title
stringlengths
1
90
url
stringlengths
31
120
text
stringlengths
0
504k
తెలుగు సినిమాలు ఊ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ఊ
thumb|ఊరికిచ్చిన మాటఊయల - 1998 ఊరంతా గోలంట - 1989 ఊరికిచ్చిన మాట - 1981 ఊర్వశీ నీవే నా ప్రేయసి - 1979 ఊరుమనదిరా - 2002 ఊసరవెల్లి (సినిమా) - 2011 ఊ..కొడతారా ఉలిక్కిపడతారా - 2012 ఊరికి ఉపకారి ఊరికి మొనగాడు (1981 సినిమా) ఊరికి మొనగాడు (1995 సినిమా) ఊరికి వుపకారి ఊరికి సోగ్గాడు ఊరు మనదిరా ఊరుమ్మడి బ్రతుకులు ఊరేగింపు (సినిమా) ఊర్మిళ (సినిమా) ఊర్వశి (సినిమా) ఊర్వశీ నీవే నా ప్రేయసి ఊర్వశీ నీవే నా ప్రేయసి ఊహాసుందరి
ముచ్చ సేనాని
https://te.wikipedia.org/wiki/ముచ్చ_సేనాని
ముచ్చ సేనాని రేచర్ల బమ్మసేనానికి కుమారుడు లేదా మనుమడుగా భావిస్తున్నారు. అతను కాకతి మొదటి ప్రోలరాజు(1052-1076) వద్ద చమూపతిగా (సామంతునిగా) పనిచేశాడు. అతను కూడా కాకతీయ రాజ్య విస్తరణలో తోడ్పడ్డాడు. వేములవాడ చాళుక్య రాజైన భద్రగుణ్ని ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించడంలో ఇతడు ముఖ్య భూమిక పోషించాడు. చక్రకూటము, కొంకణము, కొర్పర్తి, గుణసాగరము, వేములవాడ, మొదలగు ప్రాంతములను సాధించుటలో ఇతను మొదటి ప్రోలరాజునకు చాలా సహాయం చేసాడు. ఇతనికి అరిగజ కేసరి అను బిరుదు ఉంది. ఇతను విరియాల వంశజులతో కలసి కాకతి రాజ్య విస్తరణకు పాటుపడినాడు. ఇతను సైన్యాధిపతిగా చేసాడు. అతని తండ్రి రేచర్ల బమ్మసేనాని రేచర్ల రెడ్డి వంశ మూల పురుషుడు. ఇతడినే బమ్మిరెడ్డి(1035-1055) అని పిలుస్తారు. ఇతడు కాకతీయ మొదటి (గరుడ) బేతరాజు వద్ద సేనాధిపతిగా పనిచేసి కాంచీపుర చోళులను జయించాడు. పాలంపేట, పిల్లలమర్రి, చిట్యాలంపాడు, మాచాపూర్ శాసనాలు ఇతడి గురించి తెలుపుతున్నాయి. అతని కుమారుడు ఒకటో కాట సేనాని రెండో బేతరాజు(1076-1108) వద్ద సేనానిగా పనిచేశాడు. మూలాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:కాకతి వంశ సామంతులు
తెలుగు సినిమాలు ఫ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ఫ
thumb|ఫిదాఫిబ్రవరీ 14 నెక్లెస్ రోడ్డు ఫ్రెండ్స్ ఫిదా (సినిమా) ఫిట్టింగ్ మాస్టర్ ఇతర భాషా సినిమాలు ఫారెస్ట్ గంప్ (1994 సినిమా) ఫ్లిప్పర్ (1996 సినిమా) ఫ్లిప్పర్ (1996 సినిమా)
కాటసేనాని
https://te.wikipedia.org/wiki/కాటసేనాని
కాటసేనాని (1070-1108) కాకతి రెండవ బేతరాజు సామంతునిగా సేవలు అందించాడు. రెండవ బేతరాజుకు సేనానిగా పనిచేసి ఉండవచ్చును. ఇతను ముదిగొండ, సబ్బిసాయిర, అనుమగొండ ప్రాంతములను పాలించి మహా మండలేశ్వరుడై ఉండెను. ఇతను కాకతి వంశీయులకు అత్యంత విధేయుడు. మల్యాల వంశీయులు కాకతీయుల సామంతులుగా ఉన్నారు. వీరు కాకతీయులకు మంత్రులుగా, సేనానాయకులుగా, దండనాథులుగా, వారి విధేయులుగ బాధ్యతలు నిర్వహించారు. ప్రభువుల అడుగుజాడల్లోనే ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారు. చెరువులు తవ్వించారు. ఆలయాలు నిర్మించారు.అలా నిర్మించిన ఆలయాలు, వాటి నిర్మాణరీతి, శిల్పుల అద్భుత ప్రతిభ గురించి 3 శ్లోకాలు కాటసేనాని వేయించిన కొండపర్తి శాసనంలో ఉంది. కాటసేనాని మల్యాల వంశానికి చెందినవాడు. ఆచమల పుత్రుడు. అతను సా.శ. 1180లో కొండపర్తి గ్రామంలో రుద్రేశ్వర, కేశవదేవాలయాలను నిర్మించి వాటికి రెండు నివర్తనాల భూమిని దానమిచ్చి శాసనం వేయించాడు. ఈ శాసనం నాలుగువైపుల మొత్తం 192 పంక్తుల్లో ఉంది. వీటిలో దేవాలయ వాస్తు విశేషాలను తెలిపే శ్లోకం రాసి ఉంది. మూలాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:కాకతి వంశ సామంతులు
తెలుగు సినిమాలు డ, ఢ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_డ,_ఢ
డ, ఢ తో ప్రారంభమయ్యే తెలుగు సినిమాల జాబితా ఇది. డ డబ్బుకు లోకం దాసోహం డబ్బారాయుడు సుబ్బారాయుడు thumb|డబ్బెవరికి చేదుడబ్బు భలే జబ్బు డబ్బెవరికి చేదు డాక్టర్ చక్రవర్తి డాక్టర్ చక్రవర్తి (2017 సినిమా) డాక్టర్ సినీ యాక్టర్ డాడీ డామిట్ కథ అడ్డం తిరిగింది డార్లింగ్ డుండుండిగాడిగా డాన్ డైనమైట్ డిటెక్టివ్ నారద డే . డేగ ఢీ ఢమరుకం (సినిమా)
తెలుగు సినిమాలు ఓ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ఓ
ఓంకారం (సినిమా) - 1997 - కెకెఎన్ కుమారి నిర్మాణ సారథ్యంలో ఉపేంద్ర దర్శకత్వం వహించిన చిత్రం. ఓ ఇంటి కాపురం - 1985 - రమా సినీ చిత్రాలయ పతాకంపై మోహన్ జి, గంధం జగన్మోహనరావుల నిర్మాణ సారథ్యంలో రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన చిత్రం. ఓ ఇంటి భాగోతం - 1980 - దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన చిత్రం. ఓ తండ్రి – ఓ కొడుకు - 1994 - మౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓ పనై పోతుంది బాబు - 1998 - ప్రమడ ఫిల్మ్స్ పతాకంపై కందికoటి రాజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఓటుకు విలువ ఇవ్వండి - 1985 - త్రిజయ పతాకంపై ఎం. ప్రభాకర్ రావు నిర్మాణ సారథ్యంలో వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంగనాథ్, శరత్ , రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు. ఓహో నా పెళ్ళంట - 1996 - సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించాడు. ఓ అమ్మకథ - 1981 - శ్రీ పవన్ ఇంటర్నేషనల్ పతాకంపై వెల్లంకి జోషి, సి. తిమ్మా రెడ్డి, ఎస్.ఆర్. వెజల్లా లు నిర్మించిన ఈ సినిమాకు వసంతసేన్ దర్శకత్వం వహించాడు. ఓ ఆడది ఓ మగాడు - 1982 - కవిరత్న మూవీస్ పతాకం కింద కె. భాను ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా, ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు. ఓ ఇంటి కథ - 1981 ఓ చినదాన - 2002 ఓ పాపా లాలి - 1991 ఓ చెలియా నా ప్రియ సఖియా - 2015 ఓ తండ్రి తీర్పు - 1985 ఓ పిట్ట కథ (2020 సినిమా) ఓ ప్రేమ కథ - 1987 ఓ బేబీ - 2019 ఓ మంచి రోజు చూసి చెప్తా - 2021 ఓ మనిషి కథ - 2014 ఓ మనిషి తిరిగి చూడు - 1977 ఓ మనిషి నీవెవరు - 2021 ఓ మై గాడ్ 2016 ఓ మై డాగ్ - 2022 ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి - 2003 ఓ మై ఫ్రెండ్ - 2011 ఓ సీత కథ - 1974 ఓం 3D - 2013 ఓం నమో వేంకటేశాయ - 2017 ఓం శాంతి - 2010 ఓకే బంగారం - 2015
విజయనగర రాజులు
https://te.wikipedia.org/wiki/విజయనగర_రాజులు
దారిమార్పు విజయనగర సామ్రాజ్యం
విజయ నగర రాజులు - పరిపాలన కాలం
https://te.wikipedia.org/wiki/విజయ_నగర_రాజులు_-_పరిపాలన_కాలం
సంగమ వంశం మొదటి బుక్క భూపతి రాయలు, 1082 - 1087 మొదటి హరిహర రాయలు, 1087 - 1104 బుక్క మహా రాయలు, 1104 - 1126 సదా శివ రాయలు, 1126 - 1152 పురందర రాయలు, 1152 - 1207 ప్రతాప్ దెవ రాయలు, 1207 - 1227 వీర ప్రతాప్ దెవ రాయలు,1227-1242 ప్రతాప్ వెంకట్ రాయలు,1242-1251 రెండవ బుక్కభూపతి రాయలు,1251-1260 రెండవ హరిహర రాయలు,1260-1280 బుక్కన్నా వొడయారు రాయలు,1280-1285 కుమారా కంపా రాయలు,1285-1290 మొదటి బుక్క రాయలు,1290 మొదటి దెవ రాయలు, 1290 గుండమ్మా రాయలు, 1290 మొదటి బుక్క రాయలు,1290-1294 విద్యారన్య రాయలు , 1294 మొదటి బుక్క రాయలు,1294 సంగమా రాయలు , 1294 ముడప హరిహర రాయలు,1294 కుమారా కంపా రాయలు, 1294 రెండప బుక్క రాయలు,1294 మారప్పా ముద్దాప్పా రాయలు,1294 -1295 బుక్కన్నా వొడయారు రాయలు,1295-1304 అభినవ బుక్క రాయలు,1304-1306 రెండవ బుక్క రాయలు ఇంకా అయినా కుమారుడు ప్రతాప్ హరిహర రాయలు,1306-1322 ముడవ బుక్క రాయలు,1322-1330 నరసింహా రాయలు,1330-1332 రెండవ దెవ రాయలు,1332-1339 మొదటి మల్లికార్జున రాయలు,1339-1347 అచ్చుత దెవ రాయలు,1347-1360 కృష్ణ రాయలు ,1360-1380 యిమ్మాడి హరిహర రాయలు,1380-1390 ముడవ దెవ రాయలు,1390-1404 మొదటి విరూపాక్ష రాయలు,1404-1405 నాలుగవ బుక్క రాయలు,1405-1406 నాలుగవ దెవ రాయలు,1406-1422 రామచంద్ర రాయలు, 1422లో నాలుగు నెలలు! వీర విజయ బుక్క రాయలు, 1422 - 1426 రెండవ దేవ రాయలు, 1426 - 1446 త్రయంబక్ రాయలు, 1446-1458 రెండవ మల్లికార్జున రాయలు, 1458 - 1465 రెండవ విరూపాక్ష రాయలు, 1465 - 1485 ప్రౌఢరాయలు, 1485 కొంత కాలము సాళువ వంశం సాళువ నరసింహదేవ రాయలు, 1485 - 1490 తిమ్మ భూపాలుడు, 1490 రెండవ నరసింహ రాయలు, 1490 - 1506 (నిజానికి రెండవ నరసింహ రాయలు కాలాన అధికారం మొత్తము తుళువ నరస నాయకుడు చేతిలోనే ఉండేది, రెండవ నరసింహ రాయలు కేవలం పెనుగొండ దుర్గం నందు గృహదిగ్భందలో ఉండేవాడు!) తుళువ వంశం వీరనరసింహ రాయలు, 1506 - 1509 శ్రీ కృష్ణదేవ రాయలు, 1509 - 1529 అచ్యుత దేవ రాయలు, 1529 - 1542 సదాశివ రాయలు,?? ఆరవీడు వంశం అళియ రామ రాయలు?? తిరుమల దేవ రాయలు, 1565 - 1572 శ్రీరంగ దేవ రాయలు, 1572 - 1585 రామ రాజు, 1585 వేంకటపతి దేవ రాయలు, 1585 - 1614 శ్రీరంగ రాయలు, 1614 - 1614 రామదేవ రాయలు, 1617 - 1630 వేంకటపతి రాయలు, 1630 - 1642 శ్రీ రంగ రాయలు 2, 1642 - 1678 వేంకట పతి రాయలు, 1678 - 1680 మూలాలు వెలుపలి లంకెలు వర్గం:విజయ నగర రాజులు వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయనగర సామ్రాజ్యం
ఏప్రిల్ 29
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_29
ఏప్రిల్ 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 119వ రోజు (లీపు సంవత్సరములో 120వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 246 రోజులు మిగిలినవి. సంఘటనలు 1990: బొరిక్ ఎల్సిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. 1992: నల్లవారికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుకి ప్రతీకారంగా లాస్ ఏంజిల్స్ నగరాన్ని నల్లవారు మంటల్లో మండించి వారి నిరసనను తెలియ చేసారు. జననాలు 1848: రాజా రవివర్మ, భారత చిత్రకారుడు. (మ.1906) 1876: బంకుపల్లె మల్లయ్యశాస్త్రి, సంఘసంస్కర్త, రచయిత, పండితుడు (మ.1947) 1893: మేకా వెంకటాద్రి అప్పారావు, ఉయ్యూరు జమీందారు, కవి, సంస్కృత, పర్షియా భాషలలో పండితుడు. నాట్యము, జ్యోతిష్యము, చిత్రకళ, సంగీతము మొదలగు కళలో కూడా ఆయనకు ప్రవేశమున్నది. 1917: ఆవుల గోపాలకృష్ణమూర్తి, ఎ.జి.కె.గా ప్రసిద్ధిచెందిన హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు, సమీక్ష పత్రికలు నడిపారు. ( మ. 1966) 1970: ఆండ్రి అగస్సీ, అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు 1973: స్వర్ణలత , దక్షిణ భారత గాయని. 1979: ఆశిష్ నెహ్రా, భారత క్రికెట్ క్రీడాకారుడు. మరణాలు thumb|100px|ఇర్ఫాన్ ఖాన్ 2003: వావిలాల గోపాలకృష్ణయ్య, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. 2006: జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్, ఆర్థికవేత్త. (జ.1908) 2009: గుత్తా రామినీడు, తెలుగు సినీ దర్శకుడు, సారథి స్టూడియో వ్యవస్థాపకుడు. (జ.1929) 2017: ఆర్. విద్యాసాగ‌ర్‌రావు, నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు. (జ.1939) 2020: ఇర్ఫాన్ ఖాన్, హిందీ సినిమానటుడు, నిర్మాత. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1967) 2020: రిషి కపూర్, హిందీ సినిమా నటుడు. (జ.1952) 2022: తర్సామీ సింగ్ సైనీ, గాయకుడు, నటుడు, సంగీత దర్శకుడు. (జ.1967) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ నృత్య దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 29 . ఏప్రిల్ 28 - ఏప్రిల్ 30 - మార్చి 29 - మే 29 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
