటిని మాత్రం అందిస్తున్నట్లు సమాచా రం. కాగా పరప్పన జైలులో శశికళ కూర్చొని వున్న దృశ్యం అంటూ ఇప్పుడు ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళ తొలగింపు?అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన వీకే శశికళను తొలగించాలని కేంద్ర ఎన్నికల కమిషన నిర్ణయించినట్లు సమాచారం. ఆమె నియామకంపై అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఈసీ పరిశీలనలో ఉండగానే ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నిక రావడంతో ఆ ఎన్నికలో శశికళ వర్గ అభ్యర్థికి గానీ, ఓపీఎస్‌ వర్గ అభ్యర్థికి గానీ అన్నాడీఎంకే చిహ్నం ఇవ్వకుండా నిలిపేశారు. రెండు వర్గాలకు వేర్వేరు చిహ్నాలు అందజేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శశికళను అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తొలగించాలని ఈసీ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
nation
21,063
08-12-2017 10:33:19
ఐపీఎల్-11: ముంబయి ఇండియన్స్‌కి షాక్
ముంబయి: 2017 ఐపీఎల్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కి 2018 ఐపీఎల్ ముందు పెద్ద షాక్ తగిలింది. గత తొమ్మిది సీజన్‌ల నుంచి ముంబయికి ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తొమ్మిది సంవత్సరాలు ముంబయి ఇండియన్స్‌తో కలిసి ప్రయాణించడం చాలా అద్భుతంగా ఉందని జాంటి పేర్కొన్నారు. ఈ తొమ్మిదేళ్లలో సచిన్, రోహిత్, రిక్కి పాంటింగ్, అనిల్ కుంబ్లే, మహేలా జయవర్ధనే వంటి వారితో కలిసి పని చేయడంలో ఎన్నో అనుభూతులు మిగిల్చిందని అన్నారు. ఇన్ని సంవత్సరాలు నాకు మద్దతుగా నిలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు సభ్యులు, ఉద్యోగులు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. అయితే జాంటి స్థానంలో ఫీల్డింగ్ కోచ్‌‌గా న్యూజిలాండ్ క్రికెటర్ జేమ్స్ ప్యామెంట్‌ను తీసుకుంటున్నట్లు ముంబయి జట్టు ప్రకటించింది. మరికొన్ని నెలల్లో ఐపీఎల్-2018 జరుగనున్న నేపథ్యంలో జాంటి వంటి దిగ్గజ క్రికెటర్ ఫీల్డింగ్ కోచ్ పదవి నుంచి వైదొలగడం ముంబయిపై గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇండియన్ టాప్ క్రికెటర్లపై ఆసక్తికరమైన క్విజ్
sports
14,482
13-05-2017 02:38:38
గిన్నిస్‌కెక్కిన ‘ఆది యోగి’ విగ్రహం
చెన్నై, మే 12 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈషా ఫౌండేషన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఆది యోగి’ (శివుడి) విగ్రహం గిన్నిస్‌ రికార్డులో స్థానం సంపాదించింది. గుండెల నుంచి పై భాగం మాత్రమే ఉండేలా నెలకొల్పిన విగ్రహాల్లో ప్రపంచంలోనే ఇది అతిపెద్దదని గిన్నిస్‌ వెల్లడించింది. ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ సారథ్యంలోని ఈషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దీనిని ప్రతిష్టించారు. గత ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ విగ్రహం 112.4 అడుగుల ఎత్తు, 96.58 అడుగుల వెడల్పు, 147 అడుగుల పొడవు కలిగి ఉంది. మార్చి 11న దీనిని గిన్నిస్‌బుక్‌ రికార్డు అధికారులు పరిశీలించారు.
nation
15,759
18-10-2017 01:49:27
ఏక్‌దిన్‌కా సీఎం వద్దని!
శశికళ వ్యవహారంపై విద్యాసాగర్‌రావు పుస్తకం ఆమెపై కోర్టులో కేసులున్నాయి శిక్ష పడితే ఎలాగని ఆలోచించా అందుకే ఆచితూచి అడుగేశా జయమృతి నుంచి శశి జైలుదాకా పరిణామాలపై విద్యాసాగర్‌రావు ‘దోజ్‌ ఈవెంట్‌ఫుల్‌ డేస్‌’లో వెల్లడిచెన్నై, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేలో సంక్షోభం నెలకొన్నప్పుడు ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకురాలిగా ఎంపికైన శశికళకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించానని మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రానికి ఏడాదిపాటు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌గా పనిచేసిన విద్యాసాగర్‌రావు, తన అనుభవాలను ‘దోజ్‌ ఈవెంట్‌ఫుల్‌ డేస్‌’ పేరుతో ముద్రించిన పుస్తకంలో పొందుపరిచారు. 12 అధ్యాయాలు కలిగిన ఆ పుస్తకంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి, జల్లికట్టు ఉద్యమం, సీఎం పదవికి ఒ.పన్నీర్‌సెల్వం రాజీనామా, ఎడప్పాడికి సీఎం పదవి అప్పగించడం, డీఎంకే ఆందోళనలు వంటి ఘటనల ప్రస్తానవ ఉంది.  జయ మృతి తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులలో న్యాయనిపుణులతో సలహాసంప్రదింపులు జరిపి, ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని విద్యాసాగర్‌రావు తెలిపారు. తొలి మూడు అధ్యాయాలలో జయ గుణగణాలను, అపోలో ఆసుపత్రిలో మృతి చెందటం వంటి వివరాలను పొందుపరిచారు. జయకు అందిస్తున్న చికిత్సలను ప్రజలకు తెలియపరిచేలా తాను ఆదేశాలివ్వటం, ఆమె మృతి చెందినప్పుడు తమిళ ప్రజలు పాటించిన సంయమనాన్ని ప్రస్తావించారు. నాలుగో అధ్యాయంలో నగరాన్ని అతలాకుతలం చేసిన వర్దా తుఫాను గురించి, నివారణ చర్యల గురించి వివరించారు. ఐదో అధ్యాయంలో జల్లికట్టు కోసం మెరీనాతీరంలో జరిగిన మహోద్యమాన్ని విపులంగా రాశారు. ఇక అరో అధ్యాయంలో ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం రాజీనామా చేసిన తరువాత ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితులను తేటతెల్లంగా వివరించారు.  గత ఏడాది డిసెంబర్‌ 31న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకోవడం, ఫిబ్రవరి 5న ఆమె సీఎం పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించడంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘ఆ సమయంలో నేను ఆచితూచి వ్యవహరించాను. అన్నాడీఎంకే శాసన సభాపక్షనాయకురాలిగా ఎన్నికైన శశికళను సీఎంగా పదవీ ప్రమాణం చేయించడానికి తొందరపడలేదు. శశికళను సీఎంగా ప్రమాణం చేయడానికి ఆహ్వానించకపోవడంతో ఆమె నాకు వ్యతిరేకంగా ప్రకటన చేశారు. అయినా నేను ఓర్పు వహించాను. శశికళ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయిస్తే ఎదురయ్యే సమస్యలను గురించి న్యాయనిపుణులతో రోజుల తరబడి సంప్రదింపులు జరిపాను. అక్రమార్జన కేసులో ఆమెకు శిక్షను ఖరారు చేసే అవకాశం ఉందని తెలియడంతో సుప్రీంకోర్టు తీర్పు వెలువడేంతవరకు వేచి ఉండాలని నిర్ణయించుకున్నాను. నా ఆలోచన రాష్ట్రానికి మంచే చేసింది. శశికళ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించి ఉంటే 2,3 రోజులకే ఆమె పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది. అది రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చలా మిగిలిపోయి ఉండేది’’ అని విద్యాసాగర్‌రావు వివరించారు.  లేఖ ప్రస్తావన లేదుఅన్నాడీఎంకే అసమ్మతి వర్గం నేత దినకరన్‌ తరఫు శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఎడప్పాడికి మద్దతు ఉపసంహరించుకుంటూ తనకు లేఖలు సమర్పించిన ఉదంతాన్ని విద్యాసాగర్‌రావు తన పుస్తకంలో ప్రస్తావించలేదు. సోమవారం సాయంత్రం చెన్నైలో ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
nation
1,387
25-07-2017 01:27:35
అంబుజా సిమెంట్స్‌ లాభంలో 12 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో అంబుజా సిమెంట్స్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 11.85 శాతం మేర పెరిగి 718.24 కోట్ల రూపాయలకు చేరుకుంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 642.11 కోట్ల రూపాయలుగా ఉంది. సిమెంట్‌ అమ్మకాలు జోరుగా పెరగడం వల్లనే లాభాలు వృద్ధి చెందినట్టు కంపెనీ పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 15.24 శాతం పెరిగి 6,117.36 కోట్ల రూపాయల నుంచి 7,050.11 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. మొత్తం వ్యయాలు 5,430 కోట్ల రూపాయల నుంచి 6,259.83 కోట్ల రూపాయలకు చేరాయి. ఈ కంపెనీ జనవరి-డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది.
business
20,619
04-02-2017 00:57:12
అంధుల క్రికెట్‌లో భారత్ గెలుపు
ముంబై: మహ్మద్‌ ఫర్హాన్‌ (59), జాఫర్‌ ఇక్బా ల్‌ (54) రాణించడంతో.. అంధుల టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాపై భారత 9 వికెట్లతో గెలిచింది. తొలుత సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 157 రన్స్‌ చేసింది. అనంతరం భారత్ 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
sports
5,991
27-11-2017 23:36:15
ఆ ఫ్యామిలీలో మరో మెగాస్టార్‌
‘‘చిరంజీవిలో ఉన్న గ్రేస్‌ తేజ్‌లో ఉంది. యాక్టింగ్‌, ఫైట్స్‌, డాన్స్‌, డైలాగ్‌ డిక్షన్‌ అన్నింటిలో పర్ఫెక్ట్‌గా ఉన్నాడు. అతన్ని మెగా ఫ్యామిలీలో మరో మెగాస్టార్‌ అనుకోవచ్చు’’ అని కె. రాఘవేంద్రరావు అన్నారు. సాయిధరమ్‌తేజ్‌, మెహరీన్‌ జంటగా నటించిన ‘జవాన్‌’ చిత్రం డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకొస్తుంది. బీవీఎస్‌ రవి దర్శకత్వంలో కృష్ణ నిర్మించారు. దిల్‌ రాజు సమర్పకుడు. సోమవారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాఘవేంద్రరావు చిత్ర యూనిట్‌కి జ్ఞాపికలను అందచేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఇంటికొక యోగ్యుడు ఉంటే ఇంటితోపాటు సమాజం, దేశం కూడా బాగుపడుతుందనే సందేశామిచ్చే సినిమా అని ట్రైలర్‌ చూశాక తెలిసింది’’ అని అన్నారు. సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘‘దిల్‌ రాజు నన్ను ఇంటి సభ్యుడిలా చూస్తారు. ఆయనతో ఈ అనుబంధం ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు. ‘‘వరుస విజయాలు అందుకున్న ఏడాది ఇది. నాకు, మా సంస్థకు గ్రేట్‌ ఎచీవ్‌మెంట్‌ ఇయర్‌ ఇది. అనుకోకుండా ఈ సినిమాలో భాగమయ్యా. తేజ్‌, రవి మీద నమ్మకంతో ఈ సినిమా చేశా. మంచి సందేశాత్మక చిత్రాన్ని చేశానని సాయి గర్వంగా చెప్పుకోవచ్చు’’ అని దిల్‌ రాజు చెప్పారు.
entertainment
723
23-07-2017 00:04:49
జిఎస్‌టి కౌన్సిల్‌..
