SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
9,767
02-08-2017 11:06:09
స్వీటీ ఐటెంసాంగ్‌కు మూడున్నర కోట్లు?
టాలీవుడ్‌లో ఐటెంసాంగ్‌కు ఇస్తున్న అత్యధికపారితోషికం ఇదే! కాకపోతే మామూలు సాదా సీదా హీరోయిన్‌కు ఇంత సమర్పించుకోవడం లేదు. టాలీవుడ్‌ అంతా జేజమ్మ అని ముద్దుగా పిలుచుకుంటున్న అనుష్కశెట్టికి ఇంత సొమ్ము చెల్లిస్తున్నారు. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనుష్క కథలో సత్తా ఉంటే తప్ప ఒప్పుకోవడం లేదు. అలాంటిది ఐటెంసాంగ్‌ చేయబోతోంది అంటే ఆ సినిమాతో పాటు పాటలో కూడా సత్తా ఉందనే అంటున్నారు టాలీవుడ్‌ జనాలు. కాకపోతే ఈ విషయంలో ఇంత వరకు స్వీటీ నోరు విప్పి చెప్పలేదు. మౌనం అర్ధాంగీకారం కనుక అందరూ ఇదే నిజమని అనుకుంటున్నారట!
entertainment
2,460
08-08-2017 23:24:52
బిహెచ్‌ఈల్‌తో విద్యుత్‌ ప్రాజెక్టుల ఆలస్యం
యంత్రాలను సమయానికి అందించలేదు: కాగ్‌న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ సంస్థ బిహెచ్‌ఈల్‌ నిర్వాకంతో తెలంగాణలో విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతోందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) స్పష్టం చేసింది. బిహెచ్‌ఈల్‌ యంత్రాలను ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్‌ ప్రకారం సరఫరా చేయడం లేదని వెల్లడించింది. బిహెచ్‌ఈల్‌ పనితీరుపై కాగ్‌ అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో పార్లమెంటుకు మంగళవారం సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బిటిపిఎస్‌), కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కెటిపిఎస్‌) నిర్మాణానికి అవసరమైన భారీ యంత్రాల తయారీ ఆర్డర్‌ను బిహెచ్‌ఈల్‌కు తెలంగాణ జెన్‌కో అప్పగించింది.  అయితే, సమయానికి యంత్రాలను సరఫరా చేయకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి లేదని, ఫలితంగా ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగిందని టిఎ్‌సజెన్‌కో చైర్మన్‌,మేనేజింగ్‌ డైరెక్టర్‌ చెప్పినట్లు కాగ్‌ వెల్లడించింది. కాగా, భద్రాద్రి ప్రాజెక్టు కోసం జెన్‌కో 2015 మార్చిలో రూ.50,244 కోట్ల విలువైన కాంట్రాక్టు ఆర్డర్‌ ఇచ్చిందని కాగ్‌ తెలిపింది. అయితే, ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవంటూ పనులను ఆపేయాలని జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ 2015 డిసెంబరులో ఆదేశాలిచ్చిందని, దీంతో పనులను నిలిపివేయాలని బిహెచ్‌ఈల్‌కు జెన్‌కో అధికారులు రెండు రోజుల తర్వాత తెలిపిందని కాగ్‌ పేర్కొంది. పనులను ఆపాలని బిహెచ్‌ఈల్‌ తయారీ విభాగానికి మార్కెటింగ్‌ విభాగం ఆదేశాలిచ్చినా యూనిట్‌ సిబ్బంది పట్టించుకోలేదని కాగ్‌ స్పష్టం చేసింది. ఆపాలని చెప్పిన తర్వాత కూడా పనులు చేపట్టిన భెల్‌ 2016 జనవరి నుంచి 2017 మార్చి వరకు రూ.209 కోట్లు ఖర్చు చేసిందని కాగ్‌ గుర్తించింది. దీనిపై కాగ్‌ ప్రశ్నించగా సమాధానాన్ని బిహెచ్‌ఈల్‌ దాటవేసింది. చివరికి 2017 మార్చిలో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులొచ్చాయని కాగ్‌ నివేదికలో పేర్కొన్నది. బిహెచ్‌ఈల్‌ హైదరాబాద్‌ యూనిట్‌ పనిపై కాగ్‌ నివేదికలోని మరికొన్ని అంశాలు..రూ.765.65 కోట్ల విలువైన 121 ఆర్డర్లను ముందుగానే సరఫరా చేసింది.రూ.5,461 కోట్ల విలువైన 7,638 ఆర్డర్లను సమయానికి సరఫరా చేయడంలో విఫలమైంది.ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ అమలులో హైదరాబాద్‌ యూనిట్‌ సరిగ్గా వ్యవహరించడం లేదు. 2015-16లో ఈ-ప్రొక్యూర్‌మెంట్ల ద్వారా 8.07% ఆర్డర్లు మాత్రమే సాధించింది.బిహెచ్‌ఈల్‌ హైదరాబాద్‌ యూనిట్‌ పనిపై కాగ్‌ నివేదికలోని మరికొన్ని అంశాలు..రూ.765.65 కోట్ల విలువైన 121 ఆర్డర్లను ముందుగానే సరఫరా చేసింది.రూ.5,461 కోట్ల విలువైన 7,638 ఆర్డర్లను సమయానికి సరఫరా చేయడంలో విఫలమైంది.ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ అమలులో హైదరాబాద్‌ యూనిట్‌ సరిగ్గా వ్యవహరించడం లేదు. 2015-16లో ఈ-ప్రొక్యూర్‌మెంట్ల ద్వారా 8.07% ఆర్డర్లు మాత్రమే సాధించింది.
business
21,028
21-01-2017 09:25:48
కటక్‌‌లో భారత్ గెలవడానికి ముగ్గురే కారణం: రవిశాస్త్రి
యువరాజ్‌సింగ్‌ ఆ విధమైన గడ్డంతో ఉండడాన్ని చాలా అరుదుగా చూస్తుంటాం. కటక్‌ వన్డేలో ప్రతాపం చూపిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. వన్డేల్లో 150 కొట్టినా పెద్దగా సంబరాలు చేసుకోని ఆటగాళ్లను కొందర్నే చూస్తాం. క్రికెట్‌ ఫీల్డ్‌లోనుంచి కాకుండా జీవితాన్ని మరో కోణంలోనుంచి చూసిన ఆటగాడతను. జీవితం చాలా చిన్నది. అందులో మెరుగ్గా రాణించాలని తెలిసిన ఆటగాడు. అతనిప్పుడు ఎంత అమోఘమైన ఫిట్‌నెస్‌తో ఉన్నాడో చాలామందికి తెలీదు. ఇక మహీ.. జట్టు అవసరాలమేరకు ఆడగల క్రికెటర్‌. అంతసేపు బ్యాటింగ్‌ చేసి మళ్లీ మూడున్నర గంటలపాటు కీపింగ్‌ చేయడమంటే మామూలు విషయం కాదు. సవాళ్లకు అతను ఏనాడూ తలొంచడు. అది చాలా గొప్ప విషయం. ఇక కటక్‌ వన్డేలో చెప్పుకోవాల్సిన మరోవ్యక్తి అశ్విన్‌. టెస్టుమ్యాచ్‌ పద్ధతిలో బౌలింగ్‌ చేయమని అశ్విన్‌ని అతని కెప్టెన్‌ కోరాడు. అశ్విన్‌ కూడా మ్యాచ్‌ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.
sports
15,997
14-06-2017 02:58:48
గుజరాత్ లో స్మృతి ఇరానీపై గాజులతో దాడి
అహ్మదాబాద్‌: కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై గాజులతో దాడికి ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీ పాలనకు మూడేళ్లు నిండిన సందర్భంగా గుజరాతలోని అమ్రేలి పట్టణంలో నిర్వహించిన ‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌’ సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి మాట్లాడుతుండగా వేదికకు కొద్ది దూరంగా కూర్చున్న కేతన్‌ కస్వాలా అనే యువకుడు ఉన్నట్టుండి లేచి ‘వందేమాతరం’ అని నినాదాలు చేస్తూ గాజులు విసిరాడు.
nation
3,734
14-02-2017 03:28:13
అవనీమాత వలె...
ఈ వార్త నిజమే! సరోజినీ దేవి మరణం. ప్రపంచంలో జరిగే అనేక సంఘటనలతో బాటు ఆమె కాలధర్మాన్నికూడా పత్రికలు యథావిధిగా ప్రకటించాయి. కానీ ఇది అంతగా విశ్వసించనక్కరలేని వార్త. సరోజినీ దేవి ఫలానా రోజున జన్మించి ఫలానా రోజున మరణించిందని చావు పుట్టుకల జాబితా వేసుకోవడానికి మాత్రం పనికొస్తుంది ఈ వార్త. అజరామరమైన సరోజినీ దేవి జీవిత గాథకి భౌతిక మరణం ఒక ఆశ్వాసాంతం కానేకాదు. పత్రికలు ప్రకటించిన వార్తను కాదని ఖండించకుండా, ఆమె ఇంకా జీవిస్తూనే ఉందని ఖండితంగా చెప్పవచ్చు. ఆమె చిత్రపటాన్ని కూడా అన్ని పత్రికలూ ప్రకటించాయి. ఆ బొమ్మని చూసిన వాలందరూ సరోజినీ దేవికి ముసలితనం వచ్చిందని భ్రమపడవచ్చు. ఆ బొమ్మ ఇచ్చే సాక్ష్యంలో కూడా అబద్ధం లేదు. స్థూల దృష్టికి సరోజిని వృద్ధురాలిగానే కనపడవచ్చు. ఆ సత్యాన్నే కెమెరా రికార్డ్ చేసింది. అయితే అంతకన్నా అగాధమైన సత్యం ఇంకొకటి ఉన్నది. అది అసలు వయస్సే లేని ఆమె ఆత్మ. ఎవరూ దానినిప్పటికీ ఫోటో తియ్యలేదు. కానీ అందరి మనస్సుల్లోనూ అది హత్తుకుపోయిందని చెప్పవచ్చును. ఫోటో లోకి చూస్తూ, పత్రికలో వార్త చదువుతూ, ఒక ఆరముగ్గిన పండు రాలిపోయిందనుకుంటాము.జననం 1879, మరణం 1949, డెబ్భయి సంవత్సరాల జీవితం అని లెక్క వేసుకుంటాము. ఈలోపున ఆమె జీవితంలోని ప్రధాన ఘట్టాలన్నీ ఒకసారి స్మరణకి తెచ్చుకుంటాము. పదకొండో ఏటనే పద్యం రాయడం, బ్రాహ్మణేతరునితో వివాహం, సాంస్కృతిక, సాంఘిక రాజకీయ రంగాలలో దేదీప్యమాన విహారం, కాంగ్రెస్ కిరీటం, చెరసాలలు, గుండ్ర బల్లలు, ఉప్పు సత్యాగ్రహం, ప్రపంచయుద్ధం రావడం పోవడం, స్వరాజ్యం రావడం, గవర్నర్ పదవి ఇత్యాదులు. ఇటీవల ఆమె పరమపదించిందన్న వార్త, ఆమె జీవిత గాథలో అంతగా పాటించనక్కరలేని చిల్లర వివరం. అందంగా, ఆకుపచ్చగా, అవనీ మాత లాగ సరోజినీ దేవి, శాశ్వతంగా మన తోనే ఉంటుంది. శ్రీ. శ్రీ.(11.03.1949 ఆనందవాణి వార పత్రికలో) జన్మతః బెంగాలీ అయిన సరోజినీ దేవి, తండ్రి అఘోర నాథ చట్టోపాధ్యాయ్ నిజామ్ కళాశాల అధ్యాపకులుగా హైదరాబాద్ రాగా, అక్కడే చదువుకుని, తదుపరి విదేశాలలోనూ చదివిన విద్యాధికురాలు. తెలుగు వారి కోడలు. సరోజినీదేవి కవితా సంపుటి పేరే, ఆమె గృహం పేరు ‘గోల్డెన్ త్రేషొల్డ్’. భాగ్యనగరంలో సాంస్కృతిక సౌభాగ్య గరిమకు చిహ్నంగా ఇప్పటికీ నిలిచి ఉన్న ఆ భవంతి ఆమె గుర్తు. ఈ భారత కోకిల 1949లో కన్ను మూసినప్పుడు, మహాకవి శ్రీశ్రీ అలనాడు ‘ఆనందవాణి’ లో ఈ నివాళి అర్పించారు. ఆయన మాటల్లో ఈమె స్మృతి మరింత అజరామరంగా నిలిచింది. నేడు సరోజినీ దేవి 138వ జయంతి సందర్భంగా విశాఖలో మొజాయిక్ సాహిత్య సంస్థ ఒక సాహిత్య సదస్సు ఏర్పాటు చేసింది. –రామతీర్థజన్మతః బెంగాలీ అయిన సరోజినీ దేవి, తండ్రి అఘోర నాథ చట్టోపాధ్యాయ్ నిజామ్ కళాశాల అధ్యాపకులుగా హైదరాబాద్ రాగా, అక్కడే చదువుకుని, తదుపరి విదేశాలలోనూ చదివిన విద్యాధికురాలు. తెలుగు వారి కోడలు. సరోజినీదేవి కవితా సంపుటి పేరే, ఆమె గృహం పేరు ‘గోల్డెన్ త్రేషొల్డ్’. భాగ్యనగరంలో సాంస్కృతిక సౌభాగ్య గరిమకు చిహ్నంగా ఇప్పటికీ నిలిచి ఉన్న ఆ భవంతి ఆమె గుర్తు. ఈ భారత కోకిల 1949లో కన్ను మూసినప్పుడు, మహాకవి శ్రీశ్రీ అలనాడు ‘ఆనందవాణి’ లో ఈ నివాళి అర్పించారు. ఆయన మాటల్లో ఈమె స్మృతి మరింత అజరామరంగా నిలిచింది. నేడు సరోజినీ దేవి 138వ జయంతి సందర్భంగా విశాఖలో మొజాయిక్ సాహిత్య సంస్థ ఒక సాహిత్య సదస్సు ఏర్పాటు చేసింది. –రామతీర్థ
editorial
5,437
30-10-2017 19:46:09
వరుణ్‌తేజ్ 'తొలిప్రేమ'కి రిలీజ్ డేట్ లాక్ చేశారు
వరుణ్‌తేజ్, రాశిఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'తొలిప్రేమ'. ఈ చిత్రాన్ని వేలెంటైన్ డే టైమ్‌కి ప్రేమికుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయబోతున్నట్లుగా అఫీషియల్‌గా తెలియజేశారు. రీసెంట్‌గా లండన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో షెడ్యూల్‌తో చిత్రీకరణను పూర్తి చేసుకోనుంది. ఆ వెంటనే పాటలను కూడా చిత్రీకరించి ఫిబ్రవరి 9కి విడుదల చేసేందుకు పక్కా ప్లాన్‌తో చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. పవన్‌కళ్యాణ్ నటించిన చిత్రంగా, పవన్‌కళ్యాణ్‌ని స్టార్ హీరోని చేసిన చిత్రంగా 'తొలిప్రేమ'కి పేరుంది. మరి ఆ పేరుతో వస్తున్న అబ్బాయ్ వరుణ్‌తేజ్ కూడా.. తన 'తొలిప్రేమ' స్టార్ హీరోగా నిలబెడుతుందని ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ చిత్రానికి వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
entertainment
2,933
04-09-2017 23:50:30
ఎన్‌టిసిపి రీజినల్‌ ఇడిగా రామచంద్ర మూర్తి
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎన్‌టిపిసి రీజినల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (సౌత్‌)గా కె రామచంద్ర మూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈయన మూడు భారీ విద్యుత్‌ ప్రాజెక్టులైన సింగ్రౌలి (2000 మెగావాట్లు), రిహంద్‌ (3000 మెగావాట్లు), వింధ్యాంచల్‌ (4760 మెగావాట్లు) ప్లాంట్లకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. రాయ్‌పూర్‌లోని రవిశంకర్‌ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టాను అందుకున్న మూర్తి 1980లో ఎన్‌టిపిసిలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరింగ్‌ ట్రైనీగా చేరారు. మూడున్నర దశాబ్దాల సర్వీసులో ఈయన ఎన్‌టిపిసి స్టేషన్లయిన భద్రపూర్‌, అరియా, నోయిడా, దుర్గాపూర్‌, తాల్చేర్‌, సింగ్రౌలి, రిహంద్‌, వింధ్యాంచల్‌లో కీలకమైన పదవులను నిర్వహించారు. థర్మల్‌, గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్లాంట్ల నిర్వహణ, కార్యకలాపాల్లో మూర్తికి అపారమైన అనుభవం ఉంది.
business
4,566
03-12-2017 10:16:43
బన్నీ కోసం... బాలీవుడ్ కొరియోగ్రాఫర్
బాలీవుడ్ ఏస్ కొరియాగ్రఫర్స్‌లో ఒకరైన వైభవి మర్చంట్ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోంది. అది కూడా అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా సినిమాతో. ఈ సినిమాలో బన్నీకి వైభవి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయబోతోంది. ఈ సినిమాలోని రెండు పాటలకు వైభవి కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. వక్కంతం వంశీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఈ కొరియోగ్రాఫర్ స్పెషల్ లుక్ ఇవ్వనుందని తెలుస్తోంది. వైభవి బాలీవుడ్‌లో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. నా పేరు సూర్య సినిమాలో కృష్ణాష్టమి సందర్భంగా ఉండే ఫ్యామిలీ సాంగ్‌కి.. మరో లవ్ సాంగ్‌కి వైభవి కొరియోగ్రఫీ చేయనున్నారు.
entertainment
15,747
26-10-2017 04:42:03
ఉరి తీసేప్పుడు డాక్టర్లను ఉంచొద్దు.. ఎంసీఐకు ఐఎంఏ లేఖ
న్యూఢిల్లీ, అక్టోబరు 25: ఉరి శిక్ష అమలు చేసే సమయంలో వైద్యులు ఉండాలన్న నిబంధనను రద్దు చేయాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఐఎంఏ చీఫ్‌ కేకే అగర్వాల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ)కు లేఖ రాశారు. దోషులను ఉరి తీసేప్పుడు వైద్యులు ఉండడం వైద్య వృత్తి విలువల ఉల్లంఘన అవుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. మరణ శిక్ష అమలు చేసేప్పుడు వైద్యుల హాజరును వ్యతిరేకించాలని గతంలోనే ప్రపంచ మెడికల్‌ అసోసియేషన్‌ (డబ్ల్యూఎంఏ) తన సభ్య సంఘాలకు సూచించింది. స్వస్థత చేకూర్చే వైద్యుడి పాత్రకు అది విరుద్ధమని స్పష్టం చేసింది.
nation
4,412
31-03-2017 04:33:18
న్యాయకోవిదుడు
మద్రాసు హైకోర్టులో ఒక తెలుగువాడి శిలా విగ్రహం కనిపిస్తుంది. ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి విగ్రహం పెట్టడంలో విశేషమేమీ లేదు. కాకుంటే ఆ వ్యక్తి తెలుగువాడు కావటంలో కొంచెం విశేషముంది. ఇటీవల బూదరాజు రాధాకృష్ణ ఆత్మకథ చదువుతున్నప్పుడు ఆ విగ్రహమూర్తి ముత్తా వేంకట సుబ్బారావు గురించి మరో ఆసక్తికర విషయం తెలిసింది. ముత్తా వేంకటసుబ్బారావు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో ఒకసారి కలకత్తా మెయిల్లో మొదటి తరగతి కంపార్టుమెంటులో ప్రయాణిస్తుండగా గూడూరులో ఒక బ్రిటిషు మిలటరీ అధికారి కంపార్టుమెంటులో ఎక్కుతున్నందున సుబ్బారావుని దిగిపొమ్మని చెప్పారు. తనకు టిక్కెట్‌ ఉందని తనను దిగిపొమ్మనటం తప్పని, ఆ దొర రెండోవైపు కూర్చోవచ్చని చెప్పినా వినకుండా ముత్తా వారిని కిందకు ఈడ్చేశారట. అంతటితో ఆగకుండా సీటు కిందవున్న నల్లపెట్టెను బూటుకాలుతో తన్నాడట. ఆ పెట్టెకు అమర్యాద జరిగితే తీవ్ర నేరమని చెప్పినా పెడచెవిన పెట్టిన ఆ మేజర్‌ దాన్ని తంతే ఆ పెట్టె మూత వూడిపోయి మద్రాసు హైకోర్టు రాజలాంఛనాలు కిందపడ్డాయి. వెంటనే వాటిని ధరించి అది కోర్టని ప్రకటించి మేజర్‌ను క్షమాపణ చెప్పమని కోరాడట. అయినా ఖాతరుచేయని మేజర్‌ను తనకు జరిగిన అవమానానికి క్షమించి, న్యాయస్థానాన్ని అగౌరవపరిచినందుకు ఏడేళ్ళు కఠిన కారాగార శిక్ష విధించాడట. దీంతో లొంగిపోయిన ఆ సేనాని తర్వాత లండన్‌ ప్రీవీ కౌన్సిల్‌కి అప్పీలు చేసుకున్నాడు. అయితే విచారణ జరిపిన ప్రీవీ కౌన్సిల్‌ ముత్తా గారు విధించిన శిక్ష తక్కువని చెప్పి దానికి మూడు రెట్లు అంటే 21 సంవత్సరాలకు శిక్షను పెంచారు.  న్యాయస్థానాల గౌరవం కాపాడటంలో తెల్లవాళ్ళు గొప్పగా ప్రవర్తించే వాళ్ళనటానికి ఇది నిదర్శనం. ముత్తా వేంకట సుబ్బారావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు. 1878లో జన్మించారు. మద్రాసు క్రిస్టియన్‌ కాలేజిలో డిగ్రీ పొంది, 1903లో వకీలు పాసై రాదాకృష్ణయ్యర్‌తో కలిసి మద్రాసులో ప్రాక్టీసు మొదలుపెట్టారు. కొద్ది కాలంలోనే మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 1939లో ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసేదాకా గొప్ప న్యాయమూర్తిగా పేరుగాంచాడు. 1922లో ఆండాల్‌తో వీరి వివాహం. ఇరువురు కలిసి స్థాపించిన ‘మద్రాసు సేవా సదన్‌’ స్ర్తీలు, పిల్లల సంక్షేమం కోసం పనిచేసే సంస్థగా అభివృద్ధి చెందింది. బ్రిటిష్‌ కాలంలోనే ముత్తా గారికి ‘సర్‌’ బిరుదు లభ్యమైంది. 1960లో మరణించారు.చెరుకూరి సత్యనారాయణ
editorial
14,227
30-09-2017 03:40:33
ఆ వ్యాసం నా అంతట నేనే రాశా: జయంత్‌
మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై యశ్వంత్‌ సిన్హా అభిప్రాయాలతో విభేదిస్తూ ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా ఓ వ్యాసం రాశారు. ఇది ఎవరో చెబితే రాశానని తండ్రి చేసిన ఆరోపణలను జయంత్‌ తోసిపుచ్చారు. స్వబుద్ధితోనే రాశానని చెప్పారు. తండ్రితో అభిప్రాయ భేదాలు సీరియస్‌ చర్చలో భాగమని, దీనిని వ్యక్తిగతంగా చూడరాదన్నారు. కొన్ని నెలలు, వారాలుగా ఆర్థిక పరిస్థితిపై ఆయనతో చర్చిస్తున్నానని, పత్రికలు, టీవీల్లో కూడా కొనసాగుతోందని తెలిపారు.
nation
12,027
21-10-2017 16:32:55
మోదీ మాతో ఉన్నంత వరకు మాకు ఢోకా లేదు : రాష్ట్ర మంత్రి
చెన్నై : తమిళనాడు మంత్రి కే టీ రాజేంద్ర బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమకు మద్దతిచ్చినంత కాలం అన్నా డీఎంకేను ఎవరూ కదిలించలేరన్నారు. పార్టీ గుర్తు ‘రెండు ఆకులు’ తమ వర్గానికే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన అన్నా డీఎంకే సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీఎంకేతో సహా ఎవరూ అన్నా డీఎంకే పాలనను వ్యతిరేకించలేరన్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గానికి 92 శాతం మంది మద్దతిస్తున్నట్లు తెలిపారు.
nation
16,984
13-06-2017 04:09:11
వినియోగదారులకు ఇండియన్‌ ఆయిల్‌ యాప్‌
న్యూఢిల్లీ, జూన్‌ 12: దేశవ్యాప్తంగా ఈ నెల 16నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రతీ రోజు మారనున్న నేపథ్యంలో వినియోగదారుల సౌకర్యార్థం ఆయిల్‌ కంపెనీలు సాంకేతికత విరివిగా వాడుకుంటున్నాయి. తాజాగా, దేశీయ అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ మొబైల్‌ యాప్‌ను విడుదల చేసింది. దీనిలో దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రతీ రోజు మారుతున్న పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తెలుసుకోవచ్చని తెలిపింది. అంతేకాకుండా ఎస్‌ఎంఎస్‌ ద్వారాను పెట్రో ధరలు తెలుసుకోవచ్చని వివరించింది. ప్రతీ పెట్రోల్‌ బంకు వద్ద డీలర్‌ కోడ్‌ ఉంటుందని, దాని సాయంతో ధరలు తెలుసుకోవచ్చని వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హెచ్‌పీసీఎల్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లు ధరల్లో కాస్త తేడా చూపించే అవకాశం ఉండటంతో పెట్రోల్‌ బంకును బట్టి కూడా రేట్లలో తేడాలు ఉండనున్నాయి.
nation
13,888
30-01-2017 02:41:54
మా దగ్గర ప్రార్థన చేసుకోండి
అమెరికా ముస్లింలకు సంఘీభావం హోస్టన్‌, జనవరి 29: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముస్లింలపై ద్వేషం వ్యక్తం చేసినా, అక్కడి ప్రజలు మాత్రం సంఘీభావం ప్రకటించారు. టెక్సాస్ లోని విక్టోరియా సిటీలో ఓ మసీదును తగలబెట్టడాన్ని తప్పు పట్టిన అక్కడి వాసులు.. ముస్లింలకు బాసటగా నిల్చారు. వారు తమ దగ్గరకొచ్చి ప్రార్థన చేసుకోవచ్చని నాలుగు చర్చీలు, యూదుల ఆరాధనా సమాజాలు ప్రకటించాయి.
nation
9,069
17-12-2017 17:04:21
సునీల్‎కి దక్కిన ఆ ఛాన్స్ ఆయన కొట్టేశాడా..?
ఆ హీరో చేజారిన రీమేక్ ఛాన్స్ అప్ కమింగ్ హీరో సొంతమైందట. గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న హీరోకు ఇది మంచి అవకాశం అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒక హీరో కోసం అనుకున్న కథ మరో హీరోతో సినిమాగా రూపొందడం కొత్తేమీ కాదు. రీమేక్స్ విషయంలోనూ ఇలాంటివి జరగడం సహజం. తాజాగా టాలీవుడ్ హీరో సునీల్ విషయంలో ఇదే జరిగిందని ఇండస్ట్రీలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ మధ్య కోలీవుడ్ హిట్ మూవీ 'సతురంగ వెట్టయ్' తెలుగు రీమేక్‎లో హీరో సునీల్ నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే 'ఉంగరాల రాంబాబు' రిలీజ్ తరువాత ఈ సినిమాను సునీల్‎తో రీమేక్ చేసే విషయంలో నిర్మాత వెనకడుగు వేశాడట.  వరుస పరాజయాలతో సతమతమవుతున్న సునీల్‎తో సినిమా వద్దని నిర్మాత భావించినట్టు ఊహాగానాలు వినిపించాయి. సునీల్‎తో 'సతురంగ వెట్టయ్' రీమేక్ ఉండదనే విషయంలో క్లారిటీ వచ్చినా ఈ కోలీవుడ్ మూవీ టాలీవుడ్ రీమేక్‎లో నటించే హీరో ఎవరనే విషయంలో మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఈ హిట్ మూవీ రీమేక్‎లో నటించే అవకాశం 'జ్యోతిలక్ష్మీ' ఫేమ్ సత్యదేవ్‎కు దక్కినట్టు తెలుస్తోంది.  ఇందుకు సంబంధించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. సాయిరామ్ శంకర్ హీరోగా తెరకెక్కిన 'రోమియో' చిత్రానికి దర్శకత్వం వహించిన గోపీ గణేశ్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా ఈ రీమేక్ మూవీ ఉంటుందని సమాచారం. మొత్తానికి సునీల్ చేజారిన రీమేక్ ఛాన్స్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న సత్యదేవ్ కు దక్కడం విశేషమే. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి.
entertainment
16,763
19-02-2017 02:50:18
తొలి డీఎన్‌ఏ కంప్యూటర్‌ ఆవిష్కరణ
లండన్‌, ఫిబ్రవరి 18: రక్తంలోని పలు యాంటీబాడీలను గుర్తించి, మందుల చేరవేతలో వినూత్న మార్పులకు దారితీసే సరికొత్త డీఎన్‌ఏ కంప్యూటర్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. నెదర్లాండ్స్‌లోని ఎందోవెన్‌ యూనివర్సిటీ ఆప్‌ టెక్నాలజీ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. దీంతో స్మార్ట్‌ డ్రగ్స్‌ ఆవిష్కరణలో మరో ముందడుగు పడినట్లైంది.
nation
19,000
11-09-2017 09:35:17
ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులు హతం.. ఒకరిని సజీవంగా పట్టుకున్న ఆర్మీ
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు స్థానిక పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఆదివారం కుద్వానీ ప్రాంతంలో కార్డన్ సెర్చ్‌ నిర్వహించాయి. తనిఖీల సందర్భంగా తీవ్రవాదులు సైనికులపై కాల్పులకు దిగారు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న సైనిక బలగాలు భీకరకాల్పులతో విరుచుకుపడ్డాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మృతి చెందగా... మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. కాగా ఆదివారం కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద తీవ్రవాదులు పెట్టిన ల్యాండ్‌మైన్ పేలడంతో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఎల్వోసీ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుందనీ.. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించామని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.
nation
2,867
21-06-2017 02:13:26
మహీంద్రాకు ఎయిర్‌బస్‌ కాంట్రాక్టు
న్యూఢిల్లీ: యూర్‌పకు చెందిన విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్‌ మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్‌కు దృఢమైన లోహాలతో (హార్డ్‌ మెటల్స్‌) తయారుచేసే కొన్ని రకాల విడిభాగాల తయారీ, సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది. ఈ కాంట్రాక్టు కింద ఎ320 నియో, వైడ్‌బాడీ ఎ350ఎక్స్‌డబ్ల్యుబి విమానాల తయారీలో ఉపయోగించే విడిభాగాలను ఏరోస్పేస్‌ స్టీల్‌, టైటానియం, ఇంకోనెల్‌ వంటి స్పెషాలిటీ లోహాలతో తయారుచేసి సరఫరా చేయాల్సి ఉంటుందని మహీంద్రా ఏరోస్ట్రక్చర్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  ఇది తమకు ఎయిర్‌బస్‌ నుంచి నేరుగా లభించిన కాంట్రా క్టు అని, ఫ్రాన్స్‌కు చెందిన సిగ్నెర్‌ ఎస్‌ఎఎస్‌ కంపెనీతో తాము కలిసి పని చేయాల్సిఉంటుందని పేర్కొంది. భారత్‌లోను, ఫ్రాన్స్‌లోను ఉన్న ఎయిర్‌బస్‌ ఫ్యాక్టరీలకు నేరుగానే ఈ ఉత్పత్తులు సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఎయిర్‌బస్‌ విమానాల్లో భారత్‌లో తయారైన విడిభాగాల వినియోగాన్ని పెంచే దిశగా ఇది మరో ముందడుగు అని ఎయిర్‌బస్‌ ఇండి యా ప్రెసిడెంట్‌ శ్రీనివాసన్‌ ద్వారకానాథ్‌ చెప్పారు. మహీంద్రా ఏరోస్రక్చర్స్‌ కంపెనీకి బెంగళూరు సమీపంలో ఫ్యాక్టరీ ఉంది. ఇప్పటివరకు అల్యూమినియం అల్లాయ్స్‌తో తయారుచేసే విడిభాగాలను మాత్రమే ఉత్పత్తి చేస్తున్న తాము ఈ కొత్త కాంట్రాక్టుకు అనుగుణంగా హార్డ్‌మెటల్‌ సామర్థ్యాలను జోడించుకుంటున్నట్టు మహీంద్రా ఏరోస్పేస్‌ చైర్మన్‌ ఎస్‌పి శుక్లా తెలిపారు. సెర్బియా కంపెనీతో రిలయన్స్‌ డిఫెన్స్‌ ఒప్పందంఅనిల్‌ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్‌ డిఫెన్స్‌ అమ్యూనిషన్‌ కంపెనీ సెర్బియాకు చెందిన రక్షణ దిగ్గజం యుగో ఇంపోర్ట్‌తో ఆయుధాల తయారీ కాంట్రాక్టు కుదుర్చుకుంది. దీని వల్ల వచ్చే పదేళ్లలో 20 వేల కోట్ల రూపాయల వ్యాపారావకాశాలు అందుబాటులోకి వస్తాయని రిలయన్స్‌ డిఫెన్స్‌ చెబుతోంది. ఈ డీల్‌లో భాగంగా తమ సంస్థ ఎగుమతి అవకాశాలు కూడా అన్వేషించవచ్చునని, ఒఈంలకు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. మేక్‌ ఇన్‌ ఇండియా చొరవకు ఈ ఒప్పందం పూర్తిగా కట్టుబడిందని తెలిపింది. ఈ డీల్‌ను అమలుపరిచేందుకు తాము కొత్తగా ఒక ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
business
19,066
25-06-2017 01:24:13
మానస సరోవర యాత్రకు చైనా బ్రేక్‌
న్యూఢిల్లీ, జూన్‌ 24: నాథులా మార్గంలో కైలాస మానస సరోవర యాత్రకు బ్రేక్‌ పడింది. ఈ మార్గంలో మానస సరోవర యాత్రకు బయలుదేరిన తొలి బ్యాచ్‌ 50 మందిని సరిహద్దుల్లో చైనా నిలిపివేసింది. టిబెట్‌లో కొండ చరియలు విరిగిపడుతున్నందువల్ల యాత్రికులను అనుమతించడంలేదని చైనా పేర్కొంది. దీంతో వారం రోజులు ఎదురు చూసిన యాత్రికులు షెర్తాంగ్‌, గ్యాంగ్‌టక్‌ తిరిగి వచ్చారు. అయితే యాత్రికులను అనుమతించక పోవడానికి చైనా చెబుతున్న కారణాలు సహేతుకం కాదని, ఇరుదేశాల మధ్య ఇటీవల క్షీణించిన సంబంధాలకు ఇది నిదర్శనమని భావిస్తున్నారు. యాత్రకు అంతరాయం ఏర్పడినమాట వాస్తవమని అంగీకరించిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్‌ బాగ్లే, దీనిపై చైనాతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. సుదీర్ఘ విరామం తర్వాత 2015లో నాథులా మార్గాన్ని తెరిచిన విషయం తెలిసిందే!
nation
6,783
29-12-2017 22:40:00
శ్రీనివాసరెడ్డి కేరాఫ్‌ ‘జంబలకిడి పంబ’
శ్రీనివాసరెడ్డి మంచి కమెడియన్‌. ఆయనలో హీరో కూడా ఉన్నారు. తన ఇమేజ్‌కి సూటయ్యే కథ వచ్చినప్పుడు ఆ హీరోని బయటకు తీసుకొస్తారు. ఆల్రెడీ హీరోగా ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాలు చేశారు. నిన్న వైకుంఠ ఏకాదశి సందర్బంగా హీరోగా మూడో సినిమా ‘జంబలకిడి పంబ’ ప్రారంభించారు. జె.బి. మురళీకృష్ణ దర్శకత్వంలో రవి, జో జో జోస్‌, ఎన్‌. శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. ‘‘ఇదొక రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. పోసాని, ‘వెన్నెల’ కిశోర్‌లు కీలక పాత్రల్లో కనిపిస్తారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే చిత్రమిది’’ అన్నారు నిర్మాతలు. ‘‘జంబలకిడి పంబ’ టైటిల్‌ని బట్టి సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వినోదంతో పాటు, భావోద్వేగాలు పండించే పాత్రలో శ్రీనివాసరెడ్డి నటిస్తున్నారు’’ అని దర్శకుడు తెలిపారు.