https://te.wikipedia.org/wiki/మా_తెలుగు_తల్లికి_మల్లె_పూదండ
thumbnail|గుంటూరు జిల్లా కలెక్టరు కార్యాలయమునందుగల లుంబినీ వనములోని తెలుగు తల్లి విగ్రహము మా తెలుగు తల్లికి మల్లె పూదండ (మా తెనుగు తల్లికి మల్లె పూదండ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం. దీని రచయిత శంకరంబాడి సుందరాచారి. ఈ పాటలో తెలుగునాట ప్రముఖమైన నదులను, సంస్కృతి, సాహిత్యాలను, చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులను రచయిత సంస్మరించాడు. చరిత్ర సుందరాచారి 'మా తెనుగు తల్లికి' గీతాన్ని 1942లో దీనబంధు సినిమా కోసం రచించారు. కానీ ఆ చిత్ర నిర్మాతకు యుగళగీతంగా వాడాలన్న కోరికకు ఈ పాట సరిపోలేదు కాబట్టి ఆ సినిమాలో చేర్చలేదు. టంగుటూరి సూర్యకుమారి ఆభేరి రాగంలో మధురంగా పాడిన ఈ పాటను, తను ప్రైవేటుగా గ్రామఫోన్ రికార్డులో హెచ్‌.యం.వి. సంస్థ ద్వారా విడుదల చేసిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది. ఈ పాటపై హక్కులను సూర్యకుమారి సుందరాచారికి 116 రూపాయలిచ్చి కొనుక్కున్నది. ఆ తరువాతి కాలంలో సుప్రసిద్ధదర్శకుడు బాపు, బుల్లెట్ చిత్రం కోసం ఈ పాటను బాలసుబ్రమణ్యంతో పాడించారు. లీడర్ సినిమాలో టంగుటూరి సూర్యకుమారి గారి పాటను కొత్త పాటతో కలిపి కథానాయకుడిపై చిత్రీకరణ చేశారు గేయం మా తెలుగు తల్లికి మల్లె పూదండా మా కన్న తల్లికి మంగళారతులూ ॥మా తెలుగు॥ కడుపులో బంగారు కను చూపులో కరుణా చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి ॥మా తెలుగు॥ గల గలా గోదారి కదలి పోతుంటేను ॥గల గలా॥ బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలు తాయి ॥మా తెలుగు॥ అమరావతీ నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!! </div> అమరావతి గుహల - అమరావతి నగర పురాణాలలో అమరావతిని ఇంద్రనగరంగా, సర్వసుఖ, సర్వభోగ, సర్వాంగ సుందర నగరంగా తెగ వర్ణిస్తూ ఉంటారు. కాళిదాసు మేఘసందేశంలో అలకాపురిని వర్ణించి మనసులని ఊరించాడు. మనకి గొప్ప చరిత్ర ఉన్న ముఖ్యపట్టణం అమరావతి. ‘అమరావతి గుహల అపురూప శిల్పాలు’ అన్నారు మా తెలుగుతల్లి కవి. తరువాత అక్కడ గుహలు లేవని, ‘అమరావతి నగర’ అని సవరించి పాడడం మొదలు పెట్టారు. బుల్లెట్‌ సినిమాలో కూడా ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటలో ‘అమరావతినగర అపురూప శిల్పాలు’ అని ఉంది. అయితే టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులో ‘అమరావతి గుహల అపురూప శిల్పాలు’ అనే ఉంది. మూలాలు బయటి లింకులు టంగుటూరి సూర్యకుమారి పాడిన మాతెలుగు తల్లికి పాట వీడియో (యూట్యూబ్) రంగరాయ మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ ఆసోషియేషన్ పునర్మిలనం బిర్మింగహామ్, 1985 కార్యక్రమంలో, అప్లోడ్ చేసినవారు అప్పారావు నాగభైరు, 2008 వర్గం:తెలుగు భాష వర్గం:తెలుగు లలిత గీతాలు
మొదటి బుక్క రాయలు
https://te.wikipedia.org/wiki/మొదటి_బుక్క_రాయలు
thumb|మొదటి బుక్క రాయలు మొదటి హరిహర రాయలువారి సోదరుడు మొదటి బుక్క రాయలు. ఇతడు క్రీ. శ. 1356నందు విజయనగర సింహాసనమధిష్టించాడు. ఇతడు విజయనగర రాజ్య స్థాపనమున, తరువాత బహుమనీ సుల్తాను లతో జరిగిన యుద్ధములందు తన అన్నగారయిన మొదటి హరిహర రాయలునకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఇతని కుమారుడు కంప రాయలు అనేక హిందూ క్షేత్రములను మహమ్మదీయుల అధీనమునుండి స్వాధీనము చేదుకున్నాడు. బహుమనీ సుల్తానులతో యుద్దాలు మొదటి యుద్దములు బహుమనీ సుల్తాను అయిన మహమ్మద్‌ షా I ఓరుగల్లును ముట్టడించి, ఓరుగల్లునకు సహాయముగా వచ్చిన విజయ నగర ప్రభువులను కూడా ఓడించి, ఆ తరువాత 1366న అపరాధరుసుము చెల్లించమని బుక్క రాయలకు తాకీదు పంపించాడు, దానితో బుక్క రాయలు కోపితుడై బహుమనీ రాజ్యమునందున్న ముద్గల్లు కోటను ఆక్రమించాడు. బహుమనీ సేనలు విజయనగర సైన్యమును ఎదుర్కొని, ఆదవాని, కౌతల ప్రాంతములందు జరిగిన యుద్ధములందు విజయనగర సైనికులను ఓడించినాయి. ఈ యుద్ధమున సాధారణ ప్రజానీకానికి అనేక కష్టాలు ప్రాప్తించినాయి. వేలకొలదీ ప్రజలు నిరాశ్రయలు అయినారు. వందల కొలది అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు. చివరకు బుక్క రాయలు సుల్తానుతో సంధి చేసుకొనినాడు, సంధి షరతులను అనుసరించి, ఇరువురూ సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ఖేధమూ కలిగించకూడదు. రెండవ యుద్దములు మొదటి యుద్ధము తరువాత 1375 వరకూ యధాస్థితి కొనసాగినది. కానీ 1375 వ సంవత్సరమున మహమ్మద్ షా దివంగతులయినారు. తరువాత అతని వారసుడు ముజాహిద్ షా సింహాసనము అధిరోహించాడు. ఈ సమయములో బుక్క రాయలు కృష్ణా నది, తుంగభద్రా నది ప్రాంతముల మధ్య నున్న ప్రదేశమును ఆక్రమించెను. అంతే తిరిగి మరో యుద్ధము ప్రారంభమయినది. ఈ యుద్ధమున విజయనగర సైనికులు ఓడిపొయినారు. బహుమనీ సైనికులు విజయ నగర సైనికులను తుంగభద్రా నది దాటువరకూ తరిమివేసినారు. కవులు ఉత్తర హరివంశమునకు కర్త అయిన నాచన సోమన వీరి ఆస్తానంలోని వాడే! మంత్రి బుక్క రాయలకు మంత్రిగా అసాధారణ మేథా సంపత్తి కలవాడుగా పేరుగాంచిన మాధవులు, వీరి గురువుగారు విద్యారణ్యస్వామి. వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
రెండవ హరిహర రాయలు
https://te.wikipedia.org/wiki/రెండవ_హరిహర_రాయలు
రెండవ హరిహర రాయలు, మొదటి బుక్క రాయలు మరణానంతరము 1377లో సింహాసమునకు వచ్చాడు. సామంత రాజ్యాల పునరాధీనము చేసుకొనుట మొదటి బుక్క రాయలు కుమారుడైన కంప రాయలే ఈ పేరుతో రాజ్యమునకు అధిపతి అయినాడని ఓ అభిప్రాయము. ఇతను రాగానే చేసిన మొదటి పని, తన తండ్రి గారి కాలములో సామంతులుగా నియమితులైన అనేక రాజ బంధువులను స్వతంత్రులు కావాలెననెడి అభిలాషనుండి మరల్చి, వారిని తొలగించి, తన పుత్రులను నియమించాడు. ఉదయగిరికి దేవ రాయలును, మధుర ప్రాంతములకు విరూపాక్ష రాయలును అధికారులుగా నియమించాడు. బిరుదులు ఇంతకు పూర్వం విజయనగర పాలకులైన మొదటి హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు సామంతరాజులకు తగిన గౌరవాలైన మహామండలేశ్వర, ఓఢియ, శత్రురాజ దండకుడు వంటి బిరుదులు ధరించారు. రాజాధిరాజ, రాజపరమేశ్వర వంటి చక్రవర్తికి తగిన బిరుదులు ధరించిన తొలి విజయనగర పాలకుడు రెండవ హరిహర రాయలు. యుద్దములు మొదటి తరం విజయనగర రాజులకు బహుమనీ సుల్తానులతో యుద్ధాలు తప్పలేదు. రెండవ తరం రాజులకు గజపతులతోనూ, నాలుగు బహుమనీ సుల్తాను శాఖలతోనూ యుద్ధాలు తప్పలేదు. 1378లో బహుమనీ సుల్తాను ముజాహిద్ షా దారుణంగా హత్యచేయబడినాడు. బహుమనీ రాజ్యం అంతఃకలహాలకు ఆలవాలమయినది. 1378 నందే రెండవ మహమ్మద్ షా సింహాసనము అధిస్టించాడు. ఇతను శాంతిశీలుడు. ఈ కాలములో దక్షిణభారతదేశములందు పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. కొండవీడు రెడ్డిరాజ్యమున పెదకోమటి వేమారెడ్డి, కుమార గిరి రెడ్డి, కాటయ వేమారెడ్డి ల మధ్య తరచూ యుద్ధములు జరుగుతుండేవి. ఇదే సమయములో రేచర్ల పద్మనాయకులు బహమనీ సుల్తానులతో స్నేహం చేసుకొని విజయనగర, కొండవీడు రాజ్యములను ఆక్రమించాలని పథకం రూపొందించారు. ఇటువంటి పరిస్థితులలో రెండవ హరిహర రాయలు కొండవీడు రాజ్యమందున్న శ్రీశైలం ప్రాంతమును ఆక్రమించారు. కానీ కాటయ వేమారెడ్డి విజయనగర సేనలను ఎదుర్కొని ఓడించాడు. హరిహర రాయలు కాటయవేమునితో సంధిచేసుకొని అతని కొడుకు కాటయకూ తన కూతురు లక్ష్మికి వివాహం జరిపించాడు. మోటుపల్లి యుద్దం హరి హర రాయలు కుమారుడైన దేవ రాయలు ఉదయగిరి అధిపతి . ఆతడు సైన్యముతో మోటుపల్లి రేవును ఆక్రమించాడు. తరువాత కొండవీడు రాజ్యముపైకి హరిహర రాయలు చౌండసేనానిని పంపించాడు. ఇదే సమయంలో కొండవీడును కుమారగిరి రెడ్డి నుండి స్వాధీనము చేసుకున్న పెదకోటి వేమా రెడ్డి విజయనగర సైనికులను కొండవీడు భూబాగాలనుండి తరిమివేశాడు. పద్మనాయకులతో యుద్దములు మొదటి దండయాత్ర హరిహర రాయలు పద్మనాయకులపైకి తన పెద్ద కుమారుడూ, యువరాజు అయిన రెండవ బుక్కరాయలును పంపించాడు, ఈ యుద్ధములో సాళువ రామదేవుడు అను యోధుడు చాలా ప్రముఖ పాత్ర వహించాడు. ఈ దండయాత్రను ఎదుర్కోవడంలో పద్మనాయక ప్రభువులకు బహుమనీ సుల్తానులు సహాయం చేసారు. కొత్తకొండ ప్రాంతమున జరిగిన పోరాటంలో సాళువ రామదేవుడు ప్రాణాలకు తెగించి పోరాడి, చివరకు తన ప్రాణాలు అర్పించాడు. రెండవ బుక్క రాయలు ఓటమిభారంతో విజయనగరం తిరిగి వచ్చాడు. రెండవ దండయాత్ర 1397లో మరలా రెండవ హరిహర రాయలు, గండదండాధీశుడు వంటి అనేక వీరులను, పెద్ద సైన్యమును, తోడుగా ఇచ్చి యువరాజు రెండవ బుక్క రాయలును మరల పద్మనాయకులు పైకి దండయాత్రకు పంపించాడు. ఇదే సమయలో దేవరాయలు మరికొంత సైన్యముతో అలంపురం పైకి దండెత్తినాడు. ఈ దండయాత్రలను పద్మనాయకులు, బహుమనీల సహాయంతో ఎదుర్కోవాలని చూసినారు, కానీ విజయనగర రాజ సైనికులు కృష్ణా నది ఉత్తరభాగమున ఉన్న పానుగల్లు కోటను ముట్టడించి వశము చేసుకున్నారు, అలాగే చౌల్ దాలోల్ ప్రాంతమును విజయనగర సైనికులు సాధించారు. సింహళ దేశ విజయ యాత్ర విరూపాక్ష రాయలు గొప్ప నావికా సైన్యమును అభివృద్ధిచేసి సింహళ ద్వీపముపైకి దండయాత్రచేసి విజయం సాధించి సింహళ రాజునుండి కప్పమును తీసుకోని వచ్చాడు. విజయనగర సామ్రాజ్య నావికాదళ శక్తి ఈ సింహళ దేశ విజయయాత్ర ప్రదర్శించింది. కొండవీడు యుద్దాలు పైన చెప్పుకున్నటుల కొండవీడు విషయములలోనూ, వారి అంతఃకలహాలలోనూ విజయనగరరాజులు జోక్యము చేసుకున్నారు. కొన్ని ప్రాంతములు ఆక్రమించ ప్రయత్నించారు. చివరకు కాటయ వేమా రెడ్డి వీరికి సహాయము చేసాడు. కరువు ఈ రాజు పరిపాలనా కలమున దేశమునందు గొప్ప కరువు ఏర్పడినట్లు తెలుస్తున్నది గురువు వీరికి కూడా విద్యారణ స్వామివారే గురువుగా ఉన్నారు. అంతే కాకుండా వీరే మంత్రిగా ఉన్నారు కూడా! ఇతని వారసుడు నియమాల ప్రాకారం ఇతని పెద్ద కుమారుడైన రెండవ బుక్క రాయలు ఇతని తరువాత రాజు కావలెను, కానీ అప్పటికే గొప్ప సైన్యము కలవాడూ, సింహళమును జయించినవాడు అయిన విరూపాక్ష రాయలు సింహాసనము బలవంతముగా ఎక్కి, ఒక సంవత్సరము పాలించాడు, కానీ రెండవ బుక్క రాయలు తన విధేయులతోనూ, సామంతులతోనూ వచ్చి సింహాసనం స్వాధీనం చేసుకున్నాడు, కానీ ఇతను కూడా సంవత్సరమే పాలించాడు. తరువాత దేవరాయలు ఉదయగిరి దుర్గము నుండి సైన్యముతో వచ్చి సింహాసనం అధిష్టించి, 16 సంవత్సరములు మరణము వరకూ విజయవంతమైన పరిపాలన చేసాడు మూలాలు వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