ఈ మధ్యకాలంలో జిఎస్‌టి, జిఎస్‌టి అమలుకు సంబంధించి ఎలాంటి వార్త వెలువడినా అందులో తరచుగా వినిపించే పేరు జిఎస్‌టి కౌన్సిల్‌. అసలు జిఎస్‌టి కౌన్సిల్‌ అంటే ఏమిటి? జిఎస్‌టి అమలుకు సంబంధించి జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్వహించే పాత్ర ఏమిటో తెలుసుకుందాం. జిఎస్‌టి లాంటి అతి పెద్ద పన్ను వ్యవస్థ అమలులోకి రావటానికి అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్టుగా పలు విధి విధానాలను రూపొందించాల్సి ఉంటుంది. అలాగని తీసుకున్న నిర్ణయాలు కేవలం ఏదో ఒక్క ప్రాంతానికో, రాష్ట్రానికో ప్రయోజనం చేకూర్చేటట్లు ఉండకూడదు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్నో లేదా ఏదేనీ ఒక రాష్ట్రాన్నో దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిర్ణయాలు తీసుకోకూడదు కాబట్టి మన సమాఖ్య విధానాన్ని దృష్టిలో పెట్టుకుని జిఎస్‌టి కౌన్సిల్‌కు రూపకల్పన చేశారు. ఈ కౌన్సిల్‌లో కేంద్రంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చోటు కల్పించటం ద్వారా ఏ ఒక్కరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జిఎ్‌సటిలో ఏదేనీ వస్తువుకు లేదా సేవకు మినహాయింపు ఇవ్వాలన్నా లేదా ఏదేనీ వస్తువు లేదా సేవను జిఎ్‌సటి పరిధిలోకి తీసుకురావాలన్నా జిఎ్‌సటి కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే టాక్స్‌ రేటు, సెస్‌లు ఇతర నిబంధనలు అన్నీ జిఎ్‌సటి కౌన్సిల్‌ తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటాయి. మరి ఇంత ముఖ్యపాత్ర పోషించే జిఎ్‌సటి కౌన్సిల్‌లో సభ్యులు ఎవరు ఉంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్‌గా ఉండే జిఎస్‌టి కౌన్సిల్‌లో ఆర్థిక లేదా రెవెన్యూ శాఖకు సంబంధించిన కేంద్ర సహాయ మంత్రి, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి లేదా ఆ రాష్ట్రం ప్రతిపాదించిన వ్యక్తి కౌన్సిల్‌లో సభ్యులుగా ఉంటారు. దీనికి సంబంధించిన కనీసం కోరం మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కాగా కౌన్సిల్‌ తీసుకునే ఏ నిర్ణయమైనా అమల్లోకి రావాలంటే కనీసం నాలుగింట మూడొంతుల మెజారిటీ ఉండాలి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి 1/3 వంతు, రాష్ట్ర ప్రభుత్వాలకు 2/3 వంతు చొప్పున వెయిటేజీ ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కౌన్సిల్‌ తీసుకునే ముఖ్య నిర్ణయాలు.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏయే టాక్స్‌లు, సెస్‌లు.. జిఎ్‌సటిలో విలీనం కావాలిఏయే సర్వీసులకు, వస్తువులకు ఎంతెంత జిఎ్‌సటి రేట్లు ఉండాలిజిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాల్సిన, వెలుపల ఉంచాల్సిన వస్తువులు, సేవలురిజిస్ట్రేషన్‌కు ఇచ్చే మినహాయింపులకు సంబంధించిన టర్నోవర్‌ పరిమితి నిర్ణయించటంపెట్రోలియం ఉత్పత్తులను జిఎ్‌సటి పరిధిలోకి ఎప్పుడు తీసుకురావాలిటైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌, ప్లేస్‌ ఆఫ్‌ సప్లయ్‌కి సంబంధించిన నిర్ణయాలుఇంకా జిఎ్‌సటి పరిపాలన, నిర్వహణకు సంబంధించి అన్ని రకాల నిర్ణయాలు తీసుకోవటంతో పాటు పలు రకాల సమీక్షలు నిర్వహించటం జిఎస్‌టి కౌన్సిల్‌ తీసుకుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే జిఎస్‌టి అమలుకు సంబంధించి జిఎ్‌సటి కౌన్సిల్‌ గుండెకాయ వంటిది. జిఎస్‌టి కౌన్సిల్‌ తీసుకునే నిర్ణయం అంతిమం.
business
12,615
31-05-2017 18:47:32
ముగిసిన మోదీ స్పెయిన్ పర్యటన.. రష్యాకు ప్రయాణం
మాడ్రిడ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పెయిన్ పర్యటన ముగిసింది. మాడ్రిడ్ ఎయిర్ పోర్టులో ఆ దేశ పాలకులు, అధికారులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా రెండు రోజుల యూరప్ టూర్ ముగియడంతో మోదీ రష్యా ప్రయాణమయ్యారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగే ప్రపంచ సదస్సులో ఆయన పాల్గొంటారు.
nation
4,434
11-10-2017 00:52:22
ఆంధ్రకు సౌదీ సౌభాగ్యం
విశాఖలో ఆయిల్‌ రిఫైనరీలను నెలకొల్పడానికి సౌదీ అరంకో సంస్థ ఆసక్తి చూపుతున్నది. అరంకో పెట్టుబడులకోసం ఒడిశా పోటీపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అధికార యంత్రాంగం మరింత ప్రత్యేక శ్రద్ధ చూపవలసిన అవసరం లేదా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వస్తూత్పత్తి రంగంపై ఆధారపడి వుండగా అరబ్‌ దేశాల ఆర్థికంలో చమురు ముఖ్యభూమిక వహిస్తోంది. చమురు ఉత్పత్తి, ఎగుమతిలో గల్ఫ్ దేశాలు ప్రత్యేకించి సౌదీ అరేబియా, యూఏఈలోని అబుధాబి కీలకపాత్ర వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు రంగంలో సంభవించే ప్రతి పరిణామంలో ఈ రెండు దేశాల ప్రమేయం తప్పక ఉంటుంది. అంతర్జాతీయ విపణిలో మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా సౌదీ, అబుధాబీలు కూడా తమ వాణిజ్య వ్యూహాలను మార్చుకొంటున్నాయి. ప్రపంచ ఆర్థిక శక్తులుగా ఆవిర్భవిస్తోన్న సహచర ఆసియా దేశాలపై ఆసక్తి చూపుతున్న ఈ చమురు దిగ్గజాలు ముఖ్యంగా భారత్, అందునా తూర్పు తీరస్థ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. బంగాళాఖాతం తీరాన వుండడం వల్లే ఆంధ్రరాష్ట్రం ఈ ప్రాధాన్యం సంతరించుకున్నది. తమకు అనువైన, చేరువలో వున్న అరేబియా సముద్రతీరప్రాంతాల్లో కాకుండా బంగాళాఖాతం తీరంలో తమ వాణిజ్య కార్యకలాపాలను ముమ్మరం చేసుకోవాలని ఈ గల్ఫ్‌ దేశాలు ఆరాటపడుతున్నాయి. తీరాంధ్రంలో పెట్రోలియం ఉత్పత్తుల వ్యూహాత్మక నిల్వల సామర్థ్యంతో ఆగ్నేయఆసియా దేశాల మార్కెట్లను కైవసం చేసుకోవాలని సౌదీ అరేబియా సంకల్పించుకొంది. ఈ సంకల్ప సాధనకు అవసరమైన ప్రణాళికలను ఇప్పటికే రూపొందించుకొంది. తూర్పు తీరస్థ రాష్ట్రాల్లో చమురు రంగ అభివృద్ధికై మోదీ స్వయంగా సౌదీ, ఆబుధాబిలను ఆహ్వనించడం జరిగింది. మోదీ అభీష్టం మేరకు ఈ గల్ఫ్‌ దేశాల పెట్టుబడులను ప్రోత్సహించడానికి కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ చమురువ్యవస్థను శాసించే (సౌదీ అరేబియాకు చెందిన) సౌదీ అరంకో సంస్ధ కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టే విషయమై అమిత శ్రద్ధాసక్తులు చూపుతోంది. భారత్‌లో తమ వాణిజ్య విస్తరణ అవకాశాలను అనేక కోణాల నుంచి పరిశీలిస్తుంది. సంప్రదాయకంగా తమకు అనువైన అరేబియా సముద్ర తీర దేశాల్లో కాకుండా బంగాళా ఖాతం తీరానున్న భారత రాష్ట్రాలలో ప్రస్తుతమున్న భారతీయ రిఫైనరీలకు తోడుగా అదనపు రిఫైనరీలను నెలకొల్పాలని అరంకో యోచిస్తున్నది. భారతీయ కంపెనీల భాగస్వామ్యంతో వాటిని ఏర్పాటుచేయడం ద్వారా భారత్‌లో తమ వ్యాపార ప్రయోజనాలను సుదీర్ఘకాలం పదిలం చేసుకోవాలని అరంకో ఆలోచిస్తున్నది. వ్యాపార ప్రయోజనాలకు అగ్రప్రాధాన్యమివ్వడంతో పాటు వ్యూహాత్మక చమురు నిల్వలకేంద్రాలను నెలకొల్పుకోవడం ద్వారా ఆగ్నేయఆసియా దేశాల చమురు మార్కెట్లపై పట్టు సాధించాలని సౌదీ అరంకో ఆశిస్తోంది. సరిగ్గా ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో సౌదీ అరంకో అధిపతి అమీన్ నాసర్‌తో సమావేశమయ్యారు. సాధారణంగా సౌదీ అరంకో ఉన్నతాధికారులు వ్యాపార ప్రతిపాదనలతో ఎవరితో చర్చలు జరపరు. అయితే ఈ ఏడాది అనూహ్యంగా చంద్రబాబు నాయుడుతో మాత్రం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా వున్నామని సౌదీ ప్రతినిధులు ప్రతిపాదించారు. అవసరమైన స్థలం, నీటి వనరులు, ఇంకా ఇతర హంగులు అన్నీ సమకూర్చుతానని సౌదీ అరంకో అధికారులకు చంద్రబాబు హామీనిచ్చారు. విశాఖపట్టణంతో పాటుగా కాకినాడలో కూడా పెట్రో రసాయనాల పరిశ్రమలను, సంబంధిత విశ్వవిద్యాలయాన్నీ నెలకొల్పడానికి సహకరించవల్సిందిగా కూడా అరంకో అధికారులను చంద్రబాబు కోరారు. బంగాళాఖాతం తీరంలోని ఒడిశాలో బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆ రాష్టంలో కొన్ని కేంద్ర ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ఉత్కళ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెట్రోలియం మంత్రి ప్రధాన్ ఇప్పటికే ఉర్జ గంగా అనే గ్యాస్ సరఫరా ప్రాజెక్టు ద్వారా ప్రజలకు దగ్గరకావాలని ప్రయత్నిస్తుండగా గల్ఫ్ దేశాలు నెలకొల్పే రిఫైనరీలు కూడా ఒడిశాలో ఏర్పాటయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇటీవల మనదేశంలో జరిగిన కీలక అంతర్జాతీయ పెట్రోలియం సదస్సులో పాల్గొనడానికి సౌదీ అరంకోతో పాటు, ప్రధాన చమురు ఉత్పాదక దేశాల అత్యున్నత స్థాయి అధికార బృందాలు న్యూఢిల్లీకి వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీతో సుదీర్ఘ చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో వారి వద్ద తమ రాష్ట్ర ప్రతిపాదనల ప్రస్తావన తీసుకొచ్చి, మరింత పురోగతి సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం తగు శ్రద్ధ చూపలేదని సమాచారం. న్యూఢిల్లీలో సౌదీ అరంకో సంస్థ అధిపతిని కనీసం మర్యాదపూర్వకంగా కలిసి తమ రాష్ట్ర ప్రతిపాదనల భవిష్యత్తు గురించి తెలుసుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్ అధికారవర్గాలు శ్రద్ధ తీసుకోలేదని తెలుస్తోంది. తీరాంధ్రలో చమురు రంగ పురోభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సిన అవసరం ఎంతైనా వున్నది. సౌదీ అరంకో అధికారులతో చర్చించి, ఈ విషయమై పురోగతి సాధిస్తే నవ్యాంధ్రప్రదేశ్‌లో మరో నవీన ఆర్ధికాభివృద్ధి బాట మొదలవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.