entertainment
4,587
30-04-2017 00:27:50
ప్రపంచమంతా‘బాహుబలి 2’ ప్రభంజనం
సల్మాన్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌, హృతిక్‌ రోషన్‌.. వంటి హీరోలు సైతం నోళ్లు తెరుచుకొని అచ్చెరువొందుతున్న సందర్భమిది. భారతీయ సినిమా రికార్డులంటే ఈ హీరోల్లో ఎవరో ఒకరుండాలనే రూల్‌ మారిపోయింది. దక్షిణాదికి చెందిన.. అదీ ఒక తెలుగు హీరో, ఒక తెలుగు దర్శకుడు కలిసి దేశవ్యాప్తంగా పేరుండే హిందీ సూపర్‌స్టార్‌లను వెనక్కు నెట్టేశారు. ఇప్పుడు తెలుగు రాషా్ట్రలే కాదు, దక్షిణాదే కాదు, మొత్తం దేశమంతా ‘బాహుబలి 2’ మేనియాతో ఊగి పోతోంది. ఆ మాటకొస్తే.. అమెరికా, గల్ఫ్‌, మరికొన్ని ఇతర దేశాల్లోనూ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ సృష్టిస్తున్న కలెక్షన్లు సునామీని తలపిస్తున్నాయని కోమల్‌ నహతా వంటి బాలీవుడ్‌ ట్రేడ్‌ విశ్లేషకులే చెబుతున్నారంటే.. ఆ సినిమా ప్రభంజనం ఎలా ఉందో ఊహించుకోవాల్సిందే. ‘‘ఇది పిచ్చి. ఇవాళ ‘బాహుబలి 2’ కలెక్షన్లు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఇది సునామీ. మునుపటి బాక్సాఫీస్‌ రికార్డులనన్నింటినీ తుడిచిపెట్టే సునామీ. అవును.. అన్నింటినీ. ఈ సినిమా ప్రతి రోజూ ఓ చరిత్రను సృష్టించనుంది.  ఇది కేవలం ఒక సినిమా కాదు. అరుదుగా వచ్చే అద్భుతం! హిందీ వెర్షన్‌ మొదటి రోజు రూ. 41.5 కోట్లు (నెట్‌) వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్‌ చరిత్రను లిఖించింది’’ అని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా కోమల్‌ నహతా ప్రశంసల వర్షం కురిపించారు. తొలి రోజు వసూళ్లలో సల్మాన్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌ సినిమాల రికార్డుల్ని ‘బాహుబలి 2’ అధిగమించడం విశేషం. అమీర్‌ ‘దంగల్‌’ సినిమా తొలి రోజు రూ. 29.78 కోట్లు (నెట్‌), సల్మాన్‌ ‘సుల్తాన్‌’ తొలి రోజు రూ. 36.54 కోట్లు (నెట్‌) వసూలు చేశాయి. ‘‘రిపబ్లిక్‌ డే కాదు.. ఈద్‌ కాదు.. స్వాతంత్య్ర దినోత్సవం కాదు.. దీపావళి కాదు.. క్రిస్టమస్‌ కాదు.. సెలవురోజు కాకపోయినా బాక్సాఫీస్‌ వద్ద ‘బాహుబలి 2’ మేజిక్‌ చేసింది’’ అని మరో బాలీవుడ్‌ ట్రేడ్‌ పండితుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. బాక్సాఫీస్‌ వసూళ్లకు సంబంధించి సొంత నెట్‌వర్క్‌తో లెక్కలు తెప్పించుకొనే మరో బాలీవుడ్‌ విశ్లేషకుడు కమాల్‌ ఆర్‌. ఖాన్‌ అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 201 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిందని తేల్చాడు.  ‘‘బాహుబలి 2 మొదటి రోజు ప్రపంచవ్యాప్త గ్రాస్‌ కలెక్షన్‌లు: ఇండియా - రూ. 145 కోట్లు, యు.ఎస్‌.ఎ. - రూ. 33 కోట్లు, గల్ఫ్‌ - 11 కోట్లు, రెస్ట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ - 12 కోట్లు.. మొత్తం - రూ. 201 కోట్ల గ్రాస్‌’’ అని ఆయన ట్వీట్‌ చేశాడు. అయితే ఒక సమీక్షకునిగా ఆ సినిమా తనకు నచ్చలేదని ఆయన తేల్చాడు. దానిని ‘క్రాప్‌’ (చెత్త)తో పోల్చాడు. ‘‘ఇలాంటి పెద్ద చరిత్రను ‘బాహుబలి 1 ’ సృష్టించినట్లయితే నేను చాలా ఆనందపడేవాడ్ని. కానీ అలాంటి చరిత్రను ‘బాహుబలి 2’ వంటి క్రాప్‌ సృష్టించడం బాధగా ఉంది. రికార్డులు సృష్టించడానికి ‘మొఘల్‌-ఎ-ఆజమ్‌’ అవసరం లేదనీ, అడ్డూ అదుపూలేని ‘హైప్‌’తో ఒక క్రాప్‌ ఫిల్మ్‌ కూడా చరిత్రను సృష్టించగలదనీ ‘బాహుబలి 2’ స్పష్టం చేసింది’’ అని ఆయన ట్వీట్‌ చేశాడు. ఎవరెన్ని రకాల వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేసినా బాక్సాఫీస్‌ వద్ద ‘బాహుబలి 2’ ప్రకంపనాలు, ప్రభంజనాలు సృష్టిస్తూ దూసుకోపోతోందనేది వాస్తవం.
entertainment
543
14-09-2017 02:14:31
మళ్లీ రిలయన్స్‌ మెడకు ఎక్సైజ్‌ ఎగవేత కేసు
న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల నాటి ఎక్సైజ్‌ సుంకం ఎగవేత కేసు మళ్లీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మెడకు చుట్టుకుంది. ఈ కేసు నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్ కు విముక్తి కల్పిస్తూ అక్టోబర్‌, 2015న గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు బుధవారం కొట్టి వేసింది. పాతాళగంగ దగ్గర ఏర్పాటు చేసిన పాలిస్టర్‌ ఫిలమెంట్‌ యార్న్‌ (పిఎఫ్‌వై) ప్లాంట్‌ కోసం దిగుమతి చేసుకున్న యంత్రాల విలువను తక్కువగా చూపడం ద్వారా రూ.120 కోట్ల సుంకం ఎగవేసిందని అహ్మదాబాద్‌లోని సూపరింటెండెంట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ ఆగస్టు 4, 1987న రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సపై ఒక కేసు నమోదు చేసింది. దాంతో తమ ముందు హాజరు కావాలని స్థానిక ట్రయల్‌ కోర్టు కంపెనీకి నోటీసులు జారీ చేసింది.  అపుడు ఈ కేసు నుంచి రిలయన్స్‌ను తప్పించేందుకు సెంట్రల్‌ ఎక్సైజ్‌ నిబంధనల్లో కొన్నిటిని మినహాయిస్తూ ప్రభుత్వం మే 20, 1994న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మినహాయింపు ఆధారంగా తమ కేసు కొట్టి వేయాలని కంపెనీ ట్రయల్‌ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అయితే కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చి మార్చి, 2013లో అభియోగాలు నమోదు చేసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దీనిపై గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వమే ఎక్సైజ్‌ నిబంధనల్లో మినహాయింపు ఇచ్చినందున ట్రయల్‌ కోర్టు దీనిపై అభియోగాలు నమోదు చేయడం సరికాదని హైకోర్టు అక్టోబర్‌, 2015లో కేసు కొట్టివేసింది. ఎక్సైజ్‌ శాఖ దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఏ షరతులకు లోబడి రిలయన్స్‌ ఇండస్ట్రీస్ కు ఈ మినహాయింపు ఇచ్చారో స్పష్టం చేయనందున, అభియోగాలు నమోదు చేసి విచారించాల్సిందేనని బుధవారం స్పష్టం చేసింది. ‘కంపెనీపై పన్ను ఎగవేత అభియోగం నమోదైంది.
business
18,191
18-01-2017 01:43:18
దావోస్‌లో.. ‘సమాజ సేవిక’ షకీరా
దావోస్‌, జనవరి 17: బెల్లీ డాన్సులతో ప్రపంచవ్యాప్తంగా సంగీతప్రియుల హృదయాలను కొల్లగొట్టిన కొలంబియన్‌ సింగర్‌, డాన్సర్‌, పాటల రచయిత్రి.. యునిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌.. షకీరా దావో్‌సలో మెరిసింది. ఏదో ప్రదర్శన ఇవ్వడానికి కాదు. విద్యావ్యాప్తి, శిశు అభివృద్ధి దిశగా కొలంబియాలో తాను చేస్తున్న కృషి గురించి వివరించడానికి. ‘ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై ప్రసంగించిన ఆమె.. ‘నేటి బాలలే రేపటి వాణిజ్యాన్ని నడిపే వ్యాపారవేత్తలు. వారి సామర్థ్యం రేపటి సమాజానికి ఒక రూపు కల్పిస్తుంది, రేపటి సమస్యలను పరిష్కరిస్తుంది’ అంటూ ఉత్తేజపూర్వకంగా మాట్లాడారు. బేర్‌ఫుట్‌ ఫౌండేషన్‌ ద్వారా కొలంబియాలో చిన్నారులకు తోడ్పాటునందించేందుకు కృషి చేస్తున్న షకీరాను డబ్ల్యూఈఎఫ్‌ ‘హ్యుమానిటేరియన్‌ అవార్డు’తో సత్కరించింది.
nation
11,809
22-09-2017 01:41:58
రోహింగ్యాలు శరణార్థులు కాదు!
వాళ్లను వెళ్లగొట్టి తీరతాం:రాజ్‌నాథ్‌హక్కుల ఉల్లంఘనే: బాలల కమిషన్‌న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: రోహింగ్యాలు అక్రమంగా వలస వచ్చిన వారే కానీ శరణార్థులు కాదని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. వాళ్లను దేశం నుంచి వెళ్లగొట్టి తీరతామని చెప్పారు. జాతీయ మానవ హక్కుల సంఘం సదస్సులో ఆయన మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి శరణార్థుల తీర్మానంపై భారత్‌ సంతకం చేయనందున వెనక్కి పంపడంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని చెప్పారు. రోహింగ్యాలను దేశం నుంచి వెళ్లగొట్టకుండా నిలువరించాలని కోరుతూ బెంగాల్‌ బాలల హక్కుల కమిషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఇద్దరు రోహింగ్యాలు తమను వెళ్లగొట్టరాదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మీ రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలను వెనక్కి పంపించేందుకు గుర్తించాలంటూ కేంద్రం రాష్ట్రాలకు ఇటీవల లేఖలు రాసింది. మియన్మార్‌లో పథకం ప్రకారం రోహింగ్యాలను ఊచకోత కోస్తున్నారని, వారు ప్రాణభీతితో వస్తే ఉగ్రవాద ముద్ర వేయడం అసమంజసమని బాలల కమిషన్‌ వ్యాఖ్యానించింది. సంఘ్‌ మాజీ నేత గోవిందాచార్య కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రోహింగ్యాలను దేశం నుంచి వెళ్లగొట్టాలని, వాళ్లు దేశ భద్రతకు ప్రమాదమని, వనరులకు భారమని వ్యాఖ్యానించారు. మరోపక్క మియన్మార్‌లో రోహింగ్యా శరణార్థుల కోసం వస్తున్న విదేశీ సాయం ట్రక్కుపై 300 మంది దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ట్రక్కు వెంట వచ్చినవారు ప్రాణభయంతో పరుగులు తీశారు. బంగ్లాలో మానవతా సాయంతో వస్తున్న ట్రక్కు బోల్తాపడి 9 మంది మరణించారు.
nation
5,127
15-05-2017 15:19:47
తల్లి అయ్యాక మరో అడుగు ముందుకేసిన కరీనా
ఇటీవలే ఓ బిడ్డకు తల్లైన ఆ స్టార్ హీరోయిన్... ఇకపై అమ్మతనంపై క్లాసులు తీసుకోబోతోందట. ఇంతకూ ఎవరా ముద్దుగుమ్మ? ఏమా కథ?.. తెరపై ఎన్ని వయ్యారాలు పోయినా, తెరవెనుక జనాల అటెన్షన్ కోసం ఎంతగా ఆరాట పడినా.. తల్లి కాబోతున్నాం అనేసరికి... ఎలాంటి తారామణి అయినా అండర్ గ్రౌండ్‌కు వెళ్ళిపోవడం సహజం. కానీ, ఇలాంటి వాటికి చెల్లు చీటీ ఇచ్చేసిన కరీనా కపూర్ ఆధునిక అమ్మకు అచ్చమైన అంబాసిడర్‌గా మారింది. నిండు గర్భిణిగా ఉన్నప్పుడు కూడా ఫ్రెండ్స్‌తో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేసిన కరీనా... ప్రతి మహిళ జీవితంలో అమ్మతనం ఓ సాధారణ విషయం అని చాటిచెప్పింది. అంతేకాదు... దాని కోసం కెరీర్‌ను త్యాగం చేయాల్సిన అవసరం కూడా లేదని నిరూపిస్తోంది. అయితే... ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అమ్మలకే పాఠాలు చెప్పే స్థాయికి చేరుకుందీ అమ్మడు. కరీనా పెద్ద ఆడపడుచు, నటి సోహా అలీ ఖాన్ ఇటీవలే తాను తల్లికాబోతున్న విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడిప్పుడే అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న సోహా గురించి బెబో ఎంతో కేర్ తీసుకుంటోందట. ఎప్పుడేం తినాలి, ఏం తాగాలి వంటి విషయాలన్నీ... స్వయంగా చెబుతోందట. ఈ విషయాన్ని సోహా తన నోటితో తానే చెప్పడం మరో విశేషం. ఏమైనా కరీనా ఎక్స్ పీరియెన్స్ సోహాకు బాగానే ఉపయోగపడుతుందని చెప్పాలి మరి. కరీనా 'అమ్మపాఠాలు' మొదలు పెట్టేసిందా?
entertainment
18,657
23-11-2017 01:19:10
హ్యాకర్లకు లక్ష డాలర్లు చెల్లించిన ఉబెర్‌
కాలిఫోర్నియా, నవంబరు 22: గత ఏడాది చివర్లో 5.7 కోట్లమంది యూజర్ల డేటా హ్యాక్‌ అయినట్టు ఉబెర్‌ తాజాగా బయటపెట్టడం సంచలనంగా మారింది. హ్యాకర్లకు లక్ష డాలర్లు సమర్పించుకున్నట్టు కూడా వెల్లడించింది. పేర్లు, ఈమెయిల్‌ అడ్రె్‌సలు, ఫోన్‌ నంబర్లతోబాటు అమెరికాలోని ఆరు లక్షలమంది డ్రైవర్ల లైసెన్స్‌ నంబర్ల సమాచారాన్ని ఇద్దరు హ్యాకర్లు కొల్లగొట్టినట్టు ఉబెర్‌ తెలిపింది. అయుతే డేటా హ్యాక్‌ అయిన విషయాన్ని గుర్తించిన వెంటనే బాధితులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే హ్యాకింగ్‌ వ్యవహారం గురించి తనకు కూడా ఇటీవలే తెల్సిందని ఉబెర్‌ సీఈవో డారా ఖోస్రోషహి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగించామని ఆయన వెల్లడించారు.
nation
2,410
19-01-2017 00:06:38
పంచాలంటే ముందు సంపద సృష్టించాలి
దావోస్‌: ఆర్థికాభివృద్ధికి స్వేచ్ఛా మార్కెట్‌ విధానాలే మేలని రిలయన్స్‌ ఇండసీ్ట్రస్‌ అధినేత ముకేష్‌ అంబానీ స్పష్టం చేశారు. డబ్ల్యుఈఫ్‌ వార్షిక సమావేశాల సందర్భంగా బుధవారం జరిగిన ఒక సదస్సులో ఆయన ఈ విషయం చెప్పారు. సంపద పంపిణీ జరగాలంటే ముందు సంపద సృష్టి జరగాలన్నారు. ప్రపంచ సంపదలో సగం ఒక శాతం సంపన్నుల దగ్గరే కేంద్రీకృతమైందన్న వార్తల నేపథ్యంలో అంబారీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘సంపద అంటూ సృష్టిస్తే దాన్ని పంపిణీ చేయడం చాలా తేలిక. ఈ విషయంలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. స్వేచ్ఛా మార్కెట్‌ ఇందుకు అనువుగా ఉంటుంది’ అన్నారు. వినూత్న టెక్నాలజీకి, నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత సిద్ధంగా ఉందని అంబానీ చెప్పారు. కొత్త టెక్నాలజీకి అలవాటు పడడంతో భారతీయులు ఎంత వేగంగా, ఉత్సాహంగా ముందుకొస్తారనేందుకు ఇటీవలి పెద్ద నోట్ల రద్దే ఉదాహరణ అన్నారు. సదస్సులో మాట్లాడిన ఇన్ఫోసిస్‌ సిఇఒ విశాల్‌ సిక్కా కూడా ఈ విషయంలో అంబానీ అభిప్రాయాన్ని బలపరిచారు. ‘నాలుగో పారిశ్రామిక విప్లవం, కృత్రిమ మేధస్సు, ఇతర సాంకేతిక అవాంతరాల గురించి మాట్లాడేటపుడు మనం సమాజంలో ఎలాంటి పెద్ద విభజన సృష్టించకూడదు’ అన్నారు.  దక్షిణాసియానే కీలకం : నిర్మలా సీతారామన్‌
business
9,369
21-01-2017 08:53:27
నాన్న ముందే రొమాంటిక్‌ సన్నివేశాలు చేయాల్సివచ్చింది: ఐశ్వర్య
యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కూతురు ఐశ్వర్య ‘పట్టత్తుయానై’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేసింది. విశాల్‌ హీరోగా నటించిన ఆ సినిమా పరాజయం పాలవడంతో ఐశ్వర్యకు రావాల్సినంత పేరు రాలేదు. దీంతో స్వయంగా అర్జున్‌ దర్శకుడి అవతారమెత్తి తన కూతురు హీరోయిన్‌గా తమిళ, కన్నడ భాషల్లో ఓ సినిమా నిర్మిస్తున్నాడు.
entertainment
4,327
24-01-2017 01:57:18
కర్పూరీ ఠాకూర్‌ స్ఫూర్తి ఏదీ?
కర్పూరీ ఠాకూర్‌ ఒక స్వాతంత్ర్య పోరాటవీరుడు. గాంధీ, లోహియా, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌, అంబేడ్కర్‌ లాంటి జాతీయ నేతలతో పనిచేశారు. ఆధునిక భారతాన్ని నిర్మించటం కోసం జరిగిన అన్ని ప్రయత్నాల్లో తనదంటూ ముద్రవేసిన సామ్యవాది. నిజాయితీకి మారుపేరు. అతిసాధారణ మంగలి కుటుంబంలో 1924 జనవరి 24న బీహార్‌లోని సమస్తీపూర్‌ జిల్లా పితౌజియా గ్రామంలో జన్మించారు.  ప్రపంచానికి సమానతా ధర్మం అందించిన బుద్ధుడు జన్మించిన ప్రాంతంలో కర్పూరీ ఠాకూర్‌ జనహితం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు. అందువల్లే ఆయన్ని ‘జననాయక్‌’ అని ప్రజలు నేటికీ పిలుచుకుంటున్నారు. దేశ రాజకీయాల మీద, ప్రజా జీవితం మీద మరచిపోలేని ప్రభావం వేసిన కర్పూరీ ఠాకూర్‌ 93వ జయంతిని అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు గొప్పగా జరుపుకుంటున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత బీహార్‌ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. లోహియా అనుచరుడిగా, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ మిత్రుడిగా ఆయన బిహార్‌ రాజకీయాలను శాసించే స్థితికి ఎదిగారు. బిహార్‌ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి ఉపముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఎనలేని సేవ చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా వున్న కాలంలోనే బీసీ రిజర్వేషన్‌ను విద్యా, ఉద్యోగ నియామకాల్లో 1978లో ప్రవేశపెట్టారు.  ఈ నిర్ణయం బిహార్‌ సామాజిక జీవితాన్ని మార్చేసింది. బీసీ రిజర్వేషన్లు బలవంతులైన కొన్ని కులాలకే ఉపయోగపడకుండా, ఎంబీసీలకు సబ్‌కోటా కూడా ఆయనే కేటాయించి సామాజిక న్యాయ సూత్రాన్ని పాటించారు. నిజానికి, కర్పూరీ ఠాకూర్‌ చేపట్టిన ఈ విధానం దేశవ్యాప్తంగా అమలుకావాలన్న డిమాండ్‌ మేరకే మండల్‌ కమిషన్‌ వచ్చింది.బీసీ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌. మద్యపానం రద్దు, అణగారిన విద్యార్థులకు ఫీజు రద్దు వంటి వాటితో పాటు, బిహార్‌ను ఆధునికత దిశగా నడిపించే ఆలోచనలెన్నో చేశారు. సమర్థుడైన అడ్మినిస్ట్రేటర్‌. కాన్షీరాం నిర్మించిన బహుజన ఉద్యమానికి బిహార్‌లో సహాయ సహకారాలు అందించారు. కర్పూరీ ఠాకూర్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన ఎంబీసీ, బిసీ సమాజం మాత్రం రాజకీయ అనాసక్తితో వున్నది. బీసీల్లో ఎదిగిన కులాలు, ఎదగాలని ఆరాటపడే కులాలే రాజ్యాంగ ఫలాలను దక్కించుకోవాలని ఘర్షణ పడుతున్నాయి. కానీ, ఆధిపత్య రాజకీయాలను అర్థం చేసుకోలేని ఎంబీసీలు చాలా నష్టపోతున్నారు. ఎంబీసీల అనైక్యత, రాజకీయ నిరాసక్తతను ఆసరా చేసుకొని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. కర్పూరీ ఠాకూర్‌ స్ఫూర్తితో రాజకీయ చైతన్యం పెంచుకుని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి అవసరమైన కృషిని మొదలుపెట్టకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంబీసీలు, డీఎన్టీలు చాలా నష్టపోతారు. సూర్యపల్లి శ్రీనివాస్‌ప్రధాన కార్యదర్శి, ఎంబీసీ సంక్షేమ సమితి(నేడు కర్పూరీ ఠాకూర్‌ జయంతి)
editorial
13,226
16-01-2017 00:25:12
సెకండరీ విద్యలో ఇంగ్లిషు తప్పనిసరి
న్యూఢిల్లీ, జనవరి 15(ఆంధ్రజ్యోతి): సెకండరీ విద్యలో ఇంగ్లీషు భాషను తప్పనిసరిగా బోధించాలని కేంద్ర కార్యదర్శుల బృందం సూచించింది. విద్య, సామాజిక అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటుచేసిన ఈ బృందం ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేసింది. ఇంగ్లీషుతో పాటు సైన్సును ప్రోత్సహించాలని నివేదికలో పేర్కొంది. ఆరో తరగతి నుంచి కచ్చితంగా ఇంగ్లీష్ ను బోధించాలని ప్రతిపాదించింది. దీంతోపాటు గ్రామాల్లో ప్రతీ బ్లాకుకు కనీసం ఒక ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. సైన్స్‌ విద్య సదుపాయాలను కల్పించాలని, 5 కిలోమీటర్ల పరిధిలో ఒక సైన్స్‌ విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. అన్ని రాష్ట్రాలతో సుదీర్ఘంగా చర్చించి రూపొందించిన తుది నివేదికను శుక్రవారం ప్రధానికి అందజేసింది. కాగా, 1968లో రూపొందించిన జాతీయ విద్యా విధానంలో 3 భాషల సూత్రాన్ని పొందుపరిచిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం మాతృభాష, జాతీయ భాష అయిన హిందీతో మరో భాష బోధించాల్సి ఉంటుంది. కానీ ఇంగ్లీషు తప్పనిసరి అని లేదు. ఇప్పటి వరకు కేవలం సీబీఎస్ సీ స్కూళ్లలోనే 8వ తరగతి వరకు ఇంగ్లీషు తప్పనిసరిగా ఉంది. మరోవైపు, ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు మాతృభాషలోనే బోధించాలని, ఏ స్థాయిలోకూడా ఇంగ్లీష్ ను తప్పనిసరి చేయవద్దని ఆర్‌ఎస్ ఎస్‌ అనుబంధ సంస్థ శిక్ష సంస్కృతి ఉత్తన్‌ న్యాస్‌(ఎస్ఎస్ యూఎన్‌) కేంద్ర మానవ వనరుల శాఖకు సూచించింది. విద్యా ప్రమాణాలను, నాణ్యతను పెంచడానికి చర్యలు తీసుకోవాలని కార్యదర్శుల బృందం సూచించింది. ఆరోగ్యకరమైన పోటీతోనే నాణ్యత, ప్రమాణాలు పెరుగుతాయని, పోటీతత్వం పెంచడానికి విద్యా ప్రమాణాలపై రాష్ట్రాలకు ర్యాంకింగులు ఇవ్వాలని కమిటీ సూచించింది. పాఠశాల విద్య నాణ్యత సూచి(ఎస్ ఈక్యూఐ)ని ఏర్పాటుచేసి రాష్ట్రాల విద్యను పర్యవేక్షించాలని సిఫారసు చేసింది. వార్షిక ఫలితాలను తెలుసుకునేందుకు థర్డ్‌ పార్టీ సర్వేలను కూడా పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. డిటెన్షన్‌ పాలసీ అమలు నిర్ణయాన్ని రాష్ట్రాలకు అప్పగించాలని, ఈ అంశానికి సంబంధించి విద్యా హక్కు చట్టం ప్రకారం నడుచుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని స్పష్టంచేసింది. కాగా, 25 శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రతీ జిల్లాతో పాటు మైనారిటీల జనాభా అధికంగా ఉండే ప్రాంతాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించాలని కీలక ప్రతిపాదన చేశారు. దేశవ్యాప్తంగా 50 అత్యుత్తమ కాలేజీలను గుర్తించి వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని సూచించింది. పరిపాలన, ఎకడమిక్‌, ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలని, ఫీజులను నిర్ణయించే అధికారం వారికే ఇవ్వాలని తెలిపింది.
nation
1,510
22-07-2017 00:29:02
ఎయిర్‌ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణపై జిఔం తొలి భేటీ
న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందం (జిఔం) శుక్రవారంనాడిక్కడ తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు, రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు, విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పాల్గొన్నారు. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏయే అంశాలను చర్చించారో మాత్రం ఎవరూ వెల్లడించలేదు. ఇది మార్కెట్‌ను ప్రభావితం చేసే విషయం కాబట్టి ఏ వివరాలను తెలియజేయలేమని అశోక్‌ గజపతి రాజు, పౌర విమానయాన శాఖ సెక్రటరీ ఆర్‌ఎన్‌ చౌబే అన్నారు. ఎయిర్‌ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ గత నెలలో సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
business
17,986
24-06-2017 12:00:23
అగ్ని కీలల్లో అమ్మానాన్నలను విడిచిపెట్టలేక...
లండన్: జూన్ 14న లండన్‌లోని 24 అంతస్థుల భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 78 మంది సజీవ దహనమయిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో 90 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటన్‌లో గత మూడు దశాబ్ధాల్లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదంగా నమోదైంది. అగ్ని కీలల్లో చిక్కుకుని భవనం కూలిపోతున్నసమయంలో మొత్తం 120 ఫ్లాట్లలో 600 మంది ఉన్నారు. విద్యుత్ లేకపోవడంతో మొబైల్ ఫోన్, టార్చిలైట్ వెలుగులోనే బయటపడే ప్రయత్నాలు చేశారు. కొంతమంది కిటికీల్లో నుంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో చాలా కుటుంబాలు బూడిదయ్యాయి.  వాటిలో ఒక కుటుంబం దీనగాథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హుస్నాబేగం, ఆమె ఇద్దరు సోదరులు హనీఫ్(26), హమీద్)లతో పాటు వారి వృద్ధ తల్లిదండ్రులు కలిసి ఒక ఫ్లాట్‌లో ఉంటున్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో అగ్నికీలలు వీరి ఫ్లాట్‌ను చుట్టుముట్టడంతో ఈ ఐదుగురూ సజీవ దహనమైపోయారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ముగ్గురు పిల్లలు.. తమ తల్లి దండ్రులను ఒంటరిగా వదిలి వేయడం ఇష్టంలేక, వారితోపాటు దహనమైపోదామని నిర్ణయించుకున్నారు. ఈ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన ఒక వ్యక్తి మీడియాకు పలు వివరాలు తెలిపాడు. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో వారు ఫోనుచేసి పరిస్థితి వివరించారన్నాడు. 80 సంవత్సరాలు పైబడిన తల్లిదండ్రులను బయటకు తీసుకురాలేని పరిస్థితి ఉందని చెప్పారు. వారిని విడిచిపెట్టి బయటకు రావడం ఇష్టం లేదన్నారు. అలాగే అందరూ బయట పడేందుకు మార్గం లేదని తెలిపారు. దీంతో తల్లిదండ్రులతో పాటే సజీవ దహనమై పోవాలని నిర్ణయించుకున్నారని వారి సన్నిహితుడు వివరించాడు.
