title
stringlengths
1
90
url
stringlengths
31
120
text
stringlengths
0
504k
చేమకూర వెంకటకవి
https://te.wikipedia.org/wiki/చేమకూర_వెంకటకవి
thumb|చేమకూర వేంకటకవి చేమకూర వెంకటకవి నాయకరాజుల్లో ముఖ్యుడు, సాహితీప్రియుడైన రఘునాథనాయకుని కొలువులో కవి. దక్షిణాంధ్ర సాహిత్య యుగంలో చేమకూర వెంకటకవిది ముఖ్యస్థానం. జీవిత విశేషాలు చేమకూర వెంకట కవి కాలం సా.శ.1630 ప్రాంత. తంజావూరు నాయకరాజులలో ప్రసిద్దుడగు రఘునాథరాజు ఆస్థానంలో ఈ సరసకవి ఉండేవాడు. ఈ కవి వృత్తి రిత్యా రఘునాథుని వద్ద, క్షాత్ర ధర్మం నిర్వర్తిస్తూ రాజు సైనికులలోనో, సైనికాధికారులలోనో ఒకరిగా ఉండేవారు. రచనలు చేమకూర వెంకటకవి సారంగధర చరిత్ర, విజయవిలాసం రచించారు. ఆయన రచనల్లో విశిష్టమైన విజయవిలాసాన్ని అర్జునుడి (విజయుని) తీర్థయాత్ర, మానవ, నాగ కన్యలను అయన వివాహం చేసుకోవడం ఇతివృత్తంగా రచించారు. శైలి ప్రబంధయుగాన్ని దాటి దక్షిణాంధ్రయుగంలోకి సాహిత్యం అడుగుపెట్టాకా ఆ శైలిలో అత్యున్నత స్థాయిని అందుకున్న కవి చేమకూర వెంకన్న. ఆశ్చర్యకరమైన, అద్భుతమైన చమత్కారాలతో కళ్లు మిరుమిట్లుగొలిపేలా చేస్తారంటూ ఆయన శైలిని సాహిత్యవేత్త బేతవోలు రామబ్రహ్మం ప్రశంసించారు. ప్రఖ్యాతి చేమకూర వేంకటరాజకవిని, అతడు వ్రాసిన ప్రబంధరాజాలువిజయవిలాసం, సారంగధర చరిత్రలను నోరార ప్రశంసించని కవులుగాని, పండితులుగాని, విమర్శకులుగాని ఈ మూడువందల యాభై సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో ఎవ్వరూ లేరని నిరాఘాటంగ చెప్పవచ్చు. కొందరు చేమకూర పాకాన పండిందన్నారు. ఇంటిపేరు నసగా ఉన్నా కవిత్వం పసగా ఉందన్నారు కొందరు. చక్కెరమళ్ళలో అమృతం పారించి పండించిన చేమకూర అని ఒకరు అన్నారు. ఇంకొకరు కడుంగడుం గడుసువాడు అని మెచ్చారు. "అచ్చ పదములను పొందికగ గూర్చి కవనము చెప్పు నేర్పు ఈ కవికి కుదిరినట్లు మరియొక కవికి బయటి లింకులు మధుర తంజావూరు నాయక రాజుల నాటి ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - మధుర తంజావూరు నాయకరాజుల కాలంలో విలసిల్లిన సాహిత్యాన్ని గురించిన పరిశోధన. వర్గం:తెలుగు కవులు వర్గం:ఆంధ్రప్రదేశ్ చారిత్రిక వ్యక్తులు వర్గం:ఆస్థాన కవులు
రఘునాథ నాయకుడు
https://te.wikipedia.org/wiki/రఘునాథ_నాయకుడు
thumb|రఘునాథ నాయకుడు రఘునాథ నాయకుడు తంజావూరును ఏలిన తంజావూరు నాయక వంశపు మూడవ రాజు. తంజావూరు నాయక వంశపు రాజుల్లో అత్యంత ప్రసిద్ధుడు రఘునాథ నాయకుడు. ఇతడు 1600 నుండి 1634 వరకు పాలించాడు. కృష్ణదేవరాయల అనంతరం అంతటివాడేకాక, అంతకుమించినవాడని ఎన్నదగిన ఆంధ్రభోజుడు.ఇతను రాజేకాకుండా సంస్కృతం, తెలుగు ఉభయభాషలలోనూ కవిత్వం చెప్పగలవాడు. అంతేకాకుండా నూతన రాగాలను, తాళాలను కనిపెట్టి వీణల మేళవింపును సంస్కరించిన సంగీతశాస్త్ర నిపుణుడు. పారిజాతా హరణం అను గ్రంథంను చిరుత ప్రాయంలోనే సంస్కృతంలో రచించాడు. ఇప్పుడు లభిస్తున్న ఇతని గ్రంథాలు వాల్మీకి చరిత్ర, రామాయణం అను పద్య కావ్యాలు, నల చరిత్ర అను ద్విపద కావ్యం, జానకీ కల్యాణం అను చాటు కావ్యం, రుక్మిణీ కల్యాణం అను యక్ష గానం లు.ఇతని పాలనలో తంజావూరు సాహిత్యానికి, కళలకు, కర్ణాటక సంగీతానికి ప్రధాన కేంద్రమైంది. ప్రారంభ జీవితం రఘునాథ నాయకుడు, అచ్యుతప్ప నాయకుని పెద్ద కుమారుడు. తండ్రి ఘోర తపస్సు చేసిన తర్వాత కలిగిన సంతానం. రఘునాథాభ్యుదయం, సాహిత్యనాట్యకారలో ఇతని బాల్య వివరాలు వివరంగా ఇవ్వబడినవి. బాలునిగా ఉన్నప్పుడే రఘునాథునికి శాస్త్రాలు, యుద్ధవిద్యలు, పాలనవ్యవహారాలలో మంచి శిక్షణ పొందాడు. రఘునాథ నాయకునికి అనేకమంది భార్యలు ఉండేవారు.ఇతని భార్యలలో ప్రముఖురాలైన కళావతి, "రఘునాథాభ్యుదయం"లో పట్టపురాణిగా వర్ణించబడింది. తంజావూరు నాయక వంశ చరిత్ర వ్రాసిన రామభద్రమ్మ రఘునాథుని భోగపత్ని తొలిరోజుల్లో రఘునాథ నాయకుడు గోల్కొండ రాజ్యంతో పోరాడి అందరి ప్రశంసలు అందుకొన్నాడు. రఘునాథుడు1600లో రాజ్యపాలన బాధ్యతలను చేపట్టాడు. 1600 నుండి 1614 వరకు తండ్రితో సహపాలకునిగా పాలించాడు. 1614లో తండ్రి మరణం తర్వాత పట్టాభిషిక్తుడై, 1634లో మరణించేవరకు రాజ్యాన్ని పాలించాడు. కళా పోషణ రఘునాథ నాయకుడు సంస్కృతం, ఆంధ్రంలలో తొమ్మిది రచనలు చేసినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం 4 మాత్రమే లభ్యం.. వీనిలో 3 ప్రబంధాలు.అవి 1. వాల్మీకి చరిత్రవాల్మీకిచరిత్రము, 1919 ముద్రణ ఆర్కీవు.కాంలో.: వాల్మీకి గాథ కావ్యంగా రచించబడింది. 2. రఘునాథ రామాయణం: కొంతమాత్రమే లభిస్తోంది. శ్రీ రామచంద్రునికే అంకితమీయబడింది. 3. శృంగార సావిత్రి: ఇది శృంగారప్రబంధం. దీని మరో పేరు ' సావిత్రీ కల్యాణం '. దీనిని 1928లో జి.ఎన్.శాస్త్రి అండ్ కోవారు గంటి సూర్యనారాయణ శాస్త్రి సంపాదకత్వంలో ముద్రించారు.ఆర్కీవు.కాంలో శృంగార సావిత్రి 1928 ముద్రణ పూర్తి పుస్తకం. ఇతని ఆస్థానంలోని కవులలో ప్రముఖులు: చేమకూర వేంకటకవి గోవింద దీక్షితులు యజ్ఞనారాయణ దీక్షితులు కృష్ణాధ్వరి రామభద్రాంబ మధురవాణి బయటి లింకులు మధుర తంజావూరు నాయక రాజుల నాటి ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - మధుర తంజావూరు నాయకరాజుల కాలంలో విలసిల్లిన సాహిత్యాన్ని గురించిన పరిశోధన. మూలాలు వర్గం:సంస్కృత రచయితలు వర్గం:తెలుగు రచయితలు వర్గం:1634 మరణాలు వర్గం:తంజావూరు నాయకరాజులు వర్గం:తెలుగువారిలో చారిత్రిక వ్యక్తులు వర్గం:తమిళనాడు తెలుగువారు
విజయవిలాసం
https://te.wikipedia.org/wiki/విజయవిలాసం
దారిమార్పువిజయ విలాసము వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు
నవంబర్ 9
https://te.wikipedia.org/wiki/నవంబర్_9
నవంబరు 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 313వ రోజు (లీపు సంవత్సరములో 314వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 52 రోజులు మిగిలినవి. సంఘటనలు 1985: భారతదేశపు న్యాయసేవాదినం. పేద, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయసహాయం అందించే చట్టం అమలులోకి వచ్చింది. 1989: 1961 ఆగస్టు 13 తేదీన బెర్లిన్, ఈస్ట్ జర్మనీగా విభజించబడింది. బ్రన్దేన్బుర్గ్ గేట్ మూసివేయబడింది శరణార్థుల వలసలను అడ్డుకోవడానికి, నగరం యొక్క తూర్పు, పశ్చిమ రంగాల మధ్య సరిహద్దును మూసివేసారు. రెండు రోజుల తరువాత, బెర్లిన్ వాల్ గోడ కట్టడం ప్రారంభమైంది. తూర్పు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 1989 నవంబరు 9 వరకు ఈ బెర్లిన్ వాల్ ఒక అడ్డంకిగా నిలిచింది. జననాలు 1877: ముహమ్మద్ ఇక్బాల్. ఉర్దూ, పారశీ భాషలలో కవి. 1895: దువ్వూరి రామిరెడ్డి, ఆధునికాంధ్ర కవుల్లో దవ్వూరి ముందు వరుసలో వుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. (మ.1947) 1917: పిడతల రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు, మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (మ.1991) 1924: కాళీపట్నం రామారావు, సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు, ఉపాధ్యాయులు. 1936: రేకందార్ అనసూయాదేవి, సురభి నటి. 1946: ముకుంద రామారావు, ప్రస్థానం మొదట కథారచయితగా ప్రారంభమైనా కవిగా స్థిరపడ్డాడు. అనువాదకుడిగా రాణించాడు 1948: గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, పేరొందిన సంగీత విద్వాంసులు, కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరొందాడు. 1954: శంకర్ నాగ్, కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు జననం. 1970: క్రిస్ జెరిఖో, కుస్తీయోధుడు, టెలివిజన్, రంగస్థల నటుడు, రచయిత, రేడియో వ్యాఖ్యాత, టెలివిజన్ వ్యాఖ్యాత, రాక్ గాయకుడు. 1978:: రాజా: తెలుగు సినీ నటుడు మరణాలు thumb|Har Gobind Khorana 2009: హరగోవింద్ ఖురానా, నోబెల్‌ బహుమతి గ్రహీత. (జ.1922). 1927: మాగంటి అన్నపూర్ణాదేవి: రచయిత్రి, సమాజ సేవిక, స్వాతంత్ర్య సమర యోధురాలు. (జ 1900) 2005: కె.ఆర్.నారాయణన్, భారత దేశ పూర్వ రాష్ట్రపతి. (జ.1920) పండుగలు , జాతీయ దినాలు లీగల్ సర్వీసెస్ దినం. ప్రపంచ నాణ్యతా దినోత్సవం. ఉత్తరాఖండ్ ఫౌండేషన్ డే బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబరు 9 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబరు 8 - నవంబరు 10 - అక్టోబర్ 9 - డిసెంబర్ 9 -- అన్ని తేదీలు వర్గం:నవంబరు వర్గం:తేదీలు
నవంబర్ 8
https://te.wikipedia.org/wiki/నవంబర్_8
నవంబర్ 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 312వ రోజు (లీపు సంవత్సరములో 313వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 53 రోజులు మిగిలినవి. సంఘటనలు 1947: జూనాగఢ్ సంస్థానం భారత్‌లో విలీనమయ్యింది. 1948: మహత్మా గాంధీని హత్య చేసినట్లుగా నాథూరాం గాడ్సే అంగీకరించాడు, కాని కుట్ర చేసినట్లుగా ఒప్పుకోలేదు. 2016: రు.500, రు.1000 నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది. జననాలు thumb|Edmund Halley 1656: ఎడ్మండ్ హేలీ, తోకచుక్కను కనుగొన్న హేలీ ఇంగ్లండులో హేగర్‌స్టన్‌లో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. (మ.1742) 1884: హెర్మన్ రోషాక్, స్విడ్జర్లాండ్‌కు చెందిన మానసిక శాస్త్రవేత్త (మ.1922). 1893: ద్వారం వెంకటస్వామి నాయుడు, వాయులీన విద్వాంసుడు (మ.1964). 1896: పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి (మ.1972). 1908: రాజారావు, ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత (మ.2006). 1917: చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త, సంఘ సేవకురాలు, చిత్రకారిణి (మ.2008). 1918: బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త (మ.2007). 1927: లాల్ కృష్ణ అద్వానీ, భారతీయ జనతా పార్టీ నాయకుడు. 1936: ఎస్.గంగప్ప, తెలుగు రచయిత. 1968: చంద్రమహేష్ , తెలుగు చలన చిత్ర దర్శకుడు,రచయిత . 1969: ఎనుముల రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు, తరువాత కాంగ్రెస్ లో చేరాడు. 1986 : ఆరోన్ స్వార్ట్జ్, ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, అంతర్జాల కార్యకర్త. 1991: అక్షా పార్థసాని , తెలుగు, తమిళ, మళయాళ చిత్ర నటి,మోడల్ మరణాలు 1971: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు (జ.1892). 1977: బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు (జ.1908). 2012: జస్టిస్ సర్దార్ అలీ ఖాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1930) 2013: ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయనాయకుడు (జ.1957). పండుగలు , జాతీయ దినాలు వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే. అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబర్ 8 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబర్ 7 - నవంబర్ 9 - అక్టోబర్ 8 - డిసెంబర్ 8 -- అన్ని తేదీలు వర్గం:నవంబర్ వర్గం:తేదీలు
నవంబర్ 7
https://te.wikipedia.org/wiki/నవంబర్_7
నవంబర్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 311వ రోజు (లీపు సంవత్సరములో 312వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 54 రోజులు మిగిలినవి. సంఘటనలు 1917: రష్యా విప్లవం (బోల్షెవిక్ విప్లవం లేదా అక్టోబర్ విప్లవం) విజయవంతమైంది. అప్పట్లో రష్యా ఉపయోగించుతున్న జూలియన్ కాలెండర్ ప్రకారం ఆ నెల అక్టోబర్. అందువలన దీనిని అక్టోబర్ విప్లవం అని అన్నారు. 1950: నేపాల్ రాజుగా జ్ఞానేంద్ర పదవిలోకి వచ్చాడు. జననాలు thumb|బిపిన్ చంద్ర పాల్ 1728: జేమ్స్ కుక్, ఆంగ్ల-నావికుడు, సముద్ర యానికుడు, సాహస యాత్రికుడు. (మ.1779) 1858: బిపిన్ చంద్ర పాల్, భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు. (మ.1932) 1867: మేరీక్యూరీ, భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత. (మ.1934) 1888: చంద్రశేఖర్ వెంకటరామన్, భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత. (మ.1970) 1900: పాటూరి రాజగోపాల నాయుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. రైతు నాయకుడు. సాహితీవేత్త. 1900: ఎన్.జి.రంగా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. (మ.1995) 1912: చితిర తిరునాల్ బలరామ వర్మ, ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు. (మ.1991) 1920: బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. (మ.2005) 1928: ఎం.ఎల్.నరసింహారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త. (మ.2016) 1932: గిడుగు రాజేశ్వరరావు, తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (మ.2013) 1934: బొమ్మన విశ్వనాథం, భారతీయ సాహిత్యాన్ని వంగభాషలోనికి అనువదించిన తెలుగువ్యక్తి. 1937: కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని. (మ.2016) 1947: ఉషా ఉతూప్ , భారతీయ పాప్ గాయని , సినీనటి . 1954: కమల్ హాసన్, చలనచిత్ర నటుడు. 1957: వై.విజయ, తెలుగు సినిమా నటి, నృత్య కళాకారిణి. 1960: రూప: తెలుగు చలనచిత్ర నటి. 1960: సప్పా దుర్గాప్రసాద్, నృత్యకళాకారుడు. 1970: డిస్కో శాంతి, తెలుగు శృంగార నృత్యతార. 1971: రీతూపర్ణ సేన్ గుప్త, బెంగాలి సినిమాలో నటి. 1971: త్రివిక్రమ్ శ్రీనివాస్ , తెలుగు సినీ మాటల రచయిత, కథా రచయిత, దర్శకుడు. 1973: వేణు దోనేపూడి, భారతీయ ఆటోమొబైల్ పారిశ్రామికవేత్త, మల్టీబ్రాండ్ కార్ సేవల కంపెనీ కార్జ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌. 1979: రైమా సేన్ , చలన చిత్ర నటి . 1980: కార్తీక్, తెలుగు, తమిళ చిత్రసీమలో గాయకుడు. 1981: అనుష్క శెట్టి, భారతీయ సినీ నటి. మరణాలు 1975: జియాఉర్ రెహ్మాన్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు. 1992: మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో కవి. (జ.1920) 2000: సి.సుబ్రమణ్యం, భారతీయుడు, భారతరత్న గ్రహీత. (జ.1910) 2014: ద్వివేదుల విశాలాక్షి, కథా, నవలా రచయిత్రి. (జ.1929) పండుగలు , జాతీయ దినాలు ఎన్.టి.పీ.సి. స్థాపన దినోత్సవం. బాలల సంరక్షణ దినం. ప్రపంచ వేసక్టమీ దినోత్సవం . జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు: నవంబర్ 7 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. చరిత్రలోని రోజులు నవంబర్ 6 - నవంబర్ 8 - అక్టోబర్ 7 - డిసెంబర్ 7 -- అన్ని తేదీలు వర్గం:నవంబర్ వర్గం:తేదీలు
నవంబర్ 6
https://te.wikipedia.org/wiki/నవంబర్_6
నవంబరు 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 310వ రోజు (లీపు సంవత్సరములో 311వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 55 రోజులు మిగిలినవి. సంఘటనలు జననాలు thumb|ముంతాజ్ అలి 1948: ముంతాజ్ అలి, ఆధ్యాత్మిక వేత్త. 1953: :పాపినేని శివశంకర్, ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకడు. 1962: అంబికా: దక్షిణ భారత చలన చిత్ర నటి. మరణాలు 1951: హీరాలాల్ జెకిసుందాస్ కనియా, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి (జ. 1890) 1985: సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు. (జ.1938) 2018: కపిలవాయి లింగమూర్తి, పాలమూరు జిల్లాకు చెందిన కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు (జ. 1928). పండుగలు, జాతీయ దినాలు అంతర్జాతీయ పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబరు 6 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబరు 5 - నవంబరు 7 - అక్టోబర్ 6 - డిసెంబర్ 6 -- అన్ని తేదీలు వర్గం:నవంబరు వర్గం:తేదీలు
నవంబర్ 5
https://te.wikipedia.org/wiki/నవంబర్_5
నవంబర్ 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 309వ రోజు (లీపు సంవత్సరములో 310వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 56 రోజులు మిగిలినవి. సంఘటనలు 1556: రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బరు సైన్యం హేమును ఓడించిన రోజు. అప్పటికి అక్బరుకు పదమూడేళ్లు. సైన్యాధ్యక్షుడు బైరాంఖాన్‌ ఆధ్వర్యంలో మొఘలులకు ఈ విజయం సొంతమైంది. 1605: బ్రిటిష్‌ పార్లమెంటు భవనాన్ని పేల్చివేసేందుకు రోమన్‌ క్యాథలిక్కులు పన్నిన కుట్ర విఫలమైన రోజు. దీన్నే 'గన్‌పౌడర్‌ ప్లాట్‌' అంటారు. 'గై ఫాకెస్‌' అనే వ్యక్తి పేలుడు సామగ్రితో పార్లమెంటు లోపలికి వెళ్తుండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. నాటి నుంచి ఏటా నవంబర్ 5న ఇంగ్లండ్‌లో బాణాసంచా కాల్చి 'గై ఫాకెస్‌ డే'గా జరుపుకుంటారు. 1895: జార్జ్‌ సెల్డెన్‌ రూపొందించిన గ్యాసోలిన్‌తో నడిచే ఇంజిన్‌కు పేటెంటు హక్కులు లభించాయి. అమెరికన్‌ ఆటోవెుబైల్‌ రంగానికి సంబంధించినంత వరకూ ఇదే మొదటి పేటెంటు. 1920: భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది. 1951: పశ్చిమ, మధ్య రైల్వేలు ముంబయిలో ఏర్పాటయ్యాయి. 1967: ఏటీఎస్‌-3 కృత్రిమ ఉపగ్రహాన్ని అమెరికా ప్రయోగించింది. రోదసి నుంచి పూర్తిస్థాయిలో భూమి ఛాయాచిత్రాలను తీసిన మొదటి ఉపగ్రహం అది. 1976: ఎమర్జెన్సీ కాలం. లోక్‌సభ పదవీకాలం ముగిసినా, మరో సంవత్సరం పాటు ఈ కాలాన్ని తనకు తానే పొడిగించుకుంది. 1977: భారత విదేశ వ్యవహారాల శాఖా మంత్రి, అటల్ బిహారీ వాజపేయి, ఐక్యరాజ్యసమితిలో హిందీ లో ప్రసంగించాడు. 1976: భారత లోక్‌సభ స్పీకర్‌గా భలీరామ్ భగత్ పదవిని స్వీకరించాడు. 1989: అంతర్జాతీయ ఒకరోజు క్రికెట్ పోటీల్లో బ్యాట్స్‌మన్‌గా సచిన్ టెండూల్కర్ అరంగేట్రం. జననాలు thumb|జె.బి.ఎస్.హాల్డేన్ 1877: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (మ.1950) 1892: జె.బి.ఎస్‌. హాల్డేన్‌, బ్రిటిష్ జన్యు శాస్త్రవేత్త. (మ.1964) 1925: ఆలూరి బైరాగి, తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మానవతావాది. (మ.1978) 1952: వందన శివ, ఒక తత్త్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ, స్త్రీవాద రచయిత్రి. 1995:మోహ్రీన్ పిర్జాదా , హిందీ, తెలుగు,చిత్రాల నటి,మోడల్. మరణాలు 1972: సుభద్రా శ్రీనివాసన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (జ.1925) 1987: దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (జ.1925) 1993: నల్లా నరసింహులు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, సిపిఐ నాయకుడు. (జ. 1926) 1995: ఇల్జక్ రాబిన్, ఇజ్రాయిల్ మాజీ ప్రధానమంత్రి. 2019: కర్నాటి లక్ష్మీనరసయ్య నటుడు, ప్రయోక్త, దర్శకుడు, జానపద కళాకారుడు. (జ.1927) పండుగలు, జాతీయ దినాలు- . ప్రపంచ సునామీ దినోత్సవం - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబర్ 5 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబర్ 4 - నవంబర్ 6 - అక్టోబర్ 5 - డిసెంబర్ 5 -- అన్ని తేదీలు వర్గం:నవంబర్ వర్గం:తేదీలు
నవంబర్ 4
https://te.wikipedia.org/wiki/నవంబర్_4
నవంబర్ 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 308వ రోజు (లీపు సంవత్సరములో 309వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 57 రోజులు మిగిలినవి. సంఘటనలు thumb|సుశీల్ కుమార్ షిండే 1869: నేచర్ (పత్రిక) అనేది ఒక బ్రిటీష్ వైజ్ఞానిక పత్రిక. ఇది 1869 నవంబర్ 4న మొదటిసారి ప్రచురించబడింది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన బహుళ శాస్త్రీయ విభాగాల పత్రికగా ఇది పరిగణించబడుతుంది. 2004: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సుశీల్‌ కుమార్‌ షిండే నియమితుడయ్యాడు. 1947: భారతదేశపు మొట్టమొదటి పరమ వీరచక్ర పురస్కారాన్ని మేజర్ సోమనాథ్ శర్మకు మరణానంతరం ప్రదానం చేసారు. ఆయన కాశ్మీరు పోరాటంలో మరణించాడు. 1979: ఇరాన్ బందీల కల్లోలం మొదలైంది. ఇరాన్‌లోని అతివాదులు అమెరికా రాయబార కార్యాలయం మీద దాడి చేసి, 63 మంది అమెరికనులతో సహా 90 మందిని బందీలుగా పట్టుకున్నారు. జననాలు 1845: వాసుదేవ బల్వంత ఫడ్కే, బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1883) 1889: జమ్నాలాల్ బజాజ్, వ్యాపారవేత్త, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1942) 1922: ఆలపాటి రవీంద్రనాధ్, జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (మ.1996) 1925: రిత్విక్ ఘటక్, ఒక బెంగాలీ భారతీయ చిత్రనిర్మాత, స్క్రిప్టు రచయిత (మ.1976). 1929: శకుంతలా దేవి, గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్ 203) (మ.2013). 1932: వి.బి.రాజేంద్రప్రసాద్, జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. (మ.2015) 1944: పద్మావతి బందోపాధ్యాయ, భారత వైమానిక దళంలో మొదటి మహిళా ఎయిర్ మార్షల్. ఆమె భారత సాయుధ దళాలలో మూడు నక్షత్రాల ర్యాంకుకు పదోన్నతి పొందిన రెండవ మహిళ. 1964: జొన్నలగడ్డ శ్రీనివాస రావు , తెలుగుచలనచిత్ర దర్శకుడు , నిర్మాత . 1971: టాబు , భారతీయ సినీ నటీ . మరణాలు 1980: కె.సభా, కథా రచయిత, నవలాకారుడు, కవి, గేయకర్త, బాలసాహిత్య నిర్మాత, సంపాదకుడు, జానపద గేయ సంకలనకర్త, ప్రచురణకర్త. (జ.1923) 2000: నాగేంద్ర,(రాజన్ నాగేంద్ర సంగీత ద్వయం) సంగీత దర్శకులు (జ.1935) 2007: అర్జా జనార్ధనరావు, తెలుగు నాటక, సినిమా నటుడు. (జ.1926) పండుగలు , జాతీయ దినాలు 1956 : యమవిదియ బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబర్ 4 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబర్ 3 - నవంబర్ 5 - అక్టోబర్ 4 - డిసెంబర్ 4 -- అన్ని తేదీలు వర్గం:నవంబర్ వర్గం:తేదీలు
నవంబర్ 3
https://te.wikipedia.org/wiki/నవంబర్_3
నవంబర్ 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 307వ రోజు (లీపు సంవత్సరములో 308వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 58 రోజులు మిగిలినవి. సంఘటనలు 1956: పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా నియామకం. 1966: తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్లో 1000 మంది మరణించారు. 1984: ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 3000 మంది మరణించారు. జననాలు thumb|జైపూరు రాజు మహారాజా జైసింగ్, బ్రిటిష్ మ్యూజియంలోని చిత్రం 1688: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (మ.1743) 1874: మారేపల్లి రామచంద్ర శాస్త్రి, సాహితీవేత్త, సంఘ సంస్కర్త, నాటక రంగ ప్రముఖుడు. (మ.1951) 1878: బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (మ.1952) 1890: హీరాలాల్ జెకిసుందాస్ కనియా, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి (మ. 1951) 1904: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత. (మ.1986) 1906: పృథ్వీరాజ్ కపూర్, హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1972) 1925: ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (మ.2011) 1933: అమర్త్యా సేన్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1935: ఇ.వి.సరోజ, 1950, 60 వ దశకాలకు చెందిన తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి. (మ.2006) 1936: రాయ్ ఎమర్సన్, ఆస్ట్రేలియాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. 1937: జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. (మ.2004) 1937: లక్ష్మీకాంత్ ,(లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత ద్యయం లో ఒకరు) సంగీత దర్శకుడు 1940: పెండ్యాల వరవర రావు, విప్లవ రచయిత. 1949: అన్నా వింటర్, ఒక బ్రిటిష్-అమెరికన్  పాత్రికేయుడు, సంపాదకుడు. 1955: కాత్యాయని విద్మహే, అభ్యుదయ రచయిత్రి. 1956 : కోట రాజశేఖర్, ధార్మికోపన్యాసకులు. సంస్కృతభాషా ప్రచారకులు. 1963: పైడి తెరేష్ బాబు, కవి. (మ.2014) 1968: మణిబాల. ఎస్, రంగస్థల నటి. మరణాలు 1998: పి.ఎల్. నారాయణ, విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త. (జ.1935) 2022: కంచర్ల లక్ష్మారెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు. 2022: జి.ఎస్. వరదాచారి, సినీ విమర్శకుడు, పాత్రికేయుడు (జ. 1932) పండుగలు , జాతీయ దినాలు జాతీయ గృహిణుల దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబర్ 3 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబర్ 2 - నవంబర్ 4 - అక్టోబర్ 3 - డిసెంబర్ 3 -- అన్ని తేదీలు వర్గం:నవంబర్ వర్గం:తేదీలు
నవంబర్ 2
https://te.wikipedia.org/wiki/నవంబర్_2
నవంబర్ 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 306వ రోజు (లీపు సంవత్సరములో 307వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 59 రోజులు మిగిలినవి. సంఘటనలు 1774: రాబర్టు క్లైవు ఇంగ్లండులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున భారత్‌లో పనిచేసిన క్లైవు, కంపెనీ భారత్‌లో సాగించిన ఆక్రమణలలో ముఖ్య భూమిక నిర్వహించాడు. 1757లో జరిగిన, ప్రసిద్ధి చెందిన ప్లాసీ యుద్ధంలో బ్రిటీషు సేనాధిపతి ఈయనే. అప్పుల బాధ తట్టుకోలేక అత్మహత్యకు పాల్పడ్డాడు. 1976: భారత రాజ్యాంగం యొక్క 42 వ సవరణను లోక్‌సభ ఆమోదించింది. అప్పటివరకు సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత్, ఈ సవరణ తరువాత సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమయింది. జననాలు 1865: పానుగంటి లక్ష్మీ నరసింహారావు, తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించినవాడు (మ.1940). 1920: పట్రాయని సంగీతరావు, ఆంధ్ర దేశానికి చెందిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు. 1925: అబ్బూరి కమలాదేవి , రంగస్థల నటి, హరిశ్చంద్ర,శ్రీకృష్ణ , దుర్యోధన, పాత్రలకు పెట్టింది పేరు, సినిమాలలో నటించింది. 1956: రాజ్యం. కె, రంగస్థల నటి (మ.2018). 1965: షారుఖ్ ఖాన్, బాలీవుడ్ న‌టుడు. 1969: మధుశ్రీ , తెలుగు, తమిళ,కన్నడ, బెంగాలీ, చిత్రాల నేపథ్యగాయని . 1995: నివేదా థామస్,మోడల్, మలయాళ, తమిళ,తెలుగు నటి మరణాలు thumb|కింజారపు ఎర్రన్నాయుడు 1958: సామి వెంకటాచలం శెట్టి, వ్యాపారవేత్త, కాంగ్రేసు పార్టీ రాజకీయ నాయకుడు, మద్రాసు కార్పోరేషన్ యొక్క ప్రథమ కాంగ్రేసు అధ్యక్షుడు (జ.1887). 1962: త్రిపురనేని గోపీచంద్, సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1910) 2010: ఎ .హెచ్.వి. సుబ్బారావు, పాత్రికేయుడు. (జ.1934) 2012: కింజరాపు ఎర్రన్నాయుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (జ.1957) 2015: కొండవలస లక్ష్మణరావు, తెలుగు నాటక, చలన చిత్ర నటుడు. (జ.1946) 2022: చల్లా భగీరథరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనమండలి సభ్యుడు. (జ.1976) పండుగలు , జాతీయ దినాలు ఇండియన్ అరైవల్ డే. (మారిషస్) జాతీయ వత్తిడి అవగాహన దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబర్ 2 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబర్ 1 - నవంబర్ 3 - అక్టోబర్ 2 - డిసెంబర్ 2 -- అన్ని తేదీలు వర్గం:నవంబర్ వర్గం:తేదీలు
సరస్వతీ నది
https://te.wikipedia.org/wiki/సరస్వతీ_నది
thumb|250px|right|భారతదేశం లోని హర్యానా గుండా ప్రవహించే ఘగ్గర్ నది. ఘగ్గర్-హకరా వ్యవస్థను ఆధునిక (శ్వేతజాతి) శాస్త్రవేత్తలు వేద కాలం నాటి సరస్వతి నదిగా గుర్తిస్తున్నారు thumb|310x310px|సరస్వతీనది ఈ మార్గంలో ప్రవహించి ఉండవచ్చునని ఊహిస్తున్నారు 1 = ప్రాచీన నది 2 = నేటి నది 3 = నేటి థార్ ఎడారి 4 = పురాతన తీరం 5 = నేటి పట్టణం సరస్వతీ నది హిందూ పురాణములలో చెప్పబడిన ఓ పురాతనమైన నది. ఋగ్వేదము లోని నదీస్తుతిలో చెప్పబడిన సరస్వతీ నదికి, తూర్పున యమునా నది పశ్చిమాన శతద్రూ (సట్లేజ్) నది ఉన్నాయి. ఆ తరువాత మహాభారతములో ఈ నది ఎండిపోయినట్లు చెప్పబడింది. సింధు లోయ నాగరికత కాలంనాటి అవశేషాలు ఎక్కువగా సింధు నదికి తూర్పున, ఘగ్గర్-హాక్రా నది ప్రాంతములలో లభించినాయి. ప్రస్తుతము సరస్వతి అనే పేరుమీద ఓ చిన్న నది ఉంది. ఇది ఘగ్గర్ నదికి ఉపనది. బహుశా పురాతన సరస్వతీ నదికి ఓ శాఖ అయి ఉండవచ్చు. సరస్వతీ దేవి మొదట్లో ఈ నదీదేవతా మూర్తిగానే ప్రారంభమైంది, అయితే తర్వాతి కాలంలో విశిష్టమైన దేవతా స్వరూపంగా గుర్తింపు పొందింది. హిందువులు సరస్వతీ నదిని అంతర్వాహినిగానూ, గంగా-యమునల సంగమంలో త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తోందనీ భావిస్తారు. స్వర్గం వద్ద ఉండే క్షీరవాహిని, వైదిక సరస్వతీ నది ఒకటేనని, మరణానంతరం అమరత్వానికి ఇది మార్గంగా భావించేవారనీ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత ఆచార్యుడు, హార్వర్డ్ ఓరియంటల్ సీరీస్‌కి సంపాదకుడు అయిన మైఖేల్ విజెల్ భావించాడు. ఋగ్వేదంలోనూ, తర్వాతి వేదాల్లోనూ ప్రస్తుత కాలంనాటి నదులు, ప్రాచీన నదులను స్తుతించడం కనిపిస్తుంది. ఋగ్వేదంలోని నదీస్తుతి మంత్ర భాగం సరస్వతీ నదిని తూర్పున యమున, పశ్చిమాన సట్లెజ్ (శతధృ) నడుమ ఉన్నట్టు వర్ణించింది. తర్వాతి వేద పాఠ్యాలైన తాంద్య, జైమినీయ బ్రాహ్మణాలు, మహాభారతం సరస్వతీ నది ఎడారిలో ఇంకిపోయినట్టు ప్రస్తావించాయి. 19వ శతాబ్ది తుదికాలం నుంచి పరిశోధకులు వైదిక సరస్వతీ నది ఇప్పటి వాయువ్య భారతదేశంలోనూ, తూర్పు పాకిస్తాన్‌లోనూ ప్రవహిస్తున్న ఘగ్గర్-హక్రా నదీ వ్యవస్థలోనిదని భావించసాగారు. శాటిలైట్ తీసిన చిత్రాలు సరస్వతీ నదీ గమనాన్ని మరింత స్పష్టంగా చూపించాయి, ఆ నది ఇప్పటి ఘగ్గర్ నదీ గమనాన్ని అనుసరించేది.Vedic River Sarasvati and Hindu Civilization, edited by S. Kalyanaraman (2008), PP.308 సింధులోయ నాగరికత విలసిల్లిన రాజస్థాన్‌లోని కాలిబంగన్, హర్యానాలోని బనవాలీ, రాఖీఘరి, గుజరాత్‌లోని ధోలవిరా, లోథాల్ ఈ నదీపరీవాహక ప్రాంతంలోనే ఉన్నట్టుగా పరిశోధకులు గుర్తించారు.Mythical Saraswati River | "The work on delineation of entire course of Sarasvati River in North West India was carried out using Indian Remote Sensing Satellite data along with digital elevation model. Satellite images are multi-spectral, multi-temporal and have advantages of synoptic view, which are useful to detect palaeochannels. The palaeochannels are validated using historical maps, archaeological sites, hydro-geological and drilling data. It was observed that major Harappan sites of Kalibangan (Rajasthan), Banawali and Rakhigarhi (Haryana), Dholavira and Lothal (Gujarat) lie along the River Saraswati." — Department of Space, Government of India."Saraswati – The ancient river lost in the desert" | A.V.Shankaran. ఐతే, ఘగ్గర్-హక్రా ఋగ్వేదంలో ప్రత్యేకించి ప్రస్తావింపబడివుండడం, అదీ వేదకాలానికి ఎండిపోయిన నదిగా దాని ప్రస్తావన రావడంతో వైదిక సరస్వతీ నదిని ఘగ్గర్-హక్రా నదీ వ్యవస్థలో గుర్తించడం సమస్యాత్మకమైనది. అన్నెట్ విల్కె మాటల్లో - వైదిక ప్రజలు వాయువ్య భారతదేశంలోకి వలసవస్తున్న కాలానికి ఘగ్గర్-హక్రా, ఎడారిలో చిన్న ప్రవాహం అయిపోయింది. ఇటీవలి భూభౌతికశాస్త్ర పరిశోధనలు ఘగ్గర్-హక్రా నదీ వ్యవస్థ, వర్షాకాలంలో వర్షపునీటితో నిండే నదుల వ్యవస్థ అనీ, వాతావరణ మార్పుల వల్ల నదులు ఇంకిపోతూండడంతో సింధులోయ నాగరికత దెబ్బతినిపోయివుండవచ్చనీ సూచిస్తున్నాయి. 4వేల ఏళ్ళ క్రితం ఆ నాగరికత అంతమవుతూన్నప్పుడే ఈ నదులకు నీటినిచ్చే వర్షరుతువు దెబ్బతినడం మొదలైంది. దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లోని హెల్మండ్ లేదా హరాక్షవతి నది అయివుండవచ్చని కూడా భావిస్తున్నారు. వైదిక జాతి తర్వాత పంజాబ్‌కు చేరినప్పుడు హరాక్షనదికి వాడిన సంస్కృత పదాన్నే ఘగ్గర్-హక్రా నదికి కూడా వాడారని అంచనావేస్తున్నారు. ఋగ్వేదపు సరస్వతీ నది అన్నది రెండు వేర్వేరు నదులను సూచిస్తోందనీ, ఒక గ్రంథం హెల్మండ్ నదినీ, మరీ ఇటీవల నాటి 10వ మండలం ఘగ్గర్-హక్రానీ సూచిస్తూండవచ్చన్నారు. కొందరు ఋగ్వేదాన్ని మరింత ప్రాచీనమైనదిగా చెప్తూ, సింధునదీ నాగరికతను "సరస్వతీ సంస్కృతి", "సరస్వతీ నాగరికత", "సింధు-సరస్వతీ నాగరికత", "ఇండస్-సరస్వతీ నాగరికత"గా పేర్లు మారుస్తూండడంతో, 21వ శతాబ్దిలో ఘగ్గర్-హక్రా నదీ వ్యవస్థతో గుర్తించడం కొత్త ప్రాధాన్యత సంతరించుకుంది సింధు-సరస్వతీ నాగరికతగా ఈ నాగరికతకు పేరు మారుస్తున్న పరిశోధకులు, సింధు లోయ నాగరికత, వైదిక సంస్కృతీ ఒకటేనంటూ ఆర్య దండయాత్ర సిద్ధాంతం లేదా ఆర్యుల వలస సిద్ధాంతాన్ని తిరస్కరిస్తున్నారు.. ప్రాముఖ్యత హిందూత్వంలో సరస్వతీ నదికి పూజార్హత, ప్రాముఖ్యత ఉంది. వైదిక సంస్కృతం, ఋగ్వేదం తొలిభాగం, పలు ఉపనిషత్తులు వంటి ముఖ్యమైన వైదిక సాహిత్యం వంటివాటికి జన్మస్థానమైన బ్రహ్మావర్తం అనే వైదిక ప్రాంతం సరస్వతీ నది, దాని ఉపనది దృషద్వతిల ఒడ్డున ఉండేదని చెప్తారు.Manu (2004). Olivelle, Patrick, ed. The Law Code of Manu. Oxford University Press. p. 24. ISBN 978-0-19280-271-2. మనుస్మృతిలో, స్వచ్ఛమైన వైదిక సంస్కృతికి బ్రహ్మావర్తం కేంద్రం అని పేర్కొనివుంది. ద రైజ్ ఆఫ్ సివిలైజేషన్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అన్న గ్రంథంలో బ్రిడ్జెట్, రేమండ్ అల్చిన్ - "ఋగ్వేద కాలం నాడు భారత, పాకిస్తాన్‌లలో మొట్టమొదటి ఆర్యభూమి పంజాబ్‌లో సరస్వతీ, దృషద్వతీ నదుల లోయల్లో ఉండేదన్న" భావన వెల్లడించారు.Bridget Allchin, Raymond Allchin, The Rise of Civilization in India and Pakistan, Cambridge University Press, 1982, P.358. 2015లో వేదనది భౌతిక ఉనికి ఋజువయ్యాకా, ముస్లిం, క్రైస్తవ దండయాత్రలకు ముందు హిందూ భారతదేశం స్వర్ణయుగం అనుభవించిందన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వారి భావనను బలపరుస్తోందంటూ రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం పురావస్తు శాస్త్రవేత్తలను పురాతన సరస్వతీ నది ఆనవాళ్లను అన్వేషించమని ఆదేశించింది. Special Report - Battling for India's soul, state by state. Reuters. Accessed 13 October 2015. ఋగ్వేదం ఋగ్వేదపు నాలుగవ భాగంలో తప్ప మిగతా అన్ని భాగాల్లోనూ సరస్వతీ నదీ ప్రస్తావన, ప్రశంస కనిపిస్తాయి. సరస్వతీ నదికి సంబంధించిన అతి ముఖ్యమైన శ్లోకాలు ఋగ్వేదం 6.61, ఋగ్వేదం 7.95, ఋగ్వేదం 7.96 లలో ఉన్నాయి. ఋగ్వేదము లో సరస్వతీ నది ప్రముఖముగా చెప్పబడింది. మొత్తం అరవై పర్యాయాలు (ఉదాహరణకు: 2.41.16; 6.61.8-13; 1.3.12.) ఈ సరస్వతీ నది ప్రస్తావనకు వస్తుంది. ఈ నది ఏడు పుణ్య నదులలో ఒకటి. భాషా పరంగా సరస్వతి అనగా అనేక పాయలతో ప్రవహించు నది అని అర్థము. ప్రస్తుతము చాలామంది పండితులు, గఘ్ఘర్-హక్రా నదే సరస్వతీ నదిగానో, లేదా కనీసం ఓ పాయగానో ఒప్పుకుంటారు, కానీ ఈ పేరు ఆఫ్ఘనిస్తాను నుండి పంజాబుకు వెళ్ళినదా లేదా పంజాబునుండి ఆఫ్ఘనిస్తానుకు వెళ్ళినదా అనే విషయముపై భిన్నాభిప్రాయాలున్నాయి. अम्बितमे नदीतमे देवितमे सरस्वती अपरास्तस्य इव स्मासि प्रशस्तिम् अम्ब नास्कृतिम् అంబితమే నదీతమే దేవితమే సరస్వతీ అపరాస్తస్య ఇవ స్మాసి ప్రశస్తిం అంబ నాస్కృతిమ్ ఋగ్వేదములో సరస్వతీ నదిని అన్నింటికంటే ఉత్తమమైన నదిగా కీర్తించారు. దీనిని ఏడవ నదిగా, వరదలకు తల్లిగా, గొప్ప తల్లిగా, ఉత్తమ దేవతగా, ఉత్తమ నదిగా కీర్తించారు. (ఋగ్వేదము 2.41.16-18;, 6.61.13; 7.95.2) (ఋగ్వేదము: 7.36.6. సరస్వతి సప్తః సింధుం", 2.41.16 లో ఆంబితమే నదీతమే దేవితమే సరస్వతీ" ॥ దీనిని బట్టి సరస్వతీనది ప్రాముఖ్యత అర్థము అవుతుంది. ఋగ్వేదము 7.95.1-2 లో సరస్వతీ నదిని సముద్రమువైపు ప్రయాణము చేసే నదిగా కీర్తించారు. దేవతగా సరస్వతి thumb|రాజా రవి వర్మ చేత దేవత సరస్వతి యొక్క పెయింటింగ్ ఋగ్వేద శ్లోకాలలో సరస్వతి పేరు యాభై సార్లు ప్రస్తావించబడింది. ఈ పేరు ఋగ్వేదపు చివరి భాగాల్లోని పదమూడు శ్లోకాలలో (1, 10) ప్రస్తావించబడింది. 1.3, 13, 89, 164; 10.17, 30, 64, 65, 66, 75, 110, 131, 141 ఈ ప్రస్తావనల్లో రెండింటి విషయంలో మాత్రమే సరస్వతిని నదిగా సూచిస్తూన్నాయి. హిందువులు సరస్వతిని ఒక దేవతగా సరస్వతీ నదికి నేరుగా సంబంధం లేకుండానే ప్రార్థిస్తారు. దివ్య జలాలను రక్షించే నదీ దేవత అని సరస్వతి ఆవిర్భావం గురించి ఋగ్వేదంలోని ఒక శ్లోకంలో ప్రస్తావన ఉంది. ఋగ్వేదంలోని 10.135.5 శ్లోకంలో ఇంద్రుడు సోమరసం తాగాడని చెప్తూ, అతనికి సరస్వతి అలసట పోగొట్టి, తిరిగి శక్తి ప్రసాదించిందని ఉంది. 10.17 మంత్రాల్లో సరస్వతిని పూర్వుల దేవతే కాక ప్రస్తుత తరానికి కూడా దేవత అని ప్రస్తావించారు. 1.13, 1.89, 10.85, 10.66, 10.141ల్లో ఆమెను నదుల సరసన కాక, ఇతర దేవీదేవతల సరసన చేర్చారు. 10.65 మంత్రభాగంలో ఆమెను పవిత్ర భావనలు () దాతృత్వం () వంటి గుణాల కోసం ఆవాహన చేశారు. వైదిక గ్రంథాల్లో మొదట సరస్వతిని నదీ దేవతగా భావించినా, పురాణాల నాటి హిందూ మతంలో ఆమెను నదీ దేవతగా అత్యంత అరుదుగా సంభావించారు. అందుకు బదులుగా ఆమె జ్ఞానాన్ని, విద్యనీ, మేధస్సును, సంగీతాన్ని, కళలను ప్రసాదించే దేవత అయింది. నదీ దేవతగా ప్రారంభమైన సరస్వతి జ్ఞానానికి అధిదేవతగా మారడం బ్రాహ్మణాల తో ప్రారంభమైంది. ఈ బ్రాహ్మణాలు ఆమెను వాక్కుకు అధిదేవతగా వాగ్దేవిగా పేర్కొన్నాయి, నదీ తీరంలోని వైదిక జాతి అభివృద్ధికి వాక్కు ప్రధానమైన కారణం కావడంతో నదీదేవతను వాక్కుకు అధిదేవత చేశారని కూడా భావిస్తున్నారు. ఐతే ఇద్దరు స్వతంత్రమైన దేవతలు ఒకే పేరుతో ప్రారంభమై తర్వాతి వేదాల నాటికి ఒకే దేవతగా రూపాంతరం చెందివుండనూ ఉండొచ్చు. మరోవైపు అరబిందో "వేదాల సంకేతాత్మకత సరస్వతీ దేవి రూపం గురించిన స్పష్టత విషయంలో తనను తానే మోసగించుకుంటుంది.. ఆమె నిర్మలంగా, స్పష్టంగా ప్రపంచపు దేవత, దివ్యత్వం స్ఫూర్తితో వచ్చిన దేవత..." అని ప్రతిపాదిస్తాడు.K.R. Jayaswal, Hindu Polity, pp. 12-13 వేద గ్రంథాలు తదుపరి మహాభారతం మహాభారతం ప్రకారం, సరస్వతి నది ఎడారిలో వినాశన లేదా ఆదర్శన అనే ప్రదేశంలో ఎండిపోయింది. Mhb. 3.82.111; 3.130.3; 6.7.47; 6.37.1-4., 9.34.81; 9.37.1-2 ఎడారిలో అదృశ్యమైన తరువాత, కొన్ని ప్రదేశాల్లో తిరిగి కనిపిస్తుంది. Mbh. 3.80.118 చివరికి సముద్రంలో "అనిశ్చితంగా" చేరుతుంది. Mbh. 3.88.2 సరస్వతీ నది ఎండిపోయిన ప్రదేశం థార్ ఎడారి. ఈ ప్రదేశాన్ని కురుప్రదేశ్ లేక కురు రాజ్యం అంటారు, సరస్వతీ నదికి దక్షిణాన, దృషద్వతికి ఉత్తరాన నెలకొనివుండేది. రాజస్థాన్, హర్యానాల్లోని ఎండిపోయిన వర్షాధారిత నది ఘగ్గర్ మహాభారతంలో అభివర్ణించిన భౌగోళిక స్థితిగతుల్లోనే ఉంది. మహాభారతంలో ద్వారక నుంచి మథుర వరకు బలరాముడు సరస్వతీ నది ఒడ్డునే తీర్థయాత్రికునిగా ప్రయాణించినట్టు ఉంది. ప్రస్తుత రాజస్థాన్ ప్రాంతంలోని మహాజనపదాల్లో (ప్రాచీన సామ్రాజ్యాలు) కొన్నిటిని సరస్వతీ నది పేరుమీదుగా వ్యవహరించారు.Studies in Proto-Indo-Mediterranean culture, Volume 2, page 398 పురాణాలు పలు పురాణాలు సరస్వతి నదిని వర్ణించాయి, ఈ నది సరస్సులు (సారాస్) గా విభజింపబడిందనీ స్పష్టంగా నమోదు చేశారు. D.S. Chauhan in Radhakrishna, B.P. and Merh, S.S. (editors): Vedic Saraswati, 1999, p.35-44 స్కంద పురాణం ప్రకారం సరస్వతి బ్రహ్మ నీటి కుండ నుండి ఉద్భవించి, హిమాలయాలపైనున్న పిప్పల వృక్షం మీద నుంచి ప్రవహిస్తుంది. ఇది కేదారం వద్ద పశ్చిమదిశకు తిరిగి, అంతర్వాహినిగా భూగర్భంలో ప్రవహిస్తుంది. ఇందులోనే సరస్వతీ నది ఐదు శాఖలను పేర్కొన్నారు. compare also with Yajurveda 34.11, D.S. Chauhan in Radhakrishna, B.P. and Merh, S.S. (editors): Vedic Saraswati, 1999, p.35-44 ఈ పాఠ్యం సరస్వతిని బ్రహ్మ భార్య బ్రాహ్మిగా చిత్రీకరించింది. వామన పురాణం ప్రకారం (32.1-4), సరస్వతి నది పిప్పల వృక్షం నుంచి పెరిగింది. స్మృతులు మను స్మృతి ప్రకారం, వరదల నుండి తప్పించుకున్న సాధువు మనువు సరస్వతి, దృషద్వతి నదుల మధ్య వేద సంస్కృతిని స్థాపించాడు. ఈ సరస్వతి నది బ్రహ్మవర్తానికి పశ్చిమ సరిహద్దుగా ఉందనీ, "సరస్వతి, దృషద్వతి మధ్య ఉన్న భూమి దేవుని సృష్టి అయిన బ్రహ్మావర్తం." అనీ మనుస్మృతిలో పేర్కొన్నారు. మనుస్మృతి 2.17-18 వశిష్టుని ధర్మ సూత్రాల్లోని I.8-9, 12-13 శ్లోకాలు ఆర్యావర్తాన్ని సరస్వతీ నది ఎడారిలో అదృశ్యమైన ప్రాంతానికి తూర్పున, కలకవానాకు పశ్చిమాన, పరియాత్రా, వింధ్య పర్వతాలకు ఉత్తరాన, హిమాలయాల దక్షిణాన ఉన్నట్టు ప్రస్తావిస్తున్నాయి. పతంజలి మహాభాష్యం కూడా ఆర్యావర్తాన్ని వశిష్టుని ధర్మ సూత్రాల్లానే వర్ణించింది. బౌద్ధయానా ధర్మసూత్రాలు ఆర్యావర్తం అంటే కలకవానాకు పశ్చిమాన, సరస్వతీ నది అదృశ్యమైన ఎడారి అయిన ఆదర్శనకి తూర్పున, హిమాలయాలకు దక్షిణాన, వింధ్యకు ఉత్తరాన ఉన్న భూమి అని ప్రకటించారు. గుర్తింపు సిద్ధాంతాలు thumb|right|250px|వేదకాలం నదులు భౌతిక నదులతో వైదిక, పౌరాణిక నది అయిన సరస్వతిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరిగాయి. వేద సరస్వతి నది సింధు నదికి తూర్పున ప్రవహించేదని అనేకమంది భావిస్తున్నారు. Eck p. 145 శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, పరిశోధకులు సరస్వతి నదిని ప్రస్తుతమున్న లేదా గతంలో ప్రవహించిన నదులలో గుర్తించారు. సరస్వతిని గుర్తించే ప్రయత్నంలో రెండు సిద్ధాంతాలు ప్రాచుర్యం పొందాయి. అనేకమంది పరిశోధకులు ఈ రోజున ఘగ్గర్-హక్రా నది సరస్వతీ నది అయినా అయివుండాలి లేదా అది సరస్వతీ నది ఎండిపోయిన ప్రాంతంలోనిది అయినా అయివుండాలని భావిస్తున్నారు . ఇది వాయువ్య భారతదేశంలోనూ, పాకిస్తాన్‌లోనూ ప్రవహిస్తోంది. ప్రసిద్ధి పొందిన సిద్ధాంతాల్లో రెండోదాని ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌లోని హెల్మాండ్ నది సరస్వతీ నది అయివుండొచ్చు, లేదా ప్రస్తుతపు హెల్మండ్ లోయలో ప్రాచీన కాలంలో సరస్వతీ నది ప్రవహించి ఇంకిపోయివుండవచ్చు. Darian p. 59 ఇతరులు సరస్వతీ నదిని ఒక కల్పిత నదిగా భావిస్తున్నారు. ఘగ్గర్-హక్రా నదీ వ్యవస్థగా సరస్వతీ నదిని గుర్తించడానికి 21వ శతాబ్దిలో కొత్త ప్రాముఖ్యత లభిచింది.Encyclopedia Britannica, Sarasvati ఇంతవరకూ ఋగ్వేద కాలం క్రీ.పూ.1500గా గుర్తిస్తూండగా, ఋగ్వేద కూర్పు అంతకన్నా ప్రాచీన కాలంలో జరిగిందని ప్రతిపాదిస్తూ, సింధులోయ నాగరికతను "సరస్వతీ సంస్కృతి", "సరస్వతీ నాగరికత", "సింధు-సరస్వతీ నాగరికత" వంటి పేర్లు పెట్టి, దేశీయ ఆర్యులు అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం సింధులోయ నాగరికత, వైదిక సంస్కృతీ వేర్వేరు కావు, రెండూ ఒకే నాగరికతకు చెందినవి. ఈ సిద్ధాంతం ఆర్యదండయాత్ర సిద్ధాంతాన్ని, ఆర్యుల వలస ప్రతిపాదననూ తిరస్కరిస్తోంది. నది ఉనికికి బలమైన ఆధారం ఇస్రో అందించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా సరస్వతీ నది హిమాలయాల్లో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి కచ్ సింధుశాఖ (రాన్ ఆఫ్ కఛ్) వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. మొత్తం పొడవు సుమారు 1,600 కిలోమీటర్లు. ఈ మార్గంలో చాలా ప్రాంతాలలో ఓ.ఎన్.జి.సి. భూగర్భ జలాల నిల్వలను కనుగొంది. రాజస్థాన్ లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతంలో 13 చోట్ల బోరుబావులు తవ్వగా 35-40 మీటర్ల లోతున నీటి నిల్వలు లభించాయి. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ నీరు 4 వేల సంవత్సరాల నాటిదని గుర్తించారు. ఈ ఆధారాలతో సరస్వతీ నది పరీవాహక ప్రాంతం హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలుగా పరిశోధకులు భావిస్తున్నారు. సమకాలీన రాజకీయ-మతపరమైన అర్థం ఎండిపోవడం, వేదాల కాలనిర్ణయం సరస్వతీ నది ఎండిపోవడం గురించి వైదిక, పౌరాణిక సాహిత్యంలోని వివరాలు హరప్పా నాగరికతకు, వైదిక సంస్కృతికి కాలనిర్ణయం చేసేందుకు ఒక ఆధారంగా ఉపయోగిస్తున్నారు.The Editors of Encyclopædia Britannica, Sarasvati, Encyclopædia Britannica క్రీ.పూ.1500లో ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారని చెప్పే ఆర్యుల వలస లేక ఆర్యదండయాత్ర సిద్ధాంతాన్ని ఈ పాఠ్యం తిరస్కరిస్తూ ఋగ్వేదం మరింత ప్రాచీన కాలం నాటిదని నిరూపించే ఆధారంగా ఈ పాఠ్యాలను కొందరు గ్రహించారు. చరిత్రకారుడు, ఆచార్యుడు మైఖేల్ డానినో సంప్రదాయికంగా చరిత్రకారులు ఋగ్వేదం కూర్చిన కాలంగా భావిస్తున్న క్రీ.పూ.15వ శతాబ్దికి మూడు వేల ఏళ్ళ క్రితం అసలు ఋగ్వేదం కూర్చిన కాలమని భావిస్తున్నారు. ఋగ్వేదాల్లోని ప్రస్తావనలు వాస్తవమైన వివరాలని అంగీకరిస్తూనే సరస్వతీ నది క్రీ.పూ.3వ సహస్రాబ్ది తుదికాలంలో ఇంకిపోయిందని భావించడం ఒకదానికొకటి పొంతన లేనివని డానినో ఎత్తిచూపారు. డానినో ప్రకారం, ఉత్తర భారతదేశంలో క్రీ.పూ.3వ సహస్రాబ్దిలో వైదిక ప్రజలు జీవించారన్నది కొందరు భారతీయ పురాతత్వశాస్త్రవేత్తల నిర్ధారణే తప్ప పాశ్చాత్య శాస్త్రవేత్తల దీన్ని నిర్ధారించడం లేదు. క్రీ.పూ.2వ సహస్రాబ్ది కాలంలో ఏ ఆగంతుక, చొరబాటుదారుల సంస్కృతి భారతదేశపు వాయువ్యప్రాంతంలో లేదనీ అస్థి అవశేషాల్లో జీవజాలపరంగా అవిచ్ఛిన్నత,, సాంస్కృతిక అవిచ్ఛిన్నతలకు సరస్వతీ నది ఇచ్చే సాక్ష్యాన్ని చేర్చి చూస్తే ఇది స్పష్టమవుతుందని డానినో పేర్కొన్నాడు. ఇది భాషాశాస్త్రం, పురాఖగోళశాస్త్రం, మానవ విజ్ఞానశాస్త్రం, జన్యుశాస్త్రం సహా మరికొన్ని శాఖోపశాఖల్లోకి అధ్యయనాన్ని కోరుతుందని డానినో గుర్తించాడు. జర్మనీకి చెందిన హిందూ మత పరిశోధకురాలు అనెట్ విల్కే - చారిత్రక నది సరస్వతి స్థలపరంగా గుర్తించదగ్గ పౌరాణిక నది అనీ, హిందూ పురాణాలు కూర్చేనాటికే ఇది ఎడారిలో ఇంకిపోయి చిన్నగా అయిపోయిందనీ పేర్కొంది. వేదాల తర్వాత నాటి ఈ పాఠ్యాలు తరచుగా నది ఎండిపోవడం గురించి ప్రస్తావిస్తూనే, సరస్వతీ దేవిని నదితో కాక భాషతో అనుసంధానిస్తూంటాయి. మైఖేల్ విజెల్ కూడా ఋగ్వేదంలో సరస్వతి అప్పటికే దాని ప్రధాన నీటి వనరును కోల్పోయి, చేరుకోవాల్సిన తుది సరస్సు (సముద్రం) లో ముగిసిపోతుందని ప్రస్తావించాయని పేర్కొన్నాడు. పునరుద్ధరణ 1986 నుండి సరస్వతి పునరుద్ధరణకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి మొదలుపెట్టాయి. హర్యానాలోని సరస్వతి నది శోధ్ సంస్థాన్ చేపట్టిన కార్యక్రమాలు అక్కడి ప్రభుత్వాన్ని ఉత్తేజపరిచాయి. 2002 లో ఎన్.డి.ఎ. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 40 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతు, 50 కిలోమీటర్లు పొడవున్న సరస్వతి మహానది రూపనహర్ కాలువను తవ్వించారు. మూలాలు నోట్స్ ఆధారాలు Gupta, S.P. (ed.). 1995. The lost Saraswati and the Indus Civilization. Kusumanjali Prakashan, Jodhpur. Hock, Hans (1999) Through a Glass Darkly: Modern "Racial" Interpretations vs. Textual and General Prehistoric Evidence on Arya and Dasa/Dasyu in Vedic Indo-Aryan Society." in Aryan and Non-Aryan in South Asia, ed. Bronkhorst & Deshpande, Ann Arbor. Keith and Macdonell. 1912. Vedic Index of Names and Subjects. Kochhar, Rajesh, 'On the identity and chronology of the ic river ' in Archaeology and Language III; Artefacts, languages and texts, Routledge (1999), ISBN 0-415-10054-2. Lal, B.B. 2002. The Saraswati Flows on: the Continuity of Indian Culture. New Delhi: Aryan Books International Oldham, R.D. 1893. The Sarsawati and the Lost River of the Indian Desert. Journal of the Royal Asiatic Society. 1893. 49-76. Puri, VKM, and Verma, BC, Glaciological and Geological Source of Vedic Sarasvati in the Himalayas, New Delhi, Itihas Darpan, Vol. IV, No.2, 1998 Radhakrishna, B.P. and Merh, S.S. (editors) : Vedic Saraswati: Evolutionary History of a Lost River of Northwestern India (1999) Geological Society of India (Memoir 42), Bangalore. Review (on page 3) Review S. G. Talageri, The RigVeda - A Historical Analysis chapter 4 మరింత సమాచారం Frawley David: The Rig Veda and the History of India, 2001. (Aditya Prakashan), ISBN 81-7742-039-9 Gupta, S.P. (ed.). 1995. The lost Sarasvati and the Indus Civilization. Kusumanjali Prakashan, Jodhpur. Keith and Macdonell. 1912. Vedic Index of Names and Subjects. Oldham, R.D. 1893. The Sarsawati and the Lost River of the Indian Desert. Journal of the Royal Asiatic Society. 1893. 49-76. బయటి లింకులు Saraswati – the ancient river lost in the desert by A. V. Sankaran Articles on the Saraswati, Sarasvati-Sindhu civilization and Sarasvati River Recent Research on the Sarasvati River How old is the Rig Veda? The Saraswati: Where lies the mystery by Saswati Paik The rediscovery of the Sarasvati River The Sarasvati in the Rig Veda by D. Frawley More Vedic discoveries Is River Ghaggar, Saraswati? by Tripathi,Bock,Rajamani, Eir Sarasvati research and Education Trust Map వర్గం:భారతదేశ నదులు వర్గం:సరస్వతి నది వర్గం:హర్యానా నదులు వర్గం:పవిత్రమైన నదులు వర్గం:ఋగ్వేద నదులు వర్గం:ప్రాచీన భారతీయ నదులు వర్గం:పౌరాణిక నదులు వర్గం:సింధు లోయ నాగరికత వర్గం:ఈ వారం వ్యాసాలు
తపతి
https://te.wikipedia.org/wiki/తపతి
దారిమార్పుతపతీ నది
మహానది
https://te.wikipedia.org/wiki/మహానది
మహానది తూర్పు భారతదేశంలోని ఒక పెద్దనది. భారత ద్వీపకల్పములో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. మహానది మధ్యభారతదేశములో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రములో అమర్‌ఖంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతములో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్‌ఘడ్, ఒడిషా మొత్తము, జార్ఖండ్, మహారాష్ట్రలోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు. మహానది పరీవాహక ప్రాంతం 141.600 చ.కి.మీ. దీని ఉపనదుల్లో ఇబ్, మాండ్, హస్‌డో, జోంగ్, శివోనాథ్, టేల్ నదులు ప్రధానమైనవి. మహానదిపై సంబల్‌పూర్కు 15 కి.మీ. దూరంలో ప్రపంచంలోనే అతి పొడవైన హీరాకుడ్ ఆనకట్టను నిర్మించారు.Mahanadi River (river, India) – Encyclopædia Britannica ఈ ఆనకట్ట ద్వారా 1,55,635 హెక్టేర్లకు సాగునీరు అందడమే కాక, 307.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతూంది. మూలాలు వర్గం:భారతదేశ నదులు వర్గం:ఛత్తీస్‌గఢ్ నదులు వర్గం:ఒడిశా నదులు
పపెన్నా నది
https://te.wikipedia.org/wiki/పపెన్నా_నది
దారిమార్పు పెన్నా నది
ససరస్వతీ నది
https://te.wikipedia.org/wiki/ససరస్వతీ_నది
దారిమార్పు సరస్వతీ నది
జూలై 25
https://te.wikipedia.org/wiki/జూలై_25
జూలై 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 206వ రోజు (లీపు సంవత్సరములో 207వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 159 రోజులు మిగిలినవి. సంఘటనలు thumb|Apj abdul kalam 1804: హైదరాబాదులో మీర్ ఆలం టాంక్ నిర్మాణం ప్రారంభమయ్యింది 1977: భారత రాష్ట్రపతిగా బి.డి.జట్టి పదవీ విరమణ. 1977: భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు. 1978: లండన్ లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మించింది 1981: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము స్థాపించబడింది. 1982: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవిని స్వీకరించాడు. 1987: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవీ విరమణ 1987: భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకటరామన్ పదవిని అధిష్టించాడు. 1992: భారత రాష్ట్రపతిగా శంకర దయాళ్ శర్మ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. 1997: భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్ పదవిని స్వీకరించాడు. 2002: భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. 2007: భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని స్వీకరించింది. 2009 : దేశంలో ఆర్థిక విలువ గణనీయంగా పెరిగింది . జననాలు 1901: కలుగోడు అశ్వత్థరావు, స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (మ.1972) 1935: కైకాల సత్యనారాయణ, తెలుగు సినీ నటుడు. 1952: లోకనాథం నందికేశ్వరరావు, నాలుగు దశాబ్దాలుగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనలలో తనదైన గుర్తింపును స్వంతం చేసుకున్నారు 1955: చెల్లమెల్ల సుగుణ కుమారి, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 12వ లోక్‌సభ తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా పోటీచేసి, గెలిచి భారత పార్లమెంటులో ప్రవేశించింది 1978: లూయీస్ బ్రౌన్, తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ . 1984: నారా రోహిత్, సినీ నటుడు, నిర్మాత మరణాలు 1909: అమ్మెంబాల్‌ సుబ్బారావు పాయ్, భారత్‌లోని ప్రఖ్యాత బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల‌ స్థాపకుడు. (జ.1852) 2009: జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (జ.1928). 2015: చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (జ.1932). 2019: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తెలుగు కవి, రచయిత, ఆకాశవాణి కళాకారుడు. (జ.1944) 1971: గుఱ్ఱం జాషువా తెలుగు కవి, రచయిత (జ.1895) పండుగలు, జాతీయ దినాలు నేషనల్ క్లే డే. ప్రపంచ ముంపు నివారణ దినోత్సవం . బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : జూలై 25 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు జూలై 24 - జూలై 26 - జూన్ 25 - ఆగష్టు 25 -- అన్ని తేదీలు వర్గం:జూలై వర్గం:తేదీలు
జూలై 26
https://te.wikipedia.org/wiki/జూలై_26
జూలై 26, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 207వ రోజు (లీపు సంవత్సరములో 208వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 158 రోజులు మిగిలినవి. సంఘటనలు 1956: గమాల్ అబ్దుల్ నాసర్, ఈజిప్ట్ అధ్యక్షుడు సూయజ్ కాలువను జాతీయం చేసాడు. 1997: వి.ఎస్. రమాదేవి హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా నియామకం. జననాలు 1915: ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు. 1927: గులాబ్‌రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. (మ.2003) 1935: కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీమంత్రి. (మ.2010) 1981: అభిరామి, టీ.వి.వ్యాఖ్యాత, దక్షిణ భారత సినీ నటి. మరణాలు thumb|కుడి|గోరా 1930: అన్నా సారా కుగ్లర్, భారతదేశంలో 47 సంవత్సరాలపాటు వైద్యసేవలను అందించిన మొట్టమొదటి అమెరికన్ వైద్య మిషనరీ. (జ.1856) 1975: గోపరాజు రామచంద్రరావు, సంఘసంస్కర్త, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. (జ.1902) 2011: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు. ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు. కవి. నాటకకర్త. (జ.1929) 2012: కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (జ.1924) 2020: గార్లపాటి రఘుపతిరెడ్డి, తెలంగాణా విముక్తి పోరాటయోధుడు. 2021: జయంతి, దక్షిణ భారత సినిమా నటి. (జ. 1945) పండుగలు , జాతీయ దినాలు కార్గిల్ విజయ దినోత్సవం అడవుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : జూలై 26 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు జూలై 25 - జూలై 27 - జూన్ 26 - ఆగష్టు 26 -- అన్ని తేదీలు వర్గం:జూలై వర్గం:తేదీలు
జూలై 27
https://te.wikipedia.org/wiki/జూలై_27
జూలై 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 208వ రోజు (లీపు సంవత్సరములో 209వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 157 రోజులు మిగిలినవి. సంఘటనలు 1929: జెనీవా కన్వెన్‌షన్ యుద్ధ ఖైదీలకు సంబంధించిన విధివిధానాలను 53 దేశాలు కలిసి రూపొందించాయి. 1957: అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏర్పాటైంది. జననాలు 1911: సంగం లక్ష్మీబాయి, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్ సభ సభ్యురాలు. (మ.1979) 1917: దుక్కిపాటి మధుసూదనరావు , అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ లో విజయవంతం చిత్రాల నిర్మాత(మ.2006) 1935: వెలుదండ రామేశ్వరరావు, ఆయుర్వేద, హోమియోపతి వైద్య విధానాలలో ఈయనది అందే వేసిన చెయ్యి. ఈయన చాలా రచనలు చేశారు. వాటిలో కొన్ని ముద్రితం, కొన్ని అముద్రితం 1948: ఎం. వి. ఎస్. హరనాథ రావు, నాటక రచయిత, సినీ మాటల రచయిత, నటుడు. (మ.2017) 1953: కత్తి పద్మారావు, రచయుత, సంఘ సంస్కర్త 1954: రాజ్, తెలుగు సినిమా సంగీత దర్శకుడు (మ. 2023) 1955: అలాన్ బోర్డర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్. 1960: సాయి కుమార్, తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు. 1963: కె. ఎస్. చిత్ర, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల సిని నేపథ్య గాయని. 1965: రజనీ , తెలుగు, సినీనటి, 1979: వంశీ పైడిపల్లి , తెలుగు చలన చిత్ర దర్శకుడు 1990: కృతి సనన్ , మోడల్, తెలుగు, హిందీ, నటి. మరణాలు thumb|Apj abdul kalam 1936: అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి, పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. (జ.1878) 1970: పి.ఏ.థాను పిళ్లై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1885). 1992: అంజాద్ ఖాన్, భారతీయ నటుడు,దర్శకుడు (జ.1940) 2003: ఆవుల సాంబశివరావు, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (జ.1917) 2015: ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అంతరిక్ష శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి (జ.1931). పండుగలు , జాతీయ దినాలు జాతీయ రిఫ్రెష్ మెంట్ దినోత్సవం (జూలై 4 వ గురువారం ) - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : జూలై 27 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు జూలై 26 - జూలై 28 - జూన్ 27 - ఆగష్టు 27 -- అన్ని తేదీలు వర్గం:జూలై వర్గం:తేదీలు
జూలై 28
https://te.wikipedia.org/wiki/జూలై_28
జూలై 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 209వ రోజు (లీపు సంవత్సరములో 210వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 156 రోజులు మిగిలినవి. సంఘటనలు 1979: భారతదేశ 6వ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశాడు. 2007: ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్రప్రదేశ్వ్యాప్త బందులో ఖమ్మం జిల్లా ముదిగొండలో పోలీసు కాల్పులు జరిగి ఏడుగురు మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. జననాలు 1909: కాసు బ్రహ్మానందరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1994) 1956: దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల నటుడు, అధ్యాపకుడు. 1962: కృష్ణవంశీ, తెలుగు సినిమా దర్శకుడు. 1972: ఆయేషా జుల్కా , హిందీ, ఒరియా, తెలుగు, కన్నడ ,నటి . 1983: ధనుష్ , తమిళ, తెలుగు, నటుడు, రచయిత, నేపథ్య గాయకుడు.తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు మరణాలు thumb|జైపాల్ రెడ్డి 1972: చారు మజుందార్, నక్సల్బరీ ఉద్యమ నేత. (జ.1918) 1976: తరిమెల నాగిరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు. (జ.1917) 1976: శ్రీనివాస చక్రవర్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకుడు, నాటక విద్యాలయ ప్రధానాచార్యుడు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు. (జ.1911) 2004: ఫ్రాన్సిస్ క్రిక్, డీ.ఎన్.ఏ స్వరూపాన్ని కనుగొన్న సహశాస్త్రవేత్త. (జ.1916). 2009: లీలా నాయుడు, నటీమణి, ప్రపంచ సుందరి. (జ.1940) 2016: మహా శ్వేతాదేవి, నవలా రచయిత, సామాజిక కార్యకర్త. (జ.1926) 2019: సూదిని జైపాల్ రెడ్డి రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1942 2020: రావి కొండలరావు, సినీ నటుడు,రచయిత , నిర్మాత,దర్శకుడు (జ.1932) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ కాలేయ వ్యాధి(హెపటైటిస్) దినోత్సవం ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రశంస దినం . (జూలై చివరి శుక్రవారం .) బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : జూలై 28 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు జూలై 27 - జూలై 29 - జూన్ 28 - ఆగష్టు 28 -- అన్ని తేదీలు వర్గం:జూలై వర్గం:తేదీలు వర్గం:1979 వర్గం:2007 వర్గం:1909 జననాలు వర్గం:1972 మరణాలు వర్గం:2004 మరణాలు
జూలై 29
https://te.wikipedia.org/wiki/జూలై_29
జూలై 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 210వ రోజు (లీపు సంవత్సరములో 211వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 155 రోజులు మిగిలినవి. సంఘటనలు 1957: అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏర్పాటైంది. 1976: వరంగల్లులో కాకతీయ విశ్వవిద్యాలయమును నెలకొల్పారు. 2015: ముబై పేలుళ్ల కేసులో 257 మంది మృతికి కారకుడైన యాకుబ్ మెమన్ను నాగపూరు జైలులో ఉరి తీశారు. జననాలు thumb|150px|ముస్సోలిని 1883: ముస్సోలినీ, ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.1945) 1904: జె.ఆర్‌.డి.టాటా, పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు (మ.1993) 1931: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గేయరచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (మ.2017) 1975: కృష్ణుడు (నటుడు), తెలుగు సినీ నటుడు. 1975: లంక డిసిల్వా, శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. 1980: రాశి, బాలనటిగా చిత్రరంగ ప్రవేశం, తెలుగు,తమిళ నటి 1984: డాక్టర్ శ్రీజ సాధినేని, తెలుగు చలనచిత్ర, టెలివిజన్, థియేటర్ నటి, యాక్టింగ్  ప్రొఫెసర్, రచయిత్రి, దర్శకురాలు, డబ్బింగ్ ఆర్టిస్ట్. పిన్న వయసులోనే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కి గాను విశ్వకర్మ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ డిగ్రీ పొందారు. థియేటర్ ఆర్ట్స్ లో శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గోల్డ్ మెడల్ సాధించారు. 2003లో శ్రీజయ ఆర్ట్స్ సంస్థను స్థాపించి కళలపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తున్నారు. 2012 నుంచి శ్రీ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 1984: సోనియా దీప్తి, తెలుగు, తమిళ, చలనచిత్ర నటి. మరణాలు thumb|150px|బిడారం కృష్ణప్ప 1890: విన్సెంట్ వాన్ గోహ్, డచ్ చిత్రకారుడు. (జ.1853) 1891: ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌, బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు. (జ.1820) 1931: బిడారం కృష్ణప్ప, తాళబ్రహ్మ, గాన విశారద. (జ.1866) 1996: అరుణా అసఫ్ ఆలీ, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. (జ.1909) 2012: వెంపటి చినసత్యం, కూచిపూడి నాట్యాచార్యుడు (జ.1929) 2019: కె.బి.లక్ష్మి తెలుగు రచయిత్రి, పాత్రికేయురాలు. (జ.1953) 2019: ముఖేష్ గౌడ్, హైదరాబాదుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు. మాజీమంత్రి (జ.1959) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ పులుల దినోత్సవం (2010) ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ డే. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : జూలై 29 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు జూలై 28 - జూలై 30 - జూన్ 29 - ఆగష్టు 29 -- అన్ని తేదీలు వర్గం:జూలై వర్గం:తేదీలు
జూలై 30
https://te.wikipedia.org/wiki/జూలై_30
జూలై 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 211వ రోజు (లీపు సంవత్సరములో 212వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 154 రోజులు మిగిలినవి. సంఘటనలు thumb|Baghdad-Carriage 1930 762: బాగ్దాద్ నగరం స్థాపించబడింది. 1991: చారిత్రక స్టార్ట్ ఒప్పందంపై అమెరికా, రష్యా అధ్యక్షులు జార్జి బుష్, మిఖాయీల్ గోర్భచెవ్‌లు సంతకాలు చేశారు. 2013: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఆమోదం తెలిపింది. జననాలు 1854: వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (మ.1938) 1896: పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (మ.1996) 1922: రావిశాస్త్రి, న్యాయవాది, రచయిత. (మ.1993) 1931: పులికంటి కృష్ణారెడ్డి, కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (మ.2007) 1939: గోపరాజు సమరం, వైద్యనిపుణుడు, సంఘ సేవకుడు, రచయిత. 1945: దేవదాస్ కనకాల, నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. (మ.2019) 1963: మందాకిని, బాలీవుడ్ నటి. 1973: సోనూ సూద్ , తెలుగు,తమిళ, హిందీ, ప్రతి నాయకుడు , పరోపకారి. 1973: సోనూ నిగమ్ , భారతీయ నటుడు, గాయకుడు , వ్యాఖ్యాత . మరణాలు 2007: ఇంగ్మార్ బెర్గ్మాన్, స్వీడిష్ దర్శకుడు. (జ.1918) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ వ్యక్తుల అక్రమ రవాణా దినోత్సవం. అంతర్జాతీయ స్నేహా దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : జూలై 30 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు జూలై 29 - జూలై 31 - జూన్ 30 - ఆగష్టు 30 -- అన్ని తేదీలు వర్గం:జూలై వర్గం:తేదీలు
జూలై 31
https://te.wikipedia.org/wiki/జూలై_31
జూలై 31, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 212వ రోజు (లీపు సంవత్సరములో 213వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 153 రోజులు మిగిలినవి. సంఘటనలు 1498: కొలంబస్ ట్రినిడాడ్ దీవికి చేరుకున్నాడు. 1777: మార్క్విస్ డే లాఫయెట్టె అమెరికన్ కాంటినెంటల్ సైన్యానికి మేజర్ జనరల్ అయ్యాడు. 1790: మొట్టమొదటి అమెరికన్ పేటెంటును వెర్మాంట్ లోని సామ్యూల్ హాప్కిన్స్ కి ఎరువులు తయారుచేయటానికి ఇచ్చారు. 1948: కలకత్తా రాష్ట్ర రవాణా వ్యవస్థ ఏర్పాటు - దేశంలో మొదటి రవాణా వ్యవస్థ /కార్పోరేషన్. 1954: ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది. 1964: అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది. 2007: పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది. జననాలు thumb|Portrait of Milton Friedman 1880: ప్రేమ్‌చంద్, భారతదేశపు హిందీ,, ఉర్దూ కవి. (మ.1936) 1912: మిల్టన్ ఫ్రీడ్‌మన్, అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2006). 1939: నండూరి పార్థసారథి, రాంబాబు డైరీ, సాహిత్యహింసావలోకనం గ్రంథాల రచయిత, పాత్రికేయులు. 1941: అమర్‌సింహ్ చౌదరి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (మ.2004). 1951: శరత్ బాబు, తెలుగు సినిమా నటుడు (మ. 2023) 1965: జె.కె. రౌలింగ్, ఇంగ్లీషు రచయిత. 1992: కైరా అద్వానీ , భారతీయ సినీ నటీ. మరణాలు 1805: ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. (జ. 1756) 1875: ఆండ్రూ జాన్సన్, 17వ అమెరిక అధ్యక్షుడు. (జ.1808) 1980: మహమ్మద్ రఫీ, హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు. (జ.1924) 1902: పట్నం సుబ్రమణ్య అయ్యరు, శాస్త్రీయ సంగీతజ్ఞుడు (జ.1845) 2004: అల్లు రామలింగయ్య, హాస్య నటుడు (జ.1922) 2014: ముక్కురాజు, డాన్స్ మాస్టార్, ఫైటర్, నటుడు (జ.1931) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ రేంజర్ దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : జూలై 31 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు జూలై 30 - ఆగష్టు 1 - జూన్ 30 - ఆగష్టు 31 -- అన్ని తేదీలు వర్గం:జూలై వర్గం:తేదీలు
గోరు చిక్కుడు
https://te.wikipedia.org/wiki/గోరు_చిక్కుడు