మొహమ్మద్ ఇర్ఫాన్ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధిప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వస్తూత్పత్తి రంగంపై ఆధారపడి వుండగా అరబ్‌ దేశాల ఆర్థికంలో చమురు ముఖ్యభూమిక వహిస్తోంది. చమురు ఉత్పత్తి, ఎగుమతిలో గల్ఫ్ దేశాలు ప్రత్యేకించి సౌదీ అరేబియా, యూఏఈలోని అబుధాబి కీలకపాత్ర వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు రంగంలో సంభవించే ప్రతి పరిణామంలో ఈ రెండు దేశాల ప్రమేయం తప్పక ఉంటుంది. అంతర్జాతీయ విపణిలో మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా సౌదీ, అబుధాబీలు కూడా తమ వాణిజ్య వ్యూహాలను మార్చుకొంటున్నాయి. ప్రపంచ ఆర్థిక శక్తులుగా ఆవిర్భవిస్తోన్న సహచర ఆసియా దేశాలపై ఆసక్తి చూపుతున్న ఈ చమురు దిగ్గజాలు ముఖ్యంగా భారత్, అందునా తూర్పు తీరస్థ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. బంగాళాఖాతం తీరాన వుండడం వల్లే ఆంధ్రరాష్ట్రం ఈ ప్రాధాన్యం సంతరించుకున్నది. తమకు అనువైన, చేరువలో వున్న అరేబియా సముద్రతీరప్రాంతాల్లో కాకుండా బంగాళాఖాతం తీరంలో తమ వాణిజ్య కార్యకలాపాలను ముమ్మరం చేసుకోవాలని ఈ గల్ఫ్‌ దేశాలు ఆరాటపడుతున్నాయి. తీరాంధ్రంలో పెట్రోలియం ఉత్పత్తుల వ్యూహాత్మక నిల్వల సామర్థ్యంతో ఆగ్నేయఆసియా దేశాల మార్కెట్లను కైవసం చేసుకోవాలని సౌదీ అరేబియా సంకల్పించుకొంది. ఈ సంకల్ప సాధనకు అవసరమైన ప్రణాళికలను ఇప్పటికే రూపొందించుకొంది. తూర్పు తీరస్థ రాష్ట్రాల్లో చమురు రంగ అభివృద్ధికై మోదీ స్వయంగా సౌదీ, ఆబుధాబిలను ఆహ్వనించడం జరిగింది. మోదీ అభీష్టం మేరకు ఈ గల్ఫ్‌ దేశాల పెట్టుబడులను ప్రోత్సహించడానికి కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ చమురువ్యవస్థను శాసించే (సౌదీ అరేబియాకు చెందిన) సౌదీ అరంకో సంస్ధ కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టే విషయమై అమిత శ్రద్ధాసక్తులు చూపుతోంది. భారత్‌లో తమ వాణిజ్య విస్తరణ అవకాశాలను అనేక కోణాల నుంచి పరిశీలిస్తుంది. సంప్రదాయకంగా తమకు అనువైన అరేబియా సముద్ర తీర దేశాల్లో కాకుండా బంగాళా ఖాతం తీరానున్న భారత రాష్ట్రాలలో ప్రస్తుతమున్న భారతీయ రిఫైనరీలకు తోడుగా అదనపు రిఫైనరీలను నెలకొల్పాలని అరంకో యోచిస్తున్నది. భారతీయ కంపెనీల భాగస్వామ్యంతో వాటిని ఏర్పాటుచేయడం ద్వారా భారత్‌లో తమ వ్యాపార ప్రయోజనాలను సుదీర్ఘకాలం పదిలం చేసుకోవాలని అరంకో ఆలోచిస్తున్నది. వ్యాపార ప్రయోజనాలకు అగ్రప్రాధాన్యమివ్వడంతో పాటు వ్యూహాత్మక చమురు నిల్వలకేంద్రాలను నెలకొల్పుకోవడం ద్వారా ఆగ్నేయఆసియా దేశాల చమురు మార్కెట్లపై పట్టు సాధించాలని సౌదీ అరంకో ఆశిస్తోంది. సరిగ్గా ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో సౌదీ అరంకో అధిపతి అమీన్ నాసర్‌తో సమావేశమయ్యారు. సాధారణంగా సౌదీ అరంకో ఉన్నతాధికారులు వ్యాపార ప్రతిపాదనలతో ఎవరితో చర్చలు జరపరు. అయితే ఈ ఏడాది అనూహ్యంగా చంద్రబాబు నాయుడుతో మాత్రం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా వున్నామని సౌదీ ప్రతినిధులు ప్రతిపాదించారు. అవసరమైన స్థలం, నీటి వనరులు, ఇంకా ఇతర హంగులు అన్నీ సమకూర్చుతానని సౌదీ అరంకో అధికారులకు చంద్రబాబు హామీనిచ్చారు. విశాఖపట్టణంతో పాటుగా కాకినాడలో కూడా పెట్రో రసాయనాల పరిశ్రమలను, సంబంధిత విశ్వవిద్యాలయాన్నీ నెలకొల్పడానికి సహకరించవల్సిందిగా కూడా అరంకో అధికారులను చంద్రబాబు కోరారు. బంగాళాఖాతం తీరంలోని ఒడిశాలో బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆ రాష్టంలో కొన్ని కేంద్ర ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ఉత్కళ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెట్రోలియం మంత్రి ప్రధాన్ ఇప్పటికే ఉర్జ గంగా అనే గ్యాస్ సరఫరా ప్రాజెక్టు ద్వారా ప్రజలకు దగ్గరకావాలని ప్రయత్నిస్తుండగా గల్ఫ్ దేశాలు నెలకొల్పే రిఫైనరీలు కూడా ఒడిశాలో ఏర్పాటయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇటీవల మనదేశంలో జరిగిన కీలక అంతర్జాతీయ పెట్రోలియం సదస్సులో పాల్గొనడానికి సౌదీ అరంకోతో పాటు, ప్రధాన చమురు ఉత్పాదక దేశాల అత్యున్నత స్థాయి అధికార బృందాలు న్యూఢిల్లీకి వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీతో సుదీర్ఘ చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో వారి వద్ద తమ రాష్ట్ర ప్రతిపాదనల ప్రస్తావన తీసుకొచ్చి, మరింత పురోగతి సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం తగు శ్రద్ధ చూపలేదని సమాచారం. న్యూఢిల్లీలో సౌదీ అరంకో సంస్థ అధిపతిని కనీసం మర్యాదపూర్వకంగా కలిసి తమ రాష్ట్ర ప్రతిపాదనల భవిష్యత్తు గురించి తెలుసుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్ అధికారవర్గాలు శ్రద్ధ తీసుకోలేదని తెలుస్తోంది. తీరాంధ్రలో చమురు రంగ పురోభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సిన అవసరం ఎంతైనా వున్నది. సౌదీ అరంకో అధికారులతో చర్చించి, ఈ విషయమై పురోగతి సాధిస్తే నవ్యాంధ్రప్రదేశ్‌లో మరో నవీన ఆర్ధికాభివృద్ధి బాట మొదలవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.మొహమ్మద్ ఇర్ఫాన్ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి
editorial
19,200
28-04-2017 03:16:19
రాష్ర్టాల అభివృద్ధికి చేయూత
పనితీరు బాగుంటే మరింత అండ 2022 నాటికి ‘అందరికీ ఇళ్లు’: వెంకయ్య న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోందని, పనితీరు బాగున్న రాష్ర్టాలకు మరింతగా అండగా ఉంటామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. గురువారం ఆయన స్మార్ట్‌ సిటీలు, పట్టణీకరణ అనే అంశంపై నీతి ఆయోగ్‌, ఆసే్ట్రలియాకు చెందిన న్యూ సౌత వేల్స్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. 2022నాటికి దేశంలో పేదవారందరికీ ఇల్లు నిర్మించాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యమని, ఇది నినాదం మాత్రమే కాదని, వాస్తవరూపం దాల్చుతోందన్నారు. రెండేళ్లలో పట్టణ పేదలకు 18 లక్షల ఇళ్లు మంజూరుచేశామని, రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ర్టాలకు కేంద్రం సాయం చేస్తుందని, అభివృద్ధి కోసం రాష్ర్టాలు ఎంత వేగవంతంగా స్పందిస్తాయో అంతకన్నా వేగంగా వాటికి సాయం చేసేందుకు తాము ముందుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి అజెండా దిశను మార్చేందుకు ఎన్నికుట్రలు చేసినా పట్టించుకోబోమన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని, స్థానిక పరిపాలనా సంస్థలు పట్టణ ప్రణాళికలు రూపొందిస్తున్నాయని, స్మార్ట్‌ సిటీల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన, సుపరిపాలన సాధ్యమవుతోందన్నారు. స్మార్ట్‌ సిటీల ఎంపిక భేష్‌: పనగారియా ఎలాంటి వివాదాలు లేకుండా స్మార్ట్‌ సిటీల అభివృద్ధి కోసం 100 పట్టణాలను ఎంపిక చేయడం చాలా మంచి పరిణామమని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియా ప్రశంసించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మురికివాడలు లేని పట్టణాన్ని తయారుచేయడమే స్మార్ట్‌ సిటీల ప్రధానోద్దేశమని తెలిపారు. మంచినీరు, నాణ్యత గల విద్యుత, అందుబాటు ధరలకు ఇళ్లు వంటివి ఈ పథకం ద్వారా కల్పిస్తున్నామని చెప్పారు.న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోందని, పనితీరు బాగున్న రాష్ర్టాలకు మరింతగా అండగా ఉంటామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. గురువారం ఆయన స్మార్ట్‌ సిటీలు, పట్టణీకరణ అనే అంశంపై నీతి ఆయోగ్‌, ఆసే్ట్రలియాకు చెందిన న్యూ సౌత వేల్స్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. 2022నాటికి దేశంలో పేదవారందరికీ ఇల్లు నిర్మించాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యమని, ఇది నినాదం మాత్రమే కాదని, వాస్తవరూపం దాల్చుతోందన్నారు. రెండేళ్లలో పట్టణ పేదలకు 18 లక్షల ఇళ్లు మంజూరుచేశామని, రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ర్టాలకు కేంద్రం సాయం చేస్తుందని, అభివృద్ధి కోసం రాష్ర్టాలు ఎంత వేగవంతంగా స్పందిస్తాయో అంతకన్నా వేగంగా వాటికి సాయం చేసేందుకు తాము ముందుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి అజెండా దిశను మార్చేందుకు ఎన్నికుట్రలు చేసినా పట్టించుకోబోమన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని, స్థానిక పరిపాలనా సంస్థలు పట్టణ ప్రణాళికలు రూపొందిస్తున్నాయని, స్మార్ట్‌ సిటీల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన, సుపరిపాలన సాధ్యమవుతోందన్నారు.
nation
5,004
30-01-2017 12:52:27
హీరోయిన్ బోల్డ్ సీన్స్ వదిలేసి హీరో సీన్స్‌కు అభ్యంతరం చెప్పిన సెన్సార్!