nation
4,216
28-12-2017 00:26:27
విరగపండుతున్న చావుల పంట
రాను రాను అప్రధాన వార్తలుగా మారిపోయిన రైతు ఆత్మహత్యలు, తక్కిన సమాజంలో ఎటువంటి స్పందనలనూ కలిగించలేకపోతున్నాయి. రాజకీయ నాయకులు, పాలకులు వాటి గురించి మాట్లాడకున్నా చెల్లిపోతున్నది. ప్రాణనష్టం, బతుకు తెరువుల సంక్షోభం– ఇవన్నీ సరే, సమాజం కోల్పోతున్న సున్నితత్వం ఎంతటి నష్టదాయకమైనది? మిట్ఠీ– అనే హిందీ సినిమా చూశాక కొంత దుఃఖమూ కొంత నేరభావన కలిగి తీరతాయి. ఇంకా సెన్సార్‌ కాని ఆ సినిమాను కథాంశం మీద ఆసక్తి ఉన్న కొందరికి నిర్మాతలు ప్రత్యేకంగా చూపించారు. ఆ సినిమా కంటె దాని వెనుక ఉన్న ప్రయత్నం గొప్పది. రైతు ఆత్మహత్యలను ఇతివృత్తంగా తీసుకుని, కారణాలను చర్చిస్తూ, పరిష్కారాలను సూచిస్తూ సాగిన కథనం ఆ సినిమాలో ఉన్నది. ‘డెవలప్‌మెంట్‌ డైలాగ్‌’ అనే సంస్థ నిర్మాణంలో, 130 మంది రైతుల, శ్రేయోభిలాషుల ఉమ్మడి పెట్టుబడితో రూపొందించిన ‘మిట్ఠీ’కి అనేక లఘు, డాక్యుమెంటరీ చిత్రాల దర్శకుడు అన్షుల్‌ సిన్హా దర్శకత్వం వహించారు. ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా పెట్టుబడి సమీకరణ జరిగింది. రైతుల కోసం ఉద్దేశించిన ఈ సందేశాత్మక చిత్రం పాక్షికంగా డాక్యుమెంటరీ తరహాలోను, కొంత కథాచిత్రం తీరులోను ఉన్నది. కూరగాయలు పండించే రైతులు మధ్యదళారీల దోపిడీ వల్ల తగిన ఆదాయం పొందలేక కుంగిపోతారు. పత్తి వ్యవసాయంలోకి దిగుతారు. భూమిని కోల్పోయి పట్టణంలో హమాలీలుగా మారతారు. ఒకరు ఆత్మహత్య చేసుకుంటారు. ఒకరు అనారోగ్యంతో మరణిస్తారు. వ్యవసాయ సంక్షోభం మీద పరిశోధన చేస్తున్న ఒక యువతి (తాను స్వయంగా ఒక బాధిత వ్యవసాయ కుటుంబానికి చెందినది) ఆ గ్రామ రైతులను రసాయన రహిత వ్యవసాయంలోకి మళ్లిస్తుంది. రుణగ్రస్తమై, అమ్మకానికి నిలిచిన ఆ ఊరు చివరకు రసాయన రహితంగా మారడంతో కథ సుఖాంతం అవుతుంది. కథాంశాన్ని నిర్వహించిన తీరు కానీ, చూపిన పరిష్కారం కానీ ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చు. దేశవ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొంటున్న వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం ప్రకృతి వ్యవసాయమో, సేంద్రియ వ్యవసాయమో, సాంప్రదాయిక వ్యవసాయమో అవుతుందని అనుకోవడం కష్టం. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులకు భిన్నమైన, సమాంతరమైన వ్యవస్థను రైతులు సమష్టిగా నిర్మించుకుని, ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మగలిగితే, దాని వల్ల ఫలితాలు ఉండవని కాదు. అటువంటి విడి ప్రయత్నాలు కొన్ని నమూనాలను సృష్టించగలవు, పరిష్కార అన్వేషణకు ప్రభుత్వాలకు తోడ్పడగలవు. అటు పోలీహౌస్‌లు కానీ, ఇటు ప్రకృతి సేద్యం కానీ వ్యవసాయ సంక్షోభానికి చికిత్సలు ఇవ్వలేవు. రైతుల గోసను ప్రభుత్వాలు వినిపించుకోవడం లేదు కాబట్టి, చెప్పేదేదో రైతాంగానికే చెప్పాలి కాబట్టి, స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి పరిష్కారాలను కూడా సూచించక తప్పదు. బహుళజాతి సంస్థల నుంచి విత్తనాలు కొనకుండా, రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు కొనకుండా వ్యవసాయం చేస్తామని, మార్కెట్‌యార్డులకు వెళ్లకుండా ప్రత్యామ్నాయ అంగళ్లను తెరుస్తామని అంటే, ప్రభుత్వాలు ఊరుకుంటాయా? అయితే, మిట్ఠీ సినిమా, మన విస్మరణలోకి జారిపోయిన ఆత్మహత్యల అంశాన్ని బలంగా గుర్తుచేసింది. ఇంకా కొనసాగుతున్నాయని, ఇంకా కొనసాగే పరిస్థితులే ఉన్నాయని చెప్పింది. రాను రాను అప్రధాన వార్తలుగా మారిపోయిన ఆత్మహత్యలు, తక్కిన సమాజంలో ఎటువంటి స్పందనలనూ కలిగించలేకపోతున్నాయి. రాజకీయ నాయకులు, పాలకులు వాటి గురించి మాట్లాడకున్నా చెల్లిపోతున్నది. ప్రాణనష్టం, బతుకు తెరువుల సంక్షోభం– ఇవన్నీ సరే, సమాజం కోల్పోతున్న సున్నితత్వం ఎంతటి నష్టదాయకమైనది? నల్లగొండ జిల్లా మునుగోడు మండలానికి చెందిన సుక్క యాదయ్య అనే రైతు నాలుగేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు, ఏటేటా నష్టపోతూనే ఉన్నాడు. అతని భార్యకు జబ్బు చేసింది. వైద్యానికి 4 లక్షలు అప్పు చేశాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పు, వైద్యం కోసం చేసిన అప్పు– అతని కంఠం మీద కత్తుల్లా మారాయి. అతను, అతని తల్లి కలిసి తాటికల్లులో పురుగుల మందు కలుపుకుని తాగి ప్రాణం తీసుకున్నారు. మెదక్‌ జిల్లా దుబ్బాక మండలానికి చెందిన పాతికేళ్ల ప్రవీణ్‌ ఎకరంన్నర పొలంలో పత్తి వేశాడు. నీటి కోసం రెండు బోర్లు తవ్వించాడు. నీరూ లేదు, పత్తీ దెబ్బతిన్నది. మూడు లక్షల అప్పుతీర్చే మార్గం లేక, చెట్టుకు ఉరిపోసుకున్నాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో 5 లక్షల బాకీ కుటుంబం కుటుంబం ఆత్మహత్యాయత్నం చేస్తే, తండ్రి, కొడుకు, కూతురు మరణించారు. భగవాన్‌రెడ్డి అనే ఆ రైతు పత్తి, వరి పంటలు వేశాడు. వాటి పెట్టుబడులకు, ఎంబీఏ చదువుతున్న కూతురు చదువుకు, గ్రూప్స్‌కు తయారవుతున్న కొడుకు శిక్షణకు అప్పులు చేశాడు. పంట దెబ్బతినడమూ, అప్పు తీరే దారి కనిపించకపోవడం వారి సామూహిక ఆత్మహత్యకు కారణాలు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో శ్రీశైలం అనే 40 సంవత్సరాల రైతు అప్పుచేసి తాను వేయించిన నాలుగు బోర్లూ విఫలం కావడంతో ఇంట్లోనే ఉరిపోసుకున్నాడు. మంచిర్యాల జిల్లాలో సిద్దం చంద్రయ్య అనే రైతూ, నిర్మల్‌ జిల్లాలో కదం ఆనందరావు అనే కౌలు రైతూ పంట విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ గత పదిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రైతుఆత్మహత్యలే. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో ఇరవైనాలుగేళ్ల వీరనాగప్ప అనే మిరప, పత్తి రైతు పంటనష్టానికి, గిట్టుబాటు ధర దొరకనందుకు కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే జిల్లాకు చెందిన గూడూరు మండలానికి చెందిన చిన్న వెంకటేసు అనే ఉల్లి, పత్తి, పొద్దుతిరుగుడు రైతు అధికవర్షాల వల్ల కలిగిన పంటనష్టాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగి చనిపోయారు. గుంటూరు జిల్లాలో వెల్దుర్తి మండలంలో సామినేని నరసింహారావు అనే మిరపరైతు వరుస పంట నష్టాలు భరించలేక పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. నకిలీ విత్తనాల కంపెనీలపై చర్య తీసుకోనందుకు నిరసనగా కృష్ణాజిల్లాకు చెందిన ముగ్గురు రైతులు విజయవాడలో ఒక పోలీసు స్టేషన్‌ ముందు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇవి కాక గత రెండునెలల కాలంలో పదిమందికి పైగా ఒక్క గుంటూరు జిల్లాలోనే ఆత్మహత్య చేసుకున్నారు. రైతాంగ ఆత్మహత్యలు రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు విస్తరించాయి. పరిహారాలు ఇచ్చేది లేదని భీష్మించుకున్న ప్రభుత్వాలు కొన్ని. పరిహారాలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వాలు కొన్ని. పరిహారం కాదు, పరిష్కారం సంగతి చూడమని ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది కూడా. రైతులు పెట్టిన పెట్టుబడుల ఆధారంగా కాదు, రైతుల అవసరాల దృష్ట్యా గిట్టుబాటు ధరలను నిర్ణయించాలన్న సూత్రం ఏలికలకు ఆమోదయోగ్యం కావడం లేదు. వైద్యం కోసం శుభ అశుభకార్యాల కోసం జరిగే ఖర్చులు, అప్పులు వ్యవసాయ వైఫల్యం కిందికి ఎందుకు వస్తాయి? అని అమాయకంగా ప్రశ్నిస్తారు నిపుణులు. ఏ కుటుంబానికైనా దానికి అవసరమైన అన్ని వ్యయాలూ, అది జీవనోపాధిగా ఎంచుకున్న రంగం నుంచే రావాలి కదా? వ్యవసాయ సంక్షోభానికి ప్రధానమైన కారణం, విధాన వాతావరణం. ప్రభుత్వం మీద తగినంత ఒత్తిడి రాకపోవడానికి కారణం, దేశంలోని అసంఖ్యాకులైన చిన్న, సన్నకారు రైతాంగం సంఘటితం కాకపోవడం. సాగునీరు అందకపోవడమే కొన్ని ప్రాంతాల్లో ప్రధాన సమస్యగా కనిపించవచ్చు. సాగునీరు లభించినా మార్కెట్‌ మీద నియంత్రణ లేకపోతే, రైతులకు దిక్కెవరు? ధరల స్థిరీకరణ నిధులు ఏర్పాటు చేస్తామని గొప్పగా చెబుతారు. అది ఆచరణలోకి మాత్రం రాదు. ఏ నేలలో ఏ పంట వేయాలో కూడదో చెప్పడానికి వ్యవసాయ విస్తరణ విభాగం పనిచేయదు. దళారీల మీద ఎటువంటి అదుపూ లేదు. పోనీ, మార్కెట్‌ ఆటుపోట్లు, వాతావరణం వల్ల కలిగే కష్టాలు రైతులే పడతారు, ఆత్మహత్యలకు పాల్పడకుండా వారికి ఏమైనా ఉపశమన చర్యలు తీసుకుంటారా అంటే అదీ లేదు. ఆత్మహత్యకు పాల్పడాలన్న ఆలోచన వచ్చిన రైతులకు నచ్చచెప్పి, ధైర్యం చెప్పడానికి కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఆ రాష్ట్రంలో రైతాంగ మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగింది. ఆత్మహత్యల నివారణకు రాజ్యాంగ బద్ధ శాశ్వత వ్యవస్థ ఉండాలని స్వరాజ్‌ ఇండియా నాయకుడు యోగేంద్ర యాదవ్‌ చేసిన సూచన అనుసరణీయం. సమస్య మొదలయ్యే తొలిదశలోనే గుర్తించి, తక్షణం జోక్యం చేసుకోగల సున్నితత్వం ఉన్న ప్రభుత్వ వ్యవస్థ అవసరం. ఉల్లి సంక్షోభం మొదలైన వెంటనే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఉంటే, అనేక ఆత్మహత్యలు జరగకుండా ఉండేవి. మహారాష్ట్రతో పాటు, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలు రైతు ఆత్మహత్యల గణాంకాలలో ముందున్నాయి. తెలంగాణ అవతరణ జరిగినప్పటి నుంచి ఇప్పటి దాకా రాష్ట్రంలో 3403 ఆత్మహత్యలు జరిగాయని రైతుస్వరాజ్య వేదిక లెక్కవేసింది. నియోజకవర్గాల వారీగా చూస్తే, అత్యధికంగా ఆత్మహత్యలు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో 113 జరిగాయి. 91 ఆత్మహత్యలతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో మంథని, హుస్నాబాద్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలవారీగా చూస్తే నల్లగొండ జిల్లా 381 ఆత్మహత్యలతో, సిద్దిపేట జిల్లా 282 ఆత్మహత్యలతో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. ఆయా స్థానాలకు, జిల్లాలకు చెందిన నాయకులు ఆ సంఖ్యలకు బాధ్యులని చెప్పలేము కానీ, తప్పకుండా ఆందోళన చెంది, నివారణ చర్యలు తీసుకోవలసిన బాధ్యత వారి మీద ఉన్నది. ప్రభుత్వం తాను చేయగలిగినంత చేసి, సమాజ సహకారాన్ని ఆహ్వానించగలిగితే, పూర్తిగా కాకపోయినా, కొంతైనా ఉపశమనం లభిస్తుంది. రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడెవడు? అనుకుంటే, వాళ్లు చస్తూనే ఉంటారు. మనం చూస్తూనే ఉంటాము. ఆ చావుల మీదుగా అభివృద్ధి రథం పరుగులు తీస్తూ ఉంటుంది. మిట్ఠీ– అనే హిందీ సినిమా చూశాక కొంత దుఃఖమూ కొంత నేరభావన కలిగి తీరతాయి. ఇంకా సెన్సార్‌ కాని ఆ సినిమాను కథాంశం మీద ఆసక్తి ఉన్న కొందరికి నిర్మాతలు ప్రత్యేకంగా చూపించారు. ఆ సినిమా కంటె దాని వెనుక ఉన్న ప్రయత్నం గొప్పది. రైతు ఆత్మహత్యలను ఇతివృత్తంగా తీసుకుని, కారణాలను చర్చిస్తూ, పరిష్కారాలను సూచిస్తూ సాగిన కథనం ఆ సినిమాలో ఉన్నది. ‘డెవలప్‌మెంట్‌ డైలాగ్‌’ అనే సంస్థ నిర్మాణంలో, 130 మంది రైతుల, శ్రేయోభిలాషుల ఉమ్మడి పెట్టుబడితో రూపొందించిన ‘మిట్ఠీ’కి అనేక లఘు, డాక్యుమెంటరీ చిత్రాల దర్శకుడు అన్షుల్‌ సిన్హా దర్శకత్వం వహించారు. ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా పెట్టుబడి సమీకరణ జరిగింది. రైతుల కోసం ఉద్దేశించిన ఈ సందేశాత్మక చిత్రం పాక్షికంగా డాక్యుమెంటరీ తరహాలోను, కొంత కథాచిత్రం తీరులోను ఉన్నది. కూరగాయలు పండించే రైతులు మధ్యదళారీల దోపిడీ వల్ల తగిన ఆదాయం పొందలేక కుంగిపోతారు. పత్తి వ్యవసాయంలోకి దిగుతారు. భూమిని కోల్పోయి పట్టణంలో హమాలీలుగా మారతారు. ఒకరు ఆత్మహత్య చేసుకుంటారు. ఒకరు అనారోగ్యంతో మరణిస్తారు. వ్యవసాయ సంక్షోభం మీద పరిశోధన చేస్తున్న ఒక యువతి (తాను స్వయంగా ఒక బాధిత వ్యవసాయ కుటుంబానికి చెందినది) ఆ గ్రామ రైతులను రసాయన రహిత వ్యవసాయంలోకి మళ్లిస్తుంది. రుణగ్రస్తమై, అమ్మకానికి నిలిచిన ఆ ఊరు చివరకు రసాయన రహితంగా మారడంతో కథ సుఖాంతం అవుతుంది. కథాంశాన్ని నిర్వహించిన తీరు కానీ, చూపిన పరిష్కారం కానీ ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చు. దేశవ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొంటున్న వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం ప్రకృతి వ్యవసాయమో, సేంద్రియ వ్యవసాయమో, సాంప్రదాయిక వ్యవసాయమో అవుతుందని అనుకోవడం కష్టం. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులకు భిన్నమైన, సమాంతరమైన వ్యవస్థను రైతులు సమష్టిగా నిర్మించుకుని, ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మగలిగితే, దాని వల్ల ఫలితాలు ఉండవని కాదు. అటువంటి విడి ప్రయత్నాలు కొన్ని నమూనాలను సృష్టించగలవు, పరిష్కార అన్వేషణకు ప్రభుత్వాలకు తోడ్పడగలవు. అటు పోలీహౌస్‌లు కానీ, ఇటు ప్రకృతి సేద్యం కానీ వ్యవసాయ సంక్షోభానికి చికిత్సలు ఇవ్వలేవు. రైతుల గోసను ప్రభుత్వాలు వినిపించుకోవడం లేదు కాబట్టి, చెప్పేదేదో రైతాంగానికే చెప్పాలి కాబట్టి, స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి పరిష్కారాలను కూడా సూచించక తప్పదు. బహుళజాతి సంస్థల నుంచి విత్తనాలు కొనకుండా, రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు కొనకుండా వ్యవసాయం చేస్తామని, మార్కెట్‌యార్డులకు వెళ్లకుండా ప్రత్యామ్నాయ అంగళ్లను తెరుస్తామని అంటే, ప్రభుత్వాలు ఊరుకుంటాయా? అయితే, మిట్ఠీ సినిమా, మన విస్మరణలోకి జారిపోయిన ఆత్మహత్యల అంశాన్ని బలంగా గుర్తుచేసింది. ఇంకా కొనసాగుతున్నాయని, ఇంకా కొనసాగే పరిస్థితులే ఉన్నాయని చెప్పింది. రాను రాను అప్రధాన వార్తలుగా మారిపోయిన ఆత్మహత్యలు, తక్కిన సమాజంలో ఎటువంటి స్పందనలనూ కలిగించలేకపోతున్నాయి. రాజకీయ నాయకులు, పాలకులు వాటి గురించి మాట్లాడకున్నా చెల్లిపోతున్నది. ప్రాణనష్టం, బతుకు తెరువుల సంక్షోభం– ఇవన్నీ సరే, సమాజం కోల్పోతున్న సున్నితత్వం ఎంతటి నష్టదాయకమైనది? నల్లగొండ జిల్లా మునుగోడు మండలానికి చెందిన సుక్క యాదయ్య అనే రైతు నాలుగేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు, ఏటేటా నష్టపోతూనే ఉన్నాడు. అతని భార్యకు జబ్బు చేసింది. వైద్యానికి 4 లక్షలు అప్పు చేశాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పు, వైద్యం కోసం చేసిన అప్పు– అతని కంఠం మీద కత్తుల్లా మారాయి. అతను, అతని తల్లి కలిసి తాటికల్లులో పురుగుల మందు కలుపుకుని తాగి ప్రాణం తీసుకున్నారు. మెదక్‌ జిల్లా దుబ్బాక మండలానికి చెందిన పాతికేళ్ల ప్రవీణ్‌ ఎకరంన్నర పొలంలో పత్తి వేశాడు. నీటి కోసం రెండు బోర్లు తవ్వించాడు. నీరూ లేదు, పత్తీ దెబ్బతిన్నది. మూడు లక్షల అప్పుతీర్చే మార్గం లేక, చెట్టుకు ఉరిపోసుకున్నాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో 5 లక్షల బాకీ కుటుంబం కుటుంబం ఆత్మహత్యాయత్నం చేస్తే, తండ్రి, కొడుకు, కూతురు మరణించారు. భగవాన్‌రెడ్డి అనే ఆ రైతు పత్తి, వరి పంటలు వేశాడు. వాటి పెట్టుబడులకు, ఎంబీఏ చదువుతున్న కూతురు చదువుకు, గ్రూప్స్‌కు తయారవుతున్న కొడుకు శిక్షణకు అప్పులు చేశాడు. పంట దెబ్బతినడమూ, అప్పు తీరే దారి కనిపించకపోవడం వారి సామూహిక ఆత్మహత్యకు కారణాలు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో శ్రీశైలం అనే 40 సంవత్సరాల రైతు అప్పుచేసి తాను వేయించిన నాలుగు బోర్లూ విఫలం కావడంతో ఇంట్లోనే ఉరిపోసుకున్నాడు. మంచిర్యాల జిల్లాలో సిద్దం చంద్రయ్య అనే రైతూ, నిర్మల్‌ జిల్లాలో కదం ఆనందరావు అనే కౌలు రైతూ పంట విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ గత పదిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రైతుఆత్మహత్యలే. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో ఇరవైనాలుగేళ్ల వీరనాగప్ప అనే మిరప, పత్తి రైతు పంటనష్టానికి, గిట్టుబాటు ధర దొరకనందుకు కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే జిల్లాకు చెందిన గూడూరు మండలానికి చెందిన చిన్న వెంకటేసు అనే ఉల్లి, పత్తి, పొద్దుతిరుగుడు రైతు అధికవర్షాల వల్ల కలిగిన పంటనష్టాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగి చనిపోయారు. గుంటూరు జిల్లాలో వెల్దుర్తి మండలంలో సామినేని నరసింహారావు అనే మిరపరైతు వరుస పంట నష్టాలు భరించలేక పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. నకిలీ విత్తనాల కంపెనీలపై చర్య తీసుకోనందుకు నిరసనగా కృష్ణాజిల్లాకు చెందిన ముగ్గురు రైతులు విజయవాడలో ఒక పోలీసు స్టేషన్‌ ముందు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇవి కాక గత రెండునెలల కాలంలో పదిమందికి పైగా ఒక్క గుంటూరు జిల్లాలోనే ఆత్మహత్య చేసుకున్నారు. రైతాంగ ఆత్మహత్యలు రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు విస్తరించాయి. పరిహారాలు ఇచ్చేది లేదని భీష్మించుకున్న ప్రభుత్వాలు కొన్ని. పరిహారాలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వాలు కొన్ని. పరిహారం కాదు, పరిష్కారం సంగతి చూడమని ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది కూడా. రైతులు పెట్టిన పెట్టుబడుల ఆధారంగా కాదు, రైతుల అవసరాల దృష్ట్యా గిట్టుబాటు ధరలను నిర్ణయించాలన్న సూత్రం ఏలికలకు ఆమోదయోగ్యం కావడం లేదు. వైద్యం కోసం శుభ అశుభకార్యాల కోసం జరిగే ఖర్చులు, అప్పులు వ్యవసాయ వైఫల్యం కిందికి ఎందుకు వస్తాయి? అని అమాయకంగా ప్రశ్నిస్తారు నిపుణులు. ఏ కుటుంబానికైనా దానికి అవసరమైన అన్ని వ్యయాలూ, అది జీవనోపాధిగా ఎంచుకున్న రంగం నుంచే రావాలి కదా? వ్యవసాయ సంక్షోభానికి ప్రధానమైన కారణం, విధాన వాతావరణం. ప్రభుత్వం మీద తగినంత ఒత్తిడి రాకపోవడానికి కారణం, దేశంలోని అసంఖ్యాకులైన చిన్న, సన్నకారు రైతాంగం సంఘటితం కాకపోవడం. సాగునీరు అందకపోవడమే కొన్ని ప్రాంతాల్లో ప్రధాన సమస్యగా కనిపించవచ్చు. సాగునీరు లభించినా మార్కెట్‌ మీద నియంత్రణ లేకపోతే, రైతులకు దిక్కెవరు? ధరల స్థిరీకరణ నిధులు ఏర్పాటు చేస్తామని గొప్పగా చెబుతారు. అది ఆచరణలోకి మాత్రం రాదు. ఏ నేలలో ఏ పంట వేయాలో కూడదో చెప్పడానికి వ్యవసాయ విస్తరణ విభాగం పనిచేయదు. దళారీల మీద ఎటువంటి అదుపూ లేదు. పోనీ, మార్కెట్‌ ఆటుపోట్లు, వాతావరణం వల్ల కలిగే కష్టాలు రైతులే పడతారు, ఆత్మహత్యలకు పాల్పడకుండా వారికి ఏమైనా ఉపశమన చర్యలు తీసుకుంటారా అంటే అదీ లేదు. ఆత్మహత్యకు పాల్పడాలన్న ఆలోచన వచ్చిన రైతులకు నచ్చచెప్పి, ధైర్యం చెప్పడానికి కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఆ రాష్ట్రంలో రైతాంగ మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగింది. ఆత్మహత్యల నివారణకు రాజ్యాంగ బద్ధ శాశ్వత వ్యవస్థ ఉండాలని స్వరాజ్‌ ఇండియా నాయకుడు యోగేంద్ర యాదవ్‌ చేసిన సూచన అనుసరణీయం. సమస్య మొదలయ్యే తొలిదశలోనే గుర్తించి, తక్షణం జోక్యం చేసుకోగల సున్నితత్వం ఉన్న ప్రభుత్వ వ్యవస్థ అవసరం. ఉల్లి సంక్షోభం మొదలైన వెంటనే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఉంటే, అనేక ఆత్మహత్యలు జరగకుండా ఉండేవి. మహారాష్ట్రతో పాటు, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలు రైతు ఆత్మహత్యల గణాంకాలలో ముందున్నాయి. తెలంగాణ అవతరణ జరిగినప్పటి నుంచి ఇప్పటి దాకా రాష్ట్రంలో 3403 ఆత్మహత్యలు జరిగాయని రైతుస్వరాజ్య వేదిక లెక్కవేసింది. నియోజకవర్గాల వారీగా చూస్తే, అత్యధికంగా ఆత్మహత్యలు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో 113 జరిగాయి. 91 ఆత్మహత్యలతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో మంథని, హుస్నాబాద్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలవారీగా చూస్తే నల్లగొండ జిల్లా 381 ఆత్మహత్యలతో, సిద్దిపేట జిల్లా 282 ఆత్మహత్యలతో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. ఆయా స్థానాలకు, జిల్లాలకు చెందిన నాయకులు ఆ సంఖ్యలకు బాధ్యులని చెప్పలేము కానీ, తప్పకుండా ఆందోళన చెంది, నివారణ చర్యలు తీసుకోవలసిన బాధ్యత వారి మీద ఉన్నది. ప్రభుత్వం తాను చేయగలిగినంత చేసి, సమాజ సహకారాన్ని ఆహ్వానించగలిగితే, పూర్తిగా కాకపోయినా, కొంతైనా ఉపశమనం లభిస్తుంది. రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడెవడు? అనుకుంటే, వాళ్లు చస్తూనే ఉంటారు. మనం చూస్తూనే ఉంటాము. ఆ చావుల మీదుగా అభివృద్ధి రథం పరుగులు తీస్తూ ఉంటుంది.
editorial
11,636
28-04-2017 15:44:04
ఈవీఎంలపై నిందలేల? ఆత్మావలోకనం అవసరం : ఆప్ సీనియర్ నేత
న్యూఢిల్లీ : ఇటీవలి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఓటమికి పార్టీ నాయకత్వమే బాధ్యతవహించాలని ఆ పార్టీ నేత కుమార్ విశ్వాస్ స్పష్టం చేశారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, పంజాబ్, గోవా శాసనసభల ఎన్నికల్లో ఆప్ ఓటమి గురించి ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. ఓటమికి కారణం ఈవీఎంలేనని ఆరోపించడం కన్నా ఆప్ ఆత్మావలోకనం చేసుకోవాలని కుమార్ విశ్వాస్ అన్నారు. పార్టీ సీనియర్లు నాలుగు గోడల మధ్య, రహస్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీ కన్వీనర్‌గా కార్మిక మంత్రి గోపాల్ రాయ్ నియామకం కూడా ఆ విధంగానే జరిగిందని చెప్పారు. ఈ అంశంపై పార్టీలో చర్చ జరగలేదన్నారు. కేజ్రీవాల్ ఆయనను నియమించారని తెలిపారు. నిర్ణయం తీసుకున్న తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీకి తెలిపారన్నారు. పార్టీ అత్యున్నత స్థాయి నేతలు క్షేత్ర స్థాయి కార్యకర్తలతో సంబంధాలను కోల్పోయారని, ఎంసీడీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడానికి అదే ప్రధాన కారణమని తెలిపారు. పార్టీలో లోపాలు ఉన్నాయని, ప్రక్షాళన అవసరమని తెలిపారు. వాలంటీర్లకు దూరమవడం వల్ల 6వ ఓటమి ఎదురైందని చెప్పారు. కేవలం ఈవీఎంలను మాత్రమే నిందించకూడదని పేర్కొన్నారు. ప్రజలు తమకు ఓటు వేయలేదు కాబట్టి ఓడిపోయామన్నారు.
nation
5,157
12-09-2017 10:39:56
ప్రభాస్ సరసన చేయడమే వరం అనుకుంటే..
ప్రభాస్ సరసన ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కోసం హీరోయిన్లు ఎదురుచూస్తుంటారు. సాహో సినిమాలో హీరోయిన్ హంట్ మామూలుగా జరగలేదు. అన్ని అవాంతరాలనూ దాటుకుని.. ఎందరో టాప్ హీరోయిన్ల అడ్డు తొలగి చివరికి హీరోయిన్ ఛాన్స్‌ను శ్రద్ధా కపూర్‌కి సొంతం అయింది. ఇక్కడికి అమ్మడికి ఒక లడ్డు ఇచ్చేశారు దర్శక నిర్మాతలు. అంతటితో ఆగలేదు.. మరో లడ్డు కావాలా తల్లి అంటున్నారట. అర్ధం కాలేదు కదా.. హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చి ఒక స్వీట్‌తో సరిపెట్టకుండా.. డ్యుయెల్ రోల్ పాత్రనిచ్చి మరో స్వీట్ ఇస్తున్నారట. ఒక పాత్ర.. పదహారణాల తెలుగమ్మాయిలా.. మరో పాత్ర కాస్త మాస్ లుక్‌తోఉంటుందని టాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇది కానీ నిజమైతే అమ్మడు అదృష్టానికి మిగిలిన హీరోయిన్లు జలస్ ఫీల్ అవుతారేమో.
entertainment
1,848
18-04-2017 12:59:48
జియో చలవతో రిలయన్స్ మరో సంచలనం
ముంబై: జియో చలవతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనం దిశగా అడుగులు వేస్తోంది. మంగళవారం దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్‌ను కొద్దిమేర దాటుకుని... రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన భారత కంపెనీగా అవతరించింది. ఇంధనం మొదలు టెలీకామ్ సేవల వరకు విస్తరించిన రిలయన్స్ షేర్లు 1.36 శాతం మేర లాభపడి రూ.1,410కి చేరుకోవడంతో ఇది సాధ్యపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం మార్కెట్ విలువ రూ.4.58 లక్షల కోట్లకు చేరుకుంది. మరోవైపు దీంతో పోల్చితే.. టీసీఎస్ మార్కెట్ వ్యాల్యూ రూ.4.56 శాతానికి పడిపోయింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి టీసీఎస్ షేరు 0.25 శాతం నష్టపోయి రూ.2,315కి పరిమితమైంది. కాగా గత మూడు నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఏకంగా 35 శాతం లాభపడడం విశేషం. అదే టీసీఎస్ విషయానికి వస్తే కేవలం 2 శాతానికే పరిమితమైంది. ఏప్రిల్ 1 నుంచి జియో కస్టమర్ల వద్ద టారిఫ్ రుసుమును వసూలు చేస్తామని ప్రకటించడంతో... రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల బాట పట్టినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్ కెమికల్ ప్రాజెక్టులు కూడా త్వరలో ఆన్‌లైన్ కాబోతున్నాయి. మరోవైపు హెచ్1బీ వీసాల సమస్య, టెక్నాలజీ రంగం ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు, అభివృద్ధి మందగమనంతో ఐటీ స్టాక్‌లు సతమతమవుతున్నాయి.
business
19,603
12-04-2017 01:32:21
మెయిన్‌డ్రాకు సౌరభ్‌ వర్మ
సింధు, శ్రీకాంత పోరు నేడు సింగపూర్‌ ఓపెన్‌ సింగపూర్‌: సింగపూర్‌ సూపర్‌ సిరీ్‌సలో భారత యువ షట్లర్‌ సౌరభ్‌ వర్మ మెయిన్‌ డ్రాలో చోటు దక్కించుకున్నాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో మూడో సీడ్‌ సౌరభ్‌ 27-29, 21-18, 21-18తో తోంగ్నమ్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించాడు. అంతకుముందు తొలి రౌండ్‌లో సౌరభ్‌ 21-13, 23-21తో మిషా జిల్‌బెర్మాన్‌ (ఇజ్రాయెల్‌)పై గెలిచాడు. ఇక పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌లో నాలుగో సీడ్‌ అర్జున్‌-రామచంద్రన్‌ జోడీ 21-19, 21-18తో అయూబ్‌-జగ్దీష్‌ సింగ్‌ (మలేసియా) ద్వయంపై గెలిచింది. స్వాతిక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ చెట్టి జోడీ మాత్రం 8-21, 15-21తో హెండ్రా సెటివాన్‌ (ఇండోనేసియా)-బూన్‌ హెంగ్‌ టాన్‌ (మలేసియా) ద్వ యం చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. ఇక మిక్స్‌ డ్‌ రెండో రౌండ్‌లో సాత్విక్‌సాయి రాజ్‌-మనీషా జోడీ 21-18, 14-21, 21-11తో నందగోపాల్‌-మహిమ అగర్వాల్‌ ద్వయంపై గెలిచి.. మెయిన్‌డ్రాకు అర్హత సాధించింది. కాగా, బుధవారం జరగనున్న తొలి రౌండ్‌లో ప్రపంచ నెంబర్‌ 2 పీవీ సింధు.. జపాన్‌ షట్లర్‌ నొజొమి ఒకుహరతో తలపడనుంది. అయితే ఒకుహరతో తలపడిన ఐదు మ్యాచ్‌ల్లో సింధుకు మూడుసార్లు పరాజయం ఎదురైంది. కానీ, చివరగా రియో ఒలింపిక్స్‌లో ఒకుహరను సింధు ఓడించడం సానుకూలాంశం. ఇక పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత, సాయి ప్రణీత, సమీర్‌ వర్మ, అజయ్‌ జయరామ్‌ బరిలోకి దిగనున్నారు.
sports
21,304
17-12-2017 01:30:44
సుష్మ సాయం..బాక్సర్‌కు పతకం
న్యూఢిల్లీ: 15 ఏళ్ల ఆ బాక్సర్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ కోరిన విధంగా పతకం సాధించింది. అదికూడా ఓ అంతర్జాతీయ టోర్నీలో రజత కావడం విశేషం. విషయమేమిటంటే.. జూనియర్‌ నేషనల్‌ చాంపియన్‌ జలక్‌ తోమర్‌.. ఉక్రెయిన్‌లో వలేరియా డెమ్యనోవా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీకి భారత జట్టుకు ఎంపికైంది.  కానీ సమయానికి ఆమె పాస్‌పోర్టు రాలేదు. ఈ విషయం ట్విటర్‌ ద్వారా విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ దృష్టికి రావడంతో ఆమె వెంటనే స్పందించి తోమర్‌కు పాస్‌పోర్టు వచ్చేలా సాయం చేశా రు. అంతేకాదు ఆ టోర్నీ లో పతకం తీసుకు రావా లని జలక్‌ను సుష్మ కోరా రు. శనివారం ముగిసిన ఈ టోర్నీలో 54 కిలోల విభాగంలో తోమర్‌ రజత పతకం కైవసం చేసుకుంది. ఈ చాంపియన్‌షిప్‌్‌లో భారత్‌ మొత్తం నాలుగు స్వర్ణ, మూడు రజత, ఒక కాంస్యంసహా ఏడు పతకాలు గెలుచుకుంది.
sports
5,453
15-04-2017 13:39:08
చైతన్య, సమంత స్పీడుకు కారణమేంటి?
టాలీవుడ్‌ హాట్‌ కపుల్‌ అక్కినేని నాగచైతన్య, సమంత కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఆగస్ట్‌లో వీరు వివాహం చేసుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న వీరిద్దరూ ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో చెమటోడుస్తున్నారు.
entertainment
14,678
26-12-2017 01:46:18
జెరూసలేంలో మందకొడిగా వేడుకలు
జెరూసలేం, డిసెంబరు 25: ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవలి ప్రకటన ఆ ప్రాంతంలో క్రిస్మస్‌ వేడుకలపై ప్రభావం చూపాయి. స్థానికులు వేడుకల్లో పాల్గొనడం, నిర్వహించడంపై ఆసక్తి కనబర్చలేదు. సాధారణంగా ఏటా స్థానిక మాంజెర్‌ స్క్వేర్‌ వద్ద క్రిస్మ్‌సకు ఒకరోజు ముందునుంచే సందడి నెలకొంటుంది. ‘ఈ సారి విదేశీ యాత్రికులెవరూ వేడుకలపై ఆసక్తి చూపలేదు. డిసెంబరు 24 రాత్రి వేళలో వేల సంఖ్యలో పర్యాటకులు, స్థానికులతో ఈ ప్రాంతం ఇసకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోతుంది. కానీ, ఈ సారి అలాంటి వేడుకలు లేవు.’ అని స్థానిక వ్యాపారులు మిషీల్‌ కుమ్సియే, ఖాదర్‌ తెలిపారు.
nation
20,496
23-01-2017 18:03:34
టీమిండియాలో ఉన్న లోపాలను ఎత్తిచూపిన గవాస్కర్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గిన కోహ్లీ సేనకు గవాస్కర్ శుభాకాంక్షలు తెలిపారు. కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలు చేపట్టినప్పటికీ కోహ్లీ బ్యాటింగ్‌లో అదే దూకుడును కొనసాగించడం గొప్ప విషయమంటూ కొనాయాడారు. జట్టుకు ఆరో స్థానంలో ఆడేందుకు ఆణిముత్యం లాంటి కేదార్ జాదవ్ దొరికాడని అన్నారు. అయితే జట్టులో ఉన్న కొన్ని ప్రధాన లోపాలను కూడా ఆయన ఎత్తి చూపారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల్లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఒక్కసారి కూడా రాణించలేదని ఆ విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అయితే రోహిత్ శర్మ పూర్తిగా కోలుకుంటే ఆ లోటు తీరుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. మరోపక్క శిఖర్ ధావన్‌‌పై కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో పాటు ముఖ్యంగా కోహ్లీ, ధోనీలు అన్ని మ్యాచ్‌లలో రాణించకపోవడాన్ని ప్రస్తావించారు. ఇరువురిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు సునీల్ గవాస్కర్.
sports
18,964
27-09-2017 03:29:52
భారత్‌ టమాటో అక్కర్లేదు: పాక్‌
లాహోర్‌: టమాటో కొరత తీవ్రస్థాయిలో ఉన్నా.. తమ ప్రజలు ఇబ్బందులు పడ్డా.. భారత్‌ నుంచి మాత్రం దిగుమతి చేసుకోబోమని చెబుతోంది పాకిస్తాన్‌ ప్రభుత్వం. పరిస్థితి ఎంత దిగజారినా.. భారత్‌ నుంచి టమాటోను తెప్పించుకునే ప్రసక్తే లేదని ఆహార శాఖ మంత్రి సికిందర్‌ హయత్‌ బోసన్‌ స్పష్టం చేశారు. ఫలితంగా స్థానికంగా టమాటో ధర చుక్కలనంటుతోంది. నిన్నమొన్నటిదాకా రూ.100 నుంచి 150 రూపాయలున్న కిలో టమాటో ధర నేడు 3 వందల రూపాయలకు ఎగబాకింది. భారత సరిహద్దుల నుంచి టమాటో దిగుమతి నిలిచిపోవడంతో..లాహోర్‌, పంజాబ్‌లతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో టమాటో కొరత తీవ్రమైంది.
nation
11,632
29-08-2017 03:15:29
శిక్ష చాలదు: బాధితులు
రోహ్‌తక్‌, ఆగస్టు 28: గుర్మీత్‌కు పడిన శిక్షపై బాధితుల తరఫు న్యాయవాది ఉత్సవ్‌ సింగ్‌ భైస్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరానికి తగ్గట్లుగా సుదీర్ఘ జైలుశిక్ష విధించాలని కోరారు. గుర్మీత్‌పై ఇలాంటి మరో డజను లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయని, మిగతా కేసులూ సీబీఐతో దర్యాప్తు చేయించాలని హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు.
nation
14,314
23-11-2017 01:14:06
పండగ వెలుగులు
తెలుపు, ఎరుపు చారలుగా కనిపిస్తున్నవన్నీ రోడ్డు మీద నెమ్మదిగా కదులుతున్న వాహనాలు!! అమెరికాలోని లాస్‌ ఏంజిలెస్‌లో మంగళవారం రాత్రి కనిపించిందీ కిక్కిరిసిన ట్రాఫిక్‌! ఈ రద్దీకి రీజనుంది. ఏటా నవంబరు ఆఖరు గురువారాన్ని అమెరికాలో ‘థ్యాంక్స్‌ గివింగ్‌ డే’ గా జరుపుకొంటారు. బ్రిటన్‌ నుంచి ఉత్తర అమెరికాకు వలస వచ్చిన బృందం (పిల్‌గ్రిమ్‌ ఫాదర్స్‌) కొత్త పంట వచ్చినందుకు కృతజ్ఞతగా 1621లో తొలిసారి థ్యాంక్స్‌ గివింగ్‌ డేను జరుపుకొన్నారు. అప్పటి నుంచి అమెరికాలో ఈ పండుగ ఆనవాయితీగా వస్తోంది. అమెరికా తొలి అధ్యక్షుడు లింకన్‌ హయాంలోఈ పండుగను అఽధికారికంగా గుర్తించారు. థ్యాంక్స్‌ గివింగ్‌ డేను కెనడా, ఫిలిప్పైన్స్‌, లైబేరియా, సెయింట్‌ లూసియాలోనూ జరుపుకొంటారు. థ్యాంక్స్‌ గివింగ్‌ డే కోసం లాస్‌ ఏంజిలెస్‌లో ఈ స్థాయిలో కార్ల రద్దీ ఎన్నడూ లేదని ఓ ట్రావెల్‌ ఏజెన్సీ ప్రకటించింది. అమెరికా వ్యాప్తంగా 5.1 కోట్ల మంది రోడ్డు, రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తారని ఓ అంచనా.
nation
19,220
24-07-2017 01:17:14
నేటి పెట్రో ధరలు (లీ.)
పెట్రోల్‌                                  డీజిల్‌పాత ధర రూ.68.41                పాత ధర 59.83కొత్త ధర రూ.68.55                 కొత్త ధర 59.83పెరుగుదల 14 పైసలు              మార్పులేదు
nation
13,432
11-01-2017 02:51:36
‘మహా’ మునిసిపోల్స్‌లో బీజేపీ హవా!
ముంబై, జనవరి 10: మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ విజయదుందుభి మోగించింది. నవంబరు 28 నుంచి 4దశల్లో 191 మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరుగగా.. 71 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 34, శివసేన 26, ఎన్‌సీపీ 22 స్థానాలు సాధించాయి. 22 స్థానాల్లో ఇతర పార్టీలు, 16 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలించారు. 19 నగర పంచాయతీలను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తంగా 4,704 కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలు జరగగా.. అందులో బీజేపీకి 1,190, కాంగ్రె్‌సకు 952, ఎన్‌సీపీకి 812, శివసేనకు 612, బీఎస్ పీకి 17, సీపీఎంకు 12, ఎంఎన్‌ఎస్ కు 7 సీట్లు దక్కాయి. పెద్ద నోట్ల రద్దు ప్రతికూలతను ఎదుర్కొని బీజేపీ విజయకేతనం ఎగురవేయడం విశేషం.
nation
13,849
09-12-2017 01:10:21
పాత్రికేయుడి హత్యకు సుపారీ!
ఆర్థిక లావాదేవీల్లో అభిప్రాయ భేదాలు ‘హాయ్‌ బెంగళూరు’ ఎడిటర్‌ అరెస్ట్‌ గౌరీలంకేశ్‌ కేసు విచారిస్తుండగా నాటకీయంగా వెలుగులోకి వచ్చిన వైనంబెంగళూరు, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): వారిద్దరిదీ గురుశిష్యుల బంధం. పాత్రికేయ వృత్తిలో శిష్యుడికి ఒకప్పుడు ఓనమాలు నేర్పిన గురువే ఇప్పుడు అతడిని హతమార్చడానికి సుపారీ ఇచ్చాడు. సదరు గురువు గారిని పోలీసులు అరెస్ట్‌ చేసిన తర్వాత అసలు విషయం తెలుసుకున్న శిష్యుడు తీవ్ర షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో శుక్రవారం పెను సంచలనం సృష్టించింది. సీసీబీ పోలీసుల కథనం మేరకు... ‘హాయ్‌ బెంగళూరు’ వారపత్రికకు రవిబెళగెరె రెండు దశాబ్దాలుగా సంపాదకుడిగా ఉన్నారు. పత్రిక ఆర్థిక లావాదేవీల విషయంలో తనను మోసం చేశాడనే అనుమానంతో తన ఒకప్పటి సహచర పాత్రికేయుడు సునీల్‌ హెగ్గరవళ్ళిని అంతమొందించేందుకు సుపారీ కిల్లర్‌గా పేరుమోసిన శశిధర్‌ను రవి సంప్రదించాడు. సునీల్‌ను హత్య చేయడానికి శశిధర్‌ పలుమార్లు రెక్కీ నిర్వహించాడు. అయితే అక్రమాయుధాల కేసులో పోలీసులు శశిధర్‌ను అరెస్టు చేయడంతో ఈ విషయం కూడా వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రవిబెళగెరె నివాసం, కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి డబుల్‌ బ్యారెల్‌ గన్‌, ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, గౌరీలంకేశ్‌ హత్య కేసును విచారిస్తున్న పోలీసులకు ఈ సమాచారం నాటకీయంగా లభించినట్లు తెలుస్తోంది. కాగా, హోం మంత్రి రామలింగారెడ్డి బెంగళూరులో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గౌరీలంకేశ్‌ హత్య కేసుకు, రవిబెళగెరె అరెస్టుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
nation
2,075
19-11-2017 23:52:18
ప్రైవేటులో నియామకాలు అంతంతే..