విరూపాక్ష రాయలు
https://te.wikipedia.org/wiki/విరూపాక్ష_రాయలు
విరూపాక్ష రాయ (సా.శ. 1345–1405) విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. 1404 లో రెండవ హరిహర రాయలు మరణంతో, విజయనగర సామ్రాజ్యం యొక్క సింహాసనం అతని కుమారులైన మొదటి దేవరాయలు, రెండవ బుక్క రాయలు, విరూపాక్షరాయల మధ్య వివాదాస్పదమైంది. విరూపాక్ష రాయలు తన అన్నగారు అయిన రెండవ బుక్క రాయలుకు రావలసిన రాజ్య సింహాసనాన్ని అపహరించాడు. కానీ ఇతను ఎక్కువ కాలం రాజ్యము చేసుకొనలేకపొయినాడు. ఒక సంవత్సరము తరువాత రాజ్యాన్ని సామంత, విధేయుల సహాయంతో రెండవ బుక్క రాయలు స్వాధీనం చేసుకున్నాడు. ఇతని గురించి చెప్పుకోవలసిన విజయం తన తండ్రిగారి హయాములో సింహళ ద్వీపంపైన సాధించింది. అతని పాలన కొన్ని నెలలు మాత్రమే ఉన్నందున, విరూపాక్ష పాలనలో ఎటువంటి ముఖ్యమైన సంఘటనలు లేదా మార్పులు గుర్తించబడలేదు. అయినప్పటికీ విరుపాక్ష రాయలు గోవా, చౌల్, దాబోల్ వంటి రాజ్య భూములను ముస్లింల ద్వారా కోల్పోయాడని యాత్రికుడు ఫెర్నావో నూనిజ్ గుర్తించాడు. విరుపాక్షరాయలు స్వయంగా క్రూరంగా ఉండేవాడని, "స్త్రీలను తప్ప మరేమీ పట్టించుకోకుండా, తనను తాను త్రాగుడుకు అలవాటు పడ్డాడని" నూనిజ్ రాశాడు. మూలాలు బాహ్య లంకెలు https://web.archive.org/web/20051219170139/http://www.aponline.gov.in/quick%20links/HIST-CULT/history_medieval.html http://www.ourkarnataka.com/states/history/historyofkarnataka40.htm వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
రెండవ బుక్క రాయలు
https://te.wikipedia.org/wiki/రెండవ_బుక్క_రాయలు
రెండవ బుక్క రాయలు (1405–1406 CE) సంగమ వంశానికి చెందిన రెండవ హరిహర రాయలు పెద్ద కుమారుడు. రెండవ హరిహర రాయల మరణం తరువాత అతనుకుమారులైన విరూపాక్ష రాయలు, రెండవ బుక్కరాయలు, మొదటి దేవరాయల మధ్య జరిగిన వివాదాలలో రెండవ బుక్కరాయలు సింహాసనాన్ని అధిష్టించాడు. మొదటి సారి విరూపాక్ష రాయలు అతని స్వంత కుమారులచే హత్య చేయించబడే వరకు కొన్ని నెలలు మాత్రమే రాజ్యపాలన చేపట్టాడు. తరువాత రెండవ బుక్కరాయలు విధేయులు, సామంతులతో కలిసి స్వాధీనం చేసుకుంటాడు. కానీ మరొక తమ్ముడైన మొదటి దేవరాయలు అన్నగారిని తొలగించి సింహాసనాన్ని ఆక్రమించాడు. ఇతని గురించి చెప్పుకోవలసినది, ఇతను తండ్రిగారి హయాములో చేసిన పద్మనాయకులపై దండయాత్రలు వీటిగురించి రెండవ హరిహర రాయలు వ్యాసంలో చదవండి మూలాలు బాహ్య లంకెలు https://web.archive.org/web/20051219170139/http://www.aponline.gov.in/quick%20links/HIST-CULT/history_medieval.html http://www.ourkarnataka.com/states/history/historyofkarnatagggfgbnjjka40.htm వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
విజయ నగర రాజుల కాలంనాటి పన్నులు
https://te.wikipedia.org/wiki/విజయ_నగర_రాజుల_కాలంనాటి_పన్నులు
విజయనగర రాజ్యంలో పన్నులు చాలా ఎక్కువగా ఉండేవి, ఎక్కువ ఆదాయం, ఎక్కువ పన్నులుగా ఉండేవి. పన్నుల అధికారిగా భాండాగర్రి అని ఓ పదవి ఉండేది, ఇది చాలా అత్యున్నతమైనది, ప్రధాన మంత్రి తరువాత ఇదే విలువైనది. రాజునకు ఆదాయ మార్గాలు చాలా ఉండేవి, ముఖ్యముగా భూమిశిస్తుపై ఆధారపడి ఉండేవారు. భూమిశిస్తు పంటపొలాలు కొలిపించేవారు, తరువాత న్యాయముగా 1/6 వ వంతు శిస్తు వసూలు చేసేవారు, కానీ చాలా పర్యాయములు ఇవి ఎక్కువగా ఉండేవి, చాలాసార్లు సగంకంటే ఎక్కువ పంట శిస్తుగా కట్టవలసి వస్తూ ఉండేది, కానీ భ్రాహ్మణుల కిచ్చిన అగ్రహారములందూ, ఇనాము భూములపైననూ న్యాయమైన 1/6 వ వంతు మాత్రమే వసూలు చేసేవారు, దేవాయల భూములపై 1/30 వ వంతు మాత్రమే వసూలు చేసేవారు. అడవులను కొత్తగా కొట్టి గ్రామంలను ఏర్పరచి వ్యవసాయం చేసినవారికి పన్నులలో మినహాయింపు ఉండేది. మాగాణి, మెట్టభూములపై పన్నులు విడివిడిగా ఉండేవి. ఈ శిస్తు ధనముగా కానీ, ధాన్యముగా కానీ ఉండేది. మాగాణి భూములపై ధాన్యం రూపంలోనూ తోటలపైన అయితే ధనం రూపంలోనూ ఉండేది. రైతులు పన్నులు కట్టలేక వలసపోయిన దృష్టాంతములు ఉన్నాయి. గ్రామంలయందు పన్నులు వసూలు చేయడానికి కరణము అను అధికారి ఉండేవాడు. ఇతర పన్నులు మత పన్ను వృత్తి పన్ను సామాజిక పన్ను వాణిజ్య పన్ను పుల్లరి కొండగట్టు పన్ను గ్రామదేవత పూజలపై పన్నులు వేశ్యలపై పన్ను మగ్గముపన్ను ఆదాయపు పన్ను ఉప్పు పన్ను నిధి నిక్షేపాలపై పన్ను పశువులపై పన్ను నీటి బుగ్గలపై పన్ను స్థిరాస్తులపై పన్నులు ఎండుగడ్దిపై పన్ను దేవాలయ యాత్రికులనుండి పన్ను వివాయములపై పన్ను ఊరేగింపులపై పన్ను వృత్తి పన్ను ఎంత చిన్న ఆదాయమైననూ, వృత్తిపన్ను చెల్లింపవలసి వచ్చేది, చాకలి, మంగలి, కుమ్మరి, పంచాణమువారు, పశువులకాపరులు, జంగమవృత్తి, చర్మకారులు, మేళగాండ్రు, మొదలగువారు వృత్తిపన్నులక్రిందకి వచ్చేవారు. వేశ్యలపై పన్ను వేశ్యలపై కూడా పన్ను ఉండేది. విజయనగరమందున్న వేశ్యలు చెల్లించేపన్ను 12,000 మంది సైనికాధికారులకు సరిపొయ్యేవి. వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయనగర సామ్రాజ్యం
విజయ నగర రాజుల కాలంనాటి ఆర్ధిక పరిస్థితులు
https://te.wikipedia.org/wiki/విజయ_నగర_రాజుల_కాలంనాటి_ఆర్ధిక_పరిస్థితులు
విజయనగర రాజుల ఆర్థిక పరిస్థితి పటిష్ఠముగా ఉండేది. దేశము సుభిక్షముగా ఉండేది, రాజాధాయమున అన్ని వ్యయాలూ పోను సంవత్సరాంతమునకు లక్ష మాడలు విగులు ఉండేవి. సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి బాగుగానే ఉండేది, వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. భూమి సారవంతమైనది, వ్యవసాయదారులు మంచి పంటలు పండించేవారు. రాజులు వ్యవాసాయాభివృద్దికి మంచి చర్యలు తీసుకునేవారు, అనేక చెరువులూ, కాలవలూ తవ్వించి వ్యవసాయాభివృద్దికి దోహదంచేసేవారు. పండ్లతోటలు అనేకరకాలు పెంచేవారు, కొద్దిగా ధనవంతులే వరి అన్నమును తినేవారు, మిగిలిన రైతులూ, రైతుకూలీలు పేదవారు రాగులూ, జొన్నలు, తినేవారు. వ్యవసాయాధార పరిశ్రమలు ప్రతిగ్రామములోనూ ఉండేవి, బెల్లము, నేను తయారి, నీలిమందు తయారి, వస్త్ర పరిశ్రమ ముఖ్యమైనవి. తాడిపత్రి, ఆదవాని, వినుకొండ, గుత్తి, రాయదుర్గము పట్టుపరిస్రమకు ప్రసిద్ధిపొందిన కేంద్రాలు. ఒక్క అలవకొందలోనే 411 మగ్గాలు ఉండేవి, ఈ మగ్గాలు పై ఆధారపడి 2000 మంది జీవించేవారు. వజ్రములు కర్నూలు, గుత్తి, అనంతపురంలందు లభించు వజ్రములు చాలా పశస్తమైనవి. ఈ వజ్రములు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి, తళ్ళికోట యుద్ధము లేదా రక్షస తంగిడి యుద్ధం తరువాత జరిగిన దోపిడిలో రాజుగారి ఖజాన యందు ఓ కోడిగుడ్డు అంత పరిమాణము ఉన్న వజ్రం దొరికినది అని చెప్పబడింది. సైనికులకు కావలసిన కత్తులూ, శిరస్తానములు, మొదలగున్నవి తయారు చేయడం ఓ వృత్తిగా ఉండేది. సుగంధ ద్రవ్యములు కస్తూరి, పన్నీరు, బుక్క, గులాలు వంటి సుగంధ ద్రవ్యాలు ధనవంతులు ఉపయోగించేవారు. పాడి పరిశ్రమ కూడా మంచి ఉపాధి కలిగించుతుండేది. నాణెములు బంగారు, వెండి నాణెములు తయారు చేయబడుచుండేవి, వరహా లేదా గద్యాణ అను బంగారు నాణెము ఉండేది తార్ అనునది ఓ వెండి నాణెము, జిటలు, కాసు అను రాగి నాణెములు వాడుకలో ఉండేవి। వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయనగర సామ్రాజ్యం
విజయ నగర రాజుల కాలంనాటి సైనిక స్థితి
https://te.wikipedia.org/wiki/విజయ_నగర_రాజుల_కాలంనాటి_సైనిక_స్థితి
విజయనగరము ప్రభలమైన సైనిక శక్తి ఉంది. విజయనగర రాజులకు సామంతులుగా కమ్మరాజులు అయిన పెమ్మసాని నాయకులు, సూర్యదేవర నాయకులు, శాయపనేని నాయకులు, రావెళ్ళ నాయకులు ఆంధ్రదేశాన్ని పాలిస్తూ విజయనగర సామ్రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షులుగా ఉంటూ యుద్ధాల్లో తోడ్పడుతూ విజయనగర రక్షణ కవచంలా వారు ఎదురు నిలిచారు. రెండవ దేవ రాయలు (ప్రౌఢ దేవ రాయలు) ఈ వంశములో ప్రసిద్ధుడు. గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. విరూపాక్ష రాయలు గొప్ప నావికా సైన్యమును అభివృద్ధిచేసి సింహళ ద్వీపముపైకి దండయాత్రచేసి విజయం సాధించి సింహళ రాజునుండి కప్పమును తీసుకోని వచ్చాడు. ఈ విజయము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భారత దేశ చరిత్రలో ఓ అపవాదు ఉన్నది, కేవలము బ్రిటీషువారికి మాత్రమే నావికాదళము కలదు అని. కానీ దానికంటే ఎంతో ముందే భారతదేశ ప్రభువులు చక్కని నావికాదళమును రూపొందించారు. విజయనగర కాలం నాటి సైనిక విధానం విజయనగరం చక్రవర్తులు నిరంతరం బహమనీ సుల్తాను పాలకులచే పోరాడవలసి రావడంతో వారు సైనిక రాజ్యమును తప్పనిసరి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అందుకనే వారికి వచ్చే ఆదాయంలో సైనిక రంగ నిర్వహణకు దాదాపు అర్థ భాగం ఖర్చు చేసేవారు. శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి సైనిక విధానమును మిగతా పాలకులు కూడా దాదాపు పాటించారని చెప్పవచ్చును. విభాగములు విజయనగర చక్రవర్తుల కాలం నాటి సైన్యమును రెండు విభాగాలుగా విభజించవచ్చును. అందులో ఒకటి చక్రవర్తి సైన్యం. చక్రవర్తి సైన్యం ఎన్నిక, శిక్షణ, యుద్ధకాలంలో నిఅర్వహణ, చక్రవర్తి లేదా దండనాయకులచే నిర్వహించబడును. ఈ వ్యవస్థను "కందాచార శాఖ" పర్యవేక్షణలో విజయనగర పాలకులు కొనసాగించారు. నౌకా బలం, అశ్విక బలం లతో పాటు కాల్బలం సేవలను కూడా వినియోగించుకున్నారు. మేలు రకం అశ్వాలను ఇరాన్, పర్షియా, పోర్చుగీసు ప్రాంతాల నుండి దిగుమతి చేసుకొనేవారని చారిత్రిక ఆధారాలున్నాయి. దళాలు