సూపర్ హాట్ కంటెంట్‌తో కుర్రకారులో ఆసక్తి రేకెత్తిస్తోన్న ఆ మూవీకి సర్టిఫికేట్ ఇవ్వడానికే సెన్సార్ బోర్డ్‌కు ముచ్చెమటలు పట్టేశాయట. ఇంతకూ అంతగా ఆ సినిమాలో ఏముందంటారు? విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగూన్' ట్రైలర్ విడుదలైన దగ్గర నుంచే బీ-టౌన్‌లో ఈ మూవీ హాట్ టాపిక్‌గా మారింది. కంగన సూపర్ బోల్డ్ అవతారంతో పాటూ పలు హాట్ సీన్స్ జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాబట్టి, సహజంగానే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్‌తో తిప్పలు తప్పవు అనడంలో సందేహమేలేదు. 'రంగూన్' మూవీలో బోల్డ్ సీన్స్‌కు కొదవ లేకపోవడంతో... ఆ సన్నివేశాలకు కత్తెర్లు పడటం ఖాయమని భావించారు జనాలు. కానీ, కంగన అందాల ప్రదర్శనకు ఎలాంటి అభ్యంతరం చెప్పని బోర్డ్ సభ్యులు... సినిమాలో హీరోలుగా నటించిన సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ సన్నివేశాలకు మాత్రం కత్తెర్లు వేయాల్సిందిగా సూచించారట. ఈ మధ్యకాలంలో శృంగార సన్నివేశాలకు పెద్దగా అభ్యంతరాలు చెప్పని సెన్సార్ బోర్డ్... మద్యపానం, ధూమపానానికి సంబంధించిన విషయాల్లో మాత్రం నిక్కచ్చిగానే వ్యవహరిస్తోంది. 'రంగూన్' లో ఇలాంటి సన్నివేశాలను తొలిగించాల్సిందిగా లేదా వాటిపై హెచ్చరిక మార్క్‌ను వేయాల్సిందిగా ఆదేశించారు. పొగతాగడం పూర్వకాలంలో ఫ్యాషన్ అయినప్పటికీ... ఇప్పుడు చెడు వ్యసనాలతో సమానం అని బోర్డ్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇక ఈ మేరకు చిత్రంలో మార్పులు చేర్పులు చేసి సినిమాను విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. బోల్డ్ సీన్స్ కంటే పొగతాగే దృశ్యాలపైనే సెన్సార్ చర్య తీసుకుంటోందన్న మాట. మునుముందు ఇలాంటి విచిత్రాలు ఎన్ని చూడాలో..
entertainment
9,756
29-11-2017 22:39:13
గోవాలో సూర్య
అల్లు అర్జున్‌ గోవా వెళుతున్నారు. పది రోజుల పాటు అక్కడే ఉంటారు. అయితే ఇది పర్సనల్‌ ట్రిప్‌ కాదండీ.. షూటింగ్‌ నిమిత్తమే. రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్న ‘నా పేరు సూర్య’ చిత్రం డిసెంబర్‌ ఒకటి నుంచి పది రోజుల పాటు గోవాలో జరుగుతుంది. ఇటీవల హైదరాబాద్‌లో యాక్షన్‌ పార్ట్‌, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. గోవాలో సన్నివేశాలు సహా ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరిస్తారు. ఆ తర్వాత చెన్నై, నార్త్‌ ఇండియాలో జరిగే రెండు షెడ్యూల్స్‌తో చిత్రం టాకీ పార్ట్‌ పూర్తవుతుంది. పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న అల్లు అర్జున్‌ పాత్రరీత్యా కొత్తగా కనిపించడం కోసం అమెరికాన్‌ ట్రైనర్స్‌ దగ్గర ప్రత్యక శిక్షణ తీసుకొన్నారు. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శరత్‌కుమార్‌ మరో రెండు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్‌ సంగీత దర్శకద్వయం విశాల్‌-శేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న విడుదలయ్యే ఈ చిత్రానికి బన్నీ వాసు సహ నిర్మాత.
entertainment
276
27-08-2017 23:14:06
గ్రహగతులివే..
తులలోని విశాఖ పాదం 3 నుంచి ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 2 మధ్యలో చంద్ర సంచారంసింహంలోని మఖ పాదం 4 నుంచి పుబ్బ పాదం 1 మధ్యలో రవి సంచారంసింహంలోని మఖ పాదం 2,3 మధ్యలో వక్రగతిలో బుధ సంచారంకర్కాటకంలోని పుష్యమి పాదం 2,3 మధ్యలోశుక్ర సంచారంకర్కాటకంలోని మఖ పాదం 1లో నీచస్థితిలో కుజ సంచారంవృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 4లో మీన నవాంశలో వక్రగతిలో శని సంచారంకన్యలోని చిత్త పాదం 2లో కన్య వర్గోత్తమలో బృహస్పతి సంచారంకర్కాటకంలో రాహువు, మకరంలో కేతువు మీన, కన్య నవాంశల్లో సంచారం
business
19,183
18-04-2017 00:40:38
లౌడ్‌ స్పీకర్లలో ప్రార్థనలు దాదాగిరీ చేయడమే
మసీదులు, ఆలయాలు, గురుద్వారాల్లో లౌడ్‌ స్పీకర్లనుపయోగించి మత ప్రబోధాలు చేయడం దాదాగిరీ చేయడం వంటిదే. నేను ముస్లింను కాను. కానీ ప్రతిరోజూ ఉదయం అజా(ప్రార్థనకోసం పిలుపు)తో లేవాల్సి వస్తోంది. ఇస్లాం పుట్టినప్పుడు విద్యుత లేదు. మరి ఇప్పుడు పద్ధతి ఎందుకు వచ్చింది. ఏ ప్రార్థనా స్థలాలనుంచైనా లౌడ్‌ స్పీకర్ల ద్వారా ప్రార్థనలు చేసి మతం అంటే నమ్మకం లేనివారిని నిద్రలేపడం ఎంతవరకు సమంజసం. - ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు సోను నిగమ్‌.
nation
12,095
01-12-2017 01:25:38
ఏకే ఆంటోనీకి మెదడులో రక్తస్రావం..
న్యూఢిల్లీ, నవంబరు 30: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ(76) బుధవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో అకస్మాత్తుగా కిందపడిపోవడంతో ఆయన్ను వెంటనే రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఆయనకు మెదడులో స్వల్పంగా రక్తస్రావమైనట్లు గుర్తించారు. శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.
nation
16,249
04-09-2017 01:50:58
జైట్లీ వచ్చాకే బాధ్యతలు
నిర్మలా సీతారామన్‌ రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టడానికి రెండు రోజులు ఆగక తప్పదు. ఎందుకంటే.. ముందుగా నిర్ణయించిన ప్రకారం రక్షణ శాఖకు సంబంధించి ద్వైపాక్షిక చర్చలకు అరుణ్‌ జైట్లీ ఆదివారం జపాన్‌ వెళ్లారు. జైట్లీ తిరిగి వచ్చాక రెండు మూడు రోజుల్లో నిర్మలా సీతారామన్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.
nation
20,830
03-10-2017 02:07:06
సౌతాఫ్రికా ఘన విజయం
తొలి టెస్ట్‌లో బంగ్లా చిత్తు 1-0తో సిరీస్‌లో సఫారీల ఆధిక్యంపోచెఫ్‌స్ట్రోమ్‌ (దక్షిణాఫ్రికా): సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా 333 పరుగులతో భారీ విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 424 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో.. చివరి రోజైన సోమవారం బంగ్లాదేశ్‌ 90 పరుగులకే కుప్పకూలింది. దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో దక్షిణా ఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ (4/25), రబాడ (3/33) దెబ్బకు.. ఓవర్‌నైట్‌ స్కోరు 49/3తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లా తొలి సెషన్‌లో గంట వ్యవధిలోనే మరో 41 పరుగులు జోడించి చివరి 7 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 496/3 (డిక్లేర్డ్‌), బంగ్లా 320 రన్స్‌ చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 247/6 (డిక్లేర్డ్‌) స్కోరు చేసింది. ఇక ఇరు జట్ల మధ్య ఈ నెల 6న ఆఖరి, రెండో టెస్ట్‌ మొదలు కానుంది.
sports
2,949
06-04-2017 00:03:00
మహీంద్రా నుంచి చిన్న ట్రాక్టర్‌ ‘జివో’
ధర రూ.3.09 లక్షలు న్యూఢిల్లీ : మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ కలిగిన చిన్న ట్రాక్టర్‌ ‘జివో’ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 3.09 లక్షల రూపాయల నుంచి 4.05 లక్షల రూపాయల (ఎక్స్‌షోరూమ్‌, మహారాష్ట్ర) వరకు ఉంది. ఈ ట్రాక్టర్‌ 24 హార్స్‌ పవర్‌ (హెచ్‌పి)ను కలిగి ఉంది. హార్టికల్చర్‌, రో క్రాప్‌ఫార్మింగ్‌ విభాగం జోరుగా వృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో ఈ విభాగంలోకి ప్రవేశించినట్టు కంపెనీ తెలిపింది. ఈ విభాగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జివోను అభివృద్ధి చేసినట్టు కంపెనీ పేర్కొంది. ఈ నెల 25వ తేదీ నుంచి మహారాష్ట్ర, గుజరాతలో ఈ ట్రాక్టర్‌ అమ్మకాలను మహీంద్రా ప్రారంభించనుంది. ఆ తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్‌ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇన్నోవేషన్‌, టెక్నాలజీ ద్వారా సాగు ముఖచిత్రాన్నే మార్చివేయడంపై దృష్టిసారించామని ఎం అండ్‌ ఎం మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా తెలిపారు. ఈ దిశగానే జివోను తెచ్చామన్నారు. జివో ప్లాట్‌ఫామ్‌పై 20 హెచ్‌పి టూవీల్‌ డ్రైవ్‌ ట్రాక్టర్‌ను కూడా తీసుకురావాలని మహీంద్రా యోచిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
business
17,564
21-07-2017 03:15:20
మాయావతి రాజీనామా ఆమోదం
లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీకి సై!న్యూఢిల్లీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి (61) రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ గురువారం ఆమోదించారు. యూపీలో దళితులపై దాడుల విషయమై తనను రాజ్యసభలో మాట్లాడనివ్వలేదని ఆరోపిస్తూ.. రాజ్యసభకు రాజీనామా చేస్తానని ఆమె మంగళవారం సభలోనే ప్రకటించి.. ఆ సాయంత్రమే రాజీనామా లేఖను సమర్పించారు. అయితే అది మూడు పేజీల లేఖ. తానెందుకు రాజీనామా చేస్తున్నానో అందులో వివరించారు. కానీ ఏకవాక్యంలో బేషరతుగా రాజీనామా చేస్తున్నట్లు మాత్రమే పత్రం ఇవ్వాలి. దీంతో సరైన ఫార్మాట్‌లో లేదని ఆమోదించడానికి చైర్మన్‌ నిరాకరించారు. బుధవారం ఆమె స్వయంగా ఆయన్ను కలిసి రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. సరైన ఫార్మాట్‌లో సమర్పిస్తే పరిశీలిస్తానని చెప్పారు. దాంతో మరోసారి తన చేతితో ఏకవాక్యం రాసి లేఖ సమర్పించారు. దానిని చైర్మన్‌ ఆమోదించారు. మరోవైపు.. ఆమె రాజ్యసభ సభ్యత్వం వచ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగియనుంది. ఎంపీలుగా యోగి, కేశవ ప్రసాద్‌ మౌర్య రాజీనామాలతో ఖాళీ అయ్యే స్థానాల్లో ఉప ఎన్నికలో పోటీ చేసి సత్తా చాటాలని ఆమె భావిస్తున్నట్లు తెలిసింది. ఇంకోవైపు.. మాయావతి సరేనంటే బిహార్‌ నుంచి రాజ్యసభకు పంపిస్తామని ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రకటించారు.
nation
13,648
14-12-2017 02:21:59
ఆధార్‌ అనుసంధానం గడువు పెంపు
న్యూఢిల్లీ, డిసెంబరు 13: బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్‌ అనుసంధా నం గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో మరో మూడు నెలలు పొడిగింపు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. రూ.50 వేలకు పైగా లావాదేవీలు జరిపే కొత్త,పాత బ్యాంకు ఖాతాలన్నింటికీ ఆధార్‌ నంబరును 2018 మార్చి 31లోపు అనుసంధానం చేసుకోవాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. అయితే, కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరిచే వారు మాత్రం ఆ తేదీ నుంచి ఆరు నెలల్లోపు లేదా మార్చి 31వ తేదీలోపు ఏది ఎక్కువ టైం అయితే ఆ లోపు ఆధార్‌ను ఆనుసంధానం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం మనీలాండరింగ్‌ నిరోధక చట్టానికి సవరణ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ చట్టంలో ఆధార్‌, పాన్‌ నంబర్లను డిసెంబరు 31, 2017 లోపు బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాలన్న నిబంధనను సవరించారు. దాని స్థానంలో ఆధార్‌ నంబరుతో పాటు, పాన్‌ లేదా ఫామ్‌ 60లో ఒకదాన్ని కేంద్రం ప్రకటించే తేదీలోపు బ్యాంకుల్లో అందజేయాల్సి ఉంటుందంటూ కొత్త నిబంధనను తీసుకొచ్చారు.
nation
11,505
02-10-2017 01:21:33
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
తమిళనాడుకు బన్వరీలాల్‌, బిహార్‌కు సత్యపాల్‌మాలిక్‌అండమాన్‌కు కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌న్యూఢిల్లీ, అక్టోబరు1(ఆంధ్రజ్యోతి): దేశంలోని 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీచేశారు. తమిళనాడు గవర్నర్‌గా బన్వరీలాల్‌ పురోహిత్‌ని నియమించారు. రాజకీయ అస్థిరత్వం ఉన్న ఆ రాష్ట్రానికి ఇప్పటి వరకు మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అదనపు బాధ్యతలు నిర్వహించారు.  పురోహిత్‌ గతంలో మేఘాలయ, అసోం రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. మరోవైపు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బిహార్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ఖాళీ ఏర్పడింది. దీంతో బిహార్‌ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌ని నియమించారు. అండమాన్‌ నికోబార్‌ దీవులకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొ. జగ్దీష్ ముఖీని అసోం గవర్నర్‌గా నియమించారు. అండమాన్‌ నికోబార్‌కు ఆయన స్థానంలో రిటైర్‌ అడ్మిరల్‌ దేవేంద్రకుమార్‌ జోషిని నియమించారు. మేఘాలయ గవర్నర్‌గా గంగా ప్రసాద్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా బీడీ మిశ్రాను నియమించారు.