వ్యయ నియంత్రణ, మార్జిన్ల పెంపుపై కంపెనీల దృష్టివచ్చే రెండు త్రైమాసికాలు ప్రైవేటు కంపెనీలకు సవాళ్లేఅసోచామ్‌ వెల్లడిన్యూఢిల్లీ : ప్రైవేటు రంగంలో కొత్త నియామకాలకు సంబంధించిన అంచనాలు నిరాశాజనకంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు (మార్చి 2018) ఈ రంగంలో నియామకాలు అంతంత మాత్రంగానే ఉండనున్నట్టు పరిశ్రమల చాంబర్‌ అసోచామ్‌ వెల్లడించింది. దేశీయ కంపెనీలు వేతనాలకు సంబంధించిన వ్యయాలను నియంత్రించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయని, ఈ ప్రభావం నియామకాలపై పడుతోందని పేర్కొంది. తమ సభ్యులు అందించిన సమాచారం ఆధారంగా ఉద్యోగుల నియామకాలపై అంచనాలు వెలువరిస్తున్నట్టు అసోచామ్‌ తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ నియామకాలు తగ్గడానికే ఆస్కారం ఉందని తెలిపింది. ప్రభుత్వం ఈ బ్యాంకులకు కొత్తగా మూలధనం సమకూర్చనుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించుకోవడానికే బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కీలకం కానివ్యాపారాల నుంచి బయటపడటం, అప్పులను తగ్గించుకోవడం, తమ స్థానాన్ని మరింత పటిష్ఠ పరచుకోవడానికే కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయని అసోచామ్‌ పేర్కొంది.  రానున్న త్రైమాసికాల్లో కార్పొరేట్లు మార్జిన్లను పెంచుకోవడానికి, రుణ వ్యయాలను తగ్గించుకోవడానికి, రాబడుల్లో వృద్ధిపై దృష్టి పెట్టనున్నట్టు తెలిపింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం పరిస్థితుల్లో మార్పులు ఉండవచ్చన్న ఆశాభావాన్ని అసోచామ్‌ వ్యక్తం చేస్తోంది. టెలికాం, ఫైనాన్షియల్స్‌ (ప్రైవేట్‌ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, రియల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ డిఎస్‌ రావత్‌ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన రేటింగ్‌ను మూడీస్‌ అప్‌గ్రేడ్‌ చేయడం వల్ల సెంటిమెంట్‌ మెరుగు పడిందని, అయినప్పటికీ వచ్చే రెండు మూడు త్రైమాసికాలు ప్రైవేటు రంగం సవాళ్లతో సహవాసం చేయాల్సిందేనని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి కంపెనీ రుణ భారం తగ్గేందుకు, వినియోగదారుల డిమాండ్‌ పెరిగేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. అనుకోని సంఘటనలు చోటుచేసుకున్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంకన్నా వచ్చే ఆర్థిక సంవత్సరం మెరుగ్గానే ఉంటుందన్న విశ్వాసం ఉందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని స్టాక్‌ మార్కెట్‌ బూమ్‌ ప్రతిబింబిస్తోందని అసోచామ్‌ పేర్కొంది.  వచ్చే కొన్ని నెలల్లో జిఎ్‌సటికి సంబంధించిన అంశాలు సద్దుమణుగుతాయని తెలిపింది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే ఉండటం, విదేశీ మారకంలో స్థిరత్వం, విదేశీ మారక నిల్వల్లో పెరుగుదల, ఎగుమతుల్లో వృద్ధి వంటివి దేశ స్థూల ఆర్థిక వ్యవస్థకున్న పటిష్ఠతను తెలియజేస్తున్నాయని అసోచామ్‌ వెల్లడించింది. అయితే ముడిచమురు ధరలపై కన్నేసి ఉంచాలని, ప్రస్తుత స్థాయికన్నా ఇంకా ఎక్కువగా చమురు ధర పెరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
business
4,540
08-05-2017 00:16:46
విశ్వదాత కాశీనాథుని పురస్కారాలు
కీర్తిశేషులు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు పేరిట ఇస్తున్న ‘విశ్వదాత పురస్కారా’లకు కవి పాపినేని శివశంకర్‌, పాత్రికేయులు యల్లాప్రగడ మల్లిఖార్జునరావు ఎంపికైనారు. మే 8న సా.6గం.లకు కృష్ణాజిల్లా, పామర్రు మండలం, ఎలకుర్రులో జరిగే సభలో మండలి బుద్ధప్రసాద్‌, బచ్చుల అర్జునుడు పురస్కారాలు అందిస్తారు.- అమరావతి సాహితీ మిత్రులు
editorial
924
08-10-2017 01:05:37
శిల్పా మెడికేర్‌ జడ్చర్ల ప్లాంట్‌కు ఎఫ్‌డిఎ ఓకే
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం జడ్చర్లలోని ప్లాంట్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యుఎస్‌ఎఫ్‌డిఎ) ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఇన్‌స్పెక్షన్‌ నివేదిక (ఇఐఆర్‌)ను జారీ చేసిందని శిల్పా మెడికేర్‌ వెల్లడించింది. జడ్చర్లలోని జెనరిక్‌ ఫార్మాసూటికల్‌ ప్లాంట్‌ను జూలై 24-28 మధ్య కాలంలో ఎఫ్‌డిఎ తనిఖీలు చేపట్టి కొన్ని అభ్యంతరాలను లేవనెత్తుతూ ఫారమ్‌ 483 జారీ చేసిందని తెలిపింది. అయితే నిర్ధేశిత సమయంలో అభ్యంతరాలకు సమాధానమివ్వటంతో ఇఐఆర్‌ను మంజూ రు చేసిందని శిల్పా మెడికేర్‌ పేర్కొంది.
business
4,384
19-02-2017 04:28:15
మాతృభాషలోనే ప్రాథమిక విద్య
ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ!నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సమున్నత స్థాయికి చేర్చేందుకు తాము అవిరళ కృషి చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు భాషాసంస్కృతులకు మహోన్నత వైభవాన్ని చేకూర్చేందుకు సంకల్పించి, అందుకోసం స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థను ఏర్పాటుచేస్తామని, ఆ వ్యవస్థ రూపకల్పనకై శాసనసభ ఉపసభాపతి, సాంస్కృతికశాఖ మంత్రి, ప్రభుత్వ సలహాదారు, అధికారులతో ఒక కమిటీని నియమిస్తున్నట్లు, 2016 ఆగస్టు 29న తెలుగుభాషాదినోత్సవ సభలో తాము ప్రకటించారు. నెలరోజుల్లో ఆ కమిటీ నివేదికను తెప్పించుకొని తెలుగు ప్రాధికార సంస్థను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఆ కమిటీవారు ఇటీవలనే తమకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తున్నది. అయితే ఆ నివేదిక వచ్చేలోపుగానే తమ ప్రభుత్వం విద్యారంగంలో తెలుగు మీడియంకు స్వస్తి పలికి, ఇంగ్లీషు మీడియంను వెంటనే ప్రాథమిక స్థాయినుంచే ప్రవేశ పెడుతూ జీవో నెం. 14/2.1.2017ను పురపాలక మంత్రిత్వశాఖ నుంచి జారీచేసింది. ఆ వెంటనే మెమో నెం. 7176/డి1/2016: తేదీ. 5.01.2017 ద్వారా ఈ మార్చితో ప్రారంభ మవనున్న విద్యాసంవత్సరం నుంచి దానిని అమలుచేస్తున్నట్లు ప్రకటించింది. దాని కనుగుణంగా శరవేగంతో పనులు ప్రారంభించింది. ఈచర్య తొలుత మీరు ప్రకటించిన లక్ష్యాలకు, హామీలకు విరుద్ధంగా ఉన్నది. కమిటీ రిపోర్టు రాకుండానే, తెలుగును కూకటివేళ్ళతో పెకలించే ఈ చర్య -తమరి ఆశయాలను ఖండిస్తున్నట్లుగా ఉంది. ఇక్కడ తమకు ముఖ్యంగా మనవి చెయ్యవలసినదేమిటంటే- ప్రాథమిక స్థాయిలో మాతృభాషామాధ్యమం అనివార్యమైన అవసరమని భారత రాజ్యాంగం(అధికరణం 35– ఎ) చెప్పింది. కొఠారి కమిషన్‌ చెప్పింది. ఐక్యరాజ్యసమితిలో భాగమైన ‘యునెస్కో’నేకాదు అభివృద్ధి చెందిన దేశాల చరిత్ర, వర్తమానం అదే చెప్తున్నాయి. 2010లో భారత ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం, విభాగం29(2)లో ఎలిమెంటరీ స్థాయిలో మాతృభాషామాధ్యమాన్ని అమలు చెయ్యాలని నిర్దేశించింది. తాము నియమించిన కమిటీ కూడా తమ రిపోర్టులో బహుశా ఇదే సిఫారసు చేసి ఉంటుందని మేము దృఢంగా నమ్ముతున్నాము. విద్యారంగంలో పేద, ధనిక వర్గాల మధ్యగాని, మరోవిధంగా గాని విచక్షణ చూపడం తగనిపని. అందరికీ ఒకే రకమైన విద్య అందుబాటులో ఉండాలి. అందువల్ల ఆర్ధికంగా బలహీనులైన వారికి ప్రభుత్వ పాఠశాలలనీ, డబ్బున్నవారికి ప్రయివేటు స్కూళ్ళనే పరిస్థితి ఎంతమాత్రం తగదు. కనుక- మొత్తం రాష్ట్రంలో ప్రయివేటు, ప్రభుత్వ స్కూళ్ళంన్నింటికీ వర్తించే విధంగా ఒకే విధానం ఉండాలి. కనుక -ప్రాధమిక విద్యలో కనీసం 5వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో మాతృభాషామాధ్యమాన్ని తప్పనిసరి చెయ్యాలని, 6వ తరగతి నుండి విద్యార్ధి ఎంపిక ప్రకారం ఏ మాధ్యమంలోనైనా చదువుకోడానికి వీలుగా రెండు మాధ్యమాల్లోనూ 10వ తరగతి వరకూ సమాంతరంగా తరగతులుండాలని మనవి చేస్తున్నాము. ఇదే శాస్త్రీయ విద్యావిధానం అవుతుంది తప్ప, పసిబిడ్డలను పాఠశాలకు పంపడంతోనే- తనకు తెలియని భాషలో తెలియని జ్ఞానాన్ని నేర్చుకోవాలనడం- అవివేకం, అశాస్త్రీయం. పరాయిభాషలో ప్రాథమిక విద్యనుంచీ చదువు చెప్పడం ఎంత అసమంజసమో, అభివృద్ధి చెందిన దేశాలను చూచి మనం గ్రహించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. భాషను వినియోగించేకొద్దీ అభివృద్ధి చెందుతుంది. తెలుగును కూడ వృద్ధిచేసుకొంటేనే అన్నిరంగాల్లోనూ దాన్ని ఒక అత్యాధునిక భాషగా పెంపొందించుకోగలం. అదే సమయంలో ఇంగ్లీషును వద్దు అనడం విజ్ఞత కాదు. ఇంగ్లీషేకాదు, మరే ఇతర భాషను నేర్చుకోవాలన్నా మాతృభాషలో పునాది పటిష్ఠంగా ఉండాలి. విషయ గ్రహణశక్తిని, విషయ వివరణ శక్తిని మాతృభాషలో పొందుతూ, ప్రక్కన ఒక భాషగా ఇంగ్లీషును 1వ తరగతినుండే అర్హతగల టీచర్ల చేత నేర్పాలి. అప్పుడు మెరికల్లాంటి విద్యార్థులు తయారౌతారు. అటు తెలుగు సరిగా రాక, ఇటు ఇంగ్లీషు సరిగా రాని నేటి తరాలకు బదులు, మాతృభాష తెలుగులోనూ, ఇటు ఇంగ్లీషులోనూ సమర్థులైన పౌరులు తయారౌతారు. వారు మన దేశంలోనూ, బయటి దేశాల్లోనూ మన తెలుగుజాతి శక్తిని మరింతగా చాటుతారు. ఇంతటి విప్లవాత్మకమైన చర్యను మీ ప్రభుత్వం చేపట్టాలని కోరుతున్నాం. మేము చేస్తున్న విన్నపంలో ఎటువంటి అశాస్త్రీయత, అసంబద్ధత లేదని మనవిచేస్తూ -తాము ఈ కింది కోరికలను మన్నిస్తూ తగు అధికారిక ఉత్తర్వులివ్వాలని కోరుతున్నాం. 1. ప్రాథమిక విద్యను మాతృభాషలో/రాష్ట్ర అధికార భాషలో రాష్ట్రమంతటా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్ళలో (మిషనరీ స్కూళ్ళతో సహా) తప్పనిసరి చెయ్యాలి. ఇదే సమయంలో ఇంగ్లీషును ఒక భాషగా పటిష్ఠంగా బోధించాలి. ఎటువంటి తేడా లేకుండా అందరికీ ఒకేరకమైన విద్యను అందించడానికి ఇది తొలిచర్య అవుతుందని మనవి చేస్తున్నాను. 2. జి.ఒ.నెం.14ను వెంటనే రద్దుచెయ్యాలి. 3. ఉన్నతపాఠశాలల్లో ఆంగ్లంలోనూ, తెలుగులోనూ సమాంతర తరగతులుండాలి. 4. తెలుగు మంత్రిత్వశాఖ ఏర్పడివున్నందున, తాము ప్రకటించిన విధంగా వెంటనే ప్రాధికారసంస్థను ఏర్పాటుచేస్తూ, అన్నిరంగాల్లో తమ ప్రభుత్వ భాషావిధానాన్ని వెంటనే రూపొందించాలి. తెలుగుభాషకు, తెలుగు ప్రజలకు అన్ని విధాలా మేలు కలిగించాలనే తమ సంకల్పానికి జేజేలు. తమ సంకల్ప సాధనకు పైన పేర్కొన్న చర్యలు రాచబాటను ఏర్పర్చుతాయి.ధన్యవాదాలతో..డాక్టర్‌ సామల రమేష్‌బాబుతెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడుమాతృభాషా మాధ్యమ వేదిక సారథ్యసంఘ సభ్యుడు
editorial
1,602
21-10-2017 02:53:38
పన్నేతర ఆదాయంలో 22 శాతం వృద్ధి
రూ.26,101 కోట్లకు రాష్ట్రం సొంత ఆదాయంఅమరావతి (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆదాయం ఆశించిన లక్ష్యాల కంటే తగ్గినప్పటికీ రాష్ట్రంలో పన్నేతర ఆదాయం భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో సాధించిన ఆదాయం కంటే ఈ ఏడాది 22 శాతం మేర వృద్ధి చెందింది. ఈ సమయంలో రాష్ట్ర సొంత ఆదాయం 11 శాతం మేర పెరిగి రూ.26,101 కోట్లకు చేరుకుంది. పన్ను ఆదాయం రూ.23,912 కోట్లకు చేరుకుంది. బడ్జెట్‌లో ఆశించిన స్థాయి కంటే రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ.. జిఎ్‌సడిపి రెండంకెల వృద్ధికి చేరడానికి పన్నేతర ఆదాయం పెరగడమే కారణమని అధికారులు భావిస్తున్నారు. పన్ను పరిధిలోకి రాని ఆదాయం భారీగా పెరగడం వృద్ధి రేటు పెరుగుదలకు ప్రధాన కారణంగా వివరిస్తున్నారు. పన్ను పరిధిలోకి రాని మత్స్య రంగం ఉత్పత్తుల వల్ల పన్ను రూపేణా రాష్ట్ర ఆదాయానికి నష్టం జరిగినప్పటికీ జిఎ్‌సడిపి పెరుగుదలకు ఇది ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో మత్స్య రంగం రూ.12597 కోట్ల విలువైన ఉత్పత్తులను సాధించింది. మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో దీని విలువ 42 శాతం. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాల్లో కలిపి పన్ను ఆదాయం 9 శాతం మేర పెరిగి రూ.23,912 కోట్లకు చేరుకుంది. ఇందులో ఎక్సైజ్‌ ఆదాయం 47 శాతం మేర పెరిగి 3026 కోట్లకు చేరుకుంది. స్టాంప్స్‌, రిజిస్ర్టేషన్ల ఆదాయం 2 శాతం తగ్గి రూ. 2023 కోట్లకు పరిమితమైంది. లాండ్‌ రెవెన్యూ ఏకంగా 66 శాతం మేర పడిపోయింది. గత ఏడాది రూ.76 కోట్లు రాగా ఈ ఏడాది రూ.26 కోట్లు మాత్రమే వచ్చింది. వ్యవసాయేతర భూములు మినహా ఇతర స్థిరాస్తులపై వచ్చే ఆదాయం 45 శాతం మేర తగ్గింది.
business
6,785
13-01-2017 13:46:26
ఆ వ్యవహారంలో నన్ను ఇన్‌వాల్వ్‌ చెయ్యొద్దు: డైరెక్టర్ క్రిష్‌
ప్రస్తుతం ఎవరినోట విన్నా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘ఖైదీ నెంబర్‌ 150’ గురించిన మాటలే వినబడుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో కూడా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తన ట్వీట్లతో చర్చనీయాంశం అవుతున్నాడు. ‘శాతకర్ణి’ని పొగుడుతూ.. ‘ఖైదీ..’ని తిడుతూ వర్మ పెడుతున్న ట్వీట్లు హాట్‌టాపిక్‌గా మారాయి. ‘శాతకర్ణి’ సినిమాను క్రిష్‌ అద్భుతంగా తీశాడని, అమీర్‌ ఖాన్‌, షారూక్‌ ఖాన్‌.. క్రిష్‌ డైరెక్షన్‌లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ట్వీట్‌ చేస్తూనే.. ‘ఖైదీ నెంబర్‌ 150’పై వర్మ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో క్రిష్‌ ఈ వ్యవహారంపై స్పందించాడు. ‘వర్మ ట్వీట్లు పెట్టడానికి కారణం మీపై ప్రేమా, ‘ఖైదీనెంబర్‌ 150’ మీదా కోపమా’ అని ప్రశ్న క్రిష్‌కు ఎదురైంది. దీనికి క్రిష్‌ స్పందిస్తూ.. ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, తనను అనవసరంగా అందులోకి లాగొద్దని చెప్పాడు. అలాగే తన దర్శకత్వ పనితనాన్ని ప్రశంసిస్తూ వర్మ చేసిన ఓ ట్వీట్‌కు ధన్యవాదాలు చెబుదామనుకున్నానని, కానీ, ఇది సరైన సమయం కాదని ఆగిపోయానని తెలిపాడు క్రిష్‌.
entertainment
12,692
08-11-2017 03:02:30
ట్రంప్‌కు వేలు చూపెట్టి జాబ్‌ పోగొట్టుకుంది
వర్జీనియా, నవంబరు 7: సైకిల్‌పై వెళ్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఓ మహిళ మధ్య వేలు చూపెట్టింది. అంతే.. ఉద్యోగం పోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జూలి బ్రిస్క్‌మ్యాన్‌ అనే మహిళ గత నెలలో వర్జీనియాలో సైకిల్‌పై వెళ్తూ ఉండగా పక్క నుంచి అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్‌ వెళ్లింది. అప్పుడే ట్రంప్‌కు వేలు చూపిస్తూ తన నిరసనను వ్యక్తం చేసింది. దీన్ని ట్రంప్‌ కాన్వాయ్‌లోని ఓ ఫొటోగ్రాఫర్‌ ఫొటో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. జూలి పనిచేస్తున్న అకీమా అనే సంస్థ ఈ ఫొటోను చూసి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఉద్యోగంలోంచి తీసేసింది. ఇప్పుడు జూలి ధైర్యసాహసాలను పొగుడుతూ నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
nation
5,819
03-12-2017 18:32:14
టాలీవుడ్‌కి షాకివ్వబోతున్న సన్నీలియోన్
పలు ఆంగ్ల మరియు హిందీ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్‌ను దశదిశలా తెలియజేస్తున్న మోస్ట్ పాపులర్ హాలీవుడ్ లేడీ సన్నీలియోన్ మొట్టమొదటిసారిగా తెలుగులో హీరోయిన్‌గా ఒక సినిమా సైన్ చేసింది. కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరైన వి.సి.వడివుడయన్ దర్శకత్వంలో స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందున్న ఈ చారిత్రాత్మక యుద్ధ నేపధ్య చిత్రంలో సన్నీలియోన్ కథానాయికగా నటించనుంది. నవదీప్, నాజర్‌లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. ఇందుకోసం సన్నీలియోన్ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ మరియు కొన్ని యుద్ధ కళలను నేర్చుకొనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రముఖ ట్రైనర్ ఈ కళలను ముంబైలో సన్నీలియోన్‌కు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం సన్నీలియోన్ ఏకంగా 150 రోజుల కాల్షీట్స్‌ను దర్శకనిర్మాతలకు ఇవ్వడం బట్టి సినిమాపై ఆమెకున్న నమ్మకం తెలుస్తోంది. "బాహుబలి, 2.0" చిత్రాలకు గ్రాఫిక్స్ వర్క్ చేసిన సంస్థలు ఈ చిత్రానికి కూడా పనిచేయనున్నారు. సినిమాలో దాదాపు 70 నిమిషాల గ్రాఫిక్స్ ఉంటాయని చెబుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో టైటిల్‌ను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ సినిమా గురించి సన్నీలియోన్ మాట్లాడుతూ.. "ఇప్పటివరకూ నాకున్న ఇమేజ్‌ను పూర్తిస్థాయిలో మార్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లలో యాక్ట్ చేయాలన్నది నా కల. అది ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక అద్భుతమైన కథ కోసం ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్నాను. దర్శకుడు వి.సి.వడివుడయన్ కథ చెప్పిన మరుక్షణం నుండే ఈ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఎప్పటి నుంచో ఒక స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలనుకొంటున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో నాకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. వారి కోసమే ఈ సినిమా.." అని అన్నారు. 2018 ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు సెట్ వర్క్ ప్రస్తుతం వాయివేగంతో జరుగుతున్నాయి.
entertainment
2,093
20-06-2017 00:25:58
ప్రైమరీ మార్కెట్‌..
సిడిఎస్‌ఎల్‌ ఇష్యూకు తొలి రోజే రెట్టింపు స్పందనపబ్లిక్‌ ఇష్యూకు వస్తున్న ఎయు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఆఫర్‌ ధరను 355-358 రూపాయలుగా నిర్ణయించింది. గరిష్ఠ స్థాయి వద్ద ఇష్యూ సైజు 1,912 కోట్ల రూపాయలుంటుంది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగుస్తుంది. సిడిఎస్‌ఎల్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభమైన తొలి రోజు సోమవారం నాడే రెండు రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఇష్యూ సైజు 524 కోట్ల రూపాయలు. ఆఫర్‌ చేస్తున్న షేర్లు 2.48 కోట్లు కాగా 5.19 కోట్ల షేర్లకు తొలిరోజే బిడ్స్‌ వచ్చాయి. శుక్రవారం నాడు సిడిఎస్‌ఎల్‌ యాంకర్‌ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ద్వారా 154 కోట్ల రూపాయలను సమీకరించింది. ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్చేంజ్‌ పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాల్లో ఉంది. ఇష్యూ అనుమతి కోసం సెబికి దరఖాస్తు చేసింది. టాటా పవర్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌, మాడిసన్‌ ఇండియా కాపిటల్‌, మల్టీపుల్స్‌ ఆల్టర్నేటివ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి ప్రస్తుత షేర్‌ హోల్డర్లు ఇష్యూలో భాగంగా తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించే అవకాశం ఉంది.
business
16,437
20-08-2017 09:19:35
నిర్లక్ష్యమే కొంప ముంచిందా?
న్యూఢిల్లీ : ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి కారణం రైల్వే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక సమాచారం. ఈ రైలు ప్రయాణిస్తున్న మార్గంలో నిర్వహణ పనులు జరుగుతున్నట్లు ఆ రైలు డ్రైవరుకు సమాచారం అందలేదని తెలుస్తోంది. ప్రముఖ ఆంగ్ల పత్రికకు రైల్వే శాఖలోని అత్యున్న అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో మెయింటెనెన్స్ వర్క్ జరుగుతోంది, అయితే రైళ్ళ వేగంపై పరిమితులు విధించేందుకు సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం హెచ్చరిక సంకేతాలు కూడా ఇవ్వలేదు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు గంటకు 106 కి.మీ. వేగంతో ప్రయాణించింది. ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ జరిగేటపుడు గంటకు 10 నుంచి 15 కి.మీ. వేగంతో ప్రయాణించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆ మార్గంలో ప్రయాణించే రైళ్ళ డ్రైవర్లకు సరైన రీతిలో హెచ్చరికలు, సంకేతాలు అందించవలసి ఉంటుంది. ఈ ఆరోపణలను మరో రైల్వే అధికారి తోసిపుచ్చారు. ట్రాక్ చెడిపోయి ఉంటే గంటకు 106 కి.మీ. వేగంతో వెళ్తున్న ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్‌లోని 5 బోగీలు సురక్షితంగా ముందుకు వెళ్ళి ఉండేవన్నారు. ఒడిసాలోని పూరీ నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ వెళ్లే కళింగ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ శనివారం సాయంత్రం ముజఫర్‌నగర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని కటౌలీలో పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే.
nation
15,972
10-06-2017 17:57:24
మోదీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది: పవార్
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ మూడేళ్ల పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తి పడిపోయిందని, పెట్టుబడులు తగ్గిపోయాయని, ఉపాధి కల్పన అతి తక్కువగా ఉందని అన్నారు. శనివారం ఎన్‌సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవార్ మాట్లాడుతూ, దేశంలో రాజకీయ పరిస్థితి ఏమాత్రం సజావుగా లేదని, ప్రజలు తీవ్ర అంసతృప్తితో ఉన్నారని చెప్పారు. రైతుల ఆందోళనపై కూడా పవార్ ఇటీవల దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభత్వంపై నిప్పులు చెరిగారు. ఫడ్నవీస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోవడం వల్లే రైతులు ఆందోళనకు దిగారని అన్నారు. రైతుల సాకుతో రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని కొందరు కోరుకుంటున్నారని ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలను 'పిల్లతనం చేష్టలు'గా పవార్ కొట్టిపారేశారు. రైతులు ఇచ్చిన సమ్మెలో ఏ రాజకీయ పార్టీ పాల్గోలేదని, రైతు ప్రతినిధుల సారథ్యంలోనే సమ్మె జరిగిందనే విషయాన్ని ఫడ్నవిస్ గ్రహించాలని హితవు పలికారు. రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, అందుకే రైతులు ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని పవార్ పేర్కొన్నారు.
nation
16,056
11-12-2017 15:06:49
తాలిబాన్‌ వ్యవస్థాపకుడితో చిదంబరం!
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన అడ్డు తొలగించేందుకు మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్ వెళ్ళారని ఆరోపించారు. మరోవైపు మణిశంకర్ అయ్యర్, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రహస్యంగా పాకిస్థాన్ హై కమిషనర్‌తో భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి, ఆ వార్తలను మొదట ఖండించిన కాంగ్రెస్, ఆ తర్వాత ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా తాలిబాన్ నేతతో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఉన్న ఫొటో బయటపడింది. దీంతో తాలిబాన్‌తో కాంగ్రెస్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దేశ భద్రతను పట్టించుకోకుండా 2013లో అప్పటి కేంద్ర మంత్రి పి. చిదంబరం తాలిబాన్ నేతతో సమావేశమయ్యారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఫొటోను బీజేపీ విదేశీ వ్యవహారాల ఇన్‌ఛార్జి విజయ్ చౌతాయ్‌వాలే ట్వీట్ చేశారు. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ సలామ్ జయీఫ్‌తో కలిసి పి. చిదంబరం ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. 2001 వరకు తాలిబాన్ ప్రభుత్వానికి అధినేత అయిన ముల్లా ఒమర్‌కు అబ్దుల్ సలామ్ జయీఫ్ అత్యంత సన్నిహితుడు. జయీఫ్ 2005 వరకు గ్వాంటనామో బేలో జైలు జీవితం గడిపాడు. చిదంబరం 2013లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. చిదంబరం, జయీఫ్ ఉన్న ఫొటో గోవా థింక్ ఫెస్టివల్‌లో తీసినదని తెలుస్తోంది. ఈ ఫెస్టివల్‌లో ఉపన్యాసం ఇచ్చేందుకు జయీఫ్‌తోపాటు చిదంబరంను ఆహ్వానించారని తెలుస్తోంది. ‘‘2013లో పి. చిదంబరం తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ సలామ్ జయీఫ్‌తో కలిసి కనిపించారు. తాలిబాన్ ప్రభుత్వ అధినేత ముల్లా ఒమర్‌కు జయీఫ్ అత్యంత సన్నిహితుడు. ఆయన 2005 వరకు గ్వాంటనామో బేలో నిర్బంధంలో ఉన్నాడు. మరో రుజువు దొరికింది’’ అని విజయ్ చౌతాయ్‌వాలే ట్వీట్ చేశారు.
nation
9,574
28-06-2017 21:56:25
'రక్తసంబంధం'‌తో రచయితగా ముళ్లపూడి
తన రచనతో జనాలను రంజింప చేసిన ముళ్ళపూడి వెంకటరమణ చిత్రసీమలోనూ పదవిన్యాసాలతో పరవశింపచేశారు. జూన్ 28న ముళ్ళపూడి జయంతి చిత్రసీమలో అడుగు పెట్టకముందే రచయితగా మంచి పేరు సంపాదించారు ముళ్లపూడి వెంకటరమణ... సందర్భం ఏదైనా సరే అందులో సహజత్వం ఉట్టిపడుతూనే పదవిన్యాసాలు చేయించడం ముళ్ళపూడి వారి బాణీ... తొలి చిత్రం 'రక్తసంబంధం'లోనే సెంటిమెంట్ సీన్స్‌కు ముళ్ళపూడి చేసిన రచన జనం మదిని కట్టిపడేసింది. తెలుగు చిత్రసీమలో అంతకు ముందే కొన్ని సోషల్ మూవీస్‌లో మైథలాజికల్ ఫాంటసీని చొప్పించినా, ముళ్ళపూడి వెంకటరమణ రచనతో ఆ పంథా మరింత వెలుగొందింది... 'బుద్ధిమంతుడు, ముత్యాలముగ్గు' వంటి చిత్రాల్లో ముళ్ళపూడి కొన్ని పాత్రల ఊహల్లో పురాణపాత్రలను నడిపించి అలరించిన తీరు అనితరసాధ్యం అనిపించకమానదు..సినిమా రంగంలోకి రాకముందే రమణ రాతకు బాపు గీతకు స్నేహం... ఇక చిత్రసీమ 'సాక్షి'గా వారి జోడీ తెలుగువారిని పులకింప చేసింది. చివరి చిత్రం 'శ్రీరామరాజ్యం'లోనూ బాపు తీతకు రమణరాత జోడయి తెలుగు జనాన్ని అలరించింది. నేడు బాపు-రమణ ఇద్దరూ లేరు. అయినా వారి జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయి. వారు తెరకెక్కించిన చిత్రాలతో తెలుగువారి హృదయాల్లో సదా నివసిస్తూనే ఉంటారు..
entertainment
1,120
01-02-2017 04:01:56
ఆర్‌బిఐ మిగులు నిధులు పిఎస్‌బిలకే
ఆర్‌బిఐ వద్ద ఉండే మిగులు నిధులతో పాటు డీమానిటైజేషన్‌ వల్ల సమకూరిన సొమ్మును ప్రభుత్వరంగ బ్యాంకులకు అదనపు మూలధనం సమకూర్చడానికే ఉపయోగించాలి. ఈ మిగులు నిధులు సూత్రప్రాయంగా అదనపు ఆదాయంగా పరిగణనలోకి రావు. వాటిని స్వభావరీత్యా బ్యాలె న్స్‌ షీట్‌గానే పరిగణించాలి. ప్రపంచంలోనే అత్యధికంగా మూలధనం ఉన్న బ్యాంకుల్లో ఆర్‌బిఐ ఒకటి. ఆ నిధులు ఆర్‌బిఐ వద్దనే ఉండాలనడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. కాని ఆ నిధులను ఉత్పాదక కార్యకలాపాలకే వినియోగించడం హేతుబద్ధంగా ఉంటుంది. ఆ నిధులను పిఎ్‌సబిలకు అదనపు మూలధనం అందించేందు కు లేదా పిఎస్‌యు ఆస్తుల పునర్నిర్మాణ సంస్థకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు ఉపయోగిస్తే మరింత మంచిది.
business
7,073
30-07-2017 06:50:36
విశాల్ హెచ్చరికతో వెనక్కి తగ్గిన ‘ఫెఫ్సీ’..!
 షూటింగ్‌లను అడ్డుకోమని హామీసామరస్య పరిష్కారానికి విజ్ఞప్తిఆంధ్రజ్యోతి, చెన్నై: తమిళ చలనచిత్ర నిర్మాతల మండలితో ఏర్పడిన విభేదాలపై దక్షిణ భారత సినీ కార్మికుల సమ్మేళనం (ఫెఫ్సీ) వెనక్కి తగ్గింది. ఫెఫ్సీలో సభ్యులుగా ఉన్న కొంతమంది తప్పిదం వల్లే ఈ సమస్య ఏర్పడిందని, ఇందుకు తీవ్రవిచారం చేస్తున్నామని పేర్కొంటూ... సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి శనివారం నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ను కోరారు. వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ మదురైలో జరుగుతున్న ‘బిల్లా పాండి’ చిత్రం షూటింగ్‌ను కొన్నిరోజుల క్రితం ఫెఫ్సీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో సదరు చిత్ర నిర్మాతకు నష్టం ఏర్పడింది. ఈ విషయంపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయడం, ఫెఫ్సీతో జరిపిన చర్చలు విఫలం కావడంతో.. ఫెఫ్సీ సభ్యులతోనే సినిమా షూటింగ్‌లు జరుపాలన్న నిబంధనేమి లేదని, బయటి కార్మికులతో షూటింగ్‌లు చేస్తామని విశాల్‌ ప్రకటించారు. సినిమా షూటింగ్‌లు అడ్డుకుంటే సహించమని హెచ్చరించారు. దీంతో ఫెఫ్సీ వెనక్కి తగ్గింది.                ఈ మేరకు ఫెఫ్సీ అధ్యక్షుడు సెల్వమణి నిర్మాతల మండలి ఒక లేఖ రాస్తూ... ‘కొంతమంది నిర్మాతలు, ఫెఫ్సీ సభ్యుల మధ్య వ్యక్తిగత సమస్యల కారణంగానే ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇటువంటి సంఘటనల్ని ఫెఫ్సీ కూడా ప్రోత్సహించదు. ‘బిల్లా పాండి’ షూటింగ్‌ని అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం. నిర్మాతలకి వ్యతిరేకంగా ఫెఫ్సీ సభ్యులెవ్వరూ బహిరంగ వ్యాఖ్యలు చేయరు. ఒకవేళ నిర్మాతల పట్ల అనుచితంగా ప్రవర్తించుంటే క్షమాపణలు చెప్పేందుకు కూడా సిద్దం’ అని పేర్కొన్నారు. ఈ లేఖపై విశాల్‌, నిర్మాతల మండలి సభ్యుల నుంచి సానుకూల స్పందన లభించింది. ఫెఫ్సీతో చర్చలు జరుపుతామని మరోసారి విశాల్‌ స్పష్టం చేశారు.
entertainment
16,362
26-02-2017 18:20:37
కేజ్రీవాల్‌కు నితీశ్ షాక్!
న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు బీహార్ సిఎం నితీశ్ కుమార్ షాకిచ్చారు. ఏప్రిల్‌లో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో మొత్తం 272 స్థానాలకు జెడియూ పార్టీ పోటీ చేయనుంది. ఆయన స్వయంగా రెండు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే 109 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించి దూకుడుగా వెళ్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీకి నితీశ్ పార్టీ తాజా ప్రకటనతో బ్రేక్ వేసినట్లైంది. ఓ వైపు బిజెపి నుంచి ఆప్‌కు ప్రధాన పోటీ ఉండనుంది. ఈలోగా నితీశ్ కూడా బరిలోకి దిగుతుండటంతో ఎంసీడీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి.
nation
7,222
11-08-2017 10:43:54
18 ఏళ్ల తర్వాత మహేశ్ సినిమాలో కృష్ణ..!