పదాతి దళము గజ దళము అశ్విక దళము అను విభాగములు ఉన్నాయి. చివరలో పిరంగి దళము, తుపాకి దళములు కూడా ఉండెను ఆయుధములు సాధారణ సైనికునకు శిరస్త్రానము, ధనుర్బాణాలు, డాలు, కత్తి ఉండేవి, ఇంకా ఈటె మొన్నగు ఆయుధములు కూడా ఉన్నాయి. విశేషములు ఈ సైన్యము ముఖ్యముగా రెండు రకములగా ఉండేవి సిద్ద సైన్యము అనగా ఇది కేంద్ర పరిపాలనలో ఉండే సైన్యము, ఇది సుమారుగా లక్ష మంది వరకూ ఉండేది (కృష్ణ దేవరాయల సమయమున) దీనికి జీత భత్యములు అన్నీ కేంద్ర ఖజానా నుండే వచ్చేది అమరనాయంకర సైన్యము అమరసైన్యం లేదా నాయకర సైన్యము లేదా సామంత సైన్యము, దీనిని సామంతులు చూసుకునేవరు, అవసరమైనప్పుడు రాజునకు పంపించేవారు విజయనగరం పాలనా కాలం నాటి సైన్యంలో మరొక ముఖ్యమైన అంశం, విజయనగర చక్రవర్తులు అపార విజయాలు సాధించడానికి కారణమైంది ఈ సైన్యం> అమర నాయకుల అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సైనిక పటాలములు, కఠోర సైన్యము, క్రమశిక్షణతో కూడిన పద్ధతులచే పోషించబడేది. స్థానిక భద్రతలను కాపాడడంతో పాటు విదేశీ దండయాత్రల కాలంలో చక్రవర్తి ఆదేశాల మేరకు పనిచేసి విజయనగర సామ్రాజ్య పటిష్టతకు శ్రమించాల్సి రావడం వీరి ప్రధాన విధి. ఈ సైన్యం ఎన్నిక, సైన్యం శిక్షణ, యుద్ధ కాలంలో సైన్యాన్ని నిర్వహించే బాద్యత అమరనాయకులు చూసుకొనేవారు. వీరు ప్రముఖ కొండ జాయి ప్రజలైన తుళు, కబ్బతి, మొరస, కోయలు, చెంచులు మొదలగువారిని సైనికులుగా నియమించి వారి శౌర్య, పరాక్రమాలతో అనేక విజయాలను విజయనగర సామ్రాజ్యానికి సాధించి పెట్టారు. మూలాలు వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయనగర సామ్రాజ్యం
శంకరంబాడి సుందరాచారి
https://te.wikipedia.org/wiki/శంకరంబాడి_సుందరాచారి
శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10, 1914 - ఏప్రిల్ 8, 1977) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత. జీవిత విశేషాలు సుందరాచారి, 1914 ఆగష్టు 10 న తిరుపతిలో జన్మించాడు. అతని మాతృభాష తమిళం. మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు. తండ్రి మందలింపునకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆంధ్ర పత్రికలో అచ్చుదోషాలు దిద్దేవాడిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన. అమితమైన ఆత్మవిశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు వెళ్ళాడు. ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు "నీకు తెలుగు వచ్చా" అని అడిగాడు. దానికి సమాధానంగా "మీకు తెలుగు రాదా" అని అడిగాడు. నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగు లోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియ లేదు అని అన్నాడు. ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి. తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పనిచేసాడు. నందనూరులో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చాడు. ఆ సంచాలకుడు సుందరాచారిని బంట్రోతుగాను, బంట్రోతును సుందరాచారిగాను పొరబడ్డాడు. దానికి కోపగించి, సుందరాచారి ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసాడు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. తాగుడుకు అలవాటు పడ్డాడు. సుందరాచారి 1977 ఏప్రిల్ 8 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు. thumb|right|శంకరంబాడి సుందరాచార్య. తిరుపతి 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి పట్టణం తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్‌లో సుందరాచారి జ్ఞాపకార్ధం, ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన పట్ల కృతజ్ఞతాసూచకంగా విగ్రహం దగ్గర ధ్వనివర్ధకం ద్వారా నిరంతరం మా తెలుగు తల్లికీ పాట నిరంతరంగా ధ్వనించే ఏర్పాటు చేసింది. సాహితీ వ్యాసంగం శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాలలోనూ తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసాడు. "నా పేరు కూడా (శంకరంబాడి సుందరాచారి) తేటగీతిలో ఇమిడింది, అందుకనే నాకది బాగా ఇష్టం" అనేవాడు ఆయన. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి.. కూడా తేటగీతిలో రాసిందే. ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది. మహాత్మా గాంధీ హత్య జరిగినపుడు ఆవేదన చెంది, బలిదానం అనే కావ్యం వ్రాసాడు. ఆ పద్యాలను పాఠశాలలో పిల్లలకు ఆయనే చదివి వినిపించాడట. ఆ పద్యాలలోని కరుణ రసానికి పిల్లలు రోదించారని ప్రముఖ రచయిత పులికంటి కృష్ణారెడ్డి చెప్పాడుదూరదర్శన్‌ లో పులికంటి కృష్ణారెడ్డి పాల్గొన్న ఒక చర్చా కార్యక్రమం. సుందర రామాయణం అనే పేరుతో రామాయణం రచించాడు. అలాగే సుందర భారతం కూడా వ్రాసాడు. తిరుపతి వేంకటేశ్వర స్వామి పేరు మకుటంగా శ్రీనివాస శతకం రచించాడు. ఇవే కాక జపమాల, బుద్ధగీతి అనే పేరుతో బుధ్ధ చరిత్ర కూడా రాసాడు. రవీంద్రుని గీతాంజలిని అనువదించాడు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది. ఏకలవ్యుడు అనే ఖండకావ్యం, కెరటాలు అనే గ్రంథం కూడా రచించాడు. సుందర సుధా బిందువులు అనే పేరుతో భావ గీతాలు వ్రాసాడు. జానపద గీతాలు వ్రాసాడు, స్థల పురాణ రచనలు చేసాడు. ఇవే కాక అపవాదు, పేదకవి, నాస్వామి, నేటికవిత్వము, బలిదానము, కార్వేటి నగరరాజ నీరాజనము మొదలైనవి వీరి ఇతర రచనలు. సినిమాలకు కూడా పాటలు రాసాడు. మహాత్మాగాంధీ, బిల్హణీయం, దీనబంధు అనే సినిమాలకు పాటలు వ్రాసాడు. దీనబంధు సినిమాలో నటించాడు కూడా. సుందరాచారి "మా తెలుగు తల్లికి" గీతాన్ని 1942లో దీనబంధు సినిమా కోసం రచించాడు. కానీ ఆ చిత్ర నిర్మాతకు యుగళగీతంగా వాడడానికి నచ్చక పోవటం వల్ల ఆ సినిమాలో చేర్చలేదు. టంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది. ఒకసారి ఢిల్లీ వెళ్ళి అక్కడ నెహ్రూను కలిసాడు. తాను రచించిన బుధ్ధ చరిత్ర లోని ఒక పద్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ఆయనకు వినిపించాడు. నెహ్రూ ముగ్ధుడై ఆయనను మెచ్చుకుని 500 రూపాయలు బహూకరించాడు. ఇతర కవుల అభిప్రాయాలు స్వర్గీయ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారన్నారు- మృదువైన పదములు, మధురమైన శైలి, మంచి కల్పన కలిగి వీరి కవిత్వము అనందము నాపాదించకలిగి ఉంది. కీ.శే.కవిసాంరాట్ విశ్వనధ సత్యనారాయణ అన్నారు- తెలుగు పలుకుబై, కవితాశక్తి, సౌకుమార్యము, ఈమూడు గుణములు మూటకట్టి వీరు పొత్తములను రచించుచున్నట్లున్నది.ఈ యుగములో వీరిదొక ప్రత్యేక వాజ్మయముగా ఏర్పాటు కాబోవుచున్నట్లున్నది. వీరిశైలి సంస్కృత సమాసములనుండియు, మారుమూల పదములనుండియు విడివడి సరళమైనది. శ్రీగడియారం వేంకటశేషశాస్త్రి అంటారు: ఈతని శైలి మిక్కిలి సరళమైనది. భాష సుగమనమైనది. ధార సహజమైనది. పోకడలు, ఎత్తుగడలు, అలంకారములు చమత్కారములు, మున్నగు ప్రసాధనము లన్నియు సుమచిత సన్నివేశములే భావ శ్రుతిలో మేళవించినవి. శ్రీరాయప్రోలు సుబ్బారావుగారు మాటలలో-సుందరాచారి గారి సూక్తి ఎంత తేటగా సూటిగా వినబడుతుందో అంత స్ఫురితంగా సుదూరంగా ధ్వనిస్తుంది. ఇది ఈ కవి రచనలలోని అనన్య విశిష్టత. శ్రీమాన్ రాళ్ళపళ్ళి అనంతకృష్ణ శర్మ గారు:తేటగీతుల తెలుగు తీదీపిరుచుల యూట....కొంకుల కొసరుల కాటుపడక సారతరమిది సుందరాచారి కవిత. రచనల నుండి ఉదాహరణలు సుందరరామాయణం వ్రాస్తున్నప్పుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మకు ఒక సందేహం కలిగి ఇతడిని "అయ్యా! సుందరాచారీ! తాటకి భయంకరస్వరూపిణి. నీ తేటగీతులలో ఇముడుతుందా?" అని ప్రశ్నించాడు. ఆయన దానిని ఒక సవాలుగా తీసుకుని తన సుందరరామాయణంలో తాటకిని ఇలా ప్రవేశపెట్టాడు. thumb|left|తిరుపతిలో శంకరంబాడి సుందరాచార్య. విగ్రహం పలకం నల్లకొండల నుగ్గుగా నలగగొట్టి చిమ్మచీకటిలోగల చేవబిండి కాళసర్పాల విసమెల్ల గలిపినూరి కాచిపోసిన రూపుగా గానుపించె పచ్చి రక్కసి, నడగొండవలెను, వదన గహ్వరము విచ్చి మంటలుగ్రక్కి,నాల్క సాచి, కనులెఱ్ఱవార, చేయూచికొనుచు నురము ముందుకునెట్టి, శిరమునెత్తి కాలభైరవియై వల్లకాటికెల్ల దానె గాపరి యనమించి తలల మాల మెడను వ్రేలాడ, ద్రాచులు పడగలెత్తి భూషలయి మేన బుసకొట్టి, ఘోషలిడుచు హరులు,తరులును,గిరులును,దరువులొకట వెంట బడిమూగ,నడుగులు,పిడుగులగుచు నిడిన చోట్లెల్ల గోతులు వడుచునుండ నచటి కరుదెంచె వికటాట్టహాసముగను తేటతెనుగు తనము పుణికిపుచ్చుకుని ఎదుటపడిన సుందరాచారి తాటకిని చూసి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ముక్కున వేలు వేసుకున్నాడు. బిరుదులు శంకరంబాడి సుందరాచారిని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అనీ కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు. మూలాలు, వనరులు బయటి లింకులు సుందర రామాయణం -సుందరాచారి (ఆర్కైవ్స్.ఆర్గ్) సుందరాచారి జ్ఞాపకాలపై హిందూ పత్రిక వ్యాసం రాయలసీమ రచయితల చరిత్ర నాలుగవసంపుటము - కల్లూరు అహోబలరావు - శ్రీకృష్ణదేవరాయగ్రంథమాల, హిందూపురం వర్గం:తెలుగు కవులు వర్గం:1914 జననాలు వర్గం:1977 మరణాలు వర్గం:చిత్తూరు జిల్లా రచయితలు వర్గం:చిత్తూరు జిల్లా కవులు
మొదటి దేవరాయలు
https://te.wikipedia.org/wiki/మొదటి_దేవరాయలు