nation
6,173
03-08-2017 00:12:03
సెట్స్‌పై నా పేరు సూర్య
అల్లు అర్జున్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘కిక్‌’, ‘టెంపర్‌’, ‘రేసుగుర్రం’ వంటి హిట్‌ సినిమాల కథకుడు వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. నాగబాబు సమర్పిస్తుండగా, బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అను ఇమ్యాన్యుయేల్‌ నాయిక. సీనియర్‌ అర్జున్‌ కీలక పాత్రలో, శరత్‌కుమార్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్‌లో పేరు పొందిన సంగీత దర్శక ద్వయం విశాల్‌-శేఖర్‌ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. 2018 ఏప్రిల్‌ 27న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత లగడపాటి శ్రీధర్‌ తెలిపారు. ‘‘వరుస బ్లాక్‌బస్టర్స్‌ అందుకొని టాప్‌ ఫామ్‌లో ఉన్న అల్లు అర్జున్‌ మా బేనర్‌లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. బన్ని ఎనర్జీకి తగ్గట్లుగా చేసిన ఈ కథలో కమర్షియల్‌ అంశాలన్నీ ఉంటాయి. భారతదేశం గర్వించదగ్గ నటీనటులు, టెక్నీషియన్ల బృందంతో గ్రాండియర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. రామ్‌-లక్ష్మణ్‌ ఫైట్‌ మాస్టర్లుగా పనిచేస్తున్న ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఛాయాగ్రహణం: రాజీవ్‌ రవి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌.
entertainment
14,182
24-10-2017 10:11:31
విమానం కుక్కను ఢీకొన్న వేళ...
ముంబై : ముంబై నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ అవుతున్న వేళ ప్రమాదవశాత్తూ ఓ కుక్కను ఢీకొట్టింది. దీంతో గోవా విమానం ఆలస్యంగా గమ్యస్థానం చేరింది. ముంబై విమానాశ్రయంలో 6 ఈ 468 పంబనే గల ఇండిగో విమానం సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు టేకాఫ్ అవుతున్నపుడు రన్ వే పై కుక్క అడ్డు రావడంతో పైలెట్ బ్రేక్ వేశారు. దీంతో విమానం టైర్లు దెబ్బతిన్నాయి. దీంతో పైలెట్ విమానాన్ని తనిఖీ కోసం పార్కింగ్ చేశారు. నిపుణులు పరిశీలించి విమానం టైరును మార్చాక ఆలస్యంగా 8.08 గంటలకు విమానం గోవాకు బయలుదేరి వెళ్లింది. కుక్క వల్ల విమాన ప్రయాణం ఆలస్యమైంది.
nation
15,595
01-07-2017 03:14:08
ఏ వస్తువు ఏ శ్లాబులో
హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) జూలై 1 నుంచి అమలులోకి వస్తోంది. వస్తువులు, సేవలపై నాలుగు శ్లాబులుగా ఇది ఉంటుంది. మొత్తం 1,211 వస్తువులపై పన్ను రేట్లను నిర్ణయించింది. మరో 500 రకాల సేవలపై జీఎస్టీ రేట్లను కౌన్సిల్‌ ప్రకటించింది. 5 నుంచి 28% వరకు పన్నులుంటాయి. 5% శ్లాబులో 14% సరుకులు, సేవలు.. 12% శ్లాబులో 17% సరుకులు, సేవలు.. 18% శ్లాబులో 43% సరుకులు, సేవలు.. 28% శ్లాబులో 19% సరుకులు ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల వంటి 7% సరుకులను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించారు. పన్ను లేని వస్తువులుఆహార ధాన్యాలు, కూరగాయలు, శనగ పిండి, గోధుమలు, మైదా, పెరుగు, లస్సీ, మజ్జిగ, పన్నీర్‌, తేనె, ఉప్పు, చీపుర్లు, కుంకుమ, కాటుక, చిన్నారుల డ్రాయింగ్‌ బుక్స్‌, విద్యా సేవలు, వైద్య సేవలు, స్టాంపులు, దస్తావేజులు, ముద్రించిన పుస్తకాలు, వార్తా పత్రికలు, గాజులు, మెట్రో రైళ్లు, లోకల్‌ రైళ్లు, చేపలు, తాజా మాంసం, చికెన్‌, గుడ్లు, పండ్లు, బ్రెడ్‌. పన్ను పరిధిలోకి వచ్చేవి5%టీ, కాఫీలు, పంచదార, మసాలాలు, పన్నీర్‌ ప్యాకెట్‌, పాలపొడి, పిజ్జా బ్రెడ్‌, రస్కులు, కిస్‌మి్‌సలు, షాబుదానా, మ్యాట్‌లు, రూ.500 లోపు ధర ఉన్న పాదరక్షలు, రూ.50 లక్షల లోపు టర్నోవర్‌ ఉన్న రెస్టారెంట్లు, కిరోసిన్‌, బొగ్గు, రవాణా, రైళ్లు, విమానాలు, ట్యాక్సీ సేవలు(ఓలా, ఉబర్‌ లాంటివి), గాలిమరలు, బయో గ్యాస్‌ ప్లాంట్లు, వంట గ్యాస్‌, వంట నూనెలు, ఔషధాలు, స్టెంట్లు, స్టీలు పాత్రలు, ప్రాణాధార మందులు, సోయాబీన్‌, వేరుశనగ, సన్‌ఫ్లవర్‌ గింజలు, బేకరీ వస్తువులు, గృహోపయోగ వస్తువులు, సాస్‌లు, సూప్‌లు, ఎరువులు, అగ్గిపెట్టెలు, సోలార్‌ వాటర్‌ హీటర్లు, పునరుత్పాదక ఇంధన పరికరాలు, బ్లడ్‌ వాక్సిన్లు, ఇనుప స్టవ్‌లు, ఎల్‌పీజీ. పన్ను పరిధిలోనివి 12%విమాన టికెట్లు (బిజినెస్‌ క్లాస్‌), నాన్‌-ఏసీ హోటళ్లు, వర్క్‌ కాంట్రాక్టులు, నెయ్యి, ప్యాక్‌ చేసిన డ్రై ఫ్రూట్స్‌, పండ్ల రసాలు, జామ్‌, జెల్లీ, పెన్సిళ్లు, షార్పనర్లు, పెన్నులు, సైకిళ్లు, కాంటాక్ట్‌ లెన్స్‌, ఆట వస్తువులు, ఆయుర్వేద మందులు, టూత్‌ పౌడర్‌, అగర్‌బత్తీలు, గొడుగులు, కుట్టు మిషన్లు, సెల్‌ ఫోన్లు, వెన్న, చీజ్‌, చాకులు, కొవ్వొత్తులు, ఎల్‌ఈడీ లైట్లు, భుజియా, క్యాలెండర్లు, నీళ్ల పంపులు, ట్రాక్టర్లు, కుట్టుసూదులు, అల్యూమినియం పాత్రలు, వర్క్‌ కాంట్రాక్టులు, ప్రభుత్వ లాటరీలు. పన్ను పరిధిలోకి వచ్చేవి18%నూనెలు, మినరల్‌ వాటర్‌, ఐస్‌క్రీములు, పాస్తా, కార్న్‌ ఫ్లేక్స్‌, కేకులు, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌, నిల్వచేసిన కూరగాయలు, సూప్‌లు, నాప్‌కిన్‌లు, ఎల్పీజీ స్టవ్‌లు, హెల్మెట్లు, ఎలకా్ట్రనిక్‌ బొమ్మలు, స్టీలు వస్తువులు, నోటు పుస్తకాలు, మానిటర్లు, కెమెరాలు, స్పీకర్లు, రుమాళ్లు, ట్రాక్టర్‌ విడి భాగాలు, టిష్యూలు, ప్రింటెడ్‌ సర్క్యూట్లు, బ్రాండెడ్‌ దుస్తులు, లిక్కర్‌ లైసెన్స్‌ ఉన్న ఏసీ హోటళ్లు, టెలికాం సర్వీసులు, ఐటీ సర్వీసులు, ఫైనాన్స్‌ సర్వీసులు, ట్రేడ్‌ మార్క్‌, బీడీ ఆకులు, గుడ్‌విల్‌, సాఫ్ట్‌వేర్‌, బిస్కట్లు, పేస్ట్రీలు, స్టీలు ఉత్పత్తులు, బరువు తూచే యంత్రాలు, ప్రింటర్లు, సీసీటీవీలు, ఆప్టికల్‌ ఫైబర్‌, వెదురు ఫర్నిచర్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌, సలాడ్‌ డ్రసింగులు, రూ. 500 దాటిన పాదరక్షలు, ఆల్కహాల్‌ అమ్మే ఏసీ హోటళ్లు, టెలికం సర్వీసులు, ఐటీ సర్వీసులు, బ్రాండెడ్‌ దుస్తులు, ఆర్థిక సేవలు. రూ. 25,00-7500 మధ్య అద్దె ఉండే హోటల్‌ గదులు, ఫైవ్‌స్టార్‌ హోటళ్లలోని రెస్టారెంట్లు. పన్ను పరిధిలోకి వచ్చేవి 28%బీడీలు, శీతల పానీయాలు, చూయింగ్‌ గమ్‌, మొలాసెస్‌, చాక్లెట్లు, చాక్లెట్‌ కోటెడ్‌ వేఫర్స్‌, పాన్‌ మసాలా, ఏరేటెడ్‌ వాటర్‌, పెయింట్లు, డియోడిరేంట్స్‌, పెర్‌ఫ్యూమ్‌లు, షేవింగ్‌ క్రీమ్స్‌, ఆఫ్టర్‌ షేవ్స్‌, షాంపూలు, హెయిర్‌ డై, సన్‌ స్ర్కీన్‌లు, వాల్‌పేపర్లు, వాటర్‌ హీటర్లు, సిరామిక్‌ టైల్స్‌, డిష్‌ వాషర్స్‌, వేయింగ్‌ మిషన్లు, వాషింగ్‌ మిషన్లు, వెండింగ్‌ మిషన్లు, వాక్యూమ్‌ క్లీనర్లు, ఏర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ప్రింటర్లు, ఫ్యాక్స్‌ మిషన్లు, ఫర్నిచర్‌, షేవర్స్‌, హెయిర్‌ క్లిప్పర్స్‌, ఆటోమొబైల్స్‌, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, రేస్‌ క్లబ్‌ బెట్టింగులు, సినిమా టికెట్లు, షుగర్‌ డ్రింకులు, కోకో, పొగాకు, దానికి ప్రత్యామ్నాయాలు, రాళ్లల, ప్లాస్టరింగ్‌ సామగ్రి, సిమెంటు, సబ్బులు, కృత్రిమ వాక్స్‌, ప్లాస్టిక్‌ వస్తువులు, రబ్బరు, చెక్క వస్తువులు, కాగితం, బాయిలర్లు, యంత్రాలు, పడవలు, తేలే నిర్మాణాలు, ఫొటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ పరికరాలు, వైద్య లేదా శస్త్ర చికిత్స పరికరాలు, వాచీలు, గోడ గడియారాలు, సంగీత పరికరాలు, పరుపులు, కుషన్లు, దీపాలు, బొమ్మలు, గేమ్‌లు.