తమిళము : కొత్తవరై. కన్నడము : గోవర్థన. హిందీ : గవార్‌, గోరాణి; సంస్కృతము : గోవర్థన, దృఢబీజ ఉర్దూ : మటకి గోరుచిక్కుడు భారతదేశమున చాలా చోట్ల సాగు చేయబడు దేశీ కూరగాయ. భౌతిక వివరములు ఇది చిక్కుడు జాతికి చెందినది. సుమారు రెండు మీటర్ల ఎత్తువరకు పెరుగును. కొన్ని అనుకూల పరిస్థితుల యందు ఇది మూడు మీటర్ల ఎత్తువరకు పెరుగును. గోరుచిక్కుడు సామాన్యముగా విత్తిన ఆరు ఏడు వారముల లోపున పూయనారంభించును. సాగు చేయు పద్దతి దీనిని అన్ని నేలలయందూ, అన్ని కాలములందూ సాగు చేయవచ్చు. దీనిని ఒంటిగా కానీ, అంతర పంటగా కానీ, మిశ్రమ పంటగా కానీ సాగు చేయవచ్చు. బాగుగా దున్ని సాగు చేయవలెను. దీనికి ఎరువు అంతగా అవసరములేదు, ఎందుకంటే ఇది సూక్ష్మ జీవుల సహాయముతో నేలలోని నత్రజని స్వీకరించును. ఇది నీటిపారు దలతో గాని వర్షాధార పంటగా గాని పండించ వచ్చును. దీనికి చీడ పీడల సమస్య చాల తక్కువ. అందు చేత గోరుచిక్కుడు సాగు చాల సులభము. పూర్తిగా గోరు చిక్కుడును సాగు చేయడము ఇంత వరకు చాల తక్కువ. సామాన్యంగా ఇతర పంటలలో అంతర పంటగానె సాగు చేస్తుంటారు. ఇంతకాలము గోరు చిక్కుడు కేవలం ఒక సామాన్య కూరగాయ లాగానె పండించే వారు. ఇప్పుడిప్పుడే గోరుచిక్కుడు పారిశ్రామికంగా ఉపయోగంలోని వచ్చింది. దాంతో గోరు చిక్కుడుకు ప్రపంచ వ్వాప్తంగా మంచి గిరాకి ఏర్పడినది. ప్రత్తి, పొగాకు మొదలగు వాణిజ్య పంటలతో నష్టాల ఊబిలో చిక్కుకుంటున్న రైతులు పర్వవసానంగా గోరు చిక్కుడును వాణిజ్య పంటగా పండించ నారంబిస్తున్నారు. thumb|left|గోరుచిక్కుడు కాయలు/ పాకాల సంతలో తీసిన చిత్రము వంటకములు thumb|right|గోరు చిక్కుడు బంగాళాదుంప కూర. సామాన్యముగా గోరు చిక్కుడు కాయలను పులుసు, బెల్లముపెట్టి వండెదరు. ఇంకా కొబ్బరి చేర్చి ఇగురు లేదా వేపుడు చేయుదురు. ఇది మంచి బలవర్థకమైన ఆహారము. గోరు చిక్కుడు కాయలను సాంబారులోను, ఇతర కూరలలోను వాడుతారు. దీనితో పచ్చడి కూడా చెయ్య వచ్చు. కాని ఎక్కువగా వేపుడుగా గోరు చిక్కుడు కాయలను తెలుగునాట ఎక్కువ ఉపయోగములో ఉంది. పుట్టుక ఇది చాల తరాల క్రితమే ఆఫ్రికా నుండి వచ్చినదని నిపుణుల అంచనా. ఇది పుట్టిన దేశంలో కన్నా భారత్ లో దీని ఉత్పత్తి ఎక్కువ. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే దానిలో భారత్ ది 80% వాట ఉంది. తర్వాత స్థానంలో పాకిస్థాన్, అమెరికా ఉన్నాయి. రాజస్థాన్, వంటి ప్రాంతాలలో దీనిని పశువులకు, ఒంటెలకు ఆహారంగా వాడే వారు. పారిశ్రామిక ఉపయోగము ఇంత వరకు గోరుచిక్కుడు చాల సామాన్యమైన కూరగాయగా జన బాహుళ్యంలో పేరు పడింది . ఇది అత్యంత రుచికరమైన కూరగాయ అని ఎవరు అనరు. అలాగే ఇది పనికి రాని కూరగాయ అని కూడా ఎవరు అనరు. దీనికి రుచి విషయంలో ప్రత్యేక స్థానం ఏమి లేదు. అందు చేత ఇది అతి సామాన్యమైన కూరగాయ. దీని ధర కూడా చాల తక్కువగా వుంటుంది. పండించడము కూడా సులబమే. ఇది కేవలము కూరగాయగానె గాక దీనికి పారిశ్రామిక ఉపయోగము కూడా ఉంది. గోరు చిక్కుడు గింజలను పారిశ్రామికంగా వుపయోగిస్తుంటారు. గోరుచిక్కుడు కాయలను ముదరబెట్టి వాటిని ఎండ బెట్టి వాటినుండి గింజలను వేరు చేస్తారు. ఆ గింజల నుండి పొట్టును వేరు చేసి ఆ పప్పును పొడి చేస్తారు. ఆ పొడిలో నీళ్ళు కలిపితే అది జిగురుగా మారుతుంది. ఆ జిగురు పదార్తము., దాని గుణ గణాలె సాదారణమైన గోరుచిక్కుడు కాయలను అమాంతం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద గుర్తింపు నిచ్చింది. దీనిని ఐస్ క్రీంలు, సాఫ్ట్ డ్రింకులు, పుడ్డింగులు, చాక్లైట్, ప్లేవర్డ్ మిల్క్, జాం, జెల్లీ, క్యాండ్ పిష్, క్యాండ్ మేట్, నూడుల్స్, బిస్కెట్ ఇలా అనేక అహార పదార్థాలలో దీని వాడతారు. ఇందులో కేలరీలు అసలు వుండవు. కనుక బరువు తగ్గాలనుకునే వారు దీని ఎక్కువగా వాడుతారు. దీన్ని కొద్దిగా తీసుకున్నా కడుపు నిండినట్టుగా వుంటుంది జీర్ణ వ్వవస్త శుద్ధికి చాల పుపయోగ పడుతుంది. అంతేగాక చర్మ సౌందర్య సాధనాలలో దీని ఉపయోగము ఎక్కువగానె ఉంది. వస్త్ర పరిశ్రమ, ముద్రణ, దోమల నివారణలు, కాగితము, వాటర్ పైంట్లు, మొదలగు వాటిలో ఈ గోరుచిక్కుడు జిగురు ఉపయోగము చాల ఎక్కువ. ఇప్పుడిప్పుడు ' షెళ్ ' చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే బావులకు ఈ గోరు చిక్కుడు జిగురు అత్యంత ప్రధానమైన వస్తువుగా అవతరించింది. ఇది లేక పోతె వారి పని నడవదు. వారికి ఇది అత్యంత కీలకమైన పదార్థము. అమెరికాలో షెల్ ఆయిల్, షెల్ గ్యాస్ వెలికి తీత పై దృష్టి పెట్టడంతో మనదేశంలో గోరు చిక్కుడు జిగురు ధరకు రెక్కలొచ్చాయి. గతంలో ఈ జిగురు ఒక క్వింటాలు ధర రెండు లేదా నాలుగు వేల రూపాయల మధ్య వుండగా 2011 వ సంవత్సరంలో గోకర కాయ గింజల ధర ముప్పై ఐదు వేలు రూపాయలు పలికింది. గోకర కాయ గింజల ధర అలా వుంటే దాని జిగురు ధర లక్ష రూపాయల పై మాటె. ఎందు కింత గిరాకి గోరు చిక్కుడు జిగురుకు అంతర్జాతీయంగా ఈమధ్యన గొప్ప డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా అమెరికా తన చమురు పరిశ్రమ ఉత్పత్తుల కోసం భారత్ లో తయారయ్యే గోకరకాయ/ గోరు చిక్కుడు జిగురు పైనే అదార పడి ఉంది. గోరు చిక్కుడు పంట మనదగ్గర విరగ పండితె అమెరికాలోని షెల్ ఆయిల్/గ్యాస్ పారిశ్రామికులకు పండగే. ఇక్కడ గోరుచిక్కుడు పంట దిగుబడి తగ్గితే అమెరికాలోని చమురు క్షేత్రాల నిర్వహకుల మొఖాలలో నెత్తురు చుక్క వుండదు. అదీ మన దేశంలో పండే గోకరకాయ లేదా గోరు చిక్కుడు మహత్యం. ఇంత కాలం అతి సామాన్యమైన కూరగాయగా మిగిలి పోయిన గోరు చిక్కుడు, దానిలోని జిగురు పదార్థంలోని విలువలను గుర్తించడంతో దానికి అంతర్జాతీయంగా మంచి ప్రాచుర్యం కలిగి ఎనలేని గిరాకిని తెచ్చిపెట్టింది. అమెరికాలో షెల్ గ్యాసు, ఆయిల్ ఉత్పత్తి ఇంచుమిందు ముప్పై శాతం ఉంది. ఆ గ్యాస్/లేదా ఆయిల్ బావులకు అత్యంత కీలకమైన పదార్థం మన గోరక కాయ గింజల జిగురే. మనం ఈ జిగురును సరపరా చేయక పోతె ఆ చమురు/ఆయిల్ బావులు మూత పడినట్లే. అందుచేతనే మన దేశంలో గోరు చిక్కుడు ఉత్పత్తి తగ్గితే అమెరికా ఆయిల్/గ్యాస్ ఉత్పత్తి ధారులకు చెమటలు పడ్తాయి. షెల్ ఆయిల్/ గ్యాస్ అంటే.....? సాధారణంగా సహజ వాయువు, చమురు భూమి అడుగున రాతి పొరల్లో నిక్షిప్తంమై వుంటుంది. ముఖ్యంగా ఇసుకరాయి, సున్నపు రాయి పొరల్లో నిక్షేపాలుంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చమురు, సహజవాయువు 90 శాతం ఈ రెండు రకాల రాళ్ళ పొరల మధ్యనున్న ఖాళీలనుండే వస్తున్నది. ఇసుకరాతి రేణువుల మధ్యనున్న ఖాళీల లోను, సున్నపు రాతి పొరల మధ్యనున్న ఖాళీలలో ఈ నిక్షేపాలుంటాయి. సాంప్రదాయ విధానంలో ఈరాళ్ళను ముక్కలు చేసి లోనికి కొన్ని రసాయనాలను పంపిస్తారు. అప్పుడు ఆ రాళ్ళలోని ఆయిల్, గ్యాసి బావుల్లోకి వస్తుంది. ఇక షేల్ గ్యాస్ ను షేల్ చమురును వెలికి తీయడానికి ఒక ప్రత్యేకమైన విధానమున్నది. భూమి లోపల వున్న బంకమట్టి, అక్కడ వున్న అధిక ఉష్టోగ్రతకు, ఒత్తిడి కారణంగా కాలక్రమంలో అది గట్టి పడి రాళ్ళ లాగ ఏర్పడతాయి. ఈ రాళ్ళనే 'షేల్ ' అంటారు. ఈ రాళ్ళ పొరలలో ఆ నిక్షేపాలు ఉంటాయి. దాన్ని బయటకు తీయాలంటే ఆ రాళ్ళను పగలగొట్టాలి. అలా పగులగొట్టిన రాళ్ళముక్కలమధ్యకు వివిధ రసాయనాలు కలిపిన నీటిని అధిక పీడనముతో భూమి లోపలికి పంపిస్తారు. అప్పుడు రాళ్ళపొరల మధ్య చిక్కుకొని వున్న చమురు, సహజ వాయువు వేరుపడి బావిలోనికి చేరుతుంది. ఈ ప్రక్రియను ప్రాకింగ్ అని పిలుస్తారు. ఇలా భూమిలోపలికి పంపే పదార్థాన్ని ప్రొపొనెంట్ అని అంటారు. షేల్ బావుల్లోకి పంపే ప్రొపొనెంట్స్ లో గోరుచిక్కుడు జిగురు వుంటుంది. ఆ జిగురు లేకుండా షేల్ గ్యాస్/చమురు బయటకు తీయడము అసాద్యం. మనం ఈ గోరుచిక్కుడు జిగురును సరపరా చేయక పోతే ఆ బావులన్ని మూత పడినట్లే. అందుకే మనదేశంలో గోరు చిక్కుడు ఉత్పత్తి తగ్గితె అమెరికాకు చెమటలు పడతాయి. షేల్ గ్యాస్ బావులు ఎక్కెడెక్కడున్నాయి? ప్రపంచ వ్యాప్తంగా చాల దేశాలలో షేల్ గ్యాస్/చమురు నిల్వలున్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి కొన్ని దేశాలు మాత్రమే షేల్ చమురు/గ్యాస్ ను వెలికి తీస్తున్నాయి. అమెరికాలో నైతే 2004లోనె షేల్ గ్యాస్/చమురు బయటకు తీసే కార్యక్రమం మొదలైంది. ప్రస్తుతం అమెరికాలో 30 శాతం సహజ వాయువు షేల్ బావులనుండే వస్తున్నది. భారత్ లో కూడా షేల్ గ్యాస్/చమురు వంటి ప్రత్యామ్నాలను వెతకాల్సిన అవసరం ఉంది. భారత్ లో అనేక చోట్ల షేల్ వున్నా.... గ్యాస్/చమురు నిక్షేపాలున్న షేల్ కొన్ని చోట్లమాత్రమే ఉన్నట్లు చమురు రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ అవసరాలకు 176 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు అవసరమైతే, 2011 - 12 లో 48 మిలియన్ మెట్రిక్ టన్నులే ఉత్పత్తి చేయగలిగారు. గ్యాస్ 64 బిలియన్ క్యూబిక్ మీటర్ల అవసరమైతే 52 బిలియన్ క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి చేయ గలిగారు. భవిషత్ లో షేల్ ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశమున్నది. దాంతోబాటు గోరు చిక్కుడు ఉత్పత్తి, గిరాకి పెరగడము తప్పని సరి. భారత్ లో గోరు చిక్కుడు ఉత్పత్తి.... భారత్ లో ఉత్పత్తి అవుతున్న గోరుచిక్కుడు జిగురులో 75 శాతం వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండే వస్తున్నది. ఈ రాష్ట్రంలో గోరు చిక్కుడు పై పరిశోధన చేసే కేంద్రం కూడా ఉంది. గత ఏడాది వరకు గోరు చిక్కుడుకు సరైన ధరలేక, రైతులకు అవగాహన లేక దళారులు, వ్వాపార వేత్తలు, పరిశ్రమల యజమానులు మాత్రమే లాభపడే వారు. ప్రస్తుతం పరిస్థితి మారి పోయింది. ఉత్తర అమెరికాలో షేల్ గ్యాస్ ' బూం ' తో గోరుచిక్కుడు జిగురుకు ఒక్కసారిగా గిరాకి పెరిగి పోయింది. ధరలు పెరిగి పోయాయి. ఊహించని ఈ పరిణామానికి అధిక మొత్తంలో డబ్బు రావడంతో రాజస్థాన్ రైతులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. రైతులు తమ ఉత్పత్తులను వ్వాపారుల వద్దకు తీసుకొని వెళ్ళి వారిని ప్రాదేయ పడే పరిస్థితి పోయి ఇప్పుడు వ్వాపారులే రైతుల వద్దకు వచ్చి ముందుగానె పంట సాగుకు కొంత డబ్బు, గోరుచిక్కుడు విత్తనాలు ఇచ్చి పంటను కొనుక్కుంటున్నారు. అప్పటి వరకు పూరి గుడెసెల్లో బ్రతుకీడుస్తున్న సామాన్య రైతులు పక్కాగృహాలు కట్టుకొని అధునూత గృహోపకరణాలను సమకూర్చుకున్నారు. ఒకరైతు 20 క్వింటాళ్ళ గోరుచిక్కుడు గింజల్ని ఐదు లక్షల రూపాయలకు విక్రయించాడు. రైతే రజు అన్న నానుడి రాజస్థాన్ రైతుల విషయంలో నిజమైంది. రాజస్థాన్ లో వర్షపాతం అంతంత మాత్రమే. గోరు చిక్కుడు సాగుకు ఇది అనుకూలమే. గోరుచిక్కుడు పంటలోను, గోరుచిక్కుడు జిగురు ఎగుమతిలోను భారత్ అగ్రగామిగా ఉంది. అంతర్జాతీయ పారిశ్రామిక అవసరాల్లో ఎనభై శాతం వరకు భారత్ నుండే వెళ్తోంది. ఇక్కడి నుండి ఏటా సుమారు లక్షన్నర టన్నుల గోరుచిక్కుడు జిగురు ఎగుమతి అవుతున్నది. గోరుచిక్కుడు గింజల రూపంలో ఎగుమతి పై నిషేధం వున్నందున జిగురు రూపంలోనె ఎగుమతి చేయాలి. భారత్ నుండి ఎగుమతి అవుతున్న ఆహార పదార్థాలలో బాసమతి బియ్యం తర్వాతి స్థానం గోరు చిక్కుడుదె. ఆంధ్ర ప్రదేశ్ లో... గోరుచిక్కుడు.... ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలోను గోరుచిక్కుడు సాగవుతున్నది. గతేడాది గోరుచిక్కుడు కిగిరాకి పెరగడంతో కూరగాయగా పండించిన గోరుచిక్కుడునే రైతులు జిగురు కొరకు పండించి విక్రయించారు. ఇప్పుడు రాజస్థాన్ నుండి విత్తనాలను తెచ్చుకొని వాణిజ్య ప్రాతిపదికన సాగు చేసేందుకు రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. కరువు జిల్లాగా పేరు పొందిన అనంతపురం జిల్లాలో ప్రభుత్వ సహకారంతో గోరు చిక్కుడు సాగు చేస్తుండగా.... ఇప్పుడు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని రైతులు సైతం పెద్ద ఎత్తున గోరుచిక్కుడు సాగు చేయాలని బావిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ఇతర పారిశ్రామిక అవసరాల కొరకు నెల నెలా సుమారు 200 టన్నుల జిగురును ఉత్తర భారత్ నుండి దిగుమతి చేసుకుంటున్నది. అందులో 50 టన్నుల వరకు మస్కిటో కాయిల్స్ తయారీ లోనె వాడుతున్నారు. గోరు చిక్కుడుకు పెద్దగా తెగుళ్ళు సోకక పోవడం, వర్షాభావ పరిస్థితులను తట్టుకొని నిలబడగలగడము, పెట్టుబడి తక్కువ కావడము, గిరాకి బాగుండటం మొదలగు కారణాల వల్ల మన రైతులు గోరుచిక్కుడు సాగుకు మక్కువ చూపుతున్నారు. ప్రత్తి, మిరప వంటి పంటలు రైతులను దెబ్బ తీస్తుండటంతో గోరు చిక్కుడు సాగు ఈ రైతులకు ఆశాకిరణంగా కనిపిస్తున్నది. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే షేల్ గ్యాస్/చమురు వెలికి తీత కార్యక్రమం జరుగుతున్నది . చైనాలో కూడా భారి నిల్వలున్నట్టు అంచనా. మరికొన్ని దేశాలు షేల్ గ్యాస్/చమురు వెలికి తీయడము పై సన్నాహాలు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోసించిన ఆధ్రప్రదేశ్ రైతులు తమ భవిషత్తును గోరుచిక్కుడు సాగు ఆదుకుంటుందని కొండంత ఆశ పెట్టుకున్నాడు. అతి సాధారణమైన గోరు చిక్కుడు పంట రాబోవు కాలంలో ప్రముఖ వాణిజ్య పంటగా అభివృద్ధి చెందగలదని నమ్ము తున్నాడు. ఆధారము: ఈనాడు ఆదివారము: 2012 డిసెంబరు 2. [లాభాల 'చిక్కు'డే] విత్తన గోరుచిక్కుడు జిగురుఎగుమతుల్లో రికార్డుఏకంగా రూ.21, 287 కోట్ల ఆదాయం. కేజీ రూ.250 నుంచి రూ.300పలుకుతున్న విత్తనాలు. ఈనాడు - హైదరాబాదు‌త్తన గోరుచిక్కుడు పంట మరోసారి రికార్డు సృష్టించింది. గతేడాది భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయిన వ్యవసాయోత్పత్తుల్లో ఈ పంట నుంచి తీసిన జిగురుదే అగ్రస్థానం. రికార్డుస్థాయిలో రూ.21, 287 కోట్ల విలువైన గోరుచిక్కుడు జిగురును విదేశాలకు పంపి భారత వ్యాపారులు రికార్డు సృష్టించారు. అంతకుముందు ఏడాది (2011-12) తో పోలిస్తే ఇది రూ.4, 764 కోట్లు అధికం. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పంటలకు ఉన్న డిమాండులో విత్తన గోరుచిక్కుడుదే ప్రథమస్థానం కావడం విశేషం. ఈ జిగురుకు భారీ డిమాండు ఏర్పడటం వల్ల వరసగా రెండో ఏడాదీ దీని వ్యాపారం అత్యున్నత స్థాయిలో నిలిచింది. గోరుచిక్కుడు విత్తనాల నుంచి తీసే జిగురును పలు దేశాల్లో విరివిగా వాడుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో బేకరీ ఆహార పదార్థాల్లో చిక్కదనం కోసం దీనికి గిరాకీ ఉంది. నిజానికి గతేడాది దీనికి పెద్దగా మార్కెట్‌ ఉండదని తొలుత అంచనా వేశారు. కానీ 2012-13 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి వ్యవసాయోత్పత్తుల్లో ఈ జిగురు మళ్లీ అగ్రస్థానాన్నినిలబెట్టుకోవడం గమనార్హం. ఉత్తరాది రాష్ట్రాల రైతులకు ఇది కాసుల వర్షం కురిపించే పంటగా మారింది. ఒక్కో రాష్ట్రంలో దీనిసాగు విస్తీర్ణం లెక్కలు ఏటేటా మారిపోతున్నాయి. పంజాబ్‌లో రెండేళ్ల క్రితం కేవలం 4 వేల హెక్టార్లల్లో విత్తన గోరుచిక్కుడు పంట వేసేవారు. గతేడాది ఇది కాస్తా 50 వేల హెక్టార్లకు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పంట ధర కూడా మార్కెట్లో ఇదే రకంగా భారీ ఒడిదుడుకులకు లోనవుతోంది. ఉదాహరణకు ఈ నెల 11 నుంచి 13 వరకూ ఈ పంట ధర క్వింటాకు రూ.6, 300 ఉండగా ఆ తరువాత రెండు రోజులకే ఏకంగా రూ.7 వేలకు చేరింది. గత ఏప్రిల్‌, మే నెలల్లో దీని ధర ఒకదశలో రూ.13 వేలు దాటింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది తక్కువే కావడం మరో విశేషం.అనంతపురంలో ఎగరేసుకెళ్లారు..రాష్ట్రంలో విత్తన గోరుచిక్కుడును గతేడాది ప్రయోగాత్మకంగా 2500 ఎకరాల్లో కంపెనీలు, వ్యవసాయశాఖ సంయుక్తంగా వేయించాయి. పంటను కనీసం రూ.5 వేలకు క్వింటా చొప్పున కొంటామని ముందే కంపెనీలు రైతులతో తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) పేరుతో ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం రైతులకు విత్తనాలు సైతం ఉచితంగా ఇచ్చాయి. కానీ చివరికి పలువురు రైతులు అసలు ఒప్పందం ప్రకారం కంపెనీలకు అమ్మలేదు. మార్కెట్‌లో ధర రూ.9 వేల దాకా రావడంతో నేరుగా అమ్మేసుకున్నారు. దీనికితోడు తెలంగాణ, కోస్తా జిల్లాలకు చెందిన రైతులు, వ్యాపారులు అనంతపురం నుంచి ఈ విత్తనాలను కిలో రూ.300 చొప్పున కొన్నారు. ఇలా విత్తనాలు అమ్ముకున్నవారికీ మంచి ఆదాయం వచ్చింది. ప్రస్తుతం ఈ పంట విత్తనాలు మార్కెట్‌లో రూ.250పైనే ఉంది. కొన్ని కంపెనీలు రూ.500 దాకా వసూలు చేస్తున్నాయి. ఈ ఏడాదీ రాష్ట్రంలో పెద్దయెత్తున విత్తన గోరుచిక్కుడు పంట సాగుకు ప్రోత్సాహం ఇవ్వాలని, అనంతపురం జిల్లాలో 50 వేల ఎకరాల దాకా పెంచడానికి అవకాశం ఉందని ఆ జిల్లా యంత్రాంగం రాష్ట్ర వ్యవసాయశాఖకు ప్రతిపాదన పంపినట్లు తాజా సమాచారం. కానీ రాష్ట్రస్థాయిలో దీనిపై ఇంతవరకూ స్పందన లేదు. గోరుచిక్కుడు నిజానికి కూరగాయ పంట. రాష్ట్రంలో కూరగాయ పంటల పర్యవేక్షణ వ్యవహారాలు ఉద్యానశాఖ పరిధిలో ఉంది. కానీ ఈ శాఖ విత్తన గోరుచిక్కుడు సాగును పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ శాఖ నిర్లక్ష్యంతో అనంతపురంలో వ్యవసాయశాఖ అధికారులే ఈ పంట గురించి రైతులకు చెపుతున్నారు. ఆధారము: ఈనాడు 17 Jun 2013 10:00, వర్గం:కూరగాయలు వర్గం:ఈ వారం వ్యాసాలు
బీరకాయ
https://te.wikipedia.org/wiki/బీరకాయ
బీరకాయ , Ridge Guard thumb|Luffa operculata thumb|Luffa aegyptiaca సంస్కృతము కోశాతకీ; హిందీ టోరీ మొక్క గురించి గుమ్మడి కుటుంబమునకు చెందినది. బీరతీగ గుమ్మడి కుటుంబము లోని జాతులలో విస్తరణమున మధ్యమము. నులితీగలు 2 - 5 శాఖలు కలిగి యుండును. ఆకును 5 - 7 కోణములు లేక స్పష్టమగు తమ్మెలు గలిగి ఆయారకములలో మధ్యమ పరిమాణము కలిగి కానీ పెద్దవిగా కానీ యుండును. మగ పూవులు గుత్తులుగ బయలుదేరును. ఇందు 5 తమ్మెలుగల పుష్పకోశమును, ఐదు పసిమి రంగుగల రక్షతపత్రములు ఉండును. కింజల్కములు మూడు. ఆడు పూవున కూడా పుష్పకోశమును, దళవలయమును, మగపూవునందువలెనే యుండును. ఇవి ఉచ్చములు, అనగా అండాశయముపై అమరియుండును. కీలము మూడు అగ్రములు కలిగి కురుచగ ఉండును. మూడు మానమాత్రపు కింజల్కములు కూడా నుండును. బీర పూవులు సాయంకాలము 5 - 6 గంటల మధ్య విడచును. కాయలలో పొడవు 10 - 60 సెం.మీ ఉండును. లావు 2.5 - 3. 5 సెం.మీ ఉండును. పైన స్ఫుటమయిన కోణములు తేరి డోరియాలు కలిగి ఉండును. సామాన్యముగా ఈ కోణములు పది యుండును. కాయ ఎండిన వెనుక పై చర్మము పీచుకట్టుటయే కాక లోన కూడా కొన్ని పక్షుల గూళ్ళవలె పీచుతో నల్లబడిన అరలు కలిగి యందు పెక్కు గింజలు ఉండును. బీరలో రకములు గుమ్మడి కుటుంబమునకు చెందినది. బీరతీగ గుమ్మడి కుటుంబము లోని జాతులలో విస్తరణమున మధ్యమము. నులితీగలు 2 - 5 శాఖలు కలిగి యుండును. ఆకును 5 - 7 కోణములు లేక స్పష్టమగు తమ్మెలు గలిగి ఆయారకములలో మధ్యమ పరిమాణము కలిగి కానీ పెద్దవిగా కానీ యుండును. మగ పూవులు గుత్తులుగ బయలుదేరును. ఇందు 5 తమ్మెలుగల పుష్పకోశమును, ఐదు పసిమి రంగుగల రక్షతపత్రములు ఉండును. కింజల్కములు మూడు. ఆడు పూవున కూడా పుష్పకోశమును, దళవలయమును, మగపూవునందువలెనే యుండును. ఇవి ఉచ్చములు, అనగా అండాశయముపై నమరియుండును. కీలము మూడు అగ్రములు కలిగి కురుచగ ఉండును. మూడు మానమాత్రపు కింజల్కములు కూడా నుండును. బీర పూవులు సాయంకాలము 5 - 6 గంటల మధ్య విడచును. కాయలలో పొడవు 10 - 60 సెం.మీ ఉండును. లావు 2.5 - 3. 5 సెం.మీ ఉండును. పైన స్ఫుటమయిన కోణములు తేరి డోరియాలు కలిగి ఉంండును. సామాన్యముగా ఈ కోణములు పది యుండును. కాయ ఎండిన వెనుక పై చర్మము పీచుకట్టుటయే కాక లోన కూడా కొన్ని పక్షుల గూళ్ళవలె పీచుతో నల్లబడిన అరలు కలిగి యందు పెక్కు గింజలు ఉండును. రకములు పందిరి బీర : దీనినే పెద్ద బీర, పొడవు బీర అని అంటారు. ఇవి చాలా పొడవు పెరుగును, అనగా సుమారుగా 20-30 సెం.మీ పెరుగును, అనుకూల పరిస్థితులలో అవి 60 సెం.మీ వరకూ పెరుగును. పందిరి ఎక్కించుటవల్ల వీనిని పందిరి బీఋఅ అని అంటారు. పొట్టి బీర : ఇవి 12-20 సెం.మీ వరకు పెరుగును. కానీ ఇది లావుగా ఉండును. నేతి బీర : ఇది బీర జాతిలలో ఒక ప్రత్యేక జాతి, తీగ సామాన్యముగా బీర జాతికన్నా మోటుగా పెరుగును. తరచు స్వతస్సిద్ధముగా పుట్టి చెట్ల మీద ప్రాకుచుండును. ఆకులు గుండ్రముగా ఐదు తమ్మెలేర్పడియుండును. పూవులు పెద్దవి. పసుపు పచ్చగా ఉండును. మగ పూవులలో కింజల్కములు ఇతర జాతులలోవలె ఉండును. నాలుగు నుండి ఐదు సెంమీ. వరకు లావు అవును. నునుపుగా ఉండును. కానీ సామాన్యపు బీరలోవలెనే పది కోణముల ఆనవాళ్ళూ మాత్రము కనపడును.ఇది అంత రుచికరముగా ఉండదు, కానీ చూడటానికి మాత్రము బహు రమ్యముగా ఉంటుంది. నేతి బీరలోని నేతి చందముగా అని ఓ సామెత ఉంది కదా మనకు. గుత్తిబీర : ఈ బీరకాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. వైద్యపరమైన ఉపయోగాలు : thumb|బీరకాయ పప్పు బీర పాదు ఆకులు మెత్తగా నూరి, రసం తీసి కళ్లలో వేస్తే కళ్ల మంటలు, కంజెక్టివైటిస్ తగ్గుతుంది. బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది. విరేచన కారి కూడా. అందువల్లనే పథ్యంగా బీరకాయ చాలామంచిది. బీరకాయ అరుచిని కూడా పొగొడుతుంది. లేత బీరపొట్టు వేపుడు జ్వరం పడి లేచిన వారికి హితవుగా వుంటుంది. కలువ గింజలకు చలువ చేసే గుణం ఉంది. వీటిని పచ్చివిగా కానీ, కూరగా కాని చేసకుని తీసుకోవచ్చు. నెలసరి నొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి, వడకట్టి, ఆ నీటిని సేవించడం వల్ల ఫలితం వుంటుంది. అదే విధంగా పుదీనా ఆకులు, ఉప్పు కలిపి, నీటిలో మరిగించి, ఆ ఆవిరి పడితే గొంతు మృదువుగా మారుతుంది. ఉసిరి పచ్చడి, తేనెలో నానపెట్టిన ఉసిరి నిత్యం పద్ధతి ప్రకారం సేవిస్తే, దృష్టిలోపం తగ్గుతుంది. ఉసిరి పొడిని, నిత్యం పరకడుపున తేనెతో కలిపి సేవించడం మంచిది. దీని వల్ల వత్తిడి, అలసట తగ్గుతుంది. వేసవిలో ఎండు ద్రాక్షలు, లేదా కిస్‌మిస్‌లు వాడడం మంచిది. వీటికి చలువ చేసే గుణం ఉంది. గ్లాసుడు నీళ్లలో ఎండు ద్రాక్షలు వేసి, నానపెట్టి, ఆ నీటిని తీసుకుంటే, వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇది చాలా మంచిది. సీతాఫలం విత్తనాలు, ఆకులు మెత్తగా నూరి పట్టిస్తే, పేలు పోతాయి. అరటిపండు, తేనెతో కలిపి తీసుకంటే క్షయవ్యాధిగ్రస్తులకు మంచిది. నేరేడు ఆకులు నీటిలో మరిగించి, వడగట్టి, ఆ నీటిని పుక్కిలిస్తే నోటిపూతలు తగ్గుతాయి. రెండు, మూడు రోజుల పాటు రెండు మిరియాల గింజలు, మెలమెల్లగా నములుతూ, ఆ రసం మింగితే దగ్గు తగ్గుతుంది. గోధుమలు, బియ్యం, పెసలు, రాగులు, సోయాగింజలు, జొన్నలు అరకిలో వంతున కలిపి, 50 గ్రాముల నువ్వులు, 20 గ్రాముల జీలకర్ర జోడించి, దోరగా విడివిడిగా వేయించాలి. ఆపై మరపట్టించి రొట్టెలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పిండితో జావ కూడా చేసుకోవచ్చు. వేప చెట్టు బెరడును పెనంపై బాగా కాల్చి, మెత్తగా పొడి చేయాలి. ఆ పొడికి కొద్దిగా కొబ్బరి నూనె చేర్చి, కురుపులపై రాస్తే ఉపశమనం వుంటుంది. వేపాకు రసం, దానికి సమాన భాగంలో పెరుగు జోడించి, కాస్త నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది. రకములు thumb|left|బీరకాయ పీచు పందిరి బీర దీనినే పెద్ద బీర, పొడవు బీర అని అంటారు. ఇవి చాలా పొడవు పెరుగును, అనగా సుమారుగా 20-30 సెం.మీ పెరుగును, అనుకూల పరిస్థితులలో అవి 60 సెం.మీ వరకూ పెరుగును. పందిరి ఎక్కించుటవల్ల వీనిని పందిరి బీర అని అంటారు. thumb|right|బీరకాయలు., పాకాల సంతలో) పొట్టి బీర ఇవి 12-20 సెం.మీ వరకు పెరుగును. కానీ ఇది లావుగా ఉండును. నేతి బీర ఇది బీర జాతిలలో ఒక ప్రత్యేక జాతి, తీగ సామాన్యముగా బీర జాతికన్నా మోటుగా పెరుగును. తరచు స్వతస్సిద్ధముగా పుట్టి చెట్ల మీద ప్రాకుచుండును. ఆకులు గుండ్రముగా ఐదు తమ్మెలేర్పడియుండును. పూవులు పెద్దవి. పసుపు పచ్చగా ఉండును. మగ పూవులలో కింజల్కములు ఇతర జాతులలోవలె ఉండును. నాలుగు నుండి ఐదు సెంమీ. వరకు లావు గానూ, నునుపుగా ఉండును. కానీ సామాన్యపు బీరలోవలెనే పది కోణముల ఆనవాళ్ళూ మాత్రము కనపడును. ఇది అంత రుచికరముగా ఉండదు, కానీ చూడటానికి మాత్రము బహు అందముగా ఉంటుంది. నేతి బీరలోని నేతి చందముగా అని ఓ సామెత ఉంది కదా మనకు. గుత్తిబీర సాగు చేయు విధము బీరపాదులు వర్షాకాలమున బాగుగా పెరిగి కాయును. కానీ వర్షాకాలమున హెచ్చుగా వర్షాలు వచ్చినచో ఈ పాదులు చెడిపోవును. తొలకరి మొదలకొని వర్షాకాలము ముగియువరకు ఈ పాదులు పెట్టుచుండవచ్చును. బీరపాదులన్ని విధముల నేలలోను సులభముగా పెరుగును, కానీ యిసుక పొడి నెలలలో తగినంత సత్తువ జేసిన కానీ పెరగవు విశేషములు తెలుగు దేశములో సారా సీసాలు బీర కాయలులా ఉండుటవల్ల వాటిని బీర కాయ అని ముద్దుగా రహస్యముగా పిలుచుట ఉంది. అమెరికాలో, తెలుగు వారిలో, బీరకాయ అంటే బీరు సీసా (సారా వేరు, బీరు వేరు) అని ముద్దు పేరు. దోసకాయలలో లాగ బీర కాయలలో కూడా కొన్ని బీరకాయలు కొంచెం చేదుగా వుంటాయి. అందుకని కోసేముందు ఒక చిన్న ముక్కను నోట్లో వేసుకుని రుచి చూచి వండుకుంటారు. మూలాలు వర్గం:కూరగాయలు వర్గం:కుకుర్బిటేసి
సొర కాయ
https://te.wikipedia.org/wiki/సొర_కాయ
thumb|Lagenaria siceraria var peregrina సొరకాయ లేదా అనప కాయ లేదా అనగ కాయ. సొరకాయ - Lagenaria దీర్ఘకాలంగా సతాయిస్తున్న N.O. కుకుర్బిటేసి.. తమిళము సొర: కన్నడము సొరె: మళయాళము చొర హిందీ అల్‌ ఖద్దు, లౌకీ సంస్కృతము ఆలాబు. ఇంగ్లీష్readme5minutes బాటిల్ గార్డ్ అనగ వేదకాలమునుండి ఈ దేశమున సాగుచేయబడుచున్న జాతి కూరగాయ!. భౌతిక స్వరూపము సొర కాయ అనుకూల పరిస్థితులలో మిక్కిలి విరివీగా ప్రాకు మోటుజాతి మలితీగలు రెండుగా చీలియుండును. పూవులు బీర పూవులకంటే కొంచెం పెద్దవి. మగ పూవులయందు పుష్పకోశము పొడవుగా ఉండును. ఆకర్షక పత్రములు క్రిందివరకు విడియుండును. తెలుపు, కింజల్కములు అన్నియూ జేరి యుండును. ఆడుపూవున దళవలయమును, పుష్పకోశమును నిడివియైన యండాశయముపై నమరియుండును. రకములు thumb|సొరకాయ కోల గుండ్రని తెలుపు నలుపు thumb|right|పొడవు సొరకాయలు|link=Special:FilePath/Sora_kaayalu.JPG సాగు చేయుపద్దతి thumb|సొరకాయ పోపు కూర ఇవి అన్ని నేలలయందు పెరుగును. మంచిగా దున్నిన తరువాత సిద్దము చేసిన నేలలో2.5 - 3.5 మీటర్ల గోతులు తీసి వీటిని పెంచవలెను. ఆ గోతులలో పసువుల ఎరువును వేయవలెను. విశేషములు ఎండిన సొర కాయపై తొడుగును, సొర కాయ బుర్ర అని పిలుస్తారు, దీనిలో నీరు పోసుకొని పొలాలకు తీసుకొని వెళ్ళు అలవాటు ఉంది. అందులో నీరు చల్లగా ఉంటాయి. దీనిని మనము నాచురల్‌ వాటర్‌ బాటిల్‌, నాచురల్‌ మినీ కూలర్‌గా ఉపయోగించవచ్చు! గుండ్రని సొర బుర్రలను వీణలుగా కూడా చేయుదురు. వంటలు thumb|సొరకాయ పప్పు సొరకాయ వడియాలు సొరకాయ పులుసు సొరయాక టమాటో కూర సొరకాయ సాంబారు దీనిలో పెద్దగా పోషక విలువలు లేవు, మరియూ ఇది ఆలశ్యముగా జీర్ణమగును. నీరు ఎక్కువ. ఔషధ గుణాలు సొరకాయ లేదా అనప కాయ లేదా అనగ కాయ. ఆంగ్లములో Bottle gourd - (Lagenaria vulgaris N.O. Cucurbitaceae) అంటాము . అనప వేదకాలమునుండి ఈ దేశమున సాగుచేయబడుచున్న జాతి కూరగాయ!. విటమిన్ - సి, బి.కాంప్లెక్క్ష్, సొరకాయలో లభిస్తాయి . సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, సులువుగా జీర్ణమవుతుంది .డయూరెటిక్ గా పనిజేస్తుంది . ముత్రనాళాల జబ్బులకు ఇది మంచిది . పచ్చిసొరకాయ రసం దాహార్తిని అరికడుతుంది, అలసటను తగ్గిస్తుంది . భౌతిక స్వరూపము సొర కాయ అనుకూల పరిస్థితులలో మిక్కిలి విరివిరిగా ప్రాకు మోటుజాతి . మలితీగలు రెండుగా చీలియుండును. పూవులు బీర పూవులకంటే కొంచెం పెద్దవి. మగ పూవులయందు పుష్పకోశము పొడవుగా ఉండును. ఆకర్షక పత్రములు క్రిందివరకు విడియుండును. తెలుపు, కింజల్కములు అన్నియూ జేరి యుండును. ఆడు పూవున దళవలయమును, పుష్పకోశమును నిడివియైన యండాశయముపై అమరియుండును. సాగు చేయుపద్ధతి ఇవి అన్ని నేలలయందు పెరుగును. మంచిగా దున్నిన తరువాత సిద్దము చేసిన నేలలో2.5 - 3.5 మీటర్ల గోతులు తీసి వీటిని పెంచవలెను. ఆ గోతులలో పసువుల ఎరువును వేయవలెను. విశేషములు ఎండిన సొర కాయపై తొడుగును, సొర కాయ బుర్ర అని పిలుస్తారు, దీనిలో నీరు పోసుకొని పొలాలకు తీసుకొని వెళ్ళు అలవాటు ఉంది. అందులో నీరు చల్లగా ఉంటాయి. దీనిని మనము నాచురల్‌ వాటర్‌ బాటిల్‌, నాచురల్‌ మినీ కూలర్‌గా ఉపయోగించవచ్చు! గుండ్రని సొర బుర్రలను వీణలుగా కూడా చేయుదురు. పుట్తుక .. చరిత్ర : మానవజాతికి ఏనాడో పరిచయం అయిన అతి ప్రాచీన కూరగాయ సొరకాయ. ఇది పుట్టింది ఆఫ్రికాలో అని చెప్పినప్పటికీ,,, క్రీస్తుపూర్వము 11,000 - 13000 సంవత్సరాల మధ్య పెరూలో తొలిసారి సొరకాయ సాగు జరిగిందని పురాతత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు . పోషకాలు : 100 గ్రాముల పచ్చి సొరకాయలో ... శక్తి : 12 కిలో కాలరీలు, ప్రోటీన్లు : 0.2 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ : 2.5 గ్రాములు, ఫాట్స్ : 0.1 గ్రాములు, విటమిన్‌ ఎ : పుస్కలముగా, విటమిన్‌ సి : పుష్కలముగా . ఖనిజలవణాలు : పుష్కలముగా, వంద గ్రాముల సొరకాయలో కేవలం పదిహేను కెలోరీలు మాత్రమే ఉంటాయి. అలాగే పిండి పదార్థాలు అతి తక్కువగా ఉండడం వల్ల మధుమేహం ఉన్నవారికి ఇది చాలా మంచి ఆహారం. వేసవికాలంలో సొరకాయలో నీటి శాతం ఎక్కువ కాబట్టి డీహైడ్రేషన్ అవకుండా సహాయపడుతుంది. సొరకాయ చెక్కుతో పీచుపదార్థం కూడా లభ్యమవుతుంది. సొరకాయ చెట్టు ఆకులనుంచి తీసిన రసంలో క్యాన్సర్ ను నియంత్రించే క్వెర్సెటిన్, ఆంత్రక్వినోన్ లాంటి ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. వంటలు 1. సొరకాయ వడియాలు 2. సొరకాయ పులుసు 3. సొరయాక టమాటో కూర 4. సొరకాయ సాంబారు ఇవి కూడా చూడండి ఇతర లింకులు FOREST FLORA OF ANDHRA PRADESH మూలాలు వర్గం:కూరగాయలు వర్గం:కుకుర్బిటేసి
గుమ్మడి
https://te.wikipedia.org/wiki/గుమ్మడి
గుమ్మడి లేదా తియ్య గుమ్మడి దీని శాస్త్రీయ నామము "cucurbita pepo లేదా cucuebita mixta ", Pumpkin Cucurbita moschata, N.O. cucurbitaceae. తమిళము పూషిణి. శర్కరపూషిణి; కన్నడము కుంబల: హిందీ ఖద్దూ; సంస్కృతము పీతకూష్మాండః గుమ్మడి ఆంధ్రులకు ప్రీతికరమైన శుభప్రథమైన తరచూ వాడబడు కూర.ఇది ప్రపంచములో అన్ని దేశాలలో దొరుకు తుంది . గుమ్మడిలో అద్భుత ఔషధాలున్నాయి. గుమ్మడి కాయను భారత సంప్రదాయక వంటకాలలో దీనికి మంచి స్థానమే ఉంది. ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉండడం విశేషం. మలబద్ధకం మొదలుకుని మధుమేహం వరకూ చాలా విధాల ఉపయోగపడే గుమ్మడిలో నిజంగా గమ్మత్తైనదే. చైనాలో చక్కెర వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారు చేసే మందుల్లో గుమ్మడిని వాడుతున్నారు. భౌతిక రూపము పూవుయొక్క, కాయయొక్క పరిమాణమున ఈ కుటుంబము లోని జాతులందు గుమ్మడి అగ్రస్థానము వహించును, అందుకే దీనిని గుమ్మడి జాతి అంటారు. పౌష్టిక శక్తిలోకానీ, తినుట కింపుగా ఉండుటయందు కూడా ఇదే మంచిది. గుమ్మడి కాయ రకరకాల వంటగా చేసుకొని తినవచ్చును, జ్యూస్ గా తయారుచేసుకొని తీసుకోవచ్చును, సూప్ లా వాడుకోవచ్చు .. గుమ్మడితీగ చాలా ఎక్కువగా పాకు మోటు జాతి తీగ. కాండము గరుసుగా ఉండు రోమములు కలిగి ఉండునును. ఆకులు హృదయాకారము కలిగినవి. ... కూరగాయలలో అన్నిటికంటే అతి పెద్ద పరిమాణము కలిగినది గుమ్మడి కాయ. ఇది యాబై కిలోల బరువువరకు కూడా కాస్తాయి. ఔషధ ఉపయోగాలు ఇందులో చాల ఎక్కువగా "బీటా కెరోటిన్ ఉంటుంది, శరీరానికు తక్కువ క్యాలరీలు అందిస్తుంది . కళ్ళకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది . ఇందులో విటమిన్ సి కుడా సంవృద్దిగా లభిస్తుంది . డయాబెటీస్ రాకుండా ఉండేందుకు, వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది . బి.పి.ని నియంత్రిస్తుంది, పీచు పదార్ధము ఎక్కువగా ఉన్నందున కొలెస్టరాల్ను తగ్గిస్తుంది, గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్ళలో కలిపి తాగితే మూత్ర సంభంద వ్యాధులు తగ్గుతాయి . ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వును పేగులు గ్రహించకుండా చేయడం ద్వారా కొవ్వు నిల్వలను గణనీయంగా తగ్గించవచ్చు. ఇలా దేహంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది. ఇలా గుమ్మడితో లాభాలతో పాటు విటమిన్-ఇ, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా లభిస్తాయి. అందుకే కొవ్వు సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో గుమ్మడి గింజలు ఉండేలా చూచుకుంటే మంచిది. వీటిలో మెగ్నీషియం మెండుగా ఉంది. ఇంకా మినరల్స్‌ అత్యధికంగా పోగుపడ్డ గింజలు. అంతేకాదు వీటికి ఆహారంలో భాగస్వామ్యం కల్పిస్తే మన జీవితకాలం మరింత పెరుగుతుందట! గుమ్మడి ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది. గుమ్మడి విత్తనాలు తినడం వలన మలబద్ధకం నివారణ ఆవుతుంది. ఆహారం పూర్తిగా జీర్ణమై మలబద్ధక సమస్య తీరుతుంది. తరచూ గుమ్మడిని తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. పైగా గింజల నుంచి తీసే నూనె వాడడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆయుర్వేదములో గుమ్మడి : thumb|right|తీయ గుమ్మడి గుమ్మడికాయ పండినది:-Pumpkin-ripe బాగుగా ముదిరిన, పండిన గుమ్మడి కాయ వండిన మధురముగ నుండును. రుచిబుట్టించును. దేహ పుష్టి, బలము, వీర్యవృద్ధి, మేహశాంతి, దాహము, తాపము, కడుపుబ్బు లను తగ్గించును. చెడు రక్తమును బుట్టించును. అలస్యముగ జీర్ణమగును; వాతము జేయును; దీనికి విరుగుళ్ళు 1 శొంఠి, 2 కాక ఔషధములు, 3 కానుగ వేరు రసము. ఔషధ సేవలో పథ్యమైన వస్తువు. గుమ్మడి కాయ లేతది:- Pumpkin-tender. దీని కూర మిక్కిలి వాతము, రక్త పైత్యము, అగ్నిమాంద్యము జేయును; దుర్బల దేహులు, రోగులు దీనిని పుచ్చుకొనగూడదు; మిక్కిలి అపథ్యమైనది. దీనికి విరుగుళ్ళు గుమ్మడి పువ్వులు :-Flowers of pumpkin plant. పైత్యమును, సన్నిపాతములను హరించును; వీనిని కూరవండుదురు. గుమ్మడికొసల కూర :-Curry of the tender leaves of pumpkin plant. తియ్య గుమ్మడి తీగె కొసలు అనగా లేత ఆకుల కూర ఆమ్ల దోషము, వాతము, గుల్మము, జ్వరము, ఉబ్బు, విదాహము వీని నణచును; జఠరదీప్తి నిచ్చును పుట్టుక దక్షిణ అమెరికాలోని అతి ప్రాచీన రెడ్ ఇండియన్ సమాధుల్లో లభించిన అవశేషాలను బట్టి వేల ఏండ్ల క్రితం నుంచీ గుమ్మడిని మానవులు ఆహారంగా వాడేవారని శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. భారతదేశంలో చరిత్ర పూర్వ యుగాల నుంచీ గుమ్మడిని పండించడం ఉంది. అయినా గుమ్మడి జాతి తొట్టతొలి జన్మస్థలం మాత్రం పదివేల సంవత్సరాలకు పూర్వమే ఉభయ అమెరికా ఖండాల్లో అత్యుష్ణ ప్రాంతాల్లో ఆవిర్భవించిందని వారి అంచనా. అయితే గుమ్మడి జాతుల్లో కొన్నింటికి ఉన్న సంస్కృత పేర్లు కూడా అతి ప్రాచీన కాలం నాటివని నిర్ధారణ అయింది. ఉభయ అమెరికా ఖండాల నుంచి ఎటువంటి నౌకాయానాలు లేనట్టి అంత ప్రాచీన కాలంలోనే ఈ మొక్క భారతదేశం దాకా ఎలా విస్తరించి ఉంటుందనే దానిపైన కూడా శాస్త్రజ్ఞులు విస్తృతంగా చర్చించారు. చివరికి ఎండిన గుమ్మడిపళ్ళు అతి తేలికైనవైనందున అవి మహాసముద్రాల నీటిపై తేలుతూ, మొలకెత్తే సామర్థ్యం కోల్పోని విత్తనాలతో సహా ఒక ఖండం నుంచి మరో ఖండానికి విస్తరించి, అక్కడ అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తి ఉండవచ్చుననే నిర్ధారణకు వచ్చారు. అమెరికన్లు 'రెడ్ పంప్కిన్' అని పిలిచే మంచి గుమ్మడి భారతదేశంలో ప్రవేశించి, 'లాల్ కుమ్రా' అని పిలువబడుతున్నది. అమెరికాలోనే పుట్టిన కషో అనే మరో జాతి గుమ్మడిని భారతీయ మార్కెట్లలో 'ఆఫ్రికన్ గోర్డ్' అనడాన్ని బట్టి మూలంలో అమెరికాలో జన్మించిన ఆ జాతి అక్కడ నుంచి ముందు ఆఫ్రికా ఖండానికి విస్తరించి, ఆ తరువాత భారతదేశానికి విస్తరించి ఉంటుందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ప్రస్తుతం ఆఫ్రికన్ గోర్డ్‌గా పిలవబడుతున్నప్పటికీ, ఈ జాతి భారతదేశానికి అతి ప్రాచీన కాలంలోనే వచ్చి చేరింది. విచిత్ర వీణ, తంబూరా వంటి సంగీత వాద్యాలు తయారుచేసేందుకు అతి పెద్దవైన ఈ జాతి గుమ్మడి పండు బుర్రల్నే అత్యం త ప్రాచీన కాలం నుంచి భారతీయులు ఉపయోగించేవారు. ప్రయోజనాలు గుమ్మడి పండునే కాదు; వాటి లేత ఆకులు, కాండం, పూలు కూడా కూరకు వాడుకుంటారు. గుమ్మడి గింజల్ని తింటారు. హల్వాలు వంటి స్వీట్లలో బాదం, పిస్తా, చార (సార) పప్పు లాగే ఈ గింజలలోని పప్పును కూడా డ్రెస్సింగ్‌గా వాడతారు. కొందరైతే గుమ్మడి పండుతోనే హల్వా చేసుకుంటారు. గుమ్మడిలో పొటాషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఉపయుక్త ఖనిజాలే కాక, విటమిన్ ఎ (అధికంగానూ), కొద్దిగా విటమిన్ సి (కొద్దిగానూ) ఉన్నందున అది ఆహారపరంగా విలువైనదని గుర్తించారు. గుమ్మడి పండుకు ఎన్నో వైద్యపరమైన ప్రయోజనాలున్నాయి. కడుపులోని 'టేప్ వార్మ్స్' నిర్మూలన కోసం గుమ్మడి గింజల్ని పంచదారతో తినిపిస్తారు. రాత్రి పడుకోబోయే ముందు తినిపించి, తెల్లవారుఝామునే ఆముదం తాగిస్తారు. గనేరియా, మూత్ర వ్యాధులున్న రోగులకు మూత్రం సాఫీగా వెడలేందుకు గుమ్మడి విత్తులు పంచదార లేక తేనెతో తినిపిస్తారు. సెగగడ్డలు, మొండి వ్రణాలకు గుమ్మడి పండు గుజ్జును మలాం పట్టీగా వేస్తారు. తేళ్ళు, కాళ్ళజెర్రులు, మండ్రగబ్బలు మొదలైనవి కుట్టినప్పుడు, గుమ్మడిపండు తొడిమను ఎండబెట్టి పొడి చేసి, దానితో తయారుచేసిన పేస్టును రాస్తే తక్షణ ప్రయోజనం ఉంటుంది. కాలిన గాయాలకు గుమ్మడి పండు గుజ్జుతో పట్టు వేస్తారు. గుమ్మడి విత్తులు మూత్రకారిగానే కాక, నరాల బలహీనత ఉన్నవారికి టానిక్‌లా పనిచేస్తాయి. రకములు సూర్య గుమ్మడి పెద్ద గుమ్మడి బూడిద గుమ్మడి మూలాలు వర్గం:కూరగాయలు tl:Kalabasa
తంజావూరు
https://te.wikipedia.org/wiki/తంజావూరు
తంజావూరు, దక్షిణ భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా లోని ఒక పట్టణం. ఈ పట్టణం కావేరి నది దక్షిణ ఒడ్డున ఉంది. చెన్నై నుండి 218 మైళ్ళ దూరంలో ఉంది. తంజావూరు జిల్లాకు ఈ పట్టణం రాజధాని. తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చింది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ, శ్రీ నీలమేగప్పెరుమాల్‌ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి తంజావూరు అని పేరు పెట్టబడిందని నమ్ముతారు.ఈ నగరం తంజావూరు జిల్లాకు ప్రధాన కేంద్రం. కావేరీ డెల్టాలో ఉన్న ఒక ముఖ్యమైన వ్యవసాయ కేంద్రం. దీనిని తమిళనాడు బియ్యం బుట్ట అని పిలుస్తారు. తంజావూరు 128.02 చ.కి.మీ (49.43 చ.మైళ్లు) విస్తీర్ణంలో నగరపాలక సంస్థ ద్వారా పరిపాలన సాగుతుంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 2,90,720 జనాభాను కలిగి ఉంది. రహదారి మార్గాలు ప్రధాన రవాణా సాధనాలు, నగరం నుండి రైలు ద్వారా ప్రయాణసౌకర్యం కూడా అందుబాటులో కలిగి ఉంది. నగరానికి 59.6 కిమీ (37.0 మైళ్ళు) దూరంలో ఉన్న తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. తంజావూరు నుండి 94 కిమీ (58 మైళ్ళు) దూరంలో ఉన్న కారైకాల్ సమీప ఓడరేవు. చరిత్ర thumb|280x280px|సరస్వతీ మహల్, (గ్రంధాలయం), తంజావూరు ఎడమ|thumb|250x250px|1869 లో తంజావూరు thumb|280x280px|రాయల రాజ మహల్, తంజావూరు చారిత్రకముగా ఈ నగరం ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రం. చోళుల పాలనలో సామ్రాజ్యం రాజధానిగా పనిచేసినప్పుడు ఈ నగరం మొదట ప్రాముఖ్యతను సంతరించుకుంది.తరువాత నాయక రాజులు తరువాత విజయ నగర రాజులు ఈ నగరాన్ని పాలించారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని పాలించారు. 1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ శివాజీ మహా రాజుకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కడికి వచ్చారు కానీ విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించారు.ఇది 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో భాగంగా ఉంది. సంగం కాలం (సా.శ.పూ. 3వ శతాబ్దం నుండి నాల్గవ శతాబ్దం వరకు) తమిళ రికార్డులలో తంజావూరుకు సంబంధించిన ప్రస్తావనలు లేవు, అయితే కొంతమంది పండితులు ఈ నగరం అప్పటి నుండి ఉనికిలో ఉందని భావిస్తున్నారు. కోవిల్ వెన్ని, నగరానికి తూర్పున 15 మైళ్ల (24 కిమీ) దూరంలో ఉంది, ఇది చోళ రాజు కరికాల, చేరస్, పాండ్యుల సమాఖ్య మధ్య వెన్ని యుద్ధం జరిగిన ప్రదేశం.Sastri 1935, p. 32 1365, 1371 మధ్య శ్రీరంగంపై దండయాత్ర చేసిన సమయంలో కంపన్న ఉడయార్ తంజావూరును జయించాడని నమ్ముతారు. 1443 నాటి దేవరాయ శాసనం, 1455 నాటి తిరుమల శాసనం 1532- 1539 నాటి అచ్యుతదేవుని భూదానాలు తంజావూరుపై విజయనగరం ఆధిపత్యాన్ని ధృవీకరిస్తున్నాయి. ఆర్కాట్‌లోని విజయనగర వైస్రాయ్ సేవప్ప నాయక్ (1532–80), 1532లో (1549, కొన్ని ఆధారాల ప్రకారం) స్వతంత్ర చక్రవర్తిగా స్థిరపడి తంజావూరు నాయక్ రాజ్యాన్ని స్థాపించాడు.Vriddhagirisan 1942, pp. 9 – 28 అచ్యుతప్ప నాయక్ (1560–1614), రఘునాథ నాయక్ (1600–34), విజయ రాఘవ నాయక్ (1634–73) తంజావూరును పాలించిన నాయక్ రాజవంశానికి చెందిన ముఖ్యమైన పాలకులు.Mitchell 1995, p. 91Vriddhagirisan 1942, pp. 62–65 1673లో తంజావూరు మదురై నాయక్ రాజు చొక్కనాథ నాయక్ (1662–82) చేతిలో పడడంతో రాజవంశం పాలన ముగిసింది.1673.Mitchell 1995, p. 91 చొక్కనాథ కుమారుడైన విజయ రఘునాథ నాయక్ ఒక యుద్ధంలో చంపబడ్డాడు. చొక్కనాథ సోదరుడు అళగిరి నాయక్ (1673–75) సామ్రాజ్య పాలకుడిగా పట్టాభిషేకం చేయబడ్డాడు. 1674లో బీజాపూర్ సుల్తాన్ మరాఠా సామంతుడు, భోంస్లే రాజవంశానికి చెందిన శివాజీ (1627/30-80) సవతి సోదరుడు ఎకోజీ I (1675–84) తంజావూరును విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఏకోజీ తంజావూరు మరాఠా రాజ్యాన్ని స్థాపించాడు, ఇతను 1855 వరకు తంజావూరును పాలించాడు.1855.Mitchell 1995, p. 91మరాఠాలు 17వ చివరి త్రైమాసికంవరకు, 18వ శతాబ్దమంతా తంజావూరుపై తమ సార్వభౌమాధికారాన్ని ప్రదర్శించారు. 1787లో, తంజావూరు రాజప్రతినిధి అయిన అమర్ సింగ్, మైనర్ రాజా, అతని మేనల్లుడు సెర్ఫోజీ II (1787–93)ను తొలగించి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. సెర్ఫోజీ II బ్రిటిష్ వారి సహాయంతో 1799లో పునరుద్ధరించబడ్డాడు, అతను రాజ్య పరిపాలనను విడిచిపెట్టమని ప్రేరేపించాడు. తంజావూరు కోట, చుట్టుపక్కల ప్రాంతాలకు అతనికి అప్పగించాడు. చివరి తంజావూరు మరాఠా పాలకుడు శివాజీ II (1832–55) చట్టబద్ధమైన మగ వారసుడు లేకుండా మరణించినప్పుడు, 1855లో 1855లో డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ ద్వారా రాజ్యం బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయబడింది. బ్రిటిష్ వారు తమ రికార్డులలో ఈ నగరాన్ని తంజోర్ అని పేర్కొన్నారు. ఇది విలీనం అయిన ఐదు సంవత్సరాల తరువాత, బ్రిటిష్ వారు నెగపటం (నేటి నాగపట్నం) స్థానంలో తంజావూరును జిల్లా పరిపాలనా కేంద్రంగా మార్చారు. బ్రిటిష్ పాలనలో, తంజావూరు ఒక ముఖ్యమైన ప్రాంతీయ కేంద్రంగా ఉద్భవించింది. 1871 భారత జనాభా లెక్కల ప్రకారం 52,171 జనాభా నమోదైంది, మద్రాసు ప్రెసిడెన్సీలో తంజావూరు మూడవ అతిపెద్ద నగరంగా మారింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, తంజావూరు జిల్లా కేంద్రంగా కొనసాగుతుంది. జనాభా గణాంకాలు 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, తంజావూరులో దాదాపు 2,50,000 జనాభా ఉంది, ప్రతి 1,000 మంది పురుషులకు 1,042 స్త్రీల లింగ నిష్పత్తిగా ఉంది,ఇది జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ.నగర జనాభా మొత్తంలో 19,860 మంది ఆరేళ్లలోపు వారు ఉన్నారు.వారిలో 10,237 మంది పురుషులు ఉండగా, 9,623 మంది మహిళలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 9.22% ఉన్నారు. షెడ్యూల్డ్ తెగలు జనాభా .21% మంది ఉన్నారు. నగర సగటు అక్షరాస్యత 83.14%,దీనిని జాతీయ సగటు 72.99% పోల్చగా ఎక్కువ ఉంది. మొత్తం 78,005 మంది కార్మికులు ఉన్నారు, వీరిలో 803 మంది రైతులు, 2,331 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు, 2,746 మంది గృహ పరిశ్రమలపై ఆధారపడిన వారు, 65,211 మంది ఇతర కార్మికులు, 6,914 మంది సన్నకారు కార్మికులు, 110 మంది సన్నకారు రైతులు, 235 మంది సన్నకారు వ్యవసాయ కార్మికులు ఉన్నారు. 2011 భారత మతపరమైన జనాభా లెక్కల ప్రకారం, తంజావూరు (ఎం) లో 82.87% హిందువులు, 8.34% ముస్లింలు, 8.58% క్రైస్తవులు, 0.01% సిక్కులు, 0.01% బౌద్ధులు, 0.06% జైనులు, 0.11% ఇతర మతాలను అనుసరించేవారు లేక ఏ మతపరమైన ప్రాధాన్యతను సూచించనివారు 0.01% మంది ఉన్నారు. తమిళం విస్తృతంగా మాట్లాడే భాష, ప్రామాణిక మాండలికం మధ్య తమిళ మాండలికం. తెలుగు, తంజావూరు మరాఠీ, సౌరాష్ట్ర ఈ నగరంలో మాట్లాడే భాషలు. తంజావూరు మరాఠీ ప్రజల సాంస్కృతిక, రాజకీయ కేంద్రం. హిందువులు మెజారిటీగా ఉన్నప్పటికీ, నగరంలో ముస్లింలు, క్రైస్తవులు కూడా గణనీయమైన జనాభాను కలిగి ఉన్నారు. తంజావూరులోని రోమన్ క్యాథలిక్‌లు తంజోర్‌లోని రోమన్ క్యాథలిక్ డియోసెస్‌కు అనుబంధంగా ఉన్నారు. ప్రొటెస్టంట్లు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రిచీ-తంజోర్ డియోసెస్‌కు అనుబంధంగా ఉన్నారు. భౌతిక వివరణలు ఈ నగరం తమిళనాడు లోని నగరాలలో ఎనిమిదవ పెద్దది. జనాభా సుమారుగా 2,25,000 మంది. ఇక్కడి ప్రజలలో తమిళులు, తెలుగు వారు ఎక్కువగా ఉంటారు. తరువాత సౌరాష్ట్రీయులు, మరాఠీలు ఉంటారు. భౌగోళికం నగరం ఒక పైవంతెన (ఫ్లై ఓవరు) వల్ల రెండుగా విభజించబడింది. పాత నగరం వ్యాపార కేంద్రం, కొత్త నగరం ఎక్కువగా నివాస కేంద్రం. ఈ జిల్లా సరిహద్దులుగా వాయలూరు, గురువడి, పల్లియగ్రారం, కరంథై, పాత నగరం, నంజికోట్టై, విలార్‌, కీలవస్తచావిడీ ఉన్నాయి. వృత్తి ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయదారులు. ఇక్కడ నలభైకిపైబడి ఉన్న మెడికల్‌ కాలేజీల వల్ల ఎక్కువ సంఖ్యలో డాక్టర్లు ఉన్నారు.నగర నివాసుల ప్రధాన వృత్తి పర్యాటకం, సేవా ఆధారిత పరిశ్రమ, సాంప్రదాయ వృత్తి వ్యవసాయం. తంజావూరును "తమిళనాడు రైస్ బౌల్" అని పిలుస్తారు. వరి పంట, ఇతర పంటలుగా నల్లరేగడి నేలలలో, అరటి, కొబ్బరి, శొంఠి, రాగి, ఎర్ర శనగ, పచ్చి శనగ, చెరకు, మొక్కజొన్న పండిస్తారు సంస్కృతి భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక కేంద్రాలలో తంజావూరు ఒకటి. ఈ నగరం ముఖ్యముగా కర్నాటక సంగీతానికి చేసిన సేవలకూ, భరత శాస్త్రానికి చేసిన సేవలకు నిలుస్తుంది. అలాగే తంజావూరు పెయింటింగు పరిశ్రమకు చాలా ప్రసిద్ధి. ఇంకా వీణ, బొమ్మలు తయారీకి ప్రసిద్ధి. తంజావూరులో తమిళ సంప్రదాయాలు గల కుటుంబాలు ఎక్కువ. ప్రముఖ వ్యక్తులు జి.ఎ.నటేశన్ - గణపతి అగ్రహారం అన్నాదురై అయ్యర్ నటేశన్ (1873 ఆగష్టు 25 - 1948 ఏప్రిల్ 29) ఇతను ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, పాత్రికేయుడు, ప్రచురణకర్త, రాజకీయ నాయకుడు. అతను జి.ఎ. నటేశన్ & కో అనే ప్రచురణ సంస్థను స్థాపించాడు. అది జాతీయవాద పుస్తకాలను ప్రచురించింది. వాటిలో ప్రముఖమైంది "ది ఇండియన్ రివ్యూ''." విద్యా సౌకర్యం thumb|270x270px|తమిళ విశ్వవిద్యాలయం గ్రంధాలయం తంజావూరు ప్రముఖ విద్యాకేంద్రంగా వెలుగొందుతుంది. తంజావూరులో మొత్తం నాలుగు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అవి పెరియార్ మణిఅమ్మై ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , టెక్నాలజీ, పి.ఆర్.ఐ.ఎస్.టి. విశ్వవిద్యాలయం, శస్త్ర విశ్వవిద్యాలయం, తమిళ విశ్వవిద్యాలయం. తమిళ విశ్వవిద్యాలయం -''' 1981లో ప్రారంభించబడిన ప్రభుత్వ సంస్థ. 1983లో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి దాని చట్టబద్ధమైన గుర్తింపును పొందింది. తమిళ భాష , శాస్త్రాలలో ఉన్నత పరిశోధనలు చేయడం, భాషాశాస్త్రం, అనువాదం, నిఘంటువు, సంగీతం, నాటకం, మాన్యుస్క్రిప్టులాజీ వంటి వివిధ అనుబంధ విభాగాలలో ఉన్నత అధ్యయనాలు చేస్తున్న తమిళనాడులోని విద్యాకేంద్రాలలో ఇది ఒకటి తంజావూరులో మొత్తం 15 ఆర్ట్స్ , సైన్స్ మేనేజ్‌మెంట్ కళాశాలలు, తొమ్మిది ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. తంజావూరు వైద్య కళాశాల 1961లో స్థాపించబడింది. ఇది తమిళనాడులోని పురాతన వైద్య కళాశాలల్లో ఒకటి. వరి ప్రాసెసింగ్ రీసెర్చ్ సెంటర్ (పి.పి.ఆర్.సి), ఇది తర్వాత 2017లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీగా మారింది, ఇది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశోధనకు కేంద్రంగా ఉంది. 16వ శతాబ్దం చివరి నాటి సరస్వతి మహల్ గ్రంథాలయం, జిల్లా పరిపాలన నిర్వహణలో ఉన్న కేంద్ర గ్రంథాలయం నగరంలో రెండు ప్రముఖ గ్రంథాలయాలు. తంజావూరులో 20 నమోదిత పాఠశాలలు ఉన్నాయి, ఇవి నగరం ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక విద్యా అవసరాలను తీరుస్తున్నాయి. తంజావూరులోని సెయింట్ పీటర్స్ హయ్యర్ సెకండరీ పాఠశాలను 1784లో రెవ. సి ఎఫ్ స్క్వార్ట్జ్ స్థాపించాడు. వాస్తవానికి కళాశాలగా స్థాపించబడింది, ఇది దక్షిణ భారతదేశంలో స్థానిక ప్రజలకు ఇంగ్లీష్ నేర్పిన మొదటి పాఠశాల. తంజావూరు డియోసెస్ ద్వారా 1885లో స్థాపించబడిన సెయింట్ ఆంటోనీస్ హయ్యర్ సెకండరీ స్కూల్, తంజావూరు జిల్లాలోని పురాతన పాఠశాలల్లో ఒకటి. తంజావూరులో ఆంగ్ల విద్యను ప్రోత్సహించడంలో క్రిస్టియన్ మిషనరీలు ప్రముఖ పాత్ర పోషించారు. కళ్యాణసుందరం హయ్యర్ సెకండరీ స్కూల్, 1891లో స్థాపించబడింది, ఇది నగరంలోని పురాతన పాఠశాలల్లో ఒకటి. చూడవలసిన ప్రదేశాలు thumb|బృహదీశ్వరాలయం, తంజావూరు|360x360px తంజావూరు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం, తమిళనాడులోని ప్రధాన పర్యాటక కేంద్రం. తంజావూరులోని సౌత్ జోన్ సంస్ర్కతి కేంద్రంగా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి, ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వంచే స్థాపించబడిన ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలలో ఒకటి. తంజావూరులో ఎక్కువగా సందర్శించే స్మారక చిహ్నం బృహదీశ్వర ఆలయం, దీని నిర్మాణం, చరిత్రకారుడు పెర్సీ బ్రౌన్ "దక్షిణ భారతదేశంలో నిర్మాణ కళ పరిణామంలో ఒక మైలురాయి"గా అభివర్ణించారు. 11వ శతాబ్దంలో చోళ రాజు రాజ రాజ చోళ I (985–1014) చే నిర్మించబడిన ఈ ఆలయం హిందూ దేవుడు శివునికి అంకితం చేయబడింది. గర్భగుడి గోడలు చోళ, నాయకుల కాలం నాటి గోడ చిత్రాలతో కప్పబడి ఉన్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. రాజా రాజ కుమారుడు రాజేంద్ర చోళ I (1012–44) నిర్మించిన గంగైకొండ చోళేశ్వర ఆలయంలో ఇది ప్రతిరూపం చేయబడింది. బృహదీశ్వరాలయం - తంజావూరు, రాజ రాజ చోళుడు కట్టించిన ఇక్కడి చాలా ప్రసిద్ధిచెందిన ఆలయం. ఈ ఆలయం 1987లో యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడింది. ఈ దేవాలయం హిందూదేవుడు శివునికి అంకితం చేయబడింది. తంజావూరు మరాఠా రాజ మహల్ - 1674 నుండి 1855 వరకు తంజావూరు ప్రాంతాన్ని పాలించిన భోంస్లే కుటుంబానికి చెందిన అధికారిక నివాసంగా ఉంది. దీనిని వాస్తవానికి తంజావూరు నాయక్ రాజ్య పాలకులు నిర్మించారు. వారి పతనం తరువాత ఇది తంజావూరు మరాఠాల అధికారిక నివాసంగా పనిచేసింది. 1799లో తంజావూరు మరాఠా రాజ్యంలో ఎక్కువ భాగం బ్రిటీష్ సామ్రాజ్యం స్వాధీనం చేసుకున్నప్పుడు, తంజావూరు మరాఠాలు ప్యాలెస్ చుట్టుపక్కల కోటపై ఆధిపత్యాన్ని కొనసాగించారు. రాజభవనం యొక్క మూడవ చతుర్భుజం యొక్క దక్షిణ భాగంలో గూడగోపురం అని పిలువబడే 190 అడుగులు (58 మైళ్లు) టవర్ లాంటి భవనం ఉంది. ఈ ఆలయాన్ని 1680లో తంజావూరు మొదటి మరాఠా రాజు వెంకోజీ నిర్మించారు. సరస్వతీ మహల్‌ గ్రంథాలయం - తమిళనాడులో ప్రఖ్యాత చెందిన ఈ గ్రంధాలయం రాజ మహల్ ప్రాంగణంలో సుమారు 1700 సంవత్సరములో స్థాపించబడింది. తాళపత్ర, కాగితంపై వ్రాసిన 30,000 పైగా భారతీయ, యూరోపియన్ భాషలలో చేతిరాత ప్రతులు ఉన్నాయి. దాని చేటిరాత ప్రతులలో ఎనభై శాతానికి పైగా సంస్కృతంలో ఉన్నాయి. వాటిలో చాలా తాళపత్రాలపై ఉన్నాయి. తమిళ రచనలలో వైద్యానికి సంబంధించిన గ్రంథాలు, సంగం సాహిత్యంపై వ్యాఖ్యానాలు ఉన్నాయి. రాజరాజ చోళ చిత్రకళా మందిరం ఇది రాజ మహల్ లోపల ఉంది - ఇది 9వ శతాబ్దం నుండి 12వ శతాబ్దాల నాటి రాతి, కాంస్య చిత్రాల పెద్ద సేకరణను కలిగి ఉంది. గ్యాలరీలో ఉన్న చాలా విగ్రహాలు తంజావూరు జిల్లాలోని వివిధ దేవాలయాల నుండి సేకరించబడ్డాయి.Various 2007, p. 70. శివగంగ ఉద్యానవనం - ఇది బృహదీశ్వర ఆలయానికి తూర్పున ఉంది. రాజ రాజ చోళుడు నిర్మించినట్లు విశ్వసించబడే శివగంగ చెరువును ఇది చుట్టుముట్టింది. దీనిని 1871-72లో తంజోర్ ప్రజల పురపాలక సంఘ పార్కుగా రూపొందించింది.Hemingway 1907, p. 271 It h దీనిలో మొక్కల, జంతువుల, పక్షుల సమాహారముతో కలిగి ఉంది, నగరంలో పిల్లలకు ఇది జూ పార్కుగా పనిచేస్తుంది. ఇవి కూడా చూడండి కరంతై తమిళ సంఘం ప్రసన్న వెంకటేశ పెరుమాళ్ ఆలయం గంగైకొండ చోళపుర ఆలయం బృహదీశ్వరాలయం తిరునల్లార్ ఆలయం మూలాలు బయటి లింకులు తంజావూరు జిల్లా వర్గం:తమిళనాడు
భారతదేశ చరిత్ర
https://te.wikipedia.org/wiki/భారతదేశ_చరిత్ర
300px|right|alt=సా.శ. 1 వ శతాబ్దంనాటి సాంచీలో ప్రవేశద్వారం |border భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం AL Basham (1951), History and Doctrines of the Ajivikas: A Vanished Indian Religion, Motilal Banarsidass, , pages 94–103Sanderson, Alexis (2009), "The Śaiva Age: The Rise and Dominance of Śaivism during the Early Medieval Period". In: Genesis and Development of Tantrism, edited by Shingo Einoo, Tokyo: Institute of Oriental Culture, University of Tokyo, 2009. Institute of Oriental Culture Special Series no. 23, pages 41–43. అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.The Great Partition: The Making of India and Pakistan by Yasmin Khan భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది. సుమారుగా 5,00,000 సంవత్సరాల క్రితం నాటి ప్రారంభ మానవులకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నాయి. దీన్ని "నాగరికతకు ఉయ్యాల"గా భావిస్తున్నారు. దక్షిణ ఆసియాలోని మొదటి అతిపెద్ద నాగరికత అయిన సింధు లోయ నాగరికత 3300 నుండి 1300 వరకు భారత ఉపఖండంలోని ఉత్తర-పశ్చిమ భాగంలో వ్యాప్తి చెందింది.Romila Thapar, A History of India (New York: Penguin Books, 1966) p. 23. క్రీ.పూ 2600 నుండి 1900 వరకు ప్రౌఢ హరప్పా కాలంలో ఆధునిక, సాంకేతిక అధునాతన పట్టణ సంస్కృతి అభివృద్ధి చెందింది.Romila Thapar, A History of India, p. 24. ఈ నాగరికత క్రీ.పూ. రెండవ సహస్రాబ్ధి ప్రారంభంలో పతనమైంది. తరువాత ఇనుప యుగం వేద సంస్కృతి కొనసాగింది. ఈ కాలం హిందూమత పవిత్ర గ్రంథాలైన వేదాల కూర్పును చూసింది. ఇది జనపదాలకు (రాచరిక, రాజ్య-స్థాయి విధానాలు) కులాల ఆధారంగా సామాజిక విభజనకు అనుసంధానించబడింది. తరువాత వేద నాగరికత ఇండో-గంగాటిక్ మైదానానికి వరకు అలాగే భారత ఉపఖండంలో చాలా వరకు విస్తరించింది. అలాగే మహాజనపదాలు అని పిలవబడే ప్రధాన రాజకీయాల పెరుగుదలను చూసింది. ఈ సామ్రాజ్యాలలో ఒకటైన మగధ, గౌతమ బుద్ధుడు, మహావీరుడు క్రీ.పూ. 5 వ, 6 వ శతాబ్దాలలో వారి ధారావాహిక తత్వాలు ప్రచారం చేశారు. క్రీ.పూ 4 వ - 3 వ శతాబ్దాలలో భారతీయ ఉపఖండంలో అధిక భాగాన్ని మౌర్య సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. క్రీ.పూ. 3 వ శతాబ్దం నుండి ఉత్తరాన ప్రాకృత, పాలి సాహిత్యం, దక్షిణ భారతదేశంలో తమిళ సంగం సాహిత్యం వృద్ధి చెందాయి.Researches Into the History and Civilization of the Kirātas by G. P. Singh p. 33A Social History of Early India by Brajadulal Chattopadhyaya p. 259 3 వ శతాబ్దంలో వూట్జ్ స్టీల్ దక్షిణ భారతదేశంలో ఉద్భవించి విదేశాలకు ఎగుమతి చేయబడింది.Technology and Society by Menon, R. V. G. p. 15The Political Economy of Craft Production: Crafting Empire in South India, by Carla M. Sinopoli, p. 201Science in India by B. V. Subbarayappa సాంప్రదాయ కాలములో భారతదేశంలోని వివిధ ప్రాంతాలను తరువాతి 1,500 సంవత్సరముల వరకు అనేక రాజవంశాలు పాలించాయి. వాటిలో గుప్త సామ్రాజ్యం అగ్రస్థానంలో నిలిచింది. ఈ కాలాన్ని హిందూ మతానికి, మేధాసంపత్తి పునరుద్ధరణకు సాక్ష్యంగా చెప్పవచ్చు. దీనిని "భారతదేశం శాస్త్రీయ" లేదా " స్వర్ణ యుగం " అని వర్ణిస్తారు. ఈ కాలంలో భారతీయ నాగరికత, పరిపాలన, సంస్కృతి, మతం (హిందూమతం, బౌద్ధమతం) అంశాలు ఆసియాలో చాలా వరకు వ్యాపించాయి. అయితే దక్షిణ భారతదేశంలోని రాజ్యాలు మధ్యప్రాచ్య, మధ్యధరా ప్రాంతాలతో సముద్ర సంబంధ వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాయి. ఆగ్నేయాసియాలోని పలు ప్రాంతాల్లో భారతీయ సాంస్కృతిక ప్రభావం విస్తరించింది. ఇది ఆగ్నేయ ఆసియాలో (గ్రేటర్ ఇండియా) భారతదేశ రాజ్యాలను స్థాపించడానికి దారితీసింది.The Cambridge History of Southeast Asia: From Early Times to c. 1800, Band 1 by Nicholas Tarling, p. 281Flood, Gavin. Olivelle, Patrick. 2003. The Blackwell Companion to Hinduism. Malden: Blackwell. pp. 273–4. 7 - 11 వ శతాబ్దాల మధ్య కన్నౌజ్ కేంద్రంగా ఉన్న త్రిపాఠి పోరాటం అత్యంత ముఖ్యమైన సంఘటనగా భావించబడుతుంది. ఇది పాల సామ్రాజ్యం, రాష్ట్రకూట సామ్రాజ్యం, గురురా-ప్రతీహరా సామ్రాజ్యం మధ్య రెండు శతాబ్దాల వరకు కొనసాగింది. దక్షిణ భారతదేశం 5 వ శతాబ్దం మధ్యకాలంలో బహుళ సామ్రాజ్య శక్తుల అభివృద్ధిని చూసింది. వీటిలో చాళుక్య, చోళ, పల్లవ, చేరా, పాండ్యన్, పశ్చిమ చాళుక్య సామ్రాజ్యాలు చాలా ముఖ్యమైనవి. 11 వ శతాబ్దంలో చోళ రాజవంశం దక్షిణ భారతదేశాన్ని జయించి విజయవంతంగా ఆగ్నేయ ఆసియా, శ్రీలంక, మాల్దీవులు, బెంగాల్ Ancient Indian History and Civilization by Sailendra Nath Sen p. 281 ప్రాంతాలను ఆక్రమించింది.Societies, Networks, and Transitions, Volume B: From 600 to 1750 by Craig Lockard p.333Power and Plenty: Trade, War, and the World Economy in the Second Millennium by Ronald Findlay, Kevin H. O'Rourke p.67 మధ్యయుగ ప్రారంభకాలం భారతీయ గణితశాస్త్రం అరబ్బు ప్రపంచంలో గణిత, ఖగోళశాస్త్రం అభివృద్ధిని ప్రభావితం చేసి హిందూ సంఖ్యలు ప్రవేశపెట్టబడ్డాయి.Essays on Ancient India by Raj Kumar p.199 క్రీ.శ. 1206 లో మద్య ఆసియా టర్కులు ఢిల్లీ సుల్తానేట్ స్థాపించబడడంతో 13 వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో ముస్లిం పాలన ప్రారంభమైంది.The Princeton Encyclopedia of Islamic Political Thought: page 340 అంతకు పూర్వమే ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్లలో 8 వ శతాబ్దం ప్రారంభంలో ముస్లిం దండయాత్రలు పరిమితమైన చొరబాట్లు సృష్టించాయి.Al Baldiah wal nahaiyah vol: 7 page 141 "Conquest of Makran" 14 వ శతాబ్దం ఆరంభంలో ఢిల్లీ సుల్తానేట్ ఉత్తర భారతంలో ప్రధాన భాగం పాలించినప్పటికీ 14 వ శతాబ్దం చివరిలో అది తిరస్కరించబడింది. ఈ కాలంలో ముఖ్యంగా కాకతీయ, ముసునూరి, విజయనగర, గజపతి, అహోం, అలాగే మేవార్ వంటి అనేక శక్తివంతమైన హిందూ రాజ్యాలు ఆవిర్భావించాయి. విజయనగర సంరక్షణకు పెమ్మసాని, రావెళ్ళ, సూర్యదేవర, వాసిరెడ్డి, సాయపనేని, మేదరమెట్ల తదితర రాజ్యాలు అండగా నిలవటం విజయనగర సామ్రజ్యం దక్షిణ భారతములో కాకతీయ, ముసునూరి తరువాత గొప్ప శక్తిగా ఏర్పడినది. 15 వ శతాబ్దం సిక్కుల ఆగమనాన్ని చూసింది. మొఘలులు భారత ఉపఖండంలో అధిక భాగం స్వాధీనం చేసుకున్న 16 వ శతాబ్దంలో ఆధునిక కాలం ప్రారంభం మొదలైంది. 18 వ శతాబ్దం ప్రారంభంలో మొఘలులు క్రమంగా క్షీణతను ఎదుర్కొన్నారు. దీంతో భారత ఉపఖండంలోని పెద్ద ప్రాంతాలపై నియంత్రణ సాధించేందుకు మరాఠాలు, సిక్కులు, మైసూరియన్లు అవకాశాలను అందించారు.History of Mysore Under Hyder Ali and Tippoo Sultan by Joseph Michaud p. 143 18 వ శతాబ్దం చివరి నుండి 19 వ శతాబ్దం వరకు బ్రిటీష్ సామ్రాజ్యం బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే భారతదేశంలోని పెద్ద ప్రాంతాలు అనుసంధానించబడ్డాయి. కంపెనీ పాలనతో అసంతృప్తి 1857 నాటి భారతీయ తిరుగుబాటుకు దారితీసింది. దాని తరువాత బ్రిటీషు రాజ్యాలు నేరుగా బ్రిటీషు క్రౌన్ ద్వారా నిర్వహించబడ్డాయి. బ్రిటుషు పాలనా కాలం మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక తిరోగమనం, ప్రధాన కరువులు సంభవించడానికి సాక్ష్యంగా నిలిచింది.Metcalf, B.; Metcalf, T. R. (9 October 2006), A Concise History of Modern India (2nd ed.), pp. 94–99.<ref name="historydiscussion">{{cite web|url=http://www.historydiscussion.net/british-india/economic-impact-of-the-british-rule-in-india-indian-history/6317|publisher=historydiscussion.net|title=Economic Impact of the British Rule in India & 20 వ శతాబ్ధం మొదటి అర్ధభాగంలో " భారతీయ జాతీయ కాంగ్రెసు " పార్టీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా భరతీయ స్వాతంత్ర్య పోరాటం కొనసాగింది. 1947 ఆగస్టు 15 న బ్రిటిషు ప్రభుత్వం భరతీయ ఉపఖండాన్ని భారతదేశం, పాకిస్తాన్‌గా విభజించిన తరువాత భరతదేశం బ్రిటిషుప్రభుత్వం నుండి స్వాతంత్రం అందుకుంది. చరిత్ర పూర్వ కాలం (క్రీ.పూ. 3300) రాతి యుగం భారతీయ ఉపఖండంలోని శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 78,000-74,000 సంవత్సరాల పూర్వులవని భావిస్తున్నారు. ఇక్కడ లభించిన ఆధారాలు 5,00,000 సంవత్సరాల నాటి హోమో ఎరెక్టసు వంటి ఆరంభకాల హోమోనిడ్ వని భావిస్తున్నారు. మధ్య భారతదేశంలోని నర్మదా లోయలోని హత్నోరాలోని హోమో ఎరేక్టసు అవశేషాలు కనీసం 5,00,000 - 2,00,000 సంవత్సరాల మధ్యప్రాచ్య పాలిస్టోసీను కాలం నుండి భారతదేశప్రాంతం మానవ నివాసిత ప్రాంతంగా ఉంటుందని సూచిస్తున్నాయి. భారతీయ ఉపఖండంలోని వాయువ్య భాగంలో రెండు మిలియన్ల సంవత్సరాల క్రితం కనుగొనబడిన ప్రోటో-మానవులు రూపొందించిన ఉపకరణాలు కనుగొనబడ్డాయి. ఈ ప్రాంతం పురాతన చరిత్రలో దక్షిణ ఆసియాలోని పురాతన స్థావరాలు, కొన్ని ప్రధాన నాగరికతలు భాగంగా ఉన్నాయి. సోయాను నదీలోయలోని పాలియోలిథికు హోమినిదు ప్రాతం భారత ఉపఖండంలోని తొలి పురావస్తు ప్రదేశాలు, సోనియను పురాతత్వ ప్రాంతాలు భారతదేశం, పాకిస్థాను, నేపాలు దేశాలలో కనిపిస్తాయి.Parth R. Chauhan. Distribution of Acheulian sites in the Siwalik region . An Overview of the Siwalik Acheulian & Reconsidering Its Chronological Relationship with the Soanian – A Theoretical Perspective. భారతీయ ఉపఖండంలో మెసోలిథికు కాలం తరువాత నవీన శిలా యుగం (నియోలిథికు) కాలం మొదలైంది. 12,000 సంవత్సరాల క్రితం చివరి మంచు యుగము ముగిసిన తరువాత భారతీయ ఉపఖండంలో విస్తృతమైన మానవస్థావరాలు ఏర్పడ్డాయి. భారతదేశంలోని ఆధునిక మధ్యప్రదేశం లోని భీమ్‌బేట్కా శిలా గుహలు లో 9,000 సంవత్సరాల క్రితం నాటి మొట్టమొదటి ధ్రువీకరించిన పాక్షికస్థిర స్థావరాలు కనిపించాయి. ఎడక్కల్ గుహలు ఇప్పటికి క్రీ.పూ 6,000 నాటి నవీన శిలా యుగం మానవులకు చెందినవని, కేరళ లోని స్థావరాలు, నాగరికత చరిత్రపూర్వం నాటివని భావిస్తున్నారు. దక్షిణ భారతదేశం ఎడక్కల్ రాతియూం చెక్కడాలు చాలా అరుదైన ఉదాహరణలుగా ఉన్నాయి. నియోలిథిక్ సంస్కృతికి చెందిన జాతిప్రజలు భారతదేశంలోని ఖంబాట్ గల్ఫులో క్రీ.పూ. 7500 నాటి రేడియోకార్బన్ కాలానికి చెందిన ప్రజలతో విలీనం అయ్యారని భావిస్తున్నారు. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, హర్యానాలో, లాహూరాడెవా ప్రాంతాలలో కనుగొన్న (క్రీ.పూ. 7000) భారతదేశంలోని భిర్రానా (క్రీ.పూ. 7570-6200) కనుగొన్న భిరానా పరిశోధనలు, (క్రీ.పూ.3000 ) దిగువ గంగాతక్ లోయలో క్రీ.పూ. 5000 కాలంలో సింధూ లోయ ప్రాంతాలలో నియోలిథిక్ వ్యవసాయ సంస్కృతులు ఏర్పడ్డాయి పాకిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాలలో, దక్షిణ భారతదేశంలో మెహర్గర్ పరిశోధనలు(క్రీ.పూ.7000-5000 BCE) దక్షిణప్రాంతంలో వ్యాపించాయి. తరువాత ఇది క్రీ.పూ. 1800 లో మాల్వాలో ఉత్తరంవైపు వ్యాపించింది. ఈ ప్రాంతం మొదటి పట్టణ నాగరికత సింధు నాగరికతతో ప్రారంభమైంది. పాతరాతి యుగం thumb|250px|right|భింబెట్కా లోని రాతి-రంగుచిత్రాలు. మధ్య భారతదేశము లోని నర్మద నదీ పరివాహ ప్రాంతము లోని హత్నోరా లోని హోమినిని అవశేషాల వల్ల భారతదేశ భూభాగమునందు ప్రాచీన శిలా యుగం నుండే జనావాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అవశేషాల యొక్క సరియైన కాలము తెలియకున్నప్పటికినీ, పురావస్తు శాస్త్రజ్ఞుల ప్రకారం ఇవి కనీసం రెండు నుండి ఏడు లక్షల సంవత్సరాల కాలము నాటి క్రిందవని తెలియుచున్నది. ఈ శిలాజాలు దక్షిణ ఆసియా లోనే లభించిన తొలి మానవ అవశేషాలు. దక్షిణ భారతదేశము లోని కలడ్గి ప్రాంతంలో ఓ క్వారీలో ఇటీవల కొన్ని అవశేషాలు కనుగొన్నారు. వీటిని బట్టి ఆధునిక మానవులు ఈ ప్రాంతంలో సుమారు 12,000 సంవత్సరాల నాటి చివరి మంచు యుగము నుండే ఉన్నట్లు తెలియుచున్నది. మధ్య ప్రదేశ్ లోని భీమ్‌బేట్కా శిలా గుహలు అను ప్రదేశములోని ఆధారాలను అనుసరించి 9,000 సంవత్సరాల క్రితము ఇక్కడ మనుషులు ఉన్నట్లు పూర్తి ఆధారాలతో నిర్ధారణ అవుచున్నది. కొత్తరాతి యుగం దక్షిణాసియా ప్రాంతంలో, కొత్తరాతి యుగపు తొలి సంస్కృతి మెహర్‌గఢ్లో క్రీ.పూ.7000 లో వర్ద్ధిల్లింది. ఈ ప్రదేశం ప్రస్తుతం పాకిస్తాన్‌ లోని బలూచిస్తాన్‌లో ఉంది. మెహర్గఢ్‌ ప్రజలు ముఖ్యంగా పశువుల కాపరులు, మట్టి ఇళ్ళలో నివసించేవారు. బుట్టలు అల్లుతూ, గొర్రెలను పెంచుతూ ఉండేవారు. క్రీ.పూ.5500 నాటికి, వీరు కుండలు చెయ్యడము మొదలు పెట్టినారు. అలాగే రాగి పనిముట్ల వాడకం కూడా మొదలైంది. క్రీ.పూ.2000 నాటికి వీరు అదృశ్యం అయినారు. కంచుయుగం మొదటి నగరీకరణ (క్రీ.పూ.3300 – క్రీ.పూ.1500) సింధూలోయ నాగరికత సింధు లోయ నాగరికత భారత ఉపఖండంలో కాంస్య యుగం క్రీ.పూ. 3300 ప్రారంభంలో సింధు లోయ నాగరికత ప్రారంభమైంది. ఇది సింధూ నది, దాని ఉపనదీ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఘగ్గర్- హర్కా నదీ లోయల వరకు విస్తరించింది. గంగా, యమునా దోయాబ్,Indian Archaeology, A Review. 1958–1959. Excavations at Alamgirpur. Delhi: Archaeol. Surv. India, pp. 51–52. గుజరాతు ఆగ్నేయ ఆఫ్గనిస్తాన్ వరకు విస్తరించింది. మెసొపొటేమియా, ఫారోనిక్ ఈజిప్టులతో పాటు ప్రాచీన ప్రపంచంలో నాగరికత జన్మస్థానంగా ఉన్న 'ప్రాచీన తూర్పు' లో విలసిల్లిన మూడు ప్రాచీన నాగరికతలలో సింధు నాగరికత ఒకటి. ఇది భూభాగవైశాల్యం, జనాభా పరిగణలోకి తీసుకుంటే అత్యంత విస్తృతమైనదిగా భావిస్తున్నారు. ఈ నాగరికత ప్రాధమికంగా ఆధునిక భారతదేశంలో (గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జమ్ము, కాశ్మీర్ రాష్ట్రాలు), పాకిస్తాన్ (సింధ్, పంజాబు, బలూచిస్తాన్ రాష్ట్రాలు) లో ఉంది. చారిత్రాత్మకంగా ప్రాచీన భారతదేశంలో భాగంగా ఇది మెసొపొటేమియా, ప్రాచీన ఈజిప్టులతో పాటు ప్రపంచపు మొట్టమొదటి పట్టణ నాగరికతలలో ఒకటి. పురాతన సింధు నదీ లోయలో నివసించేవారు, హరాప్పన్లు లోహపు పనిముట్లు, హస్తకళ (కర్నేల్ ఉత్పత్తులు, సీల్ బొమ్మలు) లో కొత్త పద్ధతులను అభివృద్ధి చేశారు. రాగి, కాంచు, సీసం, టిన్లను ఉత్పత్తి చేశారు. పరిణతి చెందిన సింధు నాగరికతలో భాగంగా సుమారు క్రీ.పూ. 2600 - 1900 వరకు భారత ఉపఖండంలో పట్టణ నాగరికత ప్రారంభమయింది. ఆధునిక నాగరికతలో పరిణితి చెందిన ధోలావిరా, కాలిబాన్గన్, రోపార్, రాఖిగరి, ఆధునిక భారతదేశంలోని లోతల్, అలాగే హరప్పా, గణేరివాలా, మోహెంజో-దారో వంటి ఆధునిక పాకిస్తాన్లో ఉన్నాయి. ఈ నగరం నాగరికత ఇటుకలు, రహదారులు, నీటిపారుదల వ్యవస్థ, మురుగునీటి కాలువలు, పలు అంతస్థుల ఇళ్ళను నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ నగరాలకు ఒకవైధమైన పురపాలక సంస్థలను కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు.Early India: A Concise History, D.N.Jha, 2004, p.31 మొత్తం 1,022 నగరాలు, స్థావరాలు కనుగొనబడ్డాయి. ముఖ్యంగా సింధు, ఘగ్గర్-హక్ర నదులు, వారి ఉపనదులు; వీటిలో 406 ప్రదేశాలు పాకిస్తాన్లో, భారతదేశంలో 616 సైట్లు, వీటిలో 96 ప్రాంతాలలో తవ్వకాలు జరిగాయి. ఈ నాగరికత చివరి కాలంలో క్రమంగా క్షీణతకు సంకేతాలు కనిపించడం మొదలైంది. సుమారుగా క్రీ.పూ. 1700 నాటికి చాలా నగరాలు వదలివేయబడ్డాయి. ఏదేమైనా సింధు నాగరికత హఠాత్తుగా అదృశ్యమయింది. సింధు నాగరికత కొన్ని అంశాలు ముఖ్యంగా చిన్న గ్రామాలు, పొలాలు ఉన్నాయి. చరిత్రకారుడు ఉపేందర్ సింగ్ ప్రకారం "చివరి హరప్పన్ దశలో సమర్పించబడిన సాధారణ చిత్రం పట్టణ నెట్వర్క్ల విచ్ఛిన్నమై గ్రామీణ ప్రాంతాల విస్తరణ" జరిగిందని భావిస్తున్నారు. డోయాబ్ ప్రాంతంలోని ఓచెర్ రంగు పూసిన మృణ్మయలతో సంబంధం కలిగివున్న ఈ సమయంలో భారతీయ రాగి హోయార్డ్ సంస్కృతి అభివృద్ధి చెందింది. ఆదిమవాసీ ద్రావిడులు ఆర్యులు భారతీయ ఉపఖండానికి వరుసగా వలసలు సాగించడానికి ముందు భారతీయ ఉపఖండం అంతటా ద్రావిడాభాషలను మాట్లాడే ప్రజలు విస్తరించి ఉండేవారని భాషాపరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆరంభకాల సింధూనాగరికత తరచుగా ద్రావిడ నాగరికతగా భావించబడుతుంది. హెంరీ హెరాస్, కమిల్ జ్వెలెబిల్, అస్కొ పర్పొలా, ఇరావతం మహాదేవన్ వంటి పరిశోధకులు ఈ భాషా, నాగరికతల పోలికలు చూసి వీరు సింధూనాగరికతకు చెందిన ప్రోటో ద్రావిడ ఆదిమవాసులు అని భావిస్తున్నారు. భాషాపరిశోధకుడు అస్కొ పార్పోలా వ్రాతలు సిధూ లిపి, హరప్పన్ లిపి అనేకంగా ద్రావిడభాషా కుటుంబానికి చెందినవని తెలియజేస్తున్నాయి. పార్పోలా ఫిన్నిషు బృందానికి నాయకత్వం వహించి కంప్యూటర్ ఉపయోగించి శిలాశాసనాల పరిశోధన సాగించాడు. ప్రోటో ద్రావిడభాషా విధానంలో పలు చిహ్నాలను అధ్యయనం చేసి హెరాస్, నొరొజోవ్ (చేప గుర్తు ద్రావిడ భాషలో చేప (మీన్))అవి ద్రావిడభాషా కుటుంబానికి చెందినవని అంగీకరించినప్పటికీ ఇతర అధ్యయనాలు ఇదుకు వ్యతిరేకంగా ఉన్నాయి.1994 వరకూ పర్పోలా పరిశోధనల సారాంశం " డిసిఫరింగ్ ది ఇండస్ స్క్రిఫ్టు " లో వివరించబడింది. తమిళనాడులో సాగించిన పరిశోధనలు నియోలిథిక్ చివరి భాగం (క్రీ.పూ. 2000 హరప్పన్ నాగరికత పతనం తరువాత)సింధూ నగరికత చిహ్నాలు కలిగిన రాతి ఉపకరణాలు చూసి కొంత మంది ద్రావిడియన్ గుర్తింపును అంగీకరించారు.Subramanium 2006; see also A Note on the Muruku Sign of the Indus Script in light of the Mayiladuthurai Stone Axe Discovery by I. Mahadevan (2006) యూరి నొరొజొవ్ ఈ చిహ్నం లోగోసైలబిక్ లిపిగా ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. కంప్యూటర్ విశ్లేషకులు ఈ అభిప్రాయాన్ని బలపరిచారు. నొరొజొవ్ సలహాలకు హెంరీ హెరాస్ (ద్రావిడ సాంకేతిక లిపి పరిశోధకుడు)పరిశోధనల ఆధారంగా ఉన్నాయి. జె.