వరుస సినిమాలతో దూకుడు పెంచాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. ‘స్పైడర్’ షూటింగ్‌‌లో పాల్గొంటూనే ‘భరత్ అను నేను’ సినిమా కొబ్బరి కాయ కొట్టేశాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తను విన్న మహేశ్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారట..! ఇంతకీ ఏమిటా వార్త..?        కొరటాల శివ డైరెక్షన్‌లో ప్రస్తుతం మహేశ్ ‘భరత్ అను నేను’ సినిమా చేస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సూపర్ స్టార్ కృష్ణను సంప్రదించాడట కొరటాల శివ. దానికి ఆయన కూడా ఓకే చెప్పేశారట. దాదాపు 18 సంవత్సరాల తర్వాత కృష్ణ కొడుకు సినిమాలో నటించనుండడంతో ఈ సినిమా మహేశ్ కుటుంబానికి, వాళ్ల అభిమానులకు చాలా ప్రత్యేకమైనది అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటులు నటిస్తున్నాడట..! కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నవిషయం తెలిసిందే..!        కృష్ణ హీరోగా నటించిన కొన్ని సినిమాల్లో మహేశ్ బాల నటుడిగా నటించగా, మహేశ్ హీరోగా నటించిన కొన్ని సినిమాలలో కృష్ణ అతిథి పాత్రల్లో కనిపించి మెప్పించారు. అయితే ఈసారి మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లినట్టు కాకుండా సినిమాలో కీలకమైన ఓ పాత్రను ఆయన పోషించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మహేశ్ కానీ, చిత్ర బృందం కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ నటించిన ‘స్పైడర్’ సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తండ్రికి ఇష్టం లేకున్నా ఆ హీరో రాజకీయాల్లోకి వచ్చాడట
entertainment
8,251
22-08-2017 22:23:02
తెరపై చరిత్రకు.. సైరా!
చిరంజీవి, అమితాబ్‌ తొలి కాంబినేషన్‌అభిమానులు, సగటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంజీవి తాజా చిత్రానికి ‘సైరా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘నరసింహారెడ్డి’ అనేది ఉప శీర్షిక. దేశంలో తెల్లదొరలపై పోరాడిన తొలి స్వాతంత్య్ర సమరయోధునిగా చరిత్రకెక్కిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తీస్తున్న సినిమా కాబట్టి అదే పేరు పెడతారని ఇప్పటివరకూ అందరూ ఊహించారు. దాంతో పాటే ‘మహావీర’ అనే టైటిల్‌ కూడా వినిపించింది. కానీ అనూహ్యంగా ‘సైరా’ అనే టైటిల్‌ పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం అభిమానుల సమక్షంలో కోలాహలంగా జరిగిన కార్యక్రమంలో ‘బాహుబలి’ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ‘సైరా’ ఫస్ట్‌లుక్‌ మోషన్‌ ప్టోసర్‌ను ఆవిష్కరించారు. ఎదురుగా కోటపై ఎగురుతున్న ఆంగ్లేయుల జెండా కాలిపోతుంటే, బయట గుట్టలుగా బ్రిటీష్‌ సైనికుల శవాలు పడుంటే.. ఓ చేత్తో విల్లు, మరో చేత్తో కరవాలం పట్టుకొని, భుజాన అమ్ములపొది తగిలించుకుని వెనక్కి తిరిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి దర్శనమిచ్చారు. ఇందులో ఆయన ముఖాన్ని వెల్లడిచేయక పోవడం గమనార్హం. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. టైటిల్‌ లోగోను అల్లు అరవింద్‌, తారాగణం, సాంకేతిక నిపుణుల పోస్టర్‌ను పరుచూరి బ్రదర్స్‌, వరుణ్‌తేజ్‌ ఆవిష్కరించారు. రాజమౌళి మాట్లాడుతూ ‘‘మెగాస్టార్‌ ముఖం చూపించకుండా వెనుక నుంచి డిజైన్‌ చేసిన లుక్‌ అదిరిపోయింది. తారాగణం సూపర్బ్‌గా ఉంది. ‘బాహుబలి’ సక్సెస్‌ అయ్యిందంటే టెక్నీషియన్లే కారణం. ఈ సినిమాకు స్టార్‌ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. దర్శకుడు సురేందర్‌రెడ్డికి 24 శాఖలపై మంచి పట్టుంది. ఇవన్నీ చూస్తుంటే ఇది చిరంజీవి 151వ సినిమాలా కాకుండా ఆయన మొదటి సినిమాలా అనిపిస్తోంది.’’ అన్నారు. తన కెరీర్‌లో మొదటి బ్లాక్‌బస్టర్‌ అందించిన రాజమౌళి చేతుల మీదుగా మోషన్‌ పోస్టర్‌ ఆవిష్కరించడం సంతోషంగా ఉందని రామ్‌చరణ్‌ అన్నారు. ‘‘మోషన్‌ పోస్టర్‌ను ఎలా ప్రెజెంట్‌ చేయాలా అని వారం రోజులుగా టెన్షన్‌ పడుతున్నాం. ఆంజనేయస్వామి శక్తివల్లే అమితాబ్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి వంటి స్టార్లు మా సినిమాలో భాగమయ్యారు’’ అని ఆయన చెప్పారు. అరవింద్‌ మాట్లాడుతూ ‘‘చిరంజీవిగారు సినీ పరిశ్రమకు వచ్చి 40 ఏళ్లు. అందులో ఆయనతో నాది 37 ఏళ్ల జర్నీ. ‘సైరా.. నరసింహారెడ్డి’ని మాకు అత్యంత ఆప్తుడైన సూరి (సురేందర్‌రెడ్డి) డైరెక్ట్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. చరిత్ర ఎప్పుడు, ఎవర్ని ఎందుకు ఎంచుకుంటుందో తెలీదు. ఈసారి సూరి వంతైంది. భారతీయ సినిమా చరిత్రలో ఇది బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’’ అన్నారు. ‘సైరా.. నరసింహారెడ్డి’ పేరు చెబితేనే తనకు వణుకు పుడుతోందని సురేందర్‌రెడ్డి చెప్పారు. ‘‘నాపై చాలా పెద్ద బాధ్యత పెట్టారు. నా ఫోకస్‌ మొత్తం ఈ సినిమాపైనే. దాన్ని బ్లాక్‌బస్టర్‌ చేయడమే నా ముందున్న లక్ష్యం’’ అని ఆయన తెలిపారు.  ఇది నా ఆశలకు ప్రతిరూపం: చిరంజీవిఈ కార్యక్రమానికి స్వయంగా హాజరుకాని చిరంజీవి ప్రత్యేక వీడియో ద్వారా తన భావాలను పంచుకున్నారు. ‘‘నా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో, లేక నేను చేసుకున్న పుణ్యమో.. ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. వాళ్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. వాళ్లు గర్వపడే సినిమాలు, పది కాలాల పాటు చెప్పుకొనే పాత్రలు చేయగలను. భగత్‌సింగ్‌ పాత్రలో నటించాలని చాలా సార్లు అనుకున్నా. ఇన్నాళ్లకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రూపంలో నా ఆశలకు, అభిమానుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచే పాత్ర దొరికింది. మన స్వాతంత్య్ర పోరాటానికి ఆద్యులు, పోరాట యోధులందరికీ ఆరాధ్యులు, మన తెలుగుబిడ్డ అయిన ఉయ్యాలవాడ పాత్ర దొరకడం గొప్ప అవకాశం. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా అద్భుత దృశ్యకావ్యం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగువాళ్లు గర్వించేలా ఓ చరిత్ర సృష్టించిన దర్శక బాహుబలి రాజమౌళి ఆశీస్సులు అందుకోవడం నిర్మాత చరణ్‌కు, ఈ సినిమాకు శుభ సూచకం’’ అని ఆయన చెప్పారు.
entertainment
4,050
13-12-2017 00:53:37
తెలంగాణ సాహితీ కళా వైభవం
తెలంగాణ ఒక తరగని సాహిత్య గని. తెలంగాణా సాహిత్యం ఇతర భాషా కవులు, కళాకారులను ఎంతగానో కదిలించింది. ఈ నేల కీర్తిని, చరి త్రను పొగడనివారెవ్వరు? తెలంగాణ, తెలంగాణ సాయుధపోరాటం ప్రపంచ చరిత్రలోనే ఎన్నదగినది. మట్టి చరిత్రే మనిషి చరిత్ర, మట్టి మినహా మనిషికి చరిత్రే లేదు. ముందుగా ఈ మట్టికి మొక్కుదాం. ఈ తెలంగాణ నేల పోరాట పటిమ ప్రపంచ మేధావుల, పోరాట యోధుల మెప్పు పొందింది. లెనిన్ లాంటి విప్లవ మహా యోధులచే కొనియాడబడింది. నెరుడాలాంటి కవులచే కీర్తించబడింది. ఆంధ్ర ప్రాంతపు ఆరుద్ర లాంటి ప్రసిద్ధ కవిచేత ‘త్వమే వాహం’ కావ్యం రాయించుకొంది. అభ్యుదయవాది సోమసుందర్ చేత ‘వజ్రాయుధం’ కావ్యం రాయించుకొంది. శేషేంద్ర శర్మ లాంటి కవుల చేత 1947, 1948లలో ‘విశాలాంధ్ర’ పత్రికలో తెలంగాణపై కవిత్వం రాయించుకొంది. కుందుర్తి ‘తెలంగాణ’ కావ్యం రాసారు. సుద్దాల హనుమంతు, యాదగిరి లాంటి ఎందరో విప్లవ యోధులు స్వయంగా పోరాటంలో పాల్గొని అమూల్యమైన పాటలు రాశారు. సాహిత్యాన్ని సృష్టించారు. ‘మా భూమి’ లాంటి నాటకాలు పుట్టాయి. బౌద్ధం, జైనం పరిఢవిల్లిన ఈ నేల చరిత్ర లోకానికి తెలి యాల్సినంతగా తెలియ లేదు. క్రీస్తు పూర్వం మగధులు, నందులు, మౌర్యులు ఈ నేలను పరిపాలించిన ఆధారాలు ఉన్నాయి. పూర్వ శాతవాహనులైన సమగోప, నారన, గోబధలు పరిపాలించిన ఆధారాలు నాణాలతో సహా దొరికిన ప్రాంతమిది. ఇందుకు కరీంనగర్ జిల్లా లోని పెద్దబొంకూర్ తవ్వకాలే సాక్ష్యం. శాతవాహనుల తొలి రాజధాని అయిన కోటిలింగాల నేటి కరీంనగర్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉంది. శాతవాహనుల తరువాత ఇక్ష్వాకులు, త్రైకూటకులు, బాదామి చాళుఖ్యులు, వేములవాడ చాళుఖ్యులు, కళ్యాణి చాళుఖ్యులు, ముదిగొండ చాళుఖ్యులు, కుందూరు చోడులు, విష్ణుకుండినులు, వాకాటకులు, కాకతీయులు, పద్మ నాయకులు, విజయనగర రాజులు, బహమనీలు, కుతుబ్ షాహీలు, మొగలులు, నిజాం ప్రభువులు ఈ నేలను పరిపాలించారు. త్రిలింగ దేశమైన ఈ తెలంగాణం – కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం అనే మూడు లింగాల మధ్యనున్న ప్రదేశం. ఆ త్రిలింగ దేశాన్ని తొలి శాతవాహనులు నేటి కరీంనగర్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ‘కోటిలింగాల’ను రాజధానిగా చేసుకొని పాలించారు. అంతకు పూర్వం శాతవాహనులైన సమగోప, నారన, గోబధలు పాలించారు. క్రీస్తు పూర్వం ఇక్కడే బౌద్ధం, జైన మతాలూ వర్ధిల్లాయి. వేములవాడ గుళ్ళు గోపురాలు, దూళికట్ట బౌద్ధ చైత్యాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. బౌద్ధ గురువు బావరి నేటి కరీంనగర్, నిజామాబాద్ సరిహద్దు గ్రామం బాదనకుర్తి వాసి అని, జైన మత గురువు ఋషబునికి, బాహుబలికి బోధన్ తో సంబంధాలున్నాయనీ ఆధారాలున్నాయి. శాతవాహన రాజ్యం అస్మక జనపదం అని, అస్మకులు, మూలకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారని చరిత్ర చెబుతోంది. భారత ప్రభుత్వం అధికారికంగా తీసుకున్న క్యాలెండర్ శక సంవత్సరం శాతవాహన, శాలివాహన కాలం ఆధారంగా రూపుదిద్దబడినది. హాలుడి గాథా సప్త శతి, గుణాఢ్యుడి బృహత్కథ, సోమ దేవసూరి కథా సరిత్సాగారం, పంపకవి సోదరుడు జినవల్లభుడి కురిక్యాల శాసనాలు, కోనసముద్రం ఇనుము ఉక్కు పరిశ్రమలు, అజంతా, ఎల్లోరా, శిల్ప చిత్ర కళలు తెలంగాణ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాధారాలు. సాహిత్య, కళా, సాంస్కృతిక రంగాలలో రాణిస్తూ జాలువారే జాను తెనుగు ద్విపద కావ్యాల పాల్కురికి సోమన్నలు, సహజ కవితాధార మహాభాగవతం సృష్టికర్త బమ్మెర పోతన్నలు వెలసిన నేల ఇది. అచ్చ తెలుగు తొలి కావ్యం ‘యయాతి చరిత్ర’ రాసిన పొన్నెగంటి తెలుగన్న తెలంగాణ ప్రాంతపు నేటి పటాన్ చెరువు వాసి. నల్లగొండ ప్రాంతం సర్వజ్ఞ భూపాల సారస్వతపు నేల, ఓరుగల్లు కాకతీయుల కాలం నాటి జాయపసేనాని ‘పద రత్నావళులు’, మడికి సింగన, కందనామాత్యుడు, పోతన మహాకవి శిష్యుడు వెలగందుల నారయ, చరికొండ ధర్మన్నలు, కొరవి గోపరాజులు, దోమకొండ కవులు, పద్మపురాణాలు, గద్వాల సంస్థాన కవులు, గోన బుద్ధారెడ్డి తొలి రామాయణం, అప్ప కవీయం లాంటి లాక్షణిక గ్రంథాలు వెలసిన నేల ఇది. ఆధునిక తెలంగాణ సాహితీ సాంస్కృతిక, సామాజిక రంగాలలో దాశరథి సోదరులు, కాళోజి, వట్టికోట, సినారె తదితర ఎందరో గొప్ప కవులు పుట్టిన నేల ఇది. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచిక, షబ్నవీస్ తొలి తెలుగు నీలగిరి పత్రిక, చర్విరాల భాగయ్య యక్షగానాలు వెలసిన నేల ఇది. భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి లాంటి సంఘ సంస్కర్తలు, పి.టి.రెడ్డి, కాపు రాజయ్య లాంటి చిత్రకారులు, శిల్పకారులు పుట్టిన నేల ఇది. ‘ఊరుమ్మడి బతుకులు’, ‘మా భూమి’, ‘రంగుల కల’ లాంటి ఉత్తమ సినిమాలు నిర్మించిన ప్రాంతమిది. జ్ఞానపీఠాలకు నిలయమై, దేశానికి ప్రధానిని అందించి, ఉద్యమాలకు ఊపిరై అందర్నీ అక్కున చేర్చుకొని ఆదరించే కన్నతల్లి ఈ తెలంగాణం.సబ్బని లక్ష్మీనారాయణ
editorial
9,946
30-07-2017 18:49:27
సుకుమార్ ‌ని సేఫ్‌గా బయటపడేసిన బన్నీ!
దర్శకుడు సుకుమార్ ఓ అపాయంలో ఉండగా బన్నీ సాహసం చేసిమరీ సుకుమార్ ని రక్షించి సేఫ్ గాబయటపడేసాడట. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా వెల్లడించాడు. సుకుమార్ నిర్మించిన 'దర్శకుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని బయటపెట్టాడు సుకుమార్. అయితే బన్నీ చేసిన ఆ సాహసం ఏంటో వివరాల్లోకి వెళితే..'ఆర్య' సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ నదిలో 'ఏదో ప్రియరాగం వింటున్నా..' పాట చిత్రీకరణ సమయంలో అంతా పడవలో ప్రయాణిస్తున్నారట. అయితే ఆ పడవలో సుకుమార్ ఓ వైపు చివరన కూర్చోగా.. హీరోయిన్ కదపడంతో అదుపుతప్పి నీటిలో పడ్డాడట సుక్కు. ఆ సమయంలో అతన్ని రక్షించడానికి యూనిట్ సభ్యులెవరూ సాహసం చేయకున్నా.. బన్నీ మాత్రం వెంటనే సాహసంగా నీళ్ళలోకి దూకి సుకుమార్ ని రక్షించడానికి ప్రయత్నించాడట. ఆ సమయంలో నాకు ఈతరాదు. బన్నీ రక్షించడంలో ఏమైనా తేడా వస్తే ఇద్దరి ప్రాణాలకు ప్రమాదమే ఉండేదని ఈ సందర్బంగా సుకుమార్ తెలియజేశాడు. ఇందుకోసం బన్నీకి నేను కృతజ్ఞతలు తెలుపమని, ఎందుకంటే బన్నీ తనవల్లే హీరో అయ్యాడంటూ జోక్స్‌తో అందరినీ నవ్వించాడు సుక్కు.
entertainment
11,701
03-08-2017 00:23:30
సూర్యుడి మధ్య భాగానికి స్పీడెక్కువ!
ఉపరితలం కంటే నాలుగు రెట్లు వేగంగా భ్రమణంలాస్‌ఏంజెలిస్‌, ఆగస్టు 2: సూర్యుడి ఉపరితలం కంటేనూ మధ్యభాగం నాలు గు రెట్లు వేగంగా భ్రమణం చెందుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇప్పటి వరకు సూర్యుడి ఉపరితలం, మధ్యభాగం రెండూ ఒకే వేగంతో భ్రమించేవని నమ్ముతూ వచ్చామని, అయితే, తాజా విషయం అంతా ఆశ్చర్యంగా ఉందని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు తెలిపారు. దీంతో సూర్యుడు ఎలా ఏర్పడ్డాడో తెలుసుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుడు ఏర్పడిన తర్వాత ఉపరితల వేగం తగ్గి ఉండవచ్చని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఆ కారణంగానే సూర్యుడిపై మచ్చల(సన్‌స్పాట్‌)పైనా ప్రభావం పడి ఉండొచ్చ న్నారు. సన్‌స్పాట్‌ చాలా పెద్దదిగా ఉంటుందని, ఒక్కో టి భూమికంటే ఎక్కువ వ్యాసం కలిగి ఉంటుందన్నారు.
nation
3,907
17-05-2017 01:35:38
స్కూల్‌ ఫీజులు పెద్ద సమస్యే!
ప్రైవేట్‌ స్కూళ్ళలో అధిక ఫీజులు, తదితర సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం. శాశ్వత పరిష్కారం కోసం ప్రైవేట్‌ స్కూళ్ళ నియంత్రణ చట్టం తేవాలని ప్రభుత్వంతో పోరాడుతూనే, తక్షణ ఉపశమన చర్యల కోసం ప్రైవేటు యాజమాన్యాలతోనే పోరాడాలి. ఉద్యమాల్లో అనుభవం కలిగిన ప్రజాసంఘాల తోడ్పాటుతో తల్లిదండ్రులు ఐక్యమై ఉద్యమాల బాటపట్టాలి. ప్రైవేట్‌ విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి. ప్రైవేట్‌ స్కూళ్ళలో ఫీజుల సమస్య తల్లితండ్రులతో పాటు ప్రభుత్వానికీ పెద్ద సవాల్‌ గా తయారైంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ప్రైవేట్‌ స్కూళ్ళలో విద్యార్థులు అత్యధికం. దేశం మొత్తమ్మీద సగటున 40 శాతం బడి పిల్లలు ప్రైవేట్‌ స్కూళ్ళలో ఉంటే తెలంగాణలో 54 శాతం (33 లక్షల) మంది ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సగటున ఏటా 1.20 లక్షల మంది ప్రైవేట్‌ స్కూళ్ళలో చేరుతూ ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ మూడేళ్ళలో కూడా సగటున 65వేల మంది చేరుతున్నట్లు విద్యా గణాంకాల ద్వారా తెలుస్తోంది. సర్కార్‌ బడుల్లో చదువు సరిగా లేదనే అసంతృప్తితో తల్లిదండ్రులు తమ బిడ్డలకు నాణ్యమైన విద్య కోసమని ప్రైవేట్‌ స్కూళ్ళను ఆశ్రయిస్తున్నారు. అది విద్యా వ్యాపారులకు మంచి వాటంగా మారింది. ప్రభుత్వ నియంత్రణ కూడా లేకపోవడంతో ఇష్టానురాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రైవేట్‌ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం నియమించిన కమిటీతో సమస్య పరిష్కారం అవుతుందా అనేది తాజా చర్చనీయాంశం. ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఆచార్య టి. తిరుపతిరావు చైర్మన్‌గా, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు జి.కిషన్‌ కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో నలుగురు విషయ నిపుణులు కాగా తల్లిదండ్రుల ప్రతినిధులు ఇద్దరు, ప్రైవేట్‌ మేనేజ్‌మెంటు ప్రతినిధులు ఐదుగురు వున్నారు. 2017 మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 10 వరకు నాలుగు విడతల సమావేశాలు జరిగాయి. గత అనుభవాల నేపథ్యంలో ఫీజుల నియంత్రణ కోసం విద్యా శాఖ చేసిన ప్రతిపాదనలు పరిశీలించి తమ సూచనలు, సవరణలు చేయడమే ఈ కమిటీ సభ్యుల బాధ్యత. విద్యాశాఖ ప్రతిపాదనలలో చాలావరకు ఫీజులు నిర్ణయించడానికి అవసరమైన వివిధ అంశాలు సహేతుకంగానే వున్నాయి. పేరెంట్స్‌ ప్రతినిధులు వాటిని సమర్థించడంతోపాటు మరింత బలపర్చే ప్రతిపాదనలు జోడించారు. యాజమాన్యాల ప్రతినిధులు పలు అంశాలను వ్యతిరేకించారు. ప్రభుత్వ గుర్తింపు గల ఏ ప్రైవేట్ స్కూల్‌ అయినా ఎలాంటి డొనేషన్స్‌ తీసుకోకూడదు. ఏ స్కూల్‌ కయినా ఇదే నిబంధన వర్తిస్తుంది. అడ్మిషన్‌ సమయంలో అప్లికేషన్‌కి రూ.100, రిజిస్ట్రేషన్‌కు రూ.500, కాషన్‌ డిపాజిట్‌ (రిఫన్డబుల్‌)గా రూ.5000 మించకుండా వన్‌టైమ్‌ ఫీజులు తీసుకోవచ్చు. సిబ్బందికి చెల్లించే జీతాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, నిర్వహణా ఖర్చులు, వసతులు, అభివృద్ధికయ్యే ఖర్చుల ఆధారంగా ట్యూషన్‌ ఫీజు నిర్ణయించాలి. ఎడిషనల్‌ యాక్టివిటీస్‌కు అయ్యే ఖర్చులను ట్యూషన్‌ ఫీజుకి కలపకూడదు. బుక్స్‌, యూనిఫామ్స్‌, స్టేషనరీ వగైరా కోసం మార్కెట్‌లోని మూడు షాపులను నోటిఫైచేయాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ చైర్మన్‌గా, డిఈఓ, ఆడిట్‌ ఆఫీసర్‌తో డిస్ట్రిక్ట్‌ ఫీ రెగ్యులేషన్‌ కమిటీ ఉండాలి. రూ.500 మించని ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఒకసారి నిర్ణయించిన ఫీజు మూడు విద్యా సంవత్సరాలకు వర్తించాలి. ఐఐటి, ఒలింపియాడ్‌ , కాన్సెప్ట్‌, టెక్నో వగైరా ఫ్యాన్సీ పేర్లతో స్కూల్స్‌ ప్రచారం చేసుకోకూడదు. తెలంగాణ తల్లిదండ్రుల సంఘం సూచనలు కొన్ని: (1) అకడమిక్ ఇయర్‌ ప్రతి ఏటా జూన్‌ 12 నుంచి ఏప్రిల్‌ 23 వరకు వుండే విధానాన్నే కొనసాగించాలి. మార్చి 21 నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించి ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులివ్వడం వల్ల అదనపు ప్రయోజనం లేకపోగా నష్టం జరుగుతుంది. దేశమంతటికీ వర్తించే సీబీఎస్‌–ఈ అకడమిక్ ఇయర్‌ని యథాతథంగా రాష్ట్రానికి అమలుచేయడం సరైంది కాదు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు స్వతంత్ర అకడమిక్ షెడ్యూలు వుండాలి. (2) పైవేట్‌ స్కూళ్ళ స్థాపన, నిర్వహణ, నియంత్రణ తో పాటు ఫీజుల నిర్ణయానికి సంబంధించన ప్రాతిపదికలతో కూడిన సమగ్రమైన రూల్స్‌ గల జీఓ.1/ 1994ను సమర్థంగా అమలుపరచాలి. (3) ప్రైవేట్‌ స్కూళ్ళలో ప్రభుత్వ నిబంధలు అమలుజరుగుతున్న తీరును పరిశీలించడానికి, అక్రమ చర్యలు వెలికితీయడానికి సోషల్‌ ఆడిట్‌ కమిటీని నియమించాలి. ఈ కమిటీలో అధికారులు, బాలల హక్కుల సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు, న్యాయవాదులు, సామాజిక సంస్థల ప్రతినిధులు వుండాలి. (4) ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను అమలుచేయని ప్రైవేట్‌ స్కూళ్ళ గుర్తింపును రద్దుచేయాలి. ఆ విధంగా ప్రభుత్వ గుర్తింపు రద్దుకు గురయ్యే ప్రైవేట్ స్కూళ్ళను ఆరునెలల ముందుగానే బహిరంగంగా ప్రకటించి సదరు స్కూళ్ళలోని విద్యార్థులను గుర్తింపుగల స్కూళ్ళలో చేర్చుకొనే అవకాశం కల్పించాలి (5) ఫీజులు చెల్లించలేదనీ, ఇతర కారణాలతో విద్యార్థులను శిక్షలకు గురిచేస్తూ, తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్న ప్రైవేట్‌ స్కూళ్ళపైన క్రిమినల్‌ కేసులు పెట్టాలి. (6) ప్రైవేట్‌ స్కూళ్ళు ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహించే బ్రాంచీలు, సెక్షన్స్‌ను నిషేధించాలి. (7) ప్రైవేట్‌ స్కూళ్లలో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడానికి ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నంబర్‌ను అమలు చేయాలి. దాని యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టున నెలకు ఒకసారి బహిరంగంగా ప్రకటించాలి. ప్రైవేట్‌ స్కూళ్ళలో అధిక ఫీజులు, తదితర సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం. శాశ్వత పరిష్కారం కోసం ప్రైవేట్‌ స్కూళ్ళ నియంత్రణ చట్టం తేవాలని ప్రభుత్వంతో పోరాడుతూనే, తక్షణ ఉపశమన చర్యల కోసం ప్రైవేటు యాజమాన్యాలతోనే పోరాడాలి. ఉద్యమాల్లో అనుభవం కలిగిన ప్రజాసంఘాల తోడ్పాటుతో తల్లిదండ్రులు ఐక్యమై ఉద్యమాల బాటపట్టాలి. ప్రైవేట్‌ విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి. నాగటి నారాయణప్రైవేట్‌ స్కూళ్ళలో ఫీజుల సమస్య తల్లితండ్రులతో పాటు ప్రభుత్వానికీ పెద్ద సవాల్‌ గా తయారైంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ప్రైవేట్‌ స్కూళ్ళలో విద్యార్థులు అత్యధికం. దేశం మొత్తమ్మీద సగటున 40 శాతం బడి పిల్లలు ప్రైవేట్‌ స్కూళ్ళలో ఉంటే తెలంగాణలో 54 శాతం (33 లక్షల) మంది ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సగటున ఏటా 1.20 లక్షల మంది ప్రైవేట్‌ స్కూళ్ళలో చేరుతూ ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ మూడేళ్ళలో కూడా సగటున 65వేల మంది చేరుతున్నట్లు విద్యా గణాంకాల ద్వారా తెలుస్తోంది. సర్కార్‌ బడుల్లో చదువు సరిగా లేదనే అసంతృప్తితో తల్లిదండ్రులు తమ బిడ్డలకు నాణ్యమైన విద్య కోసమని ప్రైవేట్‌ స్కూళ్ళను ఆశ్రయిస్తున్నారు. అది విద్యా వ్యాపారులకు మంచి వాటంగా మారింది. ప్రభుత్వ నియంత్రణ కూడా లేకపోవడంతో ఇష్టానురాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రైవేట్‌ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం నియమించిన కమిటీతో సమస్య పరిష్కారం అవుతుందా అనేది తాజా చర్చనీయాంశం. ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఆచార్య టి. తిరుపతిరావు చైర్మన్‌గా, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు జి.కిషన్‌ కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో నలుగురు విషయ నిపుణులు కాగా తల్లిదండ్రుల ప్రతినిధులు ఇద్దరు, ప్రైవేట్‌ మేనేజ్‌మెంటు ప్రతినిధులు ఐదుగురు వున్నారు. 2017 మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 10 వరకు నాలుగు విడతల సమావేశాలు జరిగాయి. గత అనుభవాల నేపథ్యంలో ఫీజుల నియంత్రణ కోసం విద్యా శాఖ చేసిన ప్రతిపాదనలు పరిశీలించి తమ సూచనలు, సవరణలు చేయడమే ఈ కమిటీ సభ్యుల బాధ్యత. విద్యాశాఖ ప్రతిపాదనలలో చాలావరకు ఫీజులు నిర్ణయించడానికి అవసరమైన వివిధ అంశాలు సహేతుకంగానే వున్నాయి. పేరెంట్స్‌ ప్రతినిధులు వాటిని సమర్థించడంతోపాటు మరింత బలపర్చే ప్రతిపాదనలు జోడించారు. యాజమాన్యాల ప్రతినిధులు పలు అంశాలను వ్యతిరేకించారు. ప్రభుత్వ గుర్తింపు గల ఏ ప్రైవేట్ స్కూల్‌ అయినా ఎలాంటి డొనేషన్స్‌ తీసుకోకూడదు. ఏ స్కూల్‌ కయినా ఇదే నిబంధన వర్తిస్తుంది. అడ్మిషన్‌ సమయంలో అప్లికేషన్‌కి రూ.100, రిజిస్ట్రేషన్‌కు రూ.500, కాషన్‌ డిపాజిట్‌ (రిఫన్డబుల్‌)గా రూ.5000 మించకుండా వన్‌టైమ్‌ ఫీజులు తీసుకోవచ్చు. సిబ్బందికి చెల్లించే జీతాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, నిర్వహణా ఖర్చులు, వసతులు, అభివృద్ధికయ్యే ఖర్చుల ఆధారంగా ట్యూషన్‌ ఫీజు నిర్ణయించాలి. ఎడిషనల్‌ యాక్టివిటీస్‌కు అయ్యే ఖర్చులను ట్యూషన్‌ ఫీజుకి కలపకూడదు. బుక్స్‌, యూనిఫామ్స్‌, స్టేషనరీ వగైరా కోసం మార్కెట్‌లోని మూడు షాపులను నోటిఫైచేయాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ చైర్మన్‌గా, డిఈఓ, ఆడిట్‌ ఆఫీసర్‌తో డిస్ట్రిక్ట్‌ ఫీ రెగ్యులేషన్‌ కమిటీ ఉండాలి. రూ.500 మించని ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఒకసారి నిర్ణయించిన ఫీజు మూడు విద్యా సంవత్సరాలకు వర్తించాలి. ఐఐటి, ఒలింపియాడ్‌ , కాన్సెప్ట్‌, టెక్నో వగైరా ఫ్యాన్సీ పేర్లతో స్కూల్స్‌ ప్రచారం చేసుకోకూడదు. తెలంగాణ తల్లిదండ్రుల సంఘం సూచనలు కొన్ని: (1) అకడమిక్ ఇయర్‌ ప్రతి ఏటా జూన్‌ 12 నుంచి ఏప్రిల్‌ 23 వరకు వుండే విధానాన్నే కొనసాగించాలి. మార్చి 21 నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించి ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులివ్వడం వల్ల అదనపు ప్రయోజనం లేకపోగా నష్టం జరుగుతుంది. దేశమంతటికీ వర్తించే సీబీఎస్‌–ఈ అకడమిక్ ఇయర్‌ని యథాతథంగా రాష్ట్రానికి అమలుచేయడం సరైంది కాదు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు స్వతంత్ర అకడమిక్ షెడ్యూలు వుండాలి. (2) పైవేట్‌ స్కూళ్ళ స్థాపన, నిర్వహణ, నియంత్రణ తో పాటు ఫీజుల నిర్ణయానికి సంబంధించన ప్రాతిపదికలతో కూడిన సమగ్రమైన రూల్స్‌ గల జీఓ.1/ 1994ను సమర్థంగా అమలుపరచాలి. (3) ప్రైవేట్‌ స్కూళ్ళలో ప్రభుత్వ నిబంధలు అమలుజరుగుతున్న తీరును పరిశీలించడానికి, అక్రమ చర్యలు వెలికితీయడానికి సోషల్‌ ఆడిట్‌ కమిటీని నియమించాలి. ఈ కమిటీలో అధికారులు, బాలల హక్కుల సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు, న్యాయవాదులు, సామాజిక సంస్థల ప్రతినిధులు వుండాలి. (4) ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను అమలుచేయని ప్రైవేట్‌ స్కూళ్ళ గుర్తింపును రద్దుచేయాలి. ఆ విధంగా ప్రభుత్వ గుర్తింపు రద్దుకు గురయ్యే ప్రైవేట్ స్కూళ్ళను ఆరునెలల ముందుగానే బహిరంగంగా ప్రకటించి సదరు స్కూళ్ళలోని విద్యార్థులను గుర్తింపుగల స్కూళ్ళలో చేర్చుకొనే అవకాశం కల్పించాలి (5) ఫీజులు చెల్లించలేదనీ, ఇతర కారణాలతో విద్యార్థులను శిక్షలకు గురిచేస్తూ, తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్న ప్రైవేట్‌ స్కూళ్ళపైన క్రిమినల్‌ కేసులు పెట్టాలి. (6) ప్రైవేట్‌ స్కూళ్ళు ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహించే బ్రాంచీలు, సెక్షన్స్‌ను నిషేధించాలి. (7) ప్రైవేట్‌ స్కూళ్లలో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడానికి ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నంబర్‌ను అమలు చేయాలి. దాని యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టున నెలకు ఒకసారి బహిరంగంగా ప్రకటించాలి. ప్రైవేట్‌ స్కూళ్ళలో అధిక ఫీజులు, తదితర సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం. శాశ్వత పరిష్కారం కోసం ప్రైవేట్‌ స్కూళ్ళ నియంత్రణ చట్టం తేవాలని ప్రభుత్వంతో పోరాడుతూనే, తక్షణ ఉపశమన చర్యల కోసం ప్రైవేటు యాజమాన్యాలతోనే పోరాడాలి. ఉద్యమాల్లో అనుభవం కలిగిన ప్రజాసంఘాల తోడ్పాటుతో తల్లిదండ్రులు ఐక్యమై ఉద్యమాల బాటపట్టాలి. ప్రైవేట్‌ విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి. నాగటి నారాయణ
editorial
18,676
02-07-2017 11:36:44
విమానాశ్రయం అమిత్‌షా అడ్డానా?
న్యూఢిల్లీ: గోవా విమానాశ్రయంలో బీజేపీ జరిపిన సమావేశంపై కాంగ్రెస్ కన్నెర్ర చేసింది. బీజేపీ అధికారదుర్వినియోగంపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. గోవా పర్యటలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా...డబోలిమ్ విమానాశ్రయం క్లాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. విమానాశ్రయం కాంప్లెక్స్‌లో పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం పూర్తిగా అధికార దుర్వినియోగమేనని కాంగ్రెస్ విమర్శించింది. అధికారం మత్తులో పడిపోయిన బీజేపీ సుపరిపాలన మాటే మరిచిపోయిందని ఎద్దేవా చేసింది. విమానాశ్రయాలను పార్టీ కార్యక్రమాల కోసం సొంత అడ్డాగా మార్చుకోవడం సరికాదని, ఈ ఘటనపై తక్షణ దర్యాప్తు జరపాలని ఏఐసీసీ కార్యదర్శి గిరీష్ ఛోడంకర్ డిమాండ్ చేశారు. విమానాశ్రయంలో చట్టవిరుద్ధంగా సమావేశం జరిపిన అమిత్‌షా, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సభకు అనుమతించిన విమానాశ్రయ అధికారులపై ఫెనాల్టీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారంనాడు అమిత్‌షాకు బీజేపీ ఘనస్వాగతం పలికిన సందర్భంగా గోవా విమానాశ్రయం హై సెక్యూరిటీ పరిధిలో రాజకీయ సమావేశం ఏర్పాటు చేసింది. అమిత్‌షా రావడానికి ముందు విమానాశ్రయం టెర్మినల్ ఎంట్రన్స్ వద్ద కార్పెట్‌ హంగులతో పోడియం, ప్రముఖుల కోసం డజనుకు పైగా కుర్చీలు, సౌండ్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేశారు.
nation
5,973
19-11-2017 12:12:57
అల్లు అర్జున్ భారీ యాక్షన్ సీన్స్..
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా 'నా పేరు సూర్య'. నా అల్లుడు ఇండియా అనేది టాగ్ లైన్. చిత్రంలోఅల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా అలరించనున్నాడు. ఇందులో బన్నీ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ ఆడిపాడుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవలే ఊటీలో షెడ్యూల్ పూర్తిచేసి తాజాగా హైదరాబాద్‎లో షూటింగ్ షెడ్యూల్ చేసింది. చిత్రంలోని కొన్ని యాక్షన్స్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ రవి వర్మ కంపోజ్ చేసిన ఈ యాక్షన్ సీన్స్ సినిమాలో హైలైట్ అవుతాయని చెబుతోంది చిత్రయూనిట్. బన్నీ డాన్స్, ఫైట్స్‎కి అభిమానులు కేరింతలు పెట్టడం ఖాయం అని అంటున్నారు. అతి త్వరలో మిగితా పార్ట్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు యూనిట్ సభ్యులు. సినిమాపై ఇప్పటికే మెగా అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.
entertainment
18,108
01-08-2017 02:50:29
ఏపీకి సింగరేణి గనులు ఇవ్వం: కేంద్రం
న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో సింగరేణి సంస్థకు ఉన్న గనులను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోమని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు ఏంఏ ఖాన్‌ అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సోమవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో సింగరేణి కంపెనీ ఆధీనంలో ఉన్న బొగ్గు గనులను ఏపీ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయని, భాగస్వాములతో చర్చించిన తర్వాత ప్రతిపాదనలను అంగీకరించలేదని వెల్లడించారు.
nation
4,067
27-04-2017 02:17:29
వరంగల్ మాట్లాడుతున్నది...
2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడానికి ముందు వరంగల్ కేంద్రంగానే అద్భుతమైన మేధోమధనం సాగింది. కేసీఆర్ అనే ఫిరంగిలో మందుగుండును వరంగల్ కూర్చింది. తెలంగాణ ఉద్యమానికి మేధో ఇంధనాన్ని వరంగల్ సమకూర్చింది.  తెలంగాణ ప్రగతి నివేదన సభ వరంగల్‌లో నేడు జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ఇది. ఈ సందర్భంలో వరంగల్ గురించి మాట్లాడవలసి ఉన్నది. వరంగల్‌తో మాట్లాడవలసి ఉన్నది. వరంగల్ నిప్పురవ్వ తెలంగాణ అంతటా దావానలమైన తీరు గురించి చెప్పకపోతే, తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌ కాంట్రిబ్యూషన్‌ను వివరించకపోతే చరిత్ర పరిపూర్ణం కాదు. చాలా మందికి చరిత్ర తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు. చరిత్ర గురించి తెలుసుకోవలసిన అవసరం కూడా ఈ తరానికి లేకపోవచ్చు. కానీ చరిత్ర లేకుండా వర్తమానమూ లేదు, భవిష్యత్తూ లేదు. చరిత్ర పునాదులపైనే భవిష్యత్తు నిర్మితమవుతుంది. చరిత్రను ఎవరైనా వక్రీకరించవచ్చును. లేదా తమకు అనుకూలంగా మలచుకోవచ్చును. అయితే వాస్తవాలను మార్చలేరు. మరుగుపర్చలేరు.  చరిత్రను ఎవరూ పూర్వపక్షం చేయలేరు. ఆంధ్రా పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ జాతి విముక్తి కోరుకుంటున్నదని, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను, సమానత్వాన్ని, వెనుకబాటుతనం నిర్మూలనను, అభివృద్ధిని కాంక్షిస్తున్నారని వరంగల్ ఎలుగెత్తి చాటిన సంగతి చాలా మందికి తెలియదు. 1969 వైఫల్యాల తర్వాత 1996లో వరంగల్‌లోనే తెలంగాణ సభ జరిగింది. కాళోజి నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ వంటి తెలంగాణ వాదులు, మేధావులు, కార్యకర్తలు వేలాది మంది హాజరయ్యారు. ఏడాది తర్వాత 1997లో వరంగల్ డిక్లరేషన్ సభ. ఈ సభలు ఒక చరిత్ర. విస్మరించలేని వాస్తవం. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితేనే తెలంగాణ సమస్త సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, సబ్బండ వర్ణాలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ప్రకటించింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను మొట్ట మొదట శక్తిమంతంగా తెలియజేసిన ప్రాంతం వరంగల్. 1997 డిసెంబర్ 28, 29 లలో అఖిలభారత ప్రజా ప్రతిఘటన (ఏఐపీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన సభ తెలంగాణ ఉద్యమానికి నారు పోసింది. ‘‘ప్రత్యేక తెలంగాణ - ప్రజాస్వామిక ఆకాంక్షలు’’ పేరుతో ఈ సభ నాటి పీపుల్స్ వార్ పార్టీ కనుసన్నల్లో, ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ మార్గ దర్శకత్వంలోనే జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వరంగల్ దిక్సూచి అయ్యింది.  మలిదశ ఉద్యమాన్ని వాగ్దానం చేసిన నగరం వరంగల్. 1996లో వరంగల్‌లో పడిన నిప్పురవ్వే దావానలమైంది. పల్లె పల్లె పట్టణాలు చుట్టుముట్టింది. ప్రత్యేక తెలంగాణ గాలి వరంగల్ నుంచే వీచింది. ఈ గాలులన్నీ తెలంగాణ అంతటా విస్తరించాయి. ప్రొఫెసర్ జయశంకర్ సార్, బి. జనార్ధనరావు వంటి మేధావులు తెలంగాణ ఉద్యమానికి ‘‘భావజాలం’’ అనే భాస్వరాన్ని మండించారు. వరంగల్ తెలంగాణ గుండె చప్పుడు విన్నది. వరంగల్ తెలంగాణ ప్రజల నాడి అయింది. తెలంగాణకు గుండె అయింది. తెలంగాణకు తోడయ్యింది. తెలంగాణకు నీడ అయ్యింది. తెలంగాణకు నారు పోసింది. నీరు పోసింది. వరంగల్ అంటే ఒక ఉత్తేజం. వరంగల్ అంటే పోటెత్తిన ఉత్సాహం. వరంగల్ అంటే మేడారం జాతర. వరంగల్ అంటే మొగిలిచెర్ల. వరంగల్ అంటే రాయినిగూడెం. వరంగల్ అంటే ఒక తెలంగాణ. వరంగల్ ఉద్యమాలకు అమ్మచెట్టు. తెలంగాణకు నామవాచకం. తెలంగాణకు పర్యాయపదం.  వరంగల్ అంటే జనం. వరంగల్ అంటే చైతన్యం. వరంగల్ అంటే అడవి. వరంగల్ అంటే పాట. వరంగల్ అంటే ఒక గాయం. వరంగల్ అంటే మానుకోట. వరంగల్ అంటే ప్రతిఘటన. వరంగల్ అంటే కాళోజి నారాయణరావు. వరంగల్ అంటే జయశంకర్ సార్. టీఆర్‌ఎస్ పార్టీ సవాళ్ళు ఎదుర్కొన్న ప్రతి కీలక సమయంలోనూ వరంగల్ ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడింది. టీఆర్ఎస్‌ను నిలబెట్టింది. వరంగల్ ఎప్పుడూ పోరాట సంకేతమే. ఉత్తర తెలంగాణలో నాటి పీపుల్స్ వార్, నేటి మావోయిస్టు పార్టీకి హెడ్ క్వార్టర్‌గా ఉండిన వరంగల్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కూడా చిరునామా అయ్యింది. 2003లో ‘‘వరంగల్ జైత్రయాత్ర’’ పేరిట జరిగిన బహిరంగ సభ టీఆర్‌ఎస్ ప్రస్థానంలో తిరుగులేని సభ. ఆ సభకు వచ్చిన జన సంఖ్యపై ఇప్పటికీ అనేక లెక్కలున్నాయి. 1989లో పీపుల్స్‌వార్ అనుబంధ సంఘమైన రైతుకూలి సంఘం జరిపిన సభతో మాత్రమే ఈ సభని పోల్చాలి. నక్సలైట్లకు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఇచ్చిన తాత్కాలిక వెసులుబాటు సమయంలో వరంగల్‌లో జరిగిన బహిరంగసభ మొత్తం దేశాన్ని ఆకర్షించింది. ఆ స్థాయిలోనే టీఆర్‌ఎస్ సభకు కూడా లక్షలాది మంది హాజరు కావడం విశేషం.  ఆనాటి టీఆర్ఎస్ సభకు పలు రకాలుగా రాజకీయ ప్రాధాన్యం ఉన్నది. 2004లో చంద్రబాబును ఓడించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాలు జట్టు కట్టడం వెనుక వరంగల్ సభ, ఆ సభకు తెలంగాణ నలుమూలల నుంచి తరలి వచ్చిన అశేష జనం ఉన్నారు. టీడీపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సంబంధించి టీఆర్ఎస్‌తో పొత్తుపై సొనియా గాంధీ నిర్ణయానికి ఈ బహిరంగ సభ కీలకంగా పని చేసింది. కేసీఆర్ సిద్ధిపేట నుంచి సైకిల్‌పై వరంగల్ సభకు బయలుదేరడం అప్పట్లో పెద్ద వార్త. సంచలనం. ఆ సభలో దేవెగౌడ, అజిత్ సింగ్ వంటి జాతీయ ప్రముఖులు హాజరై కేసీఆర్‌కు మద్దతు ప్రకటించిన సన్నివేశం గొప్పది. 2009 డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినట్టే ప్రకటించి కేంద్రం వెనుకడుగు వేసిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చరిత్రాత్మకం. 2010 డిసెంబర్‌లో ఇదే ప్రకాష్‌రెడ్డి పేటలో టీఆర్ఎస్ పార్టీ ‘‘ఓరుగల్లు గర్జన’’ పేరుతో భారీ బహిరంగ సభ జరిపింది. 2010 మే లో మానుకోట రైల్వే స్టేషన్లో జరిగిన భీభత్సం, రాళ్ళదాడి, కాల్పులు... తదితర ఉద్రిక్త ఘటనలు ‘‘మిలిటెంట్ పోరాటానికి’’ సాక్ష్యం. ఓదార్పు యాత్ర పేరుతో వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ స్టేషన్ నుంచి సాగవలసిన వై.ఎస్. జగన్ తెలంగాణ పర్యటనను తెలంగాణ వాదులు అడ్డుకున్న తీరు, ప్రతిఘటించిన వైనం ఎవరూ మరచిపోలేరు. ఇప్పటి మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, జేఏసీ చైర్మన్‌ కోదండరాం తదితరులంతా మానుకోటలో మకాం వేసి, పకడ్బందీగా ‘గెరిల్లా వ్యూహ రచన’ చేసి అమలు చేశారు. సమైక్యాంధ్ర వాదిగానే కాకుండా పార్లమెంటులో సమైక్య ప్లకార్డులను ప్రదర్శించడంతో జగన్ తెలంగాణ వాదుల తీవ్ర ఆగ్రహాన్ని చూడవలసి వచ్చింది. ఆ రోజు జగన్‌ను వంగపల్లి స్టేషన్ దగ్గరే రైలు నుంచి దింపి అరెస్టుచేసి హైదరాబాద్‌కు తరలించకపోతే జరిగే పరిణామాలను ఊహించడం కష్టం. ఇక రాయినిగూడెం గురించి కూడా మాట్లాడాలి. వరంగల్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న రాయినిగూడెం గ్రామానికి వచ్చిన ఉమ్మడి ఏపీ సీఎం ఎన్. కిరణ్ కుమార్ రెడ్డిని మహిళలు పరిగెత్తించిన తీరు తెలంగాణ ఆకాంక్షను మరోసారి బలంగా వ్యక్తం చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి సభకు చెప్పులు లేకుండా రావాలని పోలీసులు విధించిన ఆంక్షలు, పోలీసుల ఓవర్ యాక్షన్ చివరకు సీఎం కిరణ్ అర్ధాంతరంగా హెలికాప్టర్‌లో హైదారాబాద్‌కు పయనం కావలసి వచ్చింది. వరంగల్ జిల్లాలో ప్రతి పల్లె ప్రత్యేక తెలంగాణ కోరుకున్నది. జిల్లా అంతటా ఉద్రిక్తతలు చాలా కాలం కొనసాగాయి. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడానికి ముందు వరంగల్ కేంద్రంగానే అద్భుతమైన మేధోమధనం సాగింది.  కేసీఆర్ అనే ఫిరంగిలో మందుగుండును వరంగల్ కూర్చింది. తెలంగాణ ఉద్యమానికి మేధో ఇంధనాన్ని వరంగల్ సమకూర్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ తెలంగాణ ప్రజలపై ‘మెహర్బానీ’తో, దయాగుణంతో ఇచ్చిందనీ, కేసీఆర్ తన వ్యూహ చాతుర్యంతో, పోరాటాలతో తీసుకువచ్చారనీ జరిగే ప్రచారంతో, చేసే వాదనలతో ఏకీభవించని వాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా, ఎవరు ఎన్ని విశ్లేషణలు చేసినా మొత్తం నాలుగు ఘటనలే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అత్యంత ముఖ్యమైన పిల్లర్లుగా చెప్పుకోవచ్చును. 1) 1997లో వరంగల్ డిక్లరేషన్ సభ. 2) కేసీఆర్ ఆమరణ దీక్ష. ౩) శ్రీకాంతాచారి ఆత్మాహుతి. 4) వై.ఎస్. జగన్ ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా జరిగిన మానుకోట ప్రతిఘటన. ఇవి కాకుండా చాలా ఘటనలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదాయి. ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. ఉద్యమాన్ని శిఖర స్థాయికి తీసుకు వెళ్ళాయి. ఇప్పుడిక వరంగల్ ప్రకాష్ రెడ్డి పేటలో జరగనున్న ‘ప్రగతి నివేదన సభ’ నిస్సందేహంగా భిన్నమైనది. అధికారంలో ఉన్న పార్టీ సభ. ప్రత్యేక తెలంగాణ పోరాట యోధునిగా, మాటల మాంత్రికునిగా గతంలో వేలాది బహిరంగ సభలలో కేసీఆర్ తన సహజ శైలిలో, వాక్పటిమతో చిచ్చర పిడుగులా చెలరేగిపోయేవారు. తెలంగాణ వ్యతిరేకులు, ఉమ్మడి ఏపీ పాలకులను ఉతికి ఆరేసేవారు. ప్రస్తుత సందర్భం వేరు. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన పాత్రలో టీఆర్ఎస్ ఉన్నది. ప్రభుత్వం గత మూడేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, తెలంగాణ పసి రాష్ట్రం వివిధ ప్రమాణాలలో సాధించిన జాతీయ గుర్తింపు, పలు రాష్ట్రాల పొగడ్తలు, ఇతర అంశాలపై ‘ప్రోగ్రెస్ రిపోర్టు’ ప్రజల ముందుంచబోతున్నారు. ప్రజల ఆడిటింగ్ కోసమని కూడా భావించవచ్చును. ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగం కావడం లేదు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవచ్చును. అడిగినా, అడగకుండానే అనేక వరాలు ‘ప్రగతి భవన్’ నుంచి వచ్చి పడుతున్నవి. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నట్టు అధికారపక్షం చెబుతున్నది. మొత్తంమీద ప్రజలలో ‘ఫీల్ గుడ్’ ఫ్యాక్టర్ ఉన్నది. అయితే ఇదే సానుకూల వాతావరణం ఇలాగే కొనసాగుతుందా అన్నది చెప్పలేం. తెలంగాణ ఇంటి పార్టీగా టీఆర్ఎస్‌ను మలచడంలో కేసీఆర్ కృషి అపారం. తెలంగాణ ఇచ్చామని గట్టిగా క్లయిం చేసుకోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైనది. తెలంగాణలోనూ మోదీ మంత్రం పనిచేస్తుందని బీజేపీ నాయకులు ఆశావాదంతో ఉన్నట్లున్నారు. ఏదో జరగబోయే ‘అద్భుతం’ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నట్లున్నది.ఎస్.కె. జకీర్సీనియర్ జర్నలిస్ట్(నేడు వరంగల్‌లో ‘ప్రగతి నివేదన సభ’)తెలంగాణ ప్రగతి నివేదన సభ వరంగల్‌లో నేడు జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ఇది. ఈ సందర్భంలో వరంగల్ గురించి మాట్లాడవలసి ఉన్నది. వరంగల్‌తో మాట్లాడవలసి ఉన్నది. వరంగల్ నిప్పురవ్వ తెలంగాణ అంతటా దావానలమైన తీరు గురించి చెప్పకపోతే, తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌ కాంట్రిబ్యూషన్‌ను వివరించకపోతే చరిత్ర పరిపూర్ణం కాదు. చాలా మందికి చరిత్ర తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు. చరిత్ర గురించి తెలుసుకోవలసిన అవసరం కూడా ఈ తరానికి లేకపోవచ్చు. కానీ చరిత్ర లేకుండా వర్తమానమూ లేదు, భవిష్యత్తూ లేదు. చరిత్ర పునాదులపైనే భవిష్యత్తు నిర్మితమవుతుంది. చరిత్రను ఎవరైనా వక్రీకరించవచ్చును. లేదా తమకు అనుకూలంగా మలచుకోవచ్చును. అయితే వాస్తవాలను మార్చలేరు. మరుగుపర్చలేరు.  చరిత్రను ఎవరూ పూర్వపక్షం చేయలేరు. ఆంధ్రా పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ జాతి విముక్తి కోరుకుంటున్నదని, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను, సమానత్వాన్ని, వెనుకబాటుతనం నిర్మూలనను, అభివృద్ధిని కాంక్షిస్తున్నారని వరంగల్ ఎలుగెత్తి చాటిన సంగతి చాలా మందికి తెలియదు. 1969 వైఫల్యాల తర్వాత 1996లో వరంగల్‌లోనే తెలంగాణ సభ జరిగింది. కాళోజి నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ వంటి తెలంగాణ వాదులు, మేధావులు, కార్యకర్తలు వేలాది మంది హాజరయ్యారు. ఏడాది తర్వాత 1997లో వరంగల్ డిక్లరేషన్ సభ. ఈ సభలు ఒక చరిత్ర. విస్మరించలేని వాస్తవం. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితేనే తెలంగాణ సమస్త సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, సబ్బండ వర్ణాలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ప్రకటించింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను మొట్ట మొదట శక్తిమంతంగా తెలియజేసిన ప్రాంతం వరంగల్. 1997 డిసెంబర్ 28, 29 లలో అఖిలభారత ప్రజా ప్రతిఘటన (ఏఐపీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన సభ తెలంగాణ ఉద్యమానికి నారు పోసింది. ‘‘ప్రత్యేక తెలంగాణ - ప్రజాస్వామిక ఆకాంక్షలు’’ పేరుతో ఈ సభ నాటి పీపుల్స్ వార్ పార్టీ కనుసన్నల్లో, ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ మార్గ దర్శకత్వంలోనే జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వరంగల్ దిక్సూచి అయ్యింది.  మలిదశ ఉద్యమాన్ని వాగ్దానం చేసిన నగరం వరంగల్. 1996లో వరంగల్‌లో పడిన నిప్పురవ్వే దావానలమైంది. పల్లె పల్లె పట్టణాలు చుట్టుముట్టింది. ప్రత్యేక తెలంగాణ గాలి వరంగల్ నుంచే వీచింది. ఈ గాలులన్నీ తెలంగాణ అంతటా విస్తరించాయి. ప్రొఫెసర్ జయశంకర్ సార్, బి. జనార్ధనరావు వంటి మేధావులు తెలంగాణ ఉద్యమానికి ‘‘భావజాలం’’ అనే భాస్వరాన్ని మండించారు. వరంగల్ తెలంగాణ గుండె చప్పుడు విన్నది. వరంగల్ తెలంగాణ ప్రజల నాడి అయింది. తెలంగాణకు గుండె అయింది. తెలంగాణకు తోడయ్యింది. తెలంగాణకు నీడ అయ్యింది. తెలంగాణకు నారు పోసింది. నీరు పోసింది. వరంగల్ అంటే ఒక ఉత్తేజం. వరంగల్ అంటే పోటెత్తిన ఉత్సాహం. వరంగల్ అంటే మేడారం జాతర. వరంగల్ అంటే మొగిలిచెర్ల. వరంగల్ అంటే రాయినిగూడెం. వరంగల్ అంటే ఒక తెలంగాణ. వరంగల్ ఉద్యమాలకు అమ్మచెట్టు. తెలంగాణకు నామవాచకం. తెలంగాణకు పర్యాయపదం.  వరంగల్ అంటే జనం. వరంగల్ అంటే చైతన్యం. వరంగల్ అంటే అడవి. వరంగల్ అంటే పాట. వరంగల్ అంటే ఒక గాయం. వరంగల్ అంటే మానుకోట. వరంగల్ అంటే ప్రతిఘటన. వరంగల్ అంటే కాళోజి నారాయణరావు. వరంగల్ అంటే జయశంకర్ సార్. టీఆర్‌ఎస్ పార్టీ సవాళ్ళు ఎదుర్కొన్న ప్రతి కీలక సమయంలోనూ వరంగల్ ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడింది. టీఆర్ఎస్‌ను నిలబెట్టింది. వరంగల్ ఎప్పుడూ పోరాట సంకేతమే. ఉత్తర తెలంగాణలో నాటి పీపుల్స్ వార్, నేటి మావోయిస్టు పార్టీకి హెడ్ క్వార్టర్‌గా ఉండిన వరంగల్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కూడా చిరునామా అయ్యింది. 2003లో ‘‘వరంగల్ జైత్రయాత్ర’’ పేరిట జరిగిన బహిరంగ సభ టీఆర్‌ఎస్ ప్రస్థానంలో తిరుగులేని సభ. ఆ సభకు వచ్చిన జన సంఖ్యపై ఇప్పటికీ అనేక లెక్కలున్నాయి. 1989లో పీపుల్స్‌వార్ అనుబంధ సంఘమైన రైతుకూలి సంఘం జరిపిన సభతో మాత్రమే ఈ సభని పోల్చాలి. నక్సలైట్లకు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఇచ్చిన తాత్కాలిక వెసులుబాటు సమయంలో వరంగల్‌లో జరిగిన బహిరంగసభ మొత్తం దేశాన్ని ఆకర్షించింది. ఆ స్థాయిలోనే టీఆర్‌ఎస్ సభకు కూడా లక్షలాది మంది హాజరు కావడం విశేషం.  ఆనాటి టీఆర్ఎస్ సభకు పలు రకాలుగా రాజకీయ ప్రాధాన్యం ఉన్నది. 2004లో చంద్రబాబును ఓడించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాలు జట్టు కట్టడం వెనుక వరంగల్ సభ, ఆ సభకు తెలంగాణ నలుమూలల నుంచి తరలి వచ్చిన అశేష జనం ఉన్నారు. టీడీపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సంబంధించి టీఆర్ఎస్‌తో పొత్తుపై సొనియా గాంధీ నిర్ణయానికి ఈ బహిరంగ సభ కీలకంగా పని చేసింది. కేసీఆర్ సిద్ధిపేట నుంచి సైకిల్‌పై వరంగల్ సభకు బయలుదేరడం అప్పట్లో పెద్ద వార్త. సంచలనం. ఆ సభలో దేవెగౌడ, అజిత్ సింగ్ వంటి జాతీయ ప్రముఖులు హాజరై కేసీఆర్‌కు మద్దతు ప్రకటించిన సన్నివేశం గొప్పది. 2009 డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినట్టే ప్రకటించి కేంద్రం వెనుకడుగు వేసిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చరిత్రాత్మకం. 2010 డిసెంబర్‌లో ఇదే ప్రకాష్‌రెడ్డి పేటలో టీఆర్ఎస్ పార్టీ ‘‘ఓరుగల్లు గర్జన’’ పేరుతో భారీ బహిరంగ సభ జరిపింది. 2010 మే లో మానుకోట రైల్వే స్టేషన్లో జరిగిన భీభత్సం, రాళ్ళదాడి, కాల్పులు... తదితర ఉద్రిక్త ఘటనలు ‘‘మిలిటెంట్ పోరాటానికి’’ సాక్ష్యం. ఓదార్పు యాత్ర పేరుతో వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ స్టేషన్ నుంచి సాగవలసిన వై.ఎస్. జగన్ తెలంగాణ పర్యటనను తెలంగాణ వాదులు అడ్డుకున్న తీరు, ప్రతిఘటించిన వైనం ఎవరూ మరచిపోలేరు. ఇప్పటి మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, జేఏసీ చైర్మన్‌ కోదండరాం తదితరులంతా మానుకోటలో మకాం వేసి, పకడ్బందీగా ‘గెరిల్లా వ్యూహ రచన’ చేసి అమలు చేశారు. సమైక్యాంధ్ర వాదిగానే కాకుండా పార్లమెంటులో సమైక్య ప్లకార్డులను ప్రదర్శించడంతో జగన్ తెలంగాణ వాదుల తీవ్ర ఆగ్రహాన్ని చూడవలసి వచ్చింది. ఆ రోజు జగన్‌ను వంగపల్లి స్టేషన్ దగ్గరే రైలు నుంచి దింపి అరెస్టుచేసి హైదరాబాద్‌కు తరలించకపోతే జరిగే పరిణామాలను ఊహించడం కష్టం. ఇక రాయినిగూడెం గురించి కూడా మాట్లాడాలి. వరంగల్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న రాయినిగూడెం గ్రామానికి వచ్చిన ఉమ్మడి ఏపీ సీఎం ఎన్. కిరణ్ కుమార్ రెడ్డిని మహిళలు పరిగెత్తించిన తీరు తెలంగాణ ఆకాంక్షను మరోసారి బలంగా వ్యక్తం చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి సభకు చెప్పులు లేకుండా రావాలని పోలీసులు విధించిన ఆంక్షలు, పోలీసుల ఓవర్ యాక్షన్ చివరకు సీఎం కిరణ్ అర్ధాంతరంగా హెలికాప్టర్‌లో హైదారాబాద్‌కు పయనం కావలసి వచ్చింది. వరంగల్ జిల్లాలో ప్రతి పల్లె ప్రత్యేక తెలంగాణ కోరుకున్నది. జిల్లా అంతటా ఉద్రిక్తతలు చాలా కాలం కొనసాగాయి. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడానికి ముందు వరంగల్ కేంద్రంగానే అద్భుతమైన మేధోమధనం సాగింది.  కేసీఆర్ అనే ఫిరంగిలో మందుగుండును వరంగల్ కూర్చింది. తెలంగాణ ఉద్యమానికి మేధో ఇంధనాన్ని వరంగల్ సమకూర్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ తెలంగాణ ప్రజలపై ‘మెహర్బానీ’తో, దయాగుణంతో ఇచ్చిందనీ, కేసీఆర్ తన వ్యూహ చాతుర్యంతో, పోరాటాలతో తీసుకువచ్చారనీ జరిగే ప్రచారంతో, చేసే వాదనలతో ఏకీభవించని వాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా, ఎవరు ఎన్ని విశ్లేషణలు చేసినా మొత్తం నాలుగు ఘటనలే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అత్యంత ముఖ్యమైన పిల్లర్లుగా చెప్పుకోవచ్చును. 1) 1997లో వరంగల్ డిక్లరేషన్ సభ. 2) కేసీఆర్ ఆమరణ దీక్ష. ౩) శ్రీకాంతాచారి ఆత్మాహుతి. 4) వై.ఎస్. జగన్ ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా జరిగిన మానుకోట ప్రతిఘటన. ఇవి కాకుండా చాలా ఘటనలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదాయి. ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. ఉద్యమాన్ని శిఖర స్థాయికి తీసుకు వెళ్ళాయి. ఇప్పుడిక వరంగల్ ప్రకాష్ రెడ్డి పేటలో జరగనున్న ‘ప్రగతి నివేదన సభ’ నిస్సందేహంగా భిన్నమైనది. అధికారంలో ఉన్న పార్టీ సభ. ప్రత్యేక తెలంగాణ పోరాట యోధునిగా, మాటల మాంత్రికునిగా గతంలో వేలాది బహిరంగ సభలలో కేసీఆర్ తన సహజ శైలిలో, వాక్పటిమతో చిచ్చర పిడుగులా చెలరేగిపోయేవారు. తెలంగాణ వ్యతిరేకులు, ఉమ్మడి ఏపీ పాలకులను ఉతికి ఆరేసేవారు. ప్రస్తుత సందర్భం వేరు. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన పాత్రలో టీఆర్ఎస్ ఉన్నది. ప్రభుత్వం గత మూడేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, తెలంగాణ పసి రాష్ట్రం వివిధ ప్రమాణాలలో సాధించిన జాతీయ గుర్తింపు, పలు రాష్ట్రాల పొగడ్తలు, ఇతర అంశాలపై ‘ప్రోగ్రెస్ రిపోర్టు’ ప్రజల ముందుంచబోతున్నారు. ప్రజల ఆడిటింగ్ కోసమని కూడా భావించవచ్చును. ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగం కావడం లేదు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవచ్చును. అడిగినా, అడగకుండానే అనేక వరాలు ‘ప్రగతి భవన్’ నుంచి వచ్చి పడుతున్నవి. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నట్టు అధికారపక్షం చెబుతున్నది. మొత్తంమీద ప్రజలలో ‘ఫీల్ గుడ్’ ఫ్యాక్టర్ ఉన్నది. అయితే ఇదే సానుకూల వాతావరణం ఇలాగే కొనసాగుతుందా అన్నది చెప్పలేం. తెలంగాణ ఇంటి పార్టీగా టీఆర్ఎస్‌ను మలచడంలో కేసీఆర్ కృషి అపారం. తెలంగాణ ఇచ్చామని గట్టిగా క్లయిం చేసుకోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైనది. తెలంగాణలోనూ మోదీ మంత్రం పనిచేస్తుందని బీజేపీ నాయకులు ఆశావాదంతో ఉన్నట్లున్నారు. ఏదో జరగబోయే ‘అద్భుతం’ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నట్లున్నది.ఎస్.కె. జకీర్సీనియర్ జర్నలిస్ట్(నేడు వరంగల్‌లో ‘ప్రగతి నివేదన సభ’)
editorial
16,321
09-12-2017 14:32:49
పాక్‌కు అమెరికా షాక్‌!
వాషింగ్ట‌న్‌: పొరుగు దేశం పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. ఇప్ప‌ట్లో పాకిస్తాన్ వెళ్లొద్ద‌ని చైనా ప్ర‌భుత్వం త‌న దేశ పౌరుల‌కు హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. తాజాగా అదే బాట‌లో అమెరికా కూడా పయ‌నించింది. పాకిస్తాన్‌లో అమెరికన్ల‌పై దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని, ఇప్ప‌ట్లో ఆ దేశానికి వెళ్ల‌డం అంత సుర‌క్షితం కాద‌ని అమెరికా ప్ర‌భుత్వం త‌మ దేశ పౌరుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ప్ర‌స్తుతం పాకిస్తాన్‌లో ఉగ్ర‌వాదుల ప్ర‌భావం అధికంగా ఉంద‌ని పేర్కొంది. ఇప్ప‌టికే పాకిస్తాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్‌, లాహోర్‌ల‌లోని అమెరికా రాయ‌బార కార్యాల‌యాలు త‌మ సేవ‌ల‌ను త‌గ్గించేశాయి. పెషావ‌ర్‌లోని అమెరికా రాయ‌బార కార్యాల‌యం త‌న సేవ‌ల‌ను పూర్తిగా నిలిపివేసింది. అమెరికా దౌత్య అధికారుల‌పై, ఎన్జీవోల‌పై ఉగ్రవాదులు క‌క్షలు పెంచుకున్నార‌ని అమెరికా రాయ‌బార కార్యాల‌యాలు వాషింగ్ట‌న్‌కు నివేదిక‌ను స‌మ‌ర్పించాయి.
nation
277
19-07-2017 00:21:46
ఇన్ఫోసిస్‌కు టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ గుడ్‌బై
న్యూఢిల్లీ: కంపెనీల కొనుగోళ్ళు, విలీనాల్లో దిట్టగా పేరు గడించిన వైస్‌ ప్రెసిడెంట్‌ రితికా సూరి ఇన్ఫోసిస్‌ నుంచి వైదొలగారు. ఆమె గత వారమే రాజీనామా పత్రాన్ని యాజమాన్యానికి అందచేశారని, ప్రస్తుతం నోటీస్‌ కాలంలో ఉన్నారని ఆ పరిణామానికి సన్నిహితంగా ఉన్న వర్గాలు తెలిపాయి. అయితే ఆమె రాజీనామాకు కారణాలు తెలియలేదు. 2014 సెప్టెంబర్‌లో విశాల్‌ సిక్కా సిఇఒగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాప్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ అయిన రితికను ఇన్ఫోసిస్‌లోకి తీసుకువచ్చారు. స్టార్ట్‌పల కోసం 50 కోట్ల డాలర్ల ఫండ్‌ ఏర్పాటు చేయడంలోను, ఇజ్రాయెల్‌కు చెందిన ఆటోమేషన్‌ కంపెనీ పనాయాను కొనుగోలు చేయడంలోను ఆమె కీలక పాత్ర పోషించారు.
business
3,284
09-09-2017 04:41:26
కాళోజి ప్రశ్న - సీతారాముడి కవిత్వం
కవిత్వం జీవితం కలగలిసి పోకుండా కవిత్వం రాదు. జీవితపు జీవనరేఖల్లోంచి కవిత్వనేత్రం తెరిచినప్పుడే అది జీవకవిత్వం. ఆ జీవికవిత్వ సజీవరూపం సీతారాం. అతన్ని చూస్తే పరవశించే దృశ్యంగా కనిపిస్తాడు. కానీ జీవితం పెట్టే బాధలకు అలిసిపోయి ఉంటాడు. రెండు చెకిముకిరాళ్ల మధ్య జరిగిన రాపిడి లేకుండా నిప్పు పుట్టదు. ఆ సంఘర్షణే సీతారాం. సీతారాం సాహిత్య చెకిముకిరాయి. కొందరు బైట కన్పిస్తున్నట్లుగా లోపల ఉండరు. కొందరు లోపల ఒకలా బైటకు మరొకలా ఉంటారు. కవిత్వం అంటే పసిపాప నవ్వు కదా? కవిత్వం అంటే ఎగిసిపడే జలపాతం కదా? కవిత్వమంటే కల్లాకపటం లేనిది కదా? కవిత్వమంటే అప్పటికప్పుడు పుట్టుకొచ్చే మహోగ్ర రూపం కదా? కవిత్వమంటే కాళోజీ వేసే ప్రశ్న కదా? కవిత్వమంటే కాలం కదన రంగం కదా! సీతారాం ఈ కాలం కవిత్వపు నాలుక. అతడు చూస్తే నిశ్శబ్దంగా ఉంటాడు. లోపల కల్లోలాలు కదులుతుంటాయి. ఆ చూపులు చూస్తే సున్నితంగా ఉంటాయి. అవి గాయాలున్న దేహాలను నిమురుతుంటాయి. ఆ దృష్టిని చూస్తే నిశ్చలంగా ఉంటుంది.  అవకతవకల ఎగుడుదిగుళ్ల భూమిని సదునుచేసి దక్కాల్సిన వాళ్లకు దక్కాల్సినవి ఎందుకు దక్కలేదోనని దృష్టిని సారిస్తుంటాయి. దేన్నయినా సాహిత్యదృష్టితో దర్శించవచ్చుననుకుంటే ఆ సాహిత్య దివ్యదృష్టి మా సీతారాం. ఆ లక్ష్మీపురం మట్టిపొరల్లో ఏముందో? ఆ చెప్పుల్లేని నారాయణ కాలిజోళ్లల్లో కవిత్వ రేఖలెక్కడున్నాయో, గడ్డిమోపు నెత్తిన బెట్టుకుని మోసుకుంటూ, ఆ కుటుంబమంతా ఈదుకుంటూ వచ్చిన ఆ తల్లి మాణిక్యమ్మ మట్టి చేతుల్లో అక్షరాలు ఒదిగి ఎక్కడ ప్రాణం పోసుకున్నాయో ఏమో గానీ తెలుగు సాహిత్యాన్ని పరవశింపజేసిన నటరాజమహానృత్యం సీతారాం. సీతారాం అంటే ‘‘రక్తస్పర్శ’’. అది తెలుగు సాహిత్యానికి వెచ్చగా తగిలిన మహాసాహిత్య స్పర్శ. సీతారాం అంటే ‘‘ఇదిగో ఇక్కడిదాకే’’ అని సాహిత్య తలుపులు తెరిచి తెలుగు సాహిత్యాన్ని మేల్కొపటమే. సీతారాం అంటే S/O మాణిక్యం. అసలు తెలుగు సాహిత్యానికే C/O సీతారాం. అతడు ప్రశ్నించడు. ప్రశ్నించటమెట్లో నేర్పిస్తాడు. అతడు తడబడతాడు. కానీ ప్రశ్నను తడబడనివ్వడు. వాడు కలబడడు. కానీ సంగ్రామాన్ని వేదికగా మారుస్తాడు. అతడు భయపడతున్నట్లు కనిపిస్తాడు. కానీ జంకుగొంకు లేకుండా ధైర్యంగా ఎలా ముందుకు సాగాలోనన్న వీరోచిత పోరాటాలకు వీరరసం పోస్తాడు. అతడు వినయంగా ఉంటాడు. భాంచన్‌దొరా అని తలవొంచుకపోతానంటే తలెత్తి నడువమని అక్షరాల్ని నిలబెడతాడు. అతడు స్పష్టంగా కానరాడు. ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎలా కన్పించాలోనన్న రసాయనిక చర్య బాగా తెలిసినవాడు. అతడు ఒక్కడుగా నడుచుకుంటూ పోతాడు. కానీ అతడు ఒక్కడు కాదు. అతనొక విస్తృత సమాజం. అతడు మౌనంగా ఉన్నట్లు కన్పిస్తాడు. కానీ అతడొక సాహిత్య శిఖరం. మానవత్వం అడుగడుగునా తొణికిసలాడే రూపాల కోసం వెంపర్లాడుతూ వెర్రివాడుగా పరుగెత్తుతాడు. అతడు నిలువెల్లా కవిత్వం. కవిత్వపు చెట్టుకు పూసినపూత సీతారాం. కవిత్వంగా పెరిగి, కన్నీళ్లుగా కరిగి, కష్టాలుగా కలియతిరిగి కవిత్వమే నడకగా, నడతగా, శ్వాసగా చేసుకున్న జీవకవి సీతారాంకు కాళోజి అవార్డునివ్వటంతో తెలుగుసాహిత్యమే పరవశిస్తోంది.జూలూరు గౌరీశంకర్‌, కవి, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు(నేడు సీతారాంకు కాళోజి పురస్కార ప్రదానం సందర్భంగా)
editorial
17,886
19-03-2017 02:46:48
సమ్మె చేస్తే నల్లకోటుండదు!
న్యూఢిల్లీ, మార్చి 18: అడ్వకేట్లు సమ్మె చేసినా, విధుల బహిష్కరణకు దిగినా భవిష్యత్తులో కోర్టులో ప్రాక్టీస్‌ చేసే అవకాశం లేకుండా డిబార్‌ చేయాలని బార్‌ కౌన్సిల్‌ ప్రతిపాదించింది. ఈ మేరకు లా కమిషన్‌కు తన ప్రతిపాదనలు పంపింది. సమ్మె చేసే న్యాయవాదులపై కఠిన చర్యల కోసం అడ్వకేట్ల చట్టానికి మార్పులు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో లా కమిషన్‌ ఈ కసరత్తు చేస్తోంది. కోర్టు విధులకు భంగం కలిగించే విధంగా సమ్మె చేసినా, విధులు బహిష్కరించినా అడ్వకేట్‌పై వేటు పడుతుంది. దేశంలో 21లక్షల మంది రిజిస్టర్డ్‌ న్యాయవాదులు ఉన్నారు. వారిలో 40 శాతం మంది(దాదాపు 9 లక్షల మంది) నకిలీలని బార్‌ కౌన్సిల్‌ అంచనా వేస్తోంది. న్యాయవాదులు నకిలీలని తేలితే మూడేళ్ల జైలు, లక్ష రూపాయల జరిమానా విధించాలని బార్‌ కౌన్సిల్‌ తాజాగా ప్రతిపాదించింది. న్యాయవాది తన వద్దకు వచ్చే క్లయింట్‌కు నష్టం జరిగే విధంగా అనైతికంగా ప్రవర్తిస్తే మూడు లక్షల వరకు జరిమానా, రూ.5 లక్షల వరకు క్లయింట్‌ పరిహారం చెల్లించాలని బార్‌ కౌన్సిల్‌ మరో ప్రతిపాదన చేసింది. క్లయింటే తప్పుడు ఆరోపణ చేస్తే అతనికి రూ.2 లక్షల జరిమానా విధిస్తారు. బార్‌ కౌన్సిల్‌ ప్రతిపాదనలను జిల్లా స్థాయి న్యాయవాద సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య హక్కులను పరిహరించడమేనని అన్నాయి.
nation
300
02-10-2017 00:21:07
ఐపిఒకు సిద్ధమైన హెచ్‌ఎఎల్‌
బెంగళూరు: ప్రభుత్వ రంగంలోని హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఎల్‌) పబ్లిక్‌ ఇష్యూకి సిద్ధమైంది. ఇందుకోసం శనివారం సెబికి డ్రాఫ్ట్‌ రెడ్‌ హియరింగ్‌ ప్రాస్పెక్టస్‌ సమర్పించినట్టు తెలిపింది. కంపెనీ లిస్టింగ్‌ ప్రక్రియలో ఇదో ప్రధాన మైలురాయి అని హెచ్‌ఎఎల్‌ సిఎండి సువర్ణ రాజు చెప్పారు. కంపెనీ హెచ్‌ఎఎల్‌ ఈక్విటీలో 10 శాతం ఐపిఒ ద్వారా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం 2012లోనే ఆమోదం తెలిపింది. ఇపుడు సెబికి డ్రాఫ్ట్‌ రెడ్‌ హియరింగ్‌ ప్రాస్పెక్టస్‌ కూడా సమర్పించడంతో హెచ్‌ఎఎల్‌ త్వరలోనే నిధుల సమీకరణ కోసం ప్రైమరీ మార్కెట్‌కు రాబోతోంది.
business
19,683
14-03-2017 00:17:27
గురువుగానే బెస్ట్..
అనిల్‌ కుంబ్లే మార్గనిర్దేశంలో టీమిండియా.. రాహుల్‌ ద్రావిడ్‌ పర్యవేక్షణలో యువ భారత పరుగులు పెడుతున్నాయి..! ఒకప్పుడు ఆటగాళ్లుగా జట్టును నడిపించిన క్రికెట్‌ దిగ్గజాలు.. ఇప్పుడు గురువులుగా భారత్‌ను విజయపథంలో నడిపిస్తున్నారు..! చక్కటి సమన్వయంతో ఆటగాళ్లను తీర్చిదిద్దుతూ అందరి మన్ననలు పొందుతున్నారు..! అయితే, కుంబ్లేకు టీమ్‌ డైరెక్టర్‌గా, ద్రావిడ్‌కు ప్రధాన కోచ్‌గా ప్రమోషన్‌ ఇవ్వాలని సీవోఏ ఆలోచిస్తున్నట్టు వస్తున్న వార్తలు జట్టు పరిస్థితిని తారు మారు చేసేలా కనిపిస్తున్నాయి..! ఇది సాఫీగా సాగుతున్న టీమిండియా ప్రయాణాన్ని దెబ్బ తీసేలా ఉంది..! ఈ నిర్ణయంతో జట్టుకు జరిగే మేలు కన్నా కీడే ఎక్కువగా ఉందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..!సరిగ్గా ఎనిమిది నెలల క్రితం... టీమిండియా భవిష్యత ఎలా ఉండబోతుందో ఊహించడం కూడా కష్టమైన పరిస్థితి. అప్పటికే కోచ్‌ లేకుండా రెండేళ్లు నెట్టుకొచ్చిన భారత.. టీమ్‌ డైరెక్టర్‌ రవిశాస్ర్తి సేవలను కూడా కోల్పోయింది. ఆ సమయంలో.. సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన కమిటీ ఎలాంటి హడావిడీ లేకుండా దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేను భారత కోచ్‌గా ఎంపిక చేసింది. అసలు ఆ ఎంపికే ఆశ్చర్యకరం. ముంబై ఇండియన్స్‌ జట్టుకు మెంటార్‌గా మినహా అనిల్‌కు అంతగా కోచింగ్‌ అనుభవం లేదు. అదే విధంగా, అప్పటిదాకా అతను ‘గురువు’ రేసులోకి వచ్చింది లేదు. పైగా, కుంబ్లేను ఎంపిక చేసిన కమిటీ.. మాజీ డైరెక్టర్‌ రవిశాస్ర్తిని పక్కనబెట్టడం విమర్శలకు తావిచ్చింది. కానీ, కదనరంగలోకి అడుగు పెట్టాక ఇవేవీ కుంబ్లేకు అడ్డుకాలేదు. కుంబ్లే, ద్రావిడ్‌, ధోనీ, కోహ్లీ 2016 జూలైలో భారత జట్టు తక్షణ రోడ్‌మ్యాప్‌ గురించి చర్చించారు. జట్టుకు సురక్షిత వర్తమానం, భవిష్యతను నిర్దేశించే స్పష్టమైన ప్రణాళిక రచించారు. అంతా కలిసి.. దాన్ని సమర్థవంతంగా అమలు చేశారు. ఫలితంగా.. టెస్టుల్లో టీమిండియా తిరుగులేని శక్తిగా మారింది. వన్డేల విషయానికి వస్తే.. కెప్టెన్‌గా ధోనీ భవిష్యతపై ఎలాంటి గందరగోళం లేని నిర్ణయం తీసుకున్నారు. ఎవరినీ నొప్పించకుండా.. పరిమిత ఓవర్లకు కొత్త కెప్టెన్‌గా కోహ్లీ వచ్చేశాడు. ఇప్పుడు, సెలెక్టర్లు.. జూన్‌లో ఇంగ్లండ్‌లో జరగబోయే చాంపియన్స్‌ ట్రోఫీపై దృష్టి పెట్టారు. ఈ మెగా టోర్నీ ముందు మన జట్టు సమతూకంలో కనిపిస్తోంది. ఒకరకంగా 2019 వరల్డ్‌క్‌పలో పాల్గొనే జట్టుపై కూడా అంచనా వచ్చేసింది. కోచ్‌గా కొద్ది కాలంలోనే సాధించిన ఫలితాలివి. జూనియర్‌ క్రికెట్‌లో కూడా అద్భుతమైన ప్రగతి కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌లో గతేడాది జరిగిన వరల్డ్‌క్‌పలో మన అండర్‌-19 జట్టు రన్నరప్‌గా నిలిచింది. గత డిసెంబర్‌లో ఆసియా కప్‌ నెగ్గింది. ఈ మధ్యే స్వదేశంలో ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుతో ఐదు వన్డేల సిరీ్‌స నూ కైవసం చేసుకుంది. రాహుల్‌ ద్రావిడ్‌ మార్గనిర్దేశంలో యువ భారత్ అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఇప్పుడు కోచ్‌లతో ఆటగాళ్లు నేరుగా మాట్లాడుతున్నారు. అదే విధంగా, రెండు జట్ల కోచ్‌ల మధ్య సమన్వయం భారత క్రికెట్‌కు ఎంతో లాభిస్తోంది. అన్ని విభాగాల సమష్టి కృషితో ప్రస్తుత సీజన్‌లో జట్టు విజయాలబాటలో నడుస్తోంది. గురువుగా.. సుదీర్ఘ కాలం కొనసాగే అర్హతలు తనకు ఉన్నాయని అనిల్‌ ఇప్పటికే నిరూపించాడు. కనీసం వచ్చే వరల్డ్‌ కప్‌ వరకు జట్టును నడిపించే సత్తా, విజన్‌ అతనిలో ఉంది. దానికి అనుగుణమైన జట్టును కూడా తీర్చిదిద్దాడతను. అతనితో అన్ని విషయాల్లో కలిసిపోయాడు కెప్టెన్‌ కోహ్లీ. ఇద్దరూ ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా నడుస్తున్నారు. దాంతో, కుంబ్లేను డైరెక్టర్‌గా ప్రమోట్‌ చేయడం లాభం కంటే ఎక్కువ నష్టం చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. అసలు, డైరెక్టర్‌ పదవికి కుంబ్లే నప్పుతాడా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది. ఇక, ఆటగాళ్ల నుంచి ఎనలేని గౌరవం పొందుతున్న కుంబ్లే.. ఎంతో కష్టపడి జట్టులో క్రమశిక్షణ నింపాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో, శిక్షణ కార్యక్రమాల్లో క్రమశిక్షణ తప్పకుండా.. ఆటగాళ్లకు జరిమానా విధిస్తున్నాడు. చిన్న చిన్న కార్యక్రమాలతో వారిలో ఉత్తేజం కలిగిస్తున్నాడు. ఇప్పుడు.. అతను డైరెక్టర్‌గా మారి సూటు బూటు వేసుకుంటే వాటి పరిస్థితి ఏమిటో మరి!
sports
13,820
05-03-2017 00:19:41
కేన్సర్‌ అలసటకు వ్యాయామమే మేలు
న్యూయార్క్‌, మార్చి 4: కేన్సర్‌ సంబంధిత అలసటను తగ్గించేందుకు మందులు వాడడం కన్నా వ్యాయామం చేయడమే ఉత్తమమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పరుగు, బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలతో పాటు శ్వాస సంబంధ వ్యాయామాలు కేన్సర్‌ బాధితుల అలసటను తగ్గించడంలో తోడ్పడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కేన్సర్‌ చికిత్స పొందుతున్న వారు, చికిత్స పూర్తయి కోలుకున్న వారు తీవ్రమైన అలసట, బడలికతో ఉంటారు. కొంత మంది అలసటకు చికిత్సను పూర్తిగా తీసుకోలేక మధ్యలోనే ఆపేయడంతో మరణిస్తున్నారు. ఈ అలసటకు సంబంధించి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ రోచెస్టర్‌కు చెందిన విల్మోట్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు 11 వేల మందిపై జరిపిన 113 అధ్యయనాలను పరిశీలించారు. బడలికను తగ్గించేందుకు ఔషధాలను వినియోగించడం కన్నా వ్యాయామం చేయడమే మేలని తేలిందన్నారు. వారు సానుకూల ఆలోచనా ధోరణిని పెంపొందించుకుంటే మేలన్నారు.
nation
5,816
12-10-2017 15:55:10
‘అర్జున్‌ రెడ్డి’ తమిళ రీమేక్‌‌‌లో హీరోయిన్ ఎవరంటే...
టాలీవుడ్‌ తాజా సంచలన చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’ తమిళ రీమేక్‌ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది. విక్రమ్‌ వారసుడు ధ్రువ్‌ ఈ చిత్రంతో హీరోగా ఆరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే దర్శకుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. పలువురి పేర్లు వినిపించినా... అనూహ్యంగా ప్రముఖ దర్శకుడు బాలా చేతికి వెళ్లింది. ‘అర్జున్‌ రెడ్డి’ తమిళ రీమేక్‌కు బాలా దర్శకత్వం వహించనున్నట్టు ప్రకటించగానే చాలా మంది విస్తుపోయారు. ఒక కొత్త దర్శకుడు తీసిన సినిమాను రీమేక్‌ చేసేందుకు దిగ్గజ దర్శకుడైన బాలా అంగీకరించడం ఆశ్చర్యం కలిగించేదే. యదార్థ చిత్రీకరణకు మారుపేరుగా నిలిచే సినిమాలను తీసిన బాలా... ‘అర్జున్‌ రెడ్డి’ని ఎలా హ్యాండిల్‌ చేయబోతున్నారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తెలుగులో కొత్త ట్రెండ్‌ని సృష్టించిన ఈ సినిమా తమిళంలోనూ అంతటి ప్రభావాన్ని చూపుతుందా? బాలా మేజిక్‌ పనిచేస్తుందా? అన్నది చూడాలి. ఇకపోతే... ఈ సినిమాలో ధ్రువ్‌ జోడీగా ఎవరు నటించబోతున్నారన్నది ఇంకా ఖరారు కాలేదు. కమల్‌హాసన్‌ రెండో కూతురు అక్షర హాసన్‌, యువనటి శ్రియా పేర్లు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో నటించడం ఖాయమని కోలీవుడ్‌ టాక్‌.
entertainment
19,851
26-03-2017 00:21:05
సౌతాఫ్రికా 123/4
కివీస్‌తో మూడో టెస్ట్‌ హామిల్టన్‌: హషీమ్‌ ఆమ్లా (50) అర్ధ సెంచరీతో రాణించడంతో.. న్యూజిలాండ్‌తో ఆఖరి, మూడో టెస్ట్‌లో తొలి రోజైన శనివారం ఆట చివరకు దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఓపెనర్లు డీన్‌ ఎల్గర్‌ (5), థెనిస్‌ డి బ్రూన్‌ (0) విఫలమయ్యారు. జేపీ డుమిని (20) కూడా స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. ప్రస్తుతం కెప్టెన్‌ డుప్లెసిస్‌ (33 బ్యాటింగ్‌), బవుమా (13 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. తొలి రోజు వర్షం కారణంగా 41 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం దెబ్బకు సుమారు మూడు గంటల మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోయింది. మాట్‌ హెన్రీ, గ్రాండ్‌ హోమ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
sports
9,521
25-02-2017 23:00:33
పిల్లల కోసం ఫిల్మ్‌ క్లబ్‌!
నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కేవ్స్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎన్‌ఎఫ్ఎఐ) ఇటీవల ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. కేవలం పిల్లల కోసమే ప్రత్యేకంగా ఫిల్మ్‌ క్లబ్‌ను ఏర్పాటుచేసింది. ఈ క్లబ్‌ ద్వారా భారతదేశంతోపాటు ప్రపంచ సినీమాల వారసత్వ సంపద గురించి పిల్లలకు తెలియజేయాలనుకుంటోంది. అంతేకాదు పిల్లల్లో మంచి సినిమాలపై ఆసక్తిని పెంపొందించాలని భావించింది. అరభత ఫిల్మ్స్‌ సహకారంతో ఈ వినూత్న కార్యక్రమానికి ఎన్‌ఎ్‌ఫఎఐ శ్రీకారం చుట్టింది. ఈ ఫిల్మ్‌ క్లబ్‌లో 9 నుంచి 16 సంవత్సరాల వయసు పిల్లలు సభ్యులుగా చేరొచ్చు. చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ క్లబ్‌ ప్రతి నెల చివరి వారాంతంలో పిల్లల కోసం మంచి సినిమాను ప్రదర్శిస్తుంది. ఈ క్లబ్‌ ప్రదర్శించిన తొలి సినిమా ‘సోనార్‌ కెల్లా’ (గోల్డెన్‌ ఫోరె్ట్రస్‌, 1974). ఈ చిత్రం సత్యజితరాయ్‌కు ఎన్నో జాతీయ అవార్డులను తెచ్చిపెట్టింది. చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ క్లబ్‌ ఫిబ్రవరి 25 నుంచి పిల్లల కోసం చిత్రాల స్ర్కీనింగ్‌ను మొదలెట్టింది. ఈ క్లబ్‌ ఏర్పాటు వల్ల పిల్లల్లో ఆరోగ్యకరమైన సినీమాలను చూసే సంస్కృతి వృద్ధిచెందుతుందని ఎన్‌ఎ్‌ఫఎఐ వర్గాలు అంటున్నాయి.
entertainment
10,247
04-02-2017 13:38:18
ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా: రకుల్‌
ప్రస్తుతం తెలుగు స్టార్‌ హీరోల సినిమాల్లో మెరుస్తూ టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది ఉత్తరాది భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అయితే మొదట్లో సందీప్‌ కిషన్‌ నటించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ వంటి హిట్‌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత రెండేళ్లు ఆమెను పట్టించుకోలేదు. ఆ సమయంలో తాను చాలా అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పింది రకుల్‌.
entertainment
16,155
05-05-2017 12:22:46
కోళ్ళ ఫారాలపై న్యాయ శాఖ కన్ను
న్యూఢిల్లీ : కోళ్ళ ఫారాల్లో కోళ్ళను పెంచుతున్న తీరు, వాటిని రవాణా చేస్తున్న పద్ధతులపై కేంద్ర న్యాయ శాఖ దృష్టి సారించింది. ప్రస్తుత చట్టాల ప్రకారం అంతర్జాతీయ ధోరణులను పరిగణనలోకి తీసుకుని నివేదిక సమర్పించాలని న్యాయ పరిశీలన సంఘం (లా కమిషన్)ను కోరింది. జంతు హక్కుల ఉద్యమకారిణి, కేంద్ర మంత్రి మేనక గాంధీ విజ్ఞప్తి మేరకు న్యాయ శాఖ ఈ చర్య తీసుకుంది. పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ళ పెంపకానికి సంబంధించిన చట్టాలను పునః పరిశీలించాలని మేనక గాంధీ న్యాయ శాఖను కోరారు. న్యాయ శాఖ ఆదేశాల మేరకు లా కమిషన్ స్పందించింది. ఈ అంశంతో సంబంధం ఉన్న పక్షాలన్నీ తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. వివిధ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ మూగ జీవులను అనారోగ్యకర పరిస్థితుల్లో పెంచుతున్నారని మేనక తెలిపారని, ఆమె విజ్ఞప్తి మేరకు తమకు న్యాయ శాఖ నోటీసును పంపిందని లా కమిషన్ పేర్కొంది. పౌల్ట్రీ కోళ్ళకు అమ్మకాలు, నిర్వహణ, పెంపకం వంటి సమస్యలపై పౌల్ట్రీ ఫారాల నిర్వాహకులు, రవాణాదారులు, హోటల్ వ్యాపారులు, ఎన్‌జీవోలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. సలహాలు, అభిప్రాయాలను 30 రోజుల్లోగా లా కమిషన్ కార్యాలయానికి పంపించాలని తెలిపింది.
nation
1,445
10-11-2017 00:33:19
వివో వి7+లో కొత్త వేరియంట్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వి7+స్మార్ట్‌ఫోన్‌లో నీలి రంగుతో కూడిన వేరియంట్‌ను వివో కంపెనీ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 21,990 రూపాయలు. నవంబరు 15వ తేదీ నుంచి ఇది స్టోర్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అమెజాన్‌.ఇన్‌లో ఈ ఫోన్‌ కోసం ప్రీ బుకింగ్‌ కూడా చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌లో 16 ఎంపి వెనుక, 24 ఎంపి ముందు కెమెరాలు, ఫేస్‌ అన్‌లాక్‌, 5.99 అంగుళాల టచ్‌ స్ర్కీన్‌, ఆండ్రాయిడ్‌ నౌగట్‌ ఔస్‌, 4జిబి రామ్‌, 64 జిబి ఇంటర్నల్‌ మెమరీ, 3225 ఎంఎహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి.
business
3,847
05-04-2017 03:38:02
‘హస్త’ రేఖలే శత్రువులు!
2019 ఎన్నికలకు అటు ఇటుగా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచి అయినా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎవరో వచ్చి, ఏదో చేస్తారనే భ్రమల్లో ఉండకుండా, కలిసికట్టుగా క్షేత్ర స్థాయికి వెళ్లి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధిగా ప్రభుత్వంతో కొట్లాడితే మంచిది. లేకపోతే రాబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మిగలదు. హస్తం.. రేఖలమయం. అవి సరళంగా ఉన్నా, వక్రంగా ఉన్నా.. వాటితోనే హస్తానికి అందం చందం. రేఖలు లేని హస్తాన్ని ఊహించుకోలేం. అంతటి ప్రాధాన్యం కలిగిన రేఖలే హస్తానికి శత్రువుగా మారితే? వేటి దారిన అవి ఉండకుండా పరస్పరం పొట్లాడుకుంటే? నిలువ నీడనిచ్చిన హస్తాన్ని గుండుసూదుల్లా గుచ్చుతుంటే? దాని గుండెల్లో గునపాలై దిగుతుంటే? ఏమ నాలి?? తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అంటే సరిపోతుందేమో!! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల అధికార అనుభవం ముగింపు దశకు చేరుకున్నాక రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్‌కి ఉభయ రాష్ర్టాల్లో కాలంతో పాటు, అదృష్టమూ కలిసిరాలేదు. 2014 సాధారణ ఎన్నికల్లో ఒక్క సీటూ సాధించలేక విభజిత ఆంధ్రప్రదేశ్‌ చట్టసభల్లో నామరూపాలు లేకుండా పోయిన పార్టీ, కొత్త రాష్ట్రం తెలంగాణలో కిందా మీదాపడి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఏపీని పక్కనపెడితే, తెలంగాణలో అధికారం తమదేనని కలలు కన్న కాంగ్రెస్‌ ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించలేక పోవటానికి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల కంటే, ఆ పార్టీ నేతల స్వయంకృతాపరాధమే ప్రధాన కారణమనటంలో సందేహం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జమిలిగా ఏర్పాటై మూడేళ్లు కావస్తోంది. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో మార్పు వచ్చిందా? అంటే, లేదనే సమాధానాలే అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. రాజకీయంగా, ప్రజాప్రతినిధులుగా విశేషమైన అనుభవం కలిగిన నేతలు తెలంగాణ కాంగ్రెస్‌లో మిగిలే ఉన్నారు. చాలామంది ముఖ్య నేతలు వయసు రీత్యా కూడా చిన్నవారేమీ కాదు. కానీ ఎక్కువ మందికి పార్టీ భవిష్యత్తు కంటే, స్వీయ భవిష్యత్తుపైనే బెంగ ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకే అంశానికి సంబంధించి.. ఒక నేత ఒకరకంగా మాట్లాడితే, మరొక నేత ఇంకో రకంగా మాట్లాడతారు. ఒకే నాయకుడు రోజుల వ్యవధిలో పరస్పర భిన్నంగా స్పందించటానికి ఏ మాత్రం సంశయించటం లేదు. బయటికి తెలియని విభేదాలతో పలువురు పార్టీ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవటానికి నిరంతరం కాలు దువ్వుతూనే ఉంటారు. చివరికి వ్యక్తిగత ఆరోపణలకు దిగటానికీ వెనుకాడరు. వీటిన్నింటినీ కాంగ్రెస్‌లో ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ పుష్కలంగా ఉందనే ముసుగుతో పార్టీ నేతలు సమర్థించుకుంటున్నారు. అంతేకానీ తమ వైఖరి వల్ల స్వయంగా తామే కాకుండా, కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో పలుచన అవుతున్నాయనే సోయి ఉండటం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వాతావరణంతో పోల్చుకుంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా భిన్నం. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఏం మాట్లాడినా చెల్లింది. అధికారంలో ఉన్నారు కదా! అప్పుడైనా ఒక్క ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని పల్లెత్తు మాట అనకుంటే చాలు, ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు అనే ధోరణి కొనసాగింది. ‘శతకోటి లింగాల్లో బోడి లింగం’ అన్నట్లుగా కాంగ్రెస్‌ నేతల పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ నూతనంగా ఏర్పాటైన రాష్ట్రమే కాకుండా చిన్నది. దానికంటే మించి ఇక్కడ అధికారంలో ఉన్నది ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నది ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. సమకాలీన రాజకీయాల్లో తెలంగాణ వరకు ఆయనను మించి టక్కుటమారగజకర్ణగోకర్ణ విద్యలు తెలిసిన వారు లేరు. 2014 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన మరుసటి రోజు నుంచే కేసీఆర్‌, 2019 ఎన్నికల్లో గెలుపొందటానికి అవసరమైన వ్యూహరచన మొదలుపెట్టారు. దాని అమలుకూ శ్రీకారం చుట్టారు. అధ్యయనం, ప్రణాళిక, ఆచరణ వంటి శాస్ర్తీయ దృక్పథంతో సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతుంటే, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారు. నరంలేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. దానిని అదుపులో పెట్టుకోవటంలోనే ఉంటుంది విజ్ఞత. చిన్న రాష్ట్రం కావటంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల ప్రతి మాట, చర్య వార్తలుగా మారిపోతున్నాయి. ప్రజల ముందు పరీక్షకు నిలబడుతున్నాయి.ఉదాహరణకు 2014 సాధారణ ఎన్నికల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కీలకంగా భావించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో సీఎల్పీ నేత కె.జానారెడ్డి ‘ఐదు రూపాయల భోజనం’ తమ కార్యాలయానికి తెప్పించుకొని తినటమేకాక, అది బాగుందని కితాబు కూడా ఇచ్చారు. తిన్న వెంటనే మెచ్చుకోవటానికి అదేమీ పెళ్లి భోజనం కాదు. అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం. సమయం, సందర్భం లేకుండా జానారెడ్డి చేసిన ఆ పని అప్పుడు కాంగ్రెస్‌ పార్టీని బాగానే దెబ్బకొట్టింది. ఇటీవల అదే జానారెడ్డి కాంగ్రెస్‌ పార్టీని గట్టెక్కించటానికి బాహుబలి వస్తారనే వ్యాఖ్య చేశారు. అంటే ఇప్పుడు తమ సొంత పార్టీలో ఉన్న నాయకుల వల్ల ఫలితం లేదని, కాంగ్రెస్‌ను గట్టెక్కించటానికి బయటి నుంచి ఎవరో ఒకరు రావాల్సిందేనని జానారెడ్డి చెప్ప కనే చెప్పారు. ‘చింత చచ్చినా పులుపు చావలేదు’ అన్నట్టు అధికారాన్ని కోల్పోయి మూడేళ్లు కావస్తున్నప్పటికీ, చాలా మంది కాంగ్రెస్‌ నేతల వ్యవహారశైలి మంత్రులను తలపిస్తుంటుంది.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తామని, తమదే ముఖ్యమంత్రి పీఠం అని పగటి కలలు కంటున్న వారి సంఖ్య ఆ పార్టీలో అర డజనును మించి ఉండటం బహిరంగ రహస్యమే.2014లో చేతికి అందివస్తుందనుకున్న అధికారం ఎలాగూ దక్కలేదు. అలాంటప్పుడు కనీసం 2019 ఎన్నికల కోసమైనా కాంగ్రెస్‌ నేతలు ఎంత కసిగా పనిచేయాలి? అవసరమైతే నిద్ర, ఆహారాలు మాని పార్టీ కోసం శ్రమించాలి. సీఎం కేసీఆర్‌ వంటి దిగ్గజాన్ని ఎదుర్కోవటానికి రాజకీయమే శ్వాసగా అనుక్షణం కసరత్తు చేయాలి. అయితే 2004–-14 వరకు పదేళ్లు అధికారాన్ని ఎంజాయ్‌ చేసిన చాలా మంది తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ప్రస్తుతం రాజకీయాలు, పార్టీ పరమైన వ్యవహారాలు పార్ట్‌టైం ఉద్యోగంగా మారిపోయాయి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలను చేతులారా జారవిడుచుకుంటున్నారు. కీలకమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సమయంలోనూ సీనియర్‌ నేతలు పలువురు ఒకవైపు సభ నడుస్తుండగా, మరోవైపు విశ్రాంతి తీసుకోవటానికి ప్రాధాన్యం ఇస్తే ఏమనుకోవాలి?ప్రతిపక్షం అనేది ప్రజా సమస్యలు, వారి మనోగతాన్ని ప్రతిబింబించే అద్దంలాంటిది. ఆ అద్దం పగుళ్లు పడితే లేక మసకబారటమో జరిగితే ఎలా? ప్రతిపక్షం తనను తాను స్పష్టంగా చూసుకోగలదా? ఈ పరిస్థితుల్లోనే సీఎం కేసీఆర్‌ వచ్చే ఎన్నికలపై ధీమాగా ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పని క్లోజ్‌ అయిందని, ఆ పార్టీ నేతలు చేతులెత్తేశారని, టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ఈ మాట కేసీఆర్‌ చెప్పటం కాదు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల వైఖరి చూస్తుంటే, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కాంగ్రెస్‌కు నష్టం చేయటానికి కొత్తగా శత్రువులు పుట్టుకు రావాల్సిన అవసరంలేదని, ఆ పార్టీ నేతలు వైఖరి చాలుననే అభిప్రాయం క్రమంగా అందరిలోనూ బలపడుతోంది. 2019 ఎన్నికలకు అటు, ఇటుగా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచి అయినా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎవరో వచ్చి, ఏదో చేస్తారనే భ్రమల్లో ఉండకుండా, కలిసికట్టుగా క్షేత్ర స్థాయికి వెళ్లి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధిగా ప్రభుత్వంతో కొట్లాడితే మంచిది. పార్టీ నేతలు తమ ప్రతి మాట వెనుక ఇంకో అర్థాన్ని వెతుక్కునే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వకుండా చూసుకుంటే అదే పదివేలు. లేకపోతే రాబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మిగలదు. తదుపరి చింతించినా ప్రయోజనం ఉండదు.మెండు శ్రీనివాస్‌ హస్తం.. రేఖలమయం. అవి సరళంగా ఉన్నా, వక్రంగా ఉన్నా.. వాటితోనే హస్తానికి అందం చందం. రేఖలు లేని హస్తాన్ని ఊహించుకోలేం. అంతటి ప్రాధాన్యం కలిగిన రేఖలే హస్తానికి శత్రువుగా మారితే? వేటి దారిన అవి ఉండకుండా పరస్పరం పొట్లాడుకుంటే? నిలువ నీడనిచ్చిన హస్తాన్ని గుండుసూదుల్లా గుచ్చుతుంటే? దాని గుండెల్లో గునపాలై దిగుతుంటే? ఏమ నాలి?? తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అంటే సరిపోతుందేమో!! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల అధికార అనుభవం ముగింపు దశకు చేరుకున్నాక రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్‌కి ఉభయ రాష్ర్టాల్లో కాలంతో పాటు, అదృష్టమూ కలిసిరాలేదు. 2014 సాధారణ ఎన్నికల్లో ఒక్క సీటూ సాధించలేక విభజిత ఆంధ్రప్రదేశ్‌ చట్టసభల్లో నామరూపాలు లేకుండా పోయిన పార్టీ, కొత్త రాష్ట్రం తెలంగాణలో కిందా మీదాపడి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఏపీని పక్కనపెడితే, తెలంగాణలో అధికారం తమదేనని కలలు కన్న కాంగ్రెస్‌ ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించలేక పోవటానికి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల కంటే, ఆ పార్టీ నేతల స్వయంకృతాపరాధమే ప్రధాన కారణమనటంలో సందేహం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జమిలిగా ఏర్పాటై మూడేళ్లు కావస్తోంది. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో మార్పు వచ్చిందా? అంటే, లేదనే సమాధానాలే అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. రాజకీయంగా, ప్రజాప్రతినిధులుగా విశేషమైన అనుభవం కలిగిన నేతలు తెలంగాణ కాంగ్రెస్‌లో మిగిలే ఉన్నారు. చాలామంది ముఖ్య నేతలు వయసు రీత్యా కూడా చిన్నవారేమీ కాదు. కానీ ఎక్కువ మందికి పార్టీ భవిష్యత్తు కంటే, స్వీయ భవిష్యత్తుపైనే బెంగ ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకే అంశానికి సంబంధించి.. ఒక నేత ఒకరకంగా మాట్లాడితే, మరొక నేత ఇంకో రకంగా మాట్లాడతారు. ఒకే నాయకుడు రోజుల వ్యవధిలో పరస్పర భిన్నంగా స్పందించటానికి ఏ మాత్రం సంశయించటం లేదు. బయటికి తెలియని విభేదాలతో పలువురు పార్టీ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవటానికి నిరంతరం కాలు దువ్వుతూనే ఉంటారు. చివరికి వ్యక్తిగత ఆరోపణలకు దిగటానికీ వెనుకాడరు. వీటిన్నింటినీ కాంగ్రెస్‌లో ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ పుష్కలంగా ఉందనే ముసుగుతో పార్టీ నేతలు సమర్థించుకుంటున్నారు. అంతేకానీ తమ వైఖరి వల్ల స్వయంగా తామే కాకుండా, కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో పలుచన అవుతున్నాయనే సోయి ఉండటం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వాతావరణంతో పోల్చుకుంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా భిన్నం. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఏం మాట్లాడినా చెల్లింది. అధికారంలో ఉన్నారు కదా! అప్పుడైనా ఒక్క ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని పల్లెత్తు మాట అనకుంటే చాలు, ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు అనే ధోరణి కొనసాగింది. ‘శతకోటి లింగాల్లో బోడి లింగం’ అన్నట్లుగా కాంగ్రెస్‌ నేతల పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ నూతనంగా ఏర్పాటైన రాష్ట్రమే కాకుండా చిన్నది. దానికంటే మించి ఇక్కడ అధికారంలో ఉన్నది ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నది ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. సమకాలీన రాజకీయాల్లో తెలంగాణ వరకు ఆయనను మించి టక్కుటమారగజకర్ణగోకర్ణ విద్యలు తెలిసిన వారు లేరు. 2014 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన మరుసటి రోజు నుంచే కేసీఆర్‌, 2019 ఎన్నికల్లో గెలుపొందటానికి అవసరమైన వ్యూహరచన మొదలుపెట్టారు. దాని అమలుకూ శ్రీకారం చుట్టారు. అధ్యయనం, ప్రణాళిక, ఆచరణ వంటి శాస్ర్తీయ దృక్పథంతో సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతుంటే, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారు. నరంలేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. దానిని అదుపులో పెట్టుకోవటంలోనే ఉంటుంది విజ్ఞత. చిన్న రాష్ట్రం కావటంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల ప్రతి మాట, చర్య వార్తలుగా మారిపోతున్నాయి. ప్రజల ముందు పరీక్షకు నిలబడుతున్నాయి.ఉదాహరణకు 2014 సాధారణ ఎన్నికల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కీలకంగా భావించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో సీఎల్పీ నేత కె.జానారెడ్డి ‘ఐదు రూపాయల భోజనం’ తమ కార్యాలయానికి తెప్పించుకొని తినటమేకాక, అది బాగుందని కితాబు కూడా ఇచ్చారు. తిన్న వెంటనే మెచ్చుకోవటానికి అదేమీ పెళ్లి భోజనం కాదు. అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం. సమయం, సందర్భం లేకుండా జానారెడ్డి చేసిన ఆ పని అప్పుడు కాంగ్రెస్‌ పార్టీని బాగానే దెబ్బకొట్టింది. ఇటీవల అదే జానారెడ్డి కాంగ్రెస్‌ పార్టీని గట్టెక్కించటానికి బాహుబలి వస్తారనే వ్యాఖ్య చేశారు. అంటే ఇప్పుడు తమ సొంత పార్టీలో ఉన్న నాయకుల వల్ల ఫలితం లేదని, కాంగ్రెస్‌ను గట్టెక్కించటానికి బయటి నుంచి ఎవరో ఒకరు రావాల్సిందేనని జానారెడ్డి చెప్ప కనే చెప్పారు. ‘చింత చచ్చినా పులుపు చావలేదు’ అన్నట్టు అధికారాన్ని కోల్పోయి మూడేళ్లు కావస్తున్నప్పటికీ, చాలా మంది కాంగ్రెస్‌ నేతల వ్యవహారశైలి మంత్రులను తలపిస్తుంటుంది.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తామని, తమదే ముఖ్యమంత్రి పీఠం అని పగటి కలలు కంటున్న వారి సంఖ్య ఆ పార్టీలో అర డజనును మించి ఉండటం బహిరంగ రహస్యమే.2014లో చేతికి అందివస్తుందనుకున్న అధికారం ఎలాగూ దక్కలేదు. అలాంటప్పుడు కనీసం 2019 ఎన్నికల కోసమైనా కాంగ్రెస్‌ నేతలు ఎంత కసిగా పనిచేయాలి? అవసరమైతే నిద్ర, ఆహారాలు మాని పార్టీ కోసం శ్రమించాలి. సీఎం కేసీఆర్‌ వంటి దిగ్గజాన్ని ఎదుర్కోవటానికి రాజకీయమే శ్వాసగా అనుక్షణం కసరత్తు చేయాలి. అయితే 2004–-14 వరకు పదేళ్లు అధికారాన్ని ఎంజాయ్‌ చేసిన చాలా మంది తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ప్రస్తుతం రాజకీయాలు, పార్టీ పరమైన వ్యవహారాలు పార్ట్‌టైం ఉద్యోగంగా మారిపోయాయి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలను చేతులారా జారవిడుచుకుంటున్నారు. కీలకమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సమయంలోనూ సీనియర్‌ నేతలు పలువురు ఒకవైపు సభ నడుస్తుండగా, మరోవైపు విశ్రాంతి తీసుకోవటానికి ప్రాధాన్యం ఇస్తే ఏమనుకోవాలి?ప్రతిపక్షం అనేది ప్రజా సమస్యలు, వారి మనోగతాన్ని ప్రతిబింబించే అద్దంలాంటిది. ఆ అద్దం పగుళ్లు పడితే లేక మసకబారటమో జరిగితే ఎలా? ప్రతిపక్షం తనను తాను స్పష్టంగా చూసుకోగలదా? ఈ పరిస్థితుల్లోనే సీఎం కేసీఆర్‌ వచ్చే ఎన్నికలపై ధీమాగా ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పని క్లోజ్‌ అయిందని, ఆ పార్టీ నేతలు చేతులెత్తేశారని, టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ఈ మాట కేసీఆర్‌ చెప్పటం కాదు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల వైఖరి చూస్తుంటే, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కాంగ్రెస్‌కు నష్టం చేయటానికి కొత్తగా శత్రువులు పుట్టుకు రావాల్సిన అవసరంలేదని, ఆ పార్టీ నేతలు వైఖరి చాలుననే అభిప్రాయం క్రమంగా అందరిలోనూ బలపడుతోంది. 2019 ఎన్నికలకు అటు, ఇటుగా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచి అయినా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎవరో వచ్చి, ఏదో చేస్తారనే భ్రమల్లో ఉండకుండా, కలిసికట్టుగా క్షేత్ర స్థాయికి వెళ్లి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధిగా ప్రభుత్వంతో కొట్లాడితే మంచిది. పార్టీ నేతలు తమ ప్రతి మాట వెనుక ఇంకో అర్థాన్ని వెతుక్కునే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వకుండా చూసుకుంటే అదే పదివేలు. లేకపోతే రాబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మిగలదు. తదుపరి చింతించినా ప్రయోజనం ఉండదు.మెండు శ్రీనివాస్‌
editorial
7,460
25-05-2017 12:59:12
బుల్లితెరపైనా రికార్డులతో కుమ్మేయడానికి.. ఈ నాలుగు కారణాలు చాలట!
నో డౌట్.. తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశాడు చిరంజీవి. ఎన్టీఆర్ తర్వాత బాక్సాఫీస్ మెగాస్టార్‌గా అవతరించాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరు.. కొన్నేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. దాదాపు పదేళ్ల తర్వాత ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చి సినిమాల్లో తన చరిష్మా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టాడు. ఇక, తొలిసారి ఈ సినిమా బుల్లితెరపై ప్రేక్షకులకు విందు పంచబోతోంది. మే 28న టీవీలో సినిమా రాబోతోంది. దీంతో టీఆర్పీ పరంగా కూడా చిరు రికార్డులను కుమ్మేస్తాడా..? అనే చర్చ జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వేస్తున్న భారీ ప్రీమియర్ అంటూ సదరు చానెల్ ప్రమోట్ చేసుకుంటోంది. అంతేకాదు.. బుల్లితెరపైనా చిరంజీవి రికార్డులు ఖాయమని చెబుతున్నారట. దానికి కారణాలు లేకపోలేదు.  బుల్లితెరపై సినిమా భారీ హిట్ అవుతుందనడానికి వారు వివరిస్తున్న కారణాలివే! 1. ఈ వీకెండ్‌లో విడుదలవుతున్న భారీ సినిమా ఏదీ లేదు2. మునుపటితో పోలిస్తే బాహుబలి-2 ప్రభంజనం తగ్గుతోంది3. ఐపీఎల్ సీజన్ కూడా అయిపోయింది4. మండిపోతున్న ఎండల కారణంగా సాయంత్రం పూట కూడా జనాలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు          వెరసి బుల్లితెరపై ఖైదీ నంబర్ 150 సూపర్ డూపర్ హిట్టేనని అంటున్నారు. మరి, చిరు మూవీ బుల్లితెరపై రికార్డు టీఆర్పీని అందుకుంటుందా..? లేదా..? తెలియాలంటే మాత్రం సినిమా టెలీకాస్ట్ అయ్యే మే 28వరకు ఆగాల్సిందే.
entertainment
79
08-02-2017 00:30:12
8810 వద్ద అప్రమత్త ట్రెండ్‌
నిఫ్టీ సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ 8800 స్థాయిల వద్ద నిలదొక్కుకోవటంలో విఫలమైంది. ఇంట్రాడేలో మైనర్‌ కరెక్షన్‌ను కనబరిచి చివరకు స్వల్ప నష్టంతో క్లోజైంది. టెక్నికల్‌గా మార్కెట్‌ ఎలాంటి కొత్త సంకేతాలను వెలువరించటం లేదు. 8800- 8750 మధ్య మైనర్‌ శ్రేణిలో కదలాడుతోంది. తదుపరి దిశకు ఈ స్థాయిల వద్ద బ్రేకవుట్‌ సాధించాల్సి ఉంటుంది.నిరోధం : 8810 మద్దతు : 8750 -వి. సుందర్ రాజా
business
17,205
25-10-2017 13:42:39
టిప్పు సుల్తాన్‌పై రాష్ట్రపతి సంచలన ప్రసంగం
న్యూఢిల్లీ: మైసూర్ పాలకుడు  టిప్పు సుల్తాన్ గొప్ప యుద్ధ వీరుడని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. విధాన సౌధ 60వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం కర్నాటక అసెంబ్లీ, శాసనమండలి సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘‘బ్రిటిష్ పాలకులపై పోరాడుతూ టిప్పు సుల్తాన్ వీరమరణం పొందారు. యుద్ధంలో మైసూర్ రాకెట్లకు ఆయనే నాంది పలికారు..’’ అని కొనియాడారు. రాష్ట్రంలోని జీవన వైవిధ్యంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘పురాతన జైనులకు, బౌద్ధ సంప్రదాయాలకు ఈ నేల ప్రసిద్ధి చెందింది. ఆదిశంకరాచార్యుడు ఇక్కడే శృంగేరి మఠాన్ని నెలకొల్పాడు. గుల్బర్గా ప్రాంతం సూఫీ సంస్కృతికి కేంద్రంగా విలసిల్లింది. కర్నాటకలోనే బసవాచార్య నేతృత్వంలో లింగాయత్ ఉద్యమం పురుడుపోసుకుంది..’’ అని ఆయన పేర్కొన్నారు.  ఘనమైన ఆథ్యాత్మిక చరిత్రతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాలకు, వ్యవసాయానికి కర్నాటక ప్రసిద్ధి చెందిందన్నారు. భారత సైన్యానికి సైతం కర్నాటక అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. ‘‘మన సైన్యంలోని ఇద్దరు చీఫ్‌లు ఫీల్డ్ మార్షల్ కేఎమ్ కరియప్ప, జనరల్ కేఎస్ తిమ్మయ్య కర్నాటక బిడ్డలే..’’అని రాష్ట్రపతి కోవింద్ గుర్తుచేశారు. టిప్పు సుల్తాన్‌ నిరంకుశుడంటూ బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన ప్రసంగంలో స్పష్టమైన వైఖరిని వెల్లడించడం గమనార్హం.
nation
14,636
21-08-2017 07:29:20
సీఎం పీఠంపై తలైవర్‌!
చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో... తలైవర్‌ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రచారం చేసే దిశగా ఆదివారం తిరుచ్చిలో నిర్వహించిన మహానాడులో రజనీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గాంధీయ మక్కల్‌ ఇయక్కం నేత తమిళరువి మణియన్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ మహానాడు కారణంగా తిరుచ్చి మొత్తం రజనీమయంగా మారింది. ఎక్కడ చూసినా రజనీ బ్యానర్లు, ప్లకార్డులు, పోస్టర్లు కనిపించాయి.  రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన తరుణమని తను నమ్ముతున్నట్టు తమిళరువి మణియన్‌ కొద్దికాలంగా ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. రజనీ అభిమానుల్లో అధికశాతం మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. దీనినే ప్రజల్లోకి కూడా తీసుకెళ్లేందుకు, రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకతపై, ఒకవేళ వస్తే రాష్ట్రంలో చోటుచేసుకోబోయే మార్పుల గురించి వివరించడమే లక్ష్యంగా ఈ మహానాడు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వేలాదిగా రజనీకాంత్‌ అభిమానులు తలరివచ్చారు. రజనీ ఫోటోలున్న జెండాలు చేతబూని ద్విచక్ర వాహనాలు, కార్లు, వ్యాన్‌లతో ర్యాలీగా తిరుచ్చికి పోటెత్తారు.  ఆ సందర్భంగా తమిళరువి మణియన్‌ వేదికపై ప్రసంగిస్తూ... రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావడం ఖాయమని, ఆయన సీఎం పీఠంపై కూర్చోబెడదామని పిలుపునిచ్చారు. దాంతో ఒక్కసారిగా మహానాడు ప్రాంగణం దద్ధరిల్లిపోయింది. తలైవర్‌ సీఎం.. తలైవర్‌ సీఎం అంటూ నినాదాలు మిన్నంటాయి. అనంతరం తమిళరువి మణియన్‌ ప్రసంగిస్తూ... ‘50 ఏళ్లుగా వంతులవారీగా రాష్ట్రాన్ని పాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పాలనతో విసుగు చెందిన ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. అది రజనీ వల్లే సాధ్యమవుతుంది. ఒకసారి రజనీని ఇంట్లో కలిసినప్పుడు.. దేవుడు శాసిస్తే నేను రాజకీయాల్లోకి రావడం తథ్యమని చెప్పారు. ఆ రోజు దగ్గరపడింది. సెయింట్‌ జార్జి కోటలో రజనీని సీఎంగా కూర్చోబెట్టడమే గాంధీయ మక్కల్‌ ఇయక్కం ప్రధానం లక్ష్యం. ఇది నెరవేరాలంటే అభిమానులు సైనికుల్లా పనిచేయాలి. ద్రావిడ పార్టీలు 50ఏళ్లు అధికారంలో కూర్చుని అవినీతి పాలన చేస్తున్నాయి. అందువల్లే ఫోటోసెషన్‌ కార్యక్రమంలో ‘సిస్టమ్‌ బాలేద’ని రజనీకాంత్‌ వ్యాఖ్యానించారు. రజనీ రాజకీయాల్లోకి వస్తే ఎవరితో జత కట్టే అవకాశం లేదు. ఆయన సొంత పార్టీతో వచ్చి పీఠమెక్కుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 25 శాతం ఓటు బ్యాంకు ఉందని ఓ సర్వేలో తెలిసింది. రాజకీయాల్లోకి వస్తే అది 40 శాతం పెరుగుతుంది. ఎన్నికలొస్తే డీఎంకే, అన్నాడీఎంకేలకు డిపాజిట్లు కూడా దక్కవు. అవినీతి గురించి స్టాలిన్‌ మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉంది. దేశంలోనే అతపెద్ద అవినీతి కుంభకోణం 2జీకి కారణం ఎవరో ప్రజలందరికీ తెలుసు. 2007లో డీఎంకే ప్రభుత్వ హయాంలో ఐలాండ్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ దక్షిణాది నదులను అనుసంధానం చేసేందుకు కేంద్రంగా సిద్ధంగా ఉందని, దీనికి ముఖ్యమంత్రి హోదాలో కరుణానిధి చర్యలు తీసుకోవాలని వేదికపై ప్రకటించారు. ఆ తరువాత రెండుసార్లు సీఎంగా వ్యవహరించిన కరుణానిధి నిర్లక్ష్యం చూపడం వల్లే డెల్టా రైతులు సాగు నీటి కోసం అలాడుతున్నారు. అధికారంలో లేకపోయినా కేవలం రైతుల సంక్షేమం కోరుతూ నగదు అనుసంధానం కోసం రజనీ ముందుకొచ్చారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రజనీకాంత్‌ రాష్ట్రాల్లోకి వస్తే ప్రజలకి మంచి జరుగుతుంది’ అని పేర్కొన్నారు.
nation
3,954
09-07-2017 23:00:45
తాకాలని
ఈ నగరం తాకని, ఏ వెన్నెల వానో కురిసే రాత్రిలో తడిచే పూలనుసున్నితంగా పరికించినట్టు, నీ చేతివేళ్లనితాకాలని అనుకుంటాను - అవేనిద్దురలో ఒక పక్కకి ఒత్తిగిల్లి, నాకు తెలియని భాషలో కలవరించే నీ చేతివేళ్లు - అద్దంపై పొగమంచుని తుడిచి ముఖాన్ని చూసుకున్నట్టుఅప్పుడొకగగుర్పాటు. ఉదయమంతా పొగచూరి మసిబారి ఇప్పుడిక ముడుతలు పడివెక్కి వెక్కి ఏడ్చి నిదురలోకి జారిన, పసిపాపల వంటి నీచేతివేళ్లు - చీపుర్లు అయిన చేతివేళ్లు. వంట గిన్నెలయ్యిన చేతివేళ్ళు. దుస్తులయ్యిన చేతివేళ్లు.సబ్బూ, రుబ్బురోలు పొత్రమూ, గదులూ మలమూ మూత్రమూ ఏర్పరిచినపసుపుపచ్చమరకలనూశుభ్రం చేసేశ్రమా అయిన చేతివేళ్ళు. నువ్వు కక్కుకున్నప్పుడు మట్టికుండై నిన్ను నింపుకున్నచేతివేళ్లు. అన్నం పెట్టే చేతివేళ్లు. నీకు నీళ్ళు తాపించే చేతివేళ్లుఅప్పుడప్పుడూతలుపుచాటునకండ్లల్లో నీళ్ళు కుక్కుకునే చేతివేళ్లు. అప్పుడప్పుడూ మూగవోయె చేతివేళ్లు. నుదురునిఅరచేతిలోకి వంపుకుని రాత్రంతా కూర్చునే చేతివేళ్లునిన్ను శపించలేని చేతివేళ్లునిన్ను దీవించే చేతివేళ్లు -నిన్ను ప్రేమించీ ప్రేమించీ గరకుగా మారి, ఇప్పుడిక ఒక కలత నిద్రలోపెరడులో ఆరవేసిన దుస్తులు రెపరెపా కొట్టుకుని, ఒక ముళ్ళతీగకు చుట్టుకునిఆగిపోయినట్టున్న, నీ చేతివేళ్లు - తిరిగి గాలికి కదిలితను కొద్దికొద్దిగా చిరుగుతూ, ముల్లుతో ఉండ లేకా, పూర్తిగా వొదిలి వెళ్లిపోలేకామరింతగా చీలిపోయే నీ చేతివేళ్లుచీకట్లో దీపాన్ని వెలిగించే చేతివేళ్లు - అదే దీపాన్ని ఆర్పుతూ మరెవరివో చేతివేళ్లు. ఇక మరి ఎక్కడిదో ఒక గాలి ఇక్కడవీచీ వీచీ, ఇక వీయలేక వెళ్ళిపోతేకాలం స్థంబించిన ఆ క్షణానఈ నగరం తాకిన, ఏ వానా కురియని రాత్రిలో సొమ్మసిల్లిన నీవంటి, అమ్మవంటినీ చేతివేళ్లని తాకాలని అనుకుంటాను. తాకుతాను - ఇంత ఎరుకతోనిన్ను తాకాకతాకడమంటే, తాను ఇతరమవ్వడం అని తెలిసాక, తాకడమే శోక నివారణ అని తెలిసాకఇక మునుపటిలా, నేను, నేనులాఎలా ఉండగలను? శ్రీకాంత్‌98486 66846
editorial
8,574
16-05-2017 23:57:34
సినీ దర్శకుడి ప్రేమకథ
అశోక్‌, ఈషా జంటగా నటిస్తున్న చిత్రం ‘దర్శకుడు’. హరిప్రసాద్‌ జక్క దర్శకుడు. సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై సుకుమార్‌ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశలో ఉన్నాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ సినీ దర్శకుడి ప్రేమకథ ఇది. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. కథలో మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి’’ అని అన్నారు. ‘‘ఇటీవల బ్యాంకాక్‌లో తెరకెక్కించిన పాటతో షూటింగ్‌ పూర్తయింది. ఈ నెల 22న స్టార్‌హీరో చేతులమీదుగా టీజర్‌ని ఆవిష్కరిస్తాం. ఈ నెలాఖరులో పాటల్ని, వచ్చే నెల 9న సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాణంలో సుకుమార్‌తో భాగస్వాములైన విజయ్‌కుమార్‌, థామ్‌సరెడ్డి, రవిచంద్ర తెలిపారు.
entertainment
2,786
09-06-2017 00:57:53
తెలుగు రాష్ర్టాలు భేష్‌
సులభతర వ్యాపార విధానాలకు అసోచామ్‌ ప్రశంసహైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కంపెనీలు తమ వ్యాపారాన్ని సులభతరంగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఆదర్శనీయంగా ఉన్నాయని, ఇలాంటి విధానాలనే కేంద్రం, ఇతర రాష్రాలు అనుసరించడం వల్ల ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి అవకాశం ఉంటుందని అసోచామ్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ జజోడియా అన్నారు. పారిశ్రామికవేత్తలు, ఎంటర్‌ప్రెన్యూర్లు నిర్ణీత కాలపరిమితిలోపు అనుమతులు పొందే హక్కును ఈ రాష్ర్టాలు కల్పిస్తున్నాయని, అనుమతులు ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తే జరిమానాలను కూడా విధిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా రిటర్నుల ఫైలింగ్‌, పన్నుల చెల్లింపులు, రిఫండ్స్‌ను పొందడం వంటివి ఈ రాష్ర్టాలు తీసుకున్న విప్లవాత్మక చర్యలని ఆయన పేర్కొన్నారు. సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడంలో ఈ రెండు రాష్ర్టాలు కూడా పోటీపడుతున్నాయన్నారు. గురువారంనాడిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోచామ్‌ నేషనల్‌ సెక్రటరీ జనరల్‌ డిఎస్‌ రావత్‌, అసోచామ్‌ తెలంగాణ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌ బాడిగ తో కలిసి సందీప్‌ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సులభతర వ్యాపార నిర్వహణ సూచీలో భారత్‌ చాలా వెనుకబడి ఉందని, మెరుగైన ర్యాంకింగ్‌ సాధించేందుకు మరిన్ని నూతన విధానాలను అనుసరించాలన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా వంటి నూతన విధానాల వల్ల పాలనాపరమైన ప్రక్రియలు సులభతరమైనట్టు ఆయన చెప్పారు. మరిన్ని సంస్కరణలు చేపడితే కంపెనీల పోటీతత్వం పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
business
11,545
19-02-2017 03:27:08
పళనిదే విజయం
చెన్నై, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): సంచలనాలు లేవు! అనూహ్య పరిణామాలూ చోటు చేసుకోలేదు! చివరి క్షణంలో ఏదైనా జరగొచ్చన్న ఓపీఎస్‌ ఆశలు నెరవేరలేదు! 122మంది ఎమ్మెల్యేల మద్దతుతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. డీఎంకే సభ్యుల సస్పెన్షన్‌.. డివిజన్‌ పద్ధతిలోనే ఓటింగ్‌.. వెరసి పళనిస్వామి ప్రభుత్వం నాటకీయ ఫక్కీలో మెజారిటీ నిరూపించుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రభుత్వం బలనిరూపణలో గట్టెక్కింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో డీఎంకే సభ్యులను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. స్పీకర్‌ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్‌, ఐఎంయూఎల్‌ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనకుండా వాకౌట్‌ చేశారు. దీంతో విపక్షం లేకుండానే పళనిస్వామి ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకుంది. ఉదయం నుంచి జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో సాయంత్రం 3 గంటల అనంతరం ఓటింగ్‌ జరిగింది. సభలోని వారు బయటకు వెళ్లకుండా, బయటి వారు సభలోకి రాకుండా తలుపులు మొత్తం మూసేయాలని స్పీకర్‌ ధనపాల్‌ ఆదేశించారు. రహస్య ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టినప్పటికీ స్పీకర్‌ డివిజన్‌ ఓటింగ్‌కు అనుమతించారు. మొత్తం ఆరు డివిజన్లు ఉన్న అసెంబ్లీలో ఒక్కో డివిజన వారీగా ఎమ్మెల్యేలను లెక్కించగా, ఎడప్పాడి విశ్వాస పరీక్షకు మద్దతుగా 122 మంది, వ్యతిరేకంగా 11 మంది(సెల్వం వర్గీయులు) ఓటు వేశారు. అయితే 88 మంది ఎమ్మెల్యేలున్న డీఎంకే సభ్యులను అప్పటికే మార్షల్స్‌ గెంటివేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్‌, ఐయూఎంఎల్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఒకవేళ ప్రతిపక్ష సభ్యులున్నా అధికార పక్ష మెజారిటీ వచ్చిన ఢోకా ఏమీ లేదని స్పీకర్‌ ధనపాల్‌ పేర్కొన్నారు.
nation
21,444
29-12-2017 03:43:36
పైరవీల గేమ్స్‌
కార్యదర్శి, అబ్జర్వర్‌ పదవులకు ముడుపులురాజకీయ నాయకులతో ఒత్తిళ్లురెండు వర్గాలుగా విడిపోయిన పీఈటీలుస్కూల్‌ గేమ్స్‌ సమాఖ్యలో వర్గపోరుహైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): పాఠశాల విద్యార్థులను ఆటలాడించడం వారి విధి. టోర్నీలు నిర్వహించి జిల్లా, రాష్ట్ర స్థాయి జట్లను ఎంపిక చేయడం వారి కర్తవ్యం. ప్రతిభావంతుల వెన్నుతట్టి మరింత ముందుకెళ్లేలా ప్రోత్సహించడం వారి బాధ్యత. కానీ, వాళ్లు చేసేది పదవుల కోసం పైరవీలు. ఇచ్చేది ముడుపులు.. పుచ్చుకునేది లంచాలు. తెలుగు రాష్ట్రాల వ్యాయామ ఉపాధ్యాయుల్లో ఒక వర్గం పదవుల కోసం రాజకీయ నాయకులను మించిన రాజకీయం చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కాసులు కురిపించే స్కూల్‌ గేమ్స్‌లో జిల్లా కార్యదర్శులు, పరిశీలకుల పదవుల కోసం పెద్ద స్థాయిలో పైరవీలు చేస్తున్నారని పలువురు వ్యాయామ ఉపాధ్యాయులే చెబుతున్నారు. దాంతో, స్కూల్‌ గేమ్స్‌ సమాఖ్యలో అవినీతి ఏ స్థాయికి చేరుకుందో చెప్పొచ్చు. ఆర్జన మీదే ధ్యాసంతా..ఒక విద్యార్థిని జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా తీర్చిదిద్దితే పేరు సంపాదించొచ్చు. కానీ, ఆ పేరు ఎవరికి కావాలి. అవకాశం ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకుంటే పోలా అన్నది తెలుగు రాష్ట్రాల్లో కొందరు వ్యాయామో పాధ్యాయుల ఆలోచన. స్కూల్‌ గేమ్స్‌ నిర్వహణలో జిల్లాల కార్యదర్శులు (అండర్‌ 14, 17కు ఒకరు, అండర్‌-19కు మరొకరు), పర్యవేక్షకులదే కీలక పాత్ర. అందుకే ఈ పదవుల కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. ముఖ్యంగా జిల్లా కార్యదర్శుల నియామకం కోసం పెద్ద స్థాయిలో పైరవీలు.. అంతే మొత్తంలో డబ్బులు చేతులు మారుతాయన్న ఆరోపణలు ఉన్నాయి. అ పదవులకు అర్హులు వ్యాయమ ఉపాధ్యాయులే. అనుభవం, అంకిత భావం ఉన్న వారికి అవకాశం ఇవ్వాలి. కానీ, తాము ఆ పదవుల్లో ఉంటే విచ్చలవిడిగా దండుకోవచ్చని కొంత మంది ఒక వర్గంగా ఏర్పడ్డారని సమాచారం.  పరిశీలకులుగా ఎవరు రావాలి, సెలెక్షన్‌ కమిటీలో ఎవరుండాలి, టోర్నీల కేటాయింపు ఎలా జరగాలి.. ఇలా అంతా ఆ వర్గం కనుసన్నుల్లోనే జరుగుతోందట. దాంతో, నిజాయితీగా పని చేసే ఉపాధ్యాయులు.. వారి విద్యార్థులు తీవ్రంగా నష్టంగా పోతున్నారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. గతంలో జిల్లా కార్యదర్శుల నియామకం కోసం ఎన్నికలు జరిగేవి. ఆ తర్వాత జిల్లా డీఈవోకు కార్యదర్శిని నామినేట్‌ చేసే బాధ్యత అప్పగించారు. అప్పుడు డీఈవోలకు లంచాలు ఇచ్చి ఆ పోస్టులు తెచ్చుకునే వారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీన్ని అడ్డుకునేందుకు నిబంధనలు మార్చారు. తెలంగాణలో ఈ ఏడాది నుంచి ఇప్పటికే కార్యదర్శులుగా పని చేసిన వాళ్లు ఎవరూ మళ్లీ బాధ్యతలు స్వీకరించకూడదన్న షరతు పెట్టారు. అనుభవం ఉన్న కొత్త వాళ్లను డీఈవోలు నియమించాలని స్పష్టం చేశారు. దాంతో, ఇప్పుడు రాజకీయ నాయకుల పంచన చేరి ఒత్తిళ్లు చేయడం మొదలెట్టారట.  తమకంటే అనుభవం ఉన్న వాళ్లను భయపెట్టి పక్కకు తప్పించి పదవి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని దక్షిణ తెలంగాణకు చెందిన ఓ పీడీ చెప్పా రు. సీనియర్‌ అయిన తాను జిల్లా కార్యదర్శి కావాల్సి ఉన్నా.. రాజకీయ నాయకులతో తీవ్రంగా ఒత్తిడి తెచ్చి తప్పుకునేలా చేశారని ఆయన వాపోయారు. ‘కార్యదర్శి పదవి కోసం తన్నుకున్న రోజులున్నాయి. ఎన్నికలు ఉన్నప్పుడు ఆ సమయంలో మందు పార్టీలు ఇచ్చేవారు. కిట్‌లు పంపిణీ చేసి ప్రలోభ పెట్టేవారు. లక్షల్లో ఖర్చు చేసేవారు. ఇప్పుడు రాజకీయ నాయకు లతో బెదిరిస్తున్నార’ని తెలిపారు. నిజాయితీకి బహుమతిగా వేధింపులు.. స్కూల్‌ గేమ్స్‌లో అందరూ అక్రమార్కులే అనలేం. కొందరు నిజాయితీపరులు కూడా ఉన్నారు. విద్యార్థులను చక్కగా ఆడించి.. పక్కాగా టోర్నీలు నిర్వహిస్తున్నవారిని అభినందిం చాల్సిందే. అయితే, వారి నిజాయితీకి బహుమానంగా వేధింపులు ఎదురవుతున్నాయి. నిర్వహణ డబ్బు ముందుగా ఇవ్వకుండా.. బిల్లులు విడుదల చేయకుండా జాప్యం చేస్తూ పెద్దలు, అధికారులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లా స్థాయి టోర్నీల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకు జిల్లా స్థాయి టోర్నీ లేదా రాష్ట్ర సెలెక్షన్‌ ట్రయల్స్‌ ఒక జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగితే దానికయ్యే మొత్తం ఖర్చును అతనే ముందుగా భరించాల్సి ఉంటుంది. అయిన మొత్తానికి తర్వాత బిల్లు పెడితే.. అది విడుదలవడానికి ఎన్ని రోజులు.. నెలలు పడుతుందో తెలియని పరిస్థితి. జిల్లా స్కూల్‌ గేమ్స్‌కు అధ్యక్షుడిగా ఉండే డీఈవో సంతకం పెడితేనే నిధులు విడుదలవుతాయి. దాంతో, విద్యాధికారుల చేతులు కూడా తడపాల్సి వస్తోందని పలువురు చెబుతున్నారు.  అలాగే.. ఒక క్రీడలో జాతీయ టోర్న మెంట్‌కు ఎంపికైన జట్టును ఆ టోర్నీలో ఆడించి తిరిగి తీసుకొచ్చేంత వరకూ వారి ప్రయాణ, ట్రాక్‌లు, పరికరాలు ఖర్చులు, డీ.ఏ మొత్తం కలిపి కనీసం రెండు లక్షలు అవుతున్నాయి. ఇంత ఖర్చు పెడితే.. అవి తిరిగొచ్చేదెప్పుడో తెలియదు. ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ స్థాయి టోర్నమెంట్‌లకు ఎంపికైన విద్యార్థులకు పాఠశాల విద్యా సమాఖ్య.. ట్రాక్‌ సూట్లు సహా వారికి కావాల్సిన పరికరాలు, టీఏ, డీఏ మొత్తం ముందుగానే విడుదల చేసేది. కానీ, ఇప్పుడు నిబంధనలు మార్చడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోందని వ్యాయామోధ్యాయులు వాపోతున్నారు. అంతా మీ వాళ్లేనా..స్కూల్‌ గేమ్స్‌లో నిర్వాహకులు చేసే మాయలు అన్నీ ఇన్నీ కావు. ఒక స్కూల్‌ పీఈటీ కష్టపడి ఐదారుగురు విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్ది సెలెక్షన్స్‌కు తీసుకువస్తే.. వారంతా విశేష ప్రతిభ చూపినా కూడా ఒకరిద్దరికే అవకాశం ఇస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే అంతా ఒక్క స్కూల్‌కు చెందిన వారినే జట్టులోకి తీసుకుం టే తమ పరిస్థితి ఏమిటని నిర్వాహకులు అంటున్నారని ఓ వ్యాయామోపాధ్యాయుడు వాపోయాడు. దాని వల్ల ప్రతిభ ఉన్న విద్యార్థిని పక్కన బెట్టి తమ వాళ్లను ఎంపిక చేసుకుంటున్నారని చెప్పారు.
sports
9,783
12-04-2017 12:03:52
దీపికకు పెళ్లై.. పిల్లలు కూడా ఉన్నారట!
మామూలు హీరోయిన్‌ ఈ మాట చెబితే సీరియస్‌గా తీసుకోరేమో కానీ, దీపికా పదుకొనె నోటి నుంచి వచ్చిన ఈ మాటలు పెద్ద సంచలనాన్నే రేపాయి. చాలా మంది పిల్లల్ని కనాలన్నది దీపికా కోరికట! అది కూడా హాలీవుడ్‌ నటుడు విన్‌ డిసెల్‌ పెళ్ళి చేసుకున్నట్టు, పిల్లల్ని కంటున్నట్టు కలలు వస్తున్నాయట! ఈ మాటలు విని రణవీర్‌తో పాటు ఆమె అభిమానులు కూడా తెగ కంగారు పడుతున్నారట! రణవీర్‌ పెళ్ళి మాటెత్తితే కెరీర్‌ అంటూ అతగాడి నోరు నొక్కేసే దీపికా ఇప్పుడు హాలీవుడ్‌ నటుడిని పెళ్ళి చేసుకుంటున్నట్టు ఎలా కల కంటోంది? అంటున్నారు బాలీవుడ్‌ జనాలు దీపికా హాలీవుడ్‌కి వెళ్ళిన తరువాత చాలా మారిపోయిందనీ, అందుకే రణవీర్‌ని దూరంగా పెడుతోందనీ అంటున్నారు. ఇటీవలి కాలంలో ఇద్దరూ ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నారు. దీనికి కారణం ఇద్దరూ కలిసి నటిస్తున్న ‘పద్మావతి’ మీద హైప్‌ పెంచడానికే అంటూ బయటకు చెబుతున్నా, రణవీర్‌ అంటే మొహం మొత్తడం వల్లనే అతగాడిని దూరంగా నెట్టేస్తోందని అంటున్నారు
entertainment
18,200
13-04-2017 02:49:43
ముగ్గురు ఉగ్రవాదులకు యావజ్జీవ శిక్ష
బెంగళూరు, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ టెర్రర్‌ అమలులో పట్టుబడి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులకు కర్ణాటక మంగళూరు 3వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి పుష్పాంజలి బుధవారం తీర్పునిచ్చారు. ఎనిమిదేళ్ల కిందట ఆపరేషన్‌ టెర్రర్‌ అమలులో ఏడుగురిని అదుపులోకి తీసుకోగా, వారిలో ముగ్గురి నేరం రుజువైంది. దీంతో వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, మిగిలిన నలుగురిపై ఆధారాలు లేకపోవడంతో విడుదల చేశారు. పాండేశ్వరనగర్‌కు చెందిన సయ్యద్‌ మహమ్మద్‌ నౌషాద్‌ (25), హళేయంగడి ఇందిరానగర్‌ నివాసి అహ్మద్‌ బావా అబూబక్కర్‌ (33), పడుబద్రి ఉచ్చిలద పకీర్‌ అహ్మద్‌ బావా(46)కు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేశారు. ఆపరేషన్ టెర్రర్‌లో నాడు మొత్తం 13మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
nation
19,558
25-04-2017 02:25:08
పాకిస్థాన్‌ 322/5
వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌ కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌‌లో పర్యాటక పాకిస్థాన్‌ భారీ ఆధ్యిం దిశగా సాగుతోంది. ఓవ ర్‌ నైట్‌ స్కోరు 201/4తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన పాకిస్థాన్‌.. సోమువారం లంచ్‌ సముయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి. కెపె్‌ మి్బా ఉల్‌ హక్‌ (47 బ్యాటింగ్‌), సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ (53 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. వెసి్టండీస్‌ొలి ఇన్నింగ్స్‌లో 286 రన్స్‌ చేసిది. కాగా, ముూడో రోజు ఆటలో యుూనిస్‌ఖాన్‌ (58) పదివేల పరుగుల మెుౖలురాయిుని చేరుకున్న తొలి పాకిస్థానీ క్రికెటర్‌గా చరిత్ర సృషిచాడు. మొుుత్తంగా10వేల పరుగుల క్లబ్‌లో చోటు దక్కించుకున్న 13వ ఆటగాడు.
sports
12,335
21-11-2017 15:42:29
రాష్ట్రమాతగా పద్మావతి... భారీ స్మారకమందిరానికి ఏర్పాట్లు!
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన ‘పద్మావతి’ చిత్రంపై రగులుకున్న రాజకీయ రగడ ఇప్పట్లో చల్లారేలా లేదు. సందట్లో సడేమియాగా ఈ వివాదం నుంచి లబ్ది పొందేందుకు రాజకీయ పార్టీలు.. ప్రత్యేకించి బీజేపీ ఉవ్విళ్లూరుతున్నట్టు కనిపిస్తోంది. భోపాల్‌లో మహారాణి పద్మావతికి స్మారకమందిరం నిర్మిస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ప్రకటించారు. రాణి పద్మావతిని రాష్ట్రమాతగా పేర్కొన్న ఆయన... రాణి పేరుమీదుగా ఓ అవార్డు కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. మహిళల అభివృద్ధి కోసం కృషిచేసేవారికి ‘‘రాష్ట్రమాత పద్మావతి పురస్కార్’’తో సత్కరిస్తామని ఆయన ప్రకటించారు. రాజ్‌పుత్ వర్గీయుల మనోభావాలను గాయపర్చే సన్నివేశాలను తొలగించకపోతే.. తమ రాష్ట్రంలో పద్మవతి సినిమాను విడుదల కానివ్వబోమని మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. మరుసటిరోజే ఈ అంశంపై ఈ బీజేపీ నేత మరింత దూకుడు ప్రదర్శించడం విశేషం.  ముఖ్యమంత్రికి సూటి ప్రశ్న వేసిన స్టార్ హీరో  భర్త రితేష్‌తో జెనీలియా పెళ్లికి ముందే చేసిందట!
nation