nation
20,726
28-04-2017 02:33:33
బీసీసీఐకి పీసీబీ బెదిరింపు
కరాచీ: ఐసీసీ నూతన ఆదాయ పంపిణీ నమూనాను అడ్డుకోలేకపోయి చతికిల పడ్డ బీసీసీఐపై దొరికిందే అవకాశంగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) బెదిరింపులకు దిగింది. ఒప్పందంలో భాగంగా తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనందుకు బీసీసీఐపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పీసీబీ హెచ్చరిస్తోంది. దానివల్ల తాము 200 మిలియన్‌ డాలర్లు నష్టపోయామని ఈ మొత్తం బీసీసీఐ నుంచి రాబట్టుకునేందుకు దావా వేస్తామని పీసీబీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌ నజామ్‌ ట్వీట్‌ చేశాడు. 2014లో చేసుకున్న ఎంవోయూ ప్రకారం 2015-2023 మధ్యలో భారత-పాక్‌ ఆరు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పోటీపడాలి. కానీ, కేంద్రం అనుమతి లేకపోవడంతో పాక్‌తో సిరీ్‌సలు ఆడేందుకు బోర్డు ముందుకురావడం లేదు.
sports
2,237
30-08-2017 01:39:05
కార్పొరేట్ లాభాలకు జిఎస్‌టి గండి
ముంబై: భారత కార్పొరేట్‌ రంగం ఆదాయాలను జిఎ్‌సటి కుంగదీసిందని, ఫలితంగా లాభాల్లో భారీ క్షీణత నమోదయిందని రేటింగ్‌ సంస్థ ఇక్రా ఒక నివేదికలో తెలిపింది. డీమానిటైజేషన్‌ వల్ల ఏర్పడిన ప్రతికూలతల నుంచి కోలుకుంటున్నదనుకుంటున్న సమయంలో భారత కార్పొరేట్‌ రంగానికి జిఎ్‌సటి పులిమీద పుట్రలా మారిందని పేర్కొంది. జనవరి-మార్చి త్రైమాసికంలో 448 కంపెనీల ఆదాయాల్లో వృద్ధిరేటు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 8.3 శాతం నుంచి 5.3 శాతానికి మందగించినట్టు ఆ నివేదికలో వివరించారు. ఆదాయాల్లో క్షీణత ప్రభావం కంపెనీల లాభాలపై కూడా పడిందంటూ గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే జనవరి-మార్చి నెలల మధ్య కాలంలో కంపెనీల మార్జిన్లు 1.8 శాతం మేరకు క్షీణించి 15.7 శాతానికి దిగజారినట్టు తెలిపారు.  జిఎస్‌టి ప్రవేశపెట్టడానికి ముందు నెలకొన్న అప్రమత్త వాతావరణంలో అమ్మకాలు గణనీయంగా క్షీణించడం, స్టాక్‌ క్లియర్‌ చేసేందుకు కంపెనీలు సాగించిన డిస్కౌంట్‌ అమ్మకాలు ఆటోమొబైల్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఎఫ్‌ఎంసిజి వంటి కీలక రంగాల్లోని కంపెనీల లాభదాయకత తగ్గడంలో కీలక పాత్ర పోషించినట్టు వివరించారు. ప్రధానంగా వినిమయ ఆధారిత రంగాలు జూలై ఒకటవ తేదీకి ముందు స్టాక్‌ క్లియరెన్స్‌ చేశాయని పేర్కొన్నారు. డీమానిటైజేషన్‌ నుంచి కంపెనీలు రికవరీ బాట పట్టాయనుకుంటున్న సమయంలో జిఎ్‌సటి ప్రవేశంతో పాటుగా ముడిసరకు... ప్రత్యేకించి మెటల్స్‌, రబ్బరు దరల్లో పెరుగుదల ఆయా కంపెనీలను తీవ్ర వత్తిడికి గురి చేసిందన్నారు. రంగాలవారీగా చూస్తే పోటీ పెరగడం టెలికాం రంగానికి, నియంత్రణాపరమైన అవరోధాలు ఫార్మా రంగానికి, ముడిసరకు ధరలు పెరగడం ఆటోమొబైల్‌ రంగానికి శిరోభారంగా మారాయని పేర్కొన్నారు. పైగా బిఎస్‌ 4 ప్రమాణాల అమలు ఆటోమొబైల్‌ రంగాన్ని మరింతగా కుంగదీసినట్టు తెలిపారు.
business
8,858
18-01-2017 16:42:35
అప్పుడు రుద్రమదేవికి.. ఇప్పుడు ఆమె చరిత్రతో వచ్చిన సినిమాకూ లింగ వివక్షే!
బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి తెలుగు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు లభించింది. చారిత్రక చిత్రం కావడం, అందునా తెలుగు వాడి చరిత్ర కావడం, ప్రపంచ దిగ్గజాలను ఓడించిన తెలుగు చక్రవర్తి కథ కావడంతో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పన్ను మినహాయింపునిచ్చాయి. అయితే.. ఇదే పన్ను మినహాయింపు వ్యవహారం గుణశేఖర్ డైరెక్షన్‌లో వచ్చిన రుద్రమదేవి చిత్రానికి మాత్రం వర్తించలేదు. తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపును కల్పించినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం అటు తిప్పి..ఇటు తిప్పి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో గుణశేఖర్ ఏపీ సీఎం చంద్రబాబుకు ఇటీవల ఓ లేఖ రాశాడు. రుద్రమదేవి తెలుగు దక్షిణాపథాన్ని అంతటినీ పాలించిందని, వివక్ష చూపవద్దని కోరుతూ.. తాను చెల్లించిన పన్నును తిరిగి ఇచ్చేయాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఇప్పుడు గుణశేఖర్‌కు మద్దతు వెల్లువెత్తుతోంది. సోషల్ వెబ్‌సైట్లు, ట్విట్టర్ వేదికగా జనాలు గుణశేఖర్‌కు మద్దతుగా ఓ హ్యాష్‌ట్యాగ్‌ను ఓపెన్ చేసేశారు. #SupportRDforTaxExemptionInAP అనే హ్యాష్‌ట్యాగ్‌ను క్రియేట్ చేశారు. పన్ను మినహాయింపునకు ప్రాంతీయ భేదమే కాదు.. లింగ వివక్ష కూడా చూపుతున్నారంటూ మండిపడుతున్నారు. రుద్రమదేవి (సినిమాలో నటించిన అనుష్క) ఫొటోకు మీసకట్టు పెట్టి.. ఇప్పుడు ఆమె అతడే (s'HE') కదా.. ఇప్పుడైనా పన్ను మినహాయింపు ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మహిళలపై అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా వివక్ష చూపిస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు. 13వ శతాబ్దంలో రుద్రమదేవి లింగ వివక్షను ఎదుర్కొందని, ఇప్పుడు 21వ శతాబ్దంలోనూ ఆమె కథను తెరపై చూపించిన రుద్రమదేవి సినిమా కూడా అదే లింగ వివక్షను ఎదుర్కొంటోందని పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై కామెంట్లు షేర్ చేస్తున్నారు.
entertainment
8,271
13-12-2017 17:48:21
బర్త్‌డే రోజు భయపెట్టే లుక్‌లో రెజీనా..
నవంబర్ నెలలో రెజీనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డిసెంబర్‌లో మీ అందరికి షాక్ ఇస్తానంటూ చెప్పిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే రెజీనా అందరికీ షాక్ ఇవ్వడమే కాదు, భయపెట్టేసింది కూడా. నాని సమర్పణలో ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న ‘అ!’ సినిమాకి సంబంధించిన లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌లో సర్పకన్యగా రెజీనా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు రెజీనా ఇటువంటి లుక్‌లో కనిపించలేదు. సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో తెలియదు కానీ, రెజీనా ఫస్ట్ లుక్ మాత్రం ఈ సినిమాపై విపరీతంగా అంచనాలు పెంచేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన నిత్యామీనన్, ఈషా రెబ్బా వంటి వారి లుక్స్ విడుదలైనా.. రెజీనా లుక్ మాత్రం సంథింగ్ స్పెషల్‌గా ఉంది. మొత్తానికి రెజీనా బర్త్‌డే ట్రీట్ మాత్రం అదిరింది. ఇక ఈ ‘అ!’ చిత్రం ఇప్పటికే 90 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుందని చిత్ర యూనిట్ తెలుపుతుంది. ‘ప్రపంచంలో నేను.. నాలోని ప్రపంచం’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాని, రవితేజ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ప్రశాంతి త్రిపురనేని.
entertainment
6,585
29-12-2017 17:05:07
ఇద్దరు టాప్ నిర్మాతలతో మహేశ్ 25వ మూవీ
హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన 25వ సినిమాపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం దర్శకుడు లొకేషన్లు వెతికేపనిలో పడ్డారు. కథ ప్రకారం న్యూయార్క్‌లో ఎక్కువ షూటింగ్ జరగనున్నట్టు సమాచారం. అశ్వనీదత్, దిల్‌రాజు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. వచ్చే దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నారట. కాగా మహేశ్‌బాబు నటిస్తున్న ‘భరత్ అనే నును’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. మహేశ్ సరసన కైరా అద్వాని నటిస్తున్నారు. మహేశ్‌బాబు వచ్చే ఏడాది రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారనమాట.
entertainment
5,762
09-03-2017 17:54:22
బాలయ్య చేసేది ఆటో జానీ కథేనా?
బాలకృష్ణ తాజాచిత్రం ఈరోజే ప్రారంభోత్సవం జరుపుకొంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో బాలయ్య నటించబోతున్నాడు. ఫిల్మ్‌నగర్‌లో లేటెస్ట్‌గా ఓ హాట్ టాపిక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం పూరీ జగన్నాథ్ కూడా లైన్లో ఉన్న సంగతి తెలిసిందే. చిరు కోసం పూరీ ఆటో జానీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడని, ఆ స్క్రిప్ట్ సెకండాఫ్‌లో తేడా రావడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే స్క్రిప్ట్‌ను బాలయ్యకు తగినట్టుగా మార్చాడ పూరీ. బాలయ్య స్టైల్, బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టు కొన్ని సీన్లను రీరైట్ చేసి బాలయ్యకు మళ్లీ వినిపించాడట. పూరీ సన్నిహితులు ఈ విషయాన్ని చెబుతున్నారు. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యను సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడట పూరీ. టైటిల్ మాత్రం ఆటో జానీ ఉండదని, మరో క్యాచీ టైటిల్ కోసం కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు. సినిమాలో నటించే హీరోయిన్లను ప్రకటించలేదు. త్వరలోనే సినిమా తారాగణాన్ని ప్రకటిస్తారట. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
entertainment
16,831
04-10-2017 02:23:47
గౌరీ హంతకులను గుర్తించాం: మంత్రి
బెంగళూరు, అక్టోబరు 3: గత నెల 5న తన ఇంటి వద్దే దారుణ హత్యకు గురైన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్‌ కేసులో హంతకులను గుర్తించినట్టు కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి ఢిల్లీలో వెల్లడించారు. అయితే, ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ ముమ్మరంగా సాగుతున్నట్టు తెలిపారు. కాగా, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.