మొదటి దేవ రాయలు ఇతను రెండవ హరిహర రాయలు కుమారుడు. తన అన్నగారినుండి రాజ్యమును బలవంతముగా స్వాధీనము చేసుకున్నాడు. యుద్దములు ఫిరోద్ షా తో తొలి యుద్దం సింహాసనము ఆక్రమించిన తొలిరోజులలోనే, విజయనగర రాజ్య అంతఃకలహాలను ఆసరాగా చేసుకొని ఫిరోద్ షా విజయనగరమును ముట్టడించి, ఓడించి 32 లక్షల రూపాయలను తీసుకోనిపోయినాడని సయ్యదలీ వ్రాతల వలన తెలియుచున్నది. రెడ్డి రాజులు, బహుమనీలపై విజయాలు కందుకూరును పరిపాలిస్తున్న రెడ్డి రాజులు\, ఉదయగిరి రాజ్యమందున్న పులుగునాడు, పొత్తపినాడులను జయించి తమ రాజ్యమున కలుపుకున్నారు. ఉదయగిరి దేవరాయలకు తండ్రి ఆధీనము చేసిన దుర్గము. ఈ సమయములో దేవరాయలు\, రాజమహేంద్రవరంను పరిపాలిస్తున్న కాటయవేమునితో సంధి చేసుకున్నాడు. వీరు ఇద్దరూ కలసి కొండవీటికి చెందిన పెద కోమటి వేమునితో, అతని స్నేహితుడగు అన్న దేవ చోడునితో, బహుమనీ ఫిరోద్ షా తోనూ యుద్ధము చేసారు. దేవ రాయని మిత్రుడైన కాటయ వేముడు, పెద కోమటి వేముడుతో యుద్ధం చేస్తూ వీరమరణం పొందినాడు. దానితో దేవరాయడు రాజమహేంద్రవరం అధిపతిగా కాటయవేముని కుమారుడైన, పది సంవత్సరముల ప్రాయం వాడైన రెండవ కుమార గిరిని కూర్చొనబెట్టి, అల్లాడ రెడ్డి, అతని కుమారులు వేమ\, వీర భద్రా రెడ్డి లుతో కలసి శతృవులైన ఫిరోద్ షా, పెద కోమటి వేమా రెడ్డి సైన్యాన్ని ఓడించి రాజమహేంద్రవరం పై అల్లాడరెడ్డి ఆధిపత్యాన్ని నిలబెట్టినాడు. ఇటువంటి ఓటమి తరువాత ఫిరోద్ షా పానుగల్లు దుర్గమును ఆక్రమించాడు. కొండవీడు, బహుమనీ ల స్నేహాన్ని చూసి కీడు శంకించిన పద్మ నాయకులు విజయనగరాధిపతతితో స్నేహం చేసుకొని పానుగల్లు దుర్గమును ఫిరోద్ షా నుండి కాపాడటానికి రెండు సంవత్సరములు యుద్ధము చేసాడు. ఇటువంటి సమయంలో దేవరాయలు వ్యూహాత్మకంగా బహుమనీ సుల్తానులకు కొండవీడు నుండి ఎటువంటి సహాయం రాకుండా చేయడానికి సైన్యాన్ని ఏకకాలంలో తీరాంధ్రప్రదేశాన్ని ఆక్రమించడానికి పంపించాడు. ఈ సైన్యము చాలా అమోఘమైన పురోగతి సాధించి పొత్తపినాడు, పులుగులనాడు లను ఆక్రమించి మోటుపల్లి రేవు పట్టాణాన్ని ముట్టడించింది. విజయనగర ప్రభువులు ఈ రెండు యుద్ధములందూ విజయాలు సాధించి బహుమనీ సుల్తానులనూ, కొండవీడు రాజులనూ ఓడించి నల్గొండ, పానుగల్లు, తీరాంధ్ర మొత్తం విజయనగర సామ్రాజ్యములో విలీనం చేశారు. ఇతర విశేషములు మొదటి దేవరాయలు ఈ స్ఫూర్తివంతమైన విజయములతో పాటూ, తన రాజధాని నగరాన్ని చక్కగా పటిష్ఠ పరిచాడు, కోట గోడలూ, బురుజులూ కట్టించాడు, తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టినాడు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసాడు. ఇతను సాధించిన విజయాలు తరువాత తరువాత విజయనగరాన్ని ఉన్నతస్థానంలో ఉంచడానికి చాలా తోడ్పడినాయి. కవులు జక్కన అను కవి విక్రమార్క చరిత్రను ఈ కాలముననే రచించాడు. మూలాలు వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
రామచంద్ర రాయలు
https://te.wikipedia.org/wiki/రామచంద్ర_రాయలు
thumb|విజయనగర రామచంద్ర రాయ నాణెం రామచంద్ర రాయలు (1367-1422 CE) సంగమ వంశానికి చెందిన విజయనగర సామ్రాజ్య పాలకుడు. అతను మొదటి దేవ రాయలు కుమారుడు. అతని తండ్రి మరణానంతరం 1422లో విజయనగర సింహాసనం అధిష్ఠించాడు. కానీ నాలుగునెలలు మాత్రమే పరిపాలన చేసాడు, తరువాత ఇతని తమ్ముడు విజయ రాయలు ఇతనిని తొలిగించి సింహాసనం అధిష్ఠించాడు. ఇతని తండ్రి దేవరాయల పాలనాకాలంలో ఉదయగిరి ప్రాంతానికి అధిపతిగా ఉన్నాడని కనిగిరి తాలూకా దాదిరెడ్డిపల్లెలోని 1416వ సంవత్సరపు శాసనం వల్ల తెలుస్తుందిGazetteer of the Nellore District: Madras District Gazettees - Brought Up to 1983 By Anon, Government of Madras పేజీ.50. మూలాలు వెలులి లంకెలు http://www.ourkarnataka.com/states/history/historyofkarnataka40.htm https://web.archive.org/web/20051219170139/http://www.aponline.gov.in/quick%20links/HIST-CULT/history_medieval.html వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
వీర విజయ బుక్క రాయలు
https://te.wikipedia.org/wiki/వీర_విజయ_బుక్క_రాయలు
వీర విజయ బుక్కరాయలు ( మూడవ బుక్కరాయలు లేదా మొదటి దేవరాయలు) (1371–1426) సంగం వంశానికి చెందిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. విశెషాలు అతను మొదటి దేవ రాయలు రెండవ కుమారుడు. తన అన్న రామచంద్ర రాయలు దగ్గరనుండి రాజ్యమును 1422లో అపహరించాడు. 1424 వరకు అతి కొద్ది కాలం సింహాసనాన్ని అధిష్టించిన అతను ఏ విధమైన గుర్తింపు పొందలేదు. కానీ అసమర్థుడుగా పేరుగాంచాడు, నామమాత్రమే సింహాసనముపై ఉండి, అధికారం మొత్తం తన కుమారుడైన రెండవ దేవ రాయలుకు అప్పగించాడు. మూలాలు బాహ్య లంకెలు https://web.archive.org/web/20051219170139/http://www.aponline.gov.in/quick%20links/HIST-CULT/history_medieval.html http://www.ourkarnataka.com/states/history/historyofkarnataka40.htm వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు en:Veera Vijaya Bukka Raya
రెండవ దేవ రాయలు
https://te.wikipedia.org/wiki/రెండవ_దేవ_రాయలు
link=https://en.wikipedia.org/wiki/File:Vijayanagara-empire-map.svg|కుడి|thumb|292x292px|రెండవ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం రెండవ దేవ రాయలు వీర విజయ బుక్క రాయలు కుమారుడు, దేవ రాయలు యొక్క మనుమడు. ఇతను తండ్రి పాలనలోనే పగ్గాలు చేతబట్టినవాడు, సమర్థుడు, అధికార దక్షుడు, ఏనుగులు వేటాడటంలో నేర్పరుడు. ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యం చాలా ప్రసిద్ధి చెందినదీ, నాలుగు చెరగులా వ్యాపించింది. దేశము సుసంపన్నము అయినది. యుద్దములు ఇతని కాలమునాటికి కొండవీడు బలహీనమైనది, దీనిని ఆసరాగాతీసుకోని తీరాంధ్రను జయించి, 1424 నాటికి కొండవీడు రాజ్యము అంతరించినది, అనేక చిన్న చిన్న సామంత దండనాయకులు స్వతంత్రించారు. రెండవ దేవరాయలు తీరాంధ్రపైకి దిగ్విజయ యాత్రచేసి నరసరావుపేట, ఒంగోలు లను పంట మైలారరెడ్డిని ఓడించి స్వాధీనం చేసుకున్నాడు. పొదిలిని ఏలుతున్న తెలుగు రాయలును ఓడించాడు. చివరికి వారిని తమ సామంతులుగా స్వీకరించాడు. ఇక్కడ ఓ ముఖ్య విషయం ఏమిటంటే ఈ తెలుగు రాయలు సాళువ వంశమునకు చెందినవాడు. అలాగే దిగ్విజయ యాత్రను సాగించుతూ 1428 వ సంవత్సరమున కొండవీడు దుర్గమును జయించాడు, తరువాత సింహాచల ప్రాంతములను వానియందలి పర్వత ప్రాంత భూభాగములను విజయనగర రాజ్యమున విలీనం చేసాడు. గజపతులతో యుద్దాలు 1444లో కళింగ అధిపతులైన కపిలేశ్వర గజపతి తీరాంధ్రముపైకి దండయాత్రకు వచ్చాడు, అతడు రాజమహేంద్రవరం వరకూ వచ్చాడు, కానీ తరువాత రెండవ దేవరాయలు పంపించిన మల్లపవడయ చమూపతి ఈ దురాక్రమణను తిప్పికొట్టినాడు. ఈ కాలమునాటికి దక్షిణ భారతమంతయూ విజయనగరాధీనములోనికి వచ్చింది. జాఫ్నాపై యుద్దం లక్కన్న అను దండనాయకుని సారథ్యంలో దేవరాయ సైన్యం జాఫ్నా పై దండెత్తి కప్పమును స్వీకరించెను. రెండవ దేవరాయ రాజ్యము సింహళము నుండి గుల్బర్గ వరకూ, ఓడ్ర దేశము నుండి మలబారు తీరము వరకూ వ్యాపించింది. బహుమనీ సుల్తానులతో యుద్దములు బహుమనీ సుల్తాను అహ్మద్ షా గొప్ప సైన్యమును ఏర్పాటుచేసుకోని దండెత్తి తొలి సారి విజయం సాధించాడు. తరువాత అతడు పద్మనాయకులుపై దండెత్తినాడు, కానీ సరిఅయిన సమయానికి విజయనగర సైన్యం రానికారణంగా పద్మనాయకులు ఈ యుద్ధమున ఓడిపొయినారు. అప్పటినుండి పద్మనాయకులూ, విజయనగరాధీశులూ మరల శతృత్వము వహించారు. ఈ సారి దేవరాయలు 1443నందు బహుమనీ రాజ్యముపై దండెత్తి ముద్గల్లు, బంకాపూర్, రాయచూర్, లను ఆధీనం చేసుకోని బీజాపూర్, సాగర్ లపైకి సైన్యమును నడిపినాడు. ఈ యుద్ధం అతి భయంకరంగా రెండు నెలలు జరిగినది, ఇరువైపులా చాలా నష్టాలు కలిగినాయి, చివరకు సంధి కుదిరినది, బహుమనీ, విజయనగర రాజ్యాల మధ్య కృష్ణా నది ఎల్లలుగా గుర్తించబడినాయి. ఇతని సైన్యము ఇతని సైన్యము చాలా బలవంతమైనది, ఇతను చక్కని ముస్లిం సైనికాధికారులను పిలిపించి తన సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. తన సైన్యంలో రెండువేలమంది ముస్లింలను చేర్చుకున్నాడు. (ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదాలకు దారితీసినది, ఎందుకంటే అచ్యుతరాయల కాలం నాటికి సైన్యంలో ముస్లింల సంఖ్య చాలా పెరిగినది, కానీ వారు రాక్షస తంగడి యుద్దమున అచ్యుత రాయలకు వెన్నుపోటుపొడిచి యుద్ధంలో రాయల మరణానికీ, తద్వారా విజయనగర పతనానికీ హేతువులలో ఒకరుగా నిలిచారు) ఇతని సైన్యంలో రెండు లక్షల కాల్బలము, 80 వేల అశ్విక దళము, 60 వేల ధనుర్విద్య విశారదులూ ఉండేవారు. మతము ఇతను శైవమతాభిమాని, పరమత సహనము కలవాడు, ఈ కాలములో అందరికీ ఆలయములు నిర్మించాడు, ముఖ్యముగా జైనులకూ, ముస్లింలకూ, వైష్ణవులకూ, శైవులకూ ఆలయములు నిర్మించాడు. సాహిత్యము ప్రసిద్ధ డిండిమ భట్టారకుడు ఈ కాలమునందలివాడే, ఇతనినే శ్రీనాథుడు ఓడించి కవిసార్వభౌమ బిరుదును తీసుకున్నాడు. కంచు డక్కను పగల గొట్టినాడు. రాయబారులు పర్షియా నుండి అబుల్ రజాక్ ఈ కాలంనాడే రాయబారిగా వచ్చాడు. ఇటలీ యాత్రికుడు కౌంటే ఈ కాలంలోనే వచ్చాడు. విజయ నగరం ఇది ఏడు ప్రాకారములు కలది, ప్రాకారముల మధ్యలో పంట పొలాలు ఉన్నాయి. దీని చుట్టుకొలత సుమారుగా 100 కిలోమీటర్లు. పండుగలు ఆనాటి పండుగలు చాలా ఉత్సాహంతో జరుపుకునేవారు, ముఖ్యముగా దీపావళి, శివరాత్రి, వసంతోత్సవములు ఘనంగా జరుపుకునేవారు. రాజ్య విశేషములు ఇందు 300 ఓడరేవులు ఉన్నాయి. సామ్రాజ్యము ధనవంతమైనది. విజయనగరం చాలా అద్భుతంగా ఉండెడిది. రాజప్రాసాదము అత్యున్నతమైనది, మనోహరమైనది, నగర వీధులందు స్వర్ణరత్నాభరణములు, వజ్రవైడూర్యములు రాసులుగా పోసు అమ్ము వర్తక శ్రేష్ఠులు ఉన్నారు, సామ్రాజ్య ప్రజలు విలాసమయ జీవితము గడిపేవారు। వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
మల్లికార్జున రాయలు
https://te.wikipedia.org/wiki/మల్లికార్జున_రాయలు
మల్లికార్జున రాయలు తన తండ్రి రెండవ దేవ రాయలు తరువాత అధికారములోనికి వచ్చాడు, ఇతడు అంత సమర్థుడుగా పేరుగాంచలేదు, తాత తండ్రుల రాజ సంపదను కొంత బహుమనీ సుల్తానులకు, మరికొంత గజపతులకు సమర్పించాడు. కపిలేశ్వర గజపతి పద్మనాయకుల సహాయముతో 1448న తీరాంధ్రపైకి దండెత్తివచ్చి రాజమహేంద్రవరమును ఆక్రమించాడు. తరువాత ఇంకా ముందుకు సాగి 1450లో కొండవీడును జయించాడు. అద్దంకి, శ్రీశైలము, వెలుగోడు, బెల్లంకొండలను జయించి, తరువాత విజయనగరంను ముట్టడించాడు, రాయలు సంధి చేసుకోని అపరాధరుసుము చెల్లించాడు. గజపతుల రెండవ దడయాత్ర 1464 వ సంవత్సరమున, గజపతులు కపిలేశ్వర గజపతి, గొప్ప సైన్యాన్ని ఇచ్చి హంవీర గజపతి సైన్యాధిపతిగా విజయనగరంపైకి దండయాత్రకు వచ్చి కాంచీ నగరం వరకు ఆక్రమించెను, ఇతను చంద్రగిరి, ఉదయగిరి, కొండపల్లి, వినుకొండ, అద్దంకి, తిరుచానూరు, తిరుచనాపల్లి మొదలగు ప్రాంతములను గజపతుల ఆధీనములోనికి తెచ్చాడు. మొత్తానికి ఈ రాజు చాలా అసమర్థుడైనాడు. మూలాలు Dr. Suryanath U. Kamat, Concise history of Karnataka, MCC, Bangalore, 2001 (Reprinted 2002) వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
రెండవ విరూపాక్ష రాయలు
https://te.wikipedia.org/wiki/రెండవ_విరూపాక్ష_రాయలు
thumb|240px|రెండవ విరూపాక్ష రాయలు తమిళ శాసనం, 1481 AD, Thiruvanamalai District, ASI Museum, Vellore Fort రెండవ విరూపాక్ష రాయలు, ఇతను రెండవ దేవ రాయలు సోదరుడగు విజయ రాయలు కుమారుడు. ఇతను శతృవులను జయించి రాజ్యమునకు వచ్చాడు, ఇతడు అంత సమర్థుడు కాకున్ననూ, శక్తివంతమైన సామంతులూ, వారి పోరాటాలు సహాయముగా గజపతులను కళింగ వరకూ తరిమినాడు. ముఖ్యముగా పెనుగొండను ఏలుతున్న సాళువ నరసింహ రాయ భూపతి ఇందు ముఖ్య భూమికను పోషించాడు. ఈ రాజు రాజవ్యసనమునకు అలవాటు అయి, దుష్టబుద్ధి కలిగి అవకతవక పనులు చేయుచు రాజ ప్రతిష్ఠ మంట కలిపెను. ఇతని పాలనను చూడలేక కుమారుడే తండ్రిని హతమార్చెను. వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