బ్లొచ్ వంటి కొంతమంది పరిశోధనా విద్యార్ధులు అప్పటికే ఋగ్వేదం రూపుదిద్దుకున్న ద్రావిడ భూభాగాలలో సింధూనాగరికతకు చెందిన ప్రజలు వలసగా వచ్చి చేరారని అభిప్రాయపడ్డారు. బలూచిస్తానుకు చెందిన బ్రహుయి ప్రజలు భాషాసనానతలు ఉన్న ప్రాంతాలకు తీసుకుని రాబడ్డారని ప్రాంతం అంతటా వ్యాపించిన ద్రావిడభాషలను సింధూభాషలు భర్తీ చేసాయని భావిస్తున్నారు. సరస్వతీ, సింధూ నదీ లోయల నాగరికత ఇది ఇటుకలతో కట్టబడిన కట్టడాలకూ, రోడ్లకూ, రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజి పద్ధతికీ, బహుళ అంతస్తుల భవనాలకూ, పేరుగాంచింది. సుమేరియను రికార్డులలో పేర్కొన్న మేలుహ్హా అంటే భారతదేశమే కావచ్చని భావిస్తున్నారు. చరిత్రలో మొట్టమొదటి సారిగా భారతదేశపు ప్రస్తావన వచ్చింది ఇక్కడే. సమకాలీన నాగరికతలైన సుమేరియను, ఈజిప్టు లతో పోలిస్తే ఇది భౌగోళికంగా చాలా పెద్దదీ, చక్కని ప్రణాళీకాబద్దమైనదీ అని భావిస్తున్నారు. ఇక్కడి చాలా వాటికి ఏక ప్రమాణాలు పాటించబడినాయి కనుక (ఉదాహరణకు ఇటుకల కొలత, మొత్తము అన్ని ఒకే మాదిరి ఉన్నాయి) కనుక ఇది ఒకే రాజు పాలలో ఉండవచ్చని భావిస్తున్నారు. మొహెంజో దారో ఈ నాగరికతకు కేంద్రం. దక్షిణాన బొంబాయి వరకూ, ఉత్తరాన ఢిల్లీ వరకూ, పశ్చిమాన ఇరాన్ ఎల్లల వరకూ, ఉత్తరాన హిమాలయాల వరకూ ఈ నాగరికత వ్యాపించింది. హరప్పా, దొలవీర, గన్వేరివాలా, లోథాల్‌, అనునవి ఇక్కడి ముఖ్యమైన కనుగొన్న పట్టాణాలు. సుమారుగా యాబై లక్షల జనాభా వరకూ ఉండి ఉండవచ్చు అని ఓ అభిప్రాయము. ఇప్పటివరకూ 2,500 నగరాలు కనుగొనబడ్డాయి! ముఖ్యముగా లుప్తమైన సరస్వతీ నదీ పరివాహ ప్రదేశమున ఎక్కువగా కనుగొనబడ్డాయి. ఈ సరస్వతీ నది మరణమే ఈ నాగరిత మరణానికి కారణమని చాలా మంది నమ్ముతున్నారు. వైదిక నాగరికత వేదాలతో ముడిపడ్డ ఇండో-ఆర్యన్‌ నాగరికతే వైదిక నాగరికత. వైదిక సంస్కృత భాషలో ఉన్న వేదాలు ఇండో-యూరోపియను రచనలోకెల్లా పురాతనమైనవి. ఈ పుస్తకాల " ఆర్యుల ఆగమన సిద్దాంతము " పై భిన్నాభిప్రాయాలున్నాయి. వైదిక నాగరికులు తొలుత పశువుల కాపరులు. తరువాతి కాలంలో వీరు వ్యవసాయంపై ఆధారపడ్డారు. సమాజం నాలుగు వర్ణాలుగా వర్గీకరించబడింది. అనేక చిన్న చిన్న రాజ్యాలు, జాతులు విలీనమై కొన్ని పెద్ద రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఈ రాజ్యాల మధ్య తరచుగా యుద్ధాలు జరిగేవి. ఆ తరువాత వేదాలను నాలుగు భాగాలుగా విభజించారు. వేదాలతో పాటు రామాయణము, భారతము కూడా ఈ కాలంలోనే వ్రాయబడినాయని చెప్పబడుచున్నది. భగవద్గీత కూడా ఈ కాలములోనే వ్రాయబడింది. కురు వంశం సామ్రాజ్యము వేదిక నాగరికత కాలానికి చెందినదే! ఇదే మహాభారతము లోని పోరాట భూమికను పోషించింది. క్రీ.పూ.7 వ శతాబ్దానికి భారతదేశము చాలా వరకు పట్టణీకరింపబడింది. ఆ కాలం నాటి సారస్వతంలో 16 మహా జనపదాల ప్రస్తావన ఉంది. వేదకాల సమాజం వేదకాల సమాజం చరిత్రకారులు వేద సంస్కృతి పంజాబు ప్రాంతం, ఎగువ గంగా మైదానంలో విలసిల్లిందని వేదాంశాలను ఉదహరిస్తూ విశ్లేషించారు. చాలామంది చరిత్రకారులు కూడా ఈ కాలాన్ని వాయువ్య నుండి భారత ఉపఖండంలోకి ఇండో-ఆర్యన్ వలసలు కొనసాగిన కాలంగా వశ్వసిస్తున్నారు. అధర్వ వేదకాలం నాటికి రావి చెట్టు, ఆవులను పవిత్రం అయినవిగా భావించబడ్డాయి.Singhal, K. C; Gupta, Roshan. The Ancient History of India, Vedic Period: A New Interpretation. Atlantic Publishers and Distributors. . P. 150–151. భారతీయ తత్వశాస్త్రం వేద పూర్వకాలానికి ముందున్న ధర్మం వంటి మూలాలను గుర్తించాయి. భారత ఉపఖండం వాయవ్యభూభాగంలో ౠగ్వేదంలో ఆరంభకాల వేదసమాజం గురించి వర్ణించబడింది. అతి పురాతన వేదసాహిత్యం క్రీ.పూ 2 వ సహస్రాబ్ధానికి చెందినదని భావిస్తున్నారు. ఈ సమయంలో ఆర్య సమాజంలో ఎక్కువగా గిరిజన, మతసంబంధమైన సమూహాలు ఉన్నాయి. హరప్పా పట్టణీకరణకు ఇది విభిన్నమైనది. ప్రారంభ ఇండో-ఆర్యన్ ఉనికి బహుశా ఓచర్ రంగు కుమ్మరి సంస్కృతికి అనుగుణంగా ఉంటుంది పురావస్తుశాస్త్ర వివరణలు తెలియజేస్తున్నాయి.Michael Witzel (1989), Tracing the Vedic dialects in Dialectes dans les litteratures Indo-Aryennes ed. Caillat, Paris, 97–265. ఋగ్వేద కాలం ముగిసిన తరువాత ఆర్యసమాజం భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతం నుండి పశ్చిమ గంగా మైదానానికి విస్తరించడం ప్రారంభించింది. తరువాత ఇది వ్యవసాయసమాజంగా మారి ఈ సమాజం నాలుగు వర్ణాల సాంఘిక వర్గాల సోపానక్రమం కలిగిన సామాజికంగా నిర్వహించబడింది. ఉత్తర భారతదేశ స్థానిక సంస్కృతులతో సాంఘికనిర్మాణం అనుసంధానితమైంది. కానీ చివరికి కొన్ని స్థానిక ప్రజలను వారి వృత్తులను మినహాయించారు.Kulke & Rothermund 2004, pp. 41–43. ఈ కాలంలో మునుపటి చిన్న గిరిజన విభాగాలు, ప్రధానగురువులు జనపదాలలో (రాచరిక, రాష్ట్ర-స్థాయి విధానాలు) కలిసిపోయాయి.క్రీ.పూ. 14 వ శతాబ్దంలో Witzel, Michael (2000). "The Languages of Harappa". In Kenoyer, J.. Proceedings of the conference on the Indus civilization. వేదంలోని ఆర్యన్ గిరిజన సామ్రాజ్యాలతో పురు, భరత గిరిజన రాజ్యాలు వాయవ్య గిరిజన సమూహాలతో మైత్రి చేసుకుని విశ్వామిత్రుని మార్గదర్శకత్వం స్వీకరించాయి. పురు రాజు సుదాసు, భరతగిరిజన సమూహాలతో వేదసమూహాలతో యుద్ధంచేసి విజయం సాధించి కురు సాంరాజ్యస్థాపన చేసారు. ఇది వేదకాలం నాటి మొదటి రాజ్యంగా భావించబడుతుంది.Schmidt, H.P. Notes on Rgveda 7.18.5–10. Indica. Organ of the Heras Institute, Bombay. Vol.17, 1980, 41–47. జనపదాలు సుమారు క్రీ.పూ. 1200 నుండి క్రీ.పూ. 6 వ శతాబ్దం వరకు భారత ఉపఖండంలో రిపబ్లిక్లు, సామ్రాజ్యాలు - ఇనుప యుగం రాజ్యాలుగా భావిస్తున్నారు. జనపదాల పెరుగుదల కారణంగా కురు, పాంచాల, కోసల, విదేహ వంటి ఇనుప యుగం రాజ్యాలు ఏర్పడ్డాయి. వాయువ్య భారతదేశంలో ఇనుపయుగ ఆరంభంలో సుమారు క్రీ.పూ. 1200 - 800 లో వేద కాలం నాటి మొదటి రాజ్య-స్థాయి సమాజంగా కురు సామ్రాజ్యం వెలసింది. ఈ కాలంలోనే అథర్వవేదం కూర్చబడింది. (ఇది మొట్టమొదటి భారతీయ లిఖిత సాహిత్యం). కురు ప్రభుత్వం కాలంలో వేద శ్లోకాల సేకరణ జరిగింది. సాంఘిక క్రమాన్ని సంస్కరిస్తూ సనాతన సంప్రదాయాలను అభివృద్ధి చేసింది. కురు రాజ్యానికి చెందిన ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల రాజు పరిక్షిత్తు, ఆయన వారసుడైన జానమేజయుని పాలనలో ఈ భూభాగం ఉత్తర ఇనుపయుగ భారతదేశంలో ఆధిపత్య రాజకీయ, సాంస్కృతిక శక్తిగా మార్చబడింది. కురు రాజ్యం క్షీణించిన సమయంలో వేద సంస్కృతి కేంద్రం తూర్పు పొరుగున ఉన్న పంచాల రాజ్యంలోకి మారింది. క్రీ.పూ. 1100 నుండి 600 వరకు ఉత్తర భారతదేశంలోని హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో వృద్ధి చెందిన పెయింటెడ్ గ్రే వేర్ సంస్కృతి అభివృద్ధి చెందింది. కురు, పంచాల రాజ్యాలకు అనుగుణంగా ఉన్నాయని విశ్వసిస్తున్నారు. వేద కాలం చివరిలో విదేహరాజ్యం వేద సంస్కృతికి నూతన కేంద్రంగా ఉద్భవించింది. ఇది తూర్పు వైపుకు (భారతదేశంలో నేడు నేపాల్, బీహార్ రాష్ట్రంలో) ఇప్పటికీ ఉంది. జనకరాజు సభ, బ్రాహ్మణ ఋషులు, యజ్ఞవల్క్య, అరునీ, గార్గి వచక్నవి వంటి తత్వవేత్తలకు ప్రాధాన్యం ఇచ్చింది.H. C. Raychaudhuri (1950), Political History of Ancient India and Nepal, Calcutta: University of Calcutta, pp.58 ఈ కాలంలో తరువాతి భాగంలో అభివృద్ధి చెందిన పెద్ద సాంరాజ్యాలు, రాజ్యాలు, ఉత్తరప్రదేశ్ అంతటా మహేజనపదాలు అని పిలువబడ్డాయి. మహాజనపదములు thumb|right|155px|సా.శ. 1వ శతాబ్దం నాటి నిలిచివున్న బుద్ధ విగ్రహము, గాంధారము. క్రీ. పూ. 600నాటికి భారతదేశము లోని గంగా పరీవాహక ప్రదేశములో మరియూ సింధూ పరీవాహక ప్రదేశములలో పదహారు రాజ్యాలు విస్తరించినాయి. వీటిని మహా జనపదాలు అని పిలవడం కద్దు. ఇందులో ముఖ్యమైనవి, కురు, కోసల, మగధ, గాంధార. ఇవి ఎంత ముఖ్యమైనవంటే ఇప్పటికీ చందమామ కథలలో మనము ఈ పేర్లే చూస్తుంటాము! ఉపనిషత్తులు ఈ కాలములోనే వ్రాయబడినాయని ఓ అభిప్రాయము. ఈ కాలములో రాజ భాష సంస్కృతము. సాధారణ జన భాష మాత్రము ప్రాకృతము. గౌతమ బుద్ధుడు ఈ కాలము నాటి వాడే. జైన మతము స్థాపించిన మహా వీరుడు కూడా ఈకాలము వాడే. ఈ రెండు మతాలూ సులభంగా ఉండి ప్రాకృత భాషలో బోధించినాయి, అందువల్ల సామాన్యులు వీటిని ఎక్కువగా ఆదరించారు. జైన మతము భౌగోళికంగా ఎక్కువ వ్యాపించకపోయినప్పటికీ, బౌద్ధ మతము మాత్రము టిబెట్, జపాన్, శ్రీలంక దక్షిణ ఆసియా దేశాలుకు వ్యాపించింది. క్రీ. పూ. 500 సంవత్సరమున ఈ ప్రాంతమును పర్షియన్లు ఆక్రమించారు. వీరు ప్రభువైన డేరియస్ 1 ఇందుకు ఆద్యుడు. పర్షియన్లు తక్షశిలను తమ రాజధానిగా చేసుకున్నప్పటికీ వీరి ప్రభావము నామ మాత్రమే. వీరు 150 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. తరువాత అలెగ్జాండరు వీరిని ఓడించాడు. ద్వితీయ నగరీకరణ (క్రీ.పూ 600 – 200) క్రీ.పూ. 800 నుండి 200 మధ్య కాలములో ఏర్పడిన శ్రమణ ఉద్యమం నుండి జైనమతం, బౌద్ధమతం ప్రారంభం అయ్యాయి. అదే కాలంలో మొదటి ఉపనిషత్తులు వ్రాయబడ్డాయి. "రెండవ పట్టణీకరణ" గా పిలువబడిన క్రీ.పూ. 500 తర్వాత కాలంలో ప్రత్యేకంగా మద్య గంగా మైదానంలో కొత్త పట్టణ స్థావరాలు ఏర్పడ్డాయి. రెండో పట్టణీకరణ పునాదులు క్రీ.పూ 600 కు ముందు ఘాగర్-హక్రా, ఎగువ గంగా మైదానానికి చెందిన పెయింటెడ్ గ్రే వేర్ సంస్కృతిలో ఉన్నాయి. చాలా పి.జి.డబల్యూ. ప్రాంతాలు చిన్న వ్యవసాయ గ్రామాలుగా ఉన్నప్పటికీ "అనేక డజన్ల" పి.జి.డబల్యూ. ప్రాంతాలు చివరకు పట్టణాలుగా గుర్తించదగిన పెద్ద స్థావరాలుగా ఉద్భవించాయి. క్రీ.పూ. 500 తర్వాత ఏర్పడిన కొత్త రాజ్యాలైన "రెండో పట్టణీకరణ" సమయంలో మగధ సామ్రాజ్యం విలసిల్లిన మద్య గంగా మైదానంలో ప్రత్యేక సంస్కృతితో మౌర్యసామ్రాజ్యం పునాది వేయబడింది. ఇది వేద సంస్కృతి చేత ప్రభావితమైంది, కానీ ఇది కురు-పంచల ప్రాంతం నుండి వేరుగా ఉండిపోయింది. ఇది "దక్షిణాసియాలో మొట్టమొదటి వరి సాగు చేసిన ప్రాంతం క్రీ.పూ. 1800 నాటికి చిరోండ్, చెచార్ల ప్రాంతాలతో అనుబంధితమైన ఆధునిక నియోలిథిక్ జనాభాకు ఇది స్థానంగా ఉంది". ఈ ప్రాంతంలో ధారావాహిక ఉద్యమాలు అభివృద్ధి చెంది జైనమతం, బౌద్ధమతం మొదలైంది. ఉపనిషత్తులు, శ్రమణ ఉద్యమాలు క్రీ.పూ. 800 నుండి క్రీ.పూ 400 వరకు ఉపనిషత్తుల కూర్చబడ్డాయి. ఉపనిషత్తులు సాంప్రదాయ హిందూయిజానికి సిద్ధాంతపరమైన ఆధారాన్ని ఏర్పరుస్తాయి. ఇవి వేదసారాలు(వేదాంతాలు) గా పిలువబడతారు. పాత ఉపనిషత్తులు కర్మపై తీవ్ర దాడిచేయడానికి ప్రారంభించారు. బ్రిహదరాన్యకలో ఒక దైవత్వాన్ని పూజించే ఎవరైనా ఉపనిషత్తులోని దేవతల పెంపుడు జంతువు అని చెప్పబడింది. ముండకా వృద్ధాప్య, మరణం ఒక సురక్షితం కాని పడవలో ప్రయాణించే వారిగా పేర్కొనడంద్వారా ఆచారంపై అత్యంత భీకరమైన దాడిని ప్రారంభించింది. క్రీ.పూ. 7 వ - 6 వ శతాబ్దాల్లో భారతదేశంలో అధికరించిన పట్టణీకరణ కొత్త సన్యాసమార్గం రూపుదిద్దుకుంటున్న తరుణంలో శ్రమణ ఉద్యమాల అభివృద్ధికి దారితీసింది. ఇది సనాతన ఆచారాలను సవాలు చేసింది. బౌద్ధమత స్థాపకుడు ఈ ఉద్యమానికి అత్యంత ప్రముఖమైన చిహ్నంగా మహావీరుడు (క్రీ.పూ.549-477), జైనమతం స్థాపకుడుగా, గౌతమ బుద్ధుడు (క్రీస్తుపూర్వం 563-483)బౌద్ధమత స్థాపకుడుగా అవతరించారు. శ్రమణ జనన మరణ చక్రానికి సరికొత్త అర్ధాన్ని చెప్పి సంసార భావన నుండి విమోచన భావన అనే భావనకు దారితీసింది.Flood, Gavin. Olivelle, Patrick. 2003. The Blackwell Companion to Hinduism. Malden: Blackwell. pg. 273–4. "The second half of the first millennium BC was the period that created many of the ideological and institutional elements that characterize later Indian religions. The renouncer tradition played a central role during this formative period of Indian religious history. ... Some of the fundamental values and beliefs that we generally associate with Indian religions in general and Hinduism, in particular, were in part the creation of the renouncer tradition. These include the two pillars of Indian theologies: samsara – the belief that life in this world is one of suffering and subject to repeated deaths and births (rebirth); moksa/nirvana – the goal of human existence....." బుద్ధుడు ఒక మధ్యమార్గాన్ని కనుగొన్నాడు. ఇది ఆధ్యాత్మికంగా తీవ్రమైన సన్యాసిజాన్ని సంతృప్తిపరిచింది.Laumakis, Stephen. An Introduction to Buddhist philosophy. 2008. p. 4 అదే సమయంలో మహావీర (జైనమతంలో 24 వ తీర్థంకరం) జైనమతం ఒక వేదాంతశాస్త్రాన్ని ప్రచారం చేసింది.Mary Pat Fisher (1997) In: Living Religions: An Encyclopedia of the World's Faiths I.B.Tauris : London – Jainism's major teacher is the Mahavira, a contemporary of the Buddha, and who died approximately 526 BC. Page 114 అయినప్పటికీ తీర్ధంకరుల సమయం అందరికీ తెలిసిన దానికంటే ముదుకాలానికి చెందినవని భావిస్తున్నారు. పర్ష్వంత (క్రీ.పూ 872 - క్రీ.పూ. 772) పరిశోధకులు విశ్వసిస్తున్నారు. రిషభనత మొదటి తీర్ధంకరని భావిస్తున్నారు. వేదాలలో వర్ణించిన తీర్ధంకరులు శ్రమణా ఉద్యమానికి చెందిన వారని భావిస్తున్నారు.Mary Pat Fisher (1997) In: Living Religions: An Encyclopedia of the World's Faiths I.B.Tauris : London "The extreme antiquity of Jainism as a non-Vedic, indigenous Indian religion is well documented. Ancient Hindu and Buddhist scriptures refer to Jainism as an existing tradition which began long before Mahavira." Page 115 మహాజనపదాలు క్రీ.పూ. 600 నుండి క్రీ.పూ. 300 లో మహాజనుపాదాల అభివృద్ధి సాగింది. 16 శక్తిమంతమైన, విస్తారమైన రాజ్యాలు, గణతంత్రాలు అభివృద్ధి చెందాయి. ఈ మహాజనపదాలు వాయువ్యంలో గాంధారం నుండి భారత ఉపఖండంలో తూర్పు భాగంలో బెంగాల్ వరకు విస్తరించాయి. ఇందులో ట్రాన్స్-విన్ధ్యాయ ప్రాంతం భాగాలు ఉన్నాయి. అంగుత్తారా నికాయ Anguttara Nikaya I. p 213; IV. pp 252, 256, 261. వంటి పురాతన బౌద్ధ గ్రంథాలలో ఈ పదహారు గొప్ప రాజ్యాలు, గణతంత్రాలు-అంగ, అస్కాకా, అవంతి, చెడి, గాంధార, కషి, కంబోజ, కోసల, కురు, మగధ, మల్లా, మత్స్య (లేదా మచ్చ) , పాంచాల, సురసేన, వెర్జి, వాట్సా ప్రస్తావన ఉంది. ఈ కాలంలో సింధు నాగరికత తర్వాత భారతదేశంలో పట్టణీకరణ రెండవ అతిపెద్ద పెరుగుదల కనిపించింది. left|250px|thumb|ప్రపంచంలో తొలి గణతంత్రంగా పరిగణించబడుతున్న వజ్జి రాజధాని వైశాలి నగరంలో లిచ్చవి వంశస్థులు నిర్మించిన ఆనంద స్తూప. ప్రారంభ "గణతంత్రాలు" (గానా సాంఘా) షాకియస్, కొలియస్, మల్లాస్, లిచ్చవియస్లు గణతంత్ర ప్రభుత్వాలను కలిగి ఉన్నాయి. క్రీ.పూ. 6 వ శతాబ్దం నాటికి వైశాలి నగరంలో కేంద్రీకృతమై ఉన్న వల్జియాన్ గణతంత్రం (వాజ్జి), క్రీ.పూ. 4 వ శతాబ్దం వరకు కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది. మల్లాస్ కౌసింగరా నగరంలో కేంద్రీకరించబడిన Raychaudhuri Hemchandra (1972), Political History of Ancient India, Calcutta: University of Calcutta, p.107 వజ్జి గణతంత్ర రాజ్యాలలో లచ్చావి రాజవంశం అత్యధికంగా ప్రఖ్యాతి గడించింది. ఈ కాలము " నార్తర్న్ బ్లాక్ పాలిషింగ్ వేర్ " సంస్కృతికి సంబంధించి ఉన్నట్లు ఒక పురావస్తు పుస్తకం పేర్కొన్నది. ఈ సంస్కృతి ప్రత్యేకంగా మద్య గంగాస మైదానంలో కేంద్రీకరించి ఉత్తర, మధ్య భారత ఉపఖండంలో ప్రాంతాలలో కూడా విస్తారంగా వ్యాప్తి చెందింది. ఈ సంస్కృతిలో బృహత్తర రక్షణవలయాలతో నిర్మించబడిన భారీ నగరాలు, పెద్ద జనాభా పెరుగుదల, సాంఘిక జీవితం ఆరంభం, విస్తృత వర్తక వాణిజ్య నెట్వర్కులు, ప్రజా కూడళ్ళు, నీటి కాలువలు, ప్రత్యేకమైన కళాఖండాల రూపకల్పన (ఉదా. ఐవరీ, రత్నాల చెక్కడాలు), బరువుల విధానం, పంచ్-మార్క్ నాణేలు, బ్రహ్మి లిపితో వ్రాతలు, ఖరోస్టీ స్క్రిప్ట్స్ రూపంలో వ్రాయడం ప్రవేశపెట్టబడ్డాయి.<ref>J.M. Kenoyer (2006), "Cultures and Societies of the Indus Tradition. In Historical Roots" in the Making of 'the Aryan''', R. Thapar (ed.), pp. 21–49. New Delhi, National Book Trust.</ref>Shaffer, Jim. 1993, "Reurbanization: The eastern Punjab and beyond". In Urban Form and Meaning in South Asia: The Shaping of Cities from Prehistoric to Precolonial Times, ed. H. Spodek and D.M. Srinivasan. ఆ సమయంలో పందితభాషగా సంస్కృతం, ఉత్తర భారతదేశంలోని సాధారణ ప్రజల భాషగా ప్రాకృతం అభివృద్ధి చెందాయి. క్రీ.పూ. 400-500 మద్య గౌతమ బుద్ధుని కాలంలో 16 గణతంత్రాలు వత్స, అవంతి, కోసల, మగధ అనే 4 ప్రధాన రాజ్యాలుగా సంఘటించబడ్డాయి. గౌతమబుద్ధుని జీవితంతో ప్రధానంగా ఈ నాలుగు రాజ్యాలకు సంబంధం ఉంది. thumb|800px|center|సాంచీ లోని శిలా చిత్రం మల్ల దేశీయులు కూశీనగరం రక్షించుట. మల్ల, అంగుత్తుర నికాయ లో పేర్కొన్న 16 మహాజనపదాలలో ఒక పురాతన గణతంత్ర రాజ్యం .Asiatic Mythology by J. Hackin p.83ff మగధ రాజవంశాలు మగధ రాష్ట్రం క్రీ.పూ. 600 దాని రాజధాని రాజ్య గ్రంథం నుండి హారీకా వంశీయులు, వారసుడు షిషునాగ వంశీయులు కింద విస్తరించే ముందు. మగధ రాజుకు చెందిన కింగ్ బింబిసర రాజగిరిలో వెదురున వెదురును సందర్శిస్తుంది; సాంచి నుండి కళాత్మకత. పదహారు మహా-జనపదలలో (ప్రాచీన భారతదేశంలో రాజ్యాలుగ) గంగానగరానికి దక్షిణాన బీహార్ ప్రాంతం; దాని మొదటి రాజధాని రాజగ్రిహ (ఆధునిక రాజగిర్), తరువాత పాలిటిపుత్రా (ఆధునిక పాట్నా) ఉండేవి. బీహారులో అత్యధికభాగాన్ని జయించిన తరువాత లచ్చావి, అంగదేశాలను జయించి బెంగాలు వరకు విస్తరించింది. తరువాత తూర్పు ఉత్తరప్రదేశ్, ఒరిస్సాలో ఎక్కువ భాగం వరకు విస్తరించింది. ప్రాచీన సామ్రాజ్యం మగధ జైన, బౌద్ధ గ్రంథాలలో ఎక్కువగా ప్రస్తావించబడింది. ఇది రామాయణ, మహాభారత, పురాణాలలో కూడా పేర్కొనబడింది. మగధ ప్రజలకు మొట్టమొదటి సూచన అధర్వవేదంలో ఉంది. ఇక్కడ అవి అంగ, గాంధార, ముజావతు రాజ్యాలతో పాటు జాబితాలో ఉన్నట్లు కనుగొన్నారు. మగధ జైనమతం, బౌద్ధమతం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించింది. భారతదేశంలోని రెండు గొప్ప సామ్రాజ్యాలు మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం మగధ నుండి పుట్టాయి. ఈ సామ్రాజ్యాల పాలనాకాలంలో ప్రాచీన భారతదేశ శాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం, ఆధ్యాత్మికత, తత్త్వ శాస్త్రంలో పురోగతి సాధించి ఈ కాలం భారతీయ "స్వర్ణయుగం" గా భావించబడింది. మగధ రాజ్యంలో రాజకుమారా సమాజం వంటి గణతంత్ర సమూహాలు ఉన్నాయి. గ్రామాలు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో స్వంత సభాసమావేశాలు ఉన్నాయి. వారి పాలనా యంత్రాంగం కార్యనిర్వాహక, న్యాయ, సైనిక కార్యకలాపాల వారీగా విభజించబడింది. thumb|left|మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన శిశునాగ వంశపు కాలం నాటి నాణేలు. హిందూ ఇతిహాసం మహాభారతం బృహద్రధుడు మగధ మొదటి పాలకుడు అని తెలియజేస్తుంది. బౌద్ధ పాలి కానన్, జైన ఆగామాస్, హిందూ పురాణశాస్త్రాల నుండి ప్రారంభ మూలాల ఆధారంగా 200 సంవత్సరాల కాలం హర్యాంక రాజవంశం మగధను పాలించినట్లు క్రీ.పూ 600 - 413 వరకు. హర్యంక రాజవంశం రాజు బిబిసారుడు చైతన్యవంతమైన, విస్తారమైన విధానంతో అంగ (ప్రస్తుత తూర్పు బీహారు, పశ్చిమ బెంగాలు ప్రాంతాలు) దేశాన్ని జయించాడు. రాజు బిబిసారుడు తన కుమారుడు రాజకుమారుడు అజాతశత్రు చేత పదవీచ్యుతుడై చంపబడ్డాడు. తరువాత ఆయన మగధ విస్తరణ విధానాన్ని కొనసాగించాడు. ఈ కాలంలో బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు మగధ రాజ్యంలో చాలాకాలం జీవించాడు. అతను బుద్ధ గయాలో జ్ఞానోదయం పొందాడు. సర్నాథ్లో తన మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. రాజ్గ్రహలో మొదటి బౌద్ధ మండలిని నిర్వహించారు. హర్యాంక రాజవంశం శిశునాగ వంశీకులచే పడగొట్టింది. చివరి శిశునాగ పాలకుడు కలోసోకా క్రీ.పూ. క్రీ.పూ 345 లో మహాపాద్మనాందుడిచే హతమార్చబడ్డాడు. మహాపద్మ నందుడు ఆయన ఎనిమిది మంది కుమారులైన నవనందులు అని పిలవబడ్డారు. నందసామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో చాలా భాగం వరకు వ్యాపించింది. పర్షియన్లు, గ్రీకులు క్రీ.పూ 530 లో పర్షియా అకేమెనిడ్ సామ్రాజ్యానికి చెందిన రాజు హిందూకుషు పర్వతాలను దాటి కాంభోజ, గాంధార, ట్రాన్స్-ఇండియా ప్రాంతం (ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్) గిరిజనులను కప్పం ఇవ్వాలని నిర్బంధించాడు. 520 నాటికి పర్షియా మొదటి డారియస్ పాలనా కాలంలో ఉత్తర-పశ్చిమ భారత ఉపఖండం (ప్రస్తుత తూర్పు ఆఫ్ఘనిస్థాన్ పాకిస్థాన్) చాలావరకు పెర్షియన్ అకేమెనిడ్ సామ్రాజ్య ఇది తూర్పు సరిహద్ది ప్రాంతాలలో భాగంగా ఉంది. తరువాత రెండు శతాబ్దాలు ఈ ప్రాంతం పర్షియన్ నియంత్రణలో ఉంది. ఈ సమయంలో గ్రీసు రెండవ పర్షియను దాడి చేయడానికి (క్రీ.పూ. 480-479) భారతదేశం పర్షియను సైన్యానికి కిరాయి సైనికులను సరఫరా చేసింది. పర్షియను పాలనలో పురాతన వేద విశ్వవిద్యాలయం, అకేమెనిడ్ అధ్యనాలు రెండింటినీ కలిపిన కేంద్రంగా మారింది.Romila Thapar, A History of India, p. 59. క్రీ.పూ 327 లో అలెగ్జాండర్ ది గ్రేట్ విజయంతో ఉత్తర పాశ్చాత్య దక్షిణాసియాలో పర్షియను అధిరోహణం ముగిసింది.Carl Roebuck, The World of Ancient Times (Charles Scribner's Sons Publishing: New York, 1966) p. 357. 326 నాటికి అలెగ్జాండర్ ది గ్రేట్ ఆసియా మైనర్, అకేమెనిడ్ సామ్రాజ్యాన్ని జయించి భారత ఉపఖండంలోని వాయువ్య సరిహద్దులకు చేరుకున్నాడు. అక్కడ హైడెస్పెస్ (ప్రస్తుత పాకిస్తాన్ జీలం సమీపప్రాంతం) యుద్ధంలో రాజు పోరస్ను ఓడించి పంజాబులో ఎక్కువ భాగం గెలిచాడు. అలెగ్జాండరు దండయాత్రలో తూర్పు మగధ నందా సామ్రాజ్యం, బెంగాలు గంగారిదిలను ఎదుర్కొన్నాడు. అతని సైన్యాన్ని గంగా నది వద్ద పెద్ద భారతీయ సైన్యం ఎదుర్కొని హైఫాసిస్ (ఆధునిక బీస్ నది) వద్ద తిరుగుబాటు పోరాటం చేసి మరింత తూర్పుకు చొచ్చుకు పోకుండా నిర్భంధించింది. అలెగ్జాండరు తన అధికారి, కోనస్తో సమావేశం తరువాత నందా సామ్రాజ్యబలాన్ని గురించి తెలుసుకుని తిరిగి పోవడం మంచిది అని విశ్వసించాడు. పర్షియన్, గ్రీక్ దండయాత్రలు భారత ఉపఖండంలోని ఉత్తర-పశ్చిమ ప్రాంతాలలో ప్రతిఘటనలు ఎదుర్కొన్నాయి. గాంధారం (ప్రస్తుత తూర్పు ఆఫ్ఘనిస్తాన్, వాయువ్య పాకిస్తాన్ ప్రాంతం) భారతీయ, పర్షియన్, మద్య ఆసియన్, గ్రీకు సంస్కృతుల మిశ్రమంతో గ్రీకో బుద్ధిజం అభివృద్ధి కావడానికి దారితీసింది. గ్రెకో-బౌద్ధమతం, సంస్కృతి 5 వ శతాబ్దం వరకు కొనసాగి మహాయాన బౌద్ధమతం కళాత్మక అభివృద్ధిని ప్రభావితం చేసింది. మౌర్య సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం (క్రీ.పూ. 322-185) భారతదేశాన్ని ఒకేరాజ్యంగా ఏకం చేసిన మొట్టమొదటి సామ్రాజ్యంగా గుర్తించబడుతుంది. ఇది భారత ఉపఖండంలో అతి పెద్దది. మౌర్య సామ్రాజ్యం గొప్ప విస్తరణలో ఉత్తరప్రాంతంలో హిమాలయాల సహజ సరిహద్దుల వరకు, తూర్పు వైపు అస్సాం వరకు వ్యాపించింది. పశ్చిమప్రాంతంలో ఆధునిక పాకిస్తాన్ దాటి ప్రస్తుతం హిందూ కుషు పర్వతాలకు చేరింది. మగధలో (ఆధునిక బీహార్లో) చాణక్య (కౌటిల) సహాయంతో మౌర్యచంద్రగుప్త నంద రాజవంశాన్ని పడగొట్టి మౌర్య సామ్రాజ్యం స్థాపించాడు. చంద్రగుప్తుడి కుమారుడు బిందుసారుడు క్రీ.పూ. 297 లో సింహాసనాన్ని అధిష్టించాడు. క్రీ.పూ 272 ఆయన మరణించే సమయానికి భారత ఉపఖండంలో అధిక భాగం మౌర్య సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఉంది. అయితే కళింగ (ఆధునిక ఒడిషా చుట్టూ) ప్రాంతం మౌర్య నియంత్రణకు వెలుపల ఉంది. బహుశా దక్షిణాన వారి వాణిజ్య ఆధిఖ్యం విస్తరించింది. thumb|left|200px|లోమాస్ సన్యాసుల మౌర్య బొమ్మలు, బరాబర్ గుహలలో ఒకటి క్రీ.పూ. 250 బిందుసారుడి తరువాత ఆయన కుమారుడు అశోకుడు మౌర్య సిహాసనం అధిష్టించాడు. ఆయన మరణం వరకు (సుమారు క్రీ.పూ 232 లో) ఆయన పాలన కొనసాగింది. క్రీస్తుపూర్వం 260 లో కళింగులకు వ్యతిరేకంగా ఆయన పోరాటం విజయవంతం అయినప్పటికీ యుద్ధం అపారమైన నష్టానికి దారితీసింది. ఇది అశోకుడిని పశ్చాత్తాపపడేలా చేసి హింసను అడ్డగించటానికి దారితీసింది. తదనంతరం ఆయనను బౌద్ధమతం ఆలింగనం చేసుకుంది. అతని మరణం తరువాత మౌర్యసామ్రాజ్యం క్షీణించి ఆయన చివరి మౌర్య పాలకుడయ్యాడు. బ్రీహద్రాత మర్యుడిని పుష్యమిత్ర శుంగ హత్యచేసి శుంగ సామ్రాజ్యం స్థాపించాడు. అశోకుడి వ్రాతలు, అర్థశాస్త్రం మౌర్య కాలంలోని ప్రాధమిక లిఖిత పత్రాలు. పురావస్తుశాస్త్రపరంగా ఈ కాలము " నార్తన్ బ్లాక్ పోలిష్డ్ వేర్ " యుగంలో ఉంది. మౌర్య సామ్రాజ్యం సమర్థవంతమైన ఆధునిక ఆర్థిక వ్యవస్థ, సమాజం మీద ఆధారితంగా ఉంది. అయినప్పటికీ వాణిజ్య విక్రయాలను ప్రభుత్వం కనుసన్నలలో జరిగేలా నియంత్రించింది. మౌర్య సమాజంలో ఎటువంటి బ్యాంకింగు వ్యవస్థ లేనప్పటికీ వడ్డీ విధానం ఆచరించబడింది. బానిసత్వం పై వ్రాసిన రచనలు గణనీయమైన సంఖ్యలో కనుగొనబడడం బానిసత్వం ప్రాబల్యాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో దక్షిణభారతంలో వూట్జ్ ఉక్కు అనే ఒక అధిక నాణ్యత కలిగిన ఉక్కును అభివృద్ధి చేశారు. తర్వాత ఇది చైనా, అరేబియాకు ఎగుమతి చేయబడింది. సంగకాలం క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దం నుండి 4 వ శతాబ్దం వరకు సంగం కాలములో తమిళ సాహిత్యం అభివృద్ధి చెందింది. ఈ కాలంలో మూడు తమిళ వంశాలు కలసి తమిళం మూడు తమిళ సింహాసనాలుగా పిలవబడ్డాయి: చేరా వంశీయులు, చోళ రాజవంశం, పాండ్య రాజవంశం దక్షిణ భారతదేశ భాగాలను పాలించారు. ఈ కాలం నాటి తమిళ ప్రజల చరిత్ర, రాజకీయాలు, యుద్ధాలు, సంస్కృతితో సంఘం సాహిత్యంలో భాగం అయ్యాయి.Essays on Indian Renaissance by Raj Kumar p.260 ప్రధానంగా సాధారణ ప్రజలు నుండి వచ్చిన సంగం కాలపు పండితులు తమిళ రాజుల పోషణలో రచనలు సాగిస్తూ సాధారణ ప్రజలగురించి రచనలు సాగించారు.The First Spring: The Golden Age of India by Abraham Eraly p.655 ఎక్కువగా బ్రాహ్మణులయిన సంస్కృత రచయితలు కాకుండా, సంగం రచయితలలో విభిన్న వర్గాల నుండి, సాంఘిక నేపథ్యాల నుండి వచ్చినవారు, ఎక్కువగా బ్రాహ్మణులు కాని వారు ఉన్నారు. వారు రైతులు, కళాకారులు, వర్తకులు, సన్యాసులు, పూజారులు, ప్రసంగాలు వంటి వేర్వేరు విశ్వాసాలకు, వృత్తులకు చెందినవారు, వీరిలో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. క్రీ.పూ. 300 - క్రీ.పూ. 200 " పత్తుపాట్టు " సంఘం సాహిత్యంలో భాగంగా పరిగణించబడే పది మధ్య-పొడవు కలిగిన పుస్తక సంపుటి; కవితా రచన " ఎట్టూతోగీ " ఎనిమిది సంకలనాల కూర్పు, అలాగే పద్దెనిమిది చిన్న కవిత్వ రచనలు పదునెంగిల్ కణక్కు అర్థం; అయితే తమిళ భాషలోని తొలి గ్రామీణ రచన అయిన తోల్పాప్పియం అభివృద్ధి చేయబడ్డాయి.* Zvelebil, Kamil. 1973. The smile of Murugan on Tamil literature of South India. Leiden: Brill. - Zvelebil dates the Ur-Tholkappiyam to the 1st or 2nd century BCE సంగం కాలంలో తమిళ సాహిత్యంలోని ఐదు గొప్ప ఇతిహాసాలలో రెండు రచింపబడ్డాయి. ఇళంగో ఆడిగల్ వ్రాసిన సిలప్పదికారం ఒకటి. ఇది మత ఆధారిత రచన కానప్పటికీ ఇది ఇతిహాస స్థాయి గౌరవాన్ని అందుకున్నది. అన్యాయతీర్పును ఎదుర్కొని తన భర్తను కోల్పోయిన కణ్ణకి పాండియన్ రాజవంశం సభలో తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి వాదాడి నిరూపించి రాజవంశాన్ని రాజధాని నగరాన్ని మంటలకు ఆహితి చేసిన కథ ఆధారితంగా ఇది రచించబడింది. సిలప్పదికారం రచనకు తరుతాతి భాగంగా సైతలై సత్తానర్ కోవలన్, మాధవి కుమార్తె బౌద్ధభిక్షుకి అయిన మణిమేఖలై కథను రచించాడు.Mukherjee 1999, p. 277Manimekalai - English transliteration of Tamil original సంప్రదాయ కాలం నుండి మధ్యయుగ కాలం (క్రీ.పూ.200 – క్రీ.పూ. 1200) క్రీ.పూ. 3 వ శతాబ్దంలో ప్రారంభమైన మౌర్య సామ్రాజ్యం క్రీ.పూ. 6 వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యం ఆరంభం ముగింపు మధ్యకాలం భారతదేశం "క్లాసికల్" కాలంగా సూచించబడింది. కాలవ్యవధిని బట్టి వివిధ ఉప-కాలాలుగా విభజించబడవచ్చు. సాంప్రదాయిక కాలం ముగింపులో మౌర్య సామ్రాజ్యం క్షీణత ప్రారంభమై శుంగ రాజవంశం, శాతవాహన రాజవంశం అభివృద్ధి మొదలైంది. గుప్త సామ్రాజ్యం (4 వ -6 వ శతాబ్దం) హిందూ మతం "స్వర్ణయుగం" గా పరిగణించబడుతుంది. అయితే ఈ శతాబ్దాల్లో ఉత్తరభారతదేశంలో సామ్రాజ్యాలు పాలనకొనసాగుతున్న కాలంలో క్రీ.పూ.3 వ శతాబ్దం నుండి సా.శ. 3 వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశంలో సంగం సాహిత్యం అభివృద్ధి చెందింది. ఈ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉన్నట్లు అంచనా వేయబడింది. ప్రపంచ సా.శ. 1 నుండి 1000 వరకు భారతీయ సంపద ప్రపంచ సంపదలో మూడింట ఒక వంతుల మధ్య ఉంటుంది. ఆరంభకాల సంప్రదాయ కాలం (క్రీ.పూ 200 – క్రీ.పూ 320 ) శుంగ సామ్రాజ్యం శుంగ సామ్రాజ్యం 187 నుండి 78 మధ్య తూర్పు భారతీయ ఉపఖండంలోని మగధ, నియంత్రిత ప్రాంతాల నుండి శుంగప్రభుత్వ పాలన ఉద్భవించింది. చివరి మౌర్య చక్రవర్తి పదవీచ్యుతుడిని చేసి పుష్యమిత్ర శుంగాతో ఈ రాజవంశం స్థాపించబడింది. ముదుగా రాజధాని పతలిపుత్ర నుండి పాలన సాగినప్పటికీ తరువాత భాగాభద్ర వంటి చక్రవర్తులు విదిష (తూర్పు మాల్వాలోని ఆధునిక బెస్నగర్) కూడా రాజసభ నిర్వహించబడింది. పుష్యమిత్ర శుంగా 36 సంవత్సరాల పాటు పాలించిన తరువాత ఆయన కుమారుడు అగ్నీమిత్ర రాజ్యపాలన చేసాడు. శుంగా పాలకులు పదిమంది ఉన్నారు. అయినప్పటికీ అగ్నిమిత్ర మరణం తరువాత సామ్రాజ్యం వేగంగా విచ్ఛిన్నమైంది;K.A. Nilkantha Shastri (1970), A Comprehensive History of India: Volume 2, p.108: "Soon after Agnimitra there was no 'Sunga empire'". శుంగ సామ్రాజ్యం బలహీనమైన తరువాత ఉత్తర, మధ్య భారతదేశంలో చాలా వరకు చిన్న రాజ్యాలు, నగర-రాజ్యాలుగా శుంగ ఆధిపత్యం నుండి స్వతంత్రంగా ఉండేవని శాసనాలు నాణేలు సూచిస్తున్నాయి.Bhandare, Shailendra. "Numismatics and History: The Maurya-Gupta Interlude in the Gangetic Plain" in Between the Empires: Society in India, 300 to 400 ed. Patrick Olivelle (2006), p.96 శుంగ సామ్రాజ్యం విదేశీ, స్వదేశీ శక్తులతో సాగించిన అనేక యుద్ధాలు ఈ సామ్రాజ్యం గుర్తింపు పొందింది. వారు కళింగను పాలించిన మహామేఘవాహన రాజవంశం, దక్కను పీఠభూమిని పాలించిన శాతవాహన రాజవంశంతో, ఇండో గ్రీకులు, మధుర పాలకులు పాంచాల పాలకులతో, మిత్రా రాజవంశంతో పోరాడారు. ఈ సమయంలో కళ, విద్య, తత్వశాస్త్రం, ఇతర టెర్రకోట చిత్రాలు, పెద్ద రాతి శిల్పాలు, భర్‌హుత్ స్తూపం, సాంచి వద్ద ఉన్న ప్రఖ్యాత గ్రేట్ స్తూపం వంటి ఇతర రకాల స్మారక నిర్మాణాలు అభివృద్ధి చెందాయి. శంగ పాలకులు కళలకు, విద్యాభ్యాసానికి పోషకులుగా ఉండి సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సామ్రాజ్యం ఉపయోగించిన బ్రాహ్మి లిపి వైవిధ్యమైనదిగా ఉండి సంస్కృత భాష అక్షరబద్ధం చేయడానికి ఉపయోగించబడింది. హిందూ చింతనలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. ఆ సమయంలో శుంగ సామ్రాజ్యం భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది ఈ సామ్రాజ్యం అభివృద్ధి చెందడానికి, అధికారాన్ని సంపాదించడానికి దోహదపడింది. శాతవాహన సామ్రాజ్యం శాతవాహన సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నుండి పాలన సాగించారు. పూనా, పూతిన్ (పైథాన్)లు శాతవాహనుల పాలనా కేంద్రాలుగా ఉన్నాయి. సామ్రాజ్యం భూభాగం క్రీ.పూ. 1 వ శతాబ్దం నుండి భారతదేశం పెద్ద భాగాలను స్వాధీనం చేసుకుని పాలించింది. శాతవాహనులు ముందుగా మౌర్యవంశీయులకు సామంతులుగా ఉంటూ మౌర్యసాంరాజ్య పతనం తరువాత స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. శాతవాహనులు హిందూమతం, బౌద్ధమతం ప్రాచుర్యానికి ప్రసిద్ధి చెందారు. ఇది ఎల్లోరా (యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం) నుండి అమరావతి వరకు బౌద్ధ స్మారక చిహ్నాలు అభివృద్ధి చేయడానికి దారితీసింది. పాలకుల చిత్రాలు చిత్రించబడిన నాణేలు జారీ చేసిన మొట్టమొదటి భారతీయ రాజ్యంగా ఇది గుర్తించబడింది. వారు ఒక సాంస్కృతిక వంతెనను ఏర్పరుచుకుని, వాణిజ్యంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఇండో-గంగా మైదానం నుండి భారతదేశం దక్షిణ కొన వరకు చింతనలు, సంస్కృతుల విస్తరణకు కారణమయ్యారు. వారు శుంగ సామ్రాజ్యంతో పోటీపడ్డారు. తరువాత మగధ కణ రాజవంశం పాలనను స్థాపించబడింది. తరువాత సాకాలు, యవనలు, పల్లవుల వంటి విదేశీ ఆక్రమణదారుల నుండి భారతదేశం లోని అతిపెద్ద భూభాగాన్నింరక్షించడంలో ముఖ్యపాత్ర పోషించారు. పెద్ద భాగాన్ని రక్షించడానికి వారు కీలక పాత్ర పోషించాప్రత్యేకించి పాశ్చాత్య క్షాత్రపాలతో వారి పోరాటాలు సుదీర్ఘకాలం కొనసాగాయి. శాతవాహన రాజవంశ చక్రవర్తి పాలకులలో గౌతమీపుత్ర శాతకర్ణి, శ్రీ యజ్ఞ శాతకర్ణి పాశ్చాత్య క్షత్రాలు వంటి విదేశీ ఆక్రమణదారులను ఓడించి వారి విస్తరణను నిలిపివేశారు. క్రీ.పూ. 3 వ శతాబ్దంలో సామ్రాజ్యం చిన్న రాష్ట్రాలుగా విభజించబడింది. వాయవ్య రాజ్యాలు, హైబ్రీడు సంస్కౄతులు భారతీయ ఉపఖండంలోని వాయువ్య రాజ్యాలు, హైబ్రిడ్ సంస్కృతులలో ఇండో-గ్రీకులు, ఇండో-సిథియన్లు, ఇండో-పార్థియన్లు, ఇండో-సస్సినిదులు ఉన్నారు. ఇండో-గ్రీకులు:-వీరు అనేక ఇండో-గ్రీక్ రాజ్యాల అంతటా వ్యాపించిన సంకరజాతి సంస్కృతి జాతికి చెందిన ప్రజలు. సుమారు రెండు శతాబ్దాలపాటు కొనసాగిన ఈ రాజ్యాలను 30 కంటే ఎక్కువ ఇండో-గ్రీకు రాజుల వారసులు పాలించారు. వారు తరచూ ఒకరితో ఒకరు కలహించుకున్నారు. గాంధారం నుండి హిందూ కుషు పర్వతాల మీదుగా గ్రీకో-బాక్టీరియన్లను నడిపించి విజయం సాధించి తరువాత కొంతకాలం రాజుగా మారిన మొదటి మెనాండరు పాలనలో (క్రీ.పూ. 155-130 పాలించినవారు) ఇండో-గ్రీకులు శిఖరాగ్రం చేరుకున్నారు. ఆధునిక భూభాగంలో ఆయన ప్రాంతాలను ఆధునిక ఆఫ్ఘన్ స్థానంలోని పంజాషీర్, కపిసాల వరకు విస్తరించి తరువాత భారత ఉపఖండంలోని పంజాబు ప్రాంతం వరకు విస్తరించాడు. ఆయన సామ్రాజ్యంలో అనేక దక్షిణ, తూర్పు సామంతరాజ్యాలు ఉన్నాయి. మొదటి మెనాండరు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇది బౌద్ధమత గ్రంథం మిలిన్దా పన్హాలో వివరించబడింది. అతని మార్పిడి తరువాత అతను బౌద్ధమత ప్రముఖ పోషకునిగా గుర్తింపు పొందాడు.Hinüber (2000), pp. 83-86, para. 173-179. క్రీ.పూ 2 వ శతాబ్దం మధ్యకాలం నుండి క్రీస్తు పూర్వం 1 వ శతాబ్దం మద్య కాలంలో సకాలు (సిధియన్లు) దక్షిణ సైబీరియా నుండి పాకిస్తాన్, అరచోసియాకు నుండి వలస వచ్చారు. తరువాత వారు ఇండో-గ్రీకులను స్థానభ్రంశం చేసి గాంధారా నుండి మధుర వరకు విస్తరించి ఉన్న రాజ్యాన్ని పాలించారు. శాతవాహన రాజవంశం దక్షిణ భారత చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి సిథియన్ పాశ్చాత్య సత్రాపులను ఓడించిన తరువాత క్రీ.పూ 2 వ శతాబ్ధంలో సాకాల పతనం ప్రారంభం అయింది.World history from early times to AD 2000 by B .V. Rao: p.97 4 వ శతాబ్దంలో తూర్పు భారతదేశానికి చెందిన గుప్త సామ్రాజ్యం చక్రవర్తి రెండవ చంద్రగుప్త సాకా సామ్రాజ్యం పూర్తిగా నాశనం చేసాడు.Ancient India by Ramesh Chandra Majumdar p. 234 ఇండో-పార్థియన్లను గోండోఫరిడ్ వంశీయులచే పాలించారు. దీనికి మొదటి పాలకుడు గోండోపెర్స్ పేరు పెట్టారు. వారు ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, వాయువ్య భారత దేశాలను దాదాపు సా.శ. మొదటి శతాబ్ధం వరకు పాలించారు. ప్రముఖ గోండోఫరిడ్ రాజులు వారి చరిత్రలో ఎక్కువ భాగం తక్షశిలను (ప్రస్తుతం పాకిస్థాన్ లోని పంజాబు రాష్ట్రంలో ఉంది) నివాసంగా చేసుకుని అక్కడ నుండి పాలన సాగించారు. అయితే వారి ఆఖరి కొన్ని సంవత్సరాలలో రాజధాని కాబూలు, పెషావర్ మధ్య మార్చబడింది. ఈ రాజులు సాంప్రదాయకంగా ఇండో-పార్థియన్లుగా పేర్కొనబడ్డారు. అరాసిదు రాజవంశం ప్రభావితం వారి నాణాలను ప్రభావితం చేసినప్పటికీ వారు అధికంగా పార్థియాకు తూర్పుగా నివసిస్తున్న ఇరానిక్ తెగలకు సమూహాలకు చెందినవారై ఉన్నారు. రాజులందరూ గొండోఫరు బిరుదుతో పాలించ లేదు. ఇండో-పార్థియన్లు బౌద్ధ మఠం తఖ్త్-ఇ-బాహి నిర్మాణం కొరకు ప్రసిద్ది చెందారు. ఇండో-సస్సనిదులకు పర్షియా సస్సనిద్ సామ్రాజ్యం మూలంగా ఉంది. ఇది గుప్త సామ్రాజ్యానికి సమకాలీనంగా భారతీయ సంస్కృతి, ఇరాన్ సంస్కృతి కలయిక ఒక హైబ్రీడు సంస్కృతికి (ఇండో-ససానిదు సంస్కృతి) జన్మనిచ్చిన ప్రస్తుత బలూచిస్తాన్, పాకిస్థాన్ ప్రాంతం వరకు విస్తరించింది. భారతదేశ వాణిజ్యం, పర్యాటకం కేరళలో సుగంధ వాణిజ్యం ప్రంపంచం అంతటి నుండి వ్యాపారులను భారతదేశానికి ఆకర్షించింది. క్రీ.పూ. ప్రారంభ రచనలు, నియోలిథిక్ యుగం రాతి యుగం చెక్కడాలు, సుమేరియన్ రికార్డుల ఆధారంగా భారతదేశంలోని నైరుతి తీరప్రాంత కేరళలోని ముజిరిస్ నౌకాశ్రయం క్రీ.పూ. 3000 నుండి మసాలాదినుసుల ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్నదని విశ్వసించబడుతుంది. క్రీ.పూ. 562 లో కేరళలోని కొచ్చిప్రాంతానికి యూదయ యూదువర్తకులు వచ్చారు. సా.శ. 70 లో రెండవ ఆలయం నాశనమైన తరువాత బహిష్కరణకు గురైన యూదు వర్తకులు అధిక సంఖ్యలో కేరళాకు చేరుకున్నారు. కేరళా భారతదేశ మసాలా దినుసుల తోటగా వర్ణించబడింది. క్రిస్టోఫర్ కొలంబసు, వాస్కోడిగామా వంటి వర్తకులు, ఎగుమతి దారులకు ఇది చేరవలసిన గమ్యంగా భావించబడింది.Donkin 2003: 69 థామస్ ది అపోస్టిల్ క్రీ.పూ 1 వ శతాబ్దంలో నౌకామార్గంలో భారతదేశానికి చేరుకున్నాడు. అతను భారతదేశంలోని కేరళలో ముజిరిస్లో అడుగుపెట్టాడు. యెజ్ (సెవెన్) అరా (సగం) పల్లిగల్ (చర్చిలు) (సెవెన్ అండు హాఫ్ చర్చీలను స్థాపించాడు. 1 వ లేదా 2 వ శతాబ్దంలో బౌద్ధమతం సిల్క్ రోడ్ ట్రాన్స్మిషన్ ద్వారా చైనాలోకి ప్రవేశించింది. సంస్కృతుల మిశ్రమం అనేక మంది చైనా ప్రయాణికులు, సన్యాసులు భారతదేశంలోకి ప్రవేశించేందుకు దారితీసింది. అత్యంత ప్రముఖమైనవి ఫాక్సియన్, యిజింగ్, సాంగ్ యున్, జువాన్జాంగ్. ఈ పర్యాటకులు భారత ఉపఖండంలోని వివరణాత్మక సమాచారం వ్రాశారు. వారి వ్రాతలలో ఈ ప్రాంతం రాజకీయ, సామాజిక అంశాలు ఉన్నాయి.(Original from the University of Michigan) ఆగ్నేయ ఆసియా హిందూ, బౌద్ధ మతాచార సంస్థలు ఆర్ధిక కార్యకలాపాలు, వాణిజ్యంతో అనుబంధం కలిగివున్నాయి. తరువాత పోర్చుగల్ పెద్ద నిధులను అప్పగించటంతో ఎస్టేట్ నిర్వహణ, హస్తకళ, వాణిజ్య కార్యక్రమాల ద్వారా స్థానిక ఆర్ధికవ్యవస్థకు లబ్ది చేకూరింది. ముఖ్యంగా బౌద్ధమతం నావికాదళ వాణిజ్యంతో, నాణేలు, కళ, అక్షరాస్యతలను ప్రోత్సహించింది.Donkin 2003: 63 మసాలా వ్యాపారంలో పాల్గొన్న భారతీయ వ్యాపారులు భారతదేశ వంటకాలు ఆగ్నేయాసియాకు తీసుకువెళ్ళారు. అక్కడ స్థానిక నివాసితులలో మసాలా మిశ్రమాలు, కూరలు బాగా ప్రాచుర్యం పొందాయి.Collingham245: 2006 గ్రీకో-రోమన్ ప్రపంచం మసాలాదినుసులు, సుగంధద్రవ్యాల వ్యాపారమార్గాన్ని రోమన్-ఇండియా అనుసరించడం మొదలైంది.Fage 1975: 164 పోసిడోనియస్ వ్రాతల ఆధారంగా క్రీ.పూ 2 వ శతాబ్దంలో గ్రీకు, భారతీయ నౌకలు అడెన్ పోర్టులలో (గ్రీకులచే యూడేమోన్ అని పిలువబడేవి)వాణిజ్యం కొరకు కలుసుకునేవని భావిస్తున్నారు.Greatest emporium in the world, CSI, UNESCO. తరువాత స్ట్రాబో రచన " జియాగ్రఫీ " లో దీని ప్రస్తావన చోటుచేసుకుంది.Strabo's Geography2 – Book II Chapter 3, LacusCurtius. క్రీ.పూ. 118 లేదా 116 లో " మాన్‌సూన్ విండ్ సిస్టం " హిందూ మహాసముద్రంలో పయనించింది. మాన్‌సూన్ విండ్ సిస్టంను సిజికాస్ యుడోక్సస్ నడపాడు. భారతదేశానికి చెందిన నౌకాదిగ్గజ నావికుడు పోసీడోనియస్ నౌకాప్రమాదంలో చిక్కుకుని ఎర్ర సముద్రంలో కాపాడబడి అలెగ్జాండ్రియాలోని 8 వ టోలెమికి చేరుకున్నట్లుగా చెప్పాడు. స్ట్రాబో " జియాగ్రఫీ " లో వ్రాయబడిన సముద్రప్రమాదం నుండి బ్రకిబయట పడిన ఈ కథనం ఒక మూలంగా ఉంది. ఆధునిక పరిశోధకులలో ఈ కథనం సందేహాస్పదంగా ఉంది. ఇంకొక గ్రీకు నావికుడు అయిన హిప్పాలస్, కొన్నిసార్లు భారతదేశంకు రుతుపవనాల ఆధారిత మార్గాన్ని కనుగొన్న ఘనత సాధించాడు. అతను కొన్నిసార్లు యుడోక్సస్ దండయాత్రలలో భాగంగా ఉన్నాడని ఊహిస్తున్నారు.For more on the establishment of direct sailing routes from Egypt to India, ancient knowledge of the monsoon winds, and details about Eudoxus and Hippalus, see: మొదటి సహస్రాబ్ది కాలంలో భారతీయులకు సముద్ర మార్గాలను భారతీయులు, ఇథియోపియన్లు నియంత్రించారు. ఇది సముద్రపు వాణిజ్య వర్తక శక్తిగా మారింది. కుషాన్ సామ్రాజ్యం కుషాణు సామ్రాజ్యం కుషాన్ సామ్రాజ్యం మొదటి చక్రవర్తి కుజుల కద్ఫేసేస్ నాయకత్వంలో భారత ఉపఖండంలోని వాయువ్యంలో ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించింది. కుషాన్లు బహుశా టోచారియన్ మాట్లాడే తెగకు చెందినవారని భావిస్తున్నారు. యూజి సమాఖ్యలోని ఐదు శాఖలలో ఇది ఒకటి. అతని మనవడు కనిష్క మహారాజు పాలనలో సామ్రాజ్యం ఆఫ్ఘనిస్తానులో చాలా భాగం వరకు విస్తరించింది.http://www.kushan.org/general/other/part1.htm and Si-Yu-Ki, Buddhist Records of the Western World, (Tr. Samuel Beal: Travels of Fa-Hian, The Mission of Sung-Yun and Hwei-S?ng, Books 1–5), Kegan Paul, Trench, Trubner & Co. Ltd. London. 1906 and Hill (2009), pp. 29, 318–350 తరువాత ఇది భారత ఉపఖండంలోని ఉత్తర భాగాలైన వారణాసి (బనారస్) సమీపంలోని సాకేత, సారనాథ్ వరకు విస్తరించింది.which began about 127 CE. "Falk 2001, pp. 121–136", Falk (2001), pp. 121–136, Falk, Harry (2004), pp. 167–176 and Hill (2009), pp. 29, 33, 368–371. చక్రవర్తి కనిష్కుడు బుద్ధిజాన్ని అత్యధికంగా పోషించాడు. అయితే కుషాన్లు దక్షిణానికి విస్తరించడంతో వారి తరువాత నాణేలలో చోటు చేసుకున్న దేవతలు చిత్రాలు నూతన హిందూ ఆధుఖ్యాన్ని ప్రతిబింబించాయి. వారు భారతదేశంలో బౌద్ధమతం స్థాపించడంలో అది మధ్య ఆసియా, చైనా లకు విస్తరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. చరిత్రకారుడు విన్సెంట్ స్మిత్ ఖానీకా గురించి మాట్లాడుతూ: ఈ సామ్రాజ్యం సిల్క్ రోడ్ వాణిజ్యాన్ని సింధూ లోయ ద్వారా హిందూ మహాసముద్ర సముద్ర వాణిజ్యంతో అనుసంధానించింది. చైనా, రోమ్ల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించింది. కుషాన్ పాలనలో శిఖరాగ్రానికి చేరుకుని వికసించిన గాంధార కళ, మధుర కళలకు సరికొత్త పోకడలు తీసుకుని రాబడ్డాయి. హెచ్.జి. రౌలిసన్ వ్యాఖ్యానించారు: 3 వ శతాబ్దం నాటికి భారతదేశంలో కుషాణుల సామ్రాజ్యానికి విఘాతం కలిగింది. మొదటి వాసుదేవ కుషాణుల చివరి చక్రవర్తి అయ్యాడు.Si-Yu-Ki, Buddhist Records of the Western World, (Tr. Samuel Beal: Travels of Fa-Hian, The Mission of Sung-Yun and Hwei-S?ng, Books 1–5), Kegan Paul, Trench, Trubner & Co. Ltd. London. 1906 సంప్రదాయ కాలం (క్రీ.పూ 320 – క్రీ.పూ 650) గుప్త సామ్రాజ్యం - స్వర్ణయుగం గుప్తుల కాలం - స్వర్ణయుగం భారత ఉపఖండం చాలావరకు గుప్త సామ్రాజ్యం (సా.శ.320-550) ఆధ్వర్యంలో సమైఖ్యం చేయబడిన కాలం " క్లాసికల్ ఇండియా " గా పేర్కొనబడింది. ఈ కాలం భారతదేశ స్వర్ణయుగం అని పిలువబడింది; సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు, కళ, మాండలికం, సాహిత్యం, తర్కశాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం, మతం, తత్వశాస్త్రం (హిందూ సంస్కృతి మూలాలతో) విస్తృతంగా విజయాలు సాధించాయి. హిందూ-అరబిక్ సంఖ్యా వ్యవస్థ, పొజిషనల్ న్యూమరల్ సిస్టం, భారతదేశంలో ఉద్భవించాయి. తర్వాత అరబ్బుల ద్వారా పశ్చిమదేశాలకు బదిలీ చేయబడింది. 600 నుండి 800 ల మధ్యకాలంలో సంఖ్యావిధానంలో సున్నా అభివృద్ధి చేయబడే వరకు పురాతన హిందూ సంఖ్యావిధానంలో కేవలం తొమ్మిది చిహ్నాలు ఉన్నాయి. గుప్తులు నాయకత్వంలో సృష్టించబడిన శాంతి, శ్రేయస్సు భారతదేశంలో శాస్త్రీయ, కళాత్మకతను ఉద్దీపింపజేసాయి. అనుసరించింది. అద్భుతమైన వాస్తు శిల్పకళ, శిల్పం, చిత్రలేఖనం ఈ సాంస్కృతిక సృజనాత్మకత అధిక అంశాలుగా ఉన్నాయి. గుప్తా కాలంలో కాలిదాసు, ఆర్యభట్ట, వరాహమిహిర, విష్ణు శర్మ, వాట్సయన వంటి అనేకమంది విద్యా రంగాలలో గొప్ప పురోగతిని సంపాదించారు. గుప్తుల కాలం భారతీయ సంస్కృతి పరీవాహక కాలంగా గుర్తించబడింది: గుప్తులు వారి పరిపాలనను చట్టబద్ధం చేసేందుకు వేదాలను అనుసరించినా వారు బౌద్ధమతానికి మద్దతునిచ్చారు. ఇవి బ్రాహ్మణిక సంప్రదాయానికి ప్రత్యామ్నాయాన్ని అందించాయి. మొదటి ముగ్గురు పాలకులు - మొదటి చంద్రగుప్త, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు సైనిక అత్యుపయోగంతో వారి నాయకత్వంలో భారతదేశం లోని అధిక భాగాన్ని ఆధిఖ్యతలోకి తీసుకువచ్చాయి. సైన్సు, రాజకీయ పరిపాలన గుప్త యుగంలో కొత్త ఎత్తులను చేరుకున్నాయి. బలమైన వాణిజ్య సంబంధాలతో ఈ ప్రాంతం ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా మారింది. బర్మా, శ్రీలంక, మారిటైమ్ ఆగ్నేయ ఆసియా, ఇండోచైనాలో సమీప రాజ్యాలు, ఇతర ప్రాంతాలను ప్రభావితం చేసే ఒక స్థావరంగా మారింది. 5 వ శతాబ్దం మొదటి భాగంలో ఆఫ్ఘనిస్తానులో బమియానును తమ రాజధానిగా చేసుకుని తమను తాము స్థాపించుకున్న ఆల్కాన్ హన్స్ వచ్చే వరకు మొట్టమొదటి గుప్తులు వాయువ్య రాజ్యాలను విజయవంతంగా అడ్డుకున్నాయి.Iaroslav Lebedynsky, "Les Nomades", p172. అయినప్పటికీ ఈ సంఘటనలు దక్షిణ భారతదేశంలో ఎక్కువభాగాన్ని ప్రభావితం చేయలేదు.Early History of India, p 339, Dr V. A. Smith; See also Early Empire of Central Asia (1939), W. M. McGovern.Ancient India, 2003, p 650, Dr V. D. Mahajan; History and Culture of Indian People, The Age of Imperial Kanauj, p 50, Dr R. C. Majumdar, Dr A. D. Pusalkar. వకతక సామ్రాజ్యం thumb|300px|వాకాటకాల పాలనలో రాయిని తొలచి నిర్మించిన 30 స్మారకాలు అజంతా గుహలు లో వున్నాయి. క్రీ.పూ. 3 వ శతాబ్దం మధ్యలో దక్కనులో వకతక సామ్రాజ్యం ఉద్భవించింది. వారి సామ్రాజ్యం మాల్వా, గుజరాతు దక్షిణ అంచుల నుండి దక్షిణప్రాంతంలో తుంగభద్ర నది వరకు, పశ్చిమాన అరేబియా సముద్రం నుండి తూర్పున ఛత్తీస్గఢ్ అంచుల వరకు వారి రాజ్యం విస్తరించిందని విశ్వసిస్తున్నారు. దక్కనుప్రాంతంలో శావాహనుల తరువాతి రాజవంశంగా, ఉత్తర భారతదేశంలో గుప్తులకు సమకాలీనులుగా ఉన్న వకతక రాజవంశీయుల తరువాత దక్కను ప్రాంతం విష్ణుకుండినుల వశం అయింది. వకతకాలు కళలు, వాస్తుశిల్పం, సాహిత్య పోషకులకు ప్రసిద్ధి చెందారు. వారు ప్రజోపయోగ పనులు చేపట్టారు. వారి స్మారక చిహ్నాలు వారి వారసత్వానికి సాక్ష్యంగా ఉన్నాయి. వకతక చక్రవర్తి హరిషేనా పోషణలో అజాంతా గుహల (యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద) బౌద్ధ విహరాలు, చైతనాల వంటి రాతిచెక్కడాలు నిర్మించబడ్డాయి.The precise number varies according to whether or not some barely started excavations, such as cave 15A, are counted. The ASI say "In all, total 30 excavations were hewn out of rock which also include an unfinished one", UNESCO and Spink "about 30". The controversies over the end date of excavation is covered below. కామరూప సామ్రాజ్యం 120px|left|thumb|మదన్ కామదేవి అవశేషాలలోకామరూప రాజుల రాగి పళ్లెపు ముద్ర సమాద్రగుప్తుడు స్థాపించిన 4 వ శతాబ్దపు అలహాబాద్ స్తంభాల శాసనంలో కామరూప (పశ్చిమ అస్సాం),Tej Ram Sharma, 1978, "Personal and geographical names in the Gupta inscriptions. (1.publ.)", Page 254, Kamarupa consisted of the Western districts of the Brahmaputra valley which being the most powerful state. దావకా (మధ్య అస్సాం) లలో ప్రస్తావన చోటుచేసుకుంది.Suresh Kant Sharma, Usha Sharma – 2005, "Discovery of North-East India: Geography, History, Culture, ... – Volume 3", Page 248, Davaka (Nowgong) and Kamarupa as separate and submissive friendly kingdoms. ఇది గుప్త సామ్రాజ్యం సరిహద్దు రాజ్యంగా పేర్కొనబడింది. తరువాత దావకా కామరూపలో విలీనం అయ్యింది. ఇది కరటోయ నది నుండి (ప్రస్తుత సాదియా) మొత్తం బ్రహ్మపుత్ర లోయ, ఉత్తర బెంగాల్, బంగ్లాదేశ్ భాగాలు, పూర్ణ, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో విస్తరించింది.The eastern border of Kamarupa is given by the temple of the goddess Tamreshvari (Pūrvāte Kāmarūpasya devī Dikkaravasini in Kalika Purana) near present-day Sadiya. "...the temple of the goddess Tameshwari (Dikkaravasini) is now located at modern Sadiya about 100 miles to the northeast of Sibsagar" . ఈ ప్రాంతాన్ని పాలించిన మూడు రాజవంశాలు వర్మనస్ (క్రీ.పూ. 350-650 CE), మెల్చా రాజవంశం (క్రీ.పూ. 655-900), కామరూప-పాలాస్ (సుమారుగా సా.శ. 900-1100) రాజవంశాలు వరుసగా ప్రస్తుత గౌహతి (ప్రాగ్జిజ్యోతిష్పురా), తేజ్పూర్ (హరుప్పేశ్వర), ఉత్తర గౌహతి (దుర్జయ) రాజధానిగా చేసుకుని పాలించాయి. మూడు రాజవంశాలు ఆరివార్ట్ నుండి వలస వచ్చిన నారకాసురుని సంతతికి చెందినవి. వర్మన్ రాజు భాస్కర్ వర్మన్ (క్రీస్తుపూర్వం 600-650) పాలనలో చైనా ప్రయాణికుడు జువాన్జాంగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి తన ప్రయాణాలను నమోదు చేసుకున్నాడు. తరువాత బలహీనమై విచ్చిన్నమైన తరువాత (కామరుప-పాలాస్), కామరుప సంప్రదాయం క్రీ.పూ 1255 మొదటి లూనారు (1120 - 1185 CE), రెండవ లూనారు (క్రీస్తు 1155 - 1255 CE) రాజవంశాల పాలనలో కొంత వరకు విస్తరించింది. 13 వ శతాబ్దం మధ్యకాలంలో కామరుప సామ్రాజ్యాన్ని ముస్లిం తుర్కులను ఆక్రమించిన తరువాత కామాతోపూర్ (నార్త్ బెంగాల్) నుండి రాజధానిని కామరూపనగారా (ఉత్తర గౌహతి)కు మార్చి కెన్ రాజవంశం ఆధ్వర్యంలో కమట రాజ్యాన్ని స్థాపించారు.Sarkar, J. N. (1992), "Chapter II The Turko-Afghan Invasions", in Barpujari, H. K., The Comprehensive History of Assam, 2, Guwahati: Assam Publication Board, pp. 35–48 పల్లవ సామ్రాజ్యం thumb|upright|నరసింహవర్మ II మహాబలిపురం లో నిర్మించిన తీర దేవాలయం (ప్రపంచ వారసత్వసంపద) 4 వ శతాబ్దం నుండి 9 వ శతాబ్ధం మద్యకాలంలో పల్లవులు, ఉత్తర ఉప గుప్తులతో పాటు, భారత ఉపఖండంలోని దక్షిణప్రాంతంలో సంస్కృత అభివృద్ధికి గొప్ప పోషకులుగా ఉన్నారు. పల్లవ పాలన గ్రాన్థా అని పిలిచే లిపిలోని మొదటి సంస్కృత శాసనాలు ఉన్నాయి. తొలి పల్లవులు ఆగ్నేయాసియా దేశాలతో విభిన్న సంబంధాలను కలిగి ఉన్నారు. పల్లవులు మామల్లపురం, కాంచీపురం, ఇతర ప్రాంతాలలో ద్రవిడ నిర్మాణశైలిలో కొన్ని ముఖ్యమైన హిందూ దేవాలయాలు, అకాడమీలను నిర్మించారు. వారి పాలనలో కవులు గొప్ప అభివృద్ధి సాధించారు. దేవాలయాలను వేర్వేరు దేవతలకు దేవాలయాలు నిర్మించడం ఆచరణలోకి వచ్చింది. ఆగమశాస్త్రాలను అనుసరించి దేవాలయనిర్మాణం జరిగింది.Nilakanta Sastri, pp412–413 మొదటి మహేంద్రవర్మ (క్రీ.పూ. 571 - 630 ), మొదటి నరసింహవర్మ (క్రీ.పూ.630 - 668 ) పాలనలో పల్లవులు అధికారంలోకి వచ్చారు. 9 వ శతాబ్దం చివరి వరకు 600 సంవత్సరాలుగా తమిళ ప్రాంతపు ఉత్తర ప్రాంతం, తెలుగు ప్రాంతాలలో ఆధిపత్యం చేసారు. కదంబ సామ్రాజ్యం thumb|left|దొడ్డగద్దవల్లి దగ్గర కదంబ శిఖరం పై కలస తో కూడినది. క్రీస్తుపూర్వం 345 లో మయూరశర్మ కర్ణాటక ప్రాంతంలో కదంబ రాజ్యం స్థాపించాడు. తరువాత కాలంలో దానిని సమర్ధతతో సామ్రాజ్యంగా అభివృద్ధి చేసాడు. రాజు మయూరశర్మ కొన్ని స్థానిక గిరిజనుల సహాయంతో కంచికి చెందిన పల్లవుల సైన్యాన్ని ఓడించాడు. కాకుత్సవర్మ పాలనలో కాదంబ ఖ్యాతి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఉత్తర భారతదేశంలోని గుప్త రాజవంశం రాజుకుటుంబంతో వివాహం సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. కదంబాలు పాశ్చాత్య గంగ రాజవంశం సమకాలీకులుగా ఉన్నారు. వారు భూమిని పరిపూర్ణ స్వయంప్రతిపత్తితో పరిపాలించే ప్రారంభ స్థానిక రాజ్యాలను ఏర్పరచారు. ఈ రాజవంశం తరువాత కన్నడ సామ్రాజ్యాలు, చాళుక్య, రాజపుత్ర సామ్రాజ్యాలకు సామతరాజ్యంగా ఐదు వందల సంవత్సరాల పాటు కొనసాగింది. ఇది గోవా కదంబాలు, హలాసీ కదంబాలు, హంగల్ కదంబాలు వంటి చిన్న వంశాలుగా విభజించబడింది. అల్చాన్ హంస్ ఆల్కాన్ హన్లు నోమాడిక్ సమాఖ్య పురాతన ఆదివాసీ కాలంలో మద్య ఆసియాలో ఇండో-హెఫ్తాలిటీస్ లైట్లు ( ఆల్కాన్ హున్స్)గా ఉండేది. ఆల్కాన్ హన్స్ 5 వ శతాబ్దం మొదటి అర్ధ భాగంలో ఆధునిక-ఆఫ్ఘనిస్తాన్‌లో తమ స్థావరాలు స్థాపించారు. హన్ సైనిక నాయకుడు టోరమానా నేతృత్వంలో భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతాలను అధిగమించారు. టొరమనా కుమారుడు మిహిరాకుల, ఒక పాశ్చాత్య హిందూవుతో తూర్పున పాలిటిపుత్రకు, మధ్య భారతదేశంలోని గ్వాలియరుకు వెళ్లారు. హ్యూయెన్ త్సాంగ్ బౌద్ధుల మిహిరాకుల కనికరంలేని బౌద్ధులను హింసించడం, మఠాలను విధ్వంసం చేయడం తన వ్రాతలలో వివరించాడు. అయినప్పటికీ ఆ వివరణ ప్రామాణికతకు సంబంధించినంత వరకు వివాదాస్పదంగా ఉంది.Hiuen Tsiang, Si-Yu-Ki, Buddhist Records of the Western World, (Tr. Samuel Beal), Kegan Paul, Trench, Trubner & Co. Ltd. London. 1906, pp. 167–168. 6 వ శతాబ్దంలో భారత పాలకులు, మహారాష్ట్రా మహారాజు యశోధరన్ (మాల్వా), గుప్త చక్రవర్తి నరసింహగుప్తా నరసింహగుప్తాలు కలిసి హన్సును ఓడించారు. వారిలో కొందరు భారతదేశం నుండి బయటికి వెళ్ళారు. ఇతరులు భారతీయ సమాజంలో కలిసిపోయారు.History of India by N. Jayapalan p.134 హర్ష సామ్రాజ్యం హర్షుడు 606 నుండి 647 వరకు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాడు. ఆయన వర్ధన రాజవంశానికి చెందిన ప్రభాకర్వర్ధనుడి కుమారుడు, రాజ్యవర్ధనుడి తమ్ముడు. వర్ధన రాజవంశ రాజులు ప్రస్తుత హర్యానాలో ఉన్న తానేసర్ను పాలించారు. thumb|250px|left|హర్ష చక్రవర్తి నాణెం, క్రీ.పూ. 606-647 6 వ శతాబ్దం మధ్యకాలంలో పూర్వ గుప్త సామ్రాజ్యం పతనమైన తరువాత ఉత్తర భారతదేశం చిన్న గణతంత్రాలు, రాచరిక రాజ్యాలుగా విడిపోయింది. ఫలితంగా తనేసర్ వర్ధనల అభివృద్ధి చెందుతూ పంజాబ్ నుండి కేంద్ర భారతదేశానికి గణతంత్రాలు, రాచరిక రాజ్యాలను ఏకం చేయడం ప్రారంభించారు. హర్షుడి తండ్రి, సోదరుడు మరణించిన తరువాత 606 లో సామ్రాజ్యం ప్రతినిధులు ఏప్రిల్లో సమావేశం జరిపి హర్షడిని చక్రవర్తి చేసారు. కేవలం 16 ఏళ్ళ వయసులో ఆయనకు మహారాజా బిరుదు ఇవ్వబడింది.RN Kundra & SS Bawa, History of Ancient and Medieval India తన అధికారంలో ఆయన సామ్రాజ్యం ఉత్తర, వాయవ్య దేశాలన్నింటినీ స్వాధీనం చేసుకుని సంరాజ్యాన్ని కామరూప వరకు, దక్షిణాన నర్మదా నది వరకు విస్తరించాడు. చివరికి కన్నౌజ్ (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో) తన రాజధానిగా చేసుకుని క్రీ.పూ. 647 వరకు పాలించాడు.International Dictionary of Historic Places: Asia and Oceania by Trudy Ring, Robert M. Salkin, Sharon La Boda p.507 అతని న్యాయస్థానం కాస్మోపాలిటినిజం కేంద్రంగా మారి పండితులు, కళాకారులు, మతపరమైన సందర్శకులను దీర్ఘకాలం ఆకర్షించింది. ఈ సమయంలో హర్షుడు సూర్య ఆరాధన నుండి బౌద్ధమతంలోకి మారాడు. చైనీస్ యాత్రికుడు జువాన్జాంగ్ హర్షుడి న్యాయస్థానాన్ని సందర్శించి ఆయన న్యాయాన్ని, దాతృత్వాన్ని ప్రశంసిస్తూ ఆయన గురించి చాలా అనుకూలంగా వ్రాశాడు. సంస్కృత కవి బాణభట్టు రచించిన ఆయన జీవితచరిత్ర హర్షచరిత ("హర్షీ డీడ్స్") తనేసరుతో ఆయనకున్న అనుబంధం, అలాగే రక్షణ గోడ, కందకం, రెండు అంతస్థుల ధవళగ్రిహా (వైట్ మాన్షన్) తో ఉన్న రాజభవనం గురించి వర్ణించాడు. ఆరంభకాల మధ్యయుగ కాలం (క్రీ.పూ 650 –క్రీ.పూ 1200 ) సా.శ. 6 వ శతాబ్దంలో గుప్తుల సామ్రాజ్యం ముగిసిన తరువాత భారతదేశం మద్యయుగం ప్రారంభమైంది. ఈ కాలం హుందూయిజానికి " సంప్రదాయ యుగం ద్వితీయార్ధం " అని భావించబడుతుంది.సా.శ. 7 వ శతాబ్దంలో హర్ష సామ్రాజ్యం పతనం తరువాత ఇది మొదలైంది. ఇంపీరియల్ కన్నౌజ్ ప్రారంభం త్రిపాఠి పోరాటానికి దారితీసింది.1279 లో దక్షిణ భారతదేశంలో మూడవ రాజేంద్ర చోళడి మరణంతో తర్వాతి చోళుల ముగింపుతో 13 వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తానేటు ముగిసింది; అయినప్పటికీ 17 వ శతాబ్దంలో దక్షిణాన విజయనగర సామ్రాజ్యం పతనం సాంప్రదాయిక కాలంలోని కొన్ని అంశాలు కొనసాగాయి. 5 వ శతాబ్ధం నుండి 13 వ నాటికి వేద సంస్కృతి క్షీణించి బౌద్ధమతం, జైనమతం అభివృద్ధి మొదలైంది. రాజ న్యాయస్థానాల్లో శైవిజం, వైష్ణవిజం, శక్తివిజం విస్తరించాయి. ఈ కాలం భారతదేశంలో అత్యుత్తమ కళా సాంప్రదాయిక అభివృద్ధి కొనసాగింది. హిందూ మతం, బౌద్ధమతం, జైన మతంలో ప్రధానంగా ఆధ్యాత్మిక, తాత్విక వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. ఆల్కాన్ హున్స్ ఆక్రమణ తరువాత 6 వ శతాబ్దంలో వాయవ్య భారతదేశంలో బౌద్ధమతం బలహీనపడింది. అల్కాన్ హుంస్ ప్రజలు ప్రారంభంలో వారి స్వంతమతం తెంగ్రి మతాలను అనుసరించి తరువాత భారత మతాలను అనుసరించారు. క్రీ.పూ 711 లో సింధు ప్రాంతం నుండి (ఆధునిక పాకిస్తాన్) ముహమ్మదు బిన్ ఖాసిం ముట్టడి తరువాత బౌద్ధమతం మరింత క్షీణించింది. అనేక స్థూపాలు నెనూన్ (పాకిస్థాన్ లోని హైదరాబాదు) వంటి మసీదులుగా మార్చబడ్డాయని చౌచ్ నామా నమోదు చేసాడు.Schimmel, Annemarie Schimmel, Religionen – Islam in the Indian Subcontinent, Brill Academic Publishers, 1 January 1980, , pg. 4 7 వ శతాబ్దంలో కుమారీల భట్టు మిమాంస తత్వశాస్త్ర పాఠశాలను రూపొందించాడు. బౌద్ధ దాడులకు వ్యతిరేకంగా వేదఆచారాలకు మద్దతుగా నిలిచాడు. కుమారీలభట్టు భారతదేశంలో బౌద్ధమతం పతనానికి కృషి చేసిన వ్యక్తిగా పండితులు గుర్తించాడు.Sheridan, Daniel P. "Kumarila Bhatta", in Great Thinkers of the Eastern World, ed. Ian McGready, New York: Harper Collins, 1995, pp. 198–201. . బౌద్ధులకు వ్యతిరేకంగా అతని వైవిధ్య విజయాన్ని బౌద్ధ చరిత్రకారుడు తథాగత ధృవీకరించాడు. ఆయన బుద్ధపాల్కిత, భవ్య, ధర్మదాసా, దిగ్నగా, ఇతరు శిష్యులను వాదంలో ఓడించాడని పేర్కొన్నారు.Arnold, Daniel Anderson. Buddhists, Brahmins, and Belief: Epistemology in South Asian Philosophy of religion, p. 4. Columbia University Press, 2005. . 8 వ శతాబ్దంలో అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు, విస్తరించడానికి భారత ఉపఖండం అంతటా ఆది శంకరాచార్యుడు ప్రయాణించాడు. హిందూమతంలో ప్రస్తుత ఆలోచనలు ముఖ్య లక్షణాలను ఏకీకృతం చేయటానికి శకరాచార్యుని కృషి సహకరించింది.Johannes de Kruijf and Ajaya Sahoo (2014), Indian Transnationalism Online: New Perspectives on Diaspora, , page 105, Quote: "In other words, according to Adi Shankara's argument, the philosophy of Advaita Vedanta stood over and above all other forms of Hinduism and encapsulated them. This then united Hinduism; [...] Another of Adi Shankara's important undertakings which contributed to the unification of Hinduism was his founding of a number of monastic centers."Shankara, Student's Encyclopædia Britannica – India (2000), Volume 4, Encyclopædia Britannica (UK) Publishing, , page 379, Quote: "Shankaracharya, philosopher and theologian, most renowned exponent of the Advaita Vedanta school of philosophy, from whose doctrines the main currents of modern Indian thought are derived.";David Crystal (2004), The Penguin Encyclopedia, Penguin Books, page 1353, Quote: "[Shankara] is the most famous exponent of Advaita Vedanta school of Hindu philosophy and the source of the main currents of modern Hindu thought."Christophe Jaffrelot (1998), The Hindu Nationalist Movement in India, Columbia University Press, , page 2, Quote: "The main current of Hinduism – if not the only one – which became formalized in a way that approximates to an ecclesiastical structure was that of Shankara". ఆయన బౌద్ధమతం, హిందూయిజ మీమాంసా పాఠశాలలను విమర్శించాడు.;Shyama Kumar Chattopadhyaya (2000) The Philosophy of Sankar's Advaita Vedanta, Sarup & Sons, New Delhi , Edward Roer (Translator), to Brihad Aranyaka Upanishad at pages 3–4; Quote – "[...] Lokayatikas and Bauddhas who assert that the soul does not exist. There are four sects among the followers of Buddha: 1. Madhyamicas who maintain all is void; 2. Yogacharas, who assert except sensation and intelligence all else is void; 3. Sautranticas, who affirm actual existence of external objects no less than of internal sensations; 4. Vaibhashikas, who agree with later (Sautranticas) except that they contend for immediate apprehension of exterior objects through images or forms represented to the intellect."Edward Roer (Translator), to Brihad Aranyaka Upanishad at page 3, KN Jayatilleke (2010), Early Buddhist Theory of Knowledge, , pages 246–249, from note 385 onwards;Steven Collins (1994), Religion and Practical Reason (Editors: Frank Reynolds, David Tracy), State Univ of New York Press, , page 64; Quote: "Central to Buddhist soteriology is the doctrine of not-self (Pali: anattā, Sanskrit: anātman, the opposed doctrine of ātman is central to Brahmanical thought). Put very briefly, this is the [Buddhist] doctrine that human beings have no soul, no self, no unchanging essence.";Edward Roer (Translator), , pages 2–4Katie Javanaud (2013), Is The Buddhist 'No-Self' Doctrine Compatible With Pursuing Nirvana?, Philosophy Now;John C. Plott et al. (2000), Global History of Philosophy: The Axial Age, Volume 1, Motilal Banarsidass, , page 63, Quote: "The Buddhist schools reject any Ātman concept. As we have already observed, this is the basic and ineradicable distinction between Hinduism and Buddhism". భారత ఉపఖండంలోని నాలుగు మూలల్లో అద్వైత వేదాంత విస్తరణ, అభివృద్ధి కోసం మఠాలు (మఠాలు) స్థాపించారు.The Seven Spiritual Laws Of Yoga, Deepak Chopra, John Wiley & Sons, 2006, , క్రీ.పూ.8 వ శతాబ్దం నాటికి సామ్రాజ్య కేంద్రం, కాస్మో-రాజకీయ వ్యవస్థలలో బుద్ధుడికి బదులుగా హిందూ దేవతల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. హిందూ దేవతలకు ఆలయాలు నిర్మించబడి రాజరిక ఆరాధన చేయబడింది.Inden, Ronald. "Ritual, Authority, And Cycle Time in Hindu Kingship". In JF Richards, ed., Kingship and Authority in South Asia. New Delhi: Oxford University Press, 1998, p.67, 55 ఎనిమిదవ శతాబ్దం తరువాత బౌద్ధ మతం భారతదేశం నుండి అదృశ్యమైంది. విష్ణు, శివ ఆరాధన రాజప్రసాదాలు, సామాజిక సాంఘిక నేపధ్యంలో బౌద్ధమత స్థాయిని బలహీనపరిచి క్షీణించజేయడానికి సహాయపడింది.Holt, John. The Buddhist Visnu. Columbia University Press, 2004, p.12,15 7 వ శతాబ్దంలో గుప్త రాజవంశం పతనం తరువాత కన్నౌజ్ చక్రవర్తి హర్ష తన పాలనాకాలంలో ఉత్తర భారతదేశాన్ని తిరిగి సమైఖ్యం చేసాడు. అతని మరణం తరువాత అతని సామ్రాజ్యం కూలిపోయింది. 8 నుంచి 10 వ శతాబ్దం వరకు ఉత్తర భారతదేశ నియంత్రణకు మూడు రాజవంశాలు పోటీ పడ్డాయి: మాల్వా గుర్జర ప్రతిహారులు, బెంగాల్ పాలా రాజవమ్శం, దక్కనుకు చెందిన రాష్ట్రకూటులు. సేనా రాజవంశం తరువాత పాల సామ్రాజ్యంపై నియంత్రణను చేపట్టింది; గుర్జరా ప్రతిహారులు చిన్న రాజ్యాలుగా విడిపోయారు.ఆరంభకాల రాజపుత్ర రాజ్యస్థాపకులలో మాల్వా పరమరాలు, చండేలాలు, బుండేల్ ఖండు ప్రజలు, మహాకోసల కలాచురీలు, హర్యానా తోమరాలు, రాజపుతానా చౌహానులు ఉన్నారు. పాశ్చాత్య చాళుక్యులు రాష్ట్రాకుటాను విలీనం చేసుకున్నారు.Kamath (2001), pp100–103 11 వ శతాబ్దం లో మొదటి రాజరాజ చోళుని కాలంలో చోళ సామ్రాజ్యం ప్రధాన శక్తిగా ఉద్భవించింది. మొదటి రాజరాజచోళుడు 11 వ శతాబ్ధంలో ఆగ్నేయ ఆసియా, శ్రీలంక భాగాల మీద విజయవంతంగా దాడి చేసాడు.The Dancing Girl: A History of Early India by Balaji Sadasivan p.129 వాయవ్య భారతంలో సాధిచిన ఆధిఖ్యత సా.శ.625 నుండి సా.శ. 1003 వరకు కొనసాగించిన కాశ్మీరీ కరకోట వంశలో చక్రవర్తి లలితాదిత్యా ముక్తపీడ (సా.శ.724 సా.శ. 760) ప్రఖ్యాతి గడించాడు. కరకోటా తరువాత లోహార వంశం అధికారంలోకి వచ్చింది. రాజతరంగిణిలో కలహానా ఉత్తర భారతదేశంలో, మధ్య ఆసియాలో తీవ్రమైన సైనిక పోరాటాలకు రాజు లలితాదిత్య ప్రతీకగా ఉన్నాడని కల్హనా రాజతరంగిణిలో పేర్కొన్నాడు.Sunil Fotedar (June 1984). The Kashmir Series: Glimpses of Kashmiri Culture – Vivekananda Kendra, Kanyakumari (p. 57).R.C. Mazumdar, Ancient India, Page 383 thumb|250px|తూర్పు గంగ రాజవంశం మహారాజా అనంతవర్మన్ చోడగంగా దేవ నిర్మించిన పూరీలోని జగన్నాథ ఆలయం 7 వ శతాబ్దం మధ్యకాలం నుండి 11 వ శతాబ్దం మొదలు వరకు హిందూ షాహి రాజవంశం తూర్పు ఆఫ్ఘనిస్తాన్, ఉత్తర పాకిస్థాన్, కాశ్మీర్ ప్రాంతాల మధ్య ప్రాంతాన్ని పాలించారు. ఒరిస్సాలో తూర్పు గంగా సామ్రాజ్యం అధికారంలోకి వచ్చింది; హిందూ శిల్పకళ అభివృద్దికి ప్రసిద్ధి చెందిన జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య ఆలయం నిర్మించబడ్డాయి. అలాగే కళ, సాహిత్య పోషకులుగా ప్రసిద్ధి చెందారు. చాళుక్య సామ్రాజ్యం thumb|left|250px| బాదామి గుహాలయాలలో విష్ణు బొమ్మ. సా.శ. 6 వ శతాబ్దంలో బాదామి చాళుక్య శైలిగల కొండలు తొలచిన నిర్మాణాలకు ప్రధాన ఉదాహరణ. 6 వ, 12 వ శతాబ్దాల మధ్య కాలంలో దక్షిణ, మధ్య భారతదేశ ప్రాంతాలో అధిక భాగాన్ని చాళుఖ్యవంశం పాలించింది. ఈ కాలంలో వారు మూడు వ్యక్తిగత రాజవంశాలుగా పరిపాలించారు. 6 వ శతాబ్దం మధ్యకాలం నుండి వాతాపి (ఆధునిక బాదామి) "బాదామి చాళుక్యులు" అని పిలవబడిన మొట్టమొదటి రాజవంశం చేత పాలించబడింది. బనవాసి కదంబ సామ్రాజ్యం క్షీణత తరువాత బాదామి చాళుక్యులు స్వాతంత్ర్యం చాటుకోవడం ప్రారంభించారు. రెండవ పులకేశి పాలనా సమయంలో వీరు ప్రాచుర్యంలోకి వచ్చారు. దక్షిణ భారతదేశ చరిత్రలో చాళుక్యుల పాలన ముఖ్యమైన మైలురాయిగా ఉండి కర్ణాటక చరిత్రలో ఒక స్వర్ణ యుగానికి చిహ్నంగా ఉంది. బాదామి చాళుక్యుల ఆధిపత్యంతో దక్షిణ భారతదేశంలో రాజకీయ వాతావరణం చిన్న సామ్రాజ్యాల నుండి పెద్ద సామ్రాజ్యంగా మారింది. కావేరి, నర్మదా నదుల మధ్య ఉన్న మొత్తం ప్రాంతాన్ని ఒక దక్షిణ భారతదేశ-ఆధారిత సామ్రాజ్యం నియంత్రించి ఏకీకృతం చేసింది. ఈ సామ్రాజ్యం అభివృద్ధి సమర్థవంతమైన పరిపాలన, విదేశీ వాణిజ్యం అభివృద్ధి, నూతన శైలి వాస్తు శిల్పం ("చాళుక్యుయన్ ఆర్కిటెక్చర్" అని పిలువబడింది)అభివృద్ధి చేయబడ్డాయి. సా.శ. 550 - సా.శ. 750 మధ్య కాలంలో చాళుక్య చక్రవర్తులు దక్షిణ, మధ్య భారతదేశంలోని కర్నాటకలోని బాదామి నుండి, తరువాత సా.శ. 970 - సా.శ. 1190 మధ్య కల్యాణి నుండి పాలించారు. గుజరాతులోని చౌళుక్య రాజవంశం చాళుక్యుల శాఖలలో ఒకటి. వారి రాజధాని అనీల్వర (ఆధునిక పటాన్, గుజరాత్) సా.శ. 1000 లో 1,00,000 జనసంఖ్యతో సంప్రదాయకాల భారతదేశంలో ఇది అతిపెద్ద నగరాలలో ఒకటిగా ఉండేది. రాష్ట్రకూట సామ్రాజ్యం thumb|right|300px| ఎల్లోరా గుహలోని పురాతన హిందూ దేవాలయాలలో పెద్దదైన కొండ తొలచి నిర్మించిన కైలాస దేవాలయం, ఎల్లోరా 753 చుట్టూ దంతిదుర్గా స్థాపించబడింది. రాష్ట్రాకుట సామ్రాజ్యం మన్యఖేటను రాజధాని చేసుకుని దాదాపు రెండు శతాబ్దాల కాలం పాలించింది. రాష్ట్రకూటులు ఉత్తరాన గంగా నది, యమునా నది డోబ్ నుండి దక్షిణాన కేప్ కొమొరిన్ వరకు రాజ్య విస్తరణ చేసి నిర్మాణాలు, ప్రసిద్ధ సాహిత్య రచనల అభివృద్ధి చేసారు.Kamath (2001), p.89"Mathematical Achievements of Pre-modern Indian Mathematicians", Putta Swamy T.K., 2012, chapter=Mahavira, p.231, Elsevier Publications, London, ఈ రాజవంశం ప్రారంభ పాలకులు హిందూమతాన్ని ఆచరించి తరువాత జైనమతంచే బలంగా ప్రభావితమయ్యారు. రాజవంశం ఉత్పత్తి చేసిన సుదీర్ఘకాల రాజపరంపరలో 64 సంవత్సరాలు పాలన సాగించిన అమోఘవర్ష కవిరజమార్గ రచన చేసాడు. ఇది ప్రారంభ కన్నడ కవిత్వంగా ప్రశంశించబడింది. ద్రవిడ శైలిలో వాస్తుశిల్పం ఒక మైలురాయికి చేరుకుంది. ఎల్లోరాలోని కైలాసనాథ్ ఆలయంలో ఇది అత్యుత్తమ ఉదాహరణగా నిలిచింది. ఇతర ముఖ్యమైన నిర్మాణాలలో కాశీవిష్వనత ఆలయం, కర్ణాటకలోని పట్టడకల్ వద్ద ఉన్న జైన నారాయణ ఆలయం ప్రాధాన్యత వహిస్తున్నాయి. రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని ప్రపంచంలోని నాలుగు గొప్ప సామ్రాజ్యాలలో ఒకటిగా అరబ్ యాత్రికుడు సులేమాన్ వర్ణించాడు. రాష్ట్రకూట కాలంలో దక్షిణ భారత గణిత శాస్త్రంలో స్వర్ణ యుగం ప్రారంభమైంది. గొప్ప దక్షిణాది భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు మహావీర రాష్ట్రకూట సామ్రాజ్యంలో నివసించాడు. ఆయన రచనలు అతని తర్వాత నివసించిన మధ్యయుగ దక్షిణ భారతీయ గణిత శాస్త్రవేత్తలపై భారీ ప్రభావం చూపింది.The Britannica Guide to Algebra and Trigonometry by William L. Hosch p.105 రాష్ట్రకూట పాలకులు ఉత్తరాలు వ్రాయడంలో ప్రసిద్ధి చెందారు. వీరు సంస్కృతం, అపబ్రంశ వంటి వివిధ భాషలలో లేఖలు వ్రాసారు. గుర్జర- ప్రతిహారా సామ్రాజ్యం ఇండస్ నదికి తూర్పు వైపు అరబ్ సైన్యాలను నిలిపి ఉంచడంలో గుర్జర ప్రతీహారులు ముఖ్యపాత్ర పోషించారు. భారతదేశంలోని కాలిఫెట్ పోరాటాలలో నాగభట్ట అరబ్ సైన్యాన్ని ఓడించాడు. రెండవ నాగభట్టు పాలనలో ఉత్తర భారతదేశంలో గుర్జర-ప్రతీహార వంశం అత్యంత శక్తివంతమైన రాజవంశంగా మారింది. అతని కొడుకు రామభద్ర కొంతకాలం పాలించిన తరువాత ఆయన కుమారుడు మిహిర భోజుడు పాలనా బాధ్యతలు స్వీకరించాడు. భోజా ఆయన వారసుడు మొదటి మహేంద్రపాళి పాలనలో ప్రతీహారా సామ్రాజ్య శక్తి శిఖరాగ్రం చేరుకుంది. మహేంద్రాపల కాలం నాటికి పశ్చిమ సరిహద్దులో సింధు నుండి తూర్పున బెంగాలు, ఉత్తరాన ఉన్న హిమాలయాలు, దక్షిణాన నర్మదా వరకు ఉన్న ప్రాంతాలకు గుప్త సామ్రాజ్యం విస్తరించింది. ఈ విస్తరణ భారతీయ ఉపఖండంలో నియంత్రణ కొరకు రాష్ట్రకూట, పాల సామ్రాజ్యాలతో ఒక త్రైపాక్షిక శక్తి పోరాటాన్ని ప్రేరేపించింది. ఈ కాలంలో ఇంపీరియల్ ప్రతీహర రాజులు ఆర్యవాత మహారాజధీరా (భారతదేశంలోని గొప్ప రాజుల రాజు) బిరుదాలకృతులయ్యారు. 