nation
3,711
20-04-2017 04:55:33
చెల్లప్ప కమిషన్ రద్దు చేయాలి
ఎస్టీ జాబితాలో మరిన్ని అగ్ర కులాలను కలిపి ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకం. ఆదివాసీ లక్షణాలు లేని ఇతర కులాలను షెడ్యూల్ తెగలలో కలపడం చట్ట వ్యతిరేకం, అన్యాయం, అక్రమం, అమానుషం. ఇప్పటి వరకూ ఉన్న 6 శాతం రిజర్వేషన్‌ను పాలకులు సంపూర్ణంగా అమలు చేయకపోవడం మూలంగా ఆదివాసీలు అన్ని రంగాల్లో వెనుకబడి పోయారు. 1976లో అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా ఎస్టీ జాబితాలో చేరిన లంబాడీలు ఈనాడు ఆదివాసీల విద్యా ఉఫాది అవకాశాలను 90శాతం దోచుకున్నారు. భూములు ఆక్రమించుకున్నారు. నేడు కేవలం పాలకులు ఓటు బ్యాంకు రాజకీయ కోణంలో చెల్లప్ప కమిషన్ ద్వారా బోయ, వాల్మీకి, కయిత లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చి 12శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కుట్ర పన్నుతున్నారు. దీని ఫలితం ఆదివాసీ అడవి బిడ్డలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే అవుతుంది. అంతరించి పోతున్న ఆదివాసీల గురించి పట్టించుకోవడం లేదు కానీ ఎస్టీ జాబితాలో మరిన్ని కులాలను కలిపి ఆదివాసులను అంతం చేయాలని పాలకులు ప్రయత్నిస్తున్నారు. షెడ్యూల్ తెగలలో ఒక కులాన్ని కలపాలన్నా, తీసివేయాలన్నా పార్లమెంట్, అసెంబ్లీ ఆమోదం ఉండాలి. రాష్ట్రపతి ఆమోదముద్ర ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా చట్టబద్ధత లేని, రాజ్యాంగబద్ధత లేని చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేసింది. షెడ్యూల్ తెగలలో కులాలను కలిపితే నష్టం ఎవరికి అనేది మానవతా దృక్పథంలో, సామాజిక స్పృహతో ఆలోచిస్తేనే అర్థం అవుతుంది. షెడ్యూల్ తెగలలో కులాలను కలపడం అంటే ఒకే బోనులోకి జింకను పులినీ పంపించడమే అవుతుంది. అలాగే షెడ్యూల్ తెగలలో ఇతర కులాలను కలిపితే నిజమైన ఆదివాసులను వారి విద్యా ఉపాధి అవకాశాలను, రిజర్వేషన్‌ను నిలువునా దోపిడీ చేస్తారు. నోరు లేని, రాజకీయ చైతన్యం లేని, అక్షర జ్ఞానం లేని, ఆర్థిక జ్ఞానం లేని ఆదివాసీల రోదన అరణ్య వేదనగా మారింది. చెల్లప్ప కమిషన్ ద్వారా షెడ్యూల్ తెగలలో ఇతర కులాలను కలపడాన్నీ ఆదివాసీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఆదివాసీల 6శాతం రిజర్వేషన్‌ను ఏజెన్సీలో ఖచ్చితంగా అమలు చేయాలనీ, ఆదివాసీలను నిర్వీర్యం చేసే చెల్లప్ప కమిషన్‌ను రద్దు చేయాలనీ ఆదివాసీలు కోరుతున్నారు.- వూకె రామకృష్ణ దొరఆదివాసీ రచయితల సంఘం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
editorial
322
08-06-2017 00:37:36
మసాలా బాండ్లకు ఆర్‌బిఐ అనుమతి తప్పనిసరి
ఇక నుంచి విదేశీ మార్కెట్లలో మసాలా బాండ్లు జారీ చేయాలనుకునే కంపెనీలేవైనా ఆర్‌బిఐ ఫారెక్స్‌ శాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇసిబి నిబంధనల్లో మార్పుల్లో భాగంగా ఈ చర్య తీసుకుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో 5 కోట్ల డాలర్లకు లోపు నిధులు వసూలు చేయడానికి బాండ్లు జారీ చేస్తే వాటికి మూడు సంవత్సరాలు, అంతకు పైబడిన విలువ గల నిధులు సమీకరిస్తే అలాంటి బాండ్లకు ఐదు సంవత్సరాలు కాలపరిమితిని నిర్దేశించింది.
business
20,905
16-10-2017 02:07:44
లడ్డూపై దాడి..!
టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ, కూతురు జివాతో కలసి చేసే సందడి ఎప్పుడూ అభిమానులకు సంతోషంగానే ఉంటుంది. జివా చేసే చిలిపి చేష్టలను ధోనీ తరచుగా నెట్‌లో షేర్‌ చేస్తుంటాడు. తాజా ఇద్దరూ కలసి లడ్డూ తింటున్న వీడియోను ధోనీ పోస్టు చేశాడు. ‘ఎటాక్‌ ఆన్‌ బేసన్‌ కా లడ్డూ’ అనే క్యాప్షన్‌ పెట్టాడు. ఇది చూసి మహీ ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు.
sports
6,472
18-05-2017 11:55:17
రమ్యకృష్ణలా కలిసొస్తుందని రాంగ్‌రూట్‌లో వెడుతున్న శ్రియ...
రోడ్డు మీద కాదు. క్యారక్టర్ల ఎంపికలో శ్రియ రాంగ్‌ రూట్‌లో వెడుతోంది అని బాధపడుతున్నారు ఆమె శ్రేయోభిలాషులు. గతంలో రమ్యకృష్ణ ‘నరసింహ’ సినిమాలో నీలాంబరి క్యారక్టర్ చేసి ఎంతో పాపులర్‌ అయింది. ఆ సినిమా తీసుకొచ్చినంత పేరు ఆమెకు మరే సినిమా తీసుకురాలేదు. తను కూడా అంతటి పేరు తెచ్చుకోవాలనుకుందో ఏమో శ్రియ తాజగా ఓ నెగిటివ్‌ క్యారక్టర్‌ చేయడానికి ఓకే చెప్పేసింది. ఇప్పటి వరకూ గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన శ్రియ ఈ క్యారక్టర్‌లో ఎంత వరకూ మెప్పిస్తుందన్న అనుమానాన్న ఆమె సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చేసి చెడ్డపేరు తెచ్చుకుంటుందేమో అన్నదే వారి భయమట! ఈ విషయాలన్నీ శ్రియకు తెలియదా? అన్న వారూ ఉన్నారు.
entertainment
1,326
20-11-2017 00:04:33
ఆ రూ.13 వేల కోట్లూ మాకే!
ఆర్‌బిఐని కోరిన ఆర్థిక శాఖన్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బిఐ)ను తన వద్దనున్న రూ.13వేల కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి ఇవ్వమని కోరామే తప్ప ప్రత్యేక డివిడెండ్‌ డిమాండ్‌ చేయలేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ వివరణ ఇచ్చా రు. జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్‌బిఐ.. ప్రభుత్వానికి రూ.30,659 కోట్ల డివిడెండ్‌ చెల్లించింది. గత ఏడాది జూన్‌లో చెల్లించిన రూ. 65,876 కోట్లతో పోలిస్తే సగానికంటే తక్కువ.  ఈసారి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆర్‌బిఐ నుంచి డివెడెండ్‌ రూపంలో రూ.58 వేల కోట్లు రావచ్చని అంచనా వేసింది. కానీ ఆర్‌బిఐ గత ఆర్థిక సంవత్సరానికి ఆర్జించిన రూ.44 వేల కోట్ల లాభం నుంచి ప్రభుత్వానికి రూ.30వేల కోట్లకు పైగా డివిడెండ్‌ పంచింది. అయితే, ఆ మిగిలిన రూ.13 వేల కోట్లను కూడా ప్రభుత్వానికే ఇవ్వాలని ఆర్‌బిఐని కోరడం జరిగిందని గార్గ్‌ వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండేళ్లలో రూ. 2.11 లక్షల మూలధన నిధులు కేటాయించనున్నట్లు గతనెలలో ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. ఈ కేటాయింపుల కోసం అవసరమైన నిధుల సేకరణకు కేంద్రం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. అందులోభాగంగానే ఆర్‌బిఐని ప్రభుత్వం ప్రత్యేక డివిడెండ్‌ కోరిందని ఊహాగానాలు వచ్చాయి.
business
3,798
08-11-2017 00:42:30
నిరుద్యోగుల అసహనం
రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఉపాధ్యాయ నియామక ప్రక్రియ నిరాశాజనకంగా ఉంది. ఇటీవల వివిధ శాఖల ఉద్యోగాల నోటిఫికేషన్ మొదలు, పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన, నియామక ఉత్తర్వులు అన్నీ అస్తవ్యస్తంగా ఉండడం.. నిరుద్యోగుల్లో ప్రభు త్వం పట్ల అసహనం వ్యక్తం అవుతోంది. ఆర్థిక, హోమ్, న్యాయ, పరిపాలనా రంగాల మధ్య సమన్వయం కొరవడి ఉద్యోగాల భర్తీ అపహాస్యం అవుతుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక శాఖ సూచించిన ఉపాధ్యాయ ఖాళీలు సుమారు 24000 పైమాటే. అనంతరం ఆ ఖాళీలను విద్యా శాఖ 18000లకు కుదించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 8 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వడం.. అందునా కొన్ని జిల్లాల్లో తెలుగుమీడియం ఎస్‌జీటీ పోస్టులు 10 లోపు ఉండడం.., ఇత్యాది కారణాల వల్ల నిరుద్యోగుల్లో అసహనం, అభద్రతాభావం, ఆందోళన పెరుగుతున్నాయి. గ్రామంలో ఒకే ప్రాథమిక పాఠశాల ఉండేట్టు చూస్తూ, అంగన్‌వాడీలను దానికి అనుసంధానం చేస్తూ, 4–5 గురు ఉపాధ్యాయులను ఇచ్చి, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఏర్పాటు చేస్తే విద్యావ్యవస్థ గాడిలో పడుతుంది.- ప్రేమ్ సాగర్ కులేరి, తెలంగాణ SC, ST ఉపాధ్యాయ సంఘం
editorial
18,784
02-06-2017 03:20:13
ప్రొటోకాల్‌ను కాదని..జవాన్‌ను హత్తుకున్న రాజ్‌నాథ్‌
న్యూఢిల్లీ, జూన్‌ 1: దాదాపు మూడేళ్ల క్రితం.. 2014లో. జమ్మూకశ్మీర్‌ ఉధంపూర్‌లో ఆర్మీ కాన్వాయ్‌ వెళ్తోంది. ఓ బస్సులో 30 మంది సైనిక సిబ్బంది ఉన్నారు. బస్సు ‘నర్సూ నాలా’ ప్రాంతానికి చేరుకోగానే ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగారు. వాహనంపై బుల్లెట్ల వర్షం కురిపించారు. బస్సులో గార్డు విధులు నిర్వహిస్తున్న బీఎ్‌సఎఫ్‌ జవాను గోధ్‌రాజ్‌ మీనా.. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగాడు. మిలిటెంట్ల కాల్పుల్లో శరీరం ఛిద్రమైనా.. తెగువ ప్రదర్శించి ఇద్దరిని మట్టుపెట్టాడు. 30 మంది ప్రాణాలను కాపాడాడు. కొన ఊపిరితో గోధ్‌రాజ్‌ బయటపడి కోలుకున్నా.. 85 శాతం అంగవికలుడిగా మారాడు. గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ చేతులు మీదుగా గోధ్‌రాజ్‌ పోలీస్‌ మెడల్‌ అవార్డు అందుకున్నాడు. అయితే.. ఈ సందర్భంగా ప్రొటోకాల్‌కు భిన్నంగా వ్యవహరించిన రాజ్‌నాథ్‌ గోధ్‌రాజ్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దాంతో అధికారులు ఆశ్చర్యపోయినా.. వెంటనే తేరుకుని హర్షద్వానాలతో స్వాగతించారు.
nation
14,973
30-09-2017 03:10:36
ప్రైవేటు అంబులెన్సులో జయను ఎందుకు తరలించారు?