ప్రౌఢరాయలు
https://te.wikipedia.org/wiki/ప్రౌఢరాయలు
ప్రౌఢరాయలు, విరూపాక్షరాయల రెండవ కుమారుడు. సోదరుడగు రాజశేఖర రాయలను సంహరించి 1485లో అధికారానికి వచ్చాడు, ఇతను క్రూరుడు, దుర్మార్గుడు, దుర్బలుడు, విలాసవంతమైన జీవితములకు అలవాటుపడినాడు. సామంత, మాండలీకులు ఇతని కుపిత చర్యలకు ఆశ్చరచకితులై సాళువ నరసింహరాయ భూపతినకు అండగా నిలిచి, ఇతనిని సింహాసనంనుండి దించివేసినారు. ఈ తిరుగుబాటునకు తుళువ నరసనాయకుడు నాయకత్వం వహించాడు. ముఖ్యమైన విషయము ఏమిటంటే, ఇతనితో సంగమవంశ పాలన అంతమైనది, మహోన్నత ఆశయంతో హరిహర బుక్క రాయలతో ప్రారంభమైన ఈ వంశ పాలన చివరకు అసమర్థులైన రాజుల వల్ల, విలాస జీవితం వల్లా నాశనం అయిపోయింది. మరొక ముఖ్యమైన విషయము ఏమిటంటే, రాజు చెడ్డవాడైతే విజయనగర సామంతాది మంత్రివరులు వారిని పదవీచ్యుతులు చేయు ఆచారము కలదు, కొద్దిగా ప్రజాస్వామ్య లక్షణాలు కనిపించడంలేదు! వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
సాళువ నరసింహదేవ రాయలు
https://te.wikipedia.org/wiki/సాళువ_నరసింహదేవ_రాయలు
సాళువ నరసింహ రాయ భూపతి విజయ నగర సింహాసాధిపతికి ముందు ఇతని చరిత్ర ఇతను పెనుగొండ దుర్గాధిపతి, అప్పటికే సంగమ వంశము క్షీణ దశలో పడి రాజ్య భాగాలు కాకులు పాలైనట్లు అటు గజపతులూ, ఇటు బహుమనీ సుల్తానులూ లాక్కోసాగినారు, నేరుగా సామ్రాజ్యమునకు గుండెవంటి విజయనగరము పైకి దండెత్తి వచ్చి ఓడించి కప్పాలు తీసుకోని పొయినారు. దీనితో సాళువ నరసింహ రాయ భూపతి, తన ధైర్య సాహసములతో పోరాటాలు చేసి రాజ్యభూభాగాలు రక్షించ ప్రయత్నించాడు. ఉదయగిరి స్వాతంత్ర్యము తెచ్చుట 1470నందు నరసింహరాయలు ఉదయగిరి పై దండెత్తి అక్కడి రాజప్రతినిధిఅయిన కంటంరాజు తమ్మరాజును ఓడించాడు. దీనితో కపిలేశ్వర గజపతి కోపించి, కుమారునితో కలసి ఉదయగిరి పైకి దండెత్తినాడు, కానీ నరసింహరాయలు శక్తి సామర్ద్యాలముందు ఓడిపోయి ప్రాణాలు కోల్పోయినాడు. ఇదే అదనుగా నరసింహరాయలు తమ తమ తీరాంధ్ర భూభాగాలను గజపతులనుండి పునస్వాధీనము చేసుకున్నాడు. బహుమనీ సైనికులను ఓడించుట తరువాత గజపతులు అంతఃకలహాలతో రాజ్య భూభాగాలను బహుమనీలకు కోల్పోయినారు. ఈ సమయంలో చాలా యుద్ధాల తరువాత బహుమనీ సుల్తాన్ మూడవ మహమ్మద్ షా దండయాత్రకు బయలుదేరి రాజమహేంద్రవరమును గజపతుల నుండి ఆక్రమించి, కొండవీడును జయించి, కాంచీపురంను జయించి, విశేష ధనముతో వజ్ర వైడూర్య రత మణి మయ ఖచిత ఆభరణాలతో తిరిగి వెళ్లసాగినాడు. ఇక్కడే నరసింహ రాయ భూపతి తెలివిగా ప్రవర్తించాడు, తుళువ ఈశ్వర నాయకుడు అను గొప్ప శూరుడైన సేనానిని పంపి కందుకూరు వద్ద బహుమనీ సైనికులను ఓడించి మొత్తం ధనుమును స్వాధీనము చేసుకున్నాడు. దీనితో పెనుగొండ సిరిసంపదలతో తులతూగసాగినది. మచిలీ పట్నం ఆక్రమణ తరువాత స్వయంగా నరసింహరాయలు మచిలీపట్నంపైకి దండయాత్రకు వెళ్లి ఆక్రమించుకున్నాడు. బహుమనీ ప్రతీకారం బహుమనీ సుల్తానులు ఓటమికి బాధపడి మరల గొప్పసైన్యంతో దండయాతకు బయలుదేరి మచిలీపట్నం జయించి పెనుగొండను మాత్రం ఏమీ చేయలేకపొయినారు. విజయ నగర సింహాసనము అధిస్టించుట సంగమ వంశీయులు చేతకానివార, చేవ చచ్చి, వ్యసనపరులై, సామంతుల నమ్మకాన్ని కోల్పోయినారు. సామంతుల కోర్కెపై సింహాసనం అధిస్టించాడు. సింహాసనం అధిస్టించగానే సామంతుల తిరుగుబాటు అణిచివేసినాడు. తరువాత ఉదయగిరి యుద్ధములో ఓడిపోయి దానిని గజపతులస్వాధీనము చేసాడు. వారసులు ఇతనికి ఇద్దరు కుమారులు, చివరి క్షణాలలో తన సేనాని అయిన తుళువ నరసనాయకునికి, కుమారులనూ రాజ్యాన్ని అప్పగించి ఎలాగైనా గజపతులు, బహుమనీల ఆధీనంలోని విజయనగర రాజ్య ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోమన్నాడు. సినిమాలలో ఈ రాజు అన్నమయ్య సినిమా చూసిన వారికి "గండరగండ, ....పెనుగొండ దుర్గాధిపతి ... సాళువ నరసింహ రాయ భూపతి ..." అంటూ స్టైలుగా మీసం మెలేసే మోహన్ బాబు పాత్ర గుర్తు ఉండే ఉంటుంది, ఆ సాళువ నరసింహ రాయ భూపతే, ఈ సాళువ నరసింహ రాయలు, ఇతని ఆస్తానంలోనే అన్నమయ్య ఉన్నారు, ఇతనే అన్నమయ్యను గొలుసులతో బంధించినాడని చిన్నన్న తన అన్నమయ్య చరిత్ర అను ద్విపద కావ్యంలో వ్రాసినారు. వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
తిమ్మ భూపాలుడు
https://te.wikipedia.org/wiki/తిమ్మ_భూపాలుడు
తిమ్మ భూపాలుడు, సాళువ నరసింహ రాయలుగారి పెద్ద కుమారుడు, తన ప్రభువునకు ఇచ్చిన మాట ప్రకారం తుళువ నరస నాయకుడు ఇతనిని సింహాసనాధిస్టుని చేసి రాజ్యభారం తానే వహించాడు, కానీ ఆరు నెలలలోనే ఇతను మరణించాడు. సా.శ. 1485 నుంచి 1491 వఱకు సాళువ నరసింహదేవరాయలు, 1491లో కొంతకాలం తిమ్మ భూపాలుడు రాజ్యపాలన చేసాడు. తిమ్మ భూపాలుడు సాళువ నరసింహనాయకుని కొడుకులలో ఒకడైన పెరియ సంగముడు కావచ్చునని కొందరు ఊహించారు. సాళువ నరసింహరాయలకు తిమ్మ భూపాలుడనే మరొక కొడుకు ఉండినట్లు, అతను బహుగ్రంథకర్త అయినట్లు నేలటూరి వేంకట రమణయ్య గారు Further Sources of Vijayanagara History లో వ్రాశారు. సాళువ నరసింహదేవ రాయలు రెండవ కుమారుడు, అన్నగారు అయిన తిమ్మ భూపాలుడు మరణించిన పిదప ఇతను రాజ్యాధిపతి అయినాడు, కానీ తుళువ నరస నాయకుడు ఇతనిని పెనుగొండ దుర్గమున గృహనిర్భంధమున ఉంచి రాజ్యమునకు తానే అధిపతి అయినాడు. మూలాలు వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
రెండవ నరసింహ రాయలు
https://te.wikipedia.org/wiki/రెండవ_నరసింహ_రాయలు
రెండవ నరసింహ రాయలు (పరిపాలనా కాలం: 1491-1505) (నరసింహ II, ఇమ్మడి నరసింహరాయ లేదా ధమ్మ తిమ్మరాయ)Majumdar R.C. (2006). The Delhi Sultanate, Mumbai: Bharatiya Vidya Bhavan, p. 305 విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన నాలుగు రాజవంశాలలో రెండవదైన సాళువ రాజవంశం లోని మూడవ , చివరి పాలకుడు. నేపధ్యం నరసింహ రాయని తండ్రిని నరసింహ అని కూడా పిలుస్తారు, 13 వ శతాబ్దంలో సామ్రాజ్యాన్ని స్థాపించిన సంగమ రాజవంశానికి సేవలందించే ఆర్మీ కమాండర్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. సంగమ రాజవంశం వివిధ కారణాల వల్ల కాలక్రమేణా బలహీనపడుతోంది. నరసింహదేవరాయలు 1485 లో రాజధానిని స్వాధీనం చేసుకుని తన మాజీ అధిపతి సంగమ ప్రౌదరాయను తరిమివేసిన తరువాత సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతని నమ్మకమైన సామంతుడు తుళువ నరస నాయకుడు అందించిన సైనిక బలం వల్ల ఈ ప్రయోజనం చేకూరింది. నరసింహరాయలు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసి సాళువ నరసింహ దేవరాయలుగా పేరు పొందాడు. అతను 1491 లో మరణించాడు. సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్న ఆరు సంవత్సరాల తరువాత అతని ఇద్దరు యువ కుమారులు అతని వారసులుగా మిగిలిపోయారు. తన మరణశయ్యపై అతను తన నమ్మకమైన సామంతరాజు తుళువ నరస నాయకుని సంరక్షణకు చిన్న పిల్లలను అప్పగించాడు. తండ్రి మరణించిన కొద్ది వారాల్లోనే పాత సంగమ రాజవంశానికి విధేయుడైన సైనికాధికారి పెద్ద కుమారుడైన తిమ్మ భూపాలుని చంపాడు. అపుడు రెండవ కుమారుడైన "రెండవ నరసింహరాయలు"ను సింహాసనం అధిష్టింపజేసారు. పరిపాలన తన అన్నయ్య మరణం తరువాత రెండవ రరసింహరాయలు సింహాసనాన్ని అధిష్టించాడు. విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి అయిన సమయంలో అతను యుక్తవయసులో ఉన్నాడు. అందువలన వాస్తవమైన రాజ్యాధికారం అతని సంరక్షకుడైన తుళువ నరసనాయకుని చేతిలో ఉండేది. 1503 లో తుళువ నరసనాయకుడు మరణించే వరకు ఈ పరిస్థితి పన్నెండు సంవత్సరాప పాటు కొనసాగింది. ఈ సమయానికి రెండవ నరసింహరాయలు పెద్దవాడు అయినప్పటికీ పరిపాలనా భాద్యతలు నిర్వహించడానికి అతనికి సమర్థత లేదు. ఏదేమైనా అప్పటి వరకు పరిపాలన కొనసాగించిన దివంగత తుళువ నరసనాయకుని పెద్ద కుమారుడు తుళువ వీర నరసింహరాయలు సైన్యంపై నియంత్రణ సాదించాడు. ఆతను నరసింహరాయలను తనకు దళవాయి (సైన్యం యొక్క కమాండర్-ఇన్-చీఫ్), సర్వాధికారి ("అడ్మినిస్ట్రేటర్ జనరల్," సమర్థవంతమైఅన్ పరిపాలకుడు) అని పేరు పెట్టమని ఒత్తిడి చేసాడు ఇద్దరు నరసింహ రాయలల (చక్రవర్తి సాళువ నరసింహ II, అతని మంత్రి తుళువ వీరనరసింహ) మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రాష్ట్రాన్ని పాలించే అధికారం తమకు ఉందని ఇద్దరూ భావించారు. ఆ తరువాత వీరనరసింహ రయలు చక్రవర్తి అయ్యాడు. అతను తన తండ్రి ఇంతకాలం పాటు పరిపాలించి ఇటీవల మరణించినందున సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తన తండ్రి తుళువ నరస నాయకులు అతని ప్రయత్నం వల్ల ప్రస్తుత రాజధాని స్వాధీన ప్రయత్నాలు సాధ్యమయ్యాయి. నరసింహ రాయల తరువాత దేశంలో జరిగిన అశాంతిని శాంతింపజేసాడు. పాత సంగమ రాజవంశం మద్దతుదారులను అణచివేసాడు. వయసులో చిన్నవారైన అతని కుమారులకు రక్షణ కల్పించి రాజవంశ క్రమాన్ని కొనసాగించాడు. ఈ నేపధ్యంతో తుళువ వీరనరసింహ చక్రవర్తి రెండవ నరసింహరాయల కన్నా పాలించే హక్కు ఉందని భావించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మరణం 1505లో పాత పరిపాలకుడు తుళువ నరసనాయకుడు మరణించిన రెండు సంవత్సరాల తరువాత రెండవ నరసింహరాయలను పెనుకొండ కోట వద్ద హత్య చేసారు. అతని మరణంతో సాళువ రాజవంశం పాలన ముగిసింది. సాళువ వంశంలో ముగ్గురు చక్రవర్తులు (తండ్రి, ఇద్దరు కుమారులు) మొత్తం ఇరవై సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. తరువాత వీరనరసింహరాయలను విజయనగర చంద్రవర్తిగా ప్రకటించారు. తుళువ రాజవంశం సింహాసనంపైకి వచ్చింది. 1565 లో జరిగిన తళ్ళికోట యుద్ధం జరిగే వరకు 60 సంవత్సరాల పాటు ఈ వంశం రాజ్య పాలన కొనసాగించింది. మూలాలు వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
తుళువ నరస నాయకుడు
https://te.wikipedia.org/wiki/తుళువ_నరస_నాయకుడు
తుళువ నరస నాయకుడు సాళువ నరసింహదేవ రాయలు వద్ద సేనాని, ఇతను బహమనీలనుండి ఎంతో ధనాన్ని నేర్పుగా కొల్ల గొట్టినాడు. ఇతడు నరసింహదేవ రాయలును సింహాసనాధిస్టులను చేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు. సాళువ నరసింహ రాయలు మరణ శయ్యపై ఉండి విజయనర రాజ్యాన్నీ, తన కుమారులనూ తుళువ నరస నాయకునికి అప్పగించాడు. ఇచ్చిన మాట ప్రకారం ముందు పెద్ద కుమారుడైన తిమ్మ భూపాలుడును తరువాత రెండవ నరసింహ రాయలును సింహాసనం అధిస్టింపచేసి తాను రాజ్యభారాన్ని వహించాడు, లేదా అధికారాన్ని చెలాయించాడు మొదటి దండయాత్ర ఇతను అధికారాన్ని సహించలేని సామంతులు స్వతంత్రించారు, గజపతులు విజృంభించి చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. చోళ, పాండ్య, మధుర సామంతులు స్వతంత్రించారు. వీటన్నింటినీ చక్కబరచడానికి 1496లో దండయాత్రకు బయలుదేరినాడు. తూర్పు సముద్రంవరకూగల భూమిని అందున్న సామంతులను అణచి, దక్షిణమునకు వచ్చి చోళ రాజును ముట్టడించాడు. అప్పటి తిరుచినాపల్లి పాలకుడు కోనేటి రాజు ఓడిపోయినాడు, తరువాత మధుర పాలకుడైన మానభూషనుడుని ఓడించి తరువాత పాండ్య రాజ్యముపై దండెత్తి ఆ రాజ్యమును సామంత రాజ్యముగా చేసుకున్నాడు. తరువాత కర్నాట ప్రాంతమునందున్న ఉమ్మత్తూరు పై దండెత్తినాడు. ఇలాగే విజయోత్సాహంతో ముందుకు వెళ్తున్న నరస నాయకునికి శ్రీరంగపట్టణం, శివసముద్రంలను ముట్టడించకుండా పొంగిపొరలుతున్న కావేరీ నది అడ్డు వచ్చింది. దానితో కావేరీ నదికి ఆనకట్ట కట్టి శ్రీరంగమును ముట్టడించి భీకర యుద్ధం చేసాడు, దుర్గరక్షణాధికారి హోయ్సణేంద్రుడు బంధీ అయినాడు. శ్రీరంగము నరసనాయకుని వశం అయినది. ఉమ్మత్తూరు కూడా ఇతని ఆధీనంలోనిని వచ్చింది. బీజాపూరు పాలకునితో యుద్దం బీజాపూరు పాలకుడైన యూసఫ్ ఆదిల్‌షా విజయనగర రాజ్యానికి చెందిన మానువ కోటను ఆక్రమించాడు, దానితో నరసనాయకుడు వారిపైకి సైన్యాలను నడిపి యూసఫ్ ఆదిల్‌షాను బంధీగా పట్టుకోని దయతో వదిలివేసినాడు. గజపతుల దండయాత్రను అడ్డుకొనుట 1496న గజపతుల రాజు పురుషోత్తమ గజపతి మరణించాడు, అతని కుమారుడు ప్రతాపరుద్ర గజపతి సింహాసనం అధిస్టించి, దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు, కృష్ణా నది దాటి రాకుండా నరస నాయకుడు వీనిని ఓడించాడు. మరణం ఇతను 1503లో మరణించాడు వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
తెలుగు సినిమాలు ఈ
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ఈ
thumb|ఈడు జోడుఈడు జోడు - 1964 ఈనాడు - 1982 ఈనాడు - 2009 ఈ కాలపు పిల్లలు ఈకాలం మనిషి ఈతరం నెహ్రూ ఈ తరం మనిషి ఈనాటి బంధం ఏనాటిదో - 1977 ఈ ప్రశ్నకు బదులేది ఈ పిల్లకు పెళ్ళవుతుందా ఈ చరిత్ర ఇంకా ఎన్నాళ్లు ఈ చరిత్ర ఏ సిరాతో - 1981
వీరనరసింహ రాయలు
https://te.wikipedia.org/wiki/వీరనరసింహ_రాయలు
వీరనరసింహరాయలు విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి. తుళువ వంశ స్థాపకుడైన తుళువ నరస నాయకుని కుమారుడు. ఈయన అసలు పేరు కూడా తండ్రిలాగా నరస నాయకుడే, అయితే సింహాసనాన్ని మాత్రం వీర నరసింహ రాయలు అనే వీరోచిత పేరుతో అధిష్టించాడు. ఇతని తండ్రి నరస నాయకుడు 1503లో దివంగతుడైన తర్వాత వీరనరసింహరాయలు పెనుగొండ లో బందీగా ఉన్న సాళువ ఇమ్మడి నరసింహ రాయలు పేరుతో 1505 వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ 1506లో అతనిని హత్యగావించి తనే రాజుగా సింహాసనాన్ని అధిష్టించాడు. సామంతుల తిరుగుబాట్లు వీరనరసింహరాయలు సాళువ వంశాన్ని అంతమొందించి తనే రాజుగా మారడాన్ని సహించని సామంతులు తిరుగుబాట్లు చేసారు, ముఖ్యంగా ఆదోని పాలకుడు కాసెప్ప ఒడయరు, ఉమ్మత్తూరు పాలకుడు దేవరాజు, శ్రీరంగపట్నం పాలకుడు గుండరాజులు తిరుగుబాటు చేసారు. బహుమనీ సుల్తాను మహమ్మద్ షా ఆదేశానుసారం అతని సామంతుడు యాసుఫ్ ఆదిల్ఖాన్ 1502లో విజయనగర రాజ్యంపైకి దండయాత్రకు బయలుదేరినాడు. అప్పటికే తిరుగుబాటు చేస్తున్న ఆదోని కాసెప్ప ఒడయారు అతనికి వంతగా తనూ సైనికులను నడిపించాడు, కానీ అరవీటి రామరాజు కుమారుడు అరవీటి తిమ్మరాజు కందనవోలు (కర్నూలు) ప్రాంతాన్ని పరిపాలిస్తూ విజయనగరాధీశులకు సామంతునిగా ఉండెను. అతను ఈ యూసుఫ్ ఆదిల్ఖాన్, కాసెప్ప ఒడయారు సైనికులను మూడు సంవత్సరాలు జరిగిన యుద్ధమందు ఓడించి తరిమేశాడు. ఈ విజయానికి ఆనందించి వీర నరసింహరాయలు అదవాని (అదోని) సీమను అరవీటి తిమ్మరాజునకు విజయానికి కానుకగా ఇచ్చాడు. ఈ సంఘటన వల్ల అరవీటి వంశస్తులూ, తుళువ వంశస్తులూ చక్కని స్నేహితులు అయినారు. వీరనరసింగ రాయలు మిగిలిన తిరుగుబాటు చేస్తున్న సామంతులను అణచివేయడానికి, తన సోదరుడైన శ్రీ కృష్ణదేవరాయలును రాజ్యపాలనకు నియమించి, 1508 నాటికి ఉమ్మత్తూరు, శ్రీరంగపట్టణములను ఓడించి విజయనగరము వచ్చాడు, కానీ మరల వీరు తోక జాడించారు. దానితో ఈ సారి తన సోదరులగు అచ్యుత రాయలు, శ్రీరంగ రాయలును సైన్యసమేతంగా సామంతులను అణుచుటకు పంపించెను, ఈ దండయాత్రలో కొంకణ ప్రాంతపాలకుడు కప్పము చెల్లించడానికి అంగీకరించాడు. మిగిలినవారు ఎదిరించి ఓడిపొయినారు. ఉమ్మత్తూరుపై యుద్ధంలో పోర్చుగీసు వారు గుఱ్ఱాలు, ఫిరంగులు సరఫరాచేసి రాయలకు సహాయం చేశారు. ప్రతిగా వీరు భట్కళ్ రేవుపై ఆధీనాన్ని పొందారు. దక్షిణ దండయాత్ర తరువాత వీర నరసింహరాయలు మరొక దండయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసాడు. ఈ దండయాత్రలన్నీ ముగిసిన తరువాత వీరు ఆధ్యాత్మిక మార్గంలో పడి కంచి, కుంభకోణము, పక్షితీర్థము, శ్రీరంగము, చిదంబరము, శ్రీకాళహస్తి, గోకర్ణము, రామేశ్వరము, త్రిపురాంతకము, అహోబలము, శ్రీశైలము, తిరుపతి, సంగమేశ్వరము మొదలగు పుణ్యక్షేత్రములను దర్శించి అనేక దాన ధర్మాలను చేసాడు. వారసుడు దక్షిణ దేశ యాత్రలు తరువాత వీర నరసింగ రాయలు జబ్బు పడినాడు. దానితో తన వద్ద మహామంత్రిగా ఉన్న సాళువ తిమ్మరుసును పిలిపించి, తన తరువాత, తన ఎనిమి సంవత్సరాల కొడుకు తిరుమల రాయలును రాజ్యానికి వారసునిగా చేయమనీ, అలాగే శ్రీ కృష్ణదేవ రాయలు కను గుడ్లు పీకి చూపించమనీ ఆజ్ఞాపించాడు. కానీ తిమ్మరుసు ముందుగానే అనేక యుద్ధములందు శ్రీ కృష్ణదేవరాయల ప్రతాప సామర్ధ్యములు ఎరిగి ఉన్నందువల్ల ఆ పని చేయలేక విషయమంతా కృష్ణదేవ రాయలుకు చెప్పి అతనిని ప్రవాసం పంపించి, ఓ మేక కనుగుడ్లు తెచ్చి చూపించి రాజును అవసాన కాలంలో సంతృప్తి పరచాడని ఒక కథనం ఉంది. కానీ అన్నదమ్ముల మధ్య సౌభ్రాతృత్వం తప్ప వైరమున్నట్టు ఎలాంటి చారిత్రకాధారాలు లేవు. వీర నరసింహరాయలు 1509లో మరణించాడు. ఆ తరువాత కృష్ణదేవరాయల పట్టాభిషేకం ఎలాంటి గొడవలు లేకుండా సునాయాసంగా జరిగిపోయింది. వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
శ్రీ కృష్ణదేవ రాయలు
https://te.wikipedia.org/wiki/శ్రీ_కృష్ణదేవ_రాయలు
thumb|right|200px|హైదరాబాదు లోని టాంక్‌బండ్ పై శ్రీ కృష్ణదేవ రాయలు విగ్రహము thumb|right|200px శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం: 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా అతడు కీర్తించబడినాడు. thumb|చంద్రగిరి సంగ్రహశాలలో ఉన్న శ్రీకృష్ణదేవరాయలూ, వారి దేవేరులు చిన్నమదేవీ, తిరుమలదేవిల విగ్రహాలు|ఎడమ జీవిత విశేషాలు శ్రీకృష్ణదేవరాయలు సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, ఆయన రెండవ భార్య నాగలాంబకు రాయలు జన్మించాడు.Prof K.A.N. Sastri, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, pp 250,258 రాయలు తల్లి నాగలాంబ గండికోటను పాలించిన పెమ్మసాని నాయకుల ఇంటి ఆడపడచు. రాయలవారి వంశము: http://www.eenadu.net/opiniondisplay.asp?myqry=opini2%2Ehtm&opid=2&reccount=2 ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. రాయలును తెలుగూ, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుడుగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్, న్యూనిజ్‌‌ల రచనల వలన తెలియుచున్నది. రాయలుకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు. రాయలు ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలునూ, వీర నరసింహ రాయలునూ, వారి అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించాడు. కృష్ణదేవ రాయలు 1529 అక్టోబరు 17న మరణించినట్లు 2021 ఫిబ్రవరిలో కర్ణాటకలోని తుముకూరు వద్ద బయల్పడిన శాసనం ద్వారా తెలిసింది. సాహిత్య పోషణ కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, మదాలసాచరితము, సత్య వధూప్రీణనము, సకలకథాసారసంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి తదితర గ్రంథములు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.Hinduism: An Alphabetical Guide By Roshen Dalal తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి పొందారు. భక్తునిగా కృష్ణదేవ రాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు. కానీ పరమతసహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించాడు. అంతేకాక ధూర్జటి, నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు.Encyclopaedia of Indian Literature: devraj to jyoti, Volume 2 By Amaresh DattaThe Encyclopaedia Of Indian Literature (Volume Five (Sasay To Zorgot), Volume 5 By Mohan Lal అనేక దాన ధర్మాలు చేసాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఏడు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు. కుటుంబము కృష్ణదేవ రాయలుకు తిరుమల దేవి, చిన్నాదేవి ఇద్దరు భార్యలు. అయితే, ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ, కమల).Vijayanagara Voices: Exploring South Indian History and Hindu Literature By William Joseph Jackson కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు అయిన తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు.Krishnadeva Raya: the great poet-emperor of Vijayanagara - G. Surya Prakash Rao పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. ప్రతాపరుద్ర గజపతిని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవిని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు.Encyclopaedia of Indian Literature: K to Navalram - Amaresh Datta, Sahitya Akademi చాగంటి శేషయ్య, కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు.Courts of Pre-Colonial South India By Jennifer Howes కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయంReadings in South Indian history - T. V. Mahalingam ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్నతనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524లో మరణించాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసును అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలును వారసునిగా చేసాడు. మతము, కులము శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి.Prof K.A.N. Sastri, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, pp 250,258History: UGC-NET/SET/JRF (Paper II and III), 1/e - By Amitava Chatterjee శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22, 23, 24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో, శిలాశాసనాలలో లిఖించబడినది సర్దేశాయి తిరుమలరావు-ది హిందూ ఆంగ్ల దినపత్రికయాదవాభ్యుదయ వాఖ్య - అప్పయ్య దీక్షితనరసభూపాలీయము - భట్టు మూర్తిఅచ్యుతరాయాభ్యుదయము - రాజనాథ కవివరదాంబిక పరిణయం - తిరుమలాంబస్వరమేధకళానిధి - రామయామాత్య తొదరమల్లబాలభాగవతం - కోనేరునాథ కవివసుచరితము - భట్టు మూర్తివిజయనగర సామ్రాజ్య మూలములు - యస్. కృష్ణస్వామి అయ్యంగార్ - మద్రాసు విశ్వవిద్యాలయము, 1919. సమకాలీన సంస్కృతిలో శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం నేపథ్యంగా తెలుగులో అనేక సినిమాలు విడుదలైనవి. అందులో కొన్ని మల్లీశ్వరి, మహామంత్రి తిమ్మరుసు, తెనాలి రామకృష్ణ, ఆదిత్య 369 ఇవి కూడా చూడండి శ్రీ కృష్ణదేవ రాయల రాజ సేవకులు మూలాలు లెటర్ టు ద ఎడిటర్, డా.సర్దేశాయి తిరుమలరావు, ద హిందూ ఆంగ్ల దినపత్రిక హంపి నుండి హరప్పా దాకా -ఆచార్య తిరుమల రామచంద్ర,2013, జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత "శ్రీ కృష్ణదేవరాయలు"-గుత్తి చంద్రశేఖర్ రెడ్డి, బళ్ళారి తెలుగు సంఘము, తెలుగు మహాసభల సంచిక లంకెలు వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ చక్రవర్తులు వర్గం:హిందూ రాజులు
ఏప్రిల్ 25
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_25
ఏప్రిల్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 115వ రోజు (లీపు సంవత్సరములో 116వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 250 రోజులు మిగిలినవి. సంఘటనలు 2007: నకిలీ పాసుపోర్టుల కుంభకోణంలో పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెరాస అగ్రనేత ఆలె నరేంద్రను పార్టీ నుండి సస్పెండు చేసారు. 2011: 2011 ఏప్రిల్ 1 నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు భారతదేశంలో, వెండి ధర 75,770 రూపాయలకు చేరి, రికార్డు స్థాపించింది. (1 ఏప్రిల్ నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు ఉన్న 25 రోజులలో వెండి 31% ఎక్కువ పెరిగింది). ఈ నెలంతా, బంగారం, వెండ్ వ్యాపారులు వెండిని సరఫరా చేయలేక, ముందుగా కొంత డబ్బు కట్టించుకుని, వారం రోజుల తరువాత వెండిని ఇచ్చేవారు. జననాలు 1874: గూగ్లి ఎల్మో మార్కోని, రేడియో కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ. 1937) 1900: వోల్ఫ్‌గాంగ్ ఎర్నస్ట్ పౌలీ, ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ. 1958) 1943: దేవిక, తెలుగు,తమిళ, మళయాళ చిత్రాల నటీ(మ.2002) 1971: బోయపాటి శ్రీను , తెలుగు సినిమా దర్శకుడు 1987: మల్లికా కపూర్, దక్షిణ భారత చలన చిత్ర నటి మరణాలు 68: మార్క్ ద ఎవాంజెలిస్ట్, అలెగ్జాండ్రియా లోని మొదటి పోప్, అలెగ్జాండ్రియా చర్చి స్థాపకుడు. 1744: అండర్స్ సెల్సియస్ స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. ఉష్ణోగ్రతయొక్క ఒక కొలమానాన్ని ఇతని పేరు మీద సెల్సియస్ అని పిలుస్తారు. (జ.1701) 1984: ముదిగొండ విశ్వనాధం, గణితశాస్త్రజ్ఞడు, శివపూజా దురంధురుడు. (జ.1906) 1992: వసంతరావు వేంకటరావు, సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి. 2005: స్వామి రంగనాథానంద, భారత ఆధ్యాత్మిక గురువు. (జ.1908) 2005: టంగుటూరి సూర్యకుమారి, గాయని, నటీమణి (జ.1925) 2018: ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు (జ.1950) 2021: డా. తిరునగరి రామానుజయ్య, సాహితీవేత్త, పద్యకవి. (జ. 1945) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ మలేరియా దినోత్సవం. ప్రపంచ పశువైద్య దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 25 . ఏప్రిల్ 24 - ఏప్రిల్ 26 - మార్చి 25 - మే 25 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
శ్రీ కృష్ణదేవరాయలు
https://te.wikipedia.org/wiki/శ్రీ_కృష్ణదేవరాయలు
దారిమార్పుశ్రీ కృష్ణదేవ రాయలు
కెంపెగౌడ
https://te.wikipedia.org/wiki/కెంపెగౌడ
దారిమార్పు కెంపే గౌడ
అచ్యుత దేవ రాయలు
https://te.wikipedia.org/wiki/అచ్యుత_దేవ_రాయలు
thumb|అచ్యుతరాయలు తన భార్య వరదాంబికతో సహా తిరుమలలో అచ్యుత దేవ రాయలు (అచ్యుతరాయలు) విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. తుళువ నరస నాయకుని మూడవ భార్య అయిన ఓబాంబ కుమారుడు. అచ్యుతరాయలు, తుళువ నరసనాయకుని దక్షిణ దండయాత్ర అనంతరం రామేశ్వరం దర్శించివచ్చిన తర్వాత జన్మించాడని "అచ్యుతరాయాభ్యుదయము", "వరదాబింక పరిణయం"లో పేర్కొనబడినది. Jackson, పేజీ.181 శ్రీకృష్ణదేవరాయల సవతి సోదరుడు. శ్రీకృష్ణదేవరాయల మరణ శాసనాన్ని అనుసరించి చంద్రగిరి దుర్గములో గృహనిర్బంధములో ఉన్న అచ్యుతదేవరాయలు రాజయినాడు. ఇతడు 1529 నుండి 1542 వరకు పరిపాలించాడు. శ్రీకృష్ణదేవరాయల మరణంతో విజయనగరములో అంతఃకలహాలు చెలరేగాయి. అచ్యుతరాయల్ని వారసునిగా ప్రకటించడం నచ్చని కృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయలు ప్రతిఘటించి అధికారం కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ విశ్వాసపాత్రులైన సాళువ నరసింగనాయకుడు వంటి సామంతులు ఆ ప్రయత్నాలు సాగనివ్వలేదు. పట్టాభిషేకము thumb|చంద్రగిరి మ్యూజియంలో ఉన్న అచ్యుతదేవరాయ ఆయన దేవేరి వరాదరాజమ్మల విగ్రహాలు ఇతడు మూడుసార్లు పట్టాభిషేకము చేసుకున్నాడుJackson (2005), పేజీ.181.అచ్యుతరాయల పట్టాభిషేకాలను రాజనాథ డిండిమభట్టు వ్రాసిన అచ్యుతరాయాభ్యుదయములో వివరముగా వర్ణించాడు. మొదట తిరుమలలో గర్భగుడిలోపలనే దేవదేవుని శంకుతీర్థముతో పట్టాభిషేకము జరుపుకున్నాడు.అచ్యుతరాయాభ్యుదయము - రెండవ రాజనాధ డిండిమThe Sources of Vijayanagara history No.1 Madras University Historical Series పేజీ.161 ఈ విషయమై విమర్శలు వచ్చాయి. ఎందుకంటే గర్భగుడిలోనికి బ్రాహ్మణులకు తప్ప అన్యులకు ప్రవేశము లేదు. తరువాత 1529 అక్టోబర్ 21 న (శక స.1452 విరోధి నామసంవత్సర కార్తీక బహుళ పంచమి) శ్రీ కాళహస్తిలో రెండవ పర్యాయము పట్టాభిషేకం జరుపుకున్నాడని కాళహస్తిలోని శాసనము వల్ల తెలుస్తుంది.ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.3Annual Reports of Epigraphy, Madras. 157 of 1924 తరువాత 1529 నవంబర్ 20 న విజయనగరంలో ముచ్చటగా మూడవసారి పట్టాభిషేకం జరుపుకున్నాడు. యుద్ధాలు అచ్యుతరాయలు రాజ్యము చేపట్టేనాటికి వారసత్వ పోరు కారణంగా విజయనగర రాజధానిలోని కల్లోల పరిస్థితులను ఆసరాగా తీసుకొని సామ్రాజ్యంపై ప్రతాపరుద్ర గజపతి దండెత్తినాడు. అయితే రాయలు గజపతిని తిప్పికొట్టాడు. 1530లో గోల్కొండ సుల్తాను కులీ కుత్బుల్ ముల్క్ దండెత్తి కొండవీడును ముట్టడించగా వెలుగోటి గని తిమ్మనాయుడు అతన్ని ఓడించి సుల్తాను అశ్వదళానికి అపార నష్టం కలిగించి దండయాత్రను తిప్పికొట్టాడు. ఇతను అనేక యుద్ధములందు విజయం సాధించాడు. శత్రు దండయాత్రల ప్రమాదాన్ని గుర్తించిన అచ్యుతరాయలు, రామరాయలుతో సంధి చేసుకున్నాడు. కానీ సాళువ నరసింగనాయకునికి (సెల్లప్ప) అది నచ్చక ఉమ్మత్తూరు మొదలైన దుర్గాధిపతులతో కలిసి తిరుగుబాటు చేశాడు. అయితే అచ్యుతరాయల బావమరుదులైన సలకం పెద తిరుమలరాజు, సలకం చిన తిరుమరాజులు తిరుగుబాటును అణచివేసి శాంతిని నెలకొల్పారు. కులీ కుత్బుల్ ముల్క్ తో కోయిలకొండ దగ్గర జరిగిన యుద్ధములో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్‌షా మరణించగా, అతని కొడుకు మల్లూ ఆదిల్‌షా రాజ్యాన్ని చేపట్టాడు. ఇతని పాలన నచ్చని ప్రజలు అసద్ ఖాన్ లారీ అనే ఉద్యోగి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. ఇదే అదనుగా 1535లో అచ్యుతరాయలు దండెత్తి రాయచూరు అంతర్వేదిని ఆక్రమించుకున్నాడు. రామరాయల కుట్రలు రాజధానిలో రామరాయలు బలం నానాటికి పెరగసాగింది. రామరాయల తమ్ములు వెంకటాద్రి, తిరుమలలు అతడికి అండగా ఉన్నారు. కందనవోలు, అనంతపూరు, ఆలూరు, అవుకు దుర్గాధిపతులు రామరాజు పక్షము వహించారు. ఇంతలో బీజాపూరులో మల్లూ ఆదిల్‌షాను తొలగించి ఇబ్రహీం ఆదిల్‌షా గద్దెనెక్కి, మల్లూ సానుభూతిపరులైన ఉద్యోగులను, మూడు వేల సైన్యాన్ని తొలగించాడు. అలా తొలగించబడిన సైనికులను రామరాయలు తన సైన్యములో చేర్చుకొని రాజధానిలోని తురకవాడలో నిలిపి ఉంచాడు.ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.59 1536లో గుత్తి ప్రాంతములోని తిరుగుబాటును అణచి తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకొని రాజధానికి తిరిగివస్తున్న అచ్యుతరాయలను బంధించి, రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించి పట్టాభిషేక ప్రయత్నాలు జరిపాడు. కృష్ణదేవరాయల భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవి రామరాయలకు మద్దతు నిచ్చారు. కానీ ప్రజలు, సామంతులు రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించడాన్ని ఇష్టపడలేదు. పట్టాభిషేకానికి అన్నీ సన్నద్ధం చేసుకున్నా, రాయరాయల పట్టాభిషేకం జరగలేదు.ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.60 మధుర, కొచ్చిన్ ప్రాంత సామంతులు కప్పం చెల్లించడం నిలిపివేశారు. రామరాయలు వారిపై దండయాత్రకు బయలుదేరిన సమయములో రాజధానిలోని ఉద్యోగులు సలకం పెద తిరుమలరాజుతో చేరి, అచ్యుతరాయల్ని చెర నుండి విడిపించి సింహాసనముపై పునఃప్రతిష్ఠించారు. రామరాయలు రాజధానికి మరలేనాటికి ఇబ్రహీం ఆదిల్‌షా నాగలాపురాన్ని నేలమట్టం చేసి రాజధాన్ని సమీపించాడు. ఆదిల్‌షా ప్రతిపక్షంలో చేరతాడన్న భయముతో అచ్యుతరాయలు గానీ, రామరాయలు గానీ అతడిని ప్రతిఘటించలేదు. ఇద్దరూ ఆదిల్‌షా సహాయము అర్ధించి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. అంతలో బీజాపూరులో ఆదిల్‌షాపై అసద్ ఖాన్ లారీ మొదలైన ఉద్యోగులు కుట్రలు ప్రారంభించారు. పరిస్థితిని గమనించిన ఆదిల్ షా అచ్యుత, రామరాయల మధ్య సయోధ్య కుదిర్చి బీజాపూర్ తిరిగి వెళ్ళాడు. చివరి రోజులు రామరాయలతో ఒప్పందం అయిన తర్వాత అచ్యుతరాయలు రాజ్య వ్యవహారాలను బావమరిది