10 వ శతాబ్దం నాటికి గుజరా-ప్రతీహరాస్ యొక్క తాత్కాలిక బలహీనతలను ఉపయోగించుకుని మాల్వా పారామరాలు, బుందేల్ఖండ్లోని చందేలలు, మహాకోసల కలాచూరీలు, హర్యానాలోని టోమరస్లు, చౌహానులు వంటి రాపుపుత్ర రాజులు స్వంతంత్రం ప్రకటించారు. పాలా - సామ్రాజ్యం మొదటి గోపాలా పాలా సామ్రాజ్యాన్ని స్థాపించాడు.Epigraphia Indica, XXIV, p 43, Dr N. G. Majumdar ఇది బౌద్ధ రాజవంశంగా భారత ఉపఖండంలోని తూర్పు ప్రాంతంలోని బెంగాలు నుండి పాలించింది. శశాంకా గౌడా రాజ్యం పతనం తరువాత పాలాలు బెంగాలును తిరిగి సమైఖ్య పరిచారు. పాలాలు బౌద్ధమతంలోని మహాయాన, తాంత్రిక పాఠశాలలను అనుసరించారు.History of Buddhism in India, Translation by A Shiefner ఇవి శైవిజం, వైష్ణవిజాన్ని కూడా ప్రోత్సహించాయి. పాలా అనే పదానికి "రక్షకుడు" అని అర్ధం. పాలా చక్రవర్తులందరి పేర్లకు ముగింపుగా పాలా ఉపయోగించబడింది. ధర్మపాల, దేవపాలా క్రింద ఈ సామ్రాజ్యం శిఖరాగ్రానికి చేరుకుంది. ధర్మపాలా కనౌజును జయించి వాయవ్య భారతదేశంలో సామ్రాజ్యాన్ని విస్తరించాడు. పాలా సామ్రాజ్యం అనేక విధాలుగా బెంగాలు స్వర్ణయుగం పరిగణించబడుతుంది. ధర్మపాలా విక్రమాశీల నందా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. చరిత్రలో నమోదైన మొదటి గొప్ప విశ్వవిద్యాలయాలలో నలందావిశ్వవిద్యాలయం ఒకటి. పాలా సామ్రాజ్య పోషణలో పతాకస్థాయికి చేరుకుంది. పాలా చక్రవర్తులు అనేక బౌద్ధవిహారలను కూడా నిర్మించారు. వారు ఆగ్నేయాసియా, టిబెట్ దేశాలతో సన్నిహిత సాంస్కృతిక, వ్యాపార సంబంధాలను కొనసాగించారు. పాలా సామ్రాజ్యం సంపదకు సముద్ర వాణిజ్యం జోడించబడింది. అరబ్బు వ్యాపారి సులేమాన్ తన జ్ఞాపకాలలో పాలా సైన్యం అపారమైన వివరాలను పేర్కొన్నాడు. thumb|800px|center| మైత్రేయ, బుద్ధుని జీవితపు ఘట్టాల చిత్రాలు. పాల వంశపు గొప్ప రాజు రామపాల కాలంలో చిత్రించినవి. చోళ సామ్రాజ్యం సా.శ. 9 వ శతాబ్దం మధ్యకాలంలో మధ్యయుగ చోళులు ప్రాచుర్యంలోకి వచ్చారు. వారు దక్షిణ భారతదేశంలో గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించారు. History of Ancient India: Earliest Times to 1000 A. D. by Radhey Shyam Chaurasia p.237 వారు తమ పాలనలో దక్షిణ భారతదేశాన్ని సమైఖ్యపరచడంలో విజయంసాధించారు. వారి శక్తివంతమైన నౌకా దళంతో శ్రీవిజయ వంటి ఆగ్నేయ ఆసియా దేశాలలో వారి ప్రభావాన్ని విస్తరించారు. మొదటి రాజరాజ చోళుడు, అతని వారసులైన మొదటి రాజేంద్ర చోళుడు, రాజాధిరాజ చోళుడు, వీరరాజేంద్ర చోళుడు, మొదటి కులోత్తుంగ చోళుడు పాలనలో రాజవంశం దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియాలో సైనిక, ఆర్థిక, సాంస్కృతిక శక్తిగా మారింది.Kulke and Rothermund, p 115: The Cholas were in fact the most successful dynasty since the Guptas ... The classic expansion of Chola power began anew with the accession of Rajaraja I in 985. మొదటి రాజేంద్ర చోళుని నౌకాదళాలను మరింత విస్తరించి బర్మా నుండి వియత్నాం వరకు ఉన్న సముద్రతీర ప్రాంతాలతో అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్ ద్వీపాలు, సుమత్రా, ఆగ్నేయాసియా, మాలేషియా ద్వీపకల్పం వంటి సముద్ర తీరాలను ఆక్రమించాడు. నూతన సామ్రాజ్య మొదటి రాజేంద్ర చోళుని నాయకత్వంలో తూర్పు ఆసియాలోని శ్రీవేజయ సముద్రతీరప్రాంత సామ్రాజ్య నగరాల ఆక్రమణ చేసి చైనాతో రాయబార కార్యాలయాలను కొనసాగించాడు.K.A. Nilakanta Sastri, A History of South India, p 158 శ్రీలంక రాజకీయ వ్యవహారాల్లో వారు రెండు శతాబ్దాల పాటు ఆధిపత్యం చెలాయించారు. పశ్చిమాన అరబ్బులు, తూర్పున చైనీయుల సామ్రాజ్యంతో వారు వ్యాపార సంబంధాలు కొనసాగించారు.Buddhism, Diplomacy, and Trade: The Realignment of Sino-Indian Relations by Tansen Sen p.229 మొదటి రాజారజ చోళుడు తరువాత ఆయనతో సమానంగా విశిష్టత సాధించిన కుమారుడు రాజేంద్ర చోళుడు దక్షిణ భారతదేశం మొత్తానికి రాజకీయ సమైఖ్యత సాధించి చోళ సామ్రాజ్యాన్ని గౌరవనీయమైన సముద్ర శక్తిగా స్థాపించారు.History of Asia by B.V. Rao p.297 చోళుల ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశం కళ, మతం, సాహిత్యంలో ఉన్నత స్థాయికి చేరుకుంది. దేవాలయాల నిర్మాణంలో రాతి, కాంస్యాల శిల్పకళ భారతదేశంలో మునుపెన్నడూ సాధించనంత ఎత్తుకు చేరుకుంది.Indian Civilization and Culture by Suhas Chatterjee p.417 పశ్చిమ చాళుక్య సామ్రాజ్యం 10 వ - 12 వ శతాబ్దాల మధ్యకాలంలో పాశ్చాత్య చాళుక్య సామ్రాజ్యం దక్షిణ భారతదేశం, పశ్చిమ దక్కను ప్రాంతాలను పాలించింది. A Comprehensive History of Medieval India: by Farooqui Salma Ahmed, Salma Ahmed Farooqui p.24 చాళుక్య నియంత్రణలో ఉత్తరాన నర్మదా నది, దక్షిణాన కావేరి నది మధ్య విస్తారమైన ప్రాంతాలు ఉన్నాయి. ఈ కాలంలో దక్కన్, హొయశిలలు, దేవగిరి సీనా యాదవులు, కాకతీయ రాజవంశం, దక్షిణ కలాచురీలు ఇతర పెద్ద పాలకులు పాశ్చాత్య చాళుక్యుల అనుచరులుగా ఉండేవారు. 12 వ శతాబ్దంలో ద్వితీయార్ధంలో చాళుక్య శక్తి క్షీణించిన తరువాత మాత్రమే వారు స్వతంత్రులయ్యారు.Ancient Indian History and Civilization by Sailendra Nath Sen p. 403–405 పాశ్చాత్య చాళుక్యులు శిల్పకళ శైలిని అభివృద్ధి చేశారు. ప్రారంభ చాళుక్య రాజవంశం శైలి, తరువాత హొయసల సామ్రాజ్య శైలి మధ్య ఒక నిర్మాణ సంబంధం ఉంది. మద్య కర్నాటకాలో తుంగభద్ర నదీ తీరప్రాంతాలలో అనేక చోళ కట్టడాలు ఉన్నాయి. లకుండి వద్ద ఉన్న కాశీవిశ్వేశ్వర దేవాలయం, కురువాటిలోని మల్లికార్జున దేవాలయం, బాగాలి లోని కాలేశ్వర ఆలయం, హవేరీలోని సిద్దేశ్వర దేవాలయం, ఇటాగిలోని మహాదేవ దేవాలయం ఇందుకు ఉదాహరణగా ఉన్నాయి.World Heritage Monuments and Related Edifices in India, Band 1 by ʻAlī Jāvīd p. 132–134 దక్షిణ భారతదేశంలో జరిగిన సున్నితమైన కళాభివృద్ధిలో ఇది ముఖ్యమైనది. ప్రత్యేకించి పశ్చిమ చాళుక్య రాజులు కన్నడ భాషలో, సంస్కృతం భాషలలో రచయితలకు, తత్వవేత్తలకు, బసవ వంటి రాజనీతిజ్ఞుడు, రెండవ బాస్కర వంటి గొప్ప గణిత శాస్త్రజ్ఞులకు ప్రోత్సహం అందించారు.History of Kannada Literature by E.P. Rice p.32Bilhana by Prabhakar Narayan Kawthekar, p. 29 భారతీయ ఉపఖండంలో ఆరంభకాల ఇస్లాం దాడులు భారత ఉపఖండాన్ని ఆక్రమించడం ముస్లింల ప్రారంభ ఆకాంక్షలలో ఒకటి అయినప్పటికీ తరువాత అది కష్టతరమైనదిగా గుర్తించిందని ప్రారంభ ఇస్లామిక్ సాహిత్యం సూచిస్తుంది. పర్షియాను ఆక్రమించిన తరువాత అరబు ఉమయ్యదు కాలిఫేటు 720 లో ప్రస్తుత ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో భాగంగా చేసాడు. క్రీ.పూ. 712 లో ముస్లిం సైన్యాధ్యక్షుడు ముహమ్మదు బీన్ ఖాసిం అత్యధికమైన ఇండస్ ప్రాంతాన్ని (ప్రస్తుత పాకిస్తాన్) ఉమయ్యదు సామ్రాజ్యం కొరకు జయించి అస్- సిధు ప్రొవింసుగా రూపొందించి దానికి అల్- మంసురాను రాజధానిగా చేసాడు. అనేక దురాక్రమణల తరువాత ఇండస్కు తూర్పున ఉన్న హిందూ రాజులు ఉమాయ్యదు పోరాటాల ద్వారా అరబ్బులను ఓడించి వారి విస్తరణను పాకిస్తాన్ సింధ్ వద్ద నిలిపారు. 8 వ శతాబ్దం ప్రారంభంలో రెండవ చాళుక్య సామ్రాజ్యానికి చెందిన రెండవ విక్రమాదిత్య, ప్రతీహారా రాజవంశానికి చెందిన మొదటి నాగభట్ట, గుహిలాట్ రాజవంశానికి చెందిన బాప్ప రావల్ అరబ్బు ఆక్రమణదారులను తిప్పికొట్టారు. శతాబ్దాల కాలంలో ఉత్తర ఉపఖండం (ప్రస్తుత ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్) ప్రాంతాల్లో విదేశీ, కొత్తగా మతమార్పిడి చెందిన రాజపుత్రులు పలు సుల్తానేట్లు స్థాపించారు. 10 వ శతాబ్దం నుంచి సింధును రాజపుత్ సోమ్రా రాజవంశం పాలించారు. తరువాత 13 వ శతాబ్దం మధ్యకాలంలో రాజపుత్ సామ్రా రాజవంశం చేత పాలించబడింది. అదనంగా ముస్లిం వర్తకులు దక్షిణభారతీయ పశ్చిమసముద్రతీర ప్రాంతాలలో సుసంపన్నత సాధించారు. ప్రధానంగా వీరు చిన్న సంఖ్యలో అరేబియా ద్వీపకల్పం నుండి వచ్చారు. జుడాయిజం, క్రైస్తవ మతం తరువాత మూడవ మతంగా అబ్రహమిక్ మధ్య ప్రాచ్య మతం పరిచయం చేయబడింది. 11 వ శతాబ్ద ప్రారంభంలో గజని మహమూద్ ప్రధానంగా ఉత్తర భారతీయ ఉప ఖండం మీద 17 సార్లు దాడి చేసినప్పటికీ ప్రాంతాలలో "శాశ్వత రాజ్యమును" స్థాపించటానికి ప్రయత్నించలేదు. Richard M. Eaton, Temple Desecration and Indo-Muslim States, Part I, Frontline, 22 December 2000, p.63. 11 వ శతాబ్దం ప్రారంభంలో శ్రావస్తి సుహల్దేవ్ ఘజ్నావిద్ జనరల్ ఘజి సాయియాద్ సలార్ మసూద్ను ఓడించి, చంపాడు. హిందూ షాహి 3 వ శతాబ్దం తొలినాటికి కుషాన్ సామ్రాజ్యం పతనం తరువాత కాబూల్ షాహీలు కాబూల్ లోయ, గాంధరా (ఆధునిక పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్)ను పాలించారు. షాహిస్ కాలం సాధారణంగా రెండు కాలాలుగా విభజించబడింది. బౌద్ధ షాహీలు, హిందూ షాహీలు, సుమారుగా క్రీ.పూ. 870 సమయంలో మార్పు సంభవించినదని భావిస్తున్నారు. క్రీ.పూ. 565 - క్రీ.పూ. 670 వరకు కాబూల్ షహన్ ( రత్బేల్‌షాహన్) అని పిలుస్తారు. వీటి రాజధానులు కాపిసా, కాబూలలో తరువాత ఉదభందపురా (హండ్) Sehrai, Fidaullah (1979). Hund: The Forgotten City of Gandhara, p. 2. Peshawar Museum Publications New Series, Peshawar. కొత్త రాజధానులుగా ఉన్నాయి.The Shahi Afghanistan and Punjab, 1973, pp 1, 45–46, 48, 80, Dr D. B. Pandey; The Úakas in India and Their Impact on Indian Life and Culture, 1976, p 80, Vishwa Mitra Mohan – Indo-Scythians; Country, Culture and Political life in early and medieval India, 2004, p 34, Daud Ali. Journal of the Royal Asiatic Society, 1954, pp 112 ff; The Shahis of Afghanistan and Punjab, 1973, p 46, Dr D. B. Pandey; The Úakas in India and Their Impact on Indian Life and Culture, 1976, p 80, Vishwa Mitra Mohan – Indo-Scythians.: The Hindu Shahis, and in the late ninth century great was [their fame] ... in 870 Kabul itself was captured [lost] ... But in the Panjab they consolidated their kingdom and established a new capital first at Hund. జయపాల ఆధ్వర్యంలోని హిందూ షహీస్ ప్రస్తుత తూర్పు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ ప్రాంతంలో ఘజనావిడ్సు నుండి సామ్రాజ్యాన్ని కాపాడడానికి సాగించిన పోరాటాలకు ప్రసిద్ధి చెందారు. జయపాలా గజ్నావిదుల ఏకీకరణలో ప్రమాదము గ్రహించి వారి రాజధాని నగరమైన గజ్ని మీద సెబుక్టిజిన్ పాలనలో ఒకసారి, ముస్లిం ఘజ్నావిదు, హిందూ షాహీ పోరాటాలను ప్రారంభించిన అతని కొడుకు మహ్మూద్ పాలనలో ఒకసారి దాడి చేసాడు. అయితే సెబుక్ టైగిన్ అతనిని ఓడించాడు ఫలితంగా ఆయన నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. జయపాలా చెల్లింపు రద్దుచేసి మరోసారి యుద్ధభూమికి చేరుకున్నాడు. అయితే జయపాలా కాబుల్ లోయ, సింధు నది మధ్య మొత్తం ప్రాంతంపై నియంత్రణను కోల్పోయాడు. thumb|left|250px|హిందూ షాహి సామ్రాజ్య పాలనలో 7 వ, 9 వ శతాబ్దాల మధ్యకాలంలో అంబా హిందూ దేవాలయ సముదాయం నిర్మించబడింది. జయపాలుల పోరాటానికి ముందు ఆయన పంజాబీ హిందువుల పెద్ద సైన్యాన్ని అభివృద్ధి చేసాడు. జయపాల పంజాబు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన సైన్యంలో 1,00,000 అశ్వదళం, అనేక మంది పదాతి దళాన్ని అభివృద్ధి చేసాడు. సైనికులను పెంచింది. ఫెరిష్టా అభిప్రాయంలో: ఏది ఏమయినప్పటికీ పాశ్చాత్య దళాల మీద ముఖ్యంగా గజ్ని యువ మహ్మూదు వైపు సైన్యం నిరాశకు గురైంది. 1001 సంవత్సరంలో సుల్తాన్ మహమూద్ అధికారంలోకి వచ్చి హిందూ కుష్కి ఉత్తరాన ఉన్న క్వారఖనిధులను స్వాధీనం చేసుకున్న వెంటనే జయపాలా మరోసారి ఘజ్నిపై దాడి చేసి పెషావర్ సమీపంలోని శక్తివంతమైన గజ్నావిద్ దళాలచే మరో ఓటమిని ఎదుర్కొన్నాడు. పెషావర్ యుద్ధం తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే షాహిసులకు ఆయన విపత్తు, అవమానం తెచ్చిపెట్టాడని ప్రజలు భావించడం అందుకు కారణం. జయపలా తరువాత ఆయన కుమారుడు ఆనందపాల పాలనా బాధ్యతలు చేపట్టాడు. తరువాత వచ్చిన ఇతర షాహీలు ఘజనవిదులకు వ్యతిరేకంగా చేసిన పలు పోరాటాలు అపజయం పొందాయి. హిందూ పాలకులు చివరకు కాశ్మీర్ శివాలిక్ పర్వతాలకు తరలి వెళ్ళారు. మధ్యయుగ ద్వితీయార్ధం (క్రీ.పూ 1200 – 1526) మధ్యయుగ ద్వీతీయార్ధకాలంలో మధ్య ఆసియా జాతీయుల ముస్లిం వంశాల కారణంగా ప్రాంతీయ ప్రముఖులు ఎదుర్కొన్న సమస్యలకు ప్రతీకగా ఉంది.ఇది ములిం ఆక్రమణలను రాజపుత్రులు అడ్డగించడానికి దారితీసింది. ఇది హిందూ, ముస్లిం రాజవంశాలు, సామ్రాజ్యాల అభివృద్ధి కొత్త సైనిక సాంకేతికత వ్యూహాల అభివృద్ధికి దారితీసింది. భక్తి ఉద్యమం, సిక్కిజం అభివృద్ధి చెందాయి. ముస్లిం జనసఖ్యాభివృద్ధి thumb|left|200px| సంపాదకుడు జేమ్స్ మెస్టన్ గా వెలువడిన 'హచిన్సన్ స్టోరీ ఆఫ్ ది నేషన్స్' లో భారతదేశ అధ్యాయంలో బొమ్మ టర్కీ ముస్లిం సైనికాధికారి " ముహమ్మదు బఖ్తియార్ ఖిల్జి " బీహారులో బౌద్ధసన్యాసుల సామూహిక హత్యాకాండ చేయించాడు. ఖిల్జీ సాగించిన ఉత్తర ఇండియా దాడులలో నలందా, విక్రమషీలా విశ్వవిద్యాలయాలు ధ్వంశం చేయబడ్డాయి. ఇందులో బ్రాహ్మణ, బౌద్ధ విద్యార్ధులు సామూహికంగా హత్యచేయబడ్డారు.]] చరిత్రలో స్థిరపడిన ఇతర వ్యవసాయ సమాజాలలాగా భారత ఉపఖండంలో ఉన్నవారి సుదీర్ఘ చరిత్రలో వారి మీద సంచార తెగలవారు దాడి చేశారు. ఉప-ఖండంలో ఇస్లాం ప్రభావాన్ని విశ్లేషిస్తూ వాయువ్య భారతీయ ఉపఖండం తరచుగా మధ్య ఆసియా నుండి దాడులకు లక్ష్యంగా ఉందని వివరించబడింది. ఆ కోణంలో ముస్లింల చొరబాట్లు, ముస్లిం దండయాత్రలు 1 వ సహస్రాబ్ది సమయంలో జరిగిన ముట్టడికి భిన్నంగా ఉన్నాయి.Richard M. Frye, "Pre-Islamic and Early Islamic Cultures in Central Asia", in Turko-Persia in Historical Perspective, ed. Robert L. Canfield (Cambridge U. Press c. 1991), 35–53. అయితే ముస్లింల చొరబాట్లను, తరువాత ముస్లిం దండయాత్రలను భిన్నమైనదిగా చెప్పాలంటే ముందటి ఆక్రమణదారుల వలె కాకుండా ముస్లిం విజేతలు సామాజిక వ్యవస్థలో తమ ఇస్లామిక్ గుర్తింపును నిలుపుకున్నారు. నూతనంగా చట్టపరమైన, పరిపాలనా వ్యవస్థలను సృష్టించారు. ఇది సాధారణంగా అనేక సందర్భాల్లో ముస్లిం-యేతర ప్రజల సొంత చట్టాలు, ఆచారాలకు వదిలివేయబడినప్పటికీ, ముస్లిం-వ్యతిరేక ప్రత్యర్థులను, సామూహిక ప్రజానీకాన్ని ఇది ప్రభావితం చేసింది. వారు ప్రవేశపెట్టిన కొత్త సాంస్కృతిక సంకేతాలు అప్పటికే ఉన్న సాంస్కృతిక సంకేతాలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇది ఒక నూతన భారతీయ సంస్కృతి పురోగతికి దారి తీసింది. ఇది ప్రాచీన భారత సంస్కృతి, ఆధునిక పాశ్చాత్యీకరణ చెందిన భారతీయ సంస్కృతికీ భిన్నంగా ఉంది. అదే సమయంలో భారతదేశంలో ఉన్న ముస్లింలు అధికంగా మతంమార్చుకున్న భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు. ఈ అంశం సంస్కృతుల సంశ్లేషణలో కూడా ముఖ్య పాత్ర పోషించింది.Eaton, Richard M. The Rise of Islam and the Bengal Frontier, 1204–1760. Berkeley: University of California Press, c1993 1993, accessed on 1 May 2007 ముస్లిం సామ్రాజ్యం అభివృద్ధి శత్రువుల రాజ్యాల రాజకీయ ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు విధ్వంశం చేయబడ్డాయి. ప్రజలు ఇస్లాం మతానికి బలవంతంగా మార్చబడ్డారు.der Veer, pg 27–29 జిజియా పన్ను చెల్లింపు, ముస్లిం-కాని జనాభా ప్రాణలు కోల్పోయే పరిస్థితి ఎదురైంది.Timur in the Political Tradition and Historiography of Mughal India, Irfan Habib, page 295–312 అలైన్ డానియేలు గుర్తించారు: ముస్లిములను రాజపుత్రులు అడ్డగించుట భారత ఉపఖండంలో ముస్లిం దండయాత్రల ముందు ఉత్తర, పశ్చిమ భారతదేశంలో అధిక భాగాన్ని రాజపుత్ రాజవంశాలు పాలించాయి. భారతదేశంలోని ఉమాయ్యదు పోరాటంతో అరబ్ ముస్లిం విస్తరణను అడ్డుకోవడంలో రాజపుత్రులు, దక్షిణ భారత చాళుక్య రాజవంశం విజయవంతమయ్యాయి. తరువాత మధ్య ఆసియా ముస్లిం టర్కులు ఉత్తరప్రదేశ్ హిందూ మతంలోకి రాజ్పుట్ రక్షణను చీల్చుకుని కేంద్రస్థానానికి ప్రవేశించారు. అయినప్పటికీ రాజపుత్రులు అనేక శతాబ్దాలుగా ముస్లిం టర్కిక్ సామ్రాజ్యాలపై దాడి కొనసాగించారు. సాంప్రదాయంగా బలమైన కట్టుబాట్లలో పాతుకుపోయిన ధైర్యమైన ప్రవర్తన విధానాలను పాటిస్తూ వారు పోరాటం కొనసాగించారు. 10 వ శతాబ్దంలో రాజపుత్ర చౌహాన్ రాజవంశం ఢిల్లీ, అజ్మీరుల మీద నియంత్రణను నెలకొల్పింది. ఈ రాజవంశంలో అత్యంత ప్రసిద్ధ పాలకుడు పృథ్వీరాజ్ చౌహాన్. అతని పాలన భారత చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒకటిగా గుర్తించబడింది. ఆయన ముస్లిం సుల్తాన్ ముహమ్మద్ ఘోరితో పోరాడాడు. మొదటి తారియన్ యుద్ధంలో గోరీ భారీ నష్టంతో ఓడిపోయాడు. అయినప్పటికీ తరువాతి తారియన్ యుద్ధం రాజ్ పుట్ సైన్య ఓటమి భారతదేశంలో ముస్లిం పాలనకు పునాది వేసింది.A Global Chronology of Conflict: From the Ancient World to the Modern Middle East, Vol. I, ed. Spencer C. Tucker, (ABC-CLIO, 2010), 263. మహారాజా హమీర్ ఆధ్వర్యంలో మేవార్ రాజవంశం ముఘల్ తుగ్లకును, అతని ప్రధాన మిత్రరాజులైన బర్గుజరాతులతో ఓడించి ఆయనను ఖైదు చేసాడు. తుగ్లక్ విదుదలకు చెల్లించిన భారీ మూల్యంలో మేవారు భూములు ఉన్నాయి. ఈ ఘటన తరువాత ఢిల్లీ సుల్తానేటు కొన్ని వందల సంవత్సరాలు చిత్తూరుపై దాడి చేయలేదు. రాజపుత్రులు వారి స్వాతంత్రాన్ని తిరిగి స్థాపించారు. బెంగాలు, ఉత్తరాన పంజాబులో చాలా రాజపుత్ర రాజ్యాలు స్థాపించబడ్డాయి. టోమర్లు గ్వాలియర్లో రాజ్యం స్థాపించారు. మాన్ సింగ్ తోమార్ తిరిగి నిర్మించిన గ్వాలియర్ కోట ఇప్పటికీ ఉంది. ఈ కాలంలో మేవారు ప్రముఖ రాజపుత్ర రాష్ట్రంగా ఉద్భవించింది. రాణా కుంభా మాల్వా, గుజరాత్ సుల్తానేట్స్ ఖర్చుతో తన రాజ్యాన్ని విస్తరించారు.Lectures on Rajput history and culture by Dr. Dasharatha Sharma. Publisher: Motilal Banarsidass, Jawahar Nagar, Delhi 1970. . తదుపరి గొప్ప రాజపుత్ర పాలకుడు (మేవారు) రానా సంగా ఉత్తర భారతదేశంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతని లక్ష్యాలు పరిధి వృద్ధి చెందాయి - అతను ఆ సమయంలో ఢిల్లిని పాలిస్తున్న ముస్లిం పాలకులను జయించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఖాన్వా యుద్ధంలో అతని ఓటమి భారతదేశంలో కొత్త మొఘల్ రాజవంశాన్ని సమైఖ్యం చేసింది. మహారాణా ఉదయ్ సింగు ఆధ్వర్యంలో మేవారు రాజవంశం ముఘలు చక్రవర్తి అక్బరు చేతిలో ఓడిపోయి వారి రాజధాని చిత్తోరులో పట్టుబడ్డాడు. ఈ సంఘటన కారణంగా రెండవ ఉదయ్ సింగు ఉదయపూరును స్థాపించాడు. ఇది మేవార్ రాజ్యానికి కొత్త రాజధానిగా మారింది. అతని కుమారుడు మేవారు మహారాణా ప్రతాపు మొఘలులను గట్టిగా వ్యతిరేకించారు. అక్బరు అతనికి వ్యతిరేకంగా అనేక మార్లు సైన్యాలను పంపించాడు. చివరికి చిట్టోర్ కోట మినహాయించి మేవారు లోని అన్ని ప్రాంతాలపై నియంత్రణ సాధించాడు.John Merci, Kim Smith; James Leuck (1922). "Muslim conquest and the Rajputs". The Medieval History of India pg 67–115 చిత్తోరు కోట భారత ఉపఖండంలో అతిపెద్ద కోటగా పరిగణించబడుతుంది. ఈ కోట 15 వ - 16 వ శతాబ్దాలలో ముస్లిం సైన్యాల దాడులను మూడు సార్లు ఎదుర్కొన్న రాజపుత్ర నిరోధకతకు చిహ్నంగా మారింది. 1303 లో అల్లావుద్దిన్ ఖల్జీ రాణా రతన్ సింగును ఓడించాడు. 1535 లో గుజరాతు సుల్తానేటు బహదూర్ షా బిక్రమ్జీత్ సింగును ఓడించాడు. 1567 లో అక్బరు మహారాణా రెండవ ఉదయ్ సింగును ఓడించాడు. ఆయన కోటను వదిలి ఉదయపూరును స్థాపించాడు. ప్రతిసారీ పురుషులు శత్రువులను పోరాడుతూ కోట గోడల నుండి శత్రువులను పరుగెత్తిస్తూ ధైర్యంగా పోరాడి చివరకు ఓడిపోయారు. ఈ ఓటమి తరువాత చిత్తోరు ఘడ్ కోటలో యుద్ధాల్లో చనిపోయిన రాజపుత్ర సైనికులకు భార్యలు, పిల్లలు అనేకమంది జౌహర్ కట్టుబడి ఆత్మాహుతి చేసుకున్నారు. మొదటిసారిగా 1303 లో జరిగిన యుద్ధంలో చంపబడిన రారంసింగు భార్య రాణి పద్మిని, ఆ తరువాత 1537 లో రాణి కర్ణనావతి ఆత్మాహుతి చేసుకున్నారు. ఢిల్లీ సల్తనత్ - (సల్తనత్  = సుల్తానుల పరిపాలన రాజ్యము) చరిత్రకారుడు డాక్టర్. ఆర్.పి. త్రిపాఠి ఇలా పేర్కొన్నాడు: ఢిల్లీ కేంద్రంగా పాలించిన ఢిల్లీ సల్తనత్ లు ముస్లిం సల్తనత్ లుగా పలు టర్కో-ఇండియను రాజవంశాలు,William Hunter (1903), , 23rd Edition, pp. 124–127 పఠాను సంతతికి చెందిన అనేక రాజవంశాలు పాలించాయి. 13 వ శతాబ్దం నుండి 16 వ శతాబ్దం వరకు భారత ఉపఖండంలోని అధిక భూభాగాన్ని పాలించింది.Delhi Sultanate, Encyclopædia Britannica భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఢిల్లీ సల్తనత్ దక్షిణాసియా, పశ్చిమాసియాలతో చేరిన ఆసియా ఖండాన్ని విస్తృతంగా ప్రభావితం చేసింది. మధ్య ఆసియా సోఫాన భూభాగం నుండి సంచారజాతులకు చెందిన టర్కిక్ ప్రజల ప్రవాహం మొదలైంది. మధ్యప్రాచ్యంలో ఇస్లామిక్ కాలిఫ్రేట్ ప్రత్యర్థి రాజ్యాలలోని ముస్లిం పాలకులు ముస్లిమేతరులైన సంచార టర్కీలను బానిసలుగా మార్చడం మొదలుపెట్టినప్పుడు వారిలో చాలా మంది నమ్మకమైన సైనిక బానిసలుగా (మామ్లులు) మారడం మొదలైంది. 9 వ శతాబ్దానికి మామ్లులు అని పిలువబడిన వీరు త్వరలోనే ముస్లిం భూములకు వలస వచ్చి ఇస్లామీయ రాజ్యంలో భాగంగా మారారు. అనేక టర్కీ మమ్లుకు బానిసలు చివరికి పాలకులుగా ఎదిగి ముస్లిం ప్రపంచం పెద్ద భాగాలను స్వాధీనం చేసుకున్నారు. భారత ఉపఖండం మీద తమ దృష్టిని మరల్చటానికి ముందు ఈజిప్టు నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు మమ్లుక్ సల్తనత్ లను స్థాపించారు. 12 వ - 13 వ శతాబ్దాలలో మద్య ఆసియా టర్కులు ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాల్లో దాడి చేసి హిందూ చక్రవర్తుల ఆధీనంలో ఉన్న ఢిల్లీని స్వాధీనం చేసుకుని ఢిల్లీ సల్తనత్ ను స్థాపించారు. తరువాతి బానిస రాజవంశం ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఉత్తర భారతదేశంలోని పెద్ద ప్రాంతాలను జయించగలిగారు. ఖఇల్జీ రాజవంశం చాలావరకు మధ్య భారతదేశాన్ని స్వాధీనం చేసుకుంది. దక్షిణ భారతదేశంలోని ప్రధాన హిందూ సామ్రాజ్యాలు సామంతరాజ్యాలుగా మారడానికి ఇది దారితీసింది. అయినప్పటికీ వారు భారత ఉపఖండాన్ని జయించి సమైక్యం చేయడంలో విజయవంతం కాలేదు. సల్తనత్ భారతీయ సాంస్కృతిక పునరుద్ధరణకు కొంతకాలం ఉపయోగపడింది. ఫలితంగా "ఇండో-ముస్లిం" సంస్కృతుల కలయికతో నిర్మాణం, సంగీతం, సాహిత్యం, మతం, వస్త్రాలలో శాశ్వతమైన సింక్రోనిక్ స్మారక చిహ్నాలను ఏర్పరచబడ్డాయి. ఢిల్లీ సుల్తానుల కాలంలో పర్షియన్లు, టర్కిక్, జర్మనీ భాష మాట్లాడే వలసదారులు స్థానిక సంస్కృత, ప్రాకృతం స్థానిక మాట్లాడేవారితో కలిసిన ఫలితంగా ఉర్దూ భాష (వివిధ టర్కిక్ మాండలికాలలో "గుంపు" లేదా "శిబిరం" అని అర్ధం) జనించింది. రజియా సుల్తానా (1236-1240) వంటి మహిళా పాలకులు ఉన్న ఏకైక ఇండో-ఇస్లామిక్ సామ్రాజ్యంగా ఢిల్లీ సల్తనత్ ప్రత్యేకత సంతరించుకుంది. ఏదేమైనా, ఢిల్లీ సుల్తానేట్ కూడా భారతీయ ఉపఖండంలో పెద్ద ఎత్తున విధ్వంసం, ఆలయాల అపవిత్రతపరచడానికి కారణంగా నిలిచింది.Richard Eaton (2000), Temple Desecration and Indo-Muslim States, Journal of Islamic Studies, 11(3), pp 283–319 ఢిల్లీ సల్తనత్ కాలంలో భారతీయ నాగరికత, ఇస్లామిక్ నాగరికత మధ్య ఒక సంశ్లేషణ జరిగింది. తరువాతి బహుళ-సాంస్కృతిక సమాజం విస్తృత అంతర్జాతీయ నెట్వర్కులు సామాజిక, ఆర్థిక వ్యవస్థలతో సహా, ఆఫ్రో-యురేషియా భూభాగాలను విస్తరించింది. ఇది వస్తువులు, ప్రజలు, సాంకేతికతలు, ఆలోచనలు ఒకరితో ఒకరు పంచుకోడానికి సహకరించింది. భారతీయ కులీనుల నుండి టర్కిక్ ముస్లిం కులీనులకు అధికారం బదిలీ చేయబడింది. పెరుగుతున్న ప్రపంచ వ్యవస్థకు భారతీయ ఉపఖండాన్ని అనుసంధానించడానికి ఢిల్లీ సల్తనత్ బాధ్యత వహించింది. ఇది భారతీయ సంస్కృతిని గణనీయమైన స్థాయిలో ప్రభావితం చేసి విస్తృత అంతర్జాతీయ నెట్వర్కుగా రూపొందింది. 13 వ శతాబ్దంలో మంగోలు సామ్రాజ్యం ఆసియా, తూర్పు ఐరోపాలోని చాలా ప్రాంతాలను ఆక్రమించుకుని స్వాధీనం చేసుకుంది. అయితే భారతదేశ ఢిల్లీ సల్తనత్ మంగోలు దండయాత్రను విజయవంతంగా తిప్పికొట్టింది. టర్కిక్ మమ్లుక్ బానిస సైన్యం వారి విజయానికి ముఖ్య కారణంగా ఉంది. మంగోల వంటి సంచార అశ్వికదళ యుద్ధనైపుణ్యంలో టర్కీ మమ్లుకులు ఆరితేరిన వారు కనుక ఈ విజయం సాధ్యం అయింది. మంగోలులను ఢిల్లీ సల్తనత్ ను తిప్పికొట్టకుండా ఉంటే మంగోలు సామ్రాజ్యం భారతదేశంలో విస్తరించడానికి అవకాశం ఉంది. మధ్య ఆసియాలోని టర్కో-మంగోన్ విజేత తైమూరు (టమేర్లేన్) ఉత్తర ఢిల్లీ నగరం లోని తుగ్లకు రాజవంశం సుల్తాన్ నాసిర్-యు దిన్ మెహ్ముదు మీద దాడి చేశాడు. 1398 డిసెంబరు 17 న సుల్తాను సైన్యం ఓడిపోయింది. తైమూరు ఢిల్లీకి చేరుకుని మూడు రోజులు పగలు, రాత్రులు దోపిడీ చేసి నగరంలో విధ్వంసం సృష్టించి శిథిలాలను వదిలివేశారు. సాయిసైదు విద్వాంసులు, "ఇతర ముస్లింలు" (కళాకారులు) తప్ప మిగిలిన మొత్తం నగరాన్ని దోచుకోవాలని తైమూరు ఆదేశించాడు. ఒక్క రోజులో 100,000 యుద్ధ ఖైదీలు చంపబడ్డారు. ఢిల్లీ తొలగింపు తరువాత సల్తనత్ ను గణనీయంగా బాధించబడి లోడి రాజవంశ పాలనలో కొంతకాలం పునరుద్ధరించబడింది. భక్తి ఉద్యమం, సిక్కిజం, హిమాలయన్ బుద్ధిజం thumb|సిక్కుల గురువు గురు గోవింద్ సింగ్ రచించిన దశం గ్రంథ. 24 అవతారాలు గల విష్ణు, రుద్ర, బ్రహ్మ, హిందూ యుద్ధ దేవత చండీ, బచ్చితర్ నాటక్ లో రాముని కథ ముఖ్యమైన అంశాలు.J Deol (2000), Sikh Religion, Culture and Ethnicity (Editors: AS Mandair, C Shackle, G Singh), Routledge, , pages 31–33 మధ్యయుగ హిందూ మతం నుండి భక్తి ఉద్యమం తలెత్తింది. తరువాత ఇది సిక్కు మతంలో విప్లవాత్మకంగా మారింది. ఇది దక్షిణ భారతదేశంలో (ప్రస్తుతం తమిళనాడు, కేరళ ప్రాంతాలలో)7 వ శతాబ్దంలో ఉద్భవించి ఉత్తరంవైపు వ్యాపించింది. 15 వ నుండి 17 వ శతాబ్దం మధ్యకాలంలో తూర్పు, ఉత్తర భారతదేశాల్లో ఇది విస్తరించింది. భక్తి ఉద్యమం వైష్ణవిజం (విష్ణు), శైవిజం (శివ), శాక్తేయం (శక్తి దేవతల), స్మార్టిజం వంటి వేర్వేరు దేవుళ్ళు, దేవతల చుట్టూ ప్రాంతాలవారీగా అభివృద్ధి చెందింది.Lance Nelson (2007), An Introductory Dictionary of Theology and Religious Studies (Editors: Orlando O. Espín, James B. Nickoloff), Liturgical Press,, pages 562–563SS Kumar (2010), Bhakti – the Yoga of Love, LIT Verlag Münster, , pages 35–36Wendy Doniger (2009), Bhakti, Encyclopædia Britannica; The Four Denomination of Hinduism Himalayan Academy (2013) ఈ కదలిక అనేక మంది కవి-సన్యాసుల కృషితో మరింత స్ఫూర్తి పొందింది. వీటిలో విస్తృత స్థాయిలో ద్వైత, అద్వైత వేదాంత సిద్ధాంతాలు ఉన్నాయి. సిక్కుమతానికి మొదటి గురు నానకు ప్రసంగాలు ఆధారంగా ఉన్నాయి.Singh, Patwant; (2000). The Sikhs. Alfred A Knopf Publishing. Pages 17. . సిక్కుమతం పదిమంది సిక్కు గురువుల ఆధ్యాత్మిక బోధనల మీద ఆధారపడింది. 10 వ గురువు మరణం తరువాత గురు గోవింద్ సింగు సిక్కు గ్రంథం " గురు గ్రంథ్ సాహిబు " సిక్కులకు ఆధ్యాత్మిక మార్గదర్శిగా పనిచేసే శాశ్వతమైన, వాస్తవిక గురు సాహిత్య స్వరూపంగా మారింది.Louis Fenech and WH McLeod (2014), Historical Dictionary of Sikhism, 3rd Edition, Rowman & Littlefield, , page 17William James (2011), God's Plenty: Religious Diversity in Kingston, McGill Queens University Press, , pages 241–242 భారతదేశంలో బౌద్ధమతం హిమాలయ రాజ్యాలైన నామ్గ్యాలు రాజ్యం (లఢక్), సిక్కిం రాజ్యం (సిక్కిం), మధ్యయుగ కాలం నాటి చుటియా రాజ్యంలో (అరుణాచల్ ప్రదేశ్) అభివృద్ధి చెందింది. విజయనగర సామ్రాజ్యం 1336 లో మొదటి హరిహారా, అతని సోదరుడు మొదటి బుక్క రాయా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.History of Classical Sanskrit Literature: by M. Srinivasachariar p.211 ఇది హొయసల సామ్రాజ్య, కాకతీయ సామ్రాజ్యం, పాండియన్ సామ్రాజ్యాల రాజకీయ వారసత్వంగా ఉద్భవించింది. 13 వ శతాబ్దం ముగిసేనాటికి దక్షిణ భారతాన్ని ఇస్లామీయ దండయాత్రల నుండి రక్షించే శక్తిగా ఈ సామ్రాజ్యం ప్రాచుర్యంలోకి వచ్చింది. 1565 లో దక్కను సుల్తానేట్ల మిశ్రమ సైన్యాల చేతిలో భారీ సైనిక ఓటమి తర్వాత దాని శక్తి క్షీణించినప్పటికీ కూడా ఇది 1646 వరకు కొనసాగింది. ఈ సామ్రాజ్యానికి దాని రాజధాని నగరమైన విజయనగరం పేరు పెట్టబడింది. దీని శిథిలాలు ప్రస్తుతం హంపిని చుట్టూ కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఇది కర్ణాటక రాష్ట్రంలో " ప్రపంచ వారసత్వ సంపద "గా గుర్తించబడుతుంది.South India by Amy Karafin, Anirban Mahapatra p.32 సామ్రాజ్యం స్థాపించిన మొదటి రెండు దశాబ్దాలలో మొదటి హరిహరరాయలు తుంగభద్ర నదికి దక్షిణంలో అత్యధిక భూభాగం మీద నియంత్రణ సాధించాడు. పుర్వాపశ్చిమ సమూద్రిధిస్వార ("తూర్పు, పశ్చిమ సముద్రాల అధిపతి") పేరును సంపాదించాడు. 1374 నాటికి మొదటి హరిహారరాయుడి వారసుడు ఆర్కోట, కొండవీడు రెడ్డి, మధుర సుల్తాను, పశ్చిమంలో గోవాపై నియంత్రణ సాధించి, ఉత్తరాన తుంగభద్ర-కృష్ణా నది డోయబులను అధిగమించాడు.Kamath (2001), p162 విజయనగర సామ్రాజ్యం తరువాత సామ్రాజ్యంగా మారింది. మొదటి బుక్కరా రాయుని రెండవ కుమారుడు రెండవ హరిహరరాయుడు కృష్ణా నదిని అధిగ మించి రాజ్యాన్ని మరింత విస్తరించి దక్షిణ భారతదేశం మొత్తాన్ని విజయనగర చ్ఛత్రపు నీడలోకి తీసుకుని వచ్చాడు.The success was probably also due to the peaceful nature of Muhammad II Bahmani, according to తదుపరి పాలకుడు మొదటి దేవ రాయాడు ఒరిస్సా గజపతులకు వ్యతిరేకంగా విజయం సాధించి కోటలను నిర్మించి, నీటిపారుదల వంటి ముఖ్యమైన పనిని చేపట్టాడు.From the notes of Portuguese Nuniz. Robert Sewell notes that a big dam across was built the Tungabhadra and an aqueduct long was cut out of rock (). ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కొంటి ఆయనను భారతదేశంలో అత్యంత శక్తివంతమైన పాలకునిగా పేర్కొన్నాడు.Columbia Chronologies of Asian History and Culture, John Stewart Bowman p.271, (2013), Columbia University Press, New York, రెండవ దేవా రాయ (గజబెటికార అని పిలిచేవారు)Also deciphered as Gajaventekara, a metaphor for "great hunter of his enemies", or "hunter of elephants" (Kamath 2001, p163). సింహాసనం 1424 లో సంగమ రాజవంశం పాలకులు అత్యంత సామర్థ్యతతో పాలన చేసారు. ఆయన తిరుగుబాటు చేసిన ఛాందసవాస ప్రభువులను, అలాగే కాలికట్ జామోరిన్ దక్షిణాన క్విలాన్లను తిరస్కరించాడు. అతను శ్రీలంక ద్వీపాన్ని ఆక్రమించి పెగూ, తనస్సేరిమ్ వద్ద ఉన్న బర్మా రాజుల మీద ఆధిపత్యం సాధించాడు.From the notes of Persian Abdur Razzak. Writings of Nuniz confirms that the kings of Burma paid tributes to Vijayanagara empire Kamath (2001), p164From the notes of Abdur Razzak about Vijayanagara: a city like this had not been seen by the pupil of the eye nor had an ear heard of anything equal to it in the world (Hampi, A Travel Guide 2003, p11) సామ్రాజ్యం వారసత్వంగా దక్షిణ భారతదేశం అంతటా విస్తరించిన అనేక స్మారకనిర్మాణాలు ఉన్నాయి. వీటిలో హంపిలోని నిర్మాణ సమూహం ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలో పూర్వపు ఆలయ నిర్మాణ సంప్రదాయాలు విజయనగర శిల్ప శైలిలో కలిసిపోయాయి. అన్ని విశ్వాసాలు, మాండలికాలు కలిసిపోవటం హిందూ దేవాలయ నిర్మాణంలో నూతన ఆవిష్కరణను ప్రోత్సహించింది. మొదట దక్కనులో, తర్వాత స్థానిక గ్రానైట్ ఉపయోగించి ద్రావిడ సంప్రదాయంలో ఆలయాలు నిర్మించబడ్డాయి. కేరళలో విజయనగర సామ్రాజ్యం రక్షణలో దక్షిణ భారతీయ గణిత శాస్త్రం అభివృద్ధి చెందింది. 14 వ శతాబ్దంలో సంగ్రామమాగ్రామాకు చెందిన దక్షిణ భారత గణిత శాస్త్రజ్ఞుడు మాధవ ప్రసిద్ధ " కేరళ స్కూల్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్సును " స్థాపించాడు. ఇది మధ్యయుగ దక్షిణ భారతదేశంలో పరమేశ్వర, నీలకంఠ సోమయాజి, జ్యేష్ఠదేవ వంటి గొప్ప దక్షిణ భారతీయ గణిత శాస్త్రవేత్తలను సృష్టించింది.History of Science and Philosophy of Science by Pradip Kumar Sengupta p.91 సమర్ధవంతమైన పరిపాలన, బలమైన విదేశీ వాణిజ్యం, నీటిపారుదల, నీటి నిర్వహణ వ్యవస్థలు వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాలను తీసుకువచ్చాయి. Medieval India: From Sultanat to the Mughals-Delhi Sultanat (1206–1526) by Satish Chandra p. 188–189 కన్నడ, తెలుగు, తమిళం, సంస్కృతంలో క్రొత్త ఎత్తులను చేరుకున్నాయి. సున్నితమైన కళలు, సాహిత్యాలను సామ్రాజ్యం పోషించింది. కర్ణాటక సంగీతం ప్రస్తుత రూపం సంతరించుకుంది.Art History, Volume II: 1400–present by Boundless p.243 విజయనగర సామ్రాజ్యం హిందూయిజం ప్రోత్సహించడం ద్వారా ప్రాంతీయవాదాన్ని అధిగమించింది దక్షిణభారతదేశాన్ని సమైక్యం చేసింది. శ్రీ కృష్ణదేవరాయ పాలనలో సామ్రాజ్యం దాని శిఖరానికి చేరుకుంది. విజయనగర సైన్యాలు నిరంతరాయంగా విజయం సాధించాయి. ఉత్తర దక్కను తూర్పు దక్కను ప్రాంతాలలోని కాళింగతో సహా సుల్తానేట్ల క్రింద ఉన్న ప్రాంతాలు సామ్రాజ్యంతో కలపబడ్డాయి. అదేసమయంలో దక్షిణప్రాంతాలన్నింటి మీద నియంత్రణను కొనసాగించింది.World and Its Peoples: Eastern and Southern Asia by Marshall Cavendish Corporation p.337 కృష్ణదేవరాయల కాలంలో అనేక ముఖ్యమైన స్మారక కట్టడాలు నిర్మాణాపు పునులు పూర్తి చేసుకున్నాయి. తాలికోట యుద్ధం (1565) లో ఓటమి తరువాత విజయనగర తిరోగమనం మొదలైంది. తళ్ళికోటా యుద్ధంలో అలియ రామరాయ మరణం తరువాత తిరుమల దేవ రాయుడు అరవీడు రాజవంశంని ప్రారంభించి నాశనం చేయబడిన హంపీని వదిలి ఒక నూతన రాజధానిగా పెనుగొండను స్థాపించి విజయనగర సామ్రాజ్యం అవశేషాలను పునఃస్థాపించేందుకు ప్రయత్నించారు. 1572 లో తిరుమల మిగిలిన రాజ్యాన్ని తన ముగ్గురు కుమారులకు పంచియిచ్చి మరణించే వరకు (1578 లో ) ఆయన ఆధ్యాత్మికతను ఆచరించాడు. అరవీడు రాజవంశం వారసులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ సామ్రాజ్యం బీజాపూర్ సుల్తానేటు, ఇతరులతో కొనసాగిన యుద్ధాల కారణంగా 1614 లో పతనావస్థకు చేరుకుని 1646 లో ముగిసింది.Kamath (2001), p174 ఈ కాలంలో దక్షిణ భారతదేశంలో ఎక్కువ రాజ్యాలు విజయనగర నుండి విడిపోయి స్వతంత్రంగా మారాయి. వీటిలో మైసూర్ కింగ్డమ్, కలాడీ నాయక, మధుర నాయక్లు, తంజోర్ నాయక్లు, చిత్రదుర్గ నాయకులు, జిన్గే నాయక్ రాజ్యం - వీటన్నింటికీ స్వాతంత్ర్యం ప్రకటించాయి. విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారత దేశ చరిత్రలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది.Kamath (2001), p220, p226, p234 thumb|800px|center|దక్షిణ గోపురం నుండి ఉత్తరంవైపు వీక్షిస్తున్నప్పుడు మీనాక్షి ఆలయం. ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంలో మరల నిర్మించబడింది.|alt=ఆలయం ప్రాంగణం -ఎత్తునుండి తీసిన చిత్రం. ప్రాంతీయ శక్తులు 13 వ శతాబ్దం మధ్య నుండి రెండున్నర శతాబ్దాల కాలం ఉత్తర భారతదేశంలో రాజకీయాలను ఢిల్లీ సుల్తానేటు, దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం ఆధిపత్యం వహించాయి. అయినప్పటికీ ఇతర ప్రాంతీయ శక్తులు కూడా బలోపేతంగా ఉన్నాయి. రెడ్డి రాజవంశం ఢిల్లీ సుల్తానేటును ఓడించడంలో విజయం సాధించి ఉత్తరభారతంలో కటక్ నుండి దక్షిణభారతంలో కంచి వరకూ తమ పాలనను విస్తరించి చివరకు విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేయబడింది. ఉత్తరభారతంలో రాజపుత్ర రాజ్యాలు పశ్చిమ, మధ్య భారతదేశంలో ఆధిపత్య శక్తిగా మిగిలిపోయాయి. మేవారు రానా రాజపుతానాలో శక్తివంతమైన హిందూ రాజపుత్ర సమాఖ్య ఆధిపత్యంలో రాజపుత్ర రాజ్యాలు సమైక్యశక్తిగా నిలిచాయి. ఈ సమయంలో రాజపుత్ర సైన్యాలు ఢిల్లి సుల్తాను సైన్యంపై నిరంతరం విజయం సాధించాయి.I. Austin, Mewar The World's Longest Serving Dynasty దక్షిణాభారతంలో స్థాపించబడిన " బహుమనీ సుల్తానేటు "ను ఒక మతంమారిన బ్రాహ్మణుడు లేదా బ్రాహ్మణత్వం పట్ల గౌరవాదరాలు ఉన్న వ్యక్తిచేత స్థాపించబడినందున దానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు.The Discovery of India, J.L.Nehru ఇది విజయనగర ప్రధాన ప్రత్యర్థిగా విజయనగర సామ్రాజ్యానికి తరచూ కష్టాలు సృష్టించింది.Farooqui Salma Ahmed, A Comprehensive History of Medieval India: From Twelfth to the Mid-Eighteenth Century, (Dorling Kindersley Pvt. Ltd., 2011) 16 వ శతాబ్దం ప్రారంభంలో విజయనగర సామ్రాజ్యం కృష్ణదేవరాయలు బహ్మానీ సుల్తానేటు చివరి శక్తిశేషాన్ని ఓడించారు. దీని తరువాత బహ్మానీ సుల్తానేటు పతనం అయింది.A Social History of the Deccan, 1300–1761: Eight Indian Lives, by Richard M. Eaton p.88 తరువాత ఇది 5 చిన్న డక్కను సుల్తానేట్లుగా విభజించబడింది.The Five Kingdoms of the Bahmani Sultanate 1490 లో అహ్మదు నగర స్వాతంత్ర్యం ప్రకటించింది. తరువాత సంవత్సరంలో బీజాపూరు, బెరార్లు స్వతంత్రం ప్రకటించారు. గోల్కొండ 1518 లో స్వతంత్రం పొందింది. 1528 లో బిదారు స్వతంత్రం ప్రకటించింది.Majumdar, R.C. (ed.) (2007). The Mughul Empire, Mumbai: Bharatiya Vidya Bhavan, , p.412 సాధారణంగా ప్రత్యర్థులు అయినప్పటికీ 1565 లో విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మిత్రపక్షాలుగా సమైక్యమై " తాళ్ళికోట యుద్ధం " విజయనగర సామ్రాజ్యం శాశ్వతంగా బలహీనపడింది. తూర్పు భాగంలో గజపతి సామ్రాజ్యం ప్రాంతీయ సంస్కృతి, వాస్తుశిల్పం వృద్ధితో బలమైన ప్రాంతీయ శక్తిగా మిగిలిపోయింది. కపిలేంద్రదేవుని ఆధిపత్యంలో గజపతులు సామ్రాజ్యాన్ని ఉత్తరభారతంలో గంగా నుండి దక్షిణభారతంలో కావేరీ వరకు విస్తరించారు. ఈశాన్య భారతదేశంలో 6 శతాబ్దాలుగా అహోం రాజ్యం ఒక ప్రధాన శక్తిగా ఉంది. లచిత్ బోర్ఫుకన్ నేతృత్వంలో అహోమ్స్ " అహోమ్-మొఘల్ ఘర్షణల " సమయంలో సతీఘాట్ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని వంచనతో ఓడించారు. ఈశాన్య భారతదేశంలో, తూర్పు భారతదేశంలో ఉన్న మణిపూరు రాజ్యం కాంగ్లా ఫోర్టును అధికార కేంద్రంగా చేసుకుని పాలించింది. ఇది అధునాతన హిందూ గవుడియా వైష్ణవ సంస్కృతిని అభివృద్ధి చేసింది. ఆరంభకాల ఆధునిక కాలం (సా.శ.1526 – 1858) భారత చరిత్రలో తొలి ఆధునిక కాలం మొఘల్ వంశ విస్తరణ,పతన కాలంగా ( 1526–1858 CE) పరిగణిస్తారు. ఈ కాలంలో హిందూ, మహమ్మదీయ సాంస్కృతిక కలగలుపుగా భారత-ఇస్లామీయ వాస్తుశిల్పం రూపు దిద్దుకొంది. ; మరాఠా సామ్రాజ్యం, సిఖ్ సామ్రాజ్యం విస్తరణ, బ్రిటీషు పరిపాలన ప్రారంభంతో అంతమైంది. మొఘలు సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం 1526 లో ఫెర్గానా లోయ (ఆధునిక ఉజ్బెకిస్తాన్) నుండి తైమూరు వారసుడైన తైమూరిదు బాబరు, చెంఘిస్ ఖాన్ వారసుడు బాబర్, ఖైబర్ పాస్ గుండా పయనించి వచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇందులో ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ భాగంగా ఉండేవి. అతని కుమారుడు హుమాయును 1540 లో ఆఫ్ఘన్ యోధుడు షేర్ షా సూరి చేతిలో ఓడిపోయాడు. ఫలితంగా హుమయూన్ కాబూల్ వైపు తిరుగుబాటు చేయవలసి వచ్చింది. షేర్ షా మరణించిన తరువాత అతని కుమారుడు ఇస్లాం షా సూరి, ఆయన హిందూ సైన్యాధ్యక్షుడు హేము విక్రమాదిత్య 1556 లో ఢిల్లీ కేంద్రంగా ఉత్తర భారతదేశంలో లౌకిక పాలనను స్థాపించారు. ఢిల్లీ యుద్ధంలో విజయం సాధించిన తరువాత అక్బర్ దళాలు 1556 నవంబరు 6 న రెండవ పానిపట్టు యుద్ధంలో హేమును ఓడించాయి. బాబరు మనవడు అయిన గొప్ప చక్రవర్తి అక్బర్ ది గ్రేట్ హిందువులతో మంచి సంబంధాన్ని ఏర్పరచటానికి ప్రయత్నించాడు. జైనమతం పవిత్ర దినాల్లో అక్బర్ "అమరీ" లేదా జంతువులను చంపకూడదు అని ప్రకటించాడు. అతను ముస్లిమేతరుల కోసం జిజియా పన్నును వెనక్కి తీసుకున్నాడు. మొఘల్ చక్రవర్తులు స్థానిక రాజకుటుంబాలతో వివాహ సంబంధం ఏర్పరుచుకుని స్థానిక మహారాజాలతో రాజకీయ మైత్రిని సాధించాడు. పురాతన భారతీయ శైలులతో వారి టర్కో-పెర్షియన్ సంస్కృతిని అనుసంధానించడానికి ప్రయత్నించాడు. ఇది ఒక ప్రత్యేక ఇండో-పర్షియన్ సంస్కృతి, ఇండో-సార్సెనిక్ నిర్మాణాన్ని సృష్టించింది. అక్బర్ రాజపుత్ర యువరాణి మరీయమ్-జుమానీని వివాహం చేసుకున్నాడు. వారికి జన్మించిన జహంగీర్ రాజ్పుత్, మొగల్ వారసత్వంతో భవిష్యత్తు మొఘల్ చక్రవర్తి అయ్యాడు.Jeroen Duindam (2015), Dynasties: A Global History of Power, 1300–1800, page 105, Cambridge University Press జహంగీర్ తన తండ్రి విధానాన్ని అనుసరించాడు. 1600 నాటికి మొఘల్ రాజవంశం భారత ఉపఖండంలో అధిక భాగాన్ని పాలించింది. షాజహాన్ పాలన మొఘల్ నిర్మాణకళకు స్వర్ణ యుగం. ఆయన నిర్మించిన స్మారక కట్టడాలలో అత్యంత ప్రసిద్ధమైన తాజ్ మహల్ (ఆగ్రా), మోతీ మసీదు, (ఆగ్రా), ఎర్ర కోట, జమా మసీదు (ఢిల్లీ), లాహోర్ ఫోర్ట్ ఉన్నాయి. మొఘల్ యుగం "భారతదేశం చివరి స్వర్ణ యుగం"గా పరిగణించబడింది.Abraham Eraly (2007), The Mughal World: Life in India's Last Golden Age, page 5, Penguin Books ఇది భారత ఉపఖండంలో ఉనికిలో ఉన్న రెండవ అతిపెద్ద సామ్రాజ్యంగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 24.4% నియత్రిస్తూ చైనాను వెనుకకు నెట్టింది.Maddison, Angus (2003): Development Centre Studies The World Economy Historical Statistics: Historical Statistics, OECD Publishing, , page 261 తయారీలో ప్రపంచ ప్రథమస్థానంలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా చైనాను అధిగమించింది. ఇది ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో 25% ఉత్పత్తి చేస్తుంది. మొఘల్ సామ్రాజ్యం చేపట్టిన వ్యవసాయభూముల సంస్కరణలు వ్యవసాయ ఉత్పత్తికి సహకరించాయి.John F. Richards (1995), The Mughal Empire, page 190, Cambridge University Press ప్రారిశ్రామిక విధానాల పనితీరు పారిశ్రామిక ఉత్పాదకత అభివృద్ధికి సహకరించింది. అధిక స్థాయి పట్టణీకరణ వైపు మొగ్గుచూపడానికి ఇది దారితీసింది. మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు పాలనలో ప్రాదేశిక విస్తరణలో అత్యున్నత స్థానానికి చేరుకుంది. శివాజీ క్రింద మరాఠా సైన్యం పునరుజ్జీవనం కారణంగా అతని పాలనలో క్షీణత ప్రారంభమైంది. చరిత్రకారుడు సర్. జె.ఎన్. J.N. శంకరు " అన్ని ఔరంగజేబు సాధించినట్లు కనిపించినప్పటికీ వాస్తవంగా అన్ని పోగొట్టుకున్నాడు " అని వ్రాసాడు.A History of Aurangzib (in 5 volumes) – J.N. Sarkar విన్సెంటు స్మిత్ ఈ విధంగా ప్రతిస్పందించాడు: "దక్కను ఔరంగజేబు శరీరానికే కాకుండా అతని సామ్రాజ్యానికి కూడా శ్మశానంగా మరిందని నిరూపించబడింది. ఔరంగజేబ్ భారతదేశపు అత్యంత వివాదాస్పద రాజుగా పరిగణించబడుతున్నాడు. ఆయన తన పూర్వీకుల కన్నా తక్కువ సహనంతో జిజాయా పన్నును పునఃప్రారంభించి అనేక చారిత్రక దేవాలయాలను నాశనం చేసాడు. అదే సమయంలో అతను నాశనం చేసిన దానికంటే ఎక్కువ హిందూ దేవాలయాలను నిర్మించాడు. తన పూర్వీకుల కంటే తన సామ్రాజ్య అధికార పదవులలో హిందువులు అధికంగా ఉన్నారు. సున్ని ముస్లింలు హిందువులు, షియా ముస్లింలకు వ్యతిరేకంగా ధ్వజమెత్తారు. ఏది ఏమయినప్పటికీ తన పూర్వీకుల కంటే అసహనం ప్రదర్శించి సాంప్రదాయం అణచివేతకు, క్రూరత్వం ప్రదర్శిస్తూ, అధికార కేంద్రీకరణను అధికరిస్తూ తరచూ విమర్శలను ఎదుర్కొన్నాడు. పూర్వపు చక్రవర్తుల వలె కాకుండా ఔరంగజేబ్ తరువాత రాజవంశం పతనానికి పెద్ద పాత్ర పోషించి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. ఇది అధిక సంఖ్యలో హిందూ జనాభాను ప్రభావితం చేసింది. తరువాత సామ్రాజ్యం క్షీణించింది. మరాఠాలు, జాట్లు, ఆఫ్ఘన్ల నుండి ఎదురైన దండయాత్రల కారణంగా మొఘలులు అనేక దెబ్బలను ఎదుర్కొన్నారు. మొఘల్ సామ్రాజ్యం పతనం సమయంలో అనేక చిన్న రాజ్యాలు అధికార శూన్యతను పూరించడానికి ప్రయత్నించి తరుగుదలకు మరింత దోహదపడ్డాయి. 1737 లో మరాఠా సామ్రాజ్యం మరాఠా సైన్యాధ్యక్షుడు బాజిరావ్ ఢిల్లీ మీద దాడి చేసి ఢిల్లీని దోచుకుంది. సైన్యాధ్యక్షుడు అమీర్ ఖాన్ ఉమ్రావ్ అల్ ఉదాత్ నాయకత్వంలో మొఘల్ చక్రవర్తి 5,000 మరాఠా అశ్వికదళ సైనికులను తరమడానికి 8,000 దళాలను పంపించాడు. అయితే బాజీ రావు అనుభవం లేని మొఘల్ సైన్యాన్ని సులభంగా అధిగమించాడు. మిగిలిన సామ్రాజ్య మొఘల్ సైన్యం పారిపోయారు. 1737 లో మొఘల్ సామ్రాజ్యం ఆఖరి ఓటమిలో మొఘల్ సైన్యం కమాండర్-ఇన్-చీఫ్, నిజామ్-ఉల్-ముల్క్, భోపాల్ వద్ద మరాఠా సైన్యం చేతిలో ఓడిపోయాడు. ఇది ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యం ముగిపు అయింది. జాట్ పాలకుడు సూరజ్ మల్ ఆగ్రా వద్ద మొఘల్ సైన్యాలను తరిమికొట్టి నగరాన్ని దోచుకుని తాజ్ మహల్ ప్రవేశం ద్వారంలో ఉన్న రెండు గొప్ప వెండి తలుపులను తమతో తీసుకుని వెళ్ళాడు. తరువాత 1763 లో సూరజ్ మాల్ ఈ తలుపులను కరిగించాడు. 1739 లో ఇరాన్ చక్రవర్తి నాదర్ షాహ్ కర్నాల్ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని ఓడించాడు.Dupuy, R. Ernest and Trevor N. Dupuy, The Harper Encyclopedia of Military History, 4th Ed., (HarperCollinsPublishers, 1993), 711. ఈ విజయం తర్వాత నాదిర్ షా ఢిల్లీని స్వాధీనం చేసుకుని మయూర సింహాసనంతో సహా అనేక సంపదలను మోసుకెళ్ళాడు. మొఘల్ పాలనకు నిరంతరం స్థానిక భారతీయ అడ్డగింత కారణంగా సామ్రాజ్యం మరింత బలహీనపడింది. మొఘల్ మతపరమైన అణచివేతకు వ్యతిరేకంగా బండా సింగు బహదూరు సిక్కు ఖల్సాను నడిపించాడు. బెంగాల్ హిందూ రాజులు, ప్రతాపాదిత్య, రాజా సీతరం రే తిరుగుబాటు చేశారు. బుండేలా రాజపుత్రుల మహారాజా చత్రాసాల్, మొఘలులతో పోరాడి పన్న రాజ్యాన్ని స్థాపించాడి. మొఘల్ రాజవంశం 1757 నాటికి తోలుబొమ్మ పాలకులకు పరిమితమైంది. 1762 నాటికి లాహోర్లోని ముస్లిం ప్రాదేశిక ప్రభుత్వాల ఆధ్వర్యంలో సిక్కులను తుడిచివేయడానికి జరిగింది. ఇందులో 30,000 మంది సిక్కులు చంపబడ్డారు. 1746 లో మొఘలులతో ప్రారంభమైన సిక్కు ధ్వంసం,A Popular Dictionary of Sikhism: Sikh Religion and Philosophy, p.86, Routledge, W. Owen Cole, Piara Singh Sambhi, 2005 దాని ముస్లిం వారసుల రాజులు అనేక దశాబ్దాలు కొనసాగించారు.Khushwant Singh, A History of the Sikhs, Volume I: 1469–1839, Delhi, Oxford University Press, 1978, pp. 127–129 1857 నాటి భారతీయ తిరుగుబాటు సమయంలో మొఘల్ రాజవంశం అవశేషాలు చివరకు ఓడించబడ్డాయి. దీనిని 1857 స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు. సామ్రాజ్యం అవశేషాలు అధికారికంగా బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. మరాఠీ సామ్రాజ్యం మరాఠా సామ్రాజ్యం 18 వ శతాబ్దం ప్రారంభంలో మరాఠా సామ్రాజ్యం భారతీయ ఉపఖండంలో అత్యంత బలమైన రాజకీయశక్తిగా అభివృద్ధి చెందింది. పేష్వా ఆధీనంలో మరాఠాలు సమైక్యమై దక్షిణాసియాలో అధిక భూభాగాన్ని పాలించారు. మరాఠాలు భారతదేశంలో మొఘల్ పరిపాలనను ముగింపుకు తీసుకువచ్చిన రాజకీయ శక్తిగా గుర్తింపు పొందారు. thumb|250px|left|తంజావూరు మరాఠా రాజ్యంలోని తంజావూరు మరాఠా ప్యాలెసు దర్బారు హాలు అంతర్గత నిర్మాణం మరాఠా సామ్రాజ్యం హిందవి స్వరాజ్య స్థాపనకు నిశ్చయించిన భోంస్లె వంశానికి చెందిన ఛత్రపతి శివాజీచే స్థాపించబడి సంఘటితం చేయబడింది. సర్ జె.ఎన్.సర్కారు శివాజీని "హిందూ జాతి ఉత్పత్తి చేసిన చివరి గొప్ప నిర్మాణాత్మకమైన మేధావి, జాతీయ నిర్మాత "గా వర్ణించాడు.Shivaji and his Times (1919) – J.N. Sarkar అయితే శివాజీ సోదరసమానుడు వెంకోజీ తంజావూరు మరాఠా రాజ్యాన్ని స్థాపించారు. ఏదేమైనా మరాఠాల బలమైన శక్తిని సంపాదించిన ఘనత జాతీయంగా పేష్వా మొదటి బాజిరావోకు చేరుతుంది. చరిత్రకారుడు కె.కె. మొదటి బాజీరావ్ "మరాఠా సామ్రాజ్యం రెండవ స్థాపకుడిగా పరిగణించబడుతుందని" దత్తా రాశారు.An Advanced History of India, Dr. K.K. Datta, p.546 18 వ శతాబ్దం ప్రారంభంలో మరాఠా ప్రాంతం పేష్వా పాలన (ప్రధాన మంత్రులు)లో సామ్రాజ్యంగా మారింది. 1737 లో మరాఠాలు ఢిల్లీ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని ఓడించారు. మరాఠాలు మొఘలులు, నిజాం, బెంగాలు నవాబు, దుర్రాని సామ్రాజ్యాల మీద దండెత్తి వారి సరిహద్దులను మరింత విస్తరించడానికి తమ సైనిక పోరాటాలను కొనసాగించారు. 1760 నాటికి మరాఠాల సామ్రాజ్యం భారత ఉపఖండంలో అంతటా విస్తరించింది. మరాఠాలు కూడా మొఘల్ సింహాసనాన్ని నిర్మూలించి, ఢిల్లీలోని మొఘల్ సామ్రాజ్య సింహాసనంపై విశ్వస్వాష్ పెష్వాను ఉంచడం గురించి చర్చించారు. సామ్రాజ్యం శిఖరాగ్రానికి చేరుకున్న దశలో దక్షిణప్రాంతంలో తమిళనాడు నుండి ఉత్తరప్రాంతంలో పెషావర్ (ఆధునిక ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, పాకిస్తాన్), ) తూర్పున బెంగాలు వరకు విస్తరించింది. మూడవ పానిపట్టు యుద్ధం మరాఠాల వాయవ్య విస్తరణ నిలిపివేయబడింది. అయినప్పటికీ పేష్వా మొదటి మాధవరావు ఆధ్వర్యంలో ఉత్తరప్రాంతంలో మరాఠా అధికారం ఒక దశాబ్దంలో తిరిగి స్థాపించబడింది. thumb|250px|left|గ్వాలియర్ కోటను మరాఠా సైన్యాధ్యక్షుడు మహాదాజీ షిండే (సింధియా) స్వాధీనం చేసుకున్నాడు. తరువాత సింధియాలు మరాఠా సామ్రాజ్యం పాక్షిక స్వతంత్ర గ్వాలియర్ రాజ్యపాలకులుగా మారారు మొదటి మాధవరావు పాక్షిక స్వయంప్రతిపత్తితో బలమైన వీరులతో మరాఠా రాజ్యాల సమాఖ్య సృష్టించబడింది. సమాఖ్యలో బరోడా గైక్వాడ్సు, ఇండోరు, మాల్వా హోల్కర్సు, గ్వాలియరు, గ్వాలియరు సింధియాలు, నాగపూర్ భోంస్లేలు, ధారు పూరాలు, దేవసు రాజ్యాలు ఉన్నాయి. 1775 లో ఈస్ట్ ఇండియా కంపెనీ పుణెలోని పేష్వా కుటుంబ వారసత్వ పోరాటంలో జోక్యం చేసుకుంది. ఇది మొట్టమొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధానికి దారి తీసింది. యుద్ధంలో మరాఠా విజయం సాధించింది. రెండవ, మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధాలు (1805-1818) లో ఓటమి వరకు భారతదేశంలో మరాఠాలు ప్రబలమైన శక్తిగా మిగిలిపోయారు. ఇవి తూర్పు భారతదేశం కంపెనీను భారతదేశం అధిక భాగాన్ని ఈస్టు ఇండియా కంపెనీకి వదిలివేసాయి. గవర్నర్-జనరల్ వ్యవహరించిన చార్లెస్ మెట్క్లాల్, 1806 లో ఈ విధంగా పేర్కొన్నారు: 1660 నాటికి మరాఠాలు కూడా ఒక శక్తివంతమైన నౌకాదళాన్ని అభివృద్ధి చేశాయి. ఇది భారతదేశ పశ్చిమ తీరప్రాంత భూభాగ ప్రాంతంలో ముంబాయి నుండి సావంత్వాడి వరకు ఆక్రమించింది. కొంతకాలం పాటు మరాఠా నావికాదళం బంగాళాఖాతం లోని అండమాను ద్వీపాలలో కూడా స్థావరాన్ని స్థాపించింది. ఇది బ్రిటీషు, పోర్చుగీసు, డచ్చి, సిద్దీ నౌకాదళ ఓడలను దాడి చేస్తూ వారి నౌకాదళ లక్ష్యాలను పరిశీలించేది. 1730 నాటికి మరాఠా నౌకా దళం ఆధిపత్యంతో కొనసాగి 1770 నాటికి క్షీణించిన స్థితికి చేరి 1818 నాటికి నిలిచిపోయింది. సిక్కు సామ్రాజ్యం భారత ఉపఖండంలోని వాయవ్య ప్రాంతాలను పాలించే ఒక రాజకీయ సంస్థగా సిక్కు మతం సభ్యులు పాలించిన సిక్కు సామ్రాజ్యం అభివృద్ధి చెందింది. పంజాబు ప్రాంతం మీద ఆధారపడిన సామ్రాజ్యం 1799 - 1849 వరకు ఉనికిలో ఉంది. ఇది స్వతంత్రప్రతిపత్తి కలిగిన పంజాబీ మిలిస్ మహారాజా రంజిత్ సింగ్ (1780-1839) నాయకత్వంలో ఖల్సా కేంద్రంగా అభివృద్ధి చేయబడింది. మహారాజా రంజిత్ సింగ్ ఉత్తర భారతదేశం అనేక భాగాలను సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. ఆయన ప్రాథమికంగా తన సిక్కు ఖల్సా సైన్యాన్ని ఉపయోగించుకున్నాడు. ఆయన ఐరోపా సైనిక విధానంలో శిక్షణ పొంది ఆధునిక సైనిక సాంకేతిక పరిజ్ఞానాలను కలిగి ఉన్నాడు. రంజిత్ సింగు తనను తాను ఒక మాస్టర్ వ్యూహాకర్తగా నిరూపించుకున్నాడు. తన సైన్యానికి బాగా అర్హత గల అధికారిగా ఎన్నిక చేయబడ్డాడు. అతను నిరంతరంగా ఆఫ్ఘన్ సైన్యాన్ని ఓడించి ఆఫ్ఘగనిస్తాన్-సిక్కు యుద్ధాలను విజయవంతంగా ముగించాడు. ఆయన పంజాబ్, ముల్తాన్, కాశ్మీర్ రాజ్యాలు, పెషావర్ లోయలను తన సామ్రాజ్యంలో చేర్చాడు. 19 వ శతాబ్దంలో పశ్చిమప్రాంతంలో ఖైబర్ పాస్ నుండి, ఉత్తరప్రాంతంలో కాశ్మీర్ వరకు, దక్షిణప్రాంతంలో సింధు వరకు, తూర్పుప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్ సట్లేజ్ నది వరకు సామ్రాజ్యం విస్తరించింది. రంజిత్ సింగు మరణం తరువాత సామ్రాజ్యం బలహీనపడడం బ్రిటీషు ఈస్టు ఇండియా కంపెనీతో సంఘర్షణలకు దారి తీసింది. తీవ్రంగా సాగిన మొట్టమొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం, రెండవ ఆంగ్లో-సిక్కు యుద్ధం సిక్కు సామ్రాజ్యం పతనానికి దారితీసింది. ఇది భారత ఉపఖండంలో బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్న చివరి ప్రాంతం ఇదే. thumb|800px|center|అమృత్ సర్, పంజాబులో అకల్ తఖ్త్, స్వర్ణ దేవాలయం దగ్గర గురు గ్రంథ సాహిబ్ ను ఆలకిస్తున్న మహారాజ రంజిత్ సింగ్ . ఇతర రాజ్యాలు thumb|right|250px|మైసూరు సైన్యం బ్రిటీషు సేనలతో మైసూరు రాకెట్లతో యుద్ధం చేస్తున్న చిత్రం. బ్రిటీషు ఆక్రమణకు పూర్వం మధ్యయుగ ద్వితీయార్ధంలో భారతభూభాగాలను అనేక ఇతర రాజ్యాలు పాలించాయి. వారిలో చాలామంది మరాఠాలకు కప్పం చెల్లించారు.The Rediscovery of India: A New Subcontinent Cite: "Swarming up from the Himalayas, the Marathas now ruled from the Indus and Himalayas in the north to the south tip of the peninsula. They were either masters directly or they took tribute." సుమారు 1400 లో దక్షిణ భారతదేశంలో వడయార్ రాజవంశపాలకుడు మైసూర్ రాజ్యాన్ని స్థాపించాడు. 18 వ శతాబ్దపు చివరి భాగంలో హైదర్ ఆలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాన్ కారణంగా మైసూరు రాజ్యపాలనకు అంతరాయం కలిగింది. వారి పాలనలో మైసూరు వీరులు మరాఠాలు, బ్రిటీషు, వారి మిశ్రమ దళాలతో వరుస యుద్ధాలలో పోరాడారు. 1787 ఏప్రెలులో మరాఠా-మైసూరు యుద్ధం ఏప్రిల్ గజేంద్రాగాడ్ ఒప్పందం ఆధారంగా టిప్పు సుల్తాన్ మరాఠాలకు కప్పం చెల్లించే బాధ్యత వహించడంతో మైసూరు - మరాఠీ యుద్ధం ముగిసింది. ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో మైసూరు వీరులు మైసూర్ రాకెట్లు ఉపయోగించారు. నాలుగో ఆంగ్లో-మైసూరు యుద్ధంలో (1798-1799) టిప్పు సుల్తాను మరణం మైసూరు భూభాగం మరింత క్షీణదశకు దారితీసింది. ఫ్రెంచితో మైసూరు పొత్తును బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ముప్పుగా భావించి నాలుగు వైపుల నుండి మైసూరు మీద దాడి చేశారు. హైదరాబాదు నిజాం, మరాఠాలు ఉత్తరం నుండి దండయాత్రను ప్రారంభించారు. బ్రిటీష్ శ్రీరంగపట్నం (1799) లో నిర్ణయాత్మక విజయం సాధించింది. నగరం రక్షణ సమయంలో టిప్పు చంపబడ్డాడు. మిగతా మైసూరు భూభాగం బ్రిటీషు నిజాం, మరాఠాలు భూభాగాలలో కలపబడింది. మైసూరు, శ్రీరంగపట్నం మిగిలిన ప్రాంతాన్ని ఉడయారు రాజవంశంకి చెందిన రాజకుటుంబం చేత పునరుద్ధరించబడింది. వాస్తవానికి హైదర్ ఆలీ పాలకుడు కావడానికి ముందు వీరి పూర్వీకులు అసలు పాలకులుగా ఉన్నారు. 1799 లో మైసూర్ రాజ్యం బ్రిటిష్ ఇండియా రాచరిక రాజ్యంగా మారింది. thumb|left|200px| సెయింట్ పీటర్స్ బర్గ్ లోని హెర్మిటేజ్ ప్రదర్శనశాలో 18వ శతాబ్దపు తొలికాలంనాటి మరాఠా శిరస్త్రాణం, శరీర కవచం. 1591 లో గోల్కొండ కుతుబ్ షాహి వంశీయులచే హైదరాబాదు స్థాపించబడింది. ఒక సంక్షిప్త మొఘల్ పాలన తరువాత మొఘలు అధికారి అయిన ఆసిఫ్ జాహ్ హైదరాబాదు నియంత్రణను స్వాధీనం చేసుకుని 1724 లో హైదరాబాదులో నిజామ్-అల్-ముల్కుగా ప్రకటించాడు. పాలఖాడు యుద్ధం వంటి అనేక యుద్ధాల కారణంగా తిరోగమించిన తరువాత నిజాంలు గణనీయమైన భూభాగాన్ని కోల్పోయి మరాఠీ సామ్రాజ్యానికి కప్పం చెల్లించారు.History Modern India By S. N. Sen ఏదేమైనా మరాఠాలకు కప్పం కట్టడం ద్వారా తరువాత బ్రిటిషు వారికి సామంతరాజులుగా ఉండి 1724 నుండి 1948 వరకు నిజాములు తమ సార్వభౌమత్వాన్ని నిలుపుకున్నారు. హైదరాబాదు రాజ్యం బ్రిటీష్ ఇండియాలో 1798 లో రాచరిక రాజ్యంగాగా మారింది. మొఘలు సామ్రాజ్య పతనం తరువాత బెంగాలు నవాబులు బెంగాలు పాలకులుగా మారారు. అయినప్పటికీ బెంగాల్లోని 1741 నుండి 1748 మరాఠీలు వరకు 6 దాడులు నిర్వహించిన వారి స్వతంత్ర పాలనకు అంతరాయం కలిగి ఫలితంగా బెంగాలు మరాఠీల సామంత రాజ్యంగా మారింది. 1757 జూను 23 న బెంగాలు చివరి స్వతంత్ర నవాబ్ సిరాజ్ ఉద్-దౌలా మీర్ జాఫర్ చే ప్లాస్సీ యుద్ధంలో మీరు ఫాహిరు చేత మోసగించబడ్డాడు. ఆయన 1757 లో బ్రిటిషు చేతిలో ఓడిపోయిన తరువాత బెంగాలు బాధ్యతను బ్రిటీషు ప్రభుత్వం చేపట్టి మీరు జాఫరును మస్నాదు (సింహాసనం) లో నియమించి బెంగాలులో తమ రాజకీయ శక్తిని స్థాపించింది. 1765 లో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ స్థాపించబడింది. ఫలితంగా నవాబులు బ్రిటీషు తరపున పాలిస్తూ బ్రిటీషువారికి తోలుబొమ్మలుగా మారారు. 1772 లో ఈ వ్యవస్థ రద్దుచేయబడి బెంగాలును బ్రిటీషువారి ప్రత్యక్ష నియంత్రణలో ఉంచింది. 1793 లో నవాబు నిజామాత్ (పాలనాధికారి) కూడా వారి నుండి తీసివేయబడిన తరువాత వారు బ్రిటీషు ఈస్టు ఇండియా కంపెనీ పెన్షనర్లుగా మాత్రమే ఉన్నారు. 18 వ శతాబ్దంలో రాజపుతానా మొత్తం మరాఠాల చేత నియంత్రించబడింది. రెండో ఆంగ్లో-మరాఠా యుద్ధం (1807 నుండి 1809) వరకు మరాఠాలు దృష్టి యుద్ధంమీద కేద్రీకరించిన తరువాత రాజపుతానా మీద మరాఠా ఆధిపత్యాన్ని తిరిగి ప్రారంభం అయింది. 1817 లో మరాఠా భూభాగంలో నివసించే పిండారీల మీద యుద్ధానికి బ్రిటీషువారు యుద్ధానికి వెళ్ళడంతో అది మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం అయింది. బ్రిటీషు ప్రభుత్వం పిండారీలు, మరాఠాల నుండి రాజపుత్ర పాలకులకు తమ రక్షణను అందించింది. 1818 చివరి నాటికి ఇతర రాజపుత్ర రాజ్యాలు, బ్రిటన్ల మధ్య ఇలాంటి ఒప్పందాలు జరిగాయి. గ్వాలియరు మరాఠా సింధియా పాలకుడు బ్రిటీష్కు అజ్మీర్-మెర్వరా జిల్లాను విడిచిపెట్టడంతో రాజస్థానులో మరాఠా ప్రభావం ముగిసింది. 1857 తిరుగుబాటులో బ్రిటనుకు చాలా మంది రాజపుత్రులు విశ్వసనీయంగా ఉన్నారు. 1947 లో భారత స్వాతంత్రం వరకు రాజపుతానాలో కొన్ని రాజకీయ మార్పులు చేయబడ్డాయి. రాజపుత్రా ఏజెన్సీలో 20 రాచరిక రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో చాలా ముఖ్యమైనవి ఉదయపూరు రాజ్యం, జైపూరు రాజ్యం, బికానెరు రాజ్యం, జోధ్పూరు రాజ్యం ఉన్నాయి. మరాఠా సామ్రాజ్యం పతనం తరువాత అనేక మరాఠా రాజ్యాలు బ్రిటీషువారి అనుబంధ కూటమిలో సామతరాజ్యాలుగా అవతరించాయి. ఇవి జనాభా ప్రాతిపదికగా బ్రిటీషు రాజులో అతిపెద్ద భూభాగంగా ఏర్పడ్డాయి. 1846 లో మొట్టమొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం తరువాత అమృతసర్ ఒప్పందం ప్రకారం బ్రిటీషు ప్రభుత్వం కాశ్మీరును మహారాజా గులాబు సింగుకు జమ్మూ-కాశ్మీరును విక్రయించడంతో జమ్మూ కాశ్మీరు రాజ్యం బ్రిటిషు రాజు ప్రభుత్వంలో అతిపెద్ద రాచరిక రాజ్యాలలో ద్వితీయ స్థానంలో నిలిచింది. బ్రిటిష్ ఇండియాలో డోగ్ర రాజవంశం సృష్టించబడింది. తూర్పు, ఈశాన్య భారతదేశంలో హిందూ, బౌద్ధ కూచ్ బెహార్ రాజ్యాలలోని త్రిప్ర రాజ్యం, సిక్కిం రాజ్యాలను బ్రిటీషు వారు స్వాధీనం చేసుకుని సామంతరాజ్యాలుగా చేసుకున్నారు. విజయనగరసామ్రాజ్యం పతనం తరువాత దక్షిణభారతంలో పాలెగార్ల రాజ్యం తలెత్తింది. అది పాలెగార్ల యుద్ధంలో బ్రిటిషు ఈస్టిండియా కంపెనీతో పోరాడి ఓడిపోయే వరకు దాడులను ఎదుర్కొంటూ సుసంపన్నంగా ఉంది. 18 వ శతాబ్దంలో రాజపుత్రులు నేపాలు రాజ్యం స్థాపించారు. ఆరంభకాల ఆధునిక భారతీయ వ్యాపారులు 14 - 18 వ శతాబ్దాల మద్యకాలంలో పశ్చిమ ఆసియా, తూర్పు ఐరోపాకు చెందిన ఆధునిక భారతీయ వ్యాపారులు చురుకుగా ఉన్నారు. అజర్‌బైజాన్కు చెందిన బాకు శివారు ప్రాంతం అయిన ఈ కాలంలో భారతీయ వర్తకులు సురాఖానిలో స్థిరపడ్డారు. ఈ వర్తకులు ఇక్కడ హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఇది వాణిజ్యం చురుకుగా ఉండి 17 వ శతాబ్దం నాటికి భారతీయుల సంపన్నతను తెలియజేస్తుంది. ఉత్తర సరిహద్దులో సౌరాష్ట్ర, బెంగాలు తీరాలు సముద్ర వాణిజ్యంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. గంగా మైదానాలు, సింధు లోయ ప్రాంతాలలో అనేక వాణిజ్య అనేక కేంద్రాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తానుతో పాటు మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా ప్రాంతంతో పంజాబు ప్రాంతాన్ని కలిపే ఖైబర్ పాస్ ద్వారా చాలా భూభాగ వాణిజ్యం జరిగింది. పలు రాజ్యాలు, రాజులు నాణాలను చెలామణి చేసినప్పటికీ బార్టరుకు ప్రాధాన్యత ఉండేది. వ్యవసాయదారులు వారి వ్యవసాయ ఉత్పత్తులలో కొంత భాగం ప్రభుత్వానికి సుంకంగా చెల్లించేవారు. పంట సమయంలో పనివారు పండిన పంటలో కొంతభాగం అందుకునేవారు. యురేపియన్ల అంవేషణ, కాలనీ పాలన పశ్చిమ దేశాల అంవేషకులు, వ్యాపారులు 1498 లో వాస్కో డా గామా ఆధ్వర్యంలో పోర్చుగీసు బృందం ఐరోపా నుండి భారతదేశానికి ఒక కొత్త సముద్ర మార్గాన్ని విజయవంతంగా కనుగొన్నది. అది ప్రత్యక్ష ఇండో-యూరోపియన్ వాణిజ్యానికి మార్గం సుగమం చేసింది. పోర్చుగీసు త్వరలో గోవా, డామన్, డయ్యు, బొంబాయిలలో వాణిజ్య స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. 1961 లో భారతదేశానికి స్వాధీనం అయ్యే వరకు గోవా ప్రధాన పోర్చుగీసు స్థావరంగా మారింది.Sanjay Subrahmanyam, The Portuguese empire in Asia, 1500–1700: a political and economic history (2012) తరువాత శ్రీలంకలో వారి ప్రధాన స్థావరం ఉన్న డచ్చి వారు వచ్చారు. వారు మలబార్లో ఓడరేవులను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కోలచెల్ యుద్ధంలో ట్రావెకోర్క్ సామ్రాజ్యం వారిని ఓడించిన తరువాత భారతదేశంలో వారి విస్తరణ నిలిచిపోయింది. డచ్చి ఓటమి నుండి కోలుకోలేదు. అది భారతదేశానికి పెద్ద కాలనీల భీతిని కలిగించలేదు.http://mod.nic.in 9th Madras Regiment ప్రఖ్యాత చరిత్రకారుడు " ఎ.శ్రీధర మేనన్ " మాటలలో: భారతీయ రాజ్యాల మధ్య అంతర్గత విభేదాలు క్రమంగా రాజకీయ ప్రభావాన్ని, తగిన భూములను స్థాపించడానికి యూరోపియన్ వ్యాపారులకు అవకాశాలు కల్పించాయి. 1619 లో డచ్చిని అనుసరించి బ్రిటిషు - సూరత్ పశ్చిమ తీర నౌకాశ్రయం స్థాపించింది. ఫ్రెంచి వారు భారతదేశంలో రెండు వాణిజ్య స్థావరాలను ఏర్పాటు చేశారు. తరువాత ఈ ఖండాంతర ఐరోపా శక్తులు దక్షిణ, తూర్పు భారతదేశంలోని అనేక తీర ప్రాంతాలను తరువాత శతాబ్దంలో నియంత్రించగలిగినప్పటికీ చివరికి వారు భారతదేశంలో పోండిచేరి, చందరునాగోరు మినహా మిగిలిన తమ భూభాగాలను బ్రిటీషువారి ఆధీనంలోకి వదిలారు.Holden Furber, Rival Empires of Trade in the Orient, 1600–1800, University of Minnesota Press, 1976, p. 201.Philippe Haudrère, Les Compagnies des Indes Orientales, Paris, 2006, p 70. ఫ్రెంచి సైనికులు గోవా, డామన్, డయ్యూ పోర్చుగీసు కాలనీలు కూడా మినహాయించబడ్డాయి.Dossier Goa – A Recusa do Sacrifício Inútil . Shvoong.com. బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ పాలన, విస్తరణ 1617 లో భారతదేశంలో వాణిజ్యానికి మొఘల్ చక్రవర్తి జహంగీర్ బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతినిచ్చారు. క్రమంగా వారి పెరుగుతున్న ప్రభావం 1717 లో బెంగాలులో పన్ను-రహిత వాణిజ్యం చేయడానికి వారికి ముస్లిం చక్రవర్తి ఫరూఖ్ సయారు దస్తావేజులు రూపమ్లో అనుమతి ఇవ్వటానికి దారితీసింది. బెంగాలు రాష్ట్రంలోని పాలకుడు సిరాజ్ ఉద్ దౌలా బ్రిటిషు ఈ అనుమతిలను ఉపయోగించడానికి చేసిన ప్రయత్నాలను వ్యతిరేకించారు. ఇది 1757 జూను 23 న ప్లాస్సీ యుద్ధానికి దారి తీసింది. దీనిలో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాలు సైన్యం ఫ్రెంచి-మద్దతు గల నవాబు దళాలను ఓడించింది. ప్రాదేశిక పరిణామాలతో భారతదేశంలో బ్రిటీష్వారు స్వాధీనం చేసుకున్న మొట్టమొదటి నిజమైన రాజకీయ స్థావరం ఇది. 1757 లో క్లైవ్ దాని మొట్టమొదటి 'బెంగాలు గవర్నర్' గా నియమించబడ్డాడు. మద్రాసు, వందవాసి, పాండిచెరీలలో ఫ్రెంచి మీద బ్రిటీషు విజయాలతో కలిపి సెవెన్ ఇయర్స్ వార్‌లో బ్రిటీష్ విజయాలతో భారతదేశంలో ఫ్రెంచి ప్రభావం తగ్గింది. బ్రిటీషు ఈస్టు ఇండియా కంపెనీ బెంగాలు మొత్తం మీద తన నియంత్రణను విస్తరించింది. 1764 లో బుక్సారు యుద్ధం తరువాత బెంగాలులోని జుర్ మొఘల్ చక్రవర్తి షా రెండవ ఆలం నుండి పరిపాలనా హక్కులను కంపెనీ సొంతం చేసుకుంది. ఇది తరువాతి శతాబ్దంలో భారతదేశంలో ఎక్కువ భాగాన్ని బ్రిటిషు ఈ స్టిండియా కంపెనీ స్వాహాచేయడానికి సంకేతంగా మిగిలింది. బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీ బెంగాలు వర్తక గుత్తాధిపత్యం చేసింది. వారు బెంగాలులో శాశ్వత స్థావరాలు పేరిట భూస్వామ్య-సుంకం వ్యవస్థ ప్రవేశపెట్టి తులూకాదార్లు, జమీందార్లను ఏర్పాటు చేశారు. 3 కర్నాటకా యుద్ధాల ఫలితంగా బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ కర్నాటకా ప్రాంతం అంతటి మీద నియంత్రణ సాధించింది.Lawrence James, Raj: The Making and Unmaking of British India (1997) pp 30–44 కంపెనీ వెంటనే బొంబాయి, మద్రాసులలో దాని స్థావరాలను విస్తరించింది. ఆంగ్లో-మైసూరు యుద్ధాలు (1766-1799), ఆ తరువాత ఆంగ్లో-మరాఠా యుద్ధాలు (1772-1818) భారతదేశం విస్తార ప్రాంతాల నియంత్రణకు దారి తీసింది. ఈశాన్య భారతదేశం అహోం సామ్రాజ్యం మొదట బర్మీసు దండయాత్రతో క్షీణదశకు చేరుకుని తరువాత 1826 లో యండోబో ఒప్పందం తరువాత బ్రిటీషు ఆధీనంలోకి వచ్చింది. ఏకకాలంలో బర్మా దండయాత్రలు మణిపూర్ రాజ్యాన్ని 1824 లో బ్రిటీషు కోరడానికి ప్రేరణ కలిగించాయి. అయినప్పటికీ 1891 లో ఆంగ్లో-మణిపూర్ యుద్ధం తరువాత మణిపూరు బ్రిటిషు సామ్రాజ్యంలో భాగం అయింది. 1849 లో రెండవ ఆంగ్లో-సిక్కు యుద్ధం తర్వాత పంజాబు, వాయవ్య సరిహద్దు ప్రాంతం, కాశ్మీర్లను స్వాధీనం చేసుకున్నారు. కాశ్మీర్ వెంటనే అమృత్సర్ ఒప్పందం కింద జమ్మూలోని డోగ్రా రాచరికానికి విక్రయించబడి రాచరిక రాజ్యంగా మారింది. నేపాలు, బ్రిటిషు మధ్య సరిహద్దు వివాదం, 1801 తర్వాత తీవ్రమై 1814-16 నాటి ఆంగ్లో-నేపాలు యుద్ధం గుర్ఖాల ఓటమితో ముసింది. 1854 లో బెరారు అనుసంధానించబడింది. రెండు సంవత్సరాల తరువాత ఓద్ద్ రాజ్యం చేర్చబడింది. 19 వ శతాబ్దం ప్రారంభంలో గవర్నర్-జనరల్ రిచర్డ్ వెల్లెస్లీ రెండు దశాబ్దాలపాటు సంస్థ భూభాగాల విస్తరణ వేగంపుంజుకుంది. ఇది సంస్థ, స్థానిక పాలకులు లేదా ప్రత్యక్ష సైనిక అనుబంధం మధ్య పొత్తుల ద్వారా సాధించబడింది. అనుబంధ కూటములు హిందూ మహారాజాల, ముస్లిం నవాబుల రాచరిక రాజ్యాలను సృష్టించాయి. 1850 ల నాటికి, బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత ఉపఖండంలో అధికభాగాన్ని నియంత్రించింది. వారి విధానాలు కొన్నిసార్లు విభజించి పాలించు విధానంగా పరిగణించబడింది. వివిధ రాచరిక రాజ్యాలు, సాంఘిక, మత సమూహాల మధ్య శత్రుత్వం అభివృద్ధి చేయబడింది. H. V. Bowen, The Business of Empire: The East India Company and Imperial Britain, 1756–1833 (2008) భారతీయ ఒప్పంద కూలీ విధానం భారతీయ ఒప్పంద కూలీ విధానం ఒక రుణ బానిసత్వం. దీని ద్వారా 3.5 మిలియన్ల మంది భారతీయులు (ముఖ్యంగా చెరకు) తోటల కోసం కార్మికులను ఐరోపా శక్తుల వివిధ కాలనీలకు రవాణా చేశారు. ఇది 1833 లో ప్రపంచవ్యాప్తంగా బానిసత్వం రద్దైన తరువాత ప్రారంభించి 1920 వరకు కొనసాగింది. ఇది భారతీయ మహాసముద్రం (అనగా రియూనియన్, మారిషస్) నుండి పసిఫిక్ మహాసముద్రం (అంటే ఫిజి) వరకు వ్యాపించింది. ఇది అలాగే పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయ అభివృద్ధికి దారితీసింది. ఇండో-కరేబియన్, ఇండో-ఆఫ్రికన్ జనాభాను అభివృద్ధి చేసింది. ఆధునిక కాలం, స్వతంత్రం (సా.శ. 1850 తరువాత) సిపాయీల తిరుగుబాటు 1857, పర్యవసానం 1857 లో బ్రిటీషు ఈస్టు ఇండియా కంపెనీ పాలనకి వ్యతిరేకంగా ఉత్తర, మధ్య భారతదేశంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలైంది. స్పార్క్ ఎన్ఫీల్డ్ రైఫిల్ కోసం కొత్త గన్పౌడర్ కార్ట్రిడ్జి సమస్య తిరుగుబాటుకు దారితీసిన చెప్పవచ్చు. ఇది స్థానిక మతపరమైన నిషేధంగా భావించబడింది. మంగాల్ పాండే ఇందులో కీలకపాత్ర ధరించాడు.Saul David, page 70, "The Indian Mutiny", Penguin Books 2003 అంతేకాక బ్రిటీషు పన్నుల మీద ఆధారపడిన ఆందోళనలు, బ్రిటీషు అధికారులు, వారి భారతీయ దళాల మధ్య అధికమైన జాతి అఖాతం, భూభాగ విలీనాలు తిరుగుబాటులో ముఖ్యమైన పాత్ర పోషించాయి. పాండే తిరుగుబాటు తరువాత కొన్ని వారాలలో తిరుగుబాటులో భాగంగా భారత సైన్యం డజన్ల సంఖ్యలో రైతు సైన్యాల్లో చేరడంతో తిరుగుబాటు దేశవ్యాప్తం అయింది. సైనికులు తరువాత భారతీయ ప్రముఖులకు మద్దతు ఇచ్చారు. వీరిలో చాలామంది " డాక్టర్ ఆఫ్ లాప్సు " ద్వారా శీర్షికలు, పదవులు కోల్పోయారు. కంపెనీ సంప్రదాయ వారసత్వ వ్యవస్థతో జోక్యం చేసుకుందని భావించారు. నానా సాహిబు, ఝాన్సీ రాణి వంటి తిరుగుబాటు నాయకత్వం వహించారు., , మీరట్లో తిరుగుబాటు ప్రారంభం అయిన తరువాత తిరుగుబాటుదారులు చాలా త్వరగా ఢిల్లీకి చేరుకున్నారు. తిరుగుబాటుదారులు వాయవ్య భూభాగాలు, అవధ్ (ఔద్) మార్గాలను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా అవధ్‌లో తిరుగుబాటు బ్రిటీషు ఉనికికి వ్యతిరేకంగా దేశభక్తి లక్షణాలను తీసుకువచ్చింది., బ్రిటీషు ఈస్టు ఇండియా కంపెనీ స్నేహపూర్వక రాజ్యాలలో సహాయంతో తిరుగుబాటును అణిచివేసేందుకు ప్రయత్నించింది. 1857 లో మొదలైన తిరుగుబాటు అణిచివేత 1858 వరకు కొనసాగింది. తిరుగుబాటుదారులు పేలవమైన ఆయుధాలను కలిగి ఉండటం వెలుపల మద్దతు లేదా నిధుల కారణంగా వారిని బ్రిటీషు వారు దారుణంగా స్వాధీనం చేసుకున్నారు.Christopher Hibbert, The Great Mutiny: India 1857 (1980) అనంతరం బ్రిటీషు ఈస్టు ఇండియా కంపెనీ నుండి బ్రిటీష్ క్రౌన్కు అన్ని అధికారాలు బదిలీ అయ్యాయి. ఇది భారతదేశాన్ని అనేక రాజ్యభాగాలుగా విభజించి పాలించడానికి దారితీసింది. కింగ్డమ్ సంస్థ భూములను ప్రత్యక్షంగా నియంత్రించింది. భారతదేశంలోని ఇతర ప్రాంతాలపై గణనీయమైన పరోక్ష ప్రభావాన్ని చూపింది. రాజవంశ రాజ కుటుంబాలచే పాలించబడే రాజస్థాన్ రాజ్యాలు ఇందులో భాగం అయ్యాయి. 1947 నాటికి అధికారికంగా 565 రాచరిక రాజ్యాలు ఉన్నాయి. అయితే కేవలం 21 రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో మైసూర్, హైదరాబాదు, కాశ్మీరు మూడు మాత్రమే పెద్ద రాజ్యాలు ఉన్నాయి. ఇవి అన్నీ 1947-48లో స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయబడ్డాయి. బ్రిటిషు రాజు (సా.శ. 1858 – 1947) బ్రిటీషు రాజ్యము 1857 తర్వాత వలసరాజ్య ప్రభుత్వం కోర్టు వ్యవస్థ, చట్టపరమైన ప్రక్రియలు, శాసనాల ద్వారా న్యాయవ్యస్థలో సరికొత్త విధానాలు ప్రవేశపెట్టింది. ఇది ఇండియన్ పీనల్ కోడ్ అయ్యింది."Law Commission of India – Early Beginnings" 1835 ఫిబ్రవరిలో విద్యావిధానంలో థామస్ బాబింగ్టన్ మకాలే రాజులో విద్యకుప్రాధాన్యం ఇచ్చి బోధన మాధ్యమంగా ఇంగ్లీష్ ఉపయోగించే విధానం అమలు చేయడంలో విజయం సాధించారు. 1890 నాటికి దాదాపు 60,000 మంది భారతీయులు మెట్రిక్యులేట్ చేశారు.Bentinck, Macaulay and the introduction of English education in India, Suresh Chandra Ghosh(1995) 1880 నుండి 1920 వరకు భారతీయ ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 1% అధికరించింది. జనాభా కూడా 1% అధికరించింది. 1910 నుండి భారత ప్రైవేట్ పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందింది. 19 వ శతాబ్దం చివరలో భారతదేశం ఆధునిక రైల్వే వ్యవస్థను నిర్మించింది. ఇది ప్రపంచ రల్వే వ్యవస్థలలో 4 వ స్థానంలో ఉంది.Economic Change and the Railways in North India, 1860–1914, I. D. Derbyshire(1987) [455] రైల్వేలు, తంతి తపాలా, రోడ్లు, ఓడరేవులతో పాటుగా కాలువలు, నీటిపారుదల వ్యవస్థలతో సహా బ్రిటీష్ రాజ్ మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెట్టింది.Neil Charlesworth, British Rule and the Indian Economy, 1800–1914 (1981) pp 23–37 చరిత్రకారులు ఆర్థిక చరిత్ర విషయంలో తీవ్రంగా అభిప్రాయపంగా విభజింపబడ్డారు. బ్రిటిషు రాజు పాలన ప్రారంభం కంటే బ్రిటీషు పాలన చివరిలో భారతదేశం పేదదేశంగా మారిందని, బ్రిటీషు కారణంగా ఈ దారిద్య్రం ఏర్పడిందని " నేషనలిస్టు స్కూలు " వాదించింది. thumb|left|200px| న్యూఢిల్లీలో బ్రిటిష్ వైస్రాయ్ కొరకు నిర్మించిన రాష్టప్రతి భవనం ఇది ప్రస్తుత రాష్ట్రపతి నివాసంగా ఉంది. 1905 లో లార్డ్ కెర్జోన్ అతి పెద్ద బెంగాలు ప్రావింసును హిందూ ఆధిక్యత కలిగిన పశ్చిమ భాగాన్ని పశ్చిమ బెంగాలుగా, ముస్లిం ఆధిక్యత కలిగిన తూర్పు భూభాగాన్ని "తూర్పు బెంగాలు, అస్సాం"గా విభజించాడు. సమర్ధమైన పాలనా యంత్రాంగంగా మార్చడం బ్రిటిషు లక్ష్యంగా చెప్పబడినప్పటికీ ఇది విభజించి పాలించడం వ్యూహంలో చేయబడిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు. వ్యవస్థీకృత వలసవాద వ్యతిరేక ఉద్యమానికి ఇది ప్రారంభమైంది. బ్రిటనులో లిబరల్ పార్టీ 1906 లో అధికారంలోకి వచ్చిన తరువాత లార్డు కెర్టోన్ తొలగించబడ్డాడు. 1911 లో బెంగాలును తిరిగి సమైక్యం చేశారు. కొత్త వైస్రాయి గిల్బర్టు మింటో, భారత విదేశాంగ కార్యదర్శి జాన్ మార్లే రాజకీయ సంస్కరణ గురించి కాంగ్రెసు నాయకులతో సంప్రదించాడు. 1909 మోర్లీ-మినో సంస్కరణలు ప్రావిన్షియల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్సు భారతీయ సభ్యత్వం కొరకు వైస్రాయి కార్యనిర్వాహక మండలికి అందించబడ్డాయి. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిలు 25 నుండి 60 మంది సభ్యుల వరకు విస్తరించబడింది. ముస్లింల కోసం ప్రత్యేకమైన మతపరమైన ప్రాతినిధ్యం ఏర్పాటు చేయబడింది. S. A. Wolpert, Morley and India, 1906–1910, (1967) ఆ సమయంలో అనేక సామాజిక-మతపరమైన సంస్థలురావడం మొదలైంది. 1906 లో ముస్లింలు ఆల్ ఇండియా ముస్లిం లీగును స్థాపించారు. ఇది ఒక సామూహిక పార్టీగా కాకుండా అది కులీన ముస్లింల ప్రయోజనాలను కాపాడటానికి రూపొందించబడింది. ఇది ఇస్లాం, బ్రిటీషు, భారతదేశం, హిందువుల అవిశ్వాసంతో విరుద్ధమైన భావజాలంతో అంతర్గతంగా విభజించబడింది. అఖిల భారతీయ హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) హిందూ అభిరుచులకు ప్రాతినిధ్యం వహించాయి. అయితే తరువాతి కాలంలో అది "సాంస్కృతిక" సంస్థగా పేర్కొంది.Democracy and Hindu nationalism, Chetan Bhatt (2013) 1920 లో సిక్కులు షిరోమణి అకాలీ దళును స్థాపించారు.Harjinder Singh Dilgeer. Shiromani Akali Dal (1920–2000). Sikh University Press, Belgium, 2001. 1885 లో స్థాపించబడిన అతి పెద్ద, పురాతన రాజకీయ పార్టీ " ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ". ఇది సామాజిక-మత ఉద్యమాలు, గుర్తింపు రాజకీయాల దూరంగా ఉండటానికి ప్రయత్నించింది.The History of the Indian National Congress, B. Pattabhi Sitaramayya (1935) హిందువులు తిరుగుబాటు హిందూ పునరుద్ధరణ History of the Bengali-speaking People by Nitish Sengupta, p 211, UBS Publishers' Distributors Pvt. Ltd. .Sumit Sarkar, "Calcutta and the Bengal Renaissance", in Calcutta, the Living City ed. Sukanta Chaudhuri, Vol I, p. 95.History of Bengali-speaking People by Nitish Sengupta, p 253. 10-20 వ శతాబ్ధాలలో బ్రిటిషు పరిపాలనను అధిగమించి బెంగాలీ హిందువులు ఆధిపత్యం వహించిన భారత ఉపఖండంలోని బెంగాలు ప్రాంతంలో ఒక సాంఘిక సంస్కరణ ఉద్యమం కొనసాగినట్లు భావిస్తున్నారు. హిందూ పునరుద్ధరణ రాజా రామ్ మోహన్ రాయ్ (1772-1833) తో మొదలై రవీంద్రనాథ్ ఠాగూర్ (1861-1941) తో ముగిసింది. ఈ ప్రాంతం మేధోపరమైన, సృజనాత్మక కలిగిన వ్యక్తులు పరంపర కొనసాగిందని చాలామంది నిపుణులు అంగీకరిస్తున్నారు. 19 వ శతాబ్దపు బెంగాలు మతపరమైన ప్రాముఖ్యత కలిగిన వారికి, సాంఘిక సంస్కర్తలు, విద్వాంసులు, సాహిత్య దిగ్గజాలు, పాత్రికేయులు, దేశభక్తులు, శాస్త్రవేత్తల సమ్మేళనం పునరుద్ధరణోద్యమ రూపాన్ని ఏర్పరచారు. ఈ కాలం మద్య యుగం నుండి ఆధునిక కాలంగా మార్పుచెందడానికి చిహ్నంగా ఉంది.Deb, Chitra, pp 64-65. ఈ కాలంలో మేధో చైతన్యానికి బెంగాలు సాక్ష్యంగా ఉంది. ఈ ఉద్యమం ముఖ్యంగా మహిళలు, వివాహం, కట్నం వ్యవస్థ, కుల వ్యవస్థ, మతం సంబంధించిన పురాతన సంప్రదాయాలను ప్రశ్నించింది. ఈ సమయంలో ఉద్భవించిన మొట్టమొదటి సాంఘిక ఉద్యమాలలో ఒకటి యువ బెంగాలు ఉద్యమం. భారతీయ ఉపఖండంలో భారతీయ మేధస్సులో చైతన్యం చేయడంలో ఈ ఉద్యమం ప్రధానపాత్ర పోషించింది. కరువులు బ్రిటీషు కంపెనీ పాలన, బ్రిటిషు రాజు పరిపాలనా సమయంలో బ్రిటిషు వలసరాజ్య ప్రభుత్వ విధాలు విఫలమైనందుకు చిహ్నంగా భారతదేశంలో మునుపెన్నడూ నమోదు చేయని కరువులు సంభవించాయి. సమయంలో " 1876-78 నాటి గ్రేట్ ఫామైన్ " కారణంగా 6.1 మిలియన్ల నుండి 10.3 మిలియన్ల మంది మరణించారని భావిస్తున్నారు.Davis, Mike. Late Victorian Holocausts. 1. Verso, 2000. pg 7 1770 నాటి మహా బెంగాలు కరువులో 10 మిలియన్ల మంది మరణించారు. 1899-1900 నాటి భారతీయ కరువులో 1.25 నుండి 10 మిలియన్ల మంది ప్రజలు మరణించారు.Davis, Mike. Late Victorian Holocausts. 1. Verso, 2000. pg 173 బెంగాల్ కరువు (1943) నాటికి 3.8 మిలియన్ల ప్రజలు మరణించారు. 19 వ శతాబ్దం మధ్యకాలంలో " మూడో ప్లేగు పాండమిక్ " భారతదేశంలో 10 మిలియన్ల మంది మరణానికి కారణంగా ఉంది.. World Health Organisation. నిరంతర వ్యాధులు, కరువులు ఉన్నప్పటికీ భారత ఉపఖండంలోని జనాభా 1750 నాటికి 200 మిలియన్లకు చేరింది. 1941 నాటికి 389 మిలియన్లకు చేరింది. Reintegrating India with the World Economy . Peterson Institute for International Economics. భారతీయ స్వాతంత్ర ఉద్యమం భారతదేశంలో బ్రిటీషు ప్రజల సంఖ్య చిన్నదిగా ఉన్నప్పటికీ, వారు భారత ఉపఖండంలో 52% ప్రాంతాన్ని నేరుగా పాలించగలిగారు. 48% రాచరిక దేశాలపై గణనీయమైన పరపతిని సాధించారు. 19 వ శతాబ్దంలో జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటనలలో భారతీయ జాతీయవాదం అభివృద్ధి,Modern India, Bipin Chandra, p.76 భారతీయులు మొదటి "స్వీయ పాలన" తరువాత "పూర్తి స్వాతంత్ర్యం" కోరుకున్నారు. అయితే చరిత్రకారులు దాని పెరుగుదల కారణాలను విభజించారు. కారణాలలో "బ్రిటీషు, భారత ప్రజల ప్రయోజనాల ఘర్షణ", "జాతి వివక్షలు",India Awakening and Bengal, N.S.Bose,1976, p.237 "భారతదేశం గతం సంఘర్షణలు".British Paramountcy and Indian Renaissance, Part-II, Dr.R.C.Majumdar, p.466 1861 లో బ్రిటీష్ వైస్రాయికి సలహా ఇవ్వడానికి కౌన్సిలర్ల నియామకం భారతీయ స్వీయ-పాలనకు మొదటి అడుగు మొదలైంది. వీరిలో 1909 లో మొట్టమొదటి భారతీయుడు నియమితుడయ్యాడు. భారత సభ్యులతో కూడిన ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు నియామకం తరువాత భారతీయుల నియామకం శాసన మండలి వరకు విస్తరించబడింది. బ్రిటీషు వారు పెద్ద బ్రిటీష్ ఇండియన్ ఆర్మీను నిర్మించారు, ఇందులో సీనియర్ అధికారులుగా బ్రిటిషు వారు ఉండగా నేపాలు గుర్ఖాలు, సిక్కుల వంటి చిన్న మైనారిటీ సమూహాల నుండి సైనిక బృందాలు భాగస్వామ్యం వహించారు. పౌర సేవను తక్కువ స్థాయిలో ఉన్న స్థానికులతో నింపి బ్రిటీషు అధికంగా సీనియరు హోదాను కలిగి ఉంది.Anil Chandra Banerjee, A Constitutional History of India 1600–1935 (1978) p 171–3 భారతీయ జాతీయవాద నాయకుడు బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ దేశపు విధిగా ప్రకటించారు. అతని ప్రసిద్ధ వాక్యం "స్వరాజ్ నా జన్మహక్కు, నేను కలిగి ఉంటాను" ఇది భారతీయులకు ప్రేరణగా మారింది. బిపిన్ చంద్ర పాలు, లాలా లజ్పాత్ రాయి లాంటి ప్రభుత్వ నాయకులు తిలకుకు మద్దతు ఇచ్చారు. అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్న వారు విదేశీ వస్తువుల బహిష్కరణ, భారత-వస్తువులను ఉపయోగించడం వంటి స్వదేశీ ఉద్యమాలకు మద్దతు ఇచ్చారు. ఈ త్రిముఖ ఉద్యమాన్ని లాల్ బాల్ పాల్ అని పిలిచేవారు. వారి ఆధ్వర్యంలో భారతదేశం మూడు పెద్ద రాష్ట్రాలు - మహారాష్ట్ర, బెంగాలు, పంజాబు ప్రజల డిమాడులను, భారత జాతీయవాదాన్ని రూపొందించింది. 1907 లో కాంగ్రెసు రెండు విభాగాలుగా విభజించబడింది. బ్రిటీషు సామ్రాజ్యాన్ని పడగొట్టడానికి, బ్రిటీషు వస్తువులన్నింటిని విడిచిపెట్టాలని సూచిస్తూ తిలక్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు పౌర ఆందోళన, ప్రత్యక్ష విప్లవం చేయాలని పిలుపు ఇచ్చాడు. మరోవైపు, దాదాభాయ్ నౌరోజీ, గోపాల్ కృష్ణ గోఖలే వంటి నాయకుల నేతృత్వంలోని మితవాదులు, బ్రిటీష్ పాలన యొక్క పరిధిలో సంస్కరణను కోరుకున్నారు.India's Struggle for Independence – Chandra, Bipan; Mridula Mukherjee, Aditya Mukherjee, Sucheta Mahajan, K.N. Panikkar (1989), New Delhi: Penguin Books. . 1905 బెంగాలు విభజన స్వంతత్రపోరాటాన్ని మరింత తీవ్రం చేసింది. సహాయనిరాకణోద్యమం హింసాత్మకంగా మారింది. ఖుర్దీరాంబోసు బ్రిటిషు రాజు ప్రభుత్వకార్యాలయం సమీపంలో బాంబులు పాతి పెట్టి ఖైదు చేయబడి 18 సంవత్సరాల వయసులో ఉరితీయబడ్డాడు. thumb|200px|left|ఊచకోత సమయంలో జలియంవాలాబాగ్ ప్రాంగణంలో వందల మంది నిరాయుధులైన భారత పౌరులు మీద బ్రిటిషు బలగాలు కాల్పులు సగించిన గుర్తుగా గోడలపై ఏర్పడిన బుల్లెటు గుర్తులు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశం మద్దతును గుర్తించి పునఃప్రారంభించబడిన జాతీయవాద డిమాండ్లకు ప్రతిస్పందనగా బ్రిటీషు ప్రభుత్వం "క్యారట్ అండ్ స్టిక్" విధానాన్ని స్వీకరించింది. ప్రతిపాదిత ప్రమాణాలు తరువాత భారత ప్రభుత్వ చట్టం 1919 లో పొందుపరచబడ్డాయి. ఇది ద్వంద్వ పరిపాలన సూత్రాన్ని ప్రవేశపెట్టింది, లేదా భారతీయ శాసనసభ్యులను ఎన్నుకుని బ్రిటీషు అధికారులను నియమించేలా అధికారా పంఫిణీ చేయబడింది.lbert, Sir Courtenay Peregrine. The Government of India. Clarendon Press, 1922. p. 125 1919 లో కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ శాంతియుత నిరసనకారులపై కాల్పులు చేయమని అధికారులను ఆదేశించాడు. ఇందులో నిరాయుధ మహిళలు, పిల్లలు ఉన్నారు. ఫలితంగా జలియన్ వాలా బాఘ్ ఊచకోత సంభవించింది. ఇది 1920-22 లో సహాయరనిరాకరణోద్యమానికి దారితీసింది. ఈ ఊచకోత భారతదేశంలో బ్రిటీష్ పాలన ముగింపులో నిర్ణయాత్మక పాత్ర వహించింది. 1920 నుండి మహాత్మా గాంధీ వంటి నాయకులు ఎక్కువగా శాంతియుతమైన పద్ధతులను ఉపయోగించి బ్రిటీషు రాజుకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం అత్యంత ప్రజాదరణ పొందింది. సహాయనిరాకరణ, శాసనోల్లంఘన, ఆర్థిక ప్రతిఘటన వంటి అహింసా పద్ధతులను ఉపయోగించి బ్రిటీషు పాలనను గాంధీ నేతృత్వంలోని స్వాతంత్ర ఉద్యమం వ్యతిరేకించింది. అయితే భారతీయ ఉపఖండం అంతటా బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా విప్లవ కార్యకలాపాలు జరిగాయి. మరికొందరు చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్ ఇతరులు స్థాపించిన హిందూస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ వంటి తీవ్రవాద విధానాన్ని స్వీకరించారు. ఇది బ్రిటీషు పాలనను సాయుధ పోరాటంలో పడగొట్టడానికి ప్రయత్నించింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం చట్టం 1935 ఒక ప్రధాన విజయం సాధించింది. మొదటి ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో సైన్యంలో స్వచ్ఛందంగా 8,00,000 మంది, 400,000 కంటే ఎక్కువ మంది యుద్ధరహిత సేవలకు స్వచ్ఛందంగా స్వచ్ఛన్నంగా నమోదుచేసుకున్నారు యుద్ధానికి ముందు నియామకసభ్యులు వార్షికంగా 15,000 మంది ఉండేవారు.Pati, p.31 యుపిరెస్ యుద్ధం ప్రారంభమైన నెలలోనే సైన్యం " వెస్టర్న్ ఫ్రంట్ " తరఫున మొదటిసారిగా యుద్ధంలో పాల్గొన్నది. పాశ్చాత్య సంకీర్ణ దళంలో ఒక సంవత్సరం పాల్గొన్న తరువాత అనారోగ్యం, హేతుబద్ధమైన కొన్ని కారణాల వలన అది ఉపసంహరించుకునే సమయానికి భరతీయ సైన్యం సంఖ్యాపరంగా కుదించబడింది. మెసొపొటేమియా పోరాటంలో దాదాపు 700,000 మంది భారతీయులు టర్కులతో పోరాడారు. భారతీయ సైనికులు తూర్పు ఆఫ్రికా, ఈజిప్టు, గల్లిపోలీలకు కూడా పంపబడ్డారు. 1915 లో ఇంపీరియల్ సైనిక బృందాలతో " సినై - పాలస్తీనా యుద్ధంలో, 1916 లో రోమానీలో, 1917 లో జెరూసలెంలో భారతీయ సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. భారతదేశ విభాగాలు జోర్డాన్ లోయను ఆక్రమించాయి. స్ప్రింగ్ అఫెంసివ్ తరువాత ఈజిప్టు దాడిలో (మెగిడ్డో యుద్ధంలో), డిసర్టు మౌంటెడ్ క్రాప్స్ 'దమస్కుకు, అలెప్పోకు వెళ్ళే సమయంలో వారు ప్రధాన శక్తిగా మారారు. ఇతర వర్గాలు భారతదేశంలో వాయవ్య సరిహద్దులను కాపాడటం, అంతర్గత భద్రతా బాధ్యతలను నిర్వర్తించాయి. యుద్ధంలో ఒక మిలియన్ మంది భారతీయ దళాలు విదేశాల్లో పనిచేశారు. మొత్తం 74,187 మంది మరణించారు. 67,000 మంది గాయపడ్డారు.Sumner, p.7 మొదటి ప్రపంచ యుద్ధం, ఆఫ్ఘన్ యుద్ధాలలో తమ ప్రాణాలను పోగొట్టుకున్న సుమారు 90,000 మంది సైనికుల కొరకు భారత్ గేట్ స్మారక చిహ్నం నిర్మించబడింది. రెండవ ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం (1939-1945) సమయంలో భారతదేశాన్ని యునైటెడ్ కింగ్డం నియంత్రించింది. భారతదేశంలో బ్రిటీషు భూభాగాలలో 500 రాజరిక రాజ్యాలు ఉన్నాయి. 1939 సెప్టెంబరులో బ్రిటిషు ఇండియా నాజీ జర్మనీపై అధికారికంగా యుద్ధం ప్రకటించింది. సంకీర్ణ దేశాలలో భాగంగా ఉన్న బ్రిటిషురాజు 2.5 మిలియన్ల స్వచ్ఛంద సైన్యాలను పంపి బ్రిటిషు కమాండు ఆధ్వర్యంలో ఆక్సిస్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడింది. అదనంగా యుద్ధంలో పోరాడడానికి పలు భారతీయ సంస్థానాలు అధికమొత్తంలో నిధులు అందించి సహకరించాయి. భారతదేశం చైనా మద్దతుతో అమెరికన్ సైన్యానికి మిలటరీ బేసుగా ఉండి సహకరించింది. జర్మనీకి వ్యతిరేకంగా యూరోపియన్ థియేటరు, జర్మనీ, ఇటలీకి వ్యతిరేకంగా ఉత్తర ఆఫ్రికా, జపాన్, ఇటలీకి వ్యతిరేకంగా, ఇటలీకి వ్యతిరేకంగా తూర్పు ఆఫ్రికా, విచీ ఫ్రెంచికి వ్యతిరేకంగా మిడిల్ ఈస్టు, జపానుకు వ్యతిరేకంగా బర్మా యుద్ధాలలో భారతీయ సైనికులు వీరోచితంగా పోరాడారు. 1945 ఆగస్టులో జపాన్ లొంగిపోయిన తరువాత సింగపూరు, హాంకాంగు వంటి బ్రిటీషు వలసరాజ్యాలు స్వాతంత్ర్యం పొందడంలో భారతీయులు సాయపడ్డారు. 87,000 మంది భారతీయ సైనికులు (ఆధునిక పాకిస్తాన్, నేపాలు, బంగ్లాదేశ్ ) రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించారు. మోహన్ దాసు కరంచందు గాంధీ, సర్దారు వల్లభాయి పటేలు, మౌలానా ఆజాదు నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెసు, నాజీ జర్మనీని బహిష్కరించినప్పటికీ ఇది భారతదేశం స్వతంత్రం వచ్చే వరకు ఇతరులతో పోరాడలేదు. 1942 ఆగస్టులో కాంగ్రెసు క్విటు ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది. స్వాతంత్ర్యం మంజూరు అయ్యే వరకు ప్రభుత్వానికి ఏ విధంగానైనా సహకరించడానికి నిరాకరించింది. ఈ చర్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది వెంటనే 60,000 జాతీయ, స్థానిక కాంగ్రెసు నాయకులను అరెస్టు చేసింది. తరువాత కాంగ్రెసు మద్దతుదారుల హింసాత్మంగా అణిచివేసేందుకు ప్రయత్నించింది. గాంధీ తన ఆరోగ్యం కారణంగా 1944 మే మాసంలో విడుదలైనప్పటికీ నాయకులు 1945 జూను వరకు జైలులో ఉంచబడ్డారు. ముస్లిం లీగు క్విట్ ఇండియా ఉద్యమాన్ని తిరస్కరించి రాజు అధికారులతో కలిసి పనిచేసింది. సుభాష్ చంద్రబోస్ (నేతాజీ అని కూడా పిలుస్తారు) కాంగ్రెసును విడిచి స్వాతంత్ర్యం పొందేందుకు జర్మనీ లేదా జపానులతో ఒక సైనిక సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. ఇండియన్ లెజియన్ స్థాపనలో జర్మన్లు ​​బోసుకు సహాయం చేసారు. అయితే మోహన్ సింగు ఆధ్వర్యంలో మొట్టమొదటి భారత జాతీయ సైన్యం రద్దుచేసిన తరువాత భారత జాతీయ సైన్యం (ఐఎన్ఎ) పునరుద్ధరించడానికి జపాను సహకరించింది. ఐ.ఎన్.ఏ జపనీయుల మార్గదర్శకంలో మర్మాలో పోరాడారు, బోసు ఆజాద్ హిందుకు నాయకత్వం వహించి సింగపూరు నుండి నడిపించబడిన తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాడు. ఆజాదు హిందు ప్రభుత్వం దాని సొంత కరెన్సీ, కోర్టు పౌర చట్టాలను రూపొందించింది. బ్రిటీషు వారి మీద స్వాతంత్ర్య పోరాటానికి అధిక చట్టబద్ధత ఇచ్చిందని కొంతమంది భారతీయులు భావించారు. 1942 నాటికి పొరుగునున్న బర్మా మీద జపాను దాడి చేసింది. అప్పటికే జపాను అండమాను, నికోబార్ ద్వీపాలను స్వాధీనం చేసుకుంది. జపాను 1943 డిసెంబరు 21 న ఉచిత భారతదేశ తాత్కాలిక ప్రభుత్వానికి ద్వీపాల మీద నామమాత్రపు నియంత్రణను ఇచ్చింది. తరువాత మార్చిలో జపాను సహాయంతో భారత జాతీయ సైన్యం భారతదేశంలోకి ప్రవేశించి నాగాలాండులో కోహిమా వరకు అధికార పరిధిని విస్తరించింది. భారత ఉపఖండంలోని ప్రధాన భూభాగంలో ఈ పురోగమనం సుదూర స్థానానికి చేరుకుంది. 1940-43లో భారతదేశంలో బెంగాలు ప్రాంతం వినాశకరమైన కరువును ఎదుర్కొంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత (సా.శ. 1946 – 1947) thumb|1946 లో భారతదేశానికి స్వాతంత్ర్యానికి ముందు కలకత్తాలో హిందూ ముస్లిముల మధ్య జరిగిన ఘర్షణల్లో భాగంగా మృతులు, గాయపడిన వారు. 1946 లో లేబరు ప్రభుత్వం భారతదేశంలో బ్రిటీషు పాలనను ముగించాలని నిర్ణయించింది. 1947 ప్రారంభంలో బ్రిటను 1948 జూను లోపల అధికారాన్ని బదిలీ చేయాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పర్చడంలో పాల్గొంటున్నట్లు ప్రకటించింది. స్వాతంత్ర్యం కావాలన్న కోరికతో హిందువులు, ముస్లింల మధ్య ఉద్రిక్తతలు కూడా అభివృద్ధి చెందాయి. ముస్లింలు ఎల్లప్పుడూ భారతీయ ఉపఖండంలో ఒక మైనారిటీగా ఉండేవారు. ప్రత్యేకంగా హిందూ ప్రభుత్వ ఏర్పాటు వారిని కలవరానికి గురిచేసింది. వారిలో హిందూ ప్రభుత్వం పట్ల అవిశ్వాసం అభివృద్ధి చెందింది. రెండు సంఘాల మధ్య ఐక్యత కోసం గాంధీ పిలుపునిచ్చినప్పటికీ హిందూ పాలనను నిరాకరించారు. 1946 ఆగస్టు 16 న బ్రిటీషు ఇండియాలో ఒక ముస్లిం దేశం కావాలని ముస్లిం లీగ్ నాయకుడు ముహమ్మద్ ఆలీ జిన్నా శాంతియుతంగా డిమాండు చేసాడు. ఫలితంగా మొదలైన హింసాకాండ "గ్రేట్ కలకత్తా కిల్లింగ్ ఆగస్టు 1946"గా అభివర్ణించబడింది. హింసాకాండ బీహారుకు (హిందువులు ముస్లిముల మీద దాడి చేసార్), బెంగాల్లోని నోహాకిలీకి (హిందూలను లక్ష్యంగా చేసుకుని ముస్లింలు దాడి చేసారు), యునైటెడ్ ప్రొవిన్సులలోని గార్ముక్తేశ్వర్ ( హిందువులు ముస్లిముల మీద దాడి చేశారు) 1947 మార్చిలో రావల్పిండి వద్ద (దీనిలో హిందువులు ముస్లింలచే దాడి చేయబడ్డారు) వరకు విస్తరించింది. దేశవిభజన, స్వతంత్రం (సా.శ.1947–) thumb|right|భారతదేశం, పాకిస్తాన్ విభజన కారణంగా 1947లో సుమారు కోటి 45 లక్షల మంది నిర్వాసితులయ్యారు. 1947 లో యూనియన్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్ ఆఫ్ డొమినియన్ల విభజన తరువాత బ్రిటిషు నుండి భారత భూభాగాలు స్వాతంత్ర్యం పొందాయి. పంజాబు, బెంగాలు వివాదాస్పద ముందస్తు విభజన తరువాత ఈ ప్రాంతాలలోని సిక్కులు, హిందువులు, ముస్లింల మధ్య కలహాలు చెలరేగాయి. ఇది భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. కలహాలలో సుమారు 5,00,000 మంది మరణించారు. అలాగే ఈ కాలంలో ఆధునిక చరిత్రలో ఇప్పటివరకు నమోదు చేయబడని అతిపెద్ద ప్రజా వలసలు జరిగాయి. కొత్తగా సృష్టించిన భారతదేశం, పాకిస్తాన్ (వరుసగా 15 - 1947 ఆగస్టు 14 లో స్వాతంత్ర్యం పొందాయి) మద్య దాదాపు 12 మిలియన్ల హిందువులు, సిక్కులు, ముస్లింల వలసలు సంభవించాయి. 1971 లో బంగ్లాదేశ్ (గతంలో తూర్పు పాకిస్థాన్, తూర్పు బెంగాల్) పాకిస్థాన్ నుంచి విడిపోయింది. thumb|250px|right|14 వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహంలో శివుడు ఎడమవైపున, ఉమ కుడివైపున కూర్చున్నారు. వాషింగ్టన్ డి. సి లోని స్మిత్సోనియన్ ఇన్ స్టిట్యూషన్ లో ఉంది. 250px|right|thumb|రాబర్ట్ క్లైవు, బ్రిటిష్ వారి, బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ గా. చరిత్ర అధ్యయనం ఇటీవల దశాబ్దాల్లో చరిత్రకారులు భారతదేశ చరిత్రను అధ్యయనం చేయడానికి 4 స్కూల్స్ ఆధారంగా ఉన్నాయి. కేంబ్రిడ్జి, నేషనలిస్టు, మార్క్సిస్టు, సుబాల్టర్ను. ఒకేసారి సాధారణమైన "ఓరియంటలిస్ట్" విధానం, అవగాహన, అవ్యక్తంగా, పూర్తిగా ఆధ్యాత్మిక భావంతో అధ్యయనం జరిగింది. కేబ్రిడ్జి స్కూలు అనిల్ సీల్,Anil Seal, The Emergence of Indian Nationalism: Competition and Collaboration in the Later Nineteenth Century (1971) గార్డన్ జాంసన్,Gordon Johnson, Provincial Politics and Indian Nationalism: Bombay and the Indian National Congress 1880–1915 (2005) రీచర్డ్ గార్డ్సన్,డేవిడ్ వాష్‌బ్రూక్ చేత నిర్వహించబడింది.Rosalind O'Hanlon and David Washbrook, eds. Religious Cultures in Early Modern India: New Perspectives (2011)Aravind Ganachari, "Studies in Indian Historiography: 'The Cambridge School'", Indica, March 2010, 47#1, pp 70–93 అయినప్పటికీ " ది స్కూల్ ఆఫ్ హిస్టారియో గ్రఫీ " పాశ్చాత్యులు విమర్శించారు. జాతీయవాద పాఠశాల కాంగ్రెస్, గాంధీ, నెహ్రూ, ఉన్నత స్థాయి రాజకీయాలలో దృష్టి సారించింది. ఇది 1857 లో తిరుగుబాటు యుద్ధం విముక్తికి కారణమని, 1942 లో ప్రారంభమైన గాంధీ 'క్విట్ ఇండియా', చారిత్రక సంఘటనలను నిర్వచించడానికి ప్రాధాన్యత ఇచ్చింది. చరిత్ర ఈ పాఠశాల కూడా విమర్శలను ఎదుర్కొంది. మార్క్సిస్టులు ఆర్థిక అభివృద్ధి, భూస్వామ్య విధానం, వలసపాలనకు పూర్వం భారతదేశంలో నెలకొన్న వర్గ పోరాటం, కాలనీల కాలంలో పరిశ్రమల కొరత గురించి అధ్యయనం చేశారు. మార్కిజ వాదులు గాంధీ ఉద్యమాన్ని బూర్జువా శ్రేణుల సాధనంగా చిత్రీకరించారు. ప్రజల విప్లవ శక్తులను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారని బోధించింది. మార్కిజవాదులు "ఎక్కువగా" భావజాల ప్రభావితమైనట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. 1980 లలో "ఉపల్టన్ పాఠశాల" రంజజిత్ గుహ, గియాన్ ప్రకాష్లు ప్రారంభించారు. అది ప్రముఖులు, రాజకీయ నాయకుల మీద దృష్టి కేంద్రీకరించింది. జానపద కథలు, కవిత్వం, చిక్కులు, సామెతలు, పాటలు, మౌఖిక చరిత్ర, ఆంత్రోపాలజీ స్ఫూర్తితో "చరిత్ర"కు రూపకల్పన చేయడం మీద దృష్టి కేంద్రీకరించారు. ఇది 1947 కి ముందు కాలనీల శకంలో దృష్టి సారించింది. ఇటీవలే హిందూ జాతీయవాదులు భారతీయ సమాజంలో "హిందూత్వ" ("హిందుత్వం") కొరకు తమ డిమాండ్లకు మద్దతుగా చరిత్ర సృష్టించారు. ఈ పాఠశాల ఆలోచన ఇంకా అభివృద్ధి ప్రక్రియలో ఉంది. 2012 మార్చిలో హర్వార్డ్ యూనివర్శిటీలోని కంపరటివ్ రిలీజియన్ ప్రొఫెసర్, డయానా ఎల్. ఎక్ తన పుస్తకం "భారతదేశం: ఎ సేక్రేడ్ జియోగ్రఫీ"లో ఇలా వ్రాశారు, భారతదేశం బ్రిటీషు లేదా మొఘలుల కంటే చాలా ముందుగానే ఉంది. ఇది కేవలం ప్రాంతీయ గుర్తింపుల సమూహం కాదు, ఇది సంప్రదాయ లేదా జాతి ఆధారితం కాదు. వనరులు మూలాలు గమనికలు మూలాలజాబితా ఉపయుక్త గ్రంథ సూచి జాలమూలాలు ఇంకా చదువుటకు సాధారణం Basham, A.L., ed. The Illustrated Cultural History of India (Oxford University Press, 2007) Buckland, C.E. Dictionary of Indian Biography (1906) 495pp full text Chakrabarti D.K. 2009. India, an archaeological history : palaeolithic beginnings to early historic foundations Dharma Kumar and Meghnad Desai, eds. The Cambridge Economic History of India: Volume 2, c. 1751 – c. 1970 (2nd ed. 2010), 1114pp of scholarly articles Fisher, Michael. An Environmental History of India: From Earliest Times to the Twenty-First Century (Cambridge UP, 2018) Guha, Ramachandra. India After Gandhi: The History of the World's Largest Democracy (2007), 890pp; since 1947 James, Lawrence. Raj: The Making and Unmaking of British India (2000) Khan, Yasmin. The Raj At War: A People's History Of India's Second World War (2015) Majumdar, R.C. : An Advanced History of India. London, 1960. Majumdar, R.C. (ed.) : The History and Culture of the Indian People, Bombay, 1977 (in eleven volumes). Mcleod, John. The History of India (2002) excerpt and text search Mansingh, Surjit The A to Z of India (2010), a concise historical encyclopedia Metcalf, Barbara D. and Thomas R. Metcalf. A Concise History of Modern India (2006) Peers, Douglas M. India under Colonial Rule: 1700–1885 (2006), 192pp Richards, John F. The Mughal Empire (The New Cambridge History of India) (1996) Riddick, John F. The History of British India: A Chronology (2006) excerpt Riddick, John F. Who Was Who in British India (1998); 5000 entries excerpt Rothermund, Dietmar. An Economic History of India: From Pre-Colonial Times to 1991 (1993) Sharma, R.S., India's Ancient Past, (Oxford University Press, 2005) Sarkar, Sumit. Modern India, 1885–1947 (2002) Singhal, D.P. A History of the Indian People (1983) Smith, Vincent. The Oxford History of India (3rd ed. 1958), old-fashioned Spear, Percival. A History of India. Volume 2. Penguin Books. (1990) [First published 1965] Stein, Burton. A History of India (1998) Thapar, Romila. Early India: From the Origins to AD 1300 (2004) excerpt and text search Thompson, Edward, and G.T. Garratt. Rise and Fulfilment of British Rule in India (1934) 690 pages; scholarly survey, 1599–1933 excerpt and text search Tomlinson, B.R. The Economy of Modern India, 1860–1970 (The New Cambridge History of India) (1996) Wolpert, Stanley. A New History of India (6th ed. 1999) చరిత్రకారులు రచనలు Bose, Mihir. "India's Missing Historians: Mihir Bose Discusses the Paradox That India, a Land of History, Has a Surprisingly Weak Tradition of Historiography", History Today 57#9 (2007) pp. 34–. online Elliot, Henry Miers; John Dowson (1867–77). The History of India, as told by its own historians. The Muhammadan Period. London: Trübner and Co. Kahn, Yasmin. "Remembering and Forgetting: South Asia and the Second World War' in Martin Gegner and Bart Ziino, eds., The Heritage of War (Routledge, 2011) pp. 177–193. Jain, M. The India They Saw : Foreign Accounts (4 Volumes) Delhi: Ocean Books, 2011. Lal, Vinay, The History of History: Politics and Scholarship in Modern India (2003). Palit, Chittabrata, Indian Historiography (2008). Arvind Sharma, Hinduism and Its Sense of History (Oxford University Press, 2003) E. Sreedharan, A Textbook of Historiography, 500 B.C. to A.D. 2000 (2004) Warder, A.K., An introduction to Indian historiography (1972). అధికారిక వనరు The Imperial Gazetteer of India'' (26 vol, 1908–31), highly detailed description of all of India in 1901. online edition జాలవనరులు Live History India: https://www.livehistoryindia.com/ History of India Podcast: https://historyofindiapodcast.libsyn.com/ ఇంకా చూడండి భారత దేశ విద్యా వ్యవస్థ - చరిత్ర భారతీయ చక్రవర్తుల జాబితా * చరిత్ర వర్గం:చరిత్ర
వన్య శాస్త్రము
https://te.wikipedia.org/wiki/వన్య_శాస్త్రము
thumb|right|స్లోవేనియాలో అడవి.వన్య శాస్త్రము అడవులకు సంబంధించిన ఒక కళ, శాస్త్రము. అడవులు, వాటికి సంబంధించిన సహజ వనరులు, దీనికి సన్నిహితమైన సిల్వీకల్చర్, చెట్లు, అడవుల పెంపకము, పోషణకు సంబంధించిన శాస్త్రము. ఆధునిక వన్య శాస్త్రము సాధారణముగా కలప వాటి ఉత్పత్తులు; జంతువుల సమూహాలు; ప్రకృతిలోని నీటి నాణ్యత నియంత్రణ; టూరిజం; భూమి, గిరిజనుల రక్షణ; ఉద్యోగావకాశాలు;, వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ను నియంత్రణ మొదలైనవాటి అనుసంధానము. అడవులు జీవావరణ శాస్త్రములో ఒక ముఖ్యమైన భాగము. వన్యకారులు ఏమి చేస్తారు? వన్యకారులకు పరిశ్రమలు, ప్రభుత్వ ఏజెన్సీలలో, సంరక్షణా సంఘాలు, పట్టణ ఉద్యానవన బోర్డులు, పౌరసంఘాలు, ప్రైవేటు భూస్వాములు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. చారిత్రకంగా వన్యకారులు ఎక్కువగా కలపను కోయటానికి, కొత్త చెట్ల అభివృద్ధికీ ప్రణాళికను తయారుచెయ్యటంలో తమ నైపుణ్యాన్ని ఉపయోగిస్తున్నారు. సాధారణంగా, వృత్తిపరమైన వన్యకారులు అటవీ యాజమాన్య పథకాలను అభివృద్ధి చేస్తారు. ఈ పథకాలు ఒక నిర్ధిష్టమైన ప్రాంతములో ఉన్న చెట్ల గణాంకాలను, ప్రాంతము యొక్క టోపోలాజికల్ స్వరూప లక్షణాలను, ఆ ప్రాంతంలో వివిధ స్పీసీస్ల వారీగా ఆయా చెట్ల యొక్క విస్తరణ, విస్తృతులను, ఇతర వృక్షసంపదను పరిగణనలోకి తీసుకొని తయారుచేస్తారు. ఈ ప్రణాళికలో రోడ్లు, కల్వర్టులు, మానవ ఆవాసాలకు సామీప్యత, జలవనరుల పరిస్థితి, మృత్తికా నివేదికలను కూడా చేర్చుతారు. చివరిగా, అటవీ యాజమాన్య ప్రణాళికలలో ఈ భూమి యొక్క ప్రొజెక్టెడ్ వినియోగాన్ని, ఆ వాడుకకు సంబంధించిన కాలక్రమణికను కూడా చేర్చుతారు. చరిత్ర పాశ్చాత్య ప్రపంచంలో అడవుల సంరక్షణా విధానాలు ఆయా ప్రాంతాలను పరిపాలించే రాజులు, కులీనులు నియంత్రించే వారు. అంటే ఆ అడవులలో వేటాడే హక్కు వారికే ఉండేది. కానీ రైతులకు వంట చెరకు సేకరించుకోవడానికి, కొయ్యలను సేకరించుకోవడానికి, పశువులను మేపడానికి అనుమతినిచ్చేవారు. నేటి వన్యశాస్త్రము వన్యశాస్త్ర విద్య వన్య శాస్త్రమును చాలా కాలము ముందునుండే మధ్య ఐరోపాలో భోదిస్తున్నప్పటికినీ, వన్యశాస్త్ర విద్యకు అంకితమైన మొదటి వన్యశాస్త్ర విద్యాలయమును 1787వ సంవత్సరములో జార్జ్‌ హార్టీగ్‌ జర్మనీలోని డిల్లెన్‌బర్గ్‌ వద్ద స్థాపించెను. ఉత్తర అమెరికాలో మొదటిది ఆష్‌విల్ల్‌, ఉత్తర కరోలినా దగ్గర జార్జ్‌ వాండర్బిల్ట్‌, ఆ ప్రాంతములో లాగింగ్‌ (చెట్ల నరికివేత) వలన జరిగిన నష్టమును చూచి వన్యశాస్త్ర విద్యాలయము స్థాపించాడు. దాదాపు తన బిల్ట్‌మోర్‌ ఎస్టేట్‌ భూములు మొత్తము పూర్తిగా 1895నుండి ఖాలీ నేలనుంచి పెద్దపెద్ద వృక్షాలుగా పెరిగిన నిర్వహించబడ్డ అడవే. తొలి ఉత్తర అమెరికా వన్యకారులు పందొమ్మిదవ శతాబ్దమునుండి వన్య శాస్త్రము అభ్యసించుటకు జర్మనీకి వెళ్ళేవారు. కొంతమంది తొలి జర్మనీ వన్యకారులుకూడా ఉత్తర అమెరికా వలస వెళ్ళారు. ఈ రోజుల్లో, ఒక ఆమోదయోగ్యముగా శిక్షణ పొందిన వన్యకారుడు సాధారణముగా జీవ శాస్త్రము, వృక్ష శాస్త్రము, జన్యు శాస్త్రము, నేల విగ్ఞానము, climatology, hydrology, ఆర్ధిక శాస్త్రములు అభ్యసించి ఉండవలెను. ఇవేకాక basics of sociology, రాజనీతి శాస్త్రము యొక్క పరిజ్ఞానము ఉండడము అనుకూలతగా పరిగణిస్తారు. వన్యశాస్త్ర సంస్థలు అంతర్జాతీయ వన్యశాస్త్ర విద్యార్ధుల సంఘము ప్రపంచములోని వన్యశాస్త్ర విద్యార్థులందరి సమూహము. వన్యశాస్త్ర విద్యార్థుల యొక్క సాంప్రదాయిక విద్యను ప్రధానముగా extracurricular activities, అనుభవాలు, సమచారము యొక్క మార్పిడి ద్వారా విస్త్రుతమైన, ప్రపంచ వ్యాప్త దృక్పధము కలుగజేసి మెరుగు పరచుటయే వారి ప్రాథమిక లక్ష్యము. ఇవికూడా చూడండి భారతదేశంలో వన్య శాస్త్రము వృక్ష శాస్త్రము సంరక్షణ జీవశాస్త్రము అడవి‌ చెట్ల నరికివేత సిల్వీకల్చర్‌ కలప పట్టణ అటవీకరణ ఆంధ్ర దేశ వృక్షములు మన వృక్షములు మీట మీద నొక్కండి బయటి లింకులు Indian Council of Forestry Research and Education (ICFRE), Dehradun మూలాలు Charles H. Stoddard Essentials of Forestry. New York: Ronald Press, 1978. G. Tyler Miller. Resource Conservation and Management. Belmont: Wadsworth Publishing, 1990. Chris Maser. Sustainable Forestry: Philosophy, Science, and Economics. DelRay Beach: St. Lucie Press, 1994. Hammish Kimmins. Balancing Act: Environmental Issues in Forestry. Vancouver: University of British Columbia Press, 1992. Herb Hammond. Seeing the Forest Among the Trees. Winlaw/Vancouver: Polestar Press, 1991. "Forestry" in the Encyclopaedia Brtitannica 16th edition. New York: E.B., 1990. వర్గం:వన్య శాస్త్రము fr:Sylviculture hu:Erdőgazdálkodás it:Selvicoltura ro:Silvicultură
అక్కినేని నాగార్జున
https://te.wikipedia.org/wiki/అక్కినేని_నాగార్జున
అక్కినేని నాగార్జున (ఆగష్టు 29, 1959న చెన్నైలో జన్మించిన) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు. నాగార్జున సుమారు 100 పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలు కాగా కొన్ని తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాగార్జున నటుడిగా, నిర్మాతగా కలిపి తొమ్మిది నంది పురస్కారాలు, మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు. 1989 లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. 1990 లో రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా 13 వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. అదే సంవత్సరంలోనే శివ సినిమా హిందీ పునర్నిర్మాణంతో బాలీవుడ్ లోకి ప్రవేశించాడు. నాగార్జున పలు జీవిత చరిత్ర ఆధారిత సినిమాల్లో నటించాడు. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీ సాయి, హథీరాం బావాజీ మొదలైన వారి జీవిత చరిత్ర సినిమాల్లో నటించాడు. 1995 నుంచి ఈయన సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. అన్నపూర్ణా స్టూడియోస్ అనే సినీ నిర్మాణ సంస్థకు అధినేత. హైదరాబాదులో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అనే లాభాపేక్షలేని సంస్థను కూడా నడిపిస్తున్నాడు. వ్యక్తిగతం నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇతని ప్రథమ వివాహం ఫిబ్రవరి 18, 1984 http://www.idlebrain.com/celeb/bio-data/bio-nag.html నాడు లక్ష్మితో జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటేష్ కు సోదరి.http://timesofindia.indiatimes.com/articleshow/24966153.cms వీరిరువురు విడాకులు తీసుకున్నారు. తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడారు. ఈమె మాజీ దక్షిణ భారత నటి. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ నవంబర్ 23, 1986)నటి సమంత ను వివాహమాడి 6 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నాడు నాగచైతన్య. మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ ఏప్రిల్ 8 1994) రెండవ భార్య కొడుకు. సినిమా జీవితము నాగార్జున మొదటి చిత్రం విక్రం, 1986 మే 23లో విడుదల అయింది. ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన మజ్ను సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా కలెక్టరుగారి అబ్బాయి చిత్రంలో నటించారు. సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం., రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ, ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉంది. ఈ చిత్రానికి గాను నాగార్జున ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. శివ చిత్రాన్ని హిందీలో శివ అనే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టారు. ఈ చిత్రం హిందిలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరో అన్న పేరును తెచిపెట్టాయి. ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వములో విడుదలైన నిన్నే పెళ్లాడుతా భారీగా విజయవంతమయ్యింది. ఆ తరువాత అన్నమయ్య చిత్రములో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించారు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచింది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. 2006లో నాగార్జున తన తాజా చిత్రము శ్రీ రామదాసులో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నారు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వము వహించారు. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. 2008వ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి. 2021లో వైల్డ్ డాగ్ సినిమాలో నటించాడు. thumb|Actor నాగార్జున పురస్కారములు right|250px|thumb|నరేంద్రమోడీతో నాగార్జునఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ చిత్ర పురస్కారాలు 1997 - నిన్నే పెళ్ళాడతా సినిమా నిర్మించినందుకు గాను తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం 1998 - అన్నమయ్య సినిమాలో నటించినందుకు జాతీయ స్థాయి ప్రత్యేక జ్యూరీ పురస్కారం నంది పురస్కారాలు నటుడిగా 2011 - రాజన్న సినిమాకి గాను నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం 2006 - శ్రీరామదాసులో నంది ఉత్తమ నటుడు 2002 - సంతోషంలో నంది ఉత్తమ నటుడు 1997 - అన్నమయ్యలో నంది ఉత్తమ నటుడు; నిర్మాతగా: 1996 - నిన్నే పెళ్ళాడుతా కుటుంబ సమేతంగా చూడదగ్గ నంది చిత్రం (అక్కినేని పురస్కారం) 1999 - ప్రేమకథ నంది మూడో అత్యుత్తమ చిత్రం 2000 - యువకుడు నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం 2002 - మన్మధుడు నంది ఉత్తమ చిత్రం 2011 - రాజన్న నంది ద్వితీయ ఉత్తమ చిత్రం; ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు 1990 - శివ సినిమాలో ఉత్తమ నటుడు. 1996 - నిన్నే పెళ్ళాడుతా ఉత్తమ చిత్ర పురస్కారం 1997 - అన్నమయ్య సినిమాలో ఉత్తమ నటుడు. దక్షిణ భారతదేశ అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారం 2012 - రాజన్న సినిమాకు ప్రత్యేక ప్రశంసలు; సినీ'మా' పురస్కారాలు 2012 - రాజన్న సినిమాలో ఉత్తమ నటుడిగా ప్రత్యేక ప్రశంసలు 2013 - శిర్డీసాయి ఉత్తమ నటుడిగా ప్రత్యేక జ్యూరీ పురస్కారం Nitya, Nag bag awards on star-studded night | The Hindu ఇతర పురస్కారాలు 1990 - శివ సినిమా ఎక్స్‌ప్రెస్ పురస్కారం 1996 - నిన్నే పెళ్ళాడుతా ఆకృతి చిత్ర పురస్కారం 1997 - అన్నమయ్య సినిమాకి స్క్రీన్ వీడియోకాన్ పురస్కారం 2000 - ఆజాద్ సినిమాకి ఆంధ్రప్రదేశ్ సినీ జర్నలిస్టు పురస్కారం 2011- టీ. సుబ్బరామిరెడ్డి కళారత్న పురస్కారం భరతముని పురస్కారాలప 1989 - గీతాంజలి సినిమాకి గాను ఉత్తమ నటుడు. 1997 - అన్నమయ్య సినిమాకి గాను ఉత్తమ నటుడు. వంశీ బర్కిలీ పురస్కారాలు 1986 - విక్రం సినిమాలో ఉత్తమ నటుడు. 1990 - శివ సినిమాలో ఉత్తమ నటుడు. ఏపీ సినీ గోయర్స్ పురస్కారం 1989 - గీతాంజలి సినిమాలో ఉత్తమ నటుడు. అవీ-ఇవీ ఈయన తన తండ్రి యొక్క నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ని పునరుద్ధరించి తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలములో ఒక విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకొన్నారు. నటించిన చిత్రాలు సం. సంవత్సరం సినిమా పేరు పాత్రపేరు తోటి నటీనటులు దర్శకులు ఇతర వివరాలు 2021బంగార్రాజుబంగార్రాజు అక్కినేని నాగార్జున , రమ్యకృష్ణ,నాగచైతన్య,కృతి శెట్టి కళ్యాణ్ కృష్ణ కురసాల12019మన్మథుడు 2సాంబశివరావురకుల్ ప్రీత్ సింగ్,కీర్తి సురేష్,లక్ష్మి,రావు రమేష్,వెన్నెల కిషోర్,ఝాన్సీ,దేవదర్శినిరాహుల్ రవీంద్రన్22018ఆఫీసర్శివాజీ రావుమైరా సరీన్రామ్ గోపాల్ వర్మ32018దేవదాస్దేవనాని,రష్మిక మందన,ఆకాంక్షశ్రీరామ్ ఆదిత్య42017రాజు గారి గది2రుద్రసమంత, అశ్విన్ బాబు,సీరత్ కపూర్ఓంకార్52017ఓం నమో వేంకటేశాయహాథిరామ్ బాబాఅనుష్క, ప్రజ్ఞ జైస్వాల్,సాయి కుమార్,రావు రమేష్కె. రాఘవేంద్రరావు62016ఊపిరి (సినిమా)విక్రమాదిత్యకార్తి, తమన్నా, ప్రకాష్ రాజ్, జయసుధవంశీ పైడిపల్లి72016సోగ్గాడే చిన్ని నాయనాబంగార్రాజు,రాములావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణకళ్యాణ్ కృష్ణ82014మనం నాగేశ్వరరావుఅక్కినేని, నాగ చైతన్య, సమంత, శ్రియా సరన్ విక్రమ్ కే కుమార్92013భాయ్రిచా గంగోపాధ్యాయవీరభద్రం చౌదరి10 2013గ్రీకువీరుడు చందునయనతార దశరథ్11 2012 ఢమరుకం మల్లికార్జున అనుష్క శ్రీనివాసరెడ్డి 12 2011 రాజన్న రాజన్న స్నేహ విజయేంద్రప్రసాద్ 13 2011 గగనం రవి పూనమ్‌కౌర్‌ రాధామోహన్ 14 2010 రగడ సత్య అనుష్క వీరూపోట్ల 15 2010 కేడి రమేష్ అలియస్ రమ్మి మమతా మోహన్ దాస్ కిరణ్ 16 2008 కింగ్ కింగ్, బొట్టు శీను, శరత్ త్రిష శ్రీను వైట్ల 3 పాత్రలలో వైవిధ్య నటనకు విమర్శకుల ప్రశంసలు. 17 2008 కృష్ణార్జున కృష్ణ మమతా మోహన్ దాస్ మంచు విష్ణు పి. వాసు 18 2007 డాన్ సూరిఅనుష్క రాఘవా లారెన్స్ 19 2006 బాస్ గోపాల కృష్ణ నయనతార, శ్రియా సరన్ వి.ఎన్. ఆదిత్య 20 2006 శ్రీరామదాసు గోపన్న /శ్రీ రామదాసు స్నేహ కె. రాఘవేంద్రరావు విమర్శకుల ప్రశంసలు నంది పురస్కారాలు - ఉత్తమ నటుడు. 21 2006 స్టైల్ మాస్రాఘవ లారెన్స్ అతిథి పాత్రలో 22 2005 సూపర్ అఖిల్అనుష్క, అయేషా టాకియాపూరి జగన్నాథ్ ఫిలంఫేర్ తెలుగు ఉత్తమ నటుడు బహుమతికి ఎంపిక 23 2004 మాస్ గణేష్/మాస్ జ్యోతిక రాఘవ లారెన్స్ 24 2004 నేనున్నాను వేణు శ్రియా, ఆర్తి అగర్వాల్ విఎన్‌ ఆదిత్య 25 2003 యల్ ఓ సి కార్గిల్ మేజర్ పద్మపాణి ఆచార్య జె.పి దత్తా 26 2003 శివమణి 9848022338 శివమణి ఆసిన్, రక్షితపూరి జగన్నాథ్ 27 2002 మన్మథుడు అభిరామ్ సొనాలిబింద్రే, అన్షుకె. విజయభాస్కర్నంది పురస్కారాలు - ఉత్తమ నిర్మాత. 28 2002 సంతోషం) కార్తీక్ గ్రేసీ సింగ్, శ్రియా దశరథ్నంది పురస్కారాలు - ఉత్తమ నటుడు. 29 2001 స్నేహమంటే ఇదేరా అరవింద్ భూమిక బాలశేఖరన్ 30 2001 ఆకాశ వీధిలో చందు రవీనాటాండన్ సింగీతం శ్రీనివాసరావు 31 2001 బావ నచ్చాడు అజయ్ సిమ్రాన్, రీమాసేన్ కె.ఎస్. రవికుమార్ 32 2001 ఎదురులేని మనిషి సూర్యమూర్తి/సత్యమూర్తి సౌందర్య, సేనాజ్ జొన్నలగడ్డ శ్రీనివాసరావు ద్విపాత్రాభినయం. 33 2000 ఆజాద్ ఆజాద్ సౌందర్య, శిల్పాశెట్టి తిరుపతి స్వామి 34 2000 నిన్నే ప్రేమిస్తా శ్రీనివాస్ సౌందర్య ఆర్.ఆర్. షిండే 35 2000 నువ్వు వస్తావని చిన్ని సిమ్రాన్ వి.ఆర్.ప్రతాప్ 36 1999 రావోయి చందమామ శశి అంజలా జవేరీ జయంత్ సి.పరాన్జీ 37 1999 సీతారామరాజు రామరాజు సంఘవి, సాక్షిశివానంద్ వై.వి.ఎస్.చౌదరి 38 1998 చంద్రలేఖ సీతా రామారావు రమ్యకృష్ణ, కృష్ణవంశీ 39 1998 ఆటో డ్రైవర్ జగన్ సిమ్రాన్, దీప్తి భట్నాగర్ సురేష్ కృష్ణ 40 1998 ఆవిడా మా ఆవిడే విక్రాంత్ టాబు, హీరా ఇ.వి.వి. సత్యనారాయణ 41 1998 అంగారే (హిందీ)[rowdy telugulo dubb ayyindhi] రాజా సొనాలిబింద్రే మహేష్ భట్ 42 1997 రచ్చగన్ తమిళం[rakshakudu telugulo dubb ayyindhi] అజయ్ సుస్మితాసేన్ ప్రవీణ్ గాంధీ 43 1997 అన్నమయ్య అన్నమయ్య రమ్యకృష్ణ, కస్తూరి (నటి) కె. రాఘవేంద్రరావునంది పురస్కారాలు - ఉత్తమ నటుడు. 44 1996 నిన్నే పెళ్ళాడుతా (1996 సినిమా) శీను టాబు కృష్ణవంశీ 45 1996 రాముడొచ్చాడు రామ్ సౌందర్య, రవళి (నటి)ఎ. కోదండరామిరెడ్డి 46 1996 వజ్రం (సినిమా) చక్రి రోజా సెల్వమణి, ఇంద్రజ ఎస్. వి. కృష్ణారెడ్డి 47 1995 సిసింద్రీ (సినిమా) రాజా టాబు శివనాగేశ్వరరావు 48 1995 క్రిమినల్ (సినిమా) అజయ్ మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ మహేష్ భట్ 49 1995 ఘరానా బుల్లోడు కళ్యాణ్ రమ్యకృష్ణ కె. రాఘవేంద్రరావు 50 1994 హలో బ్రదర్ దేవ/రవివర్మ సౌందర్య, రమ్యకృష్ణ ఇ.వి.వి. సత్యనారాయణ ద్విపాత్రాభినయం 51 1994 గోవిందా గోవిందా శ్రీను శ్రీదేవి రాంగోపాల్ వర్మ 52 1993 అల్లరి అల్లుడు కళ్యాణ్ నగ్మా, మీనా ఏ.కోదండరామిరెడ్డి 53 1993 వారసుడు వినయ్ నగ్మా ఇ.వి.వి. సత్యనారాయణ 54 1993 రక్షణ బోస్ శోభన, రోజా ఉప్పలపాటి నారాయణరావు 551992 ప్రెసిడెంటు గారి పెళ్ళాం రాజా మీనాఎ. కోదండరామిరెడ్డి 56 1992 ద్రోహి రాఘవ్/శేఖర్ ఊర్మిళ (నటి)రాంగోపాల్ వర్మ 57 1992 అంతం (సినిమా) రాఘవ్ ఊర్మిళ (నటి) రాంగోపాల్ వర్మ 58 1991 ఖుదా గవా (హిందీ) రాజా మిర్జాశిల్పా శిరోద్కర్ ముకుల్ ఎస్.ఆనంద్ 59 1991 కిల్లర్ ఈశ్వర్/కిల్లర్ నగ్మా ఫాజిల్ 60 1991 జైత్రయాత్ర తేజ విజయశాంతిఉప్పలపాటి నారాయణరావు 61 1991 శాంతి క్రాంతి క్రాంతి జూహిచావ్లా వి. రవిచంద్రన్ కన్నడ మూలం 62 1991 చైతన్య చైతన్య గౌతమి (నటి) ప్రతాప్ వి. పోతన్ 63 1991 నిర్ణయం (సినిమా) వంశీకృష్ణ అమల ప్రియదర్శన్ 64 1990 శివ (హిందీ) శివ అమలరాంగోపాల్ వర్మ 65 1990 ఇద్దరు ఇద్దరే రమ్యకృష్ణ ఎ. కోదండరామిరెడ్డి 66 1990 నేటి సిద్దార్థ సిద్దార్థశోభన క్రాంతికుమార్ 67 1990ప్రేమ యుద్దం కళ్యాణ్అమల రాజేంద్రసింగ్ 68 1989శివ (1989 సినిమా) శివఅమలరాంగోపాల్ వర్మ ఫిలింఫేర్ తెలుగు ఉత్తమ నటుడు. 69 1989అగ్ని (హిందీ) పవన్ శాంతిప్రియ ఇఫ్తేఖర్ చౌదరి 70 1989గీతాంజలిప్రకాష్ (( మణిరత్నం )) 71 1989విక్కీ దాదా విక్రం (విక్కీ) 72 1989విజయ్ విజయ్ 73 1988జానకి రాముడు రాము 74 1988మురళీ కృష్ణుడు మురళీ కృష్ణ 75 1988చినబాబుచినబాబు 76 1988ఆఖరి పోరాటం విహారి 77 1987కిరాయిదాదా విజయ్ 78 1987అగ్నిపుత్రుడు కాళిదాసు 79 1987కలెక్టర్ గారి అబ్బాయి రాజేష్ 80 1987సంకీర్తన కాళి 81 1987మజ్ను రాజేష్ రజిని దాసరి నారాయణరావు 821987అరణ్యకాండ 831986కెప్టెన్ నాగార్జున నాగార్జున 841986విక్రమ్ విక్రమ్ శోభన వి. మధుసూదన్ రావు అక్కినేని వంశ వృక్షం మూలాలు ఇవి కూడా చూడండి అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని నాగార్జున నటించిన చిత్రాలు బయటి లింకులు నాగార్జున అభిమానుల సైటు తెలుగు సినీరంగంలో 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న నాగార్జున అక్కినేని నాగార్జున వర్గం:తెలుగు సినిమా నటులు వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు వర్గం:జీవిస్తున్న ప్రజలు వర్గం:సినీ వారసత్వం గల తెలుగు సినిమా వ్యక్తులు
తెలుగు సినిమాలు అ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_అ
thumb|అమ్మోరు అంతస్తులు - 1965 అందమైన మనసులో (2008) అందరి బంధువయ (2010) అందరివాడు - 2005 అక్కుమ్ బక్కుం - 1996 అక్కమొగుడు - 1992 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి - 1996 అగ్గిబరాటా - 1966 అగ్గిదొర అగ్గి పిడుగు అడవి రాముడు - 1977 అడవి రాజా (1985 సినిమా) అడవిలో అన్న అతనొక్కడే - 2005 అతడు - 2005 అత్తగారు కొత్తకోడలు అత్తగారు జిందాబాద్ అత్తగారూ స్వాగతం అత్తపోరు అత్తలు కోడళ్లు అత్తకు కొడుకు మామకు అల్లుడు - 1993 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ - 2007 అత్తా ఒకింటి కోడలే - 1958 అత్తాకోడళ్లు అతిథి - 2007 అదృష్టం -1992 అదుర్స్ - 2010 అది నువ్వే - 2010 అమృతవర్షం - 2006 అది ఒక ఇదిలే (2007) అనగనగా అరణ్యం 2010 అనగనగా ఒక రోజు - 1996 అనసూయ - 1936 అనసూయ - 2007 అనసూయమ్మ గారి అల్లుడు అనాదిగా ఆడది అనార్కలి అనుకున్నది సాధిస్తా అనుకోకుండా ఒక రోజు - 2005 అనుగ్రహం అనుబంధం - 1983 అనుబంధాలు అనుభవించు రాజా అనుభవించు అనురాగబంధం అనుమానాస్పదం - 2007 అన్న - 1994 అన్నమయ్య అన్నయ్య - 2000 అన్నా తమ్ముడు (1990) అన్నా తమ్ముడు (1958) అన్నా నీ అనుగ్రహం అన్నాతమ్ముల కథ అన్నదమ్ముల శపధం అన్నాదమ్ముల సవాల్ అపరిచితుడు - 2005 అపరిచితులు అప్పగింతలు అపూర్వ సహోదరులు (1986 సినిమా) అపూర్వ సహోదరులు (1950 సినిమా) అప్పుల అప్పారావు - 1992 అప్పుచేసి పప్పుకూడు - 1959 అబ్బాయిగారు అబ్బాయిగారి పెళ్ళి అబ్బాయిగారు - అమ్మాయిగారు అభిమానవంతులు అభిసారిక (సినిమా) అభిలాష - 1983 అభినందన - 1988 అమర ప్రేమ అమరకవి అమరజీవి (1956 సినిమా) అమరజీవి (1983 సినిమా) అమరావతి - 2009 అమాయకుడు కాదు అసాధ్యుడు అమృతకలశం అమెరికా రాముడు అమ్మ అమ్మ (1975 సినిమా) అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి - 2003 అమ్మ మనసు అమ్మనా కోడలా - 1995 అమ్మా అమ్మను చూడాలనివుంది అమ్మా నాగమ్మ అమ్మాయి కావాలి అమ్మాయి పెళ్ళి అమ్మాయి మనసు అమ్మాయికి మొగుడు మామకు యముడు అమ్మో అల్లుడా అమ్మో ఒకటోతారీఖు - 2000 అమ్మో పోలీసోళ్లు అమ్మదొంగా - 1995 అమ్మాయిలు అబ్బాయిలు - 2003 అమ్మోరు - 1995 అమృత (అనువాదం) - 2002 అరబ్బీ వీరుడు జబక్ అర్ధాంగి (1996 సినిమా) అర్ధరాత్రి - 1968 అర్ఙున్ - 1987 అర్ఙున్ - 2004 అర్జున గర్వభంగము అరుణ కిరణం అరుంధతి - 2009 అల్లరి అల్లుడు అల్లరి మొగుడు అల్లరి ప్రియుడు - 1993 అల్లరి పిడుగు - 2005 అల్లరి రాముడు - 2002 అల్లరి ప్రేమికుడు అల్లూరి సీతా రామ రాజు అల్లుడుగారు అల్లుడుగారు వచ్చారు అల్లుడు గారూ జిందాబాద్ అల్లుడి కోసం అల్లావుద్దీన్ అద్భుతదీపం - 1957 ఆలీబాబా అద్భుతదీపం- 1995 అల్లరి పెళ్ళికొడుకు అల్లరి పిల్లలు అల్లరే అల్లరి - 2007 అశ్వత్థామ అశోక చక్రవర్తి (1989 సినిమా) అష్టలక్ష్మి వైభవం అష్టాచమ్మా (2008) అసలే పెళ్ళైనవాణ్ణి అస్త్రం - 2005 అయ్యా అయ్యారే - 2012 అమ్మో బొమ్మ - 2001 అసాధ్యులు అసాధ్యులకి అసాధ్యుడు అసాధ్యుడు (1985 సినిమా) అసాధ్యుడు (1968 సినిమా) అసాధ్యుడు (2006 సినిమా) అహనా పెళ్ళంట - 1987 అహనా పెళ్ళంట - 2011 అహోబ్రహ్మ ఒహోశిష్య - 1997 అజ్ఞాతవాసి (2018)
తెలుగు సినిమాలు ఆ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ఆ
ఆంధ్రుడు ఆ ఒక్కటీ అడక్కు ఆకలి రాజ్యం ఆకాశ వీధిలో ఆకాశరామన్న - 1965 ఆకాశరామన్న - 2010 ఆఖరి క్షణం ఆగష్టు 15 రాత్రి ఆగ్రహం ఆజాద్ ఆటోడ్రైవర్ ఆడజన్మ (1970 సినిమా) ఆడవారి మాటలకు అర్థాలే వేరులే - 2007 - వెంకటేష్, త్రిష ఆత్మ బంధువులు ఆదర్శం - 1952 ఆదర్శం - 1993 ఆదర్శ కుటుంబం ఆదర్శ వీరులు ఆదర్శ సోదరులు ఆది ఆదిత్య 369 ఆనందజ్యోతి ఆనందనిలయం ఆనందం ఆనంద్ ఆమె ఆమె ఎవరు? ఆమె కథ ఆయనకిద్దరు ఆలీబాబా 40 దొంగలు (1970 సినిమా) ఆలీబాబా అరడజనుదొంగలు ఆలుమగలు (1995 సినిమా) ఆల్‌రౌండర్ ఆవేశం (1994 సినిమా) ఆవిడా మా ఆవిడే ఆవిడే శ్యామల ఆవేశం (1980 సినిమా) అశాజీవులు ఆస్తులు అంతస్తులు - 1969 ఆస్తులు అంతస్తులు - 1988 ఆహా ఆహ్వానం
తెలుగు సినిమాలు ఇ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ఇ
thumb|ఇద్దరుఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ఇల్లు పెళ్ళి - 1993 ఇల్లు ఇల్లాలు - 1972 ఇల్లాలు వర్ధిల్లు ఇల్లాలు (1997 సినిమా) - సరి చూడాలి ఇల్లాలు (1996 సినిమా)- సరి చూడాలి ఇల్లాలు (1981 సినిమా) ఇల్లాలు (1965 సినిమా) ఇల్లాలు (1940 సినిమా) - గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో ఇన్స్‌పెక్టర్ రుద్ర ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ ఇన్స్‌పెక్టర్ ఝాన్సీ ఇన్స్‌పెక్టర్ అశ్విని ఇదే నా మొదటి ప్రేమలేఖ ఇద్దరు ఇద్దరు మిత్రులు ఇద్దరూ ఇద్దరే (1990 సినిమా) ఇద్దరూ ఇద్దరే (1976 సినిమా) ఇద్దరు మొనగాళ్లు ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు ఇదేనా ప్రపంచం ఇదేం పెళ్లాం బాబోయ్ ఇది కథ కాదు ఇదా లోకం ఇంద్ర ఇంద్రుడు చంద్రుడు - 1981 సినిమా ఇంద్రుడు చంద్రుడు - 1989 సినిమా ఇంద్రధనుస్సు (1988 సినిమా) ఇంద్రధనుస్సు (1978 సినిమా) ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఇంట్లో రామయ్య- (ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇదీ ఒకటేనా? సరిచూడవలెను ) ఇంటిని దిద్దిన ఇల్లాలు ఇంటింట దీపావళి ఇంటి దొంగ (1987 సినిమా) ఇంటి దొంగ (1964 సినిమా) ఇంటి గౌరవం ఇంటి కోడలు ఇంగ్లీషు పెళ్లాం ఈష్టు గోదావరి మొగుడు ఇష్టం ఇష్టపడి - (పేరులో తప్పున్నట్లుంది. సరిచూడాలి)
తెలుగు సినిమాలు ఒ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ఒ
thumb|ఒక్కడుఒక్కడు ఒక ఊరిలో ఒంటరి ఒక 'వి' చిత్రం ఒంటరి పోరాటం ఒక ఊరి కథ ఒక చల్లని రాత్రి ఒక చిన్నమాట ఒక రాధ – ఇద్దరు కృష్ణులు ఒక తుపాకి మూడు పిట్టలు ఒక నారి – వంద తుపాకులు ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు ఒక మనసు ఒక యోధుడు ఒక రాజు ఒక రాణి ఒక రోజు రాజు ఒక లైలా కోసం ఒకనాటి రాత్రి ఒకరికి ఒకరు ఒకే ఒక్కడు ఒకే కుటుంబం ఒకే మాట ఒకే రక్తం ఒక్క అమ్మాయి తప్ప ఒక్క క్షణం ఒక్క మగాడు ఒక్కడినే ఒక్కడున్నాడు ఒక్కడు చాలు 2000లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. ఒక్కడే 2005, సెప్టెంబర్ 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు! 2003లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఒట్టేసి చెపుతున్నా 2003 లో ఇ. సత్తిబాబు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఒరేయ్ రిక్షా : 1995లో విడుదలైన తెలుగు సినిమా. దాసరి ఫిల్మ్ యూనివర్శిటీ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. మూలాలు
తెలుగు సినిమాలు క
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_క
thumb|కన్నెమనుసులుకంచు కవచం కంచుకోట - 1967 కక్ష శిక్ష కక్ష సాధిస్తా కచ దేవయాని - 1938 కడప రెడ్డెమ్మ కత్తిపోటు కత్తుల కాంతయ్య కత్తులకొండయ్య కరుణించిన కనకదుర్గ - 1992 కల్యాణ వీణ కథానాయకుడు (1969) కథానాయకుడు (1984) కథానాయకుని కథ - 1965 కథానాయకుని కథ - 1975 కనకదుర్గ పూజామహిమ (1973) కన్నకూతురు కన్నకొడుకు (1973) కన్నకొడుకులు - సరిచూడాలి కన్నయ్య కిట్టయ్య కన్నవారి కలలు (1974) కన్నుల పండుగ (1966) కన్నుల పండుగ (1969) కన్నెమనసులు కన్నెవయసు కన్యాదానం (1998) కరాటే కమల కర్పూర దీపం కర్పూర శిల్పం కలలు కనే కళ్ళు కలవారి చెల్లెలు కనక మహాలక్ష్మి కలిసొచ్చిన అదృష్టం కలిసొచ్చిన కాలం కలెక్టర్ గారు కల్యాణ జ్యోతి కల్యాణ తాంబూలం కల్యాణ తిలకం కల్యాణ ప్రాప్తిరస్తు కల్యాణ మండపం కల్యాణం కల్యాణి (1960) కల్యాణి (1979) కవిత (1976) కాంచన(సినిమా) కాడెద్దులు ఎకరం నేల కానిస్టేబులు కూతురు కారు దిద్దిన కాపురం కార్తీక దీపం కార్మిక విజయం కాలాంతకుడు కాలేజీ కాలేజీ బుల్లోడు కాలేజీ స్టూడెంట్ కాళరాత్రి 12 గంటలు కాళరాత్రిలో కన్నెపిల్ల కాశ్మీరు బుల్లోడు కిల్లర్ - నాగార్జున,నగ్మా,(ఊర్వశి)శారద కిరాయి రౌడీలు కిరాయిగూండా కిల్లాడి శంకర్ కిలాడి సింగన్న కిల్లాడి సీఐడి 999 కిష్కింథాకాండ కీచురాళ్ళు కులమా గుణమా కుక్క కాటుకు చెప్పు దెబ్బ కుర్రది-కుర్రాడు కుర్రాళ్ళ రాజ్యం కూలీ నం 1 కెప్టెన్ కెప్టెన్ కృష్ణ కెప్టెన్ నాగార్జున కేడి. నెం. 1 కేడి రౌడి కొంటె కుర్రాళ్ళు కొంటెకాపురం కొంటెపిల్ల కొండవీటి రాజా కొండవీటి సింహం కొండవీటి రౌడీ కొత్త జీవితాలు కొత్తనీరు (1982) కొక్కొరో కో కొత్త కోడలు కొత్త పెళ్ళికూతురా రా కొత్త పెళ్ళికూతురు కొత్తదారి కొదమ సింహం కొత్తపేట రౌడీ కొబ్బరిబోండాం కోదండ రాముడు కోనసీమ కుర్రోడు కోయంబత్తూరు ఖైదీ కోరికలే గుర్రాలైతే కౌబాయ్ నెం. 1 కృష్ణ గారి అబ్బాయి కృష్ణ వేణి కృష్ణ లీల కృష్ణ గారడీ కృష్ణ పరమాత్మ కృష్ణ తులాభారం - 1935 క్రిమినల్ -
తెలుగు సినిమాలు ఖ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ఖ
thumb|ఖడ్గంఖడ్గం (సినిమా) ఖడ్గవీర ఖడ్గవీరుడు ఖతర్నాక్ ఖైదీ (సినిమా) ఖైదీ నెం. 786 ఖైదీ కన్నయ్య ఖైదీ ఇన్‌స్పెక్టర్ ఖైదీ కృష్ణుడు ఖైదీ నెం: 77 ఖైదీ పెళ్ళి ఖైదీ బాబాయ్ ఖైదీ బుల్లోడు
తెలుగు సినిమాలు గ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_గ
thumb|గీతాంజలిగంగ యమున సరస్వతి గంగా భవానీ గండర గండడు గందరగోళం గంధర్వ కన్య (1979 సినిమా) గజదొంగ గంగన్న గమ్మత్తు గూఢచారులు గయ్యాళి గంగమ్మ గలాటా పెళ్లిళ్లు గణేష్ గ్రహణం విడిచింది గాంగ్ మాస్టర్ గాంగ్‌వార్‌ గాడ్‌ఫాదర్‌ గ్యాంగ్ లీడర్ గాయం గాంధీనగర్ రెండవ వీధి గీతా గీతాంజలి (1948 సినిమా) గీతాంజలి (1989 సినిమా) గీతాంజలి (2014 సినిమా) గుండమ్మ కథ గుండెలు తీసిన మొనగాడు గుప్త శాస్త్రం గురు దక్షిణ గురు బ్రహ్మ గురు శిష్యులు (1981 సినిమా) (సరి చూడాలి) గురు శిష్యులు (1990 సినిమా) గురుశిష్యులు (సరి చూడాలి) గురువుని మించిన శిష్యుడు గువ్వల జంట గూండారాజ్యం గూటిలోని రామచిలక గూడుపుఠాని గూఢచారి 003 గూఢచారి 115 (గూఢచారి 116?) గూఢాచారి నెం.1 గృహప్రవేశం (1946 సినిమా) గృహప్రవేశం (1977 సినిమా) గృహలక్ష్మి (1938 సినిమా) - కన్నాంబ, కాంచనమాల గృహలక్ష్మి- 1967 - భానుమతి, అక్కినేని నాగేశ్వరరావు గృహలక్ష్మి - 1984 గొప్పింటి అమ్మాయి గోపాలరావు గారి అబ్బాయి గోపాలరావు గారి అమ్మాయి గోమాత వ్రతం గోరంత దీపం గోలనాగమ్మ గోల్కొండ గజదొంగ గోవా సి.ఐ.డి 999 గోల్‌మాల్ గోవిందం గోవుల గోపన్న గౌతం గ్రామదేవతలు గ్రీకువీరుడు గమ్యం
తెలుగు సినిమాలు చ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_చ
thumb|చంటిచంటబ్బాయి చంటి చండీరాణి - 1983 చందమామ - 1982 చందమామ - 2007 చందమామ కథలు - 2014 చంద్రహాస - 1965 చండీప్రియ చక్రం చక్రవ్యూహం చక్రపాణి (1954) చట్టానికి కళ్లులేవు చట్టానికి వేయికళ్లు చదరంగం - 1967 చదరంగం - 1984 చదువుకున్న భార్య చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం చల్లని నీడ చాణక్య శపధం చిత్రం - 2000 చిత్రం భళారే విచిత్రం చింతామణి - 1956 చిక్కడు దొరకడు - 1967 చిక్కడు దొరకడు - 1988 చిట్టి తల్లి చిత్తూరు రాణీ పద్మిని చిన్న కోడలు చిన్నరాయుడు చిన్నల్లుడు చిన్నారి చిట్టిబాబు చిన్నారి దేవత చిన్ని చిన్ని ఆశ చిరంజీవి - 1969 చిరంజీవి - 1985 చిలకా గోరింక చిలిపి మొగుడు చిల్లర దేవుళ్లు చిల్లరకొట్టు చిట్టెమ్మ చిల్లర మొగుడు అల్లరి కొడుకు చీకటి సూర్యులు చుట్టరికాలు చుట్టాలొస్తున్నారు జాగ్రత్త చూడాలనివుంది చూపులు కలసిన శుభవేళ చెంచులక్ష్మి - 1943 చెంచులక్ష్మి - 1958 చెంగల్వ పూదండ చెట్టుకింద ప్లీడరు చెయ్యెత్తి జైకొట్టు - 1969 చెయ్యెత్తి జైకొట్టు - 1979 చెల్లెలి కోసం చెవిలో రహస్యం చేతిలో చెయ్యేసి చెప్పు చేసిన బాసలు చైతన్యరధం
తెలుగు సినిమాలు జ, ఝ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_జ,_ఝ
thumb|జయంజయం జయం మనదేరా జగత్ కంత్రీలు జగత్ జెంత్రీలు జగత్ మొనగాళ్ళు జగదేకవీరుడు- అతిలోక సుందరి జగద్గురు ఆది శంకరాచార్య జగన్మోహిని జగన్నాధం & సన్స్ జడగంటలు జడ్జి గారి కోడలు జనరల్ చౌధరి జమీందారు జయసింహ జయసింహ జరిగిన కథ జరుగుతున్న కథ జలదీపం జంగిల్ రాణి జంతుప్రపంచం జంబలకిడిపంబ జస్టిస్ రుద్రమ దేవి జాక్పాట్లో గూఢచారి జాని - 1985 జాలీ జీవన గంగ జీవన తరంగాలు జీవన తీరాలు జీవన పోరాటం జీవిత ఖైదీ జీవిత చక్రం జీవిత బంధం జీవిత రంగం జీవితరథం జీవితాలు జీసస్ (సినిమా) జూ లకటక జే గంటలు జెంటిల్ మాన్ జై భజరంగబలి జై భేతాళ్ జై చిరంజీవ జ్వాలాదీప రహస్యం thumb|ఝుమ్మందినాదం ఝ ఝాన్సీ రాణి ఝుమ్మందినాదం (సినిమా)
తెలుగు సినిమాలు త
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_త
thumb|తండ్రీ కొడుకుల ఛాలెంజ్తండ్రి తండ్రీ కొడుకుల ఛాలెంజ్ తరం మారింది - 1977 తల్లి తల్లి గోదావరి తల్లి బిడ్డ తల్లీ కూతుళ్ళు తల్లే చల్లని దైవం తాత మనవుడు తాతమ్మకల తాతయ్య పెళ్ళి మనవడి శోభనం తాతయ్య ప్రేమలేఖలు తాతా మనవడు తాయారమ్మ తాండవ కృష్ణ తారకప్రభుని దీక్షామహిమలు తాసిల్దార్ గారి అమ్మాయి తిరుపతమ్మ కథ తిరుపతి - 1974 తూఫాన్ మెయిల్ తెల్ల గులాబీలు తేనె మనసులు - 1965 తేనె మనసులు - 1987 తేనెటీగ (సినిమా) తొలికోడి కూసింది తొలిపొద్దు (సినిమా) తొలిప్రేమ తొలిముద్దు తోకలేని పిట్ట తోడికోడళ్ళు - 1957 తోడికోడళ్ళు - 1994 తోడూ నీడా - 1983 తోడూ నీడా - 1965 త్యాగయ్య - 1981 త్యాగయ్య - 1946 త్రిలోక సుందరి
తెలుగు సినిమాలు ద
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ద
thumb|దేవి శ్రీదేవిదత్తపుత్రుడు దర్జా దొంగ దశావతారములు (1962 సినిమా) దశావతారములు (1976 సినిమా) దాగుడు మూతలు (1986 సినిమా) దాన వీర శూర కర్ణ దాసి దుబాయ్ శీను దీక్ష (1974 సినిమా) దీర్ఘ సుమంగళి దీర్ఘ సుమంగళీ భవ దెబ్బకు ఠా దొంగల ముఠా దెబ్బకు దెబ్బ దేవకన్య దేవత (1941 సినిమా) దేవత (1965 సినిమా) దేవత (1982 సినిమా) దేవతలారా దీవించండి దేవదాసు (1953 సినిమా) (అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి) దేవదాసు (1974 సినిమా) (కృష్ణ) దేవదాసు (2006 సినిమా) (రామ్, ఇలియానా) దేశమంటే మనుషులోయ్ దేవి (సినిమా) దేవీ దర్శనం దేవీ శ్రీదేవి దేవుడిచ్చిన భార్య దేవుడు (సినిమా) దేవుడు చేసిన పెళ్ళి దేవుడు చేసిన మనుషులు దేవుడు మావయ్య దేవుడున్నాడు జాగ్రత్త దేవుని రూపాలు దేవుళ్లు దేశంలో దొంగలు పడ్డారు దేశద్రోహులు (1964 సినిమా) దేశద్రోహులు (1995 సినిమా) దేశముదురు దేశోద్ధారకులు దేశోద్ధారకుడు (1986 సినిమా) దైవ శాసన దొంగ (సినిమా) దొంగ కాపురం దొంగ కోళ్లు దొంగ గారూ స్వాగతం దొంగ దొర దొంగరాముడు - 1955, 1988 రెండు సినిమాలు దొంగ నోటు దొంగ మొగుడు దొంగ రాస్కెల్ దొంగను వదిలితే దొరకడు దొంగల దోపిడీ దొంగల వేట దొంగల్లో దొర (1985 సినిమా) దొంగల్లో మొనగాడు దొర బిడ్డ దొరగారికి దొంగ పెళ్లాం దొరబాబు దొరలు దొంగలు (1969 సినిమా) దొరలు దొంగలు (1976 సినిమా) దొరవారింట్లో దొంగోడు దొరికితే దొంగలు (1965 సినిమా) దొరికితే దొంగలు (1989 సినిమా) దోపిడీ దొంగలు దోషి దోషి నిర్దోషి ద్రోహి (1995 సినిమా) ద్రౌపదీ మానసంరక్షణం - 1936 ద్రౌపదీ వస్త్రాపహరణం - 1936
తెలుగు సినిమాలు న
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_న
thumb|నీకోసంనరసింహ నరసింహుడు నర్తనశాల నా అల్లుడు నా ఇల్లు నా వాళ్ళు నా ఇల్లే నా స్వర్గం నా దేశం నా పేరే భగవాన్ నా మాటంటే నా మొగుడు బ్రహ్మచారి నాంది నాగ కన్య నాగ జ్యోతి నాగ మోహిని - 1959 నాగ మోహిని - 1979 నాగ శక్తి నాగదేవత (1986 సినిమా) నాగమోహిని నాడు –నేడు నాని నామాల తాతయ్య నాయకుడు – వినాయకుడు నాయకులకు సవాల్ నాయుడుగారి అబ్బాయి నారి నారి నడుమ మురారి నాలుగిళ్ళ చావడి నాలుగు స్తంభాలాట నిన్నే పెళ్ళాడుతా నిర్ణయం నిండు దంపతులు నిండు మనిషి నిండు నూరేళ్ళు నిజం చెబితే నమ్మరు నిజం చెబితే నేరమా నిన్ను చూసాక నీ కోసం నీకు నాకు పెళ్ళంట నీడ నీడ లేని ఆడది నువ్వే కావాలి నువ్వు నాకు కావాలి నువ్వు నాకు నచ్చావు నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వా నేనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను – నా దేశం నేను – మా ఆవిడ నేనే రాజు – నేనే మంత్రి నేరం నాది కాదు నేరం నాదికాదు – ఆకలిది నేరము – శిక్ష నోముల పంట న్యాయం కోసం న్యాయం మీరే చెప్పాలి
తెలుగు సినిమాలు ప
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ప
thumb|ప్రేమఖైదీపంచ కళ్యాణి పంచ కళ్యాణి దొంగల రాణి పంచభూతాలు (1979 సినిమా) పంజరంలో పసిపాప పండంటి జీవనం పండుగ (1998 సినిమా) పందిరి మంచం పగసాధిస్తా పటాలం పాండు పట్నం పిల్ల పల్లెటూరి చిన్నోడు పడమటి సంధ్యారాగం పదహారేళ్ళ వయసు పద్మావతీ కళ్యాణం పన్నెండు సూత్రాలు పరమశివుడు పరమానందయ్య శిష్యుల కథ పరమేశ్వరి మహాత్యం పరశురాముడు (సినిమా) పలనాటి పులి పలనాటి పౌరుషం పల్నాటి యుద్ధం (1947 సినిమా) పల్నాటి యుద్ధం (1966 సినిమా) పల్నాటి రుద్రయ్య పల్లెటూరి బావ పవిత్ర బంధం - 1971 పవిత్ర బంధం - 1996 పసి హృదయాలు పసివాడి ప్రాణం పసివాని పగ పచ్చని సంసారం (1970 సినిమా) పచ్చని సంసారం (1993 సినిమా) పరువు ప్రతిష్ఠ - 1963 పరువు ప్రతిష్ఠ - 1993 పాడిపంటలు పాండురంగడు-2008 పాండురంగ మహత్యం పాతాళభైరవి - 1951 పాదుకా పట్టాభిషేకం (1932 సినిమా) పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా) పాదుకా పట్టాభిషేకం (1966 సినిమా) పాపం పసివాడు పాపికొండలు (సినిమా 1986) పాపే మా ప్రాణం పారిజాత పాలమనసులు పాలు నీళ్ళు పిచ్చి పుల్లయ్య పిచ్చోడి పెళ్ళి పిట్టల దొర పిల్లజమిందారు పిల్లజమీందార్ (2011 సినిమా) పిల్లనచ్చింది పిల్లలు దిద్దినకాపురం పుట్టింటి పట్టుచీర పుట్టినిల్లు - మెట్టినిల్లు పుణ్య దంపతులు పుణ్యం కొద్దీ పురుషుడు పుణ్యస్త్రీ పుత్తడి బొమ్మ పున్నమి చంద్రుడు పుష్పకవిమానం పూజకు పనికిరాని పూవు పూల మాల పూల రంగడు పృద్వీ రాజ్ పెద్ద కొడుకు పెద్దక్కయ్య పెద్ద మనుషులు పెదరాయుడు పెద్దరికం పెద్దన్నయ్య పెదబాబు పెళ్ళంటే నూరేళ్ళ పంట పెళ్ళాం చెబితే వినాలి పెళ్ళామా మజాకా పెళ్ళి పెళ్ళి కానుక - 1960 పెళ్ళి కానుక -1998 పెళ్ళి గోల పెళ్ళి చూపులు (1983 సినిమా) పెళ్ళి చూపులు (2016 సినిమా) పెళ్ళిచేసి చూడు పెళ్ళి చేసి చూపిస్తాం పెళ్ళి నీకు అక్షింతలు నాకు పెళ్ళి పందిరి పెళ్ళి పీటలు పెళ్ళి రోజు పెళ్ళి సంబంధం - 1970 పెళ్ళి సంబంధం - 2000 పెళ్ళికాని ఇల్లాలు పెళ్ళికొడుకు అమ్మబడును పెళ్ళితాంబూలం పెళ్ళినీకు శుభం నాకు పెళ్ళిమీద పెళ్ళి పెళ్ళాం ఊరెళితే పెళ్ళాం పిచ్చోడు పెళ్ళాంతో పనేంటి పెళ్ళి పుస్తకం పేదరాసి పెద్దమ్మ కథ పేదల బ్రతుకులు పైరానా పైలా పచ్చీస్ పొట్టిప్లీడరు పొట్టేలు పొన్నమ్మ పోకిరి పోకిరిరాజా పోకిళ్ళరాయుడు పోలీస్ బ్రదర్స్ పోలీస్ వెంకట స్వామి పోస్ట్ మేన్ ప్రచండ భైరవి (1985 సినిమా) ప్రచండ భైరవి (1965 సినిమా) ప్రజా రాజ్యం ప్రజా శక్తి ప్రణయ గీతం ప్రతిజ్ఙ (1982 సినిమా) ప్రతిజ్ఞ (1996 సినిమా) ప్రతిజ్ఞా పాలన - 1965 ప్రతిష్ఠ ప్రయత్నం (1991 సినిమా) ప్రయత్నం (2005 సినిమా) ప్రళయరుద్రుడు ప్రాణం ఖరీదు ప్రార్థన ప్రియ బాంధవి ప్రియతమా ప్రియా ప్రియమైన నీకు ప్రియ బాంధవి ప్రేమవిజయం - 1936 - ఇది తెలుగులో మొదటి సాంఘిక చిత్రం ప్రేమ-పగ ప్రేమ అండ్ కో. ప్రేమ ఎంతమధురం ప్రేమ కథ ప్రేమ కానుక ప్రేమ కిరీటం ప్రేమ కోసం ప్రేమ ఖైదీ ప్రేమ చిత్రం పెళ్ళివిచిత్రం ప్రేమ చేసిన పెళ్ళి ప్రేమ జీవులు ప్రేమ దీపాలు ప్రేమ పంజరం ప్రేమ పల్లకి ప్రేమ పిచ్చోళ్ళు ప్రేమ ప్రయాణం ప్రేమ బంధం ప్రేమ మందిరం ప్రేమ యుద్ధం ప్రేమ విజేత ప్రేమ సంకెళ్ళు ప్రేమ సామ్రాట్ ప్రేమతరంగాలు ప్రేమద్రోహి ప్రేమలు - పెళ్ళిళ్ళు ప్రేమించి పెళ్ళి చేసుకో ప్రేమించేమనసు ప్రేమేనాప్రాణం ప్రేరణ ప్రేమ (1952 సినిమా) ప్రేమ (1989 సినిమా) ప్రేమంటే ఇదేరా ప్రేమతో రా ప్రేమ లేఖ ప్రేమ దేశం ప్రేమ యుద్దం ప్రేమకు వేళాయెరా ప్రేమ పావురాలు ప్రేమికులు ప్రేమికులరోజు ప్రేమించు ప్రేమించుకుందాం రా ప్రేయసి రావే
తెలుగు సినిమాలు బ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_బ
thumb|బస్తీలో భూతంబలిపీఠంపై భరతనారి బలవంతపు పెళ్ళి బలరామ శ్రీకృష్ణ కథ బజారు రౌడీ బడి పంతులు బస్తీలో భూతం బస్తీపిల్ల భలేదొంగ బస్తీ కిలాడీలు బబ్రువాహన బంగారులక్ష్మి బంగారుబాట బంగారుగుడి బంగారు సంకెళ్లు బంగారు మొగుడు బంగారు మామ బంగారు మనిషి బంగారు మనసులు బంగారుపాప - 1954 బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో బంగారు భూమి (1982 సినిమా) బంగారు పిచ్చుక బంగారు పంజరం బంగారు చిలుక బంగారు గాజులు బంగారు కుటుంబం (1994 సినిమా) బంగారు కుటుంబం (1971 సినిమా) బంధువులు బాంధవ్యాలు బందిపోటు ముఠా బావా బావా పన్నీరు బావామరదళ్లు బావలు అనుభవాలు బావగారు బాగున్నారా బావ బావమరిది బావ దిద్దిన కాపురం బాల భారతం బాలరాజు - 1948 - రజతోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రం బాలరాజుగారి బంగారుపళ్లెం బాలమురళి ఎం.ఏ బాలనాగమ్మ (1959 సినిమా) బాలనాగమ్మ (శాంతా 1942 సినిమా) బాలనాగమ్మ (1942 సినిమా) - జెమినివారి చిత్రం బారిష్టర్ పార్వతీశం బాబాయి అబ్బాయి బాడ్ బాయ్స్ బాగ్దాద్ వీరుడు బాగున్నారా బాంధవ్యాలు బాబాయి హోటల్ బాయ్‌ఫ్రెండ్ బిగ్‌బాస్ బొబ్బిలి రాజా బొంబాయి బుజ్జిగాడి బాబాయ్ బుర్రిపాలెం చిన్నోడు బుర్రిపాలెం బుల్లోడు బుల్లబ్బాయి పెళ్ళి బుల్లెమ్మ శపధం బెబ్బులి వేట బేతాళ మాంత్రికుడు బొబ్బిలి రౌడి బొమ్మలు చెప్పిన కథ బ్రతుకే ఒక పండగ బ్రహ్మముడి బ్రహ్మరుద్రుడు zbahubali
తెలుగు సినిమాలు భ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_భ
thumb|భలే తమ్ముడుభక్త కనకదాసు భక్త విజయం భక్తుడు భగవంతుడు భగవద్గీత (సినిమా) భద్రం కొడుకో భయంకర్ గూడాచారి భలే ఖైదీలు భలే తమ్ముడు (1985 సినిమా) భలే దొంగలు భలే పెళ్లాం భలే బుల్లోడు (1981 సినిమా) భలే బుల్లోడు (1995 సినిమా) భలే భయం భలే సోగ్గాడు భవాని భక్త పోతన(1942 సినిమా) - చిత్తూరు నాగయ్య పోతనగా నటించిన చరిత్రాత్మక చిత్రం భక్త పోతన(1966 సినిమా) - గుమ్మడి పోతనగా నటించాడు. చిత్తూరు నాగయ్య ఇందులో ఒక చిన్న పాత్ర పోషించాడు. భక్తప్రహ్లాద (సినిమా) - 1931 - ఇది తొలి తెలుగు టాకీ. హెచ్.ఎమ్.రెడ్డి నిర్మించినది భక్త ప్రహ్లాద (1942 సినిమా) - చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించినది. భక్త ప్రహ్లాద (1967 సినిమా) - బేబీ రోజారమణి ప్రహ్లాదునిగా నటించిన చిత్రం. భాగ్యరేఖ - 1957 భాగ్యలక్ష్మి (1984 సినిమా) భాగ్యవంతులు భారతం భార్య భార్యాభర్తలు - 1961 భార్యాభర్తల భాగోతం భార్యాభర్తల సంబంధం భావిపౌరులు భారతీయుడు భీష్మ ప్రతిజ్ఞ - 1921 ' ఇది తొలి తెలుగు మూగ సినిమా' భీష్మ ప్రతిజ్ఞ - 1965 భూకైలాస్ (1940 సినిమా) భూకైలాస్ (1958 సినిమా)‌ భూమి కోసం భూలోకంలో యమలోకం భోళా శంకరుడు భైరవి
తెలుగు సినిమాలు మ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_మ
మగాడు ఎన్. టి. రామారావు మగాడు రాజశేఖర్ మనసున్న మనిషి మట్టి మనుషులు మదనకామరాజు కథ మద్రాస్ టు హైదరాబాద్ మధుర స్వప్నం మధురానగరిలో మనదేశం మనవూరి పాండవులు-1978 మనీ మనీ మనీ మనిషి మృగము -1976 మనుషులు మారాలి - 1969 శోభన్ బాబు, శారద మనుషులు - మట్టిబొమ్మలు-1974 మనుషులు మమతలు - 1965 మన్మథ మన్మధుడు మనోరమ -1959 మనోహరం - 2000 మనోహర - 1954 మరణ శాసనం - 1987 మరణ మృదంగం మరో సీత కథ - 1979 మరో చరిత్ర మల్లీశ్వరి - 1951 - బి.ఎన్.రెడ్డి, భానుమతి, ఎన్.టి.ఆర్. మల్లీశ్వరి(2004 సినిమా) - 2004 - వెంకటేష్, కత్రినా కైఫ్ మహా మనిషి మహాభారతం (సినిమా) మంగళ తోరణాలు - 1979 మంగమ్మ శపథం - 1965 మంగళ గౌరి - 1980 మంగళసూత్రం -1966 మంగళ-1951 మంగమ్మ గారి మనవడు - 1984 మండే గుండెలు - 1979 మంత్రవాది-1959 మంచి మిత్రులు - 1968 మంచి రోజు - 1977 మంచితనం లేదు -1979 మంచి మనిషి - 1964 ఎన్. టి ఆర్, జమున, జగ్గయ్య మంచి మనసుకు మంచి రోజులు - 1958 మంచి మనసు - 1978 మంచి మనసులు (1962 సినిమా) మంచి మనసులు (1986 సినిమా) మంచి బాబాయి - 1978 మంచి చెడు - 1963 మంచి కోసం - 1975 మంచి కుటుంబం (1967 సినిమా) మంచి కుటుంబం (1989 సినిమా) మంచు పల్లకి - 1982 మా ఇంటి ఆడపడుచు మా ఇంటి కథ మా ఇంటి దేవత మా ఇంటి ప్రేమాయణం మా ఇద్దరి కథ మా ఊరి అమ్మాయి మా ఊరి దేవత మా వారి మంచితనం మా ఊరి మగాడు మా ఊళ్ళో మహాశివుడు మా దైవం మా నాన్న నిర్దోషి మా పల్లెలో గోపాలుడు మా బంగారక్క మా బాలాజీ మా భూమి మాకు స్వతంత్రం వచ్చింది మాట కోసం మాంగల్యమే మగువ ధనం మా మొగుడు బ్రహ్మచారి (నామొగుడు బ్రహ్మచారి?) మాతృ దేవత మాతృ భూమి మానవుడు - దానవుడు - 1972, 1999 మానవుడే మహనీయుడు మానవులు మమతలు మామకు తగ్గ కోడలు మాయ రంభ మాయలోకం - 1945 మాయదారి అల్లుడు మాయదారి మనుషులు మాయా బజార్ (1936 సినిమా) మాయాబజార్ - 1957 సినిమా మాయాబజార్ (1995 సినిమా) మాయాబజార్ (2006 సినిమా) మాయామచ్చీంద్ర మాయా మశ్చీంద్ర మాయామశ్చీంద్ర (1975 సినిమా) మాయా మహల్ రహస్యం మాయా మోహిని (1962 సినిమా) మాయా మోహిని (1985 సినిమా) మాలపిల్ల - 1938- కాంచనమాల నటించింది. ఉన్నవ లక్ష్మీనారాయణ నవల ఆధారంగా వచ్చిన సందేశాత్మక చిత్రం. మావా బాగున్నావా? మావిడాకులు మావూరి పెద్దమనుషులు మావూరి మహారాజు మాస్టరమ్మాయి మాస్ మాస్టర్ కిలాడి మాస్టారి కాపురం మాస్టర్ మిస్సమ్మ - 1955 మిస్సమ్మ (2003 సినిమా) మిస్టర్ పెళ్ళాం మినిస్టర్ మహాలక్ష్మి మిస్ జూలియా ప్రేమ కథ మిస్టర్ భరత్ మిస్టర్ రజనికాంత్ మిస్టర్ విజయ్ మిస్టర్ హీరో మీనా (1974 సినిమా) ముక్కు పుడక ముగ్గురమ్మాయిలు ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు ముగ్గురు మొనగాళ్ళు మున్నా - 2007 ముఠా మేస్త్రి ముద్ద మందారం మురిపించే మువ్వలు మునుసుబు గారి అల్లుడు ముత్యమంత ముద్దు - 1989 ముత్యాలముగ్గు ముద్దుల ప్రియుడు ముద్దు పాప ముళ్ళ కిరీటం ముళ్ళ పువ్వు ముసుగు వీరుడు ముహూర్త బలం మూగ జీవులు మూగ నోము మూగ వాని పగ మూగ మనసులు (1961 సినిమా) మూగ మనసులు (1964 సినిమా) మూడు పువ్వులు ఆరు కాయలు మూడు ముళ్ళ బంధం మూఢ నమ్మకాలు మెకానిక్ మావయ్య మెరుపు దాడి మెరుపు వీరుడు మేనరికం - 1954 మేన మామ మేరీ మాత మేనత్తకూతురు మేమే మొనగాళ్ళు మైనరు బాబు మొండిఘటాలు మొండిమొగుడు పెంకి పెళ్ళాం మొగుడా- పెళ్ళామా మొగుడు గారు మొగుడు పెళ్ళాల దొంగాట మొగుడు పెళ్ళాలు మొదటి అనుభవం మొనగాడొస్తున్నాడు జాగ్రత్త మొనగాళ్ళకు మొనగాళ్ళు మొనగాళ్ళు మోసగాళ్ళు - మొనగాడు-మోసగాడు? మోసగాళ్ళకు మోసగాడు-1971 మోసగాళ్ళకు సవాల్ మోహన రాగం మోహినీ విజయం మోహినీ శపధం మౌన గీతం మోహినీ రుక్మాంగద (1962 సినిమా) మోహినీ రుక్మాంగద (1937 సినిమా) మౌన పోరాటం మౌనరాగం మృగతృష్ణ మృగరాజు
తెలుగు సినిమాలు ర
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ర
thumb|రక్షణరంగవల్లి రంగులకల రంగేళీ రాజా రంబలొస్తున్నారు జాగ్రత్త రంభ-రాంబాబు రక్త కన్నీరు రక్త సంబంధం రక్త సింధూరం రక్తజ్వాల రగిలే జ్వాల రగిలేగుండెలు రగులుతున్న భరతం రఘురాముడు రత్నమాల రతి మన్మధుడు రథసారధి రక్షణ రక్షకుడు రాక్షసరాజ్యం రాఘవయ్య గారి అబ్బాయి రాజ రాజధాని (సినిమా) రాజసింహమ్ రవన్న రాజీ నాప్రాణం - 1954 రాజు రాణీ జాకి రాజు వెడలె రాజేంద్రుడు-గజేంద్రుడు రాజేశ్వరి కళ్యాణం రాణీకాసుల రంగమ్మ రాధ కళ్యాణం రాధ కృష్ణ రాధమ్మ పెళ్ళి రామచిలుక రామరాజ్యంలో-రాబందులు రామరాజ్యంలో భీమ రాజు రామరాజ్యంలో రక్త పాతం రామాయణం (సినిమా) రామాలయం (సినిమా) రాముడు-పరసురాముడు రాముడు-భీముడు రాముడు-రంగడు రాముడే దేముడు రామ్-రహీమ్ రామ్-రాబర్ట్-రహీవ్ రాయుడుగారు-నాయుడుగారు రావు - గోపాలరావు రావుగారింట్లో రౌడి రావుగారిల్లు రియల్ స్టోరి రుద్ర వీణ రెండు రెళ్ళ ఆరు రెండు కుటుంబాల కథ రెండుజెళ్ళసీత రెండో కృష్ణుడు రైతుకుటుంబం రైతుబిడ్డ (1939 సినిమా) - 1939 - గూడవల్లి రామబ్రహ్మం నిర్మాణం - నిషేధీంపబడిన మొదటి తెలుగు సినిమా రైతుబిడ్డ (1971 సినిమా) రైలుదోపిడి రోజా రోజులు మారాయి (1955 సినిమా) - అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి, వహీదా రెహమాన్ రోజులు మారాయి (1984 సినిమా) - గుమ్మడి, నూతన్ ప్రసాద్, ప్రభ, రాజేంద్రప్రసాద్ రౌద్రం రణం రుధిరం - 2021 - జూనియర్ ఎన్.టి.ఆర్, రామ్ చరణ్
తెలుగు సినిమాలు ల
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ల
thumb|లవకుశలవ కుశ ఎన్.టి.ఆర్, అంజలి, కాంతా రావు లవ్ లంకె బిందెలు లంబాడోళ్ళ రామదాసు చలం, రోజారమణి లక్కీఛాన్స్ లక్ష్మణ లక్ష్మణ రేఖ జయసుధ లక్ష్మీ పూజ లక్ష్మీనిలయం లక్ష్మీనివాసం ఎస్.వి.రంగారావు, అంజలి, కృష్ణ లవ్ ఇన్ ఆంధ్రా లవ్ ఇన్ ఖజురహో లవ్ మ్యారేజ్. లవ్ స్టోరీ 1999 లాహిరి లాహిరి లాహిరిలో లాఠీ ఛార్జ్ లాల్ సలాం లిటిల్ సోల్జర్స్ లింగబాబు లవ్‌స్టోరీ లేడీ బాస్ లోకం చుట్టిన వీరుడు లోకం మారాలి మూలాలు
తెలుగు సినిమాలు వ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_వ
వందేమాతరం (1939 సినిమా) వందేమాతరం (1982 సినిమా) వందేమాతరం (1985 సినిమా) వంశ గౌరవం వంశోధ్ధారకుడు వకీల్‌ సాబ్ వర్షం వసంత కోకిల వసంతం వదిన మాట వదినగారి గాజులు (1955 సినిమా) వద్దు బావా తప్పు వన్ బై టు వయసు పిలిచింది వయసొచ్చిన పిల్ల వరవిక్రయం - 1939 - భానుమతి మొదటి చిత్రం వసంత సేన వస్తాడే మా బావ వస్తాద్ వారసుడు వాఅమ్మో వాఅత్తో వా పెళ్ళామా వారాలబ్బాయి వాలుజెడ తోలు బెల్టు వింత ఇల్లు సంత గోల వింత కథ వింత కాపురం వింత దంపతులు విచిత్ర వివాహం విజయ రామరాజు విజయానికి సంకెళ్ళు విజేత విక్రం విప్రనారాయణ - 1954 విముక్తి కోసం వివాహ బంధం విశాల హృదయాలు విశ్వనాధ చక్రవర్తి విశ్వమోహిని విష కన్య వీడు సామాన్యుడు కాడు వీడెవడండీ బాబూ వీరాభిమన్యు (1936 సినిమా) వీరాభిమన్యు - 1965 - శోభన్ బాబు కథానాయకునిగా నటించిన మొదటి చిత్రం వీలునామా - 1965 వెంకటేశ్వర వైభవం వెంకటేశ్వర వ్రత మహాత్యం వెలుగు నీడలు వేమన చరిత్ర వైకుంఠ రాముడు వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్ ( (విజేత (చిరంజీవి)
తెలుగు సినిమాలు శ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_శ
thumb|శంకర్ దాదా జిందాబాద్శంకర్ దాదా జిందాబాద్ -2007 శివమెత్తిన సత్యం - 1980 శంకరాభరణం - 1979 శపథం -1994 శివుడు శివుడు శివుడు -1983 శివుడు - 2001 శివ - 2005 (దర్శకుడు - సత్యం) శంభు - 2003 శభాష్ శభాష్ రాముడు - 1964 శభాష్ సూరి - 1959 శివకాశి - 2003 శివరంజని - 1978 శివ శక్తి - 1991 శివలీలలు - 1995 శివమణి - 2003 శ్లోకం - 2005 శివయ్య - 1998 శివన్న- 2000 శివాతాండవం శశిరేఖా పరిణయం - 2008 శ్రిదేవి శ్రీరామరాజ్యం (సినిమా) - 2012 శ్రీ రాజరాజేశ్వరి - 2001 శ్రీరామ్- 2002 శ్రీరామచంద్రులు - 2004 శ్రీ మహాలక్ష్మి- 2007 శ్రీ కృష్ణ మాయ శ్రీ కృష్ణ గారడి శ్రీ కృష్ణ విజయం శ్రీ కృష్ణ విజయం (1971) శ్రీ మంజునాథ- 2004 శ్రీ జగద్గురు ఆదిశంకర శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ - 1988 శ్రీ ఆంజనేయం - 2004 శ్రీ కృష్ణ 2006 శ్రీ - 2005 శ్రావణ సంధ్య - 1986 శ్రావణ శుక్రవారం శ్రావణమాసం - 2005 శ్రీకృష్ణసత్య -1971 శ్రీ దత్త దర్శనము - 1983 శాంతి సందేశం శ్రీకారం - 1996 శ్రీమద్విరాట పర్వము - 1979 శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర- 1984 శ్రీమన్నారాయణ - 2012 శ్రీమతి కళ్యాణం - 2009 శ్రీమతీ వెళ్ళొస్తా - 1998 శ్రీనాథ కవిసార్వభౌమ - 1993 శ్రీవారి శోభనం -1985 శ్రీవారి చిందులు - 1991 శ్రీమతి ఒక బహుమతి - 1987 శ్రీవారి కోరిక శ్రీవారి ప్రియురాలు - 1994 శ్రీవారు శ్రుతిలయలు- 1987 శుభలేఖ - 1982 శుభలేఖలు - 1998 శుభవార్త- 1998 శుభోదయం - 1980 శుభవేళ - 2000 శుభం (2008) శుభమస్తు - 1995 శుభప్రదం - 2010 సుభాష్ చంద్రబోస్ - 2005 శుభాశీస్సులు శుభాకాంక్షలు - 1997 శివ - 1989 శుభ సంకల్పం - 1995 శుభాకాంక్షలు - 1997 శుభలగ్నం - 1994 శుభముహూర్తం (1997) శుభముహూర్తం (1983) శోభనరాత్రులు శృంగార పురుషుడు శ్రావణ సంధ్య శ్రావణ మేఘాలు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ - 1966 శ్రీదత్త దర్శనము శ్రీవారికి ప్రేమ లేఖ -1984 శ్రీ ఏడుకొండలస్వామి - 1991 శ్రీ గౌరీ మహత్యం శ్రీ చాముండేశ్వరి మహిమ శ్రీ తిరుపతి వెంకటేశ్వర మహత్యం శ్రీ వెంకటేశ్వర మహత్యం - 1960 శ్రీ వెంకటేశ్వర మహత్యం(1939 సినిమా) శ్రీ దేవీకామాక్షీ కటాక్షం శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ - 1976 శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం శ్రీ సాయిమహిమ శ్రీ సింహాచల క్షేత్ర మహిమ శ్రీ సీతారామ జననం - 1937 శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి - 1998 శ్రీకట్నలీలలు - 1985 శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా) శ్రీకృష్ణ పాండవీయం - 1966 శ్రీకృష్ణ తులాభారం (1966) శ్రీకృష్ణాంజనేయ యుద్ధం - 1972 శ్రీ కృష్ణావతారం - 1967 శ్రీనివాస కల్యాణం - 1987 శ్రీమతి కానుక - 1986 శ్రీరామాంజనేయ యుద్ధం (1975) శ్రీశైల భ్రమరాంబికా కటాక్షం శ్రీవారి ముచ్చట్లు - 1981 శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న - 1967
తెలుగు సినిమాలు స
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_స
సంతోషం సంపత్ కుమార్ thumb|సాగరసంగమంసఖి సప్తపది సతీ అనసూయ - 1957 సతీ అనసూయ - 1971 సక్కుబాయి(సినిమా) - 1935 సతీ సక్కుబాయి - 1945 సతీ సక్కుబాయి - 1965 సతీ తులసి - 1936 సరసాల సోగ్గాడు - 1993 సమరసింహారెడ్డి సంపూర్ణ రామాయణం సర్కస్ కిలాడీలు సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి - 1960 సాగర సంగమం సాఫ్ట్ టచ్ నా హృదయంలో నిదురించే చెలీ - "నా హృదయంలో నిదురించే చెలీ" అనేది వేరే సినిమా. తరువాత సరి చూడాలి. సాలెపురుగు సాక్షి (1967) సి.ఐ.డి సింధూరం సిరిపురం మొనగాడు సిరివెన్నెల సింహ (2010) సింహ గర్జన (1978) సింహ గర్జన (1995) సింహ స్వప్నం సిద్ధార్థ సినీమా పిచ్చోడు సీత గీత దాటితే సీతమ్మ సంతానం సీతాలు - 1984 సీతారత్నం గారి అమ్మాయి సీతాకళ్యాణం (సినిమా) - 1934 - చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో, కన్నాంబ నటించినది సీతారామ కల్యాణం - 1961 - నందమూరి తారక రామారావు, బి.సరోజా దేవి సీతాకల్యాణం - 1976 - బాపు దర్శకత్వంలో సీతారామకల్యాణం సీతామాలక్ష్మి సుమంగళి - 1940 సుమంగళి - 1965 సుమంగళి - 1989 సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడు సుందరి సుబ్బారావు సుఖదుఃఖాలు - 1967 సుబ్బారావుకు కోపంవచ్చింది సూపర్(నాగార్జున,ఆయోషా టాకియా,అనుష్క) సూపర్ ఎక్స్ ప్రెస్ - 1991 సూత్రధారులు సూర్య ఐ.పి.ఎస్ సూర్య పుత్రిక సూర్య వంశం సూర్యుడు (సినిమా) సేతుబంధనం - 1946 సోగ్గాడి పెళ్ళాం సోము స్టూవర్టుపురం దొంగలు స్టూవర్టుపురం పోలీసుస్టేషన్ స్టేట్‌రౌడి స్టేషన్‌మాస్టర్ స్ట్రీట్ ఫైటర్ స్త్రీ (1966) స్త్రీ (1973) స్త్రీ జన్మ స్వతంత్ర భారతం - 1991 స్వయం ప్రభ స్వయంకృషి స్వరాభిషేకం స్వర్ణకమలం స్వాతి ముత్యం స్వాతి కిరణం స్వాతంత్ర్యానికి ఊపిరి పొయ్యండి స్వాతి చినుకులు స్వామి వైభవం స్వామిద్రోహులు స్నేహ బంధం
తెలుగు సినిమాలు క్ష
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_క్ష
thumb|క్షణక్షణం "క్ష" తో మొదలయ్యే తెలుగు సినిమాల జాబితా: క్షణ క్షణం : రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడుగా 1991లో విడుదలైన తెలుగు చిత్రం. శివ అనూహ్య విజయం తరువాత రామగోపాలవర్మ నుండి వచ్చి ఘనవిజయం సాధించిన చిత్రం. చిత్రకథ నిజ కాలం కొన్ని గంటలు లేదా రోజులుగానే తీసుకుని కొన్ని సంఘటనలకూర్పుతో కొత్త తరహా చిత్రీకరణను తెలుగు సినిమాకు పరిచయం చేసిన చిత్రం. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి 2000 లో రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. మూలాలు
రసాయన శాస్త్రం
https://te.wikipedia.org/wiki/రసాయన_శాస్త్రం
రసాయనశాస్త్రం (in Greek: χημεία) చాల విస్తృతం. ఇటువంటి విస్తృతమయిన శాస్త్రాన్ని ఏకాండీగా అధ్యయనం చెయ్యటం కష్టం. అందుకని చిన్న చిన్న ఖండాలుగా విడగొట్టి పరిశీలిస్తాం. అటువంటప్పుడు కొన్ని కొన్ని అంశాలు అనేక ఖండాలలో పదే పదే పునరావృతం కాక తప్పదు. మౌలికంగా చెప్పుకోవాలంటే, రసాయనశాస్త్రంలో పదార్థ లక్షణాలని (material properties) అధ్యయనం చేస్తాం. ఒక పదార్థం (matter) మరొక పదార్థంతో సంయోగం చెందినప్పుడు ఏమవుతుంది? ఒక పదార్థం శక్తి (energy) తో కలసినప్పుడు ఏమవుతుంది? ఒక పదార్థం మరొక పదార్థంగా ఏయే సందర్భాలలో మారుతుంది? ఇటువంటి ప్రశ్నలకి సమాధానాలు రసాయనశాస్త్రంలో దొరుకుతాయి. ఒక పదార్థం మరొక పదార్థంతో కలసినప్పుడు జరిగే పనినే రసాయన ప్రక్రియ (chemical reaction) అంటారు. ఈ ప్రక్రియలో పదార్థంలో ఉన్న కొన్ని రసాయన బంధాలు (chemical bonds) సడలి కొత్త కొత్త బంధాలు ఏర్పడతాయి. పదార్థం, (ఉదాహరణకి: మనం కూర్చునే కుర్చీ, పీల్చే గాలి) అణువు (molecule) ల సముదాయం. ప్రతి అణువు లోను కొన్ని పరమాణువు (atom) లు ఉంటాయి. పరమాణువు అంతర్భాగంలో ఎలక్ట్రాన్, ఫోటాన్, న్యూట్రాన్ వంటి ఉపపరమాణు భాగాలు (sub-atomic particles) లు ఉంటాయి. అయినప్పటికీ, మన దైనందిన జీవితంలో మనకి తారసపడేవి, మన అనుభవ పరిధిలో ఇమిడేవి అణువులు, వాటి రసాయన లక్షణాలు. కాని ఈ రసాయన లక్షణాలని నిర్ణయించేది అణువులు, వాటి మధ్య ఉండే రసాయన బంధాలు. ఉదాహరణకి, ఉక్కు దృఢంగా ఉందంటే దానికి కారణం ఉక్కు బణువులో ఉన్న అణువుల అమరిక, వాటి మధ్య ఉన్న రసాయన బంధాల శక్తి. కర్ర మండుతున్నదంటే కర్రలో ఉన్న కర్బనం (carbon) గాలిలో ఉన్న ఆమ్లజని (oxygen) తో రసాయన సంయోగం చెందింది కనుక. గది ఉష్ణోగ్రత (room temperature) వద్ద నీరు ద్రవ రూపంలో ఉందంటే దానికి కారణం నీటి బణువులలో ఉన్న అణువులు వాటి ఇరుగు పొరుగు అణువులతో ప్రవర్తించే విధానం అనుకూలించింది కనుక. ఆ మాటకొస్తే ఈ వాక్యాలు మీరు చదవగలుగుతున్నారంటే దానికి కారణం ఈ వాక్యాల మీద పడ్డ కాంతి పుంజం పరావర్తనం చెంది, మీ కంట్లో ప్రవేశించి, కంటి వెనుక రెటీనా మీద ఉన్న ప్రాణ్యము (protein) బణువులతో రసాయన సంయోగము చెందటమే. ఆఖరు మాటగా, ఈ వాక్యాలు చదువుతున్న చదువరులకి ఇదంతా అర్ధం అవుతోందంటే దానికి కారణం కూడా వారి వారి మెదడులలో జరిగే రసాయన ప్రక్రియలే. రసాయనశాస్త్రంలో చాలా విభాగాలున్నాయి. ఈ విభాగాల్లో కొన్ని ఇతర విభాగాలతో మిళితమయి గాని, సంబంధాన్ని కలిగి గాని ఉన్న విభాగాలు కూడా చాలా ఉన్నాయి. విశ్లేషణాత్మక రసాయనం (Analytical chemistry) విశ్లేషణాత్మక రసాయనం అంటే ఒక పదార్థములో ఏయే ఆంశాలు ఏయే పాళ్ళల్లో ఉన్నాయో (chemical composition), ఆయా అంశాల ఆమరిక (structure) ఏమిటో విశ్లేషణ (analysis) చేసి అధ్యయనం చేసే శాస్త్రం. ఈ విభాగాన్ని అధ్యయనం చెయ్యటానికి గణితం ఉపయోగపడుతుంది. జీవ రసాయనం (Biochemistry) జీవ రసాయనం అంటే జీవ పదార్థము (organism) లో జరిగే సంయోగ, వియోగాది ప్రక్రియలని అధ్యయనం చేసే శాస్త్రం. ఈ విభాగాన్ని అధ్యయనం చెయ్యటానికి జీవశాస్త్రం, రసాయనశాస్త్రం రెండూ వచ్చి ఉండాలి. అనాంగిక రసాయనం లేదా వికర్బన రసాయనం (Inorganic chemistry) వికర్బన రసాయనం అంటే - సర్వసాధారణంగా - కర్బనం (carbon) అనే మూలకాన్ని మినహాయించగా మిగిలిన మూలకాలతో ఏర్పడే రసాయనాలనీ, రసాయన ప్రక్రియలని అధ్యయనం చేసే శాస్త్రం. అనాంగిక రసాయనం, ఆంగిక రసాయనం అనే విచక్షణ నిష్కర్షగా చెయ్యలేము. ఉదాహరణకి, ఆంగికలోహ రసాయనం (organometallic chemistry) లో ఈ రకం విభజన సాధ్యం కాదు. ఈ విభజనలన్నీ అధ్యయన సౌకర్యం కోసమే. ఆంగిక రసాయనం (Organic chemistry) లేదా కర్బన రసాయనం (carbon chemistry) కర్బన రసాయనం అంటే - సర్వసాధారణంగా - కర్బనం (carbon) మిగిలిన మూలకాలతో సంయోగం చెందటం వల్ల ఏర్పడే రసాయనాలనీ, వాటి కట్టడినీ, వాటిలో జరిగే రసాయన ప్రక్రియలనీ అధ్యయనం చేసే శాస్త్రం. భౌతిక రసాయనం (Physical chemistry) భౌతిక రసాయనంలో రకరకాల రసాయనిక ప్రక్రియల వెనక ఉండే భౌతిక సూత్రాలని, నియమాలని పరిమాణాత్మక (quantitative) దృష్టితో అధ్యయనం చేస్తారు. అంటే ఏయే భౌతిక శాస్త్రపు పునాదుల మీద రసాయన సౌధం నిర్మించబడిందో విచారణ జరుగుతుంది ఇక్కడ. ఈ సందర్భంలో ముఖ్యంగా అధ్యయనం చేసే అంశాలలో కొన్ని: రసాయన తాపగతిశాస్త్రం (chemical thermodynamics), రసాయన క్రియాగమనశాస్త్రం (chemical kinetics), గణాంక యాంత్రికశాస్త్రం (statistical mechanics), and వర్ణమాలాశాస్త్రం (spectroscopy). భౌతిక రసాయనం, అణు భౌతికశాస్త్రం (molecular physics) - ఈ రెండింటి మధ్య చాల ఉమ్మడి ఆంశాలు ఉండబట్టి వీటిని వర్గాలుగా విడగొట్టటం కష్టం. సిద్ధాంతిక రసాయనం (Theoretical chemistry) సిద్ధాంతిక రసాయనం అంటే గణిత (mathematics) సిద్ధాంతాలనీ, భౌతిక (physics) సిద్ధాంతాలనీ ఉపయోగిస్తూ రసాయనశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యటం. ముఖ్యంగా, భౌతికశాస్త్రంలో ఉప భాగమైన క్వాంటం గమనశాస్త్రాన్ని (quantum mechanics) ఉపయోగించినప్పుడు దానిని క్వాంటం రసాయనం (quantum chemistry) అంటారు. రెండవ ప్రపంచయుద్ధం తదుపరి కలనయంత్రాల వాడుక విస్తృతంగా పెరిగిన మీదట కలన రసాయనం (computational chemistry) అనే కొత్త విభాగం పుట్టింది. ఇక్కడ కలన క్రమణికలు (computer programs) ఉపయోగించి రసాయన సమస్యలని పరిష్కరిస్తారు. సిద్ధాంతిక రసాయనం, బణు భౌతికశాస్త్రం (molecular physics) - ఈ రెండింటి మధ్య చాల ఉమ్మడి ఆంశాలు ఉన్నాయి. ఇతర రసాయన రంగాలు నక్షత్ర రసాయనం (Astrochemistry), వాతావరణ రసాయనం (Atmospheric chemistry), రసాయన స్థాపత్య శాస్త్రం (Chemical Engineering), విద్యుత్‌ రసాయనం (Electrochemistry), పర్యావరణ రసాయనం (Environmental chemistry), గ్రహ రసాయనం (Geochemistry), పదార్థ శాస్త్రం (Materials science), వైద్య రసాయనం (Medicinal chemistry), బణు జీవశాస్త్రం (Molecular Biology), అణుకేంద్ర రసాయనం లేదా కణిక రసాయనం (Nuclear chemistry), ఆంగికలోహ రసాయనం (Organometallic chemistry), శిలా రసాయనం (Petrochemistry), ఔషధ రసాయనం (Pharmacology), ఛాయా రసాయనం (Photochemistry), బహుభాగ రసాయనం (Polymer chemistry), బృహత్ బణు రసాయనం (Supramolecular chemistry), ఉపరితల రసాయనం (Surface chemistry), తాప రసాయనం (Thermochemistry), మొదలగునవి. మౌలికాంశాలు నామకరణాలు రసాయన మిశ్రమాలకి పేర్లు పెట్టటం (nomenclature) ఆషామాషీ వ్యవహారం కాదు. లక్షల పైబడి ఉన్న వీటికి ఒక క్రమ పద్ధతిలో పేర్లు పెట్టకపోతే తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుకని అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం వీటికి పేర్లు పెట్టటం సులభం. ఆంగిక (కర్బన) రసాయనాలకి (Organic compound) అవలంబించే పద్ధతి ఒకటి, అనాంగిక (వికర్బన) రసాయనాలకి (inorganic compound) అవలంబించే పద్ధతి మరొకటి. అణువులు అణువు గర్భంలో ధనావేశమైన (positively charged) కణిక (nucleus) ఉంటుంది. ఈ కణిక లేక కేంద్రకంలో ప్రోటాన్లు (protons), న్యూట్రాన్లు (neutrons) అనే పరమాణువులు (atomic particles) ఉంటాయి. ఈ కణిక చుట్టూ పరివేష్టితమై ఒక ఎలక్ట్రాను మేఘం (electron cloud) ఉంటుంది. కణికలో ఎన్ని ధన విద్యుదావేశమైన (positively charged) ప్రోటానులు ఉన్నాయో ఈ మేఘంలో అన్ని రుణ విద్యుదావేశమైన (negatively charged) ఎలక్ట్రానులు ఉంటాయి. అందువల్ల అణువుకి ఏ రకమైన విద్యుదావేశమూ ఉండదు. మూలకాలు ఒకే ఒక 'జాతి' అణువులతో ఉన్న పదార్థాన్ని మూలకం (element) అంటారు. ఇదే విషయాన్ని మరొక విధంగా కూడా చెప్పొచ్చు. ఒక మూలకంలో ఉన్న అణువులన్నిటిలోనూ ప్రోటానుల జనాభా ఒక్కటే. ఈ ప్రోటానుల జనాభానే ఆ మూలకం యొక్క పరమాణు సంఖ్య (atomic number) అంటారు. ఉదాహరణకి, ఆరే ఆరు ప్రోటానులు కణికలో ఉన్న అణువులన్నీ కూడా కర్బనం అణువులే! కనుక కర్బనం (carbon) అనే రసాయనిక మూలకం యొక్క పరమాణు సంఖ్య 6. ఇదే విధంగా 92 ప్రోటానులు కణికలో ఉన్న అణువులన్నీ కూడా యురేనియం (uranium) అణువులు. కనుక యురేనియం యొక్క అణు సంఖ్య 92. మూలకాలని, వాటి లక్షణాలని అధ్యయనం చెయ్యటానికి ఎంతో అనుకూలమైన పనిముట్టు ఆవర్తన పట్టిక (periodic table). ఈ పట్టికని హొటేలు భవనంలా ఊహించుకోవచ్చు. ఈ భవనంలో ఏడు అంతస్తులు, రెండు నేలమాళిగలు ఉన్నట్లు ఊహించుకోవాలి. ప్రతి అంతస్తులోను ఒకటి నుండి పద్నాలుగు గదులు వరకు ఉండొచ్చు. ఒకొక్క గదికి ఒకొక్క మూలకాన్ని కేటాయించేరు. రసాయనిక లక్షణాలలో పోలికలు ఉన్న మూలకాలన్నీ దగ్గర దగ్గర గదులలో (అంటే, ఒకే నిలువ వరుసలో ఉండే గదులు, పక్క పక్కని ఉండే గదులు అని తాత్పర్యం) ఉండేటట్లు అమర్చబడి ఉంటాయి. ఈ భవనంలో ఎన్నో అంతస్తులో, ఎన్నో గదిలో ఏ మూలకం ఉందో తెలిసిన మీదట ఆ మూలకం రసాయనిక లక్షణాలన్నీ మనం పూసగుచ్చినట్లు చెప్పొచ్చు. ఇది ఎలా సాధ్య పడుతుందంటే - ఒక మూలకంలోని కణికలో ఎన్ని ప్రోటానులు ఉన్నాయో ఆ కణిక చుట్టూ పరిభ్రమించే మేఘంలో అన్ని ఎలక్ట్రానులు ఉంటాయి కదా. ఈ మేఘమే అణువు యొక్క బాహ్య ప్రపంచంతో సంపర్కం పెట్టుకోగలదు. కనుక అణువు యొక్క రసాయనిక లక్షణాలు ఎలా ఉండాలో ఈ మేఘం నిర్ణయిస్తుంది. ఆవర్తన పట్టికని అధ్యయనం చెయ్యటం వల్ల ఈ రకం విషయాలు కూలంకషంగా అర్ధం అవుతాయి. సమ్మేళనములు సమ్మేళనం (compound) అంటే కొన్ని రసాయన మూలకాలు నిర్ధారితమైన పాళ్ళల్లో రసాయన సంయోగం చెందటం వల్ల తయారయిన పదార్థం. ఉదాహరణకి ఉదజని (hydrogen) రెండు పాళ్ళు, ఆమ్లజని (oxygen) ఒక పాలు రసాయన సంయోగం చెందగా వచ్చిన సమ్మేళనమే నీరు (water or H2O). అంతేకాని ఇసక, పంచదార కలపగా వచ్చినది మిశ్రమం (mixture) అవుతుంది కాని సమ్మేళనం కాజాలదు; సమ్మేళనం కావాలంటే రసాయన సంయోగం విధిగా జరగాలి. అణువులు, బణువులు కొన్ని వేరు వేరు అణువులు లేదా పరమాణువుల సమూహాన్ని [అణువు] (molecule) అంటారు (నిర్వచనం: బహుళమైన అణువుల గుంపు బణువు). ఒక బణువులో ఉన్న అణువులన్నీ ఒకే మూలకానివి కావచ్చు (ఉదాహరణ: రెండు ఉదజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టినది ఒక ఉదజని బణువు (H2), రెండు ఆమ్లజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టినది ఒక ఆమ్లజని బణువు (O2) ). లేదా ఒకే బణువులో రకరకాల మూలకాలు ఉండొచ్చు (ఉదాహరణ: రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టినది ఒక నీటి బణువు (H2O) ). అంటే రెండు కాని అంత కంటే ఎక్కువ కాని అణువులు రసాయన బంధం ప్రభావం వల్ల సమ్మిళితం అయితే బణువు పుడుతుంది. అయానులు విద్యుదావేశం (electrical charge) పొందిన అణువు (molecule) కాని, పరమాణువు (atom) కాని, పరమాణు కణాలు (sub-atomic particle) కాని అయాను (ion) అనబడును. విద్యుదావేశం పొందటం అంటే ఒక ఎలక్ట్రాన్ ని లబ్ధిపొందటం (gain) కాని, నష్టపోవటం (lose) కాని జరుగుతుంది. అణువులు, పరమాణువులు ఒకటి కాని, అంతకంటే ఎక్కువ కాని ఎలక్ట్రాన్ లని లబ్ధిపొందిన ఎడల అది ఋణ అయాను (anion). అదేవిధంగా ఒక బణువు, అణువు, పరమాణువు ఒకటి కాని, అంతకంటే ఎక్కువ కాని ఎలక్ట్రాన్ లని నష్టపోయిన ఎడల అది ధనయాను (cation). ఉదాహరణకి సోడియం ధనయాను (Na+), హరితము ఋణయాను (Cl-) తో కలిస్తే నిరావేశమైన (neutrally charged) సోడియం క్లోరైడ్‌ (NaCl) వస్తుంది. (మనం తినే ఉప్పులో ఉండే ముఖ్యమైన రసాయనం ఇది.) రసాయన బంధము ఒక బణువులో కాని, స్పటికము (crystal) లో కాని ఉన్న అణువులు విడివిడిగా విడిపోకుండా - అంటే ఒకదానితో మరొకటి అంటిపెట్టుకుని ఉండే విధంగా - ఉంచగలిగే శక్తిని రసాయన బంధం (chemical bond) అంటారు. ఈ రసాయన బంధం అనే ఊహనం (concept) తో పాటు బాహుబల సిద్ధాంతం (valence bond theory) కాని, భస్మీకరణ సంఖ్య (oxidation number) కాని ఉపయోగించి సామాన్యమైన పదార్థాలలో బణువుల అమరికని, ఏయే బణువులు ఏయే పాళ్ళల్లో ఉన్నాయో కూడా కనుక్కోవచ్చు. అసమాన్యమైన (క్లిష్ట) పదార్థాలని (ఉదాహారణకి, లోహరసాయనాలని) విశ్లేషణ చెయ్యవలసి వచ్చినప్పుడు బాహుబల సిద్దాంతం వీగిపోతుంది. ఆ సందర్భాలలో వాడకానికి ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమయినవి క్వాంటం రసాయనశాస్త్రం ఒకటి. రసాయన ప్రక్రియలు రసాయన ప్రక్రియ అంటే ఏమిటి? బణువుల సూక్ష్మ కట్టడి (fine structure) లో వచ్చే పరిణామం (tranmsformation) రసాయన ప్రక్రియ (chemical reaction) అనబడును. ఇటువంటి పరిణామాలలో చిన్న చిన్న బణువులు ఒకదానికి మరొకటి అతుక్కుని పెద్దవిగా మారొచ్చు. లేదా పెద్ద బణువులు చితికిపోయి చిన్నవి కావచ్చు. లేదా, ఒక బణువులో ఉన్న కొన్ని అణువుల స్థానంలో కొత్త అణువులు ప్రతిక్షేపన కావచ్చు. ఏది ఏమయినప్పటికీ, రసాయన ప్రక్రియ జరిగినప్పుడు ఉన్న బంధాలు (రసాయన బంధాలు) తెగిపోవచ్చు, లేని చోట్ల సరికొత్త బంధాలు ఏర్పడనూ వచ్క్ష్చు. నియమాలు సాధారణమైన రసాయన ప్రక్రియలలో పదార్థం యొక్క ద్రవ్యరాశి (mass) రూపాంతరం చెందొచ్చేమో కాని నాశనం కాదు. దీనినే ద్రవ్యరాశి నిహిత నియమం (conservation of mass) అంటారు. ఆధునిక భౌతికశాస్త్రం ప్రకారం నిజానికి నిహితమయేది ద్రవ్యరాశి కాదు; శక్తి (energy). ఈ ఆధునిక నిహిత నియమమే అయిన్‌స్టయిన్‌ ప్రవచించిన E = mc2 అనే సూత్రం. నిహితమయేది శక్తి అనే గుర్తింపు రాగానే రసాయన నిశ్చలత (chemical equilibrium) అనే భావనకి, తాపగతిశాస్త్రానికీ (thermodynamics) కొత్త పునాదులు పడ్డాయి. రసాయన పదకోశం Chemistry Information Database includes basic information and some toxicity Chemistry Jobs and Career Info IUPAC Nomenclature Home Page, see especially the "Gold Book" containing definitions of standard chemical terms Experiments videos and photos of the techniques and results Material safety data sheets for a variety of chemicals Material Safety Data Sheets ఊపయుక్త గ్రంధావళి Chang, Raymond. Chemistry 6th ed. Boston: James M. Smith, 1998. ISBN 0-07-115221-0. వేమూరి, వేంకటేశ్వరరావు, రసగంధాయరసాయనం, Rao Vemuri, 1991. Vemuri, V. Rao, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, India, 2002. ISBN 0-9678080-2-2. వర్గం:రసాయన శాస్త్రం
అక్టోబర్ 2005
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_2005
__NOTOC__ అక్టోబర్ 31, సోమవారం ప్రముఖ నేపథ్యగాయని పి.లీల మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు. ఆమెకు 76 సంవత్సరాలు. కేరళలోని పాలక్కాడ్ ఆమె పుట్టినిల్లు కాగా చిత్తూరు మెట్టినిల్లు. తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఆమె 15వేలకుపైగా పాటలు పాడారు. తెలుగులో లవకుశ, మాయాబజారు, పాండవవనవాసం, రాజమకుటం, గుండమ్మకథ, చిరంజీవులు తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. భారత్-శ్రీలంక జట్ల ల మధ్య జరుగుతున్న 7 వన్డే ల ఛాలెంజర్ సీరిస్లో భాగంగా జైపూర్లో జరిగిన 3 వ వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 3-0 గా ముందంజలో ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 298/4 పరుగుల భారీ స్కోరును భారత్ ముందుంచింది. 299 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని సాధించడానికి బరిలోకి దిగిన భారత్ జట్టు తొలి ఓవర్లోనేసచిన్ టెండుల్కర్ వికెట్ కోల్పోయినప్పటికి మహేంద్ర ధోని అధ్బుత బ్యాటింగ్ మెరుపులతో 46.1 ఓవర్లలో 4 వికెట్లకి 303 పరుగుల భారీ స్కోరును ఛేదించి అధ్బుత విజయాన్ని దీపావళి కానుకగా భారత్ క్రికెట్ అభిమానులకు అందించింది.మహేంద్ర ధోని 183 (10X6-15X4) పరుగులను 145 బంతులలో సాధించి నాట్ అవుట్ గా నిలిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. thumb|120px|మహేంద్ర ధోని183 పరుగులను 145 బంతులలో సాధించి అధ్బుత సెంచరీ వీరుడి విజయానందం. అక్టోబర్ 29, శనివారం 2005: ఆంధ్ర ప్రదేశ్లో నల్గొండ జిల్లా వలిగొండ దగ్గరి గొల్నెపల్లి వద్ద తెల్లవారుఝామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇంజను, 8 పెట్టెలు పట్టాలు తప్పి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడి పోయాయి. 111 మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నట్లు దక్షిణ మధ్య రైల్వే 30 వ తేదీన తెలిపింది. ప్రమాదంలో 93 మంది గాయపడ్డారు. 28 వ తేదీ రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా, గొల్నెపల్లి లోని రామసముద్రం చెరువు కట్ట తెగిపోయింది. ఈ చెరువు నుండి వచ్చిన వరద నీటి ఉధృతికి దగ్గర్లోని కల్వర్టు కొట్టుకొని పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వాగులో పడిన బోగీల్లో 4 రిజర్వేషను బోగీలు కాగా, నాలుగు జనరల్ బోగీలు. జనరల్ బోగీల్లో ప్రయాణీకులు క్రిక్కిరిసి ఉండే అవకాశం ఉన్నందున మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగిన మూడు వరుస పేలుళ్ళలో 59 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. ఒక బస్సులో ఉంచిన పేలుడు పదార్ధాలను గుర్తించిన డ్రైవరు, కండక్టరు వాటిని బయటకు విసిరి వేయడంతో నాలుగో పేలుడు తప్పింది. ఇది తీవ్రవాదుల పనేనని భావిస్తున్నారు. పేలుళ్ళు జరిగిన ఒక రోజు వరకు ఏ తీవ్రవాద సంస్థా తామే దీనికి కారణమని ప్రకటించలేదు. ఎర్రకోటపై దాడి కేసులో ముందు నిర్ణయించిన దాని ప్రకారం ఈ రోజే కోర్టు తీర్పు వెలువడనుంది. ఈ సందర్భంలో ఈ పేలుళ్ళు జరగటం విశేషం. అయితే తీర్పును పేలుళ్ళు జరగక ముందే 31 వ తేదీకి వాయిదా వేసారు. అక్టోబర్ 13, గురువారం భారత క్రికెట్ జట్టు సారథిగా రాహుల్ ద్రావిడ్ నియామకం అక్టోబర్ 9, ఆదివారం 2005 కాశ్మీరు భూకంపం: అక్టోబర్ 8 న ఉదయం 9:20:38 కి కాశ్మీరులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6 గా నమోదయింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో కేంద్రీకృతమైన భూకంపం పాకిస్తాన్, భారత్ లలో తీవ్ర నష్టం కలుగజేసింది. అక్టోబర్
గ్రంథాలయాలు
https://te.wikipedia.org/wiki/గ్రంథాలయాలు
దారిమార్పు తెలుగు గ్రంథాలయాలు
రాష్ట్రకూటుల శాసనాలు
https://te.wikipedia.org/wiki/రాష్ట్రకూటుల_శాసనాలు
28.(ఆ.రి.నెం. 331 1905వ సంవత్సరము) ఇటీవల వైఎస్ఆర్ జిల్లా,జమ్మలమడుగు తాలూకా, దనవులపాడు గ్రామములో కనుగొనిన పాడుబడిన జైన మందిరములోని జైన విగ్రహము ముందున్న pedestal చుట్టూ. తేదీ నిర్ధారితము కాలేదు. నిత్య వర్షుని పరిపాలనా కాలములో ఒక శాంతి అనునతడు శిలాపీఠమును ప్రతిష్ఠించెనని చాటుచున్నది. 29.(ఆ.రి.నెం. 391 1904వ సంవత్సరము) వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు తాలూకా, మాలెపాడు గ్రామములోని గోపాలకృష్ణస్వామి ఆలయము వెనుక పడి ఉన్న బండ మీద. తేదీ నిర్ధారితము కాలేదు. నిత్య వర్షుని పరిపాలనా కాలములో, వల్లవరాజ యొక్క పట్టమహిషి, ఇతరులు, ఇంత మొత్తము అని వరి ధాన్యము పండే భూమిని వీరిపర్తికి చెందిన నూటెనిమిది మందికి దానమిచ్చెనని చాటుచున్నది. పలు వ్యక్తుల (ఆడా, మగా) పేర్లు పేర్కొనబడినవి. వర్గం:తెలుగు శాసనాలు
అల్లరి అల్లుడు
https://te.wikipedia.org/wiki/అల్లరి_అల్లుడు
అల్లరి అల్లుడు 1993 లో ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, నగ్మా, వాణిశ్రీ, మీనా ఇందులో ప్రధాన పాత్రధారులు. కథ అఖిలాండేశ్వరి ఒక ధనవంతురాలు. భర్తను కూడా లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటుంది. తమ సంపద గురించి అందరి దగ్గర గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఆమె తమ్ముడు గోముఖం ఆమె వడ్డీ వ్యాపారంలో సహకరిస్తుంటాడు. ఆమె కూతుర్లు శ్రావణి, సంధ్య. శ్రావణి తల్లి లాగా గర్విష్టి. సంధ్య గర్వంతో మిడిసిపడే తల్లికి ఎప్పుడూ ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది. కల్యాణ్ తను చదివిన కళాశాలలోనే క్యాంటీన్ నడుపుతూ ఉంటాడు. అతని సహాయకుడు జీవా. తన క్యాంటీన్ కి వచ్చి బిల్లు చెల్లించకుండా వెళుతున్న శ్రావణిని అందరు చూస్తుండగా పిండి రుబ్బిస్తాడు కల్యాణ్. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా శ్రావణి కల్యాణ్ ని ప్రేమిస్తున్నట్లు నటిస్తుంది. కళాశాలలో మరుగుదొడ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు మిఠాయిల్లో మందు కలిపి వారిని ఆసుపత్రి పాలు చేస్తుంది. కల్యాణ్ ను పోలీసులు అరెస్టు చేస్తారు. పెళ్ళి సంబంధానికి వచ్చిన తమని అవమానించిందన్న కోపంతో ఎక్కడికే వెళ్ళి వస్తున్న అఖిలాండేశ్వరిని ధనరాజ్ అనే వ్యక్తి, అతని మనుషులు చంపబోతే కల్యాణ్ వచ్చి కాపాడతాడు. ఆమెను కాపాడిన వంకతో కల్యాణ్ ఆమె ఇంట్లోనే మేనేజరుగా స్థిరపడతాడు. సంధ్య అతనితో బాగా కలిసిపోతుంది. తారాగణం కల్యాణ్ గా నాగార్జున శ్రావణి గా నగ్మా సంధ్య గా మీనా అయ్యలరాజు అఖిలాండేశ్వరి గా వాణిశ్రీ గోముఖం గా కోట శ్రీనివాసరావు జీవా గా బ్రహ్మానందం బాబు మోహన్ ధనరాజ్ గా చలపతి రావు సంగీత సుత్తివేలు రాళ్ళపల్లి నాయరు గా చిడతల అప్పారావు గుండు హనుమంతరావు కె. కె. శర్మ చిట్టిబాబు రమ్యకృష్ణ (ప్రత్యేక నృత్యం) పాటలు నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర కమ్మని జత కమ్మని ఒడినిమ్మని పిలిచావే , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర మచిలీపట్నం మాయాబజార్ మ్యాట్నీకొస్తే మాటేశా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, బి రమణ రైక చూస్తే, రాజమండ్రి, పైట చూస్తే, పాలకొల్లు , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర ఒక్కసారే, వన్సుమోరే, ఒప్పుకోవే, సరే, సరే , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర చలో నా చక్కెర , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర తొడ తొక్కిడి తోట, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర మూలాలు వర్గం:అక్కినేని నాగార్జున సినిమాలు వర్గం:రావు గోపాలరావు నటించిన చిత్రాలు వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు వర్గం:సుత్తి వేలు నటించిన సినిమాలు వర్గం:రాళ్ళపల్లి నటించిన సినిమాలు
మాస్
https://te.wikipedia.org/wiki/మాస్
మాస్ 2004లొ విడుదలైన తెలుగు భాషా యాక్షన్ చిత్రం, అక్కినేని నాగార్జున తన స్వంత ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించాడు. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ రచన, దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, నాగార్జున, జ్యోతిక నటించారు. ఈ చిత్రం 23 డిసెంబర్ 2004 న విడుదలైంది. తరువాత దీనిని తమిళంలో వీరన్ పేరుతో, హిందీలో మేరీ జంగ్: వన్ మ్యాన్ ఆర్మీగా 2005 లో డబ్ చేశారు. తారాగణం అక్కినేని నాగార్జున మాస్ / గణేష్ గా జ్యోతిక అంజలిగా చార్మి కౌర్ ప్రియాగా రాహుల్ దేవ్ శేషుగా, అంజలి అన్నయ్య, వైజాగ్ డాన్ రఘువరన్ అంజలి తండ్రి సత్యగా సునీల్ ఆదిత్య a.k.a ఆది, మాస్ తమ్ముడు ధర్మవరపు సుబ్రమణ్యం ఆది తండ్రిగా జీవా పోలీసు అధికారిగా సమీర్ పోలీసు అధికారిగా వేణు మాధవ్ ఒక బిచ్చగాడు నర్సింగ్ యాదవ్ నర్సింగ్‌గా సత్యం రాజేష్ టాక్సీ డ్రైవర్‌గా ప్రియ తల్లిగా అపూర్వ వర్ష ప్రకాష్ రాజ్ న్యాయవాది దుర్గా ప్రసాద్ (అతిథి పాత్ర) రవి కాలే విశాఖపట్నం ACP గా (ప్రత్యేక ప్రదర్శన) రాఘవ లారెన్స్ "మాస్" పాటలో ప్రత్యేక ప్రదర్శనలో తనూ రాయ్ "మాస్" పాటలో ప్రత్యేక ప్రదర్శన లో కమెడియన్ # 2 గా రుతిక సాంకేతిక వర్గం 'దర్శకుడు' : రాఘవ లారెన్స్ 'స్క్రీన్ ప్లే' : రాఘవ లారెన్స్ 'స్టోరీ' : రాఘవ లారెన్స్ 'డైలాగ్' : పరుచురి బ్రదర్స్ 'నిర్మాత' : అక్కినేని నాగార్జున 'సంగీతం' : దేవి శ్రీ ప్రసాద్ 'సినిమాటోగ్రఫీ' : శ్యామ్ కె నాయుడు 'ఎడిటర్' : మార్తాండ్ కె. వెంకటేష్ 'ఆర్ట్ డైరెక్టర్' : తోట తరణి 'కొరియోగ్రఫీ' : రాఘవ లారెన్స్ 'స్టంట్స్' : అలన్ అమిన్ పాటల జాబితా మాస్ మ.మా మాస్, రచన: సాహితి, గానం.మనో, రవి వర్మ నాతో వస్తావా , రచన; సాహితి ,గానం. ఉదిత్ నారాయణ్, సుమంగళి కొట్టు కొట్టు కొట్టు , రచన: సాహితి , గానం.టీప్పు, ప్రసన్న వాలు కళ్ల వయ్యారి , రచన: భాస్కర భట్ల , గానం.కార్తీక్ ఇంద్రుడు చంద్రుడు, రచన: సాహితీ, గానం.రంజిత్, కల్పన లా లా లాహిరే రచన: విశ్వా, గానం.వేణు, సునీత సారథి. మూలాలు బాహ్య లంకెలు వర్గం:అక్కినేని నాగార్జున సినిమాలు వర్గం:పరుచూరి బ్రదర్స్ సినిమాలు వర్గం:దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన చిత్రాలు వర్గం:ప్రకాష్ రాజ్ నటించిన చిత్రాలు వర్గం:రఘువరన్ నటించిన చిత్రాలు వర్గం:సునీల్ నటించిన చిత్రాలు వర్గం:వేణుమాధవ్ నటించిన చిత్రాలు వర్గం:ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన చిత్రాలు వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు వర్గం:తెలుగు ప్రేమకథ చిత్రాలు
పొట్ల కాయ
https://te.wikipedia.org/wiki/పొట్ల_కాయ
పొట్ల కాయ thumb|left|కూరగాయల మార్కెట్లో అమ్మకానికి పొట్ల కాయలు. కొత్తపేట రైతు బజారులో thumb|పొట్లకాయ పోపు కూర తమిళము : పొడలం కన్నడము : పడ్వల్‌ పడవాలు మళయాళము : పడవలం ఓడ్రము : పటోలా హిందీ : చిచిండా సంస్కృతము : అహిఫలా పొట్ల కాయ భారతదేశమంతా సాగుచేయబడుచున్న దేశీ జాతి తీగ కూరగాయ. దీని కాయలు చూడటానికి పాములా ఉంటాయి, అందువల్లనే దీనిని ఆంగ్లములో snake gourd అని పిలుస్తారు. thumb|పొట్లకాయ పోపు కూర thumb|పొట్లకాయ పెరుగు పచ్చడి thumb|పెరటి పిచ్చుక పోట్లకాయలు thumb|left|250px|The lace-like flower of T. cucumerina opens only after dark. Here, it is shown in the process of unfurling. thumb|left|250px|A full grown snake gourd. వర్గం:కూరగాయలు వర్గం:కుకుర్బిటేసి
దొండ కాయ
https://te.wikipedia.org/wiki/దొండ_కాయ
thumb|right|250px|దొండకాయలు, కొత్తపేట రైతు బజారులో తీసిన చిత్రం. thumb|250px|(Coccinia grandis) తరిగిన దొండకాయలు, మధురవాడలో తీసిన చిత్రం దొండ (లేదా తొండ, డొండ) పొదగా పెరిగే తీగపైరు. కాయలు గుండ్రంగా రెండు, రెండున్నర అంగుళాల పొడవున ఉంటాయి. పచ్చికాయలు కూరగా వండుకుంటారు. కొన్ని ప్రాంతాలలో లేత ఆకులను కూడా కూర దినుసుగా ఉపయోగిస్తారు. ఇది సంవత్సరము పొడవునా కాయలు కాయు కూరగాయ తీగ. దీని సాధారణముగా పందిరిఎక్కించి సాగు చేస్తారు. పచ్చికాయలను ఉట్టిగానే తింటారు కూడా. తమిళము కోవై కన్నడము దొండె మళయాలము కోవల్‌ ఓఢ్రము తురడా హిందీ బింట్‌ సంస్కృతము రక్తఫలా రకములు దేశవాళీ లేదా చిన్న దొండ లేదా నైజాక దొండ బొబ్బిలి దొండ ఆర దొండ పాము దొండ కాకి దొండ చేదు దొండ, పిచ్చి దొండ జయపూరు దొండ తియ్య దొండ, కూర దొండ, మంచి దొండ వంటలు thumb|దొండకాయ పోపు కూర దొండకాయను చాలా రకాలుగా వండవచ్చు. దొండకాయ వేపుడు దొండకాయ పులుసు దొండకాయ పప్పు కూర దొండకాయ పచ్చడి గుత్తి దొండకాయ కూర thumb|left|సారల దొండకాయలు. ఇదొక రకం దొండకాయలు వర్గం:కూరగాయలు
కాకర
https://te.wikipedia.org/wiki/కాకర
కాకర (ఆంగ్లం: Bitter gourd) ఇండియా అంతా పెంచబడుతున్న ఓ చేదు తీగ జాతి మొక్క. దీని శాస్త్రీయ నామం మొమోర్డికా కరన్షియా (Momordica charantia) . ఇది కుకుర్బిటేసి (Cucurbitaceae) కుటుంబానికి చెందినది. కాకర (Bitter gourd) ఇండియా అంతా పెంచబడుతున్న ఓ చేదు తీగ జాతి మొక్క. దీని శాస్త్రీయ నామం మొమోర్డికా కరన్షియా (Momordica charantia) . ఇది కుకుర్బిటేసి (Cucurbitaceae) కుటుంబానికి చెందినది. ఆరోగ్యాన్ని ఇచ్చే కాకర చేదు అయినప్పటికీ మధుమేహానికి మందు గావాడుతున్నారు . కాయ, కాకర రసము, కాకర ఆకులు మందుగా ఉపయోగ పడతాయి. కాకర రసములో " హైపోగ్లసమిక్ " పదార్ధము ఇన్‌సులిన్‌ స్థాయిలో తేడారాకుండా నియంత్రణ చేస్తూ రక్తం లోని చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది . కాకర గింజలలలో రక్తములో గ్లూకోజ్ ను తగ్గించే " చారన్‌టిన్‌ " అనే ఇన్సులిన్‌ వంటి పదార్ధము ఉంటుంది . * తమిళము : పావక్కాయ్‌ * కన్నడము : హాగల్‌ కాయి * మళయాలం : కప్పాక్కా * ఓంఢ్రము : కరవిలా * హిందీ : కర్లీ, కరేలా * సంస్కృతము : కారవేల్ల. కాకర రకాలు నల్ల కాకర, తెల్ల కాకర, బారామాసి, పొట్టికాకర, బోడ కాకర కాయ అని మరొక గుండ్రని కాయ కలదు, ఇది కూడా చేదుగానే ఉండును. కాకరకాయలు కొంచెము చేదుగా ఉన్ననూ ఉడికించిననూ, పులుసును పెట్టిననూ, బెల్లమును పెట్టి కూరగా చేసినను మంచి రుచికరముగా ఉండును. కొద్దిగా చేదు భరించువారు దీనిని ముక్కలుగా చేసి తినుటనూ ఉంది. దీనిలో నీరు తక్కువ పౌష్టిక శక్తి ఎక్కువ. వైద్యమున ఉపయోగాలు : దీనిని తినిన కొద్దిమందికి వేడిచేయును, అటువంటి వారికి దీనిని మజ్జిగలో ఉడికించి ఇవ్వవలెను, తద్వారా చేదు కూడా తగ్గును. కాకరాకు రసమును కుక్క, నక్క మొదలగు వాటి కాటునకు విరుగుడుగా వాడుదురు. కొందరు ఈ ఆకు రసమును గాయాలపై రాస్తారు. మరికొందరు దీనిని చర్మ వ్యాదులకు, క్రిమి రోగములకూ వాడురుదు, కాకరకాయ అనగానే ఒక్క మధుమేహవ్యాధిగ్రస్తులకే మంచిది అనుకోకండి. ఔషధగుణాలున్న కాకరను తరచూ స్వీకరించడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. హైపర్‌టెన్షన్‌ని అదుపులో ఉంచుతుంది ఫాస్ఫరస్‌. అధిక మొత్తంలో పీచు లభిస్తుంది. సోరియాసిస్‌ను నివారణలో కాకర కీలకపాత్ర పోషిస్తుంది. శరీరానికి అత్యావశ్యక పోషకాలైన ఫొలేట్‌, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌ కూడా సమృద్ధిగా లభిస్తాయి, జీర్ణ శక్తిని వృద్ధిచేస్తుంది, చేదుగా ఉన్నందున పొట్టపురుగు నివారణకు ఉపయోగపడును, దీనిలో ఉన్న - మోమొకార్డిసిన్‌ యాంటి వైరస్ గా ఉపయోగపడును, ఇమ్యునో మోడ్యులేటర్ గా పనిచేయడం వల్ల - కాన్సర్, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మంచిది, ఇతరత్రా -దీనిని Dysentery, colic, fevers, burns, painful Menstruation, Scabies, abortifacient మున్నగు వ్యాధులలో వాడవచ్చును . కాకరలో సోడియం, కొలెస్ట్రాల్‌ శాతం తక్కువ. థయామిన్‌, రెబొఫ్లేవిన్‌, విటమిన్‌ బి6, పాంథోనిక్‌ యాసిడ్‌, ఇనుము, ఫాస్పరస్‌లు మాత్రం పుష్కలంగా లభిస్తాయి. అందుకే కాకరను తరచూ తినండి. కనీసం పదిహేనురోజులకోసారైనా టీ స్పూను కాకర రసం తాగండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తినే ముందు తీసుకునే జాగ్రత్తలు : విసిన్‌ (vicine) అనే పాదార్ధము ఉన్నందున " favism " వచ్చే అవకాశము ఉన్నది, గింజలలో ఉన్న "red arilis " చిన్నపిల్లలో విషపదార్ధంగా చెడు చేయును, గర్భిణీ స్త్రీలు కాకరను ఏ రూపములో వాడకూడదు . పొట్టి కాకర కాయ :- Green fruit of Momordica muricata.చేదుగ నుండును, త్రిదోషములను హరించును; జ్వరము, దద్దురు, కుష్టు, విషము, కఫము, వాతము, క్రిమిరోగము వీనిని హరించును. తమిళము : పావక్కాయ్‌ కన్నడము : హాగల్‌ కాయి మళయాలము : కప్పాక్కా ఓంఢ్రము : కరవిలా హిందీ : కర్లీ, కరేలా సంస్కృతము : కారవేల్ల. వెలుపలి లింకులు కాకర రకాలు నల్ల కాకర thumb|right|కాకర కాయలు, కొత్తపేట రైతు బజారులో తీసిన చిత్రం thumb|right|ఆకాకర కాయలు తెల్ల కాకర బారామాసి పొట్టికాకర బోడ కాకర కాయ అని మరొక గుండ్రని కయ కలదు, ఇది కూడా చేదుగానే ఉండును. ఆకాకర వంటలు కాకరకాయలు కొంచెము చేదుగా ఉన్ననూ ఉడికించిననూ, పులుసును పెట్టిననూ, బెల్లమును పెట్టి కూరగా చేసినను మంచి రుచికరముగా ఉండును. కొద్దిగా చేదు భరించువారు దీనిని ముక్కలుగా చేసి తినుటనూ ఉంది. దీనిలో నీరు తక్కువ పౌష్టిక శక్తి ఎక్కువ. వైద్యమున దీనిని తినిన కొద్దిమందికి వేడిచేయును, అటువంటి వారికి దీనిని మజ్జిగలో ఉడికించి ఇవ్వవలెను, తద్వారా చేదు కూడా తగ్గును. కాకరాకు రసమును కుక్క, నక్క మొదలగు వాటి కాటునకు విరుగుడుగా వాడుదురు. కొందరు ఈ ఆకు రసమును గాయాలపై రాస్తారు. మరికొందరు దీనిని చర్మ వ్యాదులకు, క్రిమి రోగములకూ వాడురుదు కాకరకాయ రసము వలన లాభాలు thumb|కాకరకాయ పులుసు కూర స్వభావం చేదైనా కమ్మని రుచులను అందించే కూరగాయ కాకరకాయ. కొంతమందికి కాకరకాయ వాసనంటేనే పడదు. కానీ కొందరు మాత్రం ఇష్టంగా తింటుంటారు. ఈ విషయం తెలిస్తే కాకరకాయ తినే అలవాటు లేకపోయినా కొత్తగా తినాలని చాలామంది అనుకుంటారేమో. కాకరగాయ వల్ల అనేక లాభాలున్నాయి.కాకరకాయతో కలిగే లాభాలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఎన్నో ఇన్‌ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం: కాకరగాయ తినడం వల్ల జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ లక్షణాలతో బాధపడేవారు కాకరగాయ రసం తాగితే మరింత మంచిది. రక్త శుద్ధి, కాలినగాయాల పరిష్కారం: రక్తాన్ని శుద్ధి చేయడంలో కాకరగాయ ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు, కాలినగాయాలు, పుండ్లను మాన్పడంలో కూడా కాకరగాయ చక్కగా పనిచేస్తుంది. అందమైన శరీరాకృతి కోరుకునే వారు, బరువు తగ్గాలనుకునేవారు చేదుగా ఉన్నా కాకరగాయ రసం తాగాల్సిందే. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి. కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉదర సమస్యలకు, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసానికి మించిన సంజీవని లేదు. గుండెపోటుకు ఒక కారణం కొలెస్ట్రాల్. శరీరంలో కొవ్వు శాతాన్ని అదుపులో ఉంచి, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో కాకరకాయ ప్రధాన భూమిక పోషిస్తుంది. మూలాలు వర్గం:కూరగాయలు వర్గం:కుకుర్బిటేసి
ఆకు కూరలు
https://te.wikipedia.org/wiki/ఆకు_కూరలు
thumb|గోంగూర కట్టలు thumb|తీగ బచ్చలి thumb|బెంగళూరు బచ్చలి మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకుకాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు. ఆకు కూరలు అనేక కుటుంబాలకు చెందిన మొక్కలనుండి వచ్చినా వీటి పోషక విలువలలో, వండే విధానములో మాత్రము ఇవన్నీ ఒకే వర్గానికి చెందుతాయి. thumb|right|అమ్మకానికి చుట్టలు కట్టిన పాలకూర ఆకు కూరలు రకాలు దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులుగల మొక్కలు ఉన్నాయి అయితే ఆకు కూరలు సాధారణంగా పొట్టిగా, గుబురుగా పెరిగే, స్వల్పకాల పరిమితిగల బచ్చలి, తోటకూర వంటి చిన్న చిన్న మొక్కల నుండే వస్తాయి. తినయోగ్యమైన ఆకులు ఉన్న వృక్షాకార మొక్కలకు ఆడంసోనియా, అరేలియా, మోరింగా, మోరస్,, టూనా రకాలు కొన్ని ఉదాహరణలు. అనేక పశుగ్రాస పంటల యొక్క ఆకులు కూడా మనుషులు తినడానికి యోగ్యమైనవే కానీ దుర్భర కరువు కాటక సమయాల్లోనే అటువంటివి తింటారు. ఆల్ఫాఆల్ఫా, లవంగము, గోధుమ, జొన్న, మొక్కజొన్న మొదలుకొని అనేక గడ్డులు వీటికి ఉదాహరణలు. ఈ మొక్కలు సాంప్రదాయక ఆకుకూరల కంటే త్వరితగతిన పెరుగుతాయి అయితే పీచు శాతము ఎక్కువగా ఉండటము మూలాన వీటి నుండి మెండైన పోషక విలువలు రాబట్టడము చాలా కష్టము. ఈ అడ్డంకిని ఎండబెట్టడము, పొడి చేయడము, పిప్పి చేయడము, రసము పిండటము మొదలైన ప్రక్రియల ద్వారా అధిగమించవచ్చు. thumb|right|ఆకుకూరలు, కొత్త పేట మార్కెట్ లో తీసిన చిత్రము ఆకుకూరలతో కలిగే మేలు మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో.... శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండాతినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకు కూరలు వండుకునే ముందు కచ్చితంగా ఒకటికిరెండు సార్లు కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, ధుమ్మూ, ధూళి మన ఆరోగ్యానికి హాని కలిగించ వచ్చు. అవసరమైతే ఆకు కూరలు కడిగేప్పుడు గట్టిగా ఉండే భాగాలను ఏరివేయండి. వీలైతే పొటాషియం పర్మాంగనేట్‌తో ఆకు కూరలు శుభ్రం చేస్తే మంచి ఫలితా లుంటాయి. మరిన్ని ఉపయోగాలు ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి. వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి. ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగి ఉంటాయి.శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు (పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు. ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరలద్వారా లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది. విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి. మధుమేహ వ్యాధి, కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించగల మెంతులు ( షుగర్ వ్యాధి ) . మధుమేహం (షుగర్ వ్యాధి, గుండె జబ్బులు చాలామందిలో సాధారణంగా కనిపించే వ్యాధులు.శరీరంలో కొలెస్టరాల్ గాని, రక్తంలో షుగర్ గాని అతిగా పెరగడం వల్ల వచ్చే ఈ వ్యాధులు ఇతర రుగ్మతలకు కూడా దారితీస్తాయి.ఈ వ్యాధులు ఉన్నవారు మెంతులను తింటే ఉపశమనం పొందుతారని జాతీయ పోషకాహార సంస్థ (హైదరాబాదు) చేసిన ఒక పరిశోధనలో తేలింది. పోషక విలువలు ఆకు కూరల్లో సాధారణంగా క్యాలరీలు చాలా తక్కువ, కొవ్వు పదార్ధాలు కూడా తక్కువే. క్యాలరీకిగల మాంసకృత్తుల శాతము చాలా అధికము. అలాగే పీచు పదార్థాలు, ఇనుము, కాల్షియం కూడా అధిక మోతాదుల్లో ఉంటాయి. వృక్ష సంబంధ రసాయనాలు (ఫైటో కెమికల్స్) అయిన విటమిన్ సి, విటమిన్ ఎ, ల్యూటిన్, ఫోలిక్ ఆమ్లం కూడా అధికముగా ఉంటాయి. పోషకాలు (ప్రతి 100 గ్రములకు) పుదీన తోటకూర పాలకూర మునగ ఆకులు కొత్తిమీర గోంగూర క్యాలరీలు 48 45 26 92 44 56 మాంసకృత్తులు. (గ్రా) 4.8 4.0 2.0 6.7 3.3 1.7 క్యాల్షియం (మి.గ్రా) 200 397 73 440 184 1720 ఇనుము (మి.గ్రా) 15.6 25.5 10.9 7.0 18.5 2.28 కెరోటిన్ (మై.గ్రా) 1620 5520 5580 6780 6918 2898 థైమిన్ (మి.గ్రా) 0.05 0.03 0.03 0.06 0.05 0.07 రిబోఫ్లేవిన్ (మి.గ్రా) 0.26 0.30 0.26 0.06 0.06 0.39 విటమిన్ సి (మి.గ్రా) 27.0 99 28 220 135 20.2 ఆకుకూరలు తో మధుమేహానికి చెక్ , ఆకుకూరలు తినండి.. మధుమేహానికి చెక్ పెట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆకుకూరలను తినడం వల్ల మధుమేహానికి దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, ఆకుకూరలే కాకుండా రోజూ పల్లీలు, ఇతర డ్రై ఫ్రూట్స్‌ తీసుకునే వారిలో కూడా మధుమేహంతోబాటు ఇతర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతిరోజూ పల్లీలు తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఇరవైవొక్క శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. డ్రైఫ్రూట్స్‌ శరీరానికి అవసరమైన కొవ్వును అందిస్తూనే బరువును అదుపులో ఉంచుతాయని న్యూట్రీషన్లు అంటున్నారు. ఆకుకూరల్లో కెలోరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఏదో ఒక ఆకుకూర తీసుకొనే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పధ్నాలుగు శాతాన్ని తగ్గించవచ్చంటున్నారు. కాబట్టి ఆహారం ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకుంటూ వుండండి. ఉపయోగించే విధానం పాశ్చాత్య దేశాల్లో ఆకు కూరలను చాలా మటుకు పచ్చిగానే సలాడ్లలో తింటారు. అయితే వీటిని స్టిర్-ఫ్రై చెయ్యొచ్చు, ఆవిరికి ఉడక పెట్టవచ్చు, భారతీయ వంటకాల వలె కూర చెయ్యవచ్చు. పంజాబ్ ప్రాంతములో చేసే సాగ్, ఉత్తర భారతములో చేసే పాలక్ పనీర్, ఆంధ్రులు లొట్టలు వేసుకొని ఆరగించే గోంగూర పచ్చడి ఆకు కూరలతో చేసిన వంటకాలే. జాగ్రత్తలు; 1. ఆకు కూరలు వండే ముందు సుబ్రముగా కడగాలి.ఏందు కంటే ఈ మధ్య పంటల పై విపరితంగా పురుగు మందులు ఛల్లు తున్నారు. వాటి అవశెసాలు ఆకు కురల పై ఆల ఉంటున్నాయి. 2.అందు వలన ఆకు కూరలు వండే ముందు కూరలను నీటిలో మునిగెలా 10 నిమషాలపాటు ఉంఛాలి. 3.కూరలను నీటిలో ఉంఛే ముందు కొద్ది పాటి ఉప్పును ఆ నీటిలో కలపాలి.దీని వలన కూరలపై ఉన్న రసయన పురుగు మందు అవశెషాలు, రసయన మందులు లవణంతో ఛర్య జరీపీ నిటిలోకి విడుదల అవుతాయి. 4.ఇపుడు ఆకు కూరలను వందుకుంటే ఎటువంటి ప్రమాదమూ ఉండదు. కొన్ని సాంప్రదాయ ఆకు కూరలు తుటి ఆకు చెంచల ఆకు పాయల ఆకు తోట కూర (Amaranthus gangeticus) గోంగూర (Hibiscus cannabinus) మట్టుబచ్చలి ఆకు చుక్క కూర (Rumex vesicarius) మెంతికూర (Trigonella foenum) కొత్తిమీర (Coriandrum sativum) తీగ బచ్చలి పుదీనా ఆకు (Mentha spicata) కరివేపాకు (Murraya koenigii) బచ్చలి పాల కూర (Spinacia oleracea) గంగబాయలు కూర పొన్నగంటి కూర (Alternanthera sessilis) చింతచిగురు (Tamarindus indica) మునగాకు (Moringa oleifera) పప్పు కూర (Phyllanthus maderaspatensis) సోయా ఆకు (Glycine max) ఉల్లికాడలు (Allium cepa) కాబేజీ (Brassica oleracea var. capitala) శెనగాకు (Cicer arietinum) తమలపాకు (Piper betle) చిర్రాకు చక్రవర్తి కూర పెరుగు తోట కూర కోడి జుట్టు ఆకు అవిశ ఆకు మూలాలు https://web.archive.org/web/20101123004816/http://www.mcgill.ca/files/cine/Dalit_Datatables_leafyvegs_Jn06.pdf వర్గం:కూరగాయలు వర్గం:వంటలు
తోట కూర
https://te.wikipedia.org/wiki/తోట_కూర
దారిమార్పు తోటకూర
గోగు
https://te.wikipedia.org/wiki/గోగు
ఇది బెండ కుటుంబానికి చెందినది. ఎప్పుడో సరిగ్గా తెలీకపోయినా ఇది భారతదేశానికి బైటి నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిని ఆంధ్రదేశంలో విరివిగా వాడతారు. దీనిని సాధారణంగా నార పంటగా కూడా ఉపయోగిస్తారు. thumb|250x250px|గోంగూర పువ్వు|alt= తమిళము: పులిమంజై కన్నడము: పుండి పల్లె / పుండే సొప్పు హిందీ: పట్వా, లాల్‌ అంబాడీ. గోంగూర రకాలు దేశవాళీ గోగు: కాండము, ఆకుల తొడిమలు, ఈనెలు, పూవు లోని రక్షణ పత్రములు మొదలైన భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని ఆకుల కొరకూ, నార కొరకు పెంచుతారు. పుల్ల గోగు: చిన్న మొక్క, కేవలము కూర కొరకు మాత్రమే పెంవబడును. తెలంగాణ ప్రాంతంలో గోంగూరను పుంటికూర అని వ్వవరిస్తారు. గోంగూర‌ (Roselle) thumb|గోంగూర కట్టలు|alt=|250x250px దీని శాస్త్రీయ నామం Hibiscus sabdariffa. వేసవిలో ఏ కూర చేసినా అంతగా తినాలని అనిపించదు. నీళ్లు మాత్రం గటగటా తాగేస్తాం. అయితే గోంగూర ఉంటే మాత్రం పుల్లగా... పుల్లగా లాగించేస్తాం. ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర అంటే పడి చచ్చే వారు ఎందరో. అలాంటి గోంగూరతో చట్నీనే కాదు వేరే వంటకాలూ వండొచ్చు. వంటలు ప్రఖ్యాతి గాంచిన, ఘనత వహించిన గోంగూర పచ్చడి మాత్రమే కాకుండా దీనితో గోంగూర పప్పు, గోంగూర పులుసులు కూడా చేస్తారు. గోంగూర పచ్చడి మిక్కిలి రుచికరమైన ఆహార పదార్తము. దీనితో నిల్వ పచ్చడి కూడా చేస్తారు.రకములు . దేశవాళీ గోగు: కాండము, ఆకుల తొడిమలు, ఈనెలు, పూవు లోని రక్షణ పత్రములు మొదలైన భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని ఆకుల కొరకూ, నార కొరకు పెంచుతారు. పుల్ల గోగు: చిన్న మొక్క, కేవలము కూర కొరకు మాత్రమే పెంవబడును.వంటలు ప్రఖ్యాతి గాంచిన, ఘనత వహించిన గోంగూర పచ్చడి మాత్రమే కాకుండా దీనితో గోంగూర పప్పు, గోంగూర పులుసులు కూడా చేస్తారు. పోషక విలువలు వీటిలో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ', ‘సి', రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌, పీచు ఎక్కువగా ఉంటుంది ఇందులో ఐరన్‌ అధికంగా ఉండడం వల్ల, కొంచెం ఎక్కువ తింటే అరక్కపోవడం కద్దు. ఉపయోగాలు : ఆహార పదార్థంగా గోంగూర ఉపయోగం మనకు తెలుసు. సంవత్సరం పొడుగునా నిలవ ఉండి, ఉప్పులో ఊర వేసిన గోంగూర అత్యవసర పరిస్థితుల్లో సిద్ధంగా ఉండే (ఇన్‌స్టాంట్‌) కూర . గోంగూర కాడల్ని చితకకొట్టి, పలుపులు, నులక పేనడం ఆంధ్రదేశంలో అనాదిగా రైతులు చేసేపని. వాణిజ్యపరం గా, పెద్ద ఎత్తున పలుపులు, నులక పేనడం జరగక పోయినా, రైతు తన ఇంటి ఉపయోగానికి కావలసినంత మటుకు అయినా తయారు చేసుకోవడం ఒక అలవాటు. గోంగూరతో సంచులు చేస్తారు. జనపనార సంచులంత గట్టివి కాకపోయినా పనిగడుపుతాయి. మెట్ట, మాగాణీ భూముల్లో గూడ గోగులు వేస్తారు. ఇందులో కొండగోంగూర, మంచి గోంగూర రెండు రకాలు. కొండ గోంగూర కాడ కొంచెం ఎరుపుదాళుగా ఉంటుంది. ఆకు కొద్దిగా వగరు. నిలవపచ్చళ్ళకు వాడరు. మంచి గోంగూర పుల్లగా ఉంటుంది. పండు మిరప పండ్లను గోంగూరతో పాటు తగినంత ఉప్పువేసి తొక్కి నిలవ పచ్చడి తయారు చేస్తారు. మన గోంగూర విదేశాలకు పచ్చడి రూపాన ఎగుమతి అవు తున్నది. గణాంక వివరాలు ఇవ్వగలిగినంత గణనీయమైన ఎగుమతి వ్యాపారం కానప్పటికీ, మన గోంగూర ఎంతో కొంత విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి, పరోక్షంగా దేశసేవ చేస్తున్నది. గోంగూర ఔషధ గుణాలు:- ప్రకృతిలో ప్రతి ఆకు ఒక మూలిక. సృష్టిలోని ప్రతి మొక్క ఎంతోకొంత ఔషధ గుణం కలగి ఉంటూనే ఉంది. కాకపోతే మన శాస్త్రజ్ఞులు ఇప్పటికి కొన్ని గుణాలను మాత్రమే తెలుసుకోగలిగారు. మరెన్నో మనకు తెలియని మూలికలు శాస్త్రజ్ఞుల దృష్టికి అందని మూలికలు వ్యర్థంగా అడవుల్లో తుప్పల్లో బీళ్ళలో పుడ్తున్నాయి, చస్తున్నాయి. గోగుపూలుఅందంగా ఉంటాయి. అస్తమించే సూర్యుడు గోగుపూల ఛాయలో ఉంటాడని కవులు వర్ణించారు కూడా. గోంగూరకు ఔషధ గుణాలున్నా యని పరిశోధకులు ఎప్పుడో తెలుసుకు న్నారు. వ్రణాలు, గడ్డలపైన గోంగూర ఆకును ఆముదంతో కుమ్మి, వెచ్చచేసి వేస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. వ్రణాలు, గడ్డల వల్ల కలిగే తీపు తగ్గి, అవి తొందరగా పగులు తాయి. స్వస్థత చిక్కుతుంది. రేచీకటికి రాత్రిపూట సరీగా చూపు కనపడక పోవటం అనే నేత్ర రోగం లేదా దృష్టిదోషంతో బాధపడేవారు భోజనంలో ఆకుకూర గానో, పచ్చడిగానో, ఊరగాయగానో గోంగూర వాడితే కొంతమేరకు మంచి ఫలితం ఉంటుంది. అంతటితో చాలదు రేచీకటి తగ్గడానికి చిన్న చిట్కా వైద్యం లేదా గృహవైద్యం ఇది. గోంగూర పూలను దంచి, అరకప్పు రసం చేసి, దాన్ని వడకట్టి, దానిలో ఒక అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవించడం తక్షణం చేయవలసిన పని. తరచూ గోంగూర వాడుతూ గోంగూర పువ్వులను దంచి అర కప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది . బోదకాలు తగ్గడానికి శరీరంలో వాపులు తీయడానికి గోంగూర, వేపాకు కలిపి నూరి ఆ పదార్థాన్ని పట్టించాలి. విరేచనాలు అధికంగా అవుతుంటే కొండ గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి త్రాగితే ముందు అవి కట్టుకుం టాయి. మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూర అన్నంతో తిన్నా విరోచనాలు తగ్గిపోతాయి. దగ్గు, ఆయాసం తుమ్ము లతో ఇబ్బంది పడేవారు గోంగూరను ఏదో విధంగా అంటే ఆహారంగానో లేక ఔషధం గానో పుచ్చుకుంటే స్వస్థత చిక్కుతుంది. దగ్గు ఆయాసం తుమ్ములతో బాధపడే వారికీ చాలామేలు చేస్తుంది . శరీరంలో నీరు చేరినప్పుడు ఈ ఆకు కూర పథ్యం చాల మంచిది . గోంగూర తినకూడని వారు:- గోంగూర - మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది. ఉష్ణతత్వ శరీరులకు, నిక్కాకతో బాధపడేవారికి గోంగూర పడదు. వారు ఏ రూపాన కూడా గోంగూర తినరాదు. మూలాలు వెలుపలి లింకులు వర్గం:కూరగాయలు వర్గం:శాకాహార వంటలు వర్గం:మాల్వేసి
తెలుగు సినిమాలు అం
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_అం
thumb|అంతఃపురం అంకురం (సినిమా) అంకుర్ (సినిమా) అంకుల్ అంకుల్ (2018) అంకుశం అంగడిబొమ్మ అంగరక్షకుడు (సినిమా) అంజలి (అనువాదం) అంతఃపురం అందరివాడు అందరికి మొనగాడు అందరూ దొంగలే అందమె ఆనందం అందం కోసం పందెం అందరూ బాగుండాలి అందరూ మంచివారే అందాలరాజు
తెలుగు సినిమాలు ధ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ధ
thumb|ధర్మపత్నిధన 51 ధనమే ప్రపంచలీల ధనవంతుడు గుణవంతుడు ధర్మచక్రం ధర్మక్షేత్రం ధర్మ దేవత (1970 సినిమా) ధర్మ నిర్ణయం ధర్మ పరీక్ష ధర్మ పోరాటం ధర్మ యుద్ధం (1979 సినిమా) ధర్మ యుద్ధం (1989 సినిమా) ధర్మం దారి తప్పితే ధర్మపత్ని(1941 సినిమా) ధర్మపత్ని(1969 సినిమా) ధాన్యమే ధనలక్ష్మి ధృవ విజయం ధైర్యం
తెలుగు సినిమాలు య
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_య
thumb|యముడికి మొగుడుయజ్ఞం యమలీల యమగోల యమకింకరుడు యమజాతకుడు యముడికి మొగుడు యమధర్మరాజు యముడు (1980 సినిమా) యముడు (1985 సినిమా) యముడు (2010 సినిమా) యశోదాకృష్ణ యువ హృదయాలు యువతరం కదిలింది యువ యువకుడు యువసేన యుగళగీతం యుగంధర్ యూనియన్ లీడరు యోగివేమన(1947 సినిమా) యోగివేమన(1988 సినిమా)
తెలుగు సినిమాలు ట, ఠ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ట,_ఠ
thumb|ఠాగూర్టక్కరి దొంగ టాక్సీ డ్రైవర్ టాప్ లెచిపోద్ది టాప్ హీరో టింగురంగడు టింగ్ రంగ టీనేజ్ టూ టౌన్ రౌడీ టైం టోపీ రాజా స్వీటీ రోజా టాక్సీవాల ఠాగూర్ (సినిమా) టిక్ టిక్ టిక్
తెలుగు సినిమాలు హ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_హ
thumb|హై హై నాయకాహలో బ్రదర్ హంగామా-2005 హనుమాన్ జంక్షన్ హనుమంతు హలో ఫ్రెండ్ హంతకుడి వేట హంతకులు దేవాంతకులు హనుమాన్ పాతాలవిజయం హరిశ్చంద్రుడు హరే కృష్ణ హలో రాధ హలో ఐ లవ్ యూ హలో గురు హలో నీకు నాకు పెళ్లంట హలో యమ హాండ్సప్ హ్యాపీ హాయ్ హాయ్ సుబ్రహ్మణ్యం హిందుస్తాన్ ద మదర్ హిట్లర్Hitler హీరో (1984) హీరో (2008) హేమా హేమీలు. హైదరాబాద్ నవాబ్స్ హై హై నాయకా హొలీ హృదయాంజలి(1999) హృదయాంజలి(2002) హృదయమున్న మనిషి హృదయం మూలాలు
తెలుగు సినిమాలు ష
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ష
thumb|షో "ష" తో ప్రారంభమైన సినిమాల వివరాలు: షో- 2002 జాతీయ పురస్కారం పొందిన సినిమా. మంజుల ప్రయోగాత్మకంగా తీసిన సినిమా ఇది. కేవలం ఇద్దరు నటులతో తీసిన ఈ సినిమా ప్రశంసలు, అవార్డులు అందుకొన్నది.ఐడిల్ బ్రెయిన్.కమ్ లో గుడిపూడి శ్రీహరి సమీక్ష షాక్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన హరీష్ శంకర్ మొదటి సారిగా దర్శకత్వం వహించగా రవితేజ, జ్యోతిక ప్రధాన పాత్ర ధారులుగా రూపొందించిన ఈ సినిమా 2006 లో విడుదలైంది. ఈ కథలో ప్రతీకారం ప్రధానాంశంగా నడుస్తుంది. దీనికి రామ్ గోపాల్ వర్మ నిర్మాత. షాడో 2013 లో మెహర్ రమేష్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. షావుకారు- 1950 లో విడుదలైన తెలుగు సినిమా. షావుకారు చిత్రం వాహినీ స్టూడియోలో చిత్రీకరించారు, అప్పుడే స్టూడియో నిర్మాణం పూర్తిఅవుతూండడంతో వాహినీ స్టూడియోలో చిత్రీకరణ జరుపుకున్న తొలిచిత్రంగా షావుకారు నిలిచింది. ష్ గప్‌చుప్- 1994 లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన సినిమా షేర్ (సినిమా) 2015 అక్టోబరు 22 న మల్లిఖార్జున్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. మూలాలు
తెలుగు సినిమాలు ఘ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ఘ
thumb|ఘరానా మొగుడు ఘటోత్కచుడు : ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1995 లో వచ్చిన ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఘరానా మొగుడు : 1992లో విడుదలైన ఒక తెలుగు సినిమా. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి, నగ్మా ముఖ్యపాత్రలు పోషించారు. ఘరానా బుల్లోడు : 1995 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, రమ్యకృష్ణ, ఆమని ఇందులో ప్రధాన పాత్రధారులు. ఘరానా దొంగ : 1980 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణ, మోహన్ బాబు, శ్రీదేవి ముఖ్యపాత్రల్లో నటించారు. విజయ లక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు. ఘరానా దొంగలు : 1971, డిసెంబరు 11న విడుదలైన డబ్బింగ్ సినిమా. ఈ సినిమా ఠక్క బిట్రె సిక్క అనే కన్నడ చిత్రానికి అనువాదం. ఘరానా కూలి : రజనీకాంత్, రోజా జంటగా నటించిన తెలుగు డబ్బింగ్ సినిమా. పి. వాసు దర్శకత్వంలో బి. వెంకట్రామరెడ్డి చందమామ విజయా కంబైన్స్ పతాకం క్రింద నిర్మించిన ఉళైప్పలి అనే తమిళ సినిమాను తెలుగులో సాయికృప ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దాసరి శ్రీనివాసరావు ఘరానా కూలిగా డబ్ చేశాడు. ఘరానా రౌడీ : 1984 అక్టోబరు 20న విడుదలైన తెలుగు సినిమా. విజయభేరి మూవీస్ బ్యానర్ పై టి.విజయభాస్కర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రాజశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. ఘరానా హంతకుడు : ఘరానా హంతకుడు 1965లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ సినిమా "ఎన్ కదమై" అనే తమిళ సినిమాకు డబ్బింగ్. ఘరానా గంగులు ఘర్షణ (1988) ఘర్షణ (2004 సినిమా) మూలాలు వర్గం:తెలుగు సినిమా
ఆంధ్రప్రదేశ్ చరిత్ర
https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్_చరిత్ర
ఆంధ్రప్రదేశ్ లిఖితమైన చరిత్ర వేద కాలంనాటినుండి ప్రారంభమవుతుంది. సా.శ..పూ. 8 వ శతాబ్దపు ఋగ్వేద కృతి ఐతరేయ బ్రాహ్మణ లో ఆంధ్రస్ అనే వ్యక్తుల సమూహం ప్రస్తావించబడింది. ఆంధ్రులు ఉత్తర భారతదేశంలో యమునా నది ఒడ్డున నుండి దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లుగా తెలియవస్తుంది. ఈ ప్రాంతంలోని ప్రజలు విశ్వామిత్ర సంతతి వారని, అస్సాక మహాజనపదం (సా.శ..పూ.700-300) ఆగ్నేయ భారతదేశంలోని గోదావరి, కృష్ణ నదుల మధ్య ఉన్న ఆంధ్రుల పురాతన రాజ్యమని రామాయణ, మహాభారత ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది. అంధ్రప్రదేశ్ చరిత్రను తొలుత చరిత్ర పూర్వయుగము, చారిత్రకయుగము అను రెండు భాగములుగా విభజింపవచ్చును. ఇందు చరిత్ర పూర్వయుగకథనానికి లిఖిత ఆధారాలు లభింపలేదు. ఇది సామాన్య శక పూర్వం మూడవ శతాబ్ది ఆరంభము వరకు కొనసాగిన ప్రాచీన కాలము. సామాన్య శక పూర్వం మూడవ శతాబ్దినుండి ఆధునికకాలము వరకు నడచినది చారిత్రక యుగము. ఈ యుగమును మరల సౌకర్యార్ధమై పూర్వయుగము, మధ్యయుగము, ఆధునికయుగము అని మూడు భాగములుగా విభజింపవచ్చును. మధ్య యుగాన్ని మళ్ళీ పూర్వ మధ్య యుగం (కాకతీయుల కాలం), ఉత్తర మధ్య యుగం (విజయ నగర రాజ్య కాలం) గా విభజిస్తారు. చరిత్ర పూర్వయుగం క్రీ.పూ. 10,000 - క్రీ.పూ. 8,000 - పాతరాతియుగం - కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఈ కాలంనాటి పనిముట్లు దొరికాయి. కడప, కర్నూలు ప్రాంతాలలో పలుగురాయి, కృష్ణానది ఉత్తరాన సున్నపురాయి అధికంగా వాడారు. డోర్నకల్ సమీపంలోని నందికనుమ (గిద్దలూరు) ప్రాంతం పాతరాతి పనిముట్లకు ప్రధాన కేంద్రం అనిపిస్తున్నది. క్రీ.పూ. 8,000 - క్రీ.పూ. 6,000 - సూక్ష్మ రాతి యుగము కాలంలో చిన్న పరిమాణం ఉన్న పనిముట్లు వాడారు. గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ ప్రాంతాలలోను, అదిలాబాద్ జిల్లాలోను ఈ కాలం అవశేషాలు లభించాయి. క్రీ.పూ. 6,000 - క్రీ.పూ. 2,000 - కొత్తరాతియుగం - గిద్దలూరులోను, బళ్ళారి జిల్లా సంగనకల్లులోను ఈ కాలం అవశేషాలు లభించాయి. ఈ యుగంలో పెక్కు నూతన పరికరాలు వాడారు. పసువులను పెంచేవారు. మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూరు వద్ద పేడకుప్పలను తగలబెట్టిన మసిదిబ్బలను కనుగొన్నారు. క్రీ.పూ. 2,000 - క్రీ.పూ. 1,000 - రాగి యుగము - బ్రహ్మగిరి, పుదుచ్చేరిల వద్ద రాగి, కంచు పనిముట్లు లభించాయి. కర్నూలు జిల్లా పాతపాడు వద్ద అలంకరించిన మట్టి పాత్రలు లభించాయి. క్రీ.పూ. 1,000 - క్రీ.పూ. 500 - ఇనుప యుగం - "రాక్షసిగుళ్ళు" అనే సమాధులు ఈ కాలంలో నిర్మించారు. దాదాపు ఆంధ్రదేశం (విశాఖ మినహా) అంతటా ఈ కాలం ఆనవాళ్ళు లభించాయి. తెలంగాణ ప్రాంతంలో ఇనుప పనిముట్ల తయారీ ఆధారాలు అధికంగా దొరికాయి. వ్యవసాయం అభివృద్ధి చెందింది. ఆంధ్ర, తెలుగు జాతి ఒక జాతి అనేది ఒక్కమారుగా ఉద్భవించిన సమూహం కాదు. చరిత్రలో జరిగిన అనేక సాంఘిక, రాజకీయ, ఆర్థిక, స్థానచలన, సాంస్కృతిక ఘటనల ద్వారా జాతులు రూపుదిద్దుకొన్నాయి. ఆంధ్రుల జాతీయత గురించి లభించిన వివిధ (చాలా వరకు అస్పష్టమైన) ఆధారాల ద్వారా చరిత్రకారులు ఆంధ్రజాతి ఇలా ఏర్పడిందని భావిస్తున్నారు - నాగులు, ఆంధ్రులు, ద్రావిడులు, తెలుగులు, యక్షులు, శబరులవంటి ఇతర వనవాస జాతులు కాలక్రమంలో వివిధ సంబంధాల ద్వారా, ప్రధానంగా భాషాపరంగా, కలసినందువలన ఆంధ్ర లేదా తెలుగు జాతి రూపుదిద్దుకొంది. వీరిలో నాగులు పంజాబు ప్రాంతంలో (క్రీ.పూ. 600 నాటికి) ఉండి ఆర్యులను ప్రతిఘటించారు. ఆంధ్రులు మహాభారత యుద్ధకాలంలో యమునా నదితీరాన ఉండేవారు. యుద్ధానంతరం నెలకొన్న రాజకీయ కల్లోలం వలనా, మిడతల దండు కారణంగా ఏర్పడిన ఆహార లోపం వలనా క్రమంగా దక్షిణాపధానికి వలస వచ్చారు. యక్షులు భట్టిప్రోలు ప్రాంతంలో తూర్పు తీరాన ఉండేవారు. కళింగులు, తెలుగులు ఉత్తర తీరాంధ్రంలో వ్యవసాయం, ఇతర వృత్తులలో నిపుణులైన స్థిరనివాస జాతి. ద్రవిడులు రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు.ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర క్రీ. పూ. 6వ శతాబ్దంలో ఉద్భవించిన బౌద్ధ, జైన మతాలకు ఆరంభ కాలంనుండి ఈ దక్షిణాపధంలో అనన్యమయన ఆదరణ లభించింది. బౌద్ధమతం బోధించిన వర్ణరహిత జీవనం ఈ జాతుల మధ్య సహజీవనానికీ, సమాగమనానికీ మరింత ఊపునిచ్చింది. ఆంధ్రులు యుద్ధ నిపుణులైనా గాని దండెత్తి వచ్చినవారుకారు. బ్రతుకు తెరువుకోసం వచ్చినవారు. అయితే అప్పటికే స్థిరనివాసం ఏర్పరచుకొన్న తెలుగుల భాష మరింత పరిపక్వత చెందిఉండాలి. కనుక తెలుగు భాష ఈ జాతుల ఏకీకరణకు మార్గం మరింత సుగమం చేసింది. రాజకీయ అధికారం ఆంధ్రులు సాధించినా భాష మాత్రం తెలుగే నిలిచింది.బి.ఎస్.ఎల్._హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - ప్రచురణ:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఈ నేపథ్యంలోనే ఆంధ్రజాతి రూపు దిద్దుకొంది. పూర్వ యుగం thumb|Holy relic sites map of Andhra Pradesh మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు, శునస్సేపుడు కథలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివసిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చును. మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన ఉన్నట్లు (ఆంధ్రాశ్చ బహవః) ఉంది. క్రీ.పూ. 600 - జైన, బౌద్ధ మతాల ఆరంభం భారత దేశ చరిత్రలో ఒక ప్రభంజనం. మొదటినుండి ఈ మతాలు ఆంధ్రదేశంలో విస్తరించాయి. ఈ కాలంలో ఉత్తర, దక్షిణ దేశాల మధ్య సంబంధం పెరిగింది. క్రీ.పూ. 500 - 400 - బౌద్ధ జాతక కథలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం), ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన ఉంది. భట్టిప్రోలు శాసనం ద్వారా క్రీ.పూ. 400 నాటికి కుబ్బీరుడు (యక్షరాజు) తీరాంధ్రంలో రాజ్యం చేస్తున్నాడు. అయితే పెద్దయెత్తున ఔత్తరాహులు ఆంధ్రాపధంపై దండెత్తిన ఆధారాలు లేవు. కొద్దిపాటి ఘర్షణలు జరిగి ఉండవచ్చును. క్రీ.పూ. 300 నాటికే బౌద్ధం, జైనం ఆంధ్రాపధంలో అమితంగా ఆదరణ పొందాయి. మౌర్యకాలము క్రీ.పూ.322 - 184 చంద్ర గుప్తుడు క్రీ.పూ. 322లో మౌర్య వంశం స్థాపించాడుచంద్రగుప్తుడు నంద రాజుల కుమారుడు.క్రీ.పూ. 300 - మెగస్తనీసు చంద్రగుప్తుని ఆస్తానంలో ఉన్న యాత్రికుడు. ఆంధ్రుల గురించి ఇలా వ్రాశాడు - "ఆంధ్రులకు 30 నగర దుర్గాలు, 10 వేల పదాతి సైన్యం, 2వేల గుర్రపు దళం, వేయి ఏనుగులు ఉన్నాయి" క్రీ.పూ. 272 - క్రీ.పూ.232 అశోకుని పాలన కాలం. అశొకుని 13వ శిలాశాసనం ప్రకారం ఆంధ్రులు "రాజవిషయం"లో ఉన్నారు. క్రీ.పూ.400 - 200 సమయంలో బౌద్ధమతం ఆంధ్రదేశంలో అంతటా ఉచ్ఛదశలో ఉంది. ఆంధ్రుల ఏకీకరణకు మార్గం సానుకూలమయ్యంది. ఈ సమయంలో ఇనుము పరిశ్రమ, వ్యవసాయం, వాణిజ్యం బాగా అభివృద్ధి చెంది దేశం సుభిక్షమయ్యింది. ఉత్తర దేశంనుండి సింహళానికి వెళ్లేమార్గంలో ఆంధ్రదేశం ముఖ్యమైన మజిలీగా ఉండేది. శాతవాహనులు - క్రీ.పూ.200 - సా.శ..200 మౌర్య సామ్రాజ్యం పతనమైన తరువాత శాతవాహనులు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరి పాలన క్రీ.పూ. 2వ శతాబ్ది నుండి సా.శ..2వ శతాబ్ది వరకు సుమారు 400 సంవత్సరాలు సాగింది. సుమారు క్రీ.పూ. 271-248 మధ్య సిముకుడు అనే రాజు అప్పటి ఆంధ్రరాజ్యాలనన్నింటినీ ఏకం చేసి రాజై శాతవాహనుల వంశాన్ని స్థాపించాడు. అతని మొదటి రాజధాని అమరావతి వద్ద ధరణికోట కావచ్చును. తరువాత మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం (ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్) కు రాజధాని మార్చబడింది. వీరిలో ఆరవ రాజైన రెండవ శాతకర్ణి (క్రీ.పూ.184) గొప్ప రాజు. నందులు, మౌర్యులు, శుంగులు, కణ్వులు తరువాత విశాల భారత సామ్రాజ్యాన్ని శాతవాహనులు సాధించగలిగారు. సా.శ..62లో అధికారానికి వచ్చిన 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహనుల ప్రాభవం తిరిగి పుంజుకుంది. నాసిక్ శాసనం ప్రకారం ఇతని రాజ్యంలో అసిక, అస్సక, ములక, సౌరాష్ట్ర, కుకుర, అపరాంత, అనూప, విదర్భ, అకర, అవంతి దేశాలూ, వింధ్య, అచవత, పారియాత్ర, సహ్య, కన్హగిరి, సిరితన, మలయ, మహేంద్ర, శత, చకోర పర్వతాలూ ఉన్నాయి (దక్షిణ ప్రాంతమే కాక గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిషా ప్రాంతాలు). అతని రాజ్యం తూర్పు సముద్రం నుండి పశ్చిమ సముద్రం వరకు విస్తరించింది. సా.శ.. 2వ శతాబ్దానికి శాతవాహనుల సామ్రాజ్యం పూర్తిగా పతనమయ్యింది. శాతవాహనుల కాలంలో దేశాంతర వాణిజ్యం బాగా సాగింది. తీరాంధ్ర, కళింగ ప్రాంతాలలోని అనేక రేవులు, కృష్ణా గోదావరి మధ్య ప్రాంతంలో పెక్కు నగరాలు వాణిజ్యకేంద్రాలుగా విలసిల్లాయి. చేతిపనులు అభివృద్ధి చెందాయి. రాజులు వైదిక మతాన్ని అవలంబించినా గాని బౌద్ధం కూడా వర్ధిల్లింది. రెండు మతాలనూ రాజులు ఆదరించారు. అనేక గొప్ప చైత్యాలు, స్తూపాలు, విహారాలు నిర్మింపబడ్డాయి. సాహిత్యం, శిల్పం కూడా ప్రభవించాయి. ఈ కాలంలో బౌద్ధమతంలో జరిగిన మరొక విశేష తత్వశాస్త్ర వికాసం ఆచార్య నాగార్జునుడు బోధించిన మహాయానం. కళింగులు క్రీ.పూ. 200 - సా.శ..420 మహానది, గోదావరి నదుల ముఖ ద్వారాల మధ్య భాగాన్ని కళింగ దేశమని చెప్పవచ్చును. కళింగులు నేటి ఉత్తరాంధ్ర, ఒడిషా ప్రాంతాలను పాలించిన రాజులు. తొలి శాతవాహనులకు సమకాలికులుగా కళింగ దేశాన్ని ఛేది (సద) రాజులు పాలించారు. వీరిలో ప్రసిద్ధుడు ఖారవేలుడు. అశొకుని సామ్రాజ్యం క్షీణించిన తరువాత సా.శ.. 183లో ఖారవేలుడు కళింగ రాజయ్యాడు. ఖారవేలుడు జైన మతస్థుడు. వృషభ లాంఛనుడు. సమర్ధుడైన పాలకుడు. రాజ్యవిస్తరణ చేశాడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం. ఖారవేలునికి శాతవాహనులలో సమకాలీనుడు శాతకర్ణి. వారి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో "పిథుండ" నగరాన్ని ఖారవేలుడు నాశవం చేశాడని హథీగుంఫ శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది. ఖారవేలుని తరువాత కళింగ రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. తరువాతి కాలంలో కొంతకాలం పిష్ఠపురంలో మాఠరులు అధికారంలో ఉన్నారు (సా.శ..400-450). దేవపురిలో వాసిష్ఠులు పాలించారు (క్రీ. శ. 300-450). ఇక్ష్వాకులు క్రీ. శ. 225 - 300 శాతవాహనుల పతనం తరువాత తీరాంధ్రప్రాంతంలో ఇక్ష్వాకులు నాగార్జునకొండ వద్ద విజయపురి రాజధానిగా 50 సంవత్సరాలు పాలించారు. ఇక్ష్వాకులు సా.శ..225 ప్రాంతంలో విజృంభించారు. మొదటివాడైన శ్రీ శంతమూలుడు (క్రీ. శ. 225-245) గొప్ప వీరుడు. ఇతడు రాజనీతిపరుడు. ఇతని కాలంలో వైదికమతం పునరుద్ధరణ పుంజుకొంది. తరువాత వీరపురుషదత్త (క్రీ. శ. 245-265) కాలం ఆంధ్రబౌద్ధ చరిత్రలో సువర్ణఘట్టం. అతని రాణులు ఇతర అంతఃపుర స్త్రీలు పెద్దయెత్తున బౌద్ధారామాలకు దానాలు చేశారు. ఆ కాలంలో శ్రీపర్వతం (నాగార్జునకొండ) గొప్ప బౌద్ధక్షేత్రంగా విలసిల్లి దూరదేశాలనుండి యాత్రికులను ఆకర్షించింది. సింహళం, చైనా, కాశ్మీరం, గాంధారం, తొసలి, వనవాస, అపరాంతం, వంగ, యవన, తమిళ దేశాలనుండి వచ్చే యాత్రికులకోసం వారు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించారు. మాహదేవుడనే బౌద్ధభిక్షువు పల్లవబొగ్గ (పలనాడు) లో చాలాకాలం ప్రచారం చేసి, 14లక్షల 60వేల మంది భిక్షువులతో కలిసి సింహళదేశం వెళ్ళాడని మహావంశం అనే బౌద్ధగ్రంధంలో ఉంది. ఇక్ష్వాకుల శాసనాలు శాతవాహనుల శాసనాలవలె అధికంగా ప్రాకృతంలోనే ఉన్నాగాని వాటిలో తెలుగు పదాల వినియోగం హెచ్చింది. సంస్కృతం కూడా చోటు చేసుకోసాగింది. బృహత్పలాయనులు - సా.శ.. 275 ప్రాంతం ఇక్ష్వాకుల రాజ్యము అంతరించిన తరువాత క్రీ. శ. నాలుగవ శతాబ్ది ప్రథమ పాదములో కృష్ణానది ఉత్తర తటప్రాంతమును బృహత్పలాయనులు పాలించారు. కొండముదిలో దొరికిన ప్రాకృత శాసనము ప్రకారము జయవర్మ కూదూరు (కృష్ణా జిల్లా, మచిలీపట్నం తాలూకా లోని గూడూరు) రాజధానిగా పాలించాడు. ఇతని మహాసైన్యాధిపతి భాపహానవర్మ "మహాతలవర", "మహాదండనాయక" అని చెప్పబడ్డాడు. నాగార్జునకొండ వద్ద దొరికిన ఒక ఇక్ష్వాకుల శాసనములో "బహఫల సగోత్తాయ సిరివమ్మ భటాయా" అని ఉంది. ఈమె కుటుంబమువాడే జయవర్మ అయిఉండవచ్చును. జయవర్మ తరువాత బృహత్పలాయన సగోత్రులు ఎవరైనా రాజ్యము చేశారేమో తెలియదు. వీరి రాజ్యము శాలంకాయనుల విజృంభణ వల్ల అంతరించి ఉండవచ్చును. అనందగోత్రికులు సా.శ.. 295 - 620 చేజెర్లలో దొరికిన ఐదవ శతాబ్ది చివరికాలపు సంస్కృత శాసనము ప్రకారము అనంద మహర్షి గోత్రీకుడగు కందరరాజు ధాన్యకటక యుద్ధములో శత్రువులను జయించి త్రికూటపతి అయ్యాడు. ఈతని రాజ్యము కృష్ణానది దక్షిణ తీరము నుండి త్రికూట పర్వతము (కోటప్పకొండ) వరకు వ్యాపించి ఉంది. రాజధాని కందరపురము. ఇది గుంటూరు జిల్లా నర్సారావుపేట వద్దనున్న చేజెర్ల, చేబ్రోలు, కంతేరు లలో ఒకటి కావచ్చును. తరువాతి రాజులు దామోదరవర్మ, హస్తివర్మలు. వీరు వైదికమతాభిమానులైనను బౌద్ధమును ఆదరించారు. బౌద్ధమత క్షీణదశ అప్పటికి ప్రారంభము కాలేదు. వీరికి పల్లవులతో యుద్ధాలు జరిగాయి. చాళుక్యరాజు సత్యాశ్రయ పులకేశి యొక్క సేనాపతి పృథ్వీయువరాజు దండెత్తినపుడు కందారరాజు చేత ఓడిపోయాడు. కాని తరువాతి దండయాత్రలో పులకేశి తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనుడు స్థానిక రాజులందరిని ఓడించి ఆంధ్రదేశాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. తరువాత దక్షిణాంధ్రాన్ని పల్లవులు, కృష్ణామండలం ప్రాంతాన్ని శాలంకాయనులు ఆక్రమించారు. క్రీ. శ. అయిదవ శతాబ్ది చివరకు శాలంకాయనుల ధాటికి వీరి రాజ్యము అంతరించింది. శాలంకాయనులు క్రీ. శ.300 - 420 "శాలంకాయన" అనేది గోత్రనామము. వీరు వేంగి రాజధానిగా గోదావరి, కృష్ణా జిల్లాలను పాలించారు. వీరు ఆనంద గోత్రికులకు ఇంచుమించు సమకాలికులు. వీరికాలంలో వేంగి నగరం గొప్ప విజ్ఞానకేంద్రంగా ఉండేది. వీరు వేంగిలో చిత్రరధస్వామిని ఆరాధించారు. గుంటుపల్లెలోని ఆరామాలకు భూరి విరాళాలిచ్చారు. హస్తివర్మ సా.శ..320లో విజృంభించి వేంగి ప్రాంతంలోని ఇక్ష్వాకులను ఓడించి రాజ్యపాలన ప్రారంభించి ఉండవచ్చును. సముద్ర గుప్తుని దక్షిణదేశ దండయాత్రలగురించి అలహాబాదు ప్రశస్తిలో చెప్పబడిన వైగేయిక హస్తివర్మ ఇతడే. అంతర్యుద్ధాలవల్ల, ఉత్తరాన పిష్ఠపురంలో మాఠరులు, కర్మరాష్ట్రంలో విష్ణుకుండినులు బలవంతులై తరచు యుద్ధాలు చేయడం వలన శాలంకాయనుల రాజ్యం పతనమయ్యింది. ఈ కాలంలో బౌద్ధం భారత దేశంలో క్షీణిస్తూ ఇతర దేశాలలో విస్తరించడం ప్రాంభమైంది. విష్ణుకుండినులు క్రీ. శ. 375-613 శాలంకాయనులతరువాత వేంగీదేశమును విష్ణుకుండినులు క్రీ. శ. 375 నుండి క్రీ. శ. 613వరకు పాలించారు. విష్ణుకుండినుల రాజ్యము తూర్పున విశాఖపట్టణము మొదలుగ పడమట గుంటూరు వరకును, నైరుతిన గోలకొండ వరకు విస్తరించిఉన్నది. సంస్కృత భాషను ఆదరించారు. వైదిక సంస్కృతికి పట్టుకొమ్మలై వేదవిద్యలు పోషించారు. విష్ణుకుండినులు మతసహనము గలవారు. ప్రజలలో అప్పటికి ఆదరణపొందుచుండిన బౌద్ధమతాన్ని ఆదరించారు. గుహాలయములు నిర్మించి గుహాలయ వాస్తువుకు ప్రోత్సాహమిచ్చారు. మొగల్రాజపురము, ఉండవల్లి గుహాలయాలు వీరు నిర్మించినవే. విష్ణుకుండినులు రాగిమలాము చేసిన ఇనుప నాణెములు వాడారు. భారతదేశములో ఇలాంటి నాణెములు తొలుతగా ప్రవేశబెట్టినవారు విష్ణుకుండినులు. విష్ణుకుండినుల రాజధాని "ఇంద్రపురం" ప్రస్తుత నల్గొండ జిల్లా (రామన్నపేట తాలూకా) ఇంద్రపాలగుట్ట కావచ్చునని ఒక అభిప్రాయం. క్రీ. శ. 514 నాటికి గోదావరికి ఉత్తరాన కళింగ రాజ్యం వేరయ్యింది. కృష్ణానది దక్షిణ భాగం పల్లవుల వశమయ్యింది. కృష్ణా గోదావరి మధ్యభాగం విష్ణుకుండినుల పాలనలో ఉంది. పశ్చిమాన ప్రస్తుత తెలంగాణా ప్రాంతం వాకాటకుల పాలనలో ఉంది. ఈ పరిస్థితి 7వ శతాబ్దం వరకు కొనసాగింది. పల్లవులు సాతవాహనాంతరికులలో తక్కిన రాజవంశములలో వైశాల్యమున అధికతరమగు రాజ్యమును దీర్ఘ కాలము పాలించిన వారు పల్లవులు. ఉచ్చదశలో కృష్ణానది ఉత్తరపు ఎల్లగా, కావేరీనది దక్షిణపు సరిహద్దుగా వర్తించాయి. ఆంధ్ర-తమిళ ప్రాంతమునే గాక కర్ణాట ప్రాంతముపై కూడా కొంతకాలము ఆధిపత్యము నిర్వహించారు. పూర్వమధ్య యుగము మహాపల్లవులు 6వ శతాబ్దం చివరి భాగంలో పల్లవుల రాజ్యం తిరిగి బలపడింది. కంచి కేంద్రంగా సింహవిష్ణు నాయకత్వంలో వర్ధిల్లిన ఈ వంశాన్ని అనంతర పల్లవులు లేదా "మహా పల్లవులు" అంటారు. వీరిలో వీరకుర్చుడు మొదటి రాజు. త్రిలోచన పల్లవుడు అందరికంటే ప్రసిద్ధుడు. మంచికల్లు (మాచర్ల వద్ద) లభించిన శాసనం పల్లవుల గురించి తెలిపే మొదటి ఆధారం. క్రీ. శ. 600-630 ప్రాంతంలో సింహవిష్ణు కొడుకైన మహేంద్రవర్మ కృష్ణానది దక్షిణ భాగాన్నంతటినీ జయించాడు. విస్తరణ దశలో ఉన్నరెండు వంశాలైన పల్లవులకూ, చాళుక్యులకూ మధ్య అధిపత్యం కొరకు తీవ్రమైన యుద్ధాలు జరిగాయి. కాని బాదామి చాళుక్యుల రాజ్యాన్ని పశ్చిమాన రాష్ట్రకూటులు అంతం చేయడంతో పల్లవుల రాజ్యం సుస్థిరమయ్యే అవకాశం లభించింది. 9వ శతాబ్దం వరకు పల్లవుల పాలన సాగింది. తరువాత తంజావూరు చోళులు వారిని జయించి కాంచీపురాన్ని ఆక్రమించారు. రేనాటి చో (డు) ళులు రేనాడు అని వ్యవహరింపబడిన (కడప మండలంలోని పులివెందుల, అమలాపురము, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు తాలూకాలు, చిత్తూరు మండలంలోని మదనపల్లె, వాయల్పాడు తాలూకాలు) దేశ విభాగములో తెలుగు భాష శాసనభాషగా పరిణతి చెందింది. క్రీ. శ. ఆరవ శతాబ్దమునుండి తొమ్మిదవ శతాబ్దము వరకు చోళవంశమునకు చెందిన ఒక శాఖ ఈ ప్రాంతములో రాజ్యం చేసి క్రమంగా ఏరువ, పొత్తపి, నెల్లూరు, కొణిదెన, నిడుగల్లు, కందూరు అను ప్రాంతీయ వంశములుగా ఏర్పడ్డారు. చాళుక్యులు వీరు తొలుత విజయపురి ఇక్ష్వాకు రాజులకడ సామంతులుగా వుండి రాయలసీమ ప్రాంతమములోని చాళుక్యవిషయమును పరిపాలించారు.History of the Andhras, G. Durga Prasad, 1988, Page 86; P.G. Publishers, Guntur (http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf ) తూర్పుననున్న పల్లవుల ధాటికి తాళలేక కర్ణాట రాజ్యము ప్రవేశించి కదంబులనోడించి ఒక మహాసామ్రాజ్యసంభూతులైరి. చాళుక్యులకెల్ల మూలమైనది బాదామి రాజవంశము. సా.శ.. 624 సంవత్సరములో పులకేశి వేంగి, కళింగ రాజ్యములు జయించి తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుని వేంగిలో పట్టాభిషిక్తుని గావించి, కమ్మనాడు వైపు మరలి చిరకాలశత్రువులగు పల్లవులను దక్షిణమునకు తరిమివేశాడు. క్రీ. శ. 755లో చాళుక్యసామ్రాజ్యమంతరించువరకు పల్లవులతో ఎడతెగని యుద్ధాలు సాగాయి. ఆంధ్రదేశములో మాత్రము తూర్పు చాళుక్యులపేర క్రీ. శ. 1076 వరకు స్థిరముగా పాలించారు. ప్రధానమైన చాళుక్య రాజ్యాలే కాకుండా ప్రస్తుత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలోని ప్రాంతాన్ని వేములవాడ రాజధానిగా పాలించిన వంశాన్ని వేములవాడ చాళుక్యులు అంటారు. 755-968 మధ్య కాలంలో వీరు రాష్ట్రకూటులకు నామమాత్రపు సామంతులుగా ఉన్నారు. మిగిలిన చాళుక్యులు చంద్రవంశపు రాజులమని చెప్పుకొనేవారు. కాని వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులలాగా తమది సూర్యవంశమని చెప్పుకొన్నారు. రాష్ట్రకూటులు రాష్ట్రకూట వంశము బహు ప్రాచీనమైనది. సా.శ.. 6వ శతాబ్దము నుండియు ఈవంశపు రాజులు దక్షిణ హిందూదేశమున పెక్కుచోట్ల చిన్నచిన్న సంస్థానములు స్థాపించి పాలన చేయుచుండిరి. వీరు తొలుత చాళుక్యులకు సామంతులు. ఇప్పటి మహారాష్ట్ర లోని ఎల్లోరా ప్రాంతమునేలుచున్న దంతిదుర్గుడు బాదామి చాళుక్యుల కడపటి రాజు రెండవ కీర్తివర్మను కూలద్రోసి రాజ్యము చేశాడు. ఇతనిని దంతివర్మ అని కూడా అంటారు. అద్వితీయ బల పరాక్రమ సంపన్నుడు. ఖడ్గావలోక, వైరమేఘ అను బిరుదులున్నాయి. సా.శ.. 758లో యుద్ధములో మరణించాడు. రాజ్యము చేసిన కొద్దికాలములోనే కాంచీ, కళింగ, కోసల, శ్రీశైల, మాళవ, లాట, టంక, సింధుదేశములను జయించాడు. ఇతనికి వేములవాడ చాళుక్య వంశమునకు మూలపురుషుడైన వినయాదిత్య యుద్ధమల్లుడు తోడ్పడ్డాడు. పూర్వ చాళుక్యులు తూర్పుచాళుక్యులు వేంగి రాజధానిగా 7వ శతాబ్దములో తీరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజవంశము. ప్రసిద్ధి గాంచిన బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి (సా.శ..608–644) తూర్పు దక్కన్ ప్రదేశాన్ని (ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలను) సా.శ.. 616 సంవత్సరంలో, విష్ణుకుండినులను ఓడించి, తన అధీనంలోకి తీసుకొన్నాడు. రెండవ పులకేశి సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడు అక్కడ తన అన్న అనుమతితో స్వతంత్ర రాజ్యం ఆరంభించాడు. క్రమంగా సంపదలు, సైనిక సంపత్తి ఏర్పరచుకొని వేంగి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చెయ్యగలిగారు. తరువాతి కాలంలో కుటుంబ కలహాల వల్ల,, పొరుగు రాజ్యాలతో - ముఖ్యంగా రాష్ట్రకూటులు, కళింగులతోను తరువాత చోళులతోను యుద్ధాలవల్ల వేంగి రాజ్యం క్రమంగా క్షీణించింది. తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి తొలిపలుకులు పలికారు. తొమ్మిదో శతాబ్దం రెండవ అర్థభాగంలో రెండవ విజయాదిత్యుని పరిపాలనాకాలంలో తెలుగులో కవిత్వం ప్రారంభం అయిందని అద్దంకి, కందుకూరులలో నున్న పాండురంగ శిలాశాసనాలు చెబుతున్నాయి. 11వ శతాబ్దంలో కవిత్రయంలో మొదటి వాడైన నన్నయ్య మహాభారతాన్ని తెనిగించడం ప్రాంరంభించాడు. ఇది తెలుగు సాహితీ రంగంలో ఒక సువర్ణ ఘట్టం. శైవం బాగా ప్రబలి ఉన్న రోజులు కావడంచేత తూర్పు చాళుక్యులు ఎక్కువగా శివాలయాలు నిర్మించారు. పూర్వ గాంగులు వేంగిలో తూర్పు చాళుక్యుల రాజ్యానికి సమాంతరంగా ఈశాన్యాన తూర్పు (పూర్వ) గాంగులు, దక్షిణాన పల్లవులు పరిపాలించారు. పూర్వ గాంగులు 5వ శతాబ్దం చివరలో ఒడిషా ప్రాంతంలో పాలకులుగా ఉన్నారు. ఆధారాలు లభించినంత వరకు ఆంధ్ర ప్రాంతపు మొదటి రాజు అనబడుతున్న ఇంద్రవర్మ (6వ శతాబ్దం) రాజధాని "దంతిపురం". తరువాత రాజధానిని కళింగ నగరం (శ్రీకాకుళం వద్దనున్న ముఖలింగం) కు మార్చబడింది. సుమారు 5 వందల సంవత్సరాలు గాంగుల పాలన ఈ ప్రాంతంలో సాగింది. తరువాత 11వ శతాబ్దం చివరిలో వారి రాజ్యానికి ఒడిషాలోని కటక్ ప్రధాన కేంద్రమయ్యింది. చాళుక్య చోళులు 1వ రాజరాజ చోళుని (క్రీ. శ. 985 - 1016) నాయకత్వంలో దక్షిణాన చోళులు బలవంతమైన పాలకులయ్యారు. తూర్పు చాళుక్యుల అంతఃకలహాల కారణంగా శక్తివర్మ అనే రాజు వేంగి సింహాసనం సాధించడానికి రాజరాజచోళుని సహాయం అర్ధించాడు. ఇది అవకాశంగా రాజరాజు వేంగిని జయించి శక్తివర్మను వేంగికి పాలకుడిగా చేశాడు. తరువాత చోళులకు, కళ్యాణీ చాళుక్యులకు వేంగి రాజ్యం యుద్ధరంగమయ్యింది. వేంగి చాళుక్యులతో చోళులు వివాహ సంబంధాలు ఏర్పరచుకొన్నాక వారిని చాళుక్యచోళులు అని వ్యవహరిస్తున్నారు. చాళుక్య చోళ రాజు రాజేంద్రుడు క్రీ. శ. 1070లో 1వ కులోత్తుంగ చోళునిగా చోళసింహాసనం అధిష్టించాడు. క్రీ. శ. 1076వరకు వేంగిలో చాళుక్యచోళుల పాలన (చోళుల రక్షణ, అధీనంలో) సాగింది. కాకతీయులు కాకతీయ వంశము ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతమును క్రీ. శ. 1083 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము[1]. క్రీ. శ. 9వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని, జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులోక్కరే. కాకతీయుల కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారంపొందాయి. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదం ధరించారు. వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్). కాకతీయ సామ్రాజ్యంలో మూడు ముఖ్యమైన ఘట్టాలున్నాయి క్రీ. శ. 1000 - 1158 - తెలంగాణ విమోచన: ఈ దశలో నలుగురు రాజులు పాలించారు - కాకర్త్య గుండన, మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు, రెండవ ప్రోలరాజు - ఈ సమయంలో తెలంగాణ ప్రాంతం కాకతీయుల వశమయ్యింది. తెలుగునాట పశ్చిమ చాళుక్యుల పాలన అంతమయ్యింది. ముఖ్యంగా రెండవ ప్రోలరాజు పెద్ద రాజ్యాలకు ప్రతినిధులైన నలుగురు సామంతులను ఓడించి ఈ నిజయం సాధించాడు. అంతకు ముందు తీరాంధ్రంలో మాత్రమే స్వతంత్ర రాజ్యాలున్నాయి. కన్నడ ప్రాంతపు చాళుక్యులు, మహారాష్ట్ర నుండి రాష్ట్రకూటులు తీరాంధ్రంపై జరిగిన దండయాత్రలకు తెలంగాణా మార్గంగానే ఉంది. కనుక తెలంగాణ ప్రాంతంలో ఆర్థిక, సాంస్కృతిక ప్రగతి కుంటువడి స్తబ్దంగా మారింది. ప్రజలలో పుట్టి కష్ట సుఖాలెరిగిన కాకతీయులు సాధించిన స్వతంత్రతతో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం, సాహిత్యం, వ్యాపారం ఒక్కమారుగా ఊపందుకొన్నాయి. ఇప్పటికీ కాకతీయులు త్రవ్వించిన చెరువులే చాలా మండలాలలో ముఖ్యనీటివనరులు. క్రీ. శ. 1159 - 1261 తీరాంధ్రంలో విజయం : ఈ దశలో కాకతీయులు ఉత్తరాన గంజాం నుండి దక్షిణాన కంచి వరకు జయించారు. రాయలసీమ, తెలంగాణ, తీరాంధ్ర ప్రాంతాలు ఒక పాలనలోకి వచ్చాయి. ఈ దశలో ముగ్గురు పాలకులున్నారు. వారిలో గణపతి దేవుడు ప్రసిద్ధుడు. ఈ కాలంలో అన్ని ప్రాంతాల వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరిగాయి. కాని కులాల మధ్య విద్వేషాలు ఈ కాలంలో పెరగ సాగాయి. క్రీ. శ. 1262 - 1323 సామ్రాజ్య పతనం: ఈ సమయంలో రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు పాలించారు. ఇద్దరూ సమర్ధులైన ప్రభువులు, యుద్ధ కోవిదులు, కాని ఉప్పెనలా ముంచుకొచ్చిన ఉత్తర దేశపు దండయాత్రల కారణంగా కాకతీయ సామ్రాజ్య పతనాన్ని ఆపలేకపోయారు. వివిధ కులాల మధ్య కలహాలు ఈ పతనానికి మరింత తోడ్పడ్డాయి. అర్వాచీన గాంగులు 12వ శతాబ్దంలో అంతటా గందరగోళం నెలకొంది. కళ్యాణి చాళుక్యులు తూర్పు చాళుక్యులను జయించారు. 17 సంవత్సరాల తరువాత కళ్యాణి చాళుక్యులను చోళులు, వారి స్థానిక మిత్రులు కలిసి జయించారు. చందవోలు (గుంటూరు) ప్రాంతాన్ని చోళుల సామంతులు అయిన వెలనాటి చోళులు పాలించారు. క్రీ. శ. 1135-1206 కాలంలో వెలనాటి చోళుల నామమాత్రపు అధిపత్యంలో ఆంధ్రదేశాన్ని అనేక చిన్నచిన్న రాజకుటుంబాలు పాలించాయి. రాజకీయ, సాంఘిక కారణాల వల్ల వారి మధ్య జరిగిన ఘోరమైన యుద్ధమే పల్నాటి యుద్ధం. ఉత్తరమధ్య యుగం ఇక్ష్వాకులు, ఛాగి, పరిచ్చేదులు, విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు, కోటవంశస్తులు, కాకతీయులు పతనానంతరం వారి వద్ద సేనానులుగా పనిచేసిన కమ్మ, రెడ్డి, వెలమ కులస్తులు స్వతంత్ర రాజ్యాలు స్థాపించుకున్నారు. ముసునూరి నాయకులు ప్రతాపరుద్రుని పరాజయము తరువాత ఆంధ్రదేశము అల్లకల్లోలమైనది. తురుష్కుల ఆగడాలు చెప్పనలవి గానివి. ప్రోలయనాయకుని విలస తామ్ర శాసనములో ఆనాటి తెలుగు వారి దయనీయ స్థితి వర్ణించబడింది. విషమ పరిస్థితులలో బెండపూడి అన్నయ మంత్రి, కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన తెలుగు నాయకులను ఐక్యపరచి వారికి నాయకునిగా కమ్మ ముసునూరి ప్రోలానీడు అను మహాయోధుని ఎన్నుకొన్నారు. ప్రోలానీడు ఓరుగల్లు విముక్తి గావించుటకు పలు వ్యూహములల్లాడు. పెక్కు యుద్ధముల పిదప క్రీ. శ. 1324 లో తురుష్కులను దక్షిణభారతము నుండి తరిమివేయుటలో ముసునూరి నాయకులు సఫలమయ్యారు. ప్రోలయ నాయకుని మరణానంతరం క్రీ. శ. 1333లో కమ్మ కాపయ నాయకుడు మళ్ళీ ఓరుగల్లు రాజయ్యాడు. హిందూమతము రక్షించబడింది. దేవాలయములు పునరుద్ధరించబడ్డాయి. బ్రాహ్మణులకు అగ్రహారములీయబడెను. అనితల్లి కలువచేరు శాసనములో ప్రోలానీడి వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడబడ్డాయి. ఓఢ్ర గజపతులు, రేచెర్ల వెలమలు, కొండవీటి రాజ్యము, రాజమహేంద్రవర రాజ్యము ఇవన్నీ దాదాపు ఆంధ్ర దేశపు వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో నడచిన రాజ్యాలు. ముసునూరు కమ్మ నాయకులను తొలగించి రేచెర్ల నాయకులు రాజులయ్యారు. క్రీ. శ. 1325 నుండి 1474 వరకు తెలంగాణా వారి అధీనంలో ఉంది. రాజధాని రాచకొండ. తీరాంధ్ర దేశం క్రీ. శ. 1325 - 1424 మధ్య కాలంలో కొండవీటి రెడ్ల పాలనలో ఉంది. మొదట వారి రాజధాని అద్దంకి. తరువాత కొండవీటికి మార్చబడింది. అదే సమయంలో రాజమండ్రి ప్రాంతం ఇతర రెడ్ల పాలనలోకి వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రాంతం గజపతుల అధీనంలో ఉంది. ఒడిషా కటక్‌నుండి పాలిస్తున్న గజపతులు క్రీ. శ. 1448లో రాజమండ్రి రెడ్లను జయించారు. కాని క్రమంగా అన్ని ప్రాంతాలు విజయనగర రాజుల అధీనంలోకి వెళ్ళాయి. కొండవీటి రెడ్ల కాలంలోని ముఖ్య కవులు శ్రీనాధుడు, ఎర్రా ప్రగడ. బహమనీ రాజ్యము క్రీ. శ. 1323లో ఓరుగల్లు పతనానంతరం ఆంధ్రులు మొట్టమొదటి సారిగా ముస్లిముల పాలనలోకి వచ్చారు. క్రీ. శ. 1347లో ఢిల్లీ సుల్తానుల నుండి ముసునూరి కమ్మ నాయకుల సహాయంతో స్వాతంత్ర్యం ప్రకటించుకొని అల్లావుద్దీన్ హసన్ గంగు బహమనీ రాజ్యం స్థాపించాడు. క్రీ. శ. 1347 నుండి దాదాపు క్రీ. శ. 1425 వరకు బహమనీల రాజధాని ఎహసానాబాద్‌ (గుల్బర్గా). ఆ తరువాత రాజధానిని మహమ్మదాబాద్‌ (బీదర్‌) కు తరలించారు. బహమనీలు దక్కన్‌ మీద ఆధిపత్యానికై దక్షిణాన ఉన్న హిందూ విజయనగర సామ్రాజ్యముతో పోటీ పడేవారు. ఈ సల్తనత్ యొక్క అధికారము మహమూద్‌ గవాన్ యొక్క వజీరియతులో (క్రీ. శ. 1466–1481) ఉచ్ఛస్థాయి చేరుకొన్నది. క్రీ. శ. 1518 తర్వాత అంతఃకలహాల వలన బహమనీ సామ్రాజ్యము ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విచ్ఛిన్నమైనది. ఆ ఐదు రాజ్యములు అహ్మద్‌నగర్ (నిజాం షాహి), బీరార్ (ఇమాద్ షాహి), బీదర్ (బారిద్ షాహి), బీజాపూర్ (అహమ్మద్ షాహి),, గోలకొండ (కుతుబ్ షాహి) - ఇవి దక్కన్‌ సుల్తనత్ లుగా పేరు పొందాయి. వీటిలో కుతుబ్ షాహి వంశం ఆంధ్రుల చరిత్రలో ముఖ్యమైన ప్రభావం కలిగి ఉంది. విజయనగర సామ్రాజ్యము విజయనగర సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావనియెల్లా తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము. విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర (హక్క), బుక్క అనే అన్నదమ్ములు ముసునూరి కమ్మ నాయకుల విప్లవ పోరాటాల స్ఫూర్తితో క్రీ. శ. 1336 లో స్ధాపించారు. వారి రాజధాని మొదట ఆనెగొంది. ఆనెగొంది ప్రస్తుతము తుంగభద్ర ఉత్తర తీరమున ఒక చిన్న పల్లె. సామ్రాజ్యము బుక్కరాయని పరిపాలనలో అభివృద్ధి చెందిన తరువాత రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరమున గల విజయనగరము నకు తరలించారు. తరువాత రెండు శతాబ్దాలలో, విజయనగర సామ్రాజ్యము యొక్క ఆధిపత్యము దక్షిణ భారత దేశమంతటా ప్రకాశించింది. యావద్భారత ఉపఖండములోనే విజయనగరము బలీయమైన రాజ్యంగా వెలిసింది. ఈ కాలంలో గంగా మైదానం నుండి వచ్చిన టర్కీ సుల్తానుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. దక్కను లోని ఐదుగురు సుల్తానుల నుండి నిరంతరంగా ఘర్షణలను ఎదుర్కొంది. ఒక బలీయమైన శక్తిగా నిలబడింది. శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ సామ్రాజ్యం ఉచ్ఛస్థితికి చేరింది. కళింగుల అధీనంలో గల ప్రాంతాలను, తమిళదేశమును వశపరచుకున్నాడు. సామ్రాజ్యపు గొప్ప గొప్ప నిర్మాణాలు ఆయన తోటే మొదలయ్యాయి. విజయనగరం లోని హజార రామాలయం, కృష్ణ దేవాలయం, ఉగ్ర నరసింహ మూర్తి విగ్రహం వీటిలో కొన్ని. క్రీ. శ. 1530 లో అచ్యుతరాయలు ఆయనకు వారసుడయ్యాడు. క్రీ. శ. 1542 లో రామరాయలు గద్దెనెక్కాడు. ఇతడు దక్కను సుల్తానులను అనవసరంగా రెచ్చగొట్టి వారి శత్రుత్వం కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. క్రీ. శ. 1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర సైన్యాన్ని సుల్తానుల సమాఖ్య చిత్తుగా ఓడించారు. రాజధానిని ఆరు నెలలబాటు కొల్లగొట్టి, నేలమట్టం చేశారు. ఈ సామ్రాజ్యపు స్థాపన వివరాలూ, దాని చరిత్రలో ఎక్కువ భాగం అస్పష్టంగా ఉన్నాయి; కానీ దాని శక్తీ, ఆర్థిక పుష్టి లను పోర్చుగీసు యాత్రికులైన డోమింగో పేస్‌, నూనిజ్‌ వంటి వారే కాక మరి కొందరు కూడా నిర్ధారించారు. విద్యా, సాంస్కృతిక పరంగా విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంగా పరిగణిస్తారు. ఆధునిక యుగం అరవీటి వంశం గోలకొండ రాజ్యం నిజాము రాజ్యం బ్రిటిషు రాజ్యం స్వాతంత్ర్యోద్యమం ఆంధ్రోద్యమములు మధ్య యుగంలో కాకతీయులు, ముసునూరి కమ్మ నాయకులు, విజయనగర రాజులు, చోళులు, చాళుక్యులు, రెడ్డి రాజులు, కుతుబ్ షాహీలు మొదలైన అనేక వంశాల పాలనలో ఉంటూ వచ్చిన ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌ 19 వ శతాబ్దం ఆరంభం నాటికి కొంత భాగం బ్రిటిషు వారి పాలనలోను, కొంత నిజాము నవాబు ఏలుబడిలోను ఉంది. సర్కారులు గాను, రాయలసీమ గాను, హైదరాబాదు (నైజాం) గాను విడిపోయి ఉన్న ఈ ప్రాంతాలను కలిపే మూలసూత్రం - వీరి మాతృభాష అయిన తెలుగు. ఒకే రాష్ట్రంగా ఏర్పడాలన్న ఆకాంక్ష అన్ని ప్రాంతాల ప్రజలలోను బలంగా ఉండేది. బ్రిటిషు పరిపాలనా కాలంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా, బ్రిటిషు వారి అధికారంలో ఉండేవి. మద్రాసు ప్రెసిడెన్సీలో ఈ జిల్లాలు ఉండేవి. - శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు. మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభా లోను, విస్తీర్ణం లోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్పటికీ, పరిపాలన లోను, ఆర్థిక వ్యవస్థ లోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్థికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు. 1912లో ఆధికారికంగా ప్రత్యేక రాష్ట్ర పోరాటం మొదలయింది. ఉద్యమానికి టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి వంటి నాయకులు సారథ్యం వహించారు. 40 సంవత్సరాల పోరాటం, రెండు సుదీర్ఘ నిరాహార దీక్షలు, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం, విధ్వంసానికి దారితీసిన ప్రజల కోపం తరువాత 1952 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది. హైదరాబాదు సంస్థానం కథ వేరుగా ఉండేది. నిజాము ఏలుబడిలో ఉన్న ప్రజలు, స్వాతంత్ర్యం తరువాత ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము ఆలోచనకు వ్యతిరేకంగాను, నిజాము యొక్క రజాకార్ల దౌష్ట్యాన్ని ఎదిరించేందుకు గాను నడుం కట్టారు. నిజాము పాలన నుండి బయటపడి భారత దేశంలో విలీనం కావాలన్నదే అప్పటి వీరి ప్రధాన లక్ష్యం. 1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాదు నిజాము పాలన నుండి విముక్తి కాలేదు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము, తన ఆలోచనకు తగినట్లుగా ప్రయత్నాలు చేసాడు. ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా మండలికి సమస్యను నివేదించడం, సైన్యం, ఆయుధాల సమీకరణ వంటి ప్రయత్నాలు వీటిలో కొన్ని. దీనికి తోడు రజాకార్ల హింస పెచ్చుమీరడంతో, హైదరాబాదు ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటం జరిపారు. పరిస్థితి విషమిస్తున్న దశలో భారత ప్రభుత్వం 1948 సెప్టెంబరు 13 న పోలీసు చర్యకు దిగింది. భారత సైన్యం హైదరాబాదును ముట్టడించి, నిజామును ఓడించింది. 5 రోజుల్లో ముగిసిన పోలీసు చర్యతో సెప్టెంబరు 18 న హైదరాబాదు సంస్థానం భారత దేశంలో విలీనమయింది. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1950 జనవరిలో ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రి అయ్యాడు. నిజామును రాజ్‌ ప్రముఖ్‌గా ప్రకటించారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది. విశాలాంధ్ర, ఏకీకృత ఆంధ్రప్రదేశ్ 1953 డిసెంబరు‌లో సయ్యద్‌ ఫజల్‌ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషను ఏర్పాటయింది. విశాలాంధ్ర ఏర్పాటు లోని ప్రయోజనాలను అది గుర్తించినా, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్థించింది. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, హైదరాబాదు శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్రను సమర్ధించారు. కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్థించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. ఆ విధంగా వారిమధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరి, 1956 నవంబరు 1 న ఆధికారికంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 2009, నవంబరు 29: ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష మొదలైంది. 2009, డిసెంబరు 9: భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. దానితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష విరమించాడు. 2011, మార్చి 10: ప్రత్యేక తెలంగాణకై ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చి ఉద్యమం నిర్వహించబడింది. 2013, జూలై 30: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది. 2013, అక్టోబరు 3: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2013, డిసెంబరు 5: తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లును కేంద్రకేబినెట్ ఆమోదించింది. 2014, జనవరి 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2014, ఫిబ్రవరి 13: తెలంగాణ ఏర్పాటు (ఆంధ్రప్రదేశ్ విభజన) బిల్లు లోకసభలో ప్రవేశపెట్టబడింది. 2014, ఫిబ్రవరి 18: లోకసభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించింది. 2014, ఫిబ్రవరి 20: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. 2014, మార్చి 1: తెలంగాణ ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. 2014, మార్చి 4: ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ 2014 జూన్ 2 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. చివరకు అప్పటి కేంద్రం ప్రభుత్వం (UPA) తెలంగాణా ప్రాంతాన్ని విడదీసి నవ్యాంధ్రప్రదేశ్ ను పది సంవత్సరాలు హైదరాబాద్ ను తెలంగాణాతో పాటు ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసింది.2014 సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలంగాణాలో తెలంగాణారాష్ట్రసమితి (TRS) పార్టీకి చెందిన కల్వకుంట్లచంద్రశేఖర రావు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అలాగే నవ్యాంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. వారిద్దరూ తెలుగు రాష్ట్రాలకు తొలి ముఖ్యమంత్రులు అయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా హైదరాబాదులోనే ఉంటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని భావించిన చంద్రబాబు రాష్ట్ర రాజధానిని నవ్యాంధ్రప్రదేశ్ కు మార్చారు. ఆంధ్రప్రదేశ్ అంతటా అన్వేషించి చివరకు అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. నిర్ణయించిన తరువాత త్వరితగతిన నిర్మాణాలు ప్రారంభించి సంవత్సర కాలంలోనే అసెంబ్లీని అమరావతిలో ప్రారంభించారు. అలాగే అన్ని రకాల భవనాలకు మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు. ప్రజల అనుమతితో 30 వేల ఎకరాలను రాజధాని నిర్మాణానికి తీసుకున్నారు. 2015 అక్టోబర్ 22న అమరావతి శంకుస్థాపన జరిగింది అప్పటి ప్రధానమంత్రి నరేంద్రమోడి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వంటి ఎందరో మహామవుల ఆధ్వర్యంలో ఈ ఘట్టం ముగిసింది. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అమరావతి మహానగరాన్ని నవ నగరాలుగా నిర్మించ తలపెట్టారు. 2017 మార్చి 2 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు కేంద్రంగా జరగడం ప్రారంభించాయీ. 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి కేంద్రంగా పని చేయడం ప్రారంభించింది. ఇది అమరావతి ప్రాంతంలో నేలపాడు గ్రామానికి దగ్గరలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తొలి ఐదు సంవత్సరాలు E. s. l నరసింహంన్ తెలంగాణకు అలాగే నవ్యాంధ్రప్రదేశ్ కు గవర్నర్గా వ్యవహరించారు. 2019 జరిగిన ఎన్నకలలో వైఎ్సార్సీపీకి 151ఎమ్మెల్యేతో శ్రీ యడగురి సందింటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమత్రి అవ్వడం జరిగింది మంచి పాలనతో అనేక సంచేమా పథకాలతో మంచి పాలన అందిస్తున్నారు రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు వేర్వేరు గవర్నర్లను నియమించింది.తెలంగాణకు తమిళనాడు బీజేపీ నేత తమిళి సై సౌందరరాజను అలాగే నవ్యాంధ్రప్రదేశ్ కు ఒడిశాకు చెందిన బీజేపీ నేత బిశ్వభూషణ్ హరిచందన్ నియమించింది. 2019 జూలై 23 న విజయవాడ కేంద్రంగా బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్గా రాజ్ భవన్ పనిచేయడం ప్రారంభించింది. మునుపటి సీఎం క్యాంపు కార్యాలయాన్ని అన్ని హంగులతో రాజభవన్ గా అధికారులు రూపొందించారు. కాలరేఖ సాహిత్యంలో పొగడ్తలు బయటి లింకులు విజ్ఞాన సర్వస్వము, మొదటి సంపుటము, దేశము-చరిత్ర, 1983, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు. ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ Sir V Ramesam (retired Judge of Madras High Court) - Andra Chronology (90-1800 A.C.) Published 1946 - Dr. M. Rama Rao - Select Andhra Temples - Published by Govt. of Andhra Pradesh - చిలుకూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్ర - మూడవ భాగము - ఇతిహాస తరంగిణీ గ్రంథమాల ప్రచురణ - 1916 - మల్లంపల్లి సోమశేఖర శర్మ - అమరావతీ స్తూపము - ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - బౌద్ధము-ఆంధ్రము - కొలనుపాక పురావస్తు ప్రదర్శనశాల - Dr.K Gopalachari - Early_History_Of_The_Andhra_Country - Madras University Doctorate Thesis - 1946 - ఆదిరాజు వీరభద్రరావు - ప్రాచీనాంధ్ర నగరములు - మొదటి భాగము - ఆంధ్రచంద్రికా గ్రంథమాల ప్రచురణ - 1950 - ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - ప్రభుత్వ వెబ్ సైట్ 1 2 3 4 మూలాలు వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:చరిత్ర వర్గం:ఈ వారం వ్యాసాలు
కాకతీయులు
https://te.wikipedia.org/wiki/కాకతీయులు
కాకతీయులు క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు నేటి తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన రాజవంశము.Gribble, J.D.B., History of the Deccan, 1896, Luzac and Co., London క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఘనమైన పరిపాలనను అందించారు.కాకతీయులు; Sastry, P.V. Parabrahma, The Kakatiyas of Warangal, 1978, Government of Andhra Pradesh, Hyderabad శాతవాహనుల అనంతరం తెలుగు జాతిని సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే.Durga Prasad G, History of the Andhras up to 1565 A. D., 1988, P. G. Publishers, Guntur కాకతీయులు దుర్జయ వంశస్థులుగా కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.తెలంగాణ సమగ్ర చరిత్ర, 2016, తెలుఁగు అకాడమీ ముద్రణ ప్రస్తుత తెలంగాణ అనే పదం కాకతీయుల కాలంలో త్రిలింగ అని, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందింది.ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్లు). పూర్వ రంగం నేటి తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల రాజ్యానికి అంకురార్పణ జరుగుతున్నపుడు తీరాంధ్రంలో వేంగి, చాళుక్య, చోళుల 'ప్రభావం' క్షీణదశలో ఉంది. ప్రారంభంలో తూర్పు చాళుక్యులు పశ్చిమ (బాదామి) చాళుక్యులకు సోదర సమానులు. కాని క్రమంగా దక్షిణాపథం నుండి విస్తరిస్తున్న చోళులు తీరాంధ్రాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి తూర్పు చాళుక్యులతో సంబంధాలు కలుపుకొన్నారు. ఆలా క్రీ. శ. 1076నుండి తీరాంధ్రంలో చాళుక్య చోళ యుగం ప్రారంభమై క్రీ. శ. 1200 వరకు సాగింది. వారికి, సత్యదేవుని నాయకత్వంలోని పశ్చిమ చాళుక్యులకు తరచు యుద్ధాలు జరిగాయి. దక్షిణ తీరాంధ్రంలో 11, 12 శతాబ్దాలలో వెలనాటి చోడులు, గుంటూరు జిల్లా ప్రాంతంలో చోళులకు సామంతులుగా ఉంటూ పశ్చిమ చాళుక్యులను ఎదుర్కొన్నారు. క్రీ. శ. 1135లో వేంగిలో జరిగిన యుద్ధంలో గొంకయ అనే వెలనాటి చోళ నాయకుని సైన్యం చేత పశ్చిమ చాళుక్యులు తీవ్రంగా పరాజితులై ఆంధ్ర ప్రాంతంనుండి పూర్తిగా వైదొలగారు. తరువాత వెలనాటి చోళులు దక్షిణ తీరాంధ్రంలో దాదాపు స్వతంత్రులుగా పాలించారు. తరువాత ఈ ప్రాంతాన్ని అంచెలంచెలుగా కొణిదెన చోళులు, నెల్లూరు చోడులు పాలించారు. కడప ప్రాంతాన్ని రేనాటి చోళులు, కోనసీమను హైహయ రాజులు, నిడదవోలును వేంగి చాళుక్య చోళులు, కొల్లేరు ప్రాంతాన్ని తెలుగు నాయకులు, విజయవాడను చాగివారు,, ధరణికోటను కోటవారు, కొండవీడు వెలనాటి దుర్జయ చోడులు, పల్నాటిని హైహయ వంశపు రాజులు పాలిస్తుండేవారు. ఈ చిన్న చిన్న రాజ్యాల మధ్య తగాదాలు వైషమ్యాలు సర్వ సాధారణం. క్రీ. శ. 1176-1182 మధ్యకాలంలో కారంపూడి వద్ద జరిగిన పల్నాటి యుద్ధం అప్పటి మత సంప్రదాయాల మధ్య (శైవులు, వైష్ణవులు), కులాల మధ్య, జ్ఞాతుల మధ్య (నలగామరాజు, మలిదేవరాజు) జరిగిన పెద్ద పోరు. దాదాపు అందరు రాజులూ ఈ యుద్ధంలో ఏదో ఒక పక్షంలో పాలు పంచుకొన్నారు. ఇందులో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల తీరాంధ్ర రాజ్యాలన్నీ శక్తిహీనములయ్యాయి. సమాజం కకావికలయ్యింది. బలం కలిగిన పాలకులు లేకపోతే జరిగే కష్టం ప్రజలకు అవగతమయ్యింది. అరాచకాన్ని అంతం చేసే ప్రభువులకు అది అదనైన సమయం. ఈ పరిస్థితిలో ఓరుగల్లు కాకతీయులకు రాజులందరినీ ఓడించడం అంత కష్టం కాలేదు. ఆంధ్ర దేశాన్ని తమ పాలనలో ఐక్యం చేసే అవకాశం వారికి లభించింది. ప్రస్తుత తెలంగాణా ప్రాంతం ఆ సమయంలో స్వతంత్ర రాజుల పాలనలో లేదు. కొన్ని భాగాలు పశ్చిమ చాళుక్యుల అధీనంలోను, కొన్ని భాగాలు రాష్ట్రకూటుల అధీనంలోను, కొన్ని భాగాలు వేంగి చాళుక్యుల అధీనంలోను ఉన్న సామంతరాజుల పాలనలో ఉండేవి. ముఖ్యంగా వేంగి చాళుక్యులకు, రాష్ట్రకూటులకు మధ్య ఎడ తెరపి లేకుండా అనేక యుద్ధాలు జరిగాయి. తెలంగాణాలోని వివిధ ప్రాంతాలు పాలకుల మధ్యలో చేతులు మారుతుండేవి. ఇలా దాదాపు ఐదు వందల యేండ్లు తెలంగాణలో స్వతంత్ర రాజ్యం లేనందున అక్కడ ఆర్థిక, సాంస్కృతిక ప్రగతి కుంటువడింది. క్రీ. శ. 950 - 1100 మధ్య కాలంలో కాకతీయుల పూర్వీకులు రాష్ట్రకూటులకు, లేదా పశ్చిమ చాళుక్యులకు లేదా తూర్పు చాళుక్యులకు (దశలను బట్టి) సామంతులుగా, ఉద్యోగులుగా ఉండేవారు. క్రీ. శ. 934-945 మధ్య నందిగామ, ముక్త్యాల, మాంగల్లు, మధిర, మానుకోటలను పాలించిన కాకత్య గుండన రాష్ట్రకూటులకు వంశం అని హైహయ దుర్జయ వంశం అని శాసనాలు దొరికాయి. రాష్ట్రకూటులకు, వేంగి రాజులకు మధ్య జరిగిన యుద్ధాలలో ప్రశంసనీయమైన పాత్ర వహించి, తన ప్రభువు ప్రోత్సాహంతో రాజ్యాన్ని ఏర్పరచుకొన్నాడు. అతని వంశస్థులు ప్రోలరాజు, బేతరాజు, రెండవ ప్రోలరాజు క్రమంగా తెలంగాణా ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల పాలనను అంతమొందించ గలిగారు. తరువాత కాకతీయుల పాలన తెలంగాణ ప్రాంతానికి విస్తరించింది విస్తరించింది. రాష్ట్రకూటులకు, వేంగి రాజులకు మధ్య జరిగిన యుద్ధాలలో ప్రశంసనీయమైన పాత్ర వహించి, తన ప్రభువు ప్రోత్సాహంతో రాజ్యాన్ని ఏర్పరచుకొన్నాడు. అతని వంశస్థులు ప్రోలరాజు, బేతరాజు, రెండవ ప్రోలరాజు క్రమంగా తెలంగాణా ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల పాలనను అంతమొందించ గలిగారు. తరువాత కాకతీయుల పాలన తెలంగాణ ప్రాంతానికి విస్తరించింది విస్తరించింది. కాకతీయుల పుట్టుపూర్వోత్తరాలు శాసనాధారాలను బట్టి కాకతీయుల కులదేవత ‘కాకతి’ అనీ, మొదట వారు కాకతి ఆరాధకులు కాబట్టి కాకతీయులయ్యారనీ, ఆ తర్వాత స్వయంభూదేవుని ఆరాధకులయ్యారనీ చారిత్రక సమాచారం ఉంది. కాజీపేట శాసనాన్ని బట్టి వీరు గుమ్మడమ్మ సంప్రదాయానికి (తీగకు) చెందిన వారని తెలుస్తోంది. జైన దేవత గుమ్మడమ్మ (కుషాండిని) కి మరోపేరు కాకతి. ఈమె జీవుల్ని అనారోగ్యం నుండి కాపాడే జైన ఆరోగ్య దేవత. కాకతీయులు తమను తాము ‘దుర్జయుల’మని చెప్పుకున్నారు. అంటే హైహయ వంశం వారు అని అర్థం. కాకలు తీరిన వీరులుగా వీరు కాకతిని యుద్ధదేవతగా కొలిచారు. ‘కాకతికి సైదోడు ఏకవీర’ అనే నానుడి ఆ రోజుల్లో ప్రచారంలో ఉంది. ఏకవీరాదేవి ఆలయం ఓరుగల్లు సమీపంలోని మొగిలిచర్లలో ఉంది. కొన్ని శాసనాల్లో ‘కాకతి’ వీరి కులపురమని చెప్పబడింది. అయితే, ఆ గ్రామం లేదా పట్టణం ఎక్కడ ఉందో గుర్తించటం ఇప్పుడు కష్టంగా ఉంది. "కాకతీయుల కులము" గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయమున్నవి. కొన్ని శాసనాల్లో సూర్యవంశ క్షత్రియులని, మరి కొన్ని పుస్తకాల్లో తెలుగు నాయక వంశాల మాదిరి "దుర్జయ వంశము"వారని చెప్పబడ్డారు. హైహయ వంశం దుర్జయులే కాకతీయ రాజుల శాసనాలలో వీరు అని, కొమ్మజనులు అని వర్ణించబడింది. గుంటూరు తాలూకా మల్కాపురంలో కూలిపోయిన ఒక గుడియొద్ద ఉన్న నంది విగ్రహం మీద చెక్కిన శిలాశాసనం 395 (A. R. No. 94 of 1917.) కాకతీయులు సూర్యవంశపు క్షత్రియులని తెలుపుచున్నది.Journal of the Andhra Historical Research Society, Vol. IV, pp. 147-64. కర్నూలు జిల్లా త్రిపురాంతకంలో ఉన్న త్రిపురాంతకేశ్వర ఆలయంలో చెక్కబడిన శిలాశాసనం 371 (A. R. No. 196 of 1905.) ప్రకారం గణపతిదేవుడు సూర్యవంశ క్షత్రియుడని తెలుపుచున్నది. రుద్రమ దేవి భర్త వీరభద్రుడు కాస్యప గోత్రీకుడు కావున తర్వాత కాలంలో కాకతీయులు కాస్యపగోత్రపు క్షత్రియులుగా చెప్పుకున్నారని చరిత్రకారుల భావన.Social and Economic Conditions in Eastern Deccan from $A.D. 1000 to A.D. 1250 By A. Vaidehi KrishnamoorthyVentakaramanayya, N. The Early Muslim Expansion in South India, 1942 చిలుకూరి వీరభద్రరావు తన ఆంధ్ర చరిత్రలో వడ్డమాని శాసనం, బూదవూరు శాసనం, త్రిపురాంతక శాసనం ఆధారంగా చేసుకొని కాకతీయులు అని తేల్చారు. చేబ్రోలు శాసనం ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని దూర్జయ తెగకు చెందిన జాయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరీమణులైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి,గణపాంబ . గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన వీరభద్రుడు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె గణపాంబ కోట సామ్రాజ్యమునకు చెందిన - బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. కాకతీయుల అచ్చతెలుగు పేర్లు కాకతీయులు గరుడాంక చిహ్నం కలిగిన రాష్ట్రకూటులు కాబట్టి, వారు రాష్ట్రకూట వంశస్థులని, మహారాష్ట్ర ప్రాంతం నుండి త్రిలింగదేశానికి వలన వచ్చిన వారని గుండయ, ఎరియల పేర్ల చివర ఉన్న రాష్ట్రకూట శబ్ధమే ఇందుకు తార్కాణమని కొందరు అభివూపాయపడ్డారు. శాసనాలు దొరికాయి .చాళుక్య శాసనాల్లోనూ ఉంది. రాష్ట్రకూటుల వద్ద సైనిక వృత్తిలో ఉన్నమాట వాస్తవమే, కానీ, రాష్ట్ర కూటుల ఆక్రమిత ప్రాంతాలైన ఆంధ్రదేశంలోనే వారున్నారు పైగా వారి పేర్లన్నీ ‘గుండయ’ పేరు దానికి సంబంధించిందే. బేతరాజు పేరు పోతరాజు నుండి వచ్చిందే. ఈ పేరు పంటలకు చీడపీడలు రాకుండా పూజింపబడే దేవుడిదే.పోతరాజు అనేది అచ్చమైన ద్రవిడ సంస్కృతిలో నుంచి వచ్చిన పేరు. మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ మొదలైన ఏడుగురు గ్రామ దేవతలకు ఒకే ఒక్క సోదరుడు. ఇప్పటికీ తెలంగాణలో బోనాల దగ్గర ముందు నడిచేవాడు ఈ పోతరాజే. ప్రోలయ నూర్పిడి సమయంలో పూజింపబడే దేవత ప్రోచేరాజుగా పోలరాజు) శివుడు కూడా పూజితుడయ్యాడు. బ (వ) య్యలమ్మ (చదువుల తల్లి), మైలమ (భూదేవి) కుందమ్మ (వ్వ), మేడలమ్మ, రుయ్యమ్మ, ముమ్మడమ్మ (ముగ్గురమ్మల మూలపుటమ్మ) ముప్పమ మొదలైన కాకతీయ కుటుంబీకుల పేర్లు అచ్చ తెలుగు పదాలతో కూడినవి. రుద్రదేవునితోనే సంస్కృత పేర్లతో కాకతీయ ప్రభువులు కనిపిస్తారు మూడు దశలు కాకతీయ సామ్రాజ్యంలో మూడు ముఖ్యమైన ఘట్టాలున్నాయి. క్రీ. శ. 1000- 1158 - తెలంగాణ విమోచన: ఈ దశలో నలుగురు రాజులు పాలించారు - కాకత్య గుండన, మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు, రెండవ ప్రోలరాజు - ఈ సమయంలో తెలంగాణ ప్రాంతం కాకతీయుల వశమయ్యింది. తెలుగునాట పశ్చిమ చాళుక్యుల పాలన అంతమయ్యింది. ముఖ్యంగా రెండవ ప్రోలరాజు పెద్ద రాజ్యాలకు ప్రతినిధులైన నలుగురు సామంతులను ఓడించి ఈ నిజయం సాధించాడు. అంతకు ముందు తీరాంధ్రంలో మాత్రమే స్వతంత్ర రాజ్యాలున్నాయి. కన్నడ ప్రాంతపు చాళుక్యులు, మహారాష్ట్రము నుండి రాష్ట్రకూటులు తీరాంధ్రంపై జరిగిన దండయాత్రలకు తెలంగాణా మార్గంగా ఉంది. కనుక తెలంగాణ ప్రాంతంలో ఆర్థిక, సాంస్కృతిక ప్రగతి కుంటువడింది. ప్రజలలో పుట్టి, కష్టసుఖాలెరిగిన కాకతీయులు సాధించిన స్వాతంత్ర్యముతో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం, సాహిత్యం, వ్యాపారం ఊపందుకొన్నాయి. ఇప్పటికీ కాకతీయులు త్రవ్వించిన చెరువులే చాలా మండలాలలో ముఖ్య నీటివనరులు. క్రీ. శ. 1159 - 1261 తీరాంధ్రంలో విజయం: ఈ దశలో కాకతీయులు ఉత్తరాన గంజాం నుండి దక్షిణాన కంచి వరకు జయించారు. రాయలసీమ, తెలంగాణ, తీరాంధ్ర ప్రాంతాలు ఒకే పాలనలోకి వచ్చాయి. ఈ దశలో ముగ్గురు పాలకులున్నారు. వారిలో గణపతి దేవుడు ప్రసిద్ధుడు. ఈ కాలంలో అన్ని ప్రాంతాల వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరిగాయి. ఖ్రీ. శ. 1262 - 1323 సామ్రాజ్య పతనం: ఈ సమయంలో రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు పాలించారు. ఇద్దరూ సమర్థులైన ప్రభువులు, యుద్ధ కోవిదులు. కాని ఉప్పెనలా ముంచుకొచ్చిన ముస్లిం దండయాత్రల కారణంగా కాకతీయ సామ్రాజ్యం పతనాన్ని ఆపలేకపోయారు. వివిధ కులాల మధ్య కలహాలు ఈ పతనానికి మరింత తోడ్పడ్డాయి. కాకతీయ సామ్రాజ్య క్రమం ఆరంభ దశ క్రీ. శ. 934-945 మధ్యకాలంలో గుండయ రాష్ట్రకూటుల ప్రతినిధి (సామంత రాజు) గా మధిర, మానుకోట తాలూకాలను పాలించేవాడు. అది రాష్ట్రకూట రాజయిన రెండవ కృష్ణునకు, వేంగి రాజు మొదటి చాళుక్య భీమునకు యుద్ధాలు జరుగుతున్న సమయం. అనంతరం పెరువంగూరు యుద్ధంలో గుండయ మరణించాడు. బెజవాడను పట్టుకోవడంలో గుండన చూపిన సాహసానికి కృతజ్ఞతాపూర్వకముగా రెండవ కృష్ణుడు గుండయ కుమారుడు ఎరియను ఓరుగల్లు దగ్గరలోని కురవాడికి అధిపతిగా చేశాడు. తూర్పుననున్న ముదిగొండ చాళుక్యులను నివారించుటకు ఇది ఉపయోగపడింది.Altekar, A.S. The Rashtrakutas and Their Times, Oriental series No. 36, Oriental Book Agency, Poona, 1934 ఎరియ ఓరుగల్లు (కాకతీపురము) ను రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు. ఇతని మనుమడు కాకత్య గుండ్యన (ఎరియ కొడుకు బేతన కాలంలో బహుశా మళ్ళీ కురవాడిని చాళుక్యులు ఆక్రమించి ఉండవచ్చును). దానార్ణవునికి, ఆతని సోదరుడు రెండవ అమ్మరాజునకు జరిగిన ఘర్షణలో, మూడవ కృష్ణుని ప్రోద్బలముతో, దానార్ణవుడు వేంగీ సింహాసనము చేజిక్కించుకొనుటకు గుండ్యన సాయపడ్డాడు. ఆ రాజ్యాలలో చెలరేగిన కల్లోలాలను అదునుగా తీసికొని, మళ్ళీ కురవాడిని తన అధీనంలోకి తెచ్చుకొని ఉండవచ్చును. అయితే ముదిగొండ చాళుక్యులకు చెందిన "విరియాల ఎర్ర భూపతి" ఒక యుద్ధంలో గుండ్యనను వధించాడు. గుండ్యన కొడుకు గరుడ బేతన చిన్న వయసులో రాజ్యం కోల్పోయి నిస్సహాయుడైనాడు. ఎర్ర భూపతి భార్య కామసాని ఆ పిల్లవానిపై జాలిగొని ఓరుగల్లు రాజ్యం ఇప్పించింది. ముందు రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్న కాకతీయులు ఇలా విరియాల వారి సౌహార్ద్రత్వంతో చాళుక్యుల సామంతులుగా ఓరుగల్లులో నెలకొన్నారు. బేతన క్రీ. శ. 1052 వరకు రాజ్యం చేశాడు. బేతరాజు కుమారుడు మొదటి ప్రోలుడు (క్రీ. శ. 1052 - 1076) చాళుక్య యువరాజు ఆరవ విక్రమాదిత్యునికి సహాయపడ్డాడు. స్థానిక ప్రభువులైన అన్నయ్య, గొన్నయ్యలను నిర్జించాడు. ఈతనికి "అరికేసరి" అనే బిరుదు ఉంది. ఇతను అనుమకొండ (హనుమకొండ) ను సోమేశ్వరుడినుండి పొందాడు. ప్రోలుని కుమారుడు రెండవ బేతరాజు (క్రీ. శ. 1076 - 1108) హనుమకొండ రాజధానిగా పాలించాడు. రాష్ట్రకూటులను జయించి కొరవి మండలం, హనుమకొండ విషయం, సబ్బిరాయి మండలాలను కలిపి కాకతీయ రాజ్యాన్ని విస్తరించాడు. ఈతని తమ్ముడు రెండవ ప్రోలరాజు (క్రీ. శ.1116 - 1157) మిక్కిలి గొప్పవాడు. చాళుక్యులు బలహీనపడిన సమయములో స్వాతంత్ర్యము ప్రకటించుకొని, తెలంగాణ ప్రాంతం అంతా రాజ్యవిస్తరణ చేశాడు. పశ్చిమ చాళుక్యుల సామంతులైన తైలప దేవుడు (మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ప్రాంతం), గోవిందరాజు (వరంగల్ జిల్లా వేలకొండపల్లి ప్రాంతం), గుండరాజు (మంథెన ప్రాంతం), జగద్దేవుడు (వేములవాడ ప్రాంతం) అనే నలుగురు రాజులను జయించి తెలంగాణంలో చాళుక్యుల పాలనను అంతం చేశాడు. ఇతడు కళ్యాణిని పాలిస్తున్న బిజ్జలుని సమకాలికుడు. బిజ్జలునికి సహకారంగా తన సేనను పంపి, అతడు కళ్యాణి నగరాన్ని పశ్చిమ చాళుక్యులనుండి వశం చేసుకోవడానికి సాయపడ్డాడు. కాకతీయులు మొదట జైనులు. అప్పటివరకు తెలంగాణ ప్రాంతంలో జైన మతం బలంగా ఉంది. కాని కళ్యాణిలో బసవని నేతృత్వంలో వీరశైవం విజృంభించి ఆంధ్రదేశంలో బలం పుంజుకోసాగింది. ఉప్పెనలా వస్తున్న వీరశైవానికి తలవంచి రెండవ ప్రోలరాజు శైవాన్ని స్వీకరించాడు. ఈ సమయానుకూల చతురత వల్ల కాకతీయుల రాజ్యం మరో రెండు శతాబ్దాలు కొనసాగగలిగింది. తరువాత రెండవ ప్రోలుడు కృష్ణానదిని దాటి తీరాంధ్ర చోళులను జయించాలని యత్నించాడు. మంత్రకూటమును (నూజివీడు మండలం) పాలించుచున్న గుండని నిర్జించి, తన రాజ్యములో కలుపుకున్నాడు. క్రీ. శ. 1158 లో వెలనాటిపై చేసిన యుద్ధములో రాజేంద్ర చోడుని చేతిలో హతమయ్యాడు. ఈ ఘటనతో కాకతీయుల చరిత్ర మలుపు తిరిగింది.Rao, M.R. Glimpses of Dakkan History, Orient Longmans Limited, Madras, 1951 రుద్రదేవుడు (1158 - 1195) ప్రసిద్ధులైన కాకతీయులలో రుద్రదేవుడు మొదటివాడు. పరాక్రమ శాలి. రాజనీతి చతురుడు. ఇతనినే మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. ఇతని అనేక శాసనాలలో అనుమకొండ శాసనం (వేయి స్తంభాలగుడి) ప్రసిద్ధమైన చారిత్రకాధారము. రుద్రదేవుడు కాకతీయుల రాజ్యాన్ని విస్తరించి సుస్థిరం చేశాడు. ప్రోలరాజు మొదలుపెట్టిన దిగ్విజయ యాత్రలను ముందుకు తీసుకెళ్ళాడు. పశ్చిమ చాళుక్యుల సార్వభౌమత్వానికి వారసుడుగా బిజ్జలుడు కాకతీయులను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. మరో ప్రక్క కాకతీయుల విజృంభణపై అసూయాగ్రస్తులైన చాళుక్య సామంతులు కాకతీయులపై కత్తిగట్టారు. అసమానమైన రాజనీతితో వీరందరిని ఎదుర్కొని రుద్రదేవుడు కాకతీయులకు సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించాడు. మేడరాజు, దొమ్మరాజు, మైలగి దేవుడు, చోడోదయుడు వంటి చిన్న చిన్న స్థానిక రాజులను జయించాడు. తరువాత తీరాంధ్రంవైపు దృష్టి సారించాడు. క్రీ. శ. 1162 లో వెలనాటిపై దండయాత్ర చేసి శ్రీశైలం, త్రిపురాంతకం ఆక్రమించుకొన్నాడు. పలనాటి యుద్ధంలో నలగామరాజుకు సాయంగా పెద్ద దళాన్ని పంపాడు. పల్నాటి యుద్ధంలో వెలనాటి చోళులు బలహీనపడిన తరువాత క్రీ. శ. 1186 లో రుద్రదేవుడు ఈ ప్రాంతాన్నంతా ఆక్రమించుకొని రెండవ ప్రోలుని మరణానికి ప్రతీకారం తీర్చుకొన్నాడు. తరువాత దేవగిరి రాజైన yadava జైతుగితో జరిగిన యుద్ధంలో రుద్రదేవుడు మరణించాడు. రుద్రదేవుడు ఓరుగల్లును దుర్భేద్యమైన దుర్గంగా నిర్మించడం మొదలుపెట్టాడు. అనుమకొండలో దేవాలయాన్ని నిర్మించాడు. ఇతడు భాషాభిమాని. స్వయంగా కవి. మహాదేవుడు (క్రీ. శ. 1195 - 1199) రుద్రదేవుని సోదరుడు మహాదేవుడు దేవగిరి యాదవులపై పగసాధించవలెనని ప్రయత్నించి విఫలుడయ్యాడు. రుద్రునికి సంతానం లేనందున మహాదేవుని కొడుకు గణపతిదేవుని దత్తత తీసికొన్నాడు. బహుశా రుద్రదేవుడు మరణించినపుడే గణపతిదేవుడు దేవగిరి యాదవులకు బందీగా చిక్కి ఉంటాడు. అతనిని విడిపించే ప్రయత్నంలోనే మహాదేవుడు దేవగిరిపై దండెత్తి, ఆ యుద్ధంలో (ఏనుగు మీద ఉండి యుధ్ధాన్ని నడిపిస్తూ) మరణించాడు. మహాదేవుడు శైవ మతాభిమాని. ధ్రువేశహవర పండితుడు అతని దీక్షా గురువు. మహాదేవుని మరణానంతరం క్రీ. శ. 1198లో మహాదేవుని కొడుకు (రుద్రదేవుని దత్తపుత్రుడు) గణపతి దేవుడు కాకతీయ సింహాసనాన్ని అధిష్టించాడు. గణపతిదేవుడు (క్రీ. శ. 1199 - 1262) గణపతి దేవుడు రాజ్యానికి రావడానికి ముందు 12 సంవత్సరాలు దేవగిరి యాదవులకు బందీగా ఉండి విడుదల చేయబడ్డాడు. ఈలోగా కాకతీయ సామంతులు చేసిన తిరుగుబాట్లను రేచర్ల రుద్రుడు అనే విశ్వాసపాత్రుడైన సేనాని అణచి, రాజ్యాన్ని గణపతిదేవునికి అప్పగించాడు. గణపతిదేవుడు మహావీరుడు. దూరదృష్టి ఉన్న రాజనీతిజ్ఞుడు. అప్పటికి దక్షిణాన పాండ్యులు, పశ్చిమాన హొయసల, యాదవ రాజులు, ఉత్తరదేశంలో తురుష్కులు బలవంతులై తెలుగుప్రాంతాన్ని చుట్టుముట్టి ఉన్నారు. రాగల ప్రమాదాన్ని గుర్తించిన గణపతిదేవుడు త్రిలింగదేశాన్ని ఐక్యము చేయడానికి విజయయాత్రలు ప్రారంభించాడు. అయితే ఓడిపోయిన రాజులను తొలగించలేదు. వారితో సంబంధాలు కలుపుకొని, వారి సామంత ప్రతిపత్తిని కొనసాగించాడు. ఈ సామంతులు కాకతీయులకు అండగా నిలిచారు. గణపతిదేవుడు క్రీ. శ. 1212 - 1213 కాలంలో తూర్పు తీరంపై దండెత్తి కృష్ణా, గోదావరి, గుంటూరు ప్రాంతాలను స్వాధీనం చేసుకొన్నాడు. నిడదవోలు పాలకుడైన వేంగి చాళుక్య వీరభద్రునికి (క్షత్రియుడు) తన కుమార్తె రుద్రమ్మను ఇచ్చి పెళ్ళి చేశాడు. రెండవ కుమార్తె గణపాంబను ధరణికోట రాజు బేతరాజుకు, సోదరి మేలాంబికను మధిర పాలకుడు రుద్రరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. జాయపసేవాని ఇద్దరు చెల్లెళ్ళను (పిన్నచోడుని కుమార్తెలైన నారమ్మ, పేరమ్మ) గణపతిదేవుడు వివాహం చేసుకొన్నాడు. కమ్మ జాయపసేనానిని (జాయప నాయుడు) తన గజసైన్యాధ్యక్షునిగా ఓరుగల్లు తీసుకెళ్ళాడు. నెల్లూరు ప్రాంతాన్ని జయించి, అక్కడి పూర్వపాలకుడైన మనుమసిద్ధికి ఇచ్చాడు. రాయలసీమ ప్రాంతాన్నంతా జయించి, గంగయ సాహిణి అనే సామంత పాలకునికి అధికారం అప్పజెప్పాడు. తర్వాత కళింగ దేశంలోని గంజాం జిల్లా ఆస్కావరకు జయించాడు. అప్పటికి కుల వ్యవస్థ, కులాల మధ్య అంతరాలు బలపడుతున్నాయి. కాని గణపతిదేవుడు అన్ని కులాల వారితో సంబంధ బాంధవ్యాలు నెరపుకొంటూ ఈ కుల భేదాలు అంతఃకలహాలుగా మారకుండా జాగ్రత్త పడ్డాడు. జాయప కమ్మ వంశస్థుడు. చాళుక్య వీరభద్రుడు క్షత్రియుడు. నెల్లూరుకు చెందిన తిక్కన సోమయాజి ఓరుగల్లు వెళ్ళి గణపతిదేవుని ఆస్థానంలో తన మహాభారత రచన పూర్తి చేశాడు. నెల్లూరు రాజ్యంలో కాకతీయుల జోక్యం వలన వారికి పాండ్యులతో వైరం ఏర్పడింది. పాండ్యులు రెండు సైన్యాలను పంపారు. కొప్పెరుంజింగలి నాయకత్వంలోని ఒక సైన్యం కాకతీయులతో యుద్ధంలో ఓడిపోయింది. పాండ్యుల రెండవ సైన్యం జటావర్మ నాయకత్వంలో నెల్లూరు పై దాడిచేసింది. క్రీ. శ. 1263లో ముత్తుకూరు వద్ద జరిగిన యుద్ధంలో కాకతీయ-శేవుణ సైన్యాలు ఓడిపోయాయి. ఈ యుద్ధంలో మనుమసిద్ధి మరణించాడు. నెల్లూరు రాజ్యం పాండ్యుల వశమయ్యంది. ఇది కాకతీయులకు ఘోర పరాజయం. ఇదొక్కటే గణపతిదేవుడు యుద్ధాలలో చవి చూసిన ఓటమి. అప్పటికే గణపతిదేవుడు బాగా వృద్ధుడై యున్నాడు. తరువాత ప్రతాపరుద్రుని కాలం వరకు నెల్లూరును కాకతీయులు వశపరచుకోలేకపోయారు. గణపతిదేవుని కాలంలో ఓరుగల్లు పెక్కు తటాకాల, ఆలయాల నిర్మాణం జరిగింది. అనేక గణపవరాలు వెలిశాయి. విదేశీ వాణిజ్యం వర్ధిల్లింది. మోటుపల్లి రేవు ప్రసిద్ధిగాంచింది. శిల్ప వాస్తువు ప్రభవించింది. రామప్ప దేవాలయనిర్మాణం ఈ కాలంలో జరిగినదే. రుద్రమదేవి (1269 - 1289) right|thumb|200px|రాణి రుద్రమ దేవి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు. త్రిలింగదేశమంతటినీ ఒక స్త్రీ అసమాన ధైర్య సాహసాలతో సమర్ధవంతంగా పాలించడం వలన ఈ ఘట్టం తెలుగువారి చరిత్రలో ముఖ్యమైనది. రుద్రమదేవి పాలనకాలమంతా యుద్ధాలతోనే సరిపోయింది. రుద్రమదేవికి ముందుగా స్త్రీ పరిపాలన సహించని సామంతులనుండి, దాయాదులనుండి ప్రతిఘటన ఎదురయ్యింది. అదే సమయంలో దేవగిరి యాదవరాజు అయినా మహదేవ దండెత్తి వచ్చాడు. ఈ రెండు విపత్తులనూ ఆమె సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ పోరాటాలలో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వారిలో కొందరు - గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యుడు (వెలమ), రుద్రనాయకుడు (కమ్మ), జన్నిగదేవుడు (కాయస్థుడు), త్రిపురాంతకుడు (కాయస్థుడు), బెండపూడి అన్నయ్య (బ్రాహ్మణుడు). తరువాత తూర్పున గంగ నరసింహదేవుడు వేంగి ప్రాంతాన్ని (క్రీ. శ. 1262లో) ఆక్రమించాడు. కాని పోతినాయక, ప్రోలినాయకులు వారిని ఓడించి సా.శ. 1278లో వేంగిలో తిరిగి కాకతీయుల అధికారం నెలకొల్పారు. ఇంతలో దేవగిరి యాదవ మహాదేవుడు దండెత్తాడు. అతనిని ఓడించి రుద్రమదేవి పరిహారాన్ని గ్రహించింది. దక్షిణాదిన నెల్లూరు ప్రాంతంలో పాండ్యులు విజృంభించసాగారు. వారిని ఓడించిననూ అక్కడ కాకతీయాధికారం ఎంతో కాలం నిలువలేదు. పాండ్యుల సామంతులైన తెలుగు చోడులు మళ్ళీ నెల్లూరును ఆక్రమించారు. వల్లూరు రాజ్యం మాత్రం పాండ్యులనుండి కాకతీయుల వశమైంది. దానిని జన్నిగదేవుడు, తరువాత త్రిపురారి కాకతీయుల సామంతులుగా ఏలారు. అయితే త్రిపురారి తరువాత వచ్చిన అంబదేవుడు తిరుగుబాటు చేసి స్వతంత్రరాజ్యం స్థాపించ ప్రయత్నించాడు. అంబయతో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించింది (క్రీ. శ. 1289). నిరంతరం యుద్ధాలలో ఉన్నాగాని, రుద్రమదేవి చాలా సమర్థవంతంగా పాలన నిర్వహించింది. ఓరుగల్లు కోటను దుర్భేద్యంగా బలపరచింది. దేశం సుభిక్షంగా ఉంది. ఆమె కాలంలోనే వెనిస్ యాత్రికుడు మోటుపల్లి రేవులో దిగాడు. దేశంలో పాలన కట్టుదిట్టంగా ఉందని, పరిశ్రమలు, వాణిజ్యం వర్ధిల్లుతున్నాయని వర్ణించాడు. రుద్రమ దేవి భర్త చాళుక్య వీరభద్రుడు. వీరికి ముగ్గుర్ కుమార్తెలు, కుమారులు కలగలేదు. పెద్ద కూతురు ముమ్మడామ్మను కాకతి మహాదేవుడు వివాహమాడెను. వారి తనయుడే ప్రతాపరుద్రుడు. రుద్రమ దేవి తరువాత కాకతీయ సామ్రాట్టు అయినాడు. రుద్రమ చిన్న నాదే అతనిని దత్తత తీసుకొని తన తదనంతరం వారసుడిని యువరాజ్య పట్టాభిషేక మొనర్చింది. ప్రతాపరుద్రుడు (1289 - 1323) ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనుమడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఈతనిని వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. క్రీ. శ. 1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించింది. ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుని పరిపాలనాకాలమంతయూ యుద్ధములతోనే గడచింది. అంబదేవుని, నెల్లూరులో మనుమగండుని, కర్ణాట రాజులను జయించి రాజ్యము కట్టుదిట్టము చేశాడు. ఇంతలో ఉత్తర దేశమునుండి కొత్త ఉపద్రవము ముంచుకొచ్చింది. సా.శ. 1303,1309, 1318, 1320 లో ఢిల్లీ సుల్తాను అలా ఉద్దీన్ ఖిల్జీ మూడు సార్లు దాడి చేసి విఫలమయ్యాడు.ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రము, సి. వి. రామచంద్ర రావు, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి, హైదరాబాదు క్రీ. శ. 1323 లో జరిగిన నాలుగవ యుద్ధములో ప్రతాపరుద్రునికి అపజయము సంభవించింది.Pre-colonial India in Practice, Cynthia Talbot, 2001, Oxford University Press, pp.177-182, ISBN 0195136616 ముసునూరి నాయకులు ప్రతాపరుద్రుని పరాజయము తరువాత త్రిలింగదేశము అల్లకల్లోలమైనది. తురుష్కుల ఆగడాలు చెప్పనలవి గానివి. ముసునూరి ప్రోలయ నాయకుని విలస తామ్ర శాసనములో ఆనాటి తెలుగు వారి దయనీయ స్థితి వర్ణించబడింది. అట్టి విషమ పరిస్థితులలో బెండపూడి అన్నయ మంత్రి, కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన తెలుగు నాయకులను ఐక్యపరచి వారికి నాయకునిగా కమ్మ కులానికి చెందిన ముసునూరి ప్రోలయ నాయకుడు అను మహాయోధుని ఎన్నుకొన్నారు. ముసునూరి ప్రోలయ నాయకుడు ఓరుగల్లు విముక్తి గావించుటకు పలు వ్యూహములల్లాడు. పెక్కు యుద్ధముల పిదప క్రీ. శ. 1325 లో తురుష్కులను దక్షిణభారతము నుండి తరిమివేయుటలో కమ్మవారు సఫలమయ్యారు. హిందూమతము రక్షించబడింది. దేవాలయములు పునరుద్ధరించబడ్డాయి. బ్రాహ్మణులకు అగ్రహారములీయబడెను. అనితల్లి కలువచేరు శాసనములో ముసునూరి ప్రోలయ నాయకుని వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడబడ్డాయి.Sarma, M. Somasekhara; A Forgotten Chapter of Andhra History 1945, Andhra University, Waltair కాకతీయ సామంతులు కాకతీయుల కాలమున సామంతులు, మహా సామంతాధిపతులు, మహా మాత్యులు, దండనాయకులు, వంశ పాలకులు అమేయమైన శక్తిప్రపత్తులతో రాజ భక్తితో దేశ భక్తితో చాలా చక్కని పాత్రని పోషించారు. వంశ పాలకులు అనగా స్వజాతి కుటుంబ పాలకులు. యుద్ధములలో వీరు చాలా ఎన్న దగిన పాత్ర పోషించారు. అటువంటి కాకతి వంశ సామంతులలో ఎన్నదగినవారు రేచర్ల రుద్ర వంశం రేచెర్ల పద్మనాయకులు గోన వంశీయులు కందూరి చోడులు చెరుకు వంశీయులు మల్యాల వంశీయులు విరియాల వంశీయులు పొలవాస పాలకులు వావిలాల వంశీయులు యాదవ రాజులు త్యాగి వంశీయులు నతవాడి వంశం కోట వంశం కాయస్థ వంశం ఇందులూరి వంశీయులు ముసునూరి నాయకులు బాణ వంశం నాగ వంశీయులు వైదుంబులు చిత్రమాలిక ఆర్ధిక రంగం ఈ కాలంలో కాకతీయ సామ్రాజ్యం సిరిసంపదలతో తులతూగుతున్నట్లు అమీర ఖుస్రూ, అబ్దున్నా వాసఫ్, మార్కోపోలో వంటి విదేశీ యాత్రికుల రచనల వల్ల తెలుస్తుంది. వ్యవసాయమే నాడు తెలంగాణ ప్రాంతానికి ప్రధాన వృత్తి . వ్యవసాయం చాలావరకు వర్షాధారమే, అయితే కాకతీయ రాజులు, రాణులు, సామంతులు పెద్ద చెరువులు, కాలువలు త్రవ్వించి, నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. రామప్పచెరువు, కేసరి సముద్రం, పాకాల చెరువు, కాటసముద్రం, చౌడ సముద్రం, సబ్బి సముద్రం, జగత్కేసరి సముద్రం ఉదాహరణలు. ఇంకా నెల్లూరు, కడప, పల్నాడు ప్రాంతాల్లోని అడవులు నాశనం చేసి, పంట పొలాలు ఏర్పాటు చేసి క్రొత్త గ్రామాలు సృష్టించారు. దేశం పలు ప్రాంతాల్లో గోధుమలు, వరి, కొర్రెలు, పెసలు, జొన్నలు, చెరకు, నూనె దినుసులు, ఉల్లి, అల్లం, పసుపు వంటివి ఎక్కువగా పండించేవారు. దేశమంతా కొబ్బరి, జామ, మామిడి, అరటి, ఆకుకూరగాయల తోటలు ఉండేవి. పంచదార, బెల్లం, నూనె పరిశ్రమలు ప్రతి గ్రామంలోనూ ఉండేవి. పశుసంపద చాలా ఎక్కువగా ఉండేది. పాలు, పెరుగు, నెయ్యి పుష్కలంగా లభించేది. వ్యవసాయంతో పాటు పెక్కు పరిశ్రమలు వృద్ధి చెందాయి. వస్త్ర పరిశ్రమ నాణ్యమైన వస్త్రాలు ఎగుమతి చేసేది. రత్నకంబళాలు, ముఖమల్ వస్త్రాలు, పంచలోహాలతో పలురకాల వస్తువులు తయారయ్యేవి. ఇంకా లక్కబొమ్మలు, ఆటవస్తువులు, ఆయుధాలు, వంటివి తయారయ్యేయి. తోలుబొమ్మలాటకు కావలసిన బొమ్మలకు రంగులు వెయ్యటం పెద్ద పరిశ్రమ. నిర్మల్ కత్తులు జగత్ర్పసిద్ది. వజ్రాల గనులు ఉండేవి. దేశీ వాణిజ్యానికి ఓరుగల్లు ప్రసిద్ధి. అక్కడ ప్రతి వారము మడిసంత, మైల సంత జరిగేవి. మంథెన, పానగల్లు, అలంపురం, మాచెర్ల, వేల్పూరు, యనమదల, తంగెడ, త్రిపురాంతకం, లేబాక, కొచ్చర్లకోట, నందలూరు, నెల్లారు, పెద గంజాం, ఘంటశాల ఇతర వాణిజ్య కేంద్రాలు. ఇంకా మోటుపల్లి, మచిలీపట్టణం వంటి రేవుపట్టణాల ద్వారా విదేశీ వ్యాపారం జరిగేది. వ్యవసాయం కాకతీయుల కాలంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి కావడంతో కాకతీయ చక్రవర్తులు వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వ్యవసాయ సంస్కరణల ద్వారా చెన్నూరు, పాలంపేట, పాకాల, మంథని, ఏటూరు నాగారం, కొత్తగూడ, ఎల్లందు, బయ్యారం, అమ్రాబాద్, శ్రీశైలం ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల భూమి కొత్తగా సాగులోకి వచ్చింది, ఫలితంగా ఆ ప్రాంతాలలో వందల గ్రామాలు ఏర్పడ్డాయి. ఇందుకోసం రెండు ప్రధానమైన మార్గాలు అనుసరించారు - ఒకటి వ్యవసాయానికి సాగునీటి ఏర్పాటు, రెండు అడవులు కొట్టించడం ద్వారానూ, సాగులో లేని బీడు భూముల సాగుకు ప్రోత్సాహకాలు అందించడం; సాగునీటికి జలాశయాలు ఏర్పాటు thumb|వేయిస్తంభాల గుడి వద్ద కాకతీయులు నిర్మించిన చెరువు వ్యవసాయం ప్రధానంగా వర్షాధారం కావడంతో సాగునీటి వనరుల పెంపుకు వర్షపునీటిని నిల్వచేసుకునే లక్ష్యంతో కాకతీయుల కాలపు నిర్మాణాలు సాగాయి. కాకతీయ చక్రవర్తులు నిర్మించిన జలాశయాలు నాలుగు విధాలుగా విభజించవచ్చు: సరస్సులు, చెరువులు, కాలువలు, బావులు. ప్రతీ ఊరికీ అనుబంధంగా, ఆలయానికి ఈశాన్యంగా ఒక చెరువు నిర్మాణం చేసేవారు. ఊరికి దిగువన చెరువు, చెరువుకు దిగువన పొలాలు ఉండేలా జాగ్రత్తపడడంతో ఊరిలో పడిన వాననీరు చెరువును నింపడంతోపాటు ఊరికి వరదల ముప్పు కూడా ఉండేది కాదు. వర్షపు నీటిని నిలువ చేయడం మాత్రమే కాక సమీపంలోని భారీ జలాశయానికి దీన్ని అనుసంధానించేవారు. 1052 నుంచి చాళుక్యుల సామంతునిగా రాజ్యపాలన చేసిన కాకతీయ పాలకుడు మొదటి ప్రోలయరాజు నిర్మించిన కేసీయసముద్రం సరస్సుతో కాకతీయుల చెరువుల నిర్మాణం ప్రారంభమైంది. తర్వాత్తర్వాత స్వాతంత్ర్యం ప్రకటించుకున్న కాకతీయులు చెరువుల నిర్మాణం కొనసాగించారు. రెండవ బేతరాజు అనుమకొండలో చెరువును కట్టించాడు. ఆపైన గణపతిదేవుడు నెల్లూరు, ఎల్లూరు, గణపురం, గంగాపురం వగైరా చెరువులను నిర్మించి ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళాడు. వ్యవసాయ భూముల పెంపు సాగునీటి వనరుల పెంపుతోపాటు సాగుభూములను విస్తరించుకుంటూ పోయారు. ఈ క్రమంలో పలు చర్యలు తీసుకున్నారు: అడవులను నరికించి సాగులోకి తీసుకువచ్చి వందలాది గ్రామాలను నిర్మించారు. ఉదాహరణకు నేటి కర్నూలు ప్రాంతంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు స్వయంగా విడిసి ఈ పనిని చేపట్టినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. నిరుపయోగంగా ఉన్న బీడు భూములను సాగులోకి తీసుకువచ్చినవారికి ఆ సాగుపై పన్నులో రాయితీలు కల్పించారు. గ్రామాలకు దూరంగా సాగులోలేని భూములను బ్రాహ్మణులు, పండితులు, వృత్తులవారికి, అధికారులకు, దేవాలయాలకు కానుకలుగా, అగ్రహారాలుగా ఇవ్వడం ద్వారా సాగులోకి తీసుకువచ్చారు. వ్యవసాయం పెంపొందిద్దామని అడపగట్టు అనే పద్ధతిలో రాచభూములను సగం ఆదాయాన్ని ప్రభుత్వానికి జమకట్టడానికి ఇష్టపడేవారికి కౌలుకు ఇచ్చేవారు. ఈ విధానాలు వ్యవసాయానికి, కాకతీయుల ఆర్థిక స్థితికి సాయం చేశాయి. జీవనం శిల్పం, సాహిత్యం, కళలు ఇవి కూడా చూడండి కాకతీయుల వంశవృక్షము కాకతీయుల కళాపోషణ నోట్స్ మూలములు వనరులు Ventakaramanayya, N. The Early Muslim Expansion in South India, 1942 A History of India, H. Kulke and D. Rothermund, 1998, Routledge, p. 160, ISBN 0415154820 A Social History of the Deccan: 1300-1761, R. M. Eaton, 2005, Cambridge University Press, pp. 16–20, ISBN 0521254841 ఆంధ్రుల చరిత్ర - డాక్టర్ బి యస్ యల్ హనుమంతరావు బయటి లింకులు వర్గం:కాకతీయ సామ్రాజ్యం వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:తెలంగాణ చరిత్ర వర్గం:కాకతీయ రాజులు వర్గం:చరిత్ర వర్గం:మధ్యయుగ భారతీయ సామ్రాజ్యాలు
రేచర్ల రెడ్డి వంశీయులు
https://te.wikipedia.org/wiki/రేచర్ల_రెడ్డి_వంశీయులు
రేచర్ల రెడ్డి రాజులు, చక్కని ప్రతిభా పాటవాలతో, స్వామి భక్తితో కాకతీయ వంశీయుల వద్ద చాలా పలుకుబడికలిగి, మంత్రులుగా, సామంతులుగా, మహా సామంతులుగా ఉన్నారు. వీరు ముఖ్యముగా నల్గొండ లోని ఆమనగల్లు, పిల్లలమర్రి, మిర్యాలగూడ, నాగులపాడు, సోమవరం: వరంగల్లు ప్రాంతము లోని ఎలకుర్తి, ములుగు, నర్సంపేట, మాచాపూరు, కరీంనగర్ ప్రాంతము లోని హుజూరాబాదు ప్రాంతాలను పరిపాలించారు. దేవాలయ నిర్మాణము ఈ వంశజులు అనేక దేవాలయములు నిర్మించారు. వీరి ప్రధానముగా శైవమత అవలంబీకులు. వీరు నిర్మించిన దేవాలయములు పిల్లలమర్రి లోని త్రికూటేశ్వర, నామేశ్వర, ఎఱకేశ్వర ఆలయములు నాగులపాడునందలి నామేశ్వర, కాదేశ్వర, కాటేశ్వర, కామేశ్వర ఆలయములు పాలంపేటనందలి రుద్రేశ్వరాలయము(రామప్ప) గొడిశాలనందలి పంచలింగేశ్వరాలయము డిచ్చకుంట, రామన్న పేట, చిట్యాలంపాడు, ఎలకుర్తి, మాచాపూరు మొదలగు ప్రాంతములయందూ వీరు దేవాలయములు నిర్మించారు. మత విషయములు తమ ప్రభువులైన కాకతి వంశము వలే వీరు కూడా శైవ మతము ఆరాధించారు. నీటి పారుదల సౌకర్యములు ప్రజల ముఖ్య ఆధారము వ్యవసాయము. దాని అభివృద్ధి కోసం తద్వారా దేశ అభివృద్ధి కోసం వీరు చాలా తటాకములు నిర్మించారు ఈసంఖ్య వందలలోనే ఉంటుంది, కొన్ని చూడండి లోక సముద్రము, ఎఱక సముద్రము, మూసేటి కాలువలు, నామ సముద్రము, విశ్వనాథ సముద్రము, నాగ సముద్రము, చింతల చెఱువు, నేరెడ్ల చెఱువు, కత్యాకె చెఱువు, గుడ్ల చెఱువు, గౌర సముద్రము, సబ్బి సముద్రము, లక్ష్మీ సముద్రము, ఎర్రమరాజు కుంట, బొమ్మాయి కుంట కాలువ, రాజెనాయకుని చెఱువు, ఏలేశ్వరము కాలువ, చవుట కాలువ, పడాల చెఱువు, రామప్ప చెఱువు, కామ సముద్రము, మేడ సముద్రము వంటి అనేక చెరువులూ, కాలలు తవ్వించారు. దుర్గములు లేదా కోటలు వీరికి అమనగల్లు, పిల్లల మర్రి, ఉండ్రుగొండ, ఉర్లు కొండ, వాడ్వల్లి, ఎలకుర్తి మొదలగు దుర్గములు ఉన్నాయి. పరకామణి పరకామణి, లేదా ఈ కాలమునాటి నాణెములు వీటిని నిష్కమ అను బంగారునాణెములుగా ఉండెడివి. ఆ తరువాత రూక, అడ్డుగ, వీసము, చిన్నము అను నాణెములు ఉండెడివి.నిష్కము = మాడ = బంగారు నాణెము రూక = వెండి నాణెము పది రూకలు = ఒక మాడఅడ్డుగ = అర్థ = 1/2 రూక పాదిక = పాతిక = 1/4 రూక వీసము, చిన్నము, రూకలోని భాగములు. ఓ విషయము గమనీచినారా? ఇప్పటికీ ఈ వొకాబులరీ లేదా పదములు తెలుగువారిని వదలలేదు ఉదాహరణకు రూక, రూపాయ లాగా ద్వనించడములేదు! వీసమెత్తు బంగారం కూడా ఇవ్వను - అను వాడు కలదు కదా (అంటే ఇప్పటి భాషలో నయాపైసా కూడా ఇవ్వను అని ) మాడలు జానపద కథలలో మాత్రము మిగిలినట్లున్నాయి. సైనిక విశేషములు వీరు సైన్యమును స్వంతముగా పోషించి, కాకతి వంశజులకు తలలో నాలుకగా ఉండేవారు. అనేక సమయములో వీరు చాలా ప్రముఖ భూమికను పోషించారు, ముఖ్యముగా మొదటి బేతరాజు కంచి దండయాత్రలోనూ, రుద్రదేవ మహారాజు మరణాంతరము గణపతిదేవ మహారాజు నకు రాజ్యమునప్పగించడములోనూ, వీరి పాత్ర చాలా ముఖ్యమైనది. వీరు స్వంత సైన్యముతో పాటుగా తమ తమ దుర్గములందు సైన్యము పెంచేవారు, ఈ సైన్యమును దుర్గాదిపతులు చూసేవారు, వారు దుర్గము అధీనములోని గ్రామాలనుండి పన్నులు వసూలు చేసేవారు. ఓ చిన్న విషయము ఏమిటంటే, ఈ కాలములో పన్నులు ఎక్కువగానే ఉండెడివి అని తెలుస్తుంది, కాకపోతే పాడి పంటలు, చాలా సమృద్దిగా ఉండుటవల్ల ప్రజలు సుఖశాంతులతోనే ఉన్నారు, అదియే కాకుండా వీరు వ్యవసాయమును చాలా బాగుగా పోషించారు అని చెప్పుకున్నాము కదా! వీరు సైనికులకు జీతములు ఇచ్చేవారు. యుద్ధములందు విజయము సాధించిన పిదప వీరులకు సన్మానములు జరిపేవారు. సైన్యమునందు ఉన్నత పదోన్నతులతో పాటు రకరకాలైన కానుకలూ ఇతర బహుమతులూ ఇచ్చేవారు. అసి, ముసల, కణయ, కంపణ, ముద్గర, తోమర, భిండివాల, క్రకచ, నారాచ, ముషిండి మొదలైన పేర్లతో సైన్యమును విభజించేవారు, ఇది ఇప్పటి మన రకరకాల ప్రమోషను పద్ధతివంటిది అనుకోవచ్చు. చూడండి రేచర్ల రెడ్డి రాజుల వంశ వృక్షము రేచర్ల రెడ్డి రాజుల కాలమునాటి శాసనాలు రేచర్ల రెడ్డి రాజుల పేర్లు రేచర్ల రెడ్డి రాజుల శాసనములందలి గ్రామముల పేర్లు వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:కాకతి వంశ సామంతులు
రేచర్ల రెడ్డి రాజుల కాలమునాటి శాసనాలు
https://te.wikipedia.org/wiki/రేచర్ల_రెడ్డి_రాజుల_కాలమునాటి_శాసనాలు
రేచర్ల వంశీయులకు సంబంధించి, వారి సామంత, మాండలిక, సచివ, అంగ రక్షకులకు చెందిన అనేక శాసనాలు లభించినాయి. ఇవి వరంగల్లు, కరీంనగర్, నల్గొండ, ద్రాక్షారామము, వేల్పూరు ప్రాంతములందు కనిపించుతున్నవి. నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము , 1195 వేల్పూరు శాసనము, 1199 నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము 2 , 1202 నామి రెడ్డి నాగులపాడు శాసనము, 1202 ఎఱకసాని పిల్లలమర్రి శాసనము, 1208 పిల్లలమర్రి శాసనము, కాలము తెలీదు నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము 3 కాలము తెలీదు ద్రాక్షారామ శాసనము , 1212 చిట్యాలంపాడు శాసనము, 1213 బేతిరెడ్డి సోమవరము శాసనము, 1213 ఎలకుర్తి శాసనము సోమవరము శాసనము పాలంపేట శాసనము , 1213 పెద్ద గణపతిరెడ్ది ద్రాక్షారామ శాసనము డిచ్చకుంట శాసనము మాచాపూర్ శాసనము రామన్న పేట శాసనము , 1213 ఊటూరు శాసనము , 1216 మాచాపూర్ శాసనము, 1217 డిచ్చకుంట శాసనము 2, 1217 తాడువాయి శాసనము నాగులపాడు శాసనము, 1234 సోమవరము శాసనము, 1234 గొడిశాల శాసనము , 1235 ఉప్పరపల్లి శాసనము , 1236 దోసపాడు శాసనము, 1254 కామిరెడ్డి నాగులపాడు శాసనము , 1258 కామిరెడ్డి అన్నవరము శాసనము, 1258 గణపి రెడ్డి మర్రెడ్ల నాగులపాడు శాసనము నాగులపాడు శాసనము ధర్మారావు పేట శాసనము ఈ శాసనములలో కొన్ని సంస్కృతమునందూ, కొన్ని తెలుగునందూ, కొన్నీ రెండు భాషలయందూ ఉన్నాయి. వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:కాకతి వంశ సామంతులు వర్గం:తెలుగు శాసనాలు
రేచర్ల రెడ్డి రాజుల పేర్లు
https://te.wikipedia.org/wiki/రేచర్ల_రెడ్డి_రాజుల_పేర్లు
బ్రహ్మ సేనాని ముచ్చ సేనాని కాటసేనాని కామ సేనాని కాటచమూపతి బేతి రెడ్డి నామి రెడ్డి వల్లసాని ప్రోలయ ముచ్చసేనాని రుద్రసేనాని మల్లా రెడ్డి లోకి రెడ్డి కాట్రెడ్డి కామి రెడ్డి లోక సేనాని పెద్ద గణపతి చమూనాథ కాటచమూపతి నామయ కామయ మల్లయ గణపి రెడ్డి మర్రెడ్డి గణపతి పసాయిత చమూనాథ వీరపసాయిత వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:కాకతి వంశ సామంతులు
రేచర్ల రెడ్డి రాజుల శాసనములందలి గ్రామముల పేర్లు
https://te.wikipedia.org/wiki/రేచర్ల_రెడ్డి_రాజుల_శాసనములందలి_గ్రామముల_పేర్లు
రేచర్ల వంశీయులకు సంబంధించి, వారి సామంత, మాండలిక, సచివ, అంగ రక్షకులకు చెందిన అనేక శాసనాలు లభించినాయి. ఇవి వరంగల్లు, కరీంనగర్, నల్గొండ, ద్రాక్షారామము, వేల్పూరు ప్రాంతములందు కనిపించుతున్నవి. నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము , 1195 గుంటిపల్లి ఎఱకపురము వేల్పూరు శాసనము, 1199 వేల్సునూరు నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము 2 , 1202 నామి రెడ్డి నాగులపాడు శాసనము, 1202 ఎఱకసాని పిల్లలమర్రి శాసనము, 1208 క్రొపోలు ఉప్పరిపాడు మ్రోంతుకూరు పిల్లలమర్రి శాసనము, కాలము తెలీదు కల్లూరు నేరట్ల చెరువు చిల్లపల్లి నామి రెడ్డి పిల్లలమర్రి శాసనము 3 కాలము తెలీదు ద్రాక్షారామ శాసనము , 1212 చిట్యాలంపాడు శాసనము, 1213 చిట్యాలంపాడు బేతిరెడ్డి సోమవరము శాసనము, 1213 ఎలకుర్తి శాసనము ఎలకుర్తి కమ్మేపల్లి సోమవరము శాసనము బిక్కమాలె చింతపల్లి కట్టచెరువు పాలంపేట శాసనము , 1213 నెక్కొండ ఓరుగల్లు ఉప్పరపల్లి బోర్లపల్లి నడకుడె పెద్ద గణపతిరెడ్ది ద్రాక్షారామ శాసనము డిచ్చకుంట శాసనము డిచ్చకుంట గొల్లకోట మాచాపూర్ శాసనము రామన్న పేట శాసనము , 1213 మారటూరు కాట్యబోయనిమెట్ట ఊటూరు శాసనము , 1216 మాచాపూర్ శాసనము, 1217 పాదనిపల్లి బోడుపాటు బోడు కోడూరు వెన్నయవల్లి డిచ్చకుంట శాసనము 2, 1217 తాడువాయి శాసనము తాడువాయి నాగులపాడు శాసనము, 1234 మర్రెపాడు సోమవరము శాసనము, 1234 గొడిశాల శాసనము , 1235 బొక్కెర ఉదయగిరి ద్రాక్షారామము పించఱపల్లి బొమ్మకల్లు దోసపాడు శాసనము, 1254 కామిరెడ్డి నాగులపాడు శాసనము , 1258 కామిరెడ్డి అన్నవరము శాసనము, 1258 గణపి రెడ్డి మర్రెడ్ల నాగులపాడు శాసనము నాగులపాడు శాసనము ధర్మారావు పేట శాసనము రాజవీధి వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:కాకతి వంశ సామంతులు వర్గం:తెలుగు శాసనాలు
ఆమనగల్లు
https://te.wikipedia.org/wiki/ఆమనగల్లు
అమనగల్లు, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, వేములపల్లి మండలంలోని గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ఇది మండల కేంద్రమైన వేములపల్లి నుండి 22 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో 2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది. గ్రామ చరిత్ర ఇది రేచర్ల రెడ్డి వంశీయులకు జన్మస్థానం.వారికిది తొలి రాజధాని. ఇక్కడ ఇప్పటికీ ఈ రాజ వంశీయులు నిర్మించిన ఓ పురాతన కోట ఉంది. మధ్యయుగాల్లో ఇదొక ముఖ్యమైన వ్యాపారకేంద్రంగా అభివృద్ధి చెందింది. గ్రామ జనాభా 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1241 ఇళ్లతో, 4510 జనాభాతో 2143 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2247, ఆడవారి సంఖ్య 2263. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1838 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 19. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 577043.పిన్ కోడ్: 508374. విద్యా సౌకర్యాలు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి పాములపహాడ్లో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల సూర్యాపేటలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నార్కట్ పల్లిలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు సూర్యాపేటలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం సూర్యాపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నల్గొండ లోనూ ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం ఆమంగల్లో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. పారిశుధ్యం గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. సమాచార, రవాణా సౌకర్యాలు ఆమంగల్లో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ఆటో సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. విద్యుత్తు గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూమి వినియోగం ఆమంగల్లో భూ వినియోగం కింది విధంగా ఉంది: వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 49 హెక్టార్లు వ్యవసాయం సాగని, బంజరు భూమి: 261 హెక్టార్లు శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 55 హెక్టార్లు తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 246 హెక్టార్లు వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 125 హెక్టార్లు సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 585 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 822 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 804 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 603 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు ఆమంగల్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. బావులు/బోరు బావులు: 504 హెక్టార్లు* చెరువులు: 99 హెక్టార్లు ఉత్పత్తి ఆమంగల్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధాన పంటలు వరి, ప్రత్తి, కంది మూలాలు వెలుపలి లంకెలు
పిల్లలమర్రి
https://te.wikipedia.org/wiki/పిల్లలమర్రి
పిల్లలమర్రి తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలంలోని గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ఇది మండల కేంద్రమైన సూర్యాపేట నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది.పిల్లలమర్రి అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో 2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది. చరిత్ర thumb|కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు 1195లో వేయించిన పిల్లలమర్రి శిలాశాసనం|alt=|333x333px చారిత్రాత్మక ఈ గ్రామాన్ని కాకతీయ రాజులు పరిపాలించారు. వారి హయాంలో అనేక దేవాలయాలు అప్పటి శిల్పశైలిని అనుసరించి నిర్మించారు.ఈ దేవాలయాలలో ఉన్న శిలాశాసనాలు అప్పటి చరిత్రను తెలుపుతున్నాయి. శాలివాహన శకం 1130 (సా.శ. 1208) లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు కన్నడ, తెలుగు భాషలలో వేయించిన శిలాశాసనం ఉంది. గణపతి దేవుడు కంటే ముందు పరిపాలించిన కాకతీయ చక్రవర్తి, రుద్రదేవుడు శాలివాహన శకం 1117 (సా.శ.1195) సంవత్సరములో వేయించిన శిలాశాసనం కూడా ఉంది. కాకతీయుల కాలం నాటి నాణెములు కూడా ఈ గ్రామములో లభించాయి. కాకతీయుల తరువాత పిల్లలమర్రి రేచర్ల రెడ్డి రాజులకు రాజధానిగా విలసిల్లినది. ప్రఖ్యాత తెలుగు కవి పిల్లలమర్రి పిన వీరభద్రుడు జన్మస్థలము పిల్లలమర్రి దేవాలయాలు thumb|ఎఱకేశ్వర ఆలయంలోని ఒక స్తంభము|alt=|333x333px ఈ గ్రామములో ఉన్న చెన్నకేశవస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము మాఘమాసంలో ప్రత్యేక ఉత్సవాలకు వేలాది భక్తులు తరలివస్తారు. ఇక్కడ అపూర్వమైన శిల్పకళతో భాసిల్లుతున్న చెన్నకేశవస్వామి దేవాలయం, నామేశ్వర, త్రికూటేశ్వర, ఎఱకేశ్వర దేవాలయాలు ఉన్నాయి. హైదరాబాదు నుండి ఖమ్మం లేదా విజయవాడ వెళ్ళే దారిలో సూర్యాపేటకు ఆరు కిలోమీటర్ల ముందు ఎడమవైపు పిల్లలమర్రి శివాలయానికి దారి చూపిస్తూ ఒక బోర్డు ఉంది. ఆంధ్రుల సాంఘిక చరిత్ర నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట తాలూకాలో పిల్లలమర్రి యను గ్రామములో బహు మనోహరమగు దేవాలయములను నామిరెడ్డి కట్టించెను. (రచయిత సురవరం ప్రతాపరెడ్డి...సంవత్సరం 1950 .........ప్రచురణకర్త సురవరము ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి చిరునామా హైదరాబాదు). గ్రామ జనాభా 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2147 ఇళ్లతో, 8600 జనాభాతో 3043 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4300, ఆడవారి సంఖ్య 4300. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1906 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 942. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576956.పిన్ కోడ్: 508376. విద్యా సౌకర్యాలు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప బాలబడి సూర్యాపేటలో ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల సూర్యాపేటలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నార్కట్ పల్లిలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు సూర్యాపేటలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం సూర్యాపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నల్గొండ లోనూ ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం పిల్లలమర్రిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది. ప్రైవేటు వైద్య సౌకర్యం గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. పారిశుధ్యం గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. సమాచార, రవాణా సౌకర్యాలు పిల్లలమర్రిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం ఉంది. జనన మరణాల నమోదు కార్యాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. విద్యుత్తు గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 8 గంటల పాటు వ్యవసాయానికి, 8 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూమి వినియోగం పిల్లలమర్రిలో భూ వినియోగం కింది విధంగా ఉంది: వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 184 హెక్టార్లు వ్యవసాయం సాగని, బంజరు భూమి: 133 హెక్టార్లు శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 231 హెక్టార్లు తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 15 హెక్టార్లు వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 19 హెక్టార్లు సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 569 హెక్టార్లు బంజరు భూమి: 1531 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 356 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 1484 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 973 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు పిల్లలమర్రిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. కాలువలు: 550 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 422 హెక్టార్లు ఉత్పత్తి పిల్లలమర్రిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తులు గ్రానైట్, ఇటుకలు ఇవి కూడా చూడండి కాకతీయులు గణపతి దేవుడు మూలాలు బయటి లింకులు జాతీయ సూచనకేంద్రం వారి వెబ్ సైటు నుండి పిల్లలమర్రి గురించి
నాగులపాడు
https://te.wikipedia.org/wiki/నాగులపాడు
నాగులపాడు పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా: నాగులపాడు (సూర్యాపేట) - సూర్యాపేట దగ్గరలోని గ్రామం, రేచర్ల నామిరెడ్డి తొలి నివాసం నాగులపాడు (ఆత్మకూరు) - నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలానికి చెందిన గ్రామం నాగులపాడు (డక్కిలి) -శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని డక్కిలి మండలానికి చెందిన గ్రామం నాగులపాడు (పెదనందిపాడు) - గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని గ్రామం నాగులపాడు (అద్దంకి) - ప్రకాశం జిల్లా లోని అద్దంకి మండలంలోని గ్రామం
భారతీయ సంఖ్యా మానము
https://te.wikipedia.org/wiki/భారతీయ_సంఖ్యా_మానము
thumb ప్రపంచంలో పది భూమిగా గల సంఖ్యావ్యవస్థ భారతదేశంలో పుట్టినట్లు చెప్పవచ్చు. మొట్టమొదట సంఖ్యా వ్యవస్థ యొక్క స్థానములు భారతదేశం లోనే అభివృద్ధి చెందినవి. భారత దేశ సంఖ్యా వ్యవస్థ అనునది హిందూ-అరబిక్ సంఖ్యా వ్యవస్థ లేదా అరబిక్ సంఖ్యల స్థానములలో పశ్చిమ భాగంలో కొంతభాగం నిర్దేసశించబడుతుంది. ఈ సంఖ్యా వ్యవస్థ అరబ్బుల వల్ల ఐరోపా దేశాలకు చేరినది. దేవనాగరి అంకెలు, వాటి సంస్కృత నామములు ఈ క్రింది పట్టికలో భారత అంకెలు వాటి నవీన దేవనాగరి రూపంలో, యూరోపియన్ (హిందూ-అరబిక్) సమానార్థములలో, వాటి సంస్కృత ఉచ్ఛారణ, కొన్ని యితర భాషలలో అనువాదములు సూచించబడినవిList of numbers in various languages. ModernDevanagariHindu-Arabic Sanskrit word for theordinal numeral (wordstem) Translations in some languages० 0 (शून्य) sifr (Arabic)१ 1 (एक) echad (Hebrew)२ 2 (द्वि) dva (Russian)३ 3 (त्रि) tre (Italian)४ 4 (चतुर्) katër (Albanian)५ 5 (पञ्च) penki (Lithuanian)६ 6 (षष्) seis (Spanish)७ 7 (सप्त) şapte (Romanian)८ 8 (अष्ट) astoņi (Latvian)९ 9 (नव) naw (Welsh) సంస్కృతం అనునది ఇండో యూరోపియన్ భాష అయినందిన, గ్రీకు, లాటిన్ భాషలో గల అంకెలతో యించుమించు సమానముగా ఉండుట గమనించవచ్చు. "శూన్య" అనగా "0" అనునది అరబిక్ లో "صفر" "sifr", (ఏమీలేదని అర్థం) నుండి అనువదం చేయబడింది.ఇది అనేక యూరోపియన్ భాషలలో "zero"గా మారినది.Online Etymological Dictionary దక్షిణ భారతీయ భాషలు Arabic numerals0123456789Used InTelugu numerals೦౧౨౩౪౫౬౭౮౯తెలుగుTamil numerals೦௧௨௩௪௫௬௭௮௯Tamil languageKannada numerals೦೧೨೩೪೫೬೭೮೯Kannada languageMalayalam numerals൦൧൨൩൪൫൬൭൮൯Malayalam language ఇతర నవీన భారతీయ భాషలు హిందీ, మరాఠీ, కొంకణి, నేపాలీ, సంస్కృతం వంటి భాషలు దేవనాగరి లిపి నుండి దత్తత తీసుకొనబడినవి. ఈ క్రింది పట్టికలో అనెక నవీన భారత లిపులలో సంఖ్యల సంజ్ఙలు (0నుండి 9 వరకు) సూచించ బడినవి. Arabic Numerals0123456789Used inBengali numerals০১২৩৪৫৬৭৮৯Bengali and Assamese languagesGujarati numerals૦૧૨૩૪૫૬૭૮૯Gujarati languageMarathi numerals०१२३४५६७८९Marathi, Sanskrit and Hindi languagesGurmukhi numerals੦੧੨੩੪੫੬੭੮੯Punjabi languageOriya numerals୦୧୨୩୪୫୬୭୮୯Oriya language చరిత్ర భారతదేశంలో దశాంశ వ్యవస్థ క్రీ.పూ 500 నాడే గుర్తించబడింది. ఈ శకమునకు ముంది బ్రహ్మీ అంకెల వ్యవస్థ వాడులలో ఉండెడిది. ఈ వ్యవస్థ సంఖ్యల స్థానవిలువలను పరిపూర్ణం చేయలేకపోయింది. బ్రహ్మీ విధానంలో పది, వంద, వెయ్యి లకు క్రొత్త సంజ్ఞలు ఉండెడివి. భారత దేశ స్థానవిలువల వ్యవస్థ పొరుగు దేశమైన పర్షియా దేశానికి అరబ్బులనుండి వ్యాపించింది. సా.శ. 662 లో నేస్టోరియన్ (ప్రస్తుతం ఇరక్) మత గురువు ఇలా సందేశం ఇచ్చాడు. I will omit all discussion of the science of the Indians ... of their subtle discoveries in astronomy — discoveries that are more ingenious than those of the Greeks and the Babylonians - and of their valuable methods of calculation which surpass description. I wish only to say that this computation is done by means of nine signs. If those who believe that because they speak Greek they have arrived at the limits of science would read the Indian texts they would be convinced even if a little late in the day that there are others who know something of value. 7 వ శతాబ్దంలో బ్రహ్మగుప్తుడు రాసిన రాతప్రతి ఆధారంగా అంకెలలో సున్నను పదవ స్థానంగా నిర్ణయించారు. కానీ 5 వ శతాబ్దం నకు పూర్వము బక్షాలీ రాతప్రతిలో కూడా సున్న చేర్చబడింది. కొలంబియాలో ఖ్మెర్ అంకెలలో 7 వశతాబ్దంలో సున్న ఉపయోగించినట్లు ఆధారములున్నవి. మూలాలు Georges Ifrah, The Universal History of Numbers. John Wiley, 2000. Sanskrit Siddham (Bonji) Numbers Karl Menninger, Number Words and Number Symbols - A Cultural History of Numbers ISBN 0-486-27096-3 David Eugene Smith and Louis Charles Karpinski, The Hindu-Arabic Numerals (1911) సంఖ్యా మానము వర్గం:సంఖ్యామానాలు
డిసెంబర్ 8
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_8
డిసెంబర్ 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 342వ రోజు (లీపు సంవత్సరములో 343వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 23 రోజులు మిగిలినవి. సంఘటనలు 1946: భారత రాజ్యాంగ సభ తొలిసారి సమావేశమైంది. 2009 : డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్‌హాగెన్ లో 15వ ప్రపంచ వాతావరణ సదస్సు ప్రారంభమైనది. జననాలు 1721 : బాలాజీ బాజీరావ్ మరాఠా సామ్రాజ్యపు 10వ పీష్వా (మ.1761). 1932 : చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (మ.2015). 1935: ధర్మేంద్ర , భారతీయ చలనచిత్ర నటుడు , రాజకీయ నాయకుడు. 1939: ఎల్.ఆర్.ఈశ్వరి , నేపథ్య గాయని. 1947: గంగైఅమరన్, సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు 1953: మనోబాల, సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు (మ. 2023) 1984: హంసా నందిని, మోడల్, తెలుగునటి 1992: శాన్వీ, శ్రీవాత్సవ, తెలుగు,కన్నడ, మళయాళ, మరాఠి , చిత్రాల నటి. మరణాలు thumb|NedunuriKrishnaMurthy 1991: చతుర్వేదుల నరసింహశాస్త్రి, సాహిత్యవేత్త. (జ.1924) 2002: భగవాన్ (చిత్రకారుడు), మంచి వ్యంగ్య చిత్రకారులు. (జ.1939) 2004: చిత్తజల్లు శ్రీనివాసరావు, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (జ.1924) 2010: నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (జ.1926) 2014: పిరాట్ల వెంకటేశ్వర్లు, పత్రికా సంపాధకుడు, రచయిత. (జ.1940) 2014: నేదునూరి కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (జ.1927) పండుగలు , జాతీయ దినాలు హోంగార్డ్స్ ఏర్పాటు దినోత్సవం. జలాంతర్గాముల దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 7 - డిసెంబర్ 9 - నవంబర్ 8 - జనవరి 8 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 9
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_9
డిసెంబర్ 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 343వ రోజు (లీపు సంవత్సరములో 344వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 22 రోజులు మిగిలినవి. సంఘటనలు 1966: ఐదవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్లో ప్రారంభమయ్యాయి. 2009: అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేశారు. జననాలు 1742: కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (మ.1786) 1908: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, పురాణ ప్రవచకుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1995) 1913: హొమాయ్ వ్యరవాలా, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (మ.2012) 1934: అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (మ.2000) 1946: సోనియా గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. 1970: వి.సముద్ర , తెలుగు చలన చిత్ర దర్శకుడు. 1975: ప్రియాగిల్ , హిందీ, తెలుగు,తమిళ , మలయాళం, పంజాబీ, చిత్ర నటి . 1981: కీర్తి చావ్లా , తెలుగు, తమిళ ,కన్నడ, చిత్రాల నటి. 1981: దియా మీర్జా , నటి, మోడల్, నిర్మాత . మరణాలు thumb|Valluri Basavaraju 1986: వల్లూరి బసవరాజు, హేతువాది, ఆంధ్ర మహాసభ కార్యకర్త, అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు. 1986: వెదిరె రామచంద్రారెడ్డి, భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి (జ. 1905) 2013: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (జ.1914) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రపంచ రోగి భద్రతా దినము బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 8 - డిసెంబర్ 10 - నవంబర్ 9 - జనవరి 9 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 10
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_10
డిసెంబర్ 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 344వ రోజు (లీపు సంవత్సరములో 345వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 21 రోజులు మిగిలినవి. సంఘటనలు 1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారిగా విధింఛిన రాష్ట్రపతి పాలనకు ఆఖరి రోజు (1973 జనవరి 10 నుంచి 1973 డిసెంబర్ 10 వరకు). 1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరవ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ప్రమాణ స్వీకారం (10 డెసెంబర్ 1973 నుంచి 1978 మార్చి 6 వరకు). 1955: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2003: తెలుగు వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభం. 2004: టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారునిగా అనిల్ కుంబ్లే అవతరించాడు. జననాలు thumb|C Rajagopalachari Feb 17 2011 1877: రావిచెట్టు రంగారావు, తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన వ్యక్తి. (మ.1910) 1878: చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ (మ.1972). 1880: కట్టమంచి రామలింగారెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (మ.1951) 1897: సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, తెలుగు పండిత కవి (మ.1982). 1902: ఎస్.నిజలింగప్ప, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు. 1902: ఉప్పల వేంకటశాస్త్రి, ఉత్తమశ్రేణికి చెందిన కవి. (మ.1976) 1920: గంటి కృష్ణవేణమ్మ, తెలుగు కవయిత్రి. 1943: మాణిక్య వినాయగం , ప్లే బ్యాక్ సింగర్, జానపద సంగీతం (మ.2021) 1948: రేకందార్ ఉత్తరమ్మ, తెలుగు రంగస్థల, సినిమా నటి. 1952: సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (మ.2011) 1954: జలీల్ ఖాన్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు. 1960: రతి అగ్నిహోత్రి , పలు భారతీయ చిత్రాల నటి 1982: జివిద శర్మ , హిందీ, పంజాబీ, తెలుగూ చిత్రాల నటి 1985: కామ్నా జఠ్మలానీ, దక్షిణ భారత చలన చిత్ర నటి, ప్రచార కర్త. మరణాలు 1896: ఆల్‍ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త (జ.1833). 1990: తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, లలితా త్రిపుర సుందరీ ఉపాసకుడు (జ.1896). 2013: రావెళ్ళ వెంకట రామారావు, తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు (జ.1927). పండుగలు, జాతీయ దినాలు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ప్రపంచ జంతువుల హక్కుల దినం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 9 - డిసెంబర్ 11 - నవంబర్ 10 - జనవరి 10 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 11
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_11
డిసెంబర్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 345వ రోజు (లీపు సంవత్సరములో 346వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 20 రోజులు మిగిలినవి. సంఘటనలు 1891: తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో, రాజమండ్రిలో జరిగింది. 1911: నేపాల్ రాజు త్రిభువన్ అధికారంలోకి వచ్చాడు. 1946: భారత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. 1946: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ అమలులోకి వచ్చింది. 1965: హైదరాబాదు లోని రామచంద్రాపురంలో బి.హెచ్.ఇ.ఎల్ కర్మాగారాన్ని, నాటి భారత ప్రధానమంత్రి, లాల్‌ బహదూర్ శాస్త్రి ప్రారంభించాడు. 1967: పశ్చిమ భారతదేశములో వచ్చిన భూకంపము వలన 170 మంది మరణించారు. ఆ భూకంపము తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.5గా నమోదు అయ్యింది జననాలు 1882: సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్యయోధుడు. (మ.1921) 1864: సత్తిరాజు సీతారామయ్య, దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (మ.1945) 1896: గ్రంధి మంగరాజు, సినిమా పంపిణీదారుడు, నిర్మాత. 1922: దిలీప్ కుమార్ , భారతీయ చలనచిత్ర నటుడు,నిర్మాత,దర్శకుడు ,రాజకీయ నాయకుడు . 1931: ఓషో, భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (మ.1990) 1934: సలీం దుర్రానీ, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1935: ప్రణబ్ ముఖర్జీ, భారత 13 వ రాష్ట్రపతి. 1948:రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు. (మ.2008) 1967: మునిమడుగుల రాజారావు, తాత్విక రచయిత 1969: విశ్వనాథన్ ఆనంద్, భారత చదరంగ క్రీడాకాకారుడు. 1995: నభా నటేష్ , కన్నడ, తెలుగు, చలన చిత్ర నటి, మోడల్ . మరణాలు thumb|ఎం.ఎస్.సుబ్బులక్ష్మి 1756: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికా. (జ.1694) 1783: రఘునాథరావ్, మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా. (జ.1734) 1967: మెహర్ చంద్ మహాజన్, భారతదేశ మూడవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1889) 2004: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. (జ.1916) 2011: మల్లెమాల సుందర రామిరెడ్డి, తెలుగు రచయిత, సినీ నిర్మాత. (జ.1924) 2013: శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్, మైసూర్ రాజ కుటుంబం యొక్క వారసుడు. (జ.1953) 2016: పి.వి. రాజేశ్వర్ రావు: రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి. (జ. 1946) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ పర్వత దినోత్సవం యూనిసెఫ్ దినోత్సవం. వితంతు పునర్వివాహా దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 10 - డిసెంబర్ 12 - నవంబర్ 11 - జనవరి 11 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 12
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_12
డిసెంబర్ 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 346వ రోజు (లీపు సంవత్సరములో 347వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 19 రోజులు మిగిలినవి. సంఘటనలు 1972 - 1973- జననాలు 1890: కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. (జ.1970) 1905: ముల్క్ రాజ్ ఆనంద్, ఒక భారతీయ ఆంగ్ల రచయిత. (మ.2004) 1925: కానేటి మోహనరావు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2014) 1931: షావుకారు జానకి, తెలుగు సినీ కథానాయిక, 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మలయాళం సినిమాలోను నటించింది. 1935: వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (మ.2016) 1936: బి. ఆర్. చలపతిరావు, ఆకాశవాణి డైరక్టరేట్ లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ప్రముఖుడు. 1945: నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములోని హాస్యనటుడు, ప్రతినాయకుడు. (మ.2011) 1950: రజినీకాంత్, భారతదేశంలో ప్రజాదరణ కలిగిన నటుడు. 1981: యువరాజ్ సింగ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు. మరణాలు thumb|Asaf Jah VI 1884: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (జ.1798). 1911: మహబూబ్ ఆలీ ఖాన్, హైదరాబాదును పాలించిన 6వ నిజాం (జ.1866). 1971: పెమ్మరాజు రామారావు, ఈయన సుమారు 500 నాటక ప్రదర్శనలలో విభిన్న స్త్రీ పురుష పాత్రలను పోషించాడు. 2015: శరద్ అనంతరావు జోషి, రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (జ.1935) 2019: గొల్లపూడి మారుతీరావు రచయిత, నటుడు, సంపాదకుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి (జ.1939) పండుగలు , జాతీయ దినాలు అస్సాం రైఫిల్స్ స్థాపన దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 11 - డిసెంబర్ 13 - నవంబర్ 12 - జనవరి 12 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 13
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_13
డిసెంబర్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 347వ రోజు (లీపు సంవత్సరములో 348వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 18 రోజులు మిగిలినవి. సంఘటనలు 2001: భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు. 1865 : శ్వేతజాతి ఆధిపత్యం తగ్గిపోవడాన్ని సహించలేని కొందరు దురహంకారులు కుక్లక్స్‌ క్లాన్‌ అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ సభ్యులు నల్లజాతివారిపై చేసిన అత్యాచారాలకు అంతేలేదు. 1968 : నాసా అంతరిక్షనౌక అపోలో 8లోప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు. 1989 : మనదేశంలో మొట్టమొదటి ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ 'ఎస్సెల్‌ వరల్డ్‌' ముంబయిలో ప్రారంభమైంది. 1999 : ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు హైజాక్‌ చేశారు. 2000 : భారత్ కు చెందిన చదరంగం ఆటగాడు, విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. ఆ ఘనత సాధించిన తొలి ఆసియా ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌. 2002 : ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించాడు. జననాలు 1835: పటాని సమంత్, భారతీయ ఖగోళ శాస్త్రవేత్త (మ.1904) 1894: బసవరాజు అప్పారావు, కవి. భావకవితాయుగంలోని కవుల్లో ఒకడుగా ఆయన తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాడు (1933). 1911: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ట్రిగ్వే హవిల్మొ (మ.1999). 1928: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత. ఈయన ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడుగా పనిచేశాడు [మ. 2010]. 1952: యెర్రగుడిపాటి లక్ష్మి, దక్షిణ భారతీయ నటీమణి, జూలీలో ప్రధాన పాత్ర పోషించిన నటిగా ప్రసిద్ధి చెందింది. 1960: దగ్గుపాటి వెంకటేష్, సినీ నటుడు. 1981: ఏమీ లీ, అమెరికన్ గాయని-గేయ రచయిత్రి, పియానిస్ట్. 1984: మధు శర్మ , చలన చిత్ర నటి , నిర్మాత . 1989: టేలర్ స్విఫ్ట్, అమెరికా దేశపు గాయని, పాటల రచయిత, నటీమణి. 1988: రెజీనా , తెలుగు,తమిళ,కన్నడ నటి.. మరణాలు thumb|బారు అలివేలమ్మ 1973: బారు అలివేలమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు (జ.1897). 1977: బెహరా కమలమ్మ, "తనుమధ్యాంబ" పీఠానికి వారసురాలు (జ.1904). 1986: స్మితా పాటిల్, హిందీ సినీనటి (జ.1955). 1994: నీలం రాజశేఖరరెడ్డి, భారతీయ కమ్యూనిస్టు నేత, మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సోదరుడు (జ.1918). 2007: తేళ్ల లక్ష్మీకాంతమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెసు నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు. (జ.1924) 2016: కొల్లూరు సత్యనారాయణ శాస్త్రి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (జ.1922) పండుగలు , జాతీయ దినాలు - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 12 - డిసెంబర్ 14 - నవంబర్ 13 - జనవరి 13 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 14
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_14
డిసెంబర్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 348వ రోజు (లీపు సంవత్సరములో 349వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 17 రోజులు మిగిలినవి. సంఘటనలు 2017 - ఐఎన్ఎస్ కరంజ్ జలాంతర్గామి జలప్రవేశం. జననాలు 1914: మాకినేని బసవపున్నయ్య, మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. (మ.1992) 1923: అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటకకర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది 1963: భరత్ అరుణ్ భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు. 1982: ఆది పినిశెట్టి, తెలుగు మరియూ తమిళ 1982: సమీరా రెడ్డి, టాలీవుడ్,బాలీవుడ్,సినీ నటి. 1984: రానా దగ్గుపాటి , తెలుగు ,తమిళ, హిందీ చిత్రాలనటుడు . మరణాలు thumb|జార్జ్ వాషింగ్టన్ - గిల్బర్ట్ స్టువర్ట్ విలియమ్స్‌టౌన్ పోర్ట్రెయిట్ 1799: జార్జి వాషింగ్టన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1732) 1915: కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (జ.1842) 1965: జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి, నవలా రచయిత, నాటకకర్త. (జ.1906) 2008: జ్వాలాముఖి, రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. (జ.1938) 2014: పి.జె.శర్మ, డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1933) పండుగలు , జాతీయ దినాలు జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం. అంతర్జాతీయ కోతుల దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 13 - డిసెంబర్ 15 - నవంబర్ 14 - జనవరి 14 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 15
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_15
డిసెంబర్ 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 349వ రోజు (లీపు సంవత్సరములో 350వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 16 రోజులు మిగిలినవి. సంఘటనలు 1600కి ముందు 533 - వాండలిక్ యుద్ధం : బైజాంటైన్ జనరల్ బెలిసారియస్ ట్రికామరం యుద్ధంలో గెలిమర్ రాజు నేతృత్వంలోని వాండల్స్‌ను ఓడించాడు . 687 - పోప్ సెర్గియస్ I యాంటీపోప్‌లు పాస్చల్, థియోడర్ మధ్య రాజీగా ఎన్నికయ్యాడు . 1025 - కాన్స్టాంటైన్ VIII సహ-చక్రవర్తిగా పట్టాభిషేకం చేసిన 63 సంవత్సరాల తర్వాత బైజాంటైన్ సామ్రాజ్యానికి ఏకైక చక్రవర్తి అయ్యాడు . 1161 - జిన్-సాంగ్ యుద్ధాలు : కైషీ యుద్ధంలో సైనిక ఓటమి తర్వాత జిన్ రాజవంశానికి చెందిన చక్రవర్తి వాన్యన్ లియాంగ్‌పై సైనిక అధికారులు కుట్ర పన్నారు, అతని శిబిరంలో చక్రవర్తిని హత్య చేశారు. 1167 - సిసిలియన్ ఛాన్సలర్ స్టీఫెన్ డు పెర్చే తిరుగుబాటును నివారించడానికి రాజ న్యాయస్థానాన్ని మెస్సినాకు తరలించాడు. 1256 - ఇస్లామిక్ నైరుతి ఆసియాపై వారి దాడిలో భాగంగా హులాగు ఆధ్వర్యంలోని మంగోల్ దళాలు అలముట్ కాజిల్ (ప్రస్తుత ఇరాన్‌లో ) వద్ద ఉన్న నిజారీ ఇస్మాయిలీ ( హంతకుడు ) బలమైన కోటలోకి ప్రవేశించి కూల్చివేసాయి . 1270 - పర్షియాలోని గెర్డ్‌కుహ్ యొక్క నిజారీ ఇస్మాయిలీ గారిసన్ 17 సంవత్సరాల తర్వాత మంగోలులకు లొంగిపోయింది . 1467 - మోల్దవియాకు చెందిన స్టీఫెన్ III హంగరీకి చెందిన మాథియాస్ కార్వినస్‌ను ఓడించాడు, తరువాతివాడు మూడుసార్లు గాయపడ్డాడు, భయా యుద్ధంలో . 1601–1900 1651 - మూడవ ఆంగ్ల అంతర్యుద్ధంలో రాజుకు మద్దతునిచ్చిన చివరి బలమైన కోట అయిన గ్వెర్న్సీలోని క్యాజిల్ కార్నెట్ లొంగిపోయింది. 1778 - అమెరికన్ రివల్యూషనరీ వార్ : సెయింట్ లూసియా యుద్ధంలో బ్రిటిష్, ఫ్రెంచ్ నౌకాదళాలు ఘర్షణ పడ్డాయి . 1791 - వర్జీనియా జనరల్ అసెంబ్లీ ఆమోదించినప్పుడు యునైటెడ్ స్టేట్స్ హక్కుల బిల్లు చట్టంగా మారింది . 1836 - వాషింగ్టన్, DC లోని US పేటెంట్ ఆఫీస్ భవనం దాదాపుగా నేలమీద కాలిపోయింది, ఆ తేదీ వరకు ఫెడరల్ ప్రభుత్వం జారీ చేసిన మొత్తం 9,957 పేటెంట్లను అలాగే 7,000 సంబంధిత పేటెంట్ నమూనాలను నాశనం చేసింది . 1864 - అమెరికన్ సివిల్ వార్ : నాష్‌విల్లే యుద్ధం టేనస్సీలోని నాష్‌విల్లేలో ప్రారంభమైంది, మరుసటి రోజు యూనియన్ ఆర్మీ ఆఫ్ కంబర్‌ల్యాండ్ పోరాట శక్తిగా కాన్ఫెడరేట్ ఆర్మీ ఆఫ్ టేనస్సీని నాశనం చేయడంతో ముగిసింది . 1869 - జపాన్‌లోని ఎజో ప్రాంతంలో స్వల్పకాలిక రిపబ్లిక్ ఆఫ్ ఎజో ప్రకటించబడింది . జపాన్‌లో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ఇది మొదటి ప్రయత్నం . 1890 - హంక్‌పాపా లకోటా నాయకుడు సిట్టింగ్ బుల్ స్టాండింగ్ రాక్ ఇండియన్ రిజర్వేషన్‌లో చంపబడ్డాడు, ఇది గాయపడిన మోకాలి ఊచకోతకు దారితీసింది . 1893 – సింఫనీ నం. 9 ("ఫ్రమ్ ది న్యూ వరల్డ్" అకా "న్యూ వరల్డ్ సింఫనీ") ఆంటోనిన్ డ్వోర్క్ ద్వారా న్యూయార్క్ నగరంలోని కార్నెగీ హాల్‌లో పబ్లిక్ మధ్యాహ్నం రిహార్సల్‌లో ప్రదర్శించబడింది, ఆ తర్వాత డిసెంబర్ 16 సాయంత్రం కచేరీ ప్రీమియర్ ప్రదర్శించబడుతుంది. 1899 - దక్షిణాఫ్రికాలోని నాటల్‌లోని కొలెన్సో యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీ దళాలు ఓడిపోయాయి, రెండవ బోయర్ యుద్ధం యొక్క బ్లాక్ వీక్‌లో జరిగిన మూడవ, చివరి యుద్ధం === 1901ప్రస్తుతం === 1903 - ఇటాలియన్ అమెరికన్ ఫుడ్ కార్ట్ విక్రేత ఇటలో మర్చియోనీ ఐస్ క్రీం కోన్‌లను తయారుచేసే యంత్రాన్ని కనుగొన్నందుకు US పేటెంట్‌ను అందుకున్నాడు . 1905 - అలెగ్జాండర్ పుష్కిన్ యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పుష్కిన్ హౌస్ స్థాపించబడింది . 1906 - లండన్ అండర్‌గ్రౌండ్ గ్రేట్ నార్తర్న్, పిక్కడిల్లీ, బ్రోంప్టన్ రైల్వే ప్రారంభించబడింది . 1914 - మొదటి ప్రపంచ యుద్ధం : ఆస్ట్రో-హంగేరియన్ సైన్యం నుండి సెర్బియా సైన్యం బెల్‌గ్రేడ్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది . 1914 - జపాన్‌లోని క్యుషులోని మిత్సుబిషి హోజో బొగ్గు గనిలో గ్యాస్ పేలుడు సంభవించి 687 మంది మరణించారు. 1917 - మొదటి ప్రపంచ యుద్ధం: రష్యా, సెంట్రల్ పవర్స్ మధ్య యుద్ధ విరమణ సంతకం చేయబడింది. 1939 – గాన్ విత్ ది విండ్ (అత్యధిక ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయబడిన వసూళ్ల చిత్రం) యునైటెడ్ స్టేట్స్‌లోని అట్లాంటా, జార్జియాలోని లోవ్స్ గ్రాండ్ థియేటర్‌లో దాని ప్రీమియర్‌ను అందుకుంది. 1941 - ఉక్రెయిన్‌లో హోలోకాస్ట్ : ఖార్కివ్ నగరానికి ఆగ్నేయంగా ఉన్న డ్రోబిట్స్‌కీ యార్ వద్ద జర్మన్ దళాలు 15,000 మంది యూదులను హత్య చేశాయి . 1942 - రెండవ ప్రపంచ యుద్ధం : గ్వాడల్‌కెనాల్ ప్రచారం సమయంలో మౌంట్ ఆస్టెన్, గాల్లోపింగ్ హార్స్, సీ హార్స్ యుద్ధం ప్రారంభమైంది . 1943 - రెండవ ప్రపంచ యుద్ధం: న్యూ బ్రిటన్ ప్రచారం సందర్భంగా అరావే యుద్ధం ప్రారంభమైంది . 1944 - రెండవ ప్రపంచ యుద్ధం: యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ వైమానిక దళానికి చెందిన మేజర్ గ్లెన్ మిల్లర్‌ను తీసుకువెళుతున్న సింగిల్-ఇంజిన్ UC-64A నార్స్‌మన్ విమానం ఇంగ్లీష్ ఛానల్ మీదుగా విమానంలో పోయింది. 1945 – జపాన్ యొక్క ఆక్రమణ / షింటో ఆదేశం : జనరల్ డగ్లస్ మాక్‌ఆర్థర్ జపాన్ యొక్క రాష్ట్ర మతంగా షింటోను రద్దు చేయాలని ఆదేశించాడు . 1960 - రిచర్డ్ పావ్లిక్ US అధ్యక్షుడిగా ఎన్నికైన జాన్ ఎఫ్. కెన్నెడీని హత్య చేయడానికి కుట్ర పన్నినందుకు అరెస్టయ్యాడు . 1960 – నేపాల్ రాజు మహేంద్ర దేశ రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి, పార్లమెంటును రద్దు చేసి, మంత్రివర్గాన్ని రద్దు చేసి, ప్రత్యక్ష పాలన విధించారు. 1961 - మానవాళికి వ్యతిరేకంగా నేరాలు, యూదు ప్రజలపై నేరాలు, చట్టవిరుద్ధమైన సంస్థ సభ్యత్వంతో సహా 15 నేరారోపణలపై ఇజ్రాయెల్ కోర్టు దోషిగా నిర్ధారించిన తరువాత అడాల్ఫ్ ఐచ్‌మన్‌కు మరణశిక్ష విధించబడింది. 1965 - ప్రాజెక్ట్ జెమిని : జెమిని 6A, వాలీ షిర్రా, థామస్ స్టాఫోర్డ్‌లచే రూపొందించబడింది, ఇది ఫ్లోరిడాలోని కేప్ కెన్నెడీ నుండి ప్రారంభించబడింది . నాలుగు కక్ష్యల తర్వాత, ఇది జెమిని 7 తో మొదటి స్పేస్ రెండెజౌస్‌ను సాధించింది . 1970 - సోవియట్ అంతరిక్ష నౌక వెనెరా 7 విజయవంతంగా వీనస్‌పై దిగింది . ఇది మరొక గ్రహంపై మొట్టమొదటి విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ . 1973 - జాన్ పాల్ గెట్టి III, అమెరికన్ బిలియనీర్ J. పాల్ గెట్టి మనవడు, జూలై 10న ఇటాలియన్ ముఠా కిడ్నాప్ చేయబడిన తర్వాత ఇటలీలోని నేపుల్స్ సమీపంలో సజీవంగా కనుగొనబడింది . 1973 – అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ తన అధికారిక మానసిక రుగ్మతల జాబితా, డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ నుండి స్వలింగసంపర్కాన్ని తొలగించడానికి 13-0 ఓటు వేసింది . 1978 - యుఎస్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ యునైటెడ్ స్టేట్స్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను గుర్తిస్తుందని, రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) తో దౌత్య సంబంధాలను తెంచుకుంటామని ప్రకటించారు . 1981 - లెబనాన్‌లోని బీరూట్‌లోని ఇరాకీ రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి కారు బాంబు దాడి, రాయబార కార్యాలయాన్ని సమం చేసింది, లెబనాన్‌లోని ఇరాక్ రాయబారితో సహా 61 మందిని చంపింది. ఈ దాడిని మొదటి ఆధునిక ఆత్మాహుతి దాడిగా పరిగణిస్తారు . 1989 - మరణశిక్ష రద్దుకు సంబంధించిన పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికకు రెండవ ఐచ్ఛిక ప్రోటోకాల్ ఆమోదించబడింది. 1993 - ది ట్రబుల్స్ : ది డౌనింగ్ స్ట్రీట్ డిక్లరేషన్‌ను బ్రిటీష్ ప్రధాన మంత్రి జాన్ మేజర్, ఐరిష్ టావోసీచ్ ఆల్బర్ట్ రేనాల్డ్స్ జారీ చేశారు . 1997 - తజికిస్తాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 3183 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా సమీపంలోని ఎడారిలో కూలి 85 మంది మరణించారు . 2000 - చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోని మూడవ రియాక్టర్ మూసివేయబడింది. 2001 - పిసా యొక్క లీనింగ్ టవర్ 11 సంవత్సరాల తర్వాత తిరిగి తెరవబడింది, దాని ప్రసిద్ధ లీన్‌ను పరిష్కరించకుండా, దానిని స్థిరీకరించడానికి $27,000,000 ఖర్చు చేయబడింది. 2005 – USAF క్రియాశీల సేవలో లాక్‌హీడ్ మార్టిన్ F-22 రాప్టర్ పరిచయం . 2010 - ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ద్వీపం తీరంలో 90 మంది శరణార్థులను తీసుకువెళుతున్న పడవ రాళ్లపై కూలి 48 మంది మరణించారు. 2013 - న్యాకురాన్‌లో జరిగిన నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించాలని ప్రతిపక్ష నాయకులు డాక్టర్ రిక్ మచార్, పాగన్ అముమ్, రెబెక్కా న్యాన్‌డెంగ్ ఓటు వేయడంతో దక్షిణ సూడానీస్ అంతర్యుద్ధం ప్రారంభమైంది. 2014 - గన్‌మ్యాన్ హరోన్ మోనిస్ సిడ్నీలోని మార్టిన్ ప్లేస్‌లోని ఒక కేఫ్‌లో 16 గంటలపాటు 18 మందిని బందీలుగా పట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయం పోలీసులు కేఫ్‌పై దాడి చేసినప్పుడు మోనిస్, ఇద్దరు బందీలు చనిపోయారు. 2017 - తాసిక్‌మలయ నగరంలోని ఇండోనేషియా ద్వీపం జావాపై 6.5M w భూకంపం సంభవించింది, ఫలితంగా  నలుగురు మరణించారు. 1952: ప్రత్యేకాంధ్ర సాధనకై 56 రోజుల నిరాహార దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యాడు. జననాలు 1914: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు కోదాటి నారాయణరావు. 1925: ఎస్.వి.భుజంగరాయశర్మ కవి, విమర్శకుడు, నాటక రచయిత. (మ.1997) 1931: దుర్గా నాగేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2018) 1933: వాసిరెడ్డి సీతాదేవి, రచయిత్రి. (మ.2007) 1933: బాపు, చిత్రకారుడు, సినీ దర్శకుడు. (జ.2014) 1937: పింగళి వెంకట రమణారావు, ఎలెక్ట్రాన్ అనే కలంపేరుతో ప్రసిద్ధుడైన కథా రచయిత. 1938: పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కథారచయిత (మ.2018) 1939: నూతలపాటి గంగాధరం, కవి, విమర్శకుడు. (మ.1975) 1945: విను చక్రవర్తి, తమిళ హాస్యనటుడు, సినీ రచయిత, దర్శకుడు (మ.2017) 1960: మధు యాస్కీ గౌడ్, ఆంధ్రప్రదేశ్ లోని నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1966: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు కార్ల్ హూపర్. 1973: బుర్రా సాయి మాధవ్, రంగస్థల నటుడు, చలనచిత్ర సంభాషణల రచయిత. 1990: లావణ్య త్రిపాఠి, మోడల్, తెలుగు, తమిళ, హిందీ, చిత్రాల నటి మరణాలు thumb|Chakri (music director) 1950: సర్దార్ వల్లభాయి పటేల్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి. 1952: పొట్టి శ్రీరాములు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి. 1974: కొత్త సత్యనారాయణ చౌదరి, సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది, ఉభయ భాషా ప్రవీణుడు. (జ.1907) 1985: శివసాగర్ రాంగులామ్, మారిషస్ తొలి ప్రధానమంత్రి, గవర్నర్ జనరల్ (జ.1900) 2014: చక్రి, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు. (జ.1974) 2019: నవోదయ రామమోహనరావు ప్రచురణకర్త, హేతువాది, కమ్యూనిస్టు, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. (జ.1934) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ టీ దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 14 - డిసెంబర్ 16 - నవంబర్ 15 - జనవరి 15 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 16
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_16
డిసెంబర్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 350వ రోజు (లీపు సంవత్సరములో 351వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 15 రోజులు మిగిలినవి. సంఘటనలు 1951: సాలార్‌జంగ్‌ మ్యూజియంను అప్పటి ప్రధానమంత్రి, జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు. 1970: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎం. హిదయతుల్లా పదవీ విరమణ. 1971: బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. జననాలు 1912: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత (మ.1975). 1919: చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు, స్వాతంత్ర్య సమరయోధుడు. 1800 ఎకరాలు దానం చేసిన దాత (మ.2012). 1922: కుందుర్తి ఆంజనేయులు, వచన కవితా పితామహుడు అనే బిరుదాంకితుడై, ఆంధ్ర దేశములో వచన కవితా ఉద్యమానికి ఆద్యుడు (మ.1982). 1949: తోట తరణి, సుమారు 100 సినిమాలకు కళా దర్శకత్వం వహించి, వాటి ప్రాచుర్యానికి తోడ్పడ్డాడు. మరణాలు thumb|క్వెస్నే పోర్ట్రెయిట్ 1774: ఫ్రాంకోయిస్ కేనే ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (జ.1694) 1928: పానగల్ రాజా, కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము, ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. (జ.1866) పండుగలు , జాతీయ దినాలు -1971 డిసెంబర్ 16 న భారతదేశం పాకిస్థాన్ తో తలపడి విజయాన్ని సాధించినందుకు గాను విజయ్ దివస్ ను జరుపుకొంటారు. విజయ్ దివస్ దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 15 - డిసెంబర్ 17 - నవంబర్ 16 - జనవరి 16 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 17
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_17
డిసెంబర్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 351వ రోజు (లీపు సంవత్సరములో 352వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 14 రోజులు మిగిలినవి. సంఘటనలు 1903: రైటు సోదరులు తయారుచేసిన విమానం మొదటిసారి ఎగిరింది. జననాలు 1778: సర్ హంఫ్రీ డేవీ, రసాయన శాస్త్రవేత్త. (మ.1829) 1866: కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (మ.1940) 1959: జయసుధ, సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత. మరణాలు thumb|కుడి|భోగరాజు పట్టాభిసీతారామయ్య 1273: జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి, పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ 1959: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (జ.1880) 1965: జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారతదేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌. (జ.1906) 1996: సూర్యకాంతం, తెలుగు సినిమా నటి. (జ.1924) పండుగలు , జాతీయ దినాలు పెన్షనర్స్ డే. 1956 : దుర్ముఖి - దత్తాత్రేయ జయంతి బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 16 - డిసెంబర్ 18 - నవంబర్ 17 - జనవరి 17 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 18
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_18
డిసెంబర్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 352వ రోజు (లీపు సంవత్సరములో 353వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 13 రోజులు మిగిలినవి. సంఘటనలు 1948: జాగృతి తెలుగు వారపత్రిక ప్రారంభమైనది. 1971: బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది. 1989: భారత లోక్‌సభ స్పీకర్‌గా బలరాం జక్కర్ పదవీ విరమణ. 2002: భారత ప్రధాన న్యాయమూర్తిగా జి.బి. పట్నాయక్ పదవీ విరమణ. 2014: భారతదేశానికి చెందిన భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III ప్రయోగం విజయవంతం. జననాలు thumb|Spielberg99 1824: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (మ.1892) 1913: విల్లీబ్రాంట్, పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్ (మ.1992). 1937: కాకరాల సత్యనారాయణ, నటుడు, పాత్రికేయుడు, డబ్బింగ్‌ ఆర్టిస్టు. 1938: తాడిపర్తి సుశీలారాణి, రంగస్థల నటి, హరికథ కళాకారిణి. 1946: స్టీవెన్ స్పీల్‌బెర్గ్, దర్శకుడు. 1947: ఎన్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగు కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రకాశరావు సాహిత్యంలో అత్యంత మక్కువ చూపేవాడు (మ.1973). 1970: దిల్ రాజు , నిర్మాత , పంపిణీ దారుడు. 1971: బర్ఖాదత్, టిలివిజన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. 1973: డిబి చారి, తెలుగు చలనచిత్ర గేయ, సంభాషణల రచయిత. 1985: స్నేహ ఉల్లాల్ , తెలుగు, హిందీ చిత్ర నటి. మరణాలు 1829: జీన్ బాప్టిస్ట్ లామార్క్, నేచురలిస్ట్. (జ.1744) 1948: కాట్రగడ్డ బాలకృష్ణ, అసాధారణ మేధావి, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించేవాడు. (జ.1906) 1952: గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1893) 2000: మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (జ.1922) 2001: అమల్ కుమార్ సర్కార్, భారతదేశ సుప్రీంకోర్టు ఎనమిదవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1901) 2012: తిలకం గోపాల్, వాలీబాల్ మాజీ ఆటగాడు, కెప్టెన్. (జ. 1947) 2015: చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (జ.1931) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం. మైనారిటీ హక్కుల దినం. (భారతదేశం.) బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 17 - డిసెంబర్ 19 - నవంబర్ 18 - జనవరి 18 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 19
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_19
డిసెంబర్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 353వ రోజు (లీపు సంవత్సరములో 354వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 12 రోజులు మిగిలినవి. సంఘటనలు 1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించాడు. 1961: భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి, గోవాను విముక్తి చేసాయి. 1978: ఇందిరా గాంధీని లోక్‌సభ నుండి బహిష్కరించి, అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలుశిక్ష విధించారు. డిసెంబర్ 26 న ఆమెను విడుదల చేసారు. 1985: భారత లోక్‌సభ స్పీకర్‌గా రబీ రాయ్ పదవిని స్వీకరించాడు. 2009: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరి నియమించబడ్డాడు. జననాలు thumb|నిర్మలా దేశ్ పాండే 1903: కె.వి. గోపాలస్వామి, ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్. (మ.1983) 1918: భాస్కరభట్ల కృష్ణారావు, రచయిత. (మ.1966]) 1928: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత. 1929: నిర్మలా దేశ్ పాండే, గాంధేయవాది. (మ.2008) 1935: రాజ్‌సింగ్ దుంగార్పుర్, మాజీ క్రికెట్ క్రీడాకారుడు, బి.సి.సి.ఐ.మాజీ అధ్యక్షుడు. 1977: హేమ. ఎమ్, రంగస్థల నటి. 1991: సిధికా శర్మ , భారతీయ సినీ నటీ, మోడల్. 2000: మ్యాథరి అపరంజిని, కోహిర్ గ్రామము & మండలం, సంగారెడ్డి జిల్లా. మరణాలు 1953: వనారస గోవిందరావు, శ్రీ శారదా మనో వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, స్టేజి నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ సభే నేటి సురభి కంపెనీలకు మాతృసంస్థ. 1967: కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (జ.1893) 2015: రంగనాథ్, విలక్షణ సినిమా నటుడు, కవి. (జ.1949) పండుగలు , జాతీయ దినాలు గోవా విముక్తి దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 18 - డిసెంబర్ 20 - నవంబర్ 19 - జనవరి 19 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 20
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_20
డిసెంబర్ 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 354వ రోజు (లీపు సంవత్సరములో 355వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 11 రోజులు మిగిలినవి. సంఘటనలు 1972 - 1986: భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రఫుల్లచంద్ర నట్వర్‌లాల్ భగవతి పదవీ విరమణ. జననాలు thumb|యామినీ కృష్ణమూర్తి 1934: ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త (మ.2010). 1940: యామినీ కృష్ణమూర్తి, శాస్త్రీయ నృత్య కళాకారిణి . 1951: కన్నేపల్లి చలమయ్య, కథారచయిత. 1991: మాలోతు రవీందర్ నాయక్, గిరిజన సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి, మహబూబాబాద్ టౌన్, మండలం & జిల్లా, తెలంగాణ. మరణాలు 1817: తులసిబాయి హోల్కర్, ఇండోర్ మహారాణి. భర్త మరణం తర్వాత తన కుమారుడు మల్హర్ రావ్ హోల్కర్ II తరఫున ఇండోర్ రాజ్యాన్ని 1811-1817ల మధ్య పరిపాలించింది.(జ.1788) 1988: బి.జయమ్మ, మూకీ సినిమా యుగంలో కథానాయకిగా ప్రాచుర్యం పొందింది (జ.1915). పండుగలు, జాతీయ దినాలు అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 19 - డిసెంబర్ 21 - నవంబర్ 20 - జనవరి 20 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 21
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_21
డిసెంబర్ 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 355వ రోజు (లీపు సంవత్సరములో 356వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 10 రోజులు మిగిలినవి. సంఘటనలు 2007: రెండో ఎలిజబెత్ రాణి అత్యధిక వయస్సు ఉన్న బ్రిటన్ రాణిగా రికార్డు సృష్టించింది. జననాలు thumb|U R Ananthamurthy Z1 1853: వేదము వేంకటరాయ శాస్త్రి, పండితులు, కవి, విమర్శకులు, నాటకకర్త. (మ.1929) 1926: అర్జా జనార్ధనరావు, తెలుగు నాటక, సినిమా నటుడు. (మ.2007) 1928: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (మ.2015) 1931: అవసరాల రామకృష్ణారావు, కథ, నవల రచయిత. (మ.2011) 1932: యు.ఆర్.అనంతమూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.2014) 1939: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (మ.2007) 1942: హు జింటావ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క అత్యున్నత నాయకుడు. 1959: కృష్ణమాచారి శ్రీకాంత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1972: వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, రాజకీయ నాయకుడు. 1972: తుంపిల్ల శ్రీనివాస్, న్యాయవాది, కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ. 1985: ఆండ్రియా జర్మియా , తెలుగు, తమిళ, మళయాళ చిత్రాల నటి, గాయని. 1989: తమన్నా, భారతీయ చలనచిత్ర నటి, మోడల్, నృత్య కారిణి . 2002: తప్పెట్ల భవిత, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్, తెలంగాణ. మరణాలు 1962: ఉప్మాక నారాయణమూర్తి, సాహితీవేత్త, అవధాని, న్యాయవాది. (జ.1896) 1969: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (జ.1915) 1972: దాసరి కోటిరత్నం, రంగస్థలనటి, తెలుగు సినిమా నటి, తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత. (జ.1910) పండుగలు , జాతీయ దినాలు - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 20 - డిసెంబర్ 22 - నవంబర్ 21 - జనవరి 21 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 22
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_22
డిసెంబర్ 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 356వ రోజు (లీపు సంవత్సరములో 357వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 9 రోజులు మిగిలినవి. సంఘటనలు 1953: సయ్యద్ ఫజల్‌ఆలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పడింది ( 1953డిసెంబరు 29 చూడు). 2000: ఢిల్లీ లోని ఎర్రకోట లోనికి ప్రవేశించిన ఐదుగురు లష్కరేతొయిబా ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు. జననాలు thumb|శ్రీనివాస రామానుజన్ 1887: ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ (మ.1920). 1899: శొంఠి దక్షిణామూర్తి, ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖుడు (మ.1975). 1920: తాతినేని చలపతిరావు ,సంగీత దర్శకుడు(మ.1994) 1955: సయ్యద్ నసీర్ అహ్మద్, హేతువాది, పాత్రికేయుడు, లాయర్,. 'సారేజహాఁ సే అచ్ఛా ఇండియా' తెలుగు మాస పత్రిక సంపాదకుడు. 1987: ఇషా తల్వార్, మళయాళ చిత్రాలతో పాటు తెలుగులో కూడా నటించిన నటి. మరణాలు 1958: తారక్‌నాథ్ దాస్, బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు. (జ.1884) 2014: జి.వెంకటస్వామి, భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. (జ.1929) 2015: కాశీ విశ్వనాథ్, ప్రఖ్యాత రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త (జ.1946) పండుగలు, జాతీయ దినాలు జాతీయ గణిత దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 21 - డిసెంబర్ 23 - నవంబర్ 22 - జనవరి 22 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 23
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_23
డిసెంబర్ 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 357వ రోజు (లీపు సంవత్సరములో 358వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 8 రోజులు మిగిలినవి. సంఘటనలు 1912: రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చే సందర్భంగా జరిగిన సంబరాలలో వైస్రాయి లార్డ్ హర్డింగ్ పై జరిగిన హత్యాప్రయత్నం ఢిల్లీ-లాహోర్ కుట్రగా చరిత్రకెక్కింది 1920: 'హైదరాబాదు కంపెనీస్ ఛట్టం ప్రకారం, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా 'ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) ' అనే పేరుతో ఏర్పడింది. హైదరాబాదు (డెక్కన్) కంపెనీ లిమిటెడ్ కి చెందిన సమస్త హక్కులను (అప్పులు, ఆస్తులు) మొందింది. కాలక్రమంలో, 1956 కంపెనీస్ చట్టం ప్రకారం, ప్రభుత్వ సంస్థగా అవతరించింది. జననాలు thumb|చరణ్ సింగ్ 1725: అహమ్మద్ షా బహదూర్, 13 వ మొఘల్ చక్రవర్తి. (మ.1775) 1881: బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. (మ.1953) 1889: మెహర్ చంద్ మహాజన్, భారతదేశ మూడవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1967) 1891: వీరమాచనేని ఆంజనేయ చౌదరి, స్వసంఘ పౌరోహిత్యానికి మూలపురుషుడు. (మ.1988) 1902: చరణ్ సింగ్, భారత దేశ 5వ ప్రధానమంత్రి. (మ.1987) 1922: ఘండికోట బ్రహ్మాజీరావు, ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (మ.2012) 1933: శిరోమణి సహవాసి, ఈనాడు దినపత్రికలో ఉద్యోగిగా చేరాడు. 1984లో సహాయక వార్తా సంపాదకునిగా పనిచేశాడు. 1936: ఆదేశ్వరరావు, సమకాలీన హిందీ రచయిత. 1936: కప్పగంతుల మల్లికార్జునరావు, కథా, నవలా, నాటక రచయిత. (మ.2006) 1940: ముదిగొండ శివప్రసాద్, చారిత్రక నవలా రచయిత. 1966: చెరుకూరి సుమన్, బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. (మ.2012) 1987: ఆది: తెలుగు నటుడు , క్రికెట్ ఆటగాడు. మరణాలు 1987: ఈమని శంకరశాస్త్రి, వైణికుడు. (జ.1922) 1997: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (జ.1913) 2004: పి.వి.నరసింహారావు, పూర్వ భారత ప్రధానమంత్రి. (జ.1921) 2011: త్రిపురనేని మహారధి, సినీ మాటల రచయిత (జ.1930) 2014: కైలాసం బాలచందర్ , దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు,రచయిత,నిర్మాత ,(జ.1930) 2020: బాతిక్ బాలయ్య, తెలంగాణకు చెందిన బాతిక్ చిత్రకారుడు. (జ. 1939) 2022: కైకాల సత్యనారాయణ, సినిమా నటుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1935) పండుగలు , జాతీయ దినాలు జాతీయ రైతు దినోత్సవం ఈజిప్టు విజయోత్సవ దినం. ( సూయజ్ కెనాల్ వివాదానికి తెరపడింది.) బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 22 - డిసెంబర్ 24 - నవంబర్ 23 - జనవరి 23 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
బ్రహ్మ సేనాని
https://te.wikipedia.org/wiki/బ్రహ్మ_సేనాని
బ్రహ్మ సేనాని రేచర్ల వంశజులమూల పురుషుడు. అతను రేచర్ల బమ్మసేనాని గా సుపరిచితుడు. ఇతడినే బమ్మిరెడ్డి(1035-1055) అని కూడా పిలుస్తారు. జీవిత విశేషాలు రేచర్ల రెడ్డి వంశీయులు కాకతీయ సామ్రాజ్య సంరక్షణ భారం వహించి, కాకతీయుల శత్రువులకు సింహస్వప్నంగా మారారు. అనేక యుద్ధాల్లో విజయం సాధించిన రేచర్ల రెడ్డి వంశీయులు కాకతీయ రాజుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇతడు కాకతీయ మొదటి (గరుడ) బేతరాజు వద్ద సేనాధిపతిగా పనిచేసి కాంచీపుర చోళులను జయించాడు. పాలంపేట, పిల్లలమర్రి, చిట్యాలంపాడు, మాచాపూర్ శాసనాలు ఇతడి గురించి తెలుపుతున్నాయి. ముఖ్యముగా ఇతను కంచి నందలి చోళసైన్యముతో యుద్దముచేసిన కాకతి సామంత వీరులలో ఒకడు. ఈ యుద్దంలో విజయం సాధించారు. ఇతను సుమారుగా 1035 నందు కాకతి బేతరాజు కొలువులో ప్రవేశించి, 1055 వరకూ ఉన్నట్టు భావించబడుతున్నది. అతడి కుమారుడు లేదా మనువడి భావిస్తున్న ముచ్చ సేనాని మొదటి ప్రోలరాజు(1052-1076) వద్ద చమూపతిగా పనిచేశాడు. ముచ్చసేనాని కూడా కాకతీయ రాజ్య విస్తరణలో తోడ్పడ్డాడు. ఇవి కూడా చూడండి రేచర్ల రెడ్డి రాజుల పేర్లు మూలాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:కాకతి వంశ సామంతులు
తెలుగు సినిమాలు ఉ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ఉ
thumb|ఉమ్మడి మొగుడుఉక్కు సంకెళ్ళు ఉక్కు మనిషి ఉగాది ఉగ్ర నరసింహం ఉద్దండుడు ఉమ్మడి మొగుడు ఉమ్మడి కుటుంబం ఉమా చండీ గౌరీ శంకరుల కథ ఉల్లాసం ఉల్టా పుల్టా ఉష ఉషాపరిణయం - 1961