ఆమె భద్రతాసిబ్బంది ఎక్కడికెళ్లారుఅపస్మారక స్థితిలో ఉంటే ఓపీఎస్ కు బాధ్యతలు ఎలా అప్పగించారు?జయ మరణంపై స్టాలిన్‌ ప్రశ్నాస్త్రాలుచెన్నై, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరిన సమయంలో నమోదుచేసిన పేషంట్‌ కేర్‌ రిపోర్టు ఇప్పుడు తమిళనాడులో సంచలనం రేపుతోంది. ఓ తమిళ చానల్‌ దీనిని బహిర్గతం చేయడంతో అన్ని రాజకీయ పార్టీల నేతలు అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభలో విపక్ష నేత ఎంకే స్టాలిన్‌ శుక్రవారం 10 ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రిగా ఉన్న జయను ఆమె భద్రతావిభాగంలోని అంబులెన్సులో గాక ప్రైవేటు అంబులెన్సులో ఎలా తీసుకెళ్లారని నిలదీశారు. ఆమె అపస్మారక స్థితిలో ఉంటే ఒ.పన్నీర్‌సెల్వానికి ఎలా నిర్వహణ బాధ్యతలు అప్పగించారని ప్రశ్నించారు. ‘జడ్‌ ప్లస్‌ భద్రతా సిబ్బంది జయ ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎక్కడకు వెళ్లారు? 75 రోజులపాటు వారేం చేశారు? ఆమె ఆరోగ్యంపై కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించారా లేదా? సమర్పించి ఉంటే జయ ఆరోగ్యం గురించి కేంద్రానికి పూర్తి వివరాలు తెలుసా? శశికళ కూడా అక్టోబరు మొదటివారం నుంచి జయను చూడలేదని దినకరన్‌ అన్నారు.  అలాంటప్పుడు తిరుప్పరంకుండ్రం ఉప ఎన్నికలో బీఫారం పత్రాలపై జయ వేలిముద్ర ఎలా వచ్చింది? ముఖ్యమంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసేవారు ఆమె చుట్టూ, ఆమె మంత్రివర్గంలో, సచివాలయంలో ఎవరైనా ఉన్నారా? ఇదే నిజమైతే ఏయే పథకాలకు ఆ సంతకాన్ని ఫోర్జరీ చేశారు? పదవుల పంపకం కోసమే జయ ఆరోగ్యంపై 75 రోజులపాటు నాటకం ఆడారా’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. ఈ ప్రశ్నలు వ్యక్తిగతంగా తాను సంధిస్తున్నవి కావని, రాష్ట్ర ప్రజలతో పాటు అన్నాడీఎంకే కార్యకర్తలు లేవనెత్తుతున్న ప్రశ్నలని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్ధతో విచారణ జరిపినప్పుడే నిజానిజాలు బయటపడతాయని స్పష్టం చేశారు.
nation
1,325
23-08-2017 02:04:41
సిఇఒలు అభివృద్ధి సైనికులు కావాలి
దేశ దిగుమతుల భారం తగ్గించాలిపర్యాటకంతో ఉద్యోగాలే ఉద్యోగాలుదీపావళి బహుమతులుగా ‘ఖాదీ’ కూపన్లుప్రధాని మోదీ పిలుపున్యూఢిల్లీ: చిన్న వయసులోనే కంపెనీల ప్రధాన కార్యనిర్వహణాధికారులు(సిఇఒ)గా పని చేసే వ్యక్తు లు దేశ అభివృద్ధికి సైనికులుగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. దిగుమతుల భారం తగ్గించడంతో పాటు, ఆర్థిక వ్యవస్థలో నగదు లావాదేవీల ప్రమేయం తగ్గించేందుకూ కృషి చేయాలని కోరారు. భీమ్‌ యాప్‌ను ప్రోత్సహించడం ద్వారా 2022 నాటికి మీ దగ్గర చేసే ఉద్యోగులందరికీ నగదు రహితంగా జీతాలు చెల్లించే విధానం అమలు చేయాలని సూచించారు. చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ పేరుతో నీతి ఆయోగ్‌ దాదాపు 200 మంది యువ సిఇఒలు, స్టార్టప్‌ కంపెనీల ప్రధాన అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని ఈ పిలుపునిచ్చారు. సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పండ్లు, కూరగాయలతో సహా ఏటా రూ.లక్ష కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు వృధా కావడాన్ని గుర్తు చేశారు.  మౌలిక సదుపాయాల కల్పన కూడా పెద్ద వ్యాపార అవకాశం అనే విషయాన్ని సిఇఒలు గుర్తించాలని కోరారు. వ్యవసాయ ఆధారత ఎగుమతులతో పాటు దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకూ చర్యలు తీసుకోవాలన్నారు. ‘గాంధీజీ స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చారు. ప్రతి ప్రభుత్వం దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అయినా అభివృద్ధి ప్రజా ఉద్యమంగా మారలేదు’ అన్నారు. గాంధీజీ స్వాతంత్య్ర పోరాటాన్ని ఎలా ప్రజా ఉద్యమంగా మార్చారో మనమూ భారత అభివృద్ధిని అలానే ప్రజా ఉద్యమంలా మార్చాలని ప్రధాని.. సిఇఒలను కోరారు. అందరం కలిసి కట్టుగా పని చేస్తే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. దేశంలో ఖాదీ వస్త్రాల వాడకాన్ని పెంచేందుకూ సిఇఒలు సహకరించాలని కోరారు. దీపావళి వంటి పండుగల సందర్భంగా ఉద్యోగులకు ఖాదీ కూపన్లను బహుమతిగా ఇవ్వాలని సూచించారు. పర్యాటకంతో ఉద్యోగాలుదేశంలో పర్యాటక రంగ అభివృద్ధి అవకాశాలపైనా యువ సిఇఒలు దృష్టి పెట్టాలని ప్రధాని కోరారు. ఈ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉందన్నారు. ‘సుసంపన్నమైన మన వారసత్వాన్ని మనం గర్వకారణంగా భావించం. దీని గురించి మనం గర్వంగా చెప్పుకోగలిగితే అంతర్జాతీయ పర్యాటకులు మన ఘనమైన వారసత్వ కట్టడాలు చూసేందుకు ఎగబడతారు’ అన్నారు. భారత్‌కు మాత్రమే పరిమితమైన సమస్యలు, మార్కెట్లకు అనువైన పరిష్కారాలు అభివృద్ధి చేయగలిగితే ఉద్యోగాలు వాటంతట అవే ఏర్పడతాయని ప్రధాని మోదీ అన్నారు. జిఈం పోర్టల్‌ ద్వారా ప్రభుత్వానికి వివిధ వస్తువులు సరఫరా చేయడం ద్వారా 28,000 మంది చిన్న వ్యాపారులు గత 4-6 నెలల్లో రూ.1,000 కోట్ల వ్యాపారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పనగడియా పనితీరు భేష్‌ఈ నెలాఖరులో పదవి నుంచి తప్పుకుంటున్న నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగడియాపై ఈ సమావేశంలో ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ను ఎలాంటి ప్రచారం లేకుండానే చక్కగా తీర్చిదిద్దారని కితాబిచ్చారు. ‘నిర్ణీత లక్ష్య సాధన కోసం కలిసి కట్టుగా ఎలా చేయవచ్చో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ పనగడియా ఆచరించి చూపారు. అందుకు ఆయన్ని అభినందిస్తున్నా. ఈ విషయంలో దేశం ఆయన సేవల్ని పాత్రని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’ అన్నా రు. నాలుగున్నర దశాబ్దాలుగా అమెరికాలో పని చేస్తున్న పనగడియా తన విజ్ఞప్తి పైనే భారత్‌ వచ్చి నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ పదవి చేపట్టారని మోదీ చెప్పారు. ముందు ముందు కూడా పనగడియా ప్రభుత్వంతో కలిసి పని చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
business
6,153
30-10-2017 22:23:29
ఓ ఇడియట్‌ ప్రేమకథ
‘‘ఇష్టపడిన అమ్మాయి వెంటపడి, తన ఇష్టాయిష్టాలను తెలుసుకుని, ఆమె ప్రేమకోసం తన ఇష్టాల్ని వదులుకొని, ఆ అందమైన అమ్మాయిని ఇంప్రెస్‌ చెయ్యడమే పనిగా పెట్టుకున్న ఓ యువకుడికి చివరికి ఆమె ప్రేమ దక్కిందా లేదా అన్నది తెరపైనే చూడాలి’’ అని అంటున్నారు దర్శకుడు అజయ్‌ వోధిరాల. నవీన్‌చంద్ర, నివేదా థామస్‌ జంటగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌’. కొత్తపల్లి అనురాధ సమర్పణలో అనురాగ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కొత్తపల్లి ఆర్‌.రఘుబాబు కె.బి.చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రతీస్‌ వేగ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల్ని ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సుకుమార్‌ ఆడియో సీడీలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘నేను స్ట్రగ్‌లింగ్‌లో ఉన్న సమయంలో ‘మీరు గొప్ప దర్శకుడు అవుతారు. మీ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్‌ అవుతాను’ అని అజయ్‌ చెప్పాడు. అది జరిగింది. ఇప్పుడు అతను మంచి ప్రేమకథతో దర్శకుడిగా మారాడు. ప్రతి విషయంలో క్లారిటీగా ఉంటాడు... క్వాలిటీగా ఆలోచిస్తాడు. వెతికి వెతికి మంచి టీమ్‌ను తీసుకున్నాడు. చిన్న సినిమా అయినా ఇది మంచి సినిమా. ఇలాంటి సినిమాలు ఆడితే పరిశ్రమ బావుంటుంది’’ అని అన్నారు.
entertainment
18,899
24-02-2017 02:11:16
రాహుల్‌ ఆఫీసుకు ముడుపులు!
బెంగళూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్‌ అధిష్ఠానానికి పెద్దఎత్తున ముడుపులు పంపిందా...! ఆ రాష్ట్ర మంత్రులు తమకు తోచినంత ముట్టచెప్పారా..!! ఏకంగా రాహుల్‌ గాంధీ కార్యాలయానికే ఇక్కడి నుంచి డబ్బులు వెళ్లాయా..!! అంటే అవుననే అంటోంది ఓ డైరీ. పైగా అది సాదా సీదా డైరీ కాదు. కర్ణాటక ప్రభుత్వంలో అధిష్ఠానం మనిషిగా ముద్రపడిన వ్యక్తి వద్ద ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న డైరీ అని చెబుతున్నారు. దానిలోని కొన్ని పత్రాలు గురువారం రాత్రి విడుదల చేశారు. అందులోని వివరాల ప్రకారం.. వారం రోజుల కిందట కర్ణాటకలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ గోవిందరాజులు ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఒక డైరీ, పలు డాక్యుమెంట్లు, పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకుంది. ఐటీ, ఈడీ అధికారులు సదరు డైరీని పరిశీలించగా.. అందులో కర్ణాటక నుంచి ‘ఏఐసీసీకి చెల్లింపులు..’’ అని రాసి ఉంది. ఈ వివరాలను ఐటీ అధికారులు అధికారికంగా బయటపెట్టలేదు. కానీ, డైరీలో దాదాపు డజను మంత్రి కర్ణాటక మంత్రుల పేరిట అధిష్ఠానానికి ముడుపులు అందినట్లు ఉంది. వీరి నుంచి ముడుపులు అందుకున్నవారి పేర్లలో అహ్మద్‌ పటేల్‌, రాహుల్‌ గాంధీ కార్యాలయం, మోతీలాల్‌ వోరా పేర్లు ఉన్నాయి. వీటితోపాటు సెప్టెంబరు నుంచి జనవరి వరకూ నెలల వారీగా ఇచ్చిన వివరాలూ డైరీలో ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి గోవిందరాజులు అధిష్ఠానం మనిషని.. ఆయన్ను హైకమాండే నేరుగా ఎమ్మెల్సీ చేసిందని ఇక్కడ చెబుతూ ఉంటారు. ఈయన ఇప్పుడే మొదటిసారిగా ఎమ్మెల్సీ అయ్యారు కూడా. ఆయన ఇంట్లో లభించిన డైరీలో ముడుపుల వివరాలు ఉండటంతో.. ఆయన ద్వారానే కర్ణాటక మంత్రులు ముడుపులు సమర్పించుకున్నారనీ అంటున్నారు. తాజాగా బయటపడిన మంత్రులు అందరినీ పరిశీలిస్తే.. వీరందరూ అటు అధిష్ఠానానికి లేకుంటే సీఎం సిద్ధరామయ్యకు ఆప్తులుగా ఉన్నవారే. ఈ డైరీలోని వివరాలతో కర్ణాటక నుంచి ఢిల్లీ దాకా రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలం మొదలైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన దాదాపు 10 పత్రాల్లో 65 కోట్ల ముడుపులకు సంబంధించిన లెక్కలున్నాయి. కేవలం రాహుల్‌గాంధీ, అహ్మద్‌ పటేల్‌, ఓరాలకే రూ.50 కోట్ల వరకు ఇచ్చినట్లు ఇందులో వారి సంక్షిప్త నామాల పేరిట రాసి ఉంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధిష్ఠానానికి వెయ్యి కోట్లు పంపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు. వాటిని సీఎం, కాంగ్రెస్‌ కొట్టిపారేశాయి. ఈ నేపథ్యంలో సదరు డైరీ పత్రాలు ఢిల్లీలో వెలుగులోకి వచ్చాయి. డైరీలో ఉన్న వివరాలు..!!‘‘ఏఐసీసీకి చెల్లింపులు...’’కేజేజే, ఎంబీపీ రూ.219 కోట్లు. (కేజేజే- కేజే జార్జ్‌.. ఈయన సోనియాగాంధీకి అత్యంత ఆప్తుడని చెబుతూ ఉంటారు. అలాగే ఎంబీపీ- అంటే మహదేవప్రసాద్‌. ఆయన ప్రజాపనుల మంత్రి. ఈయన సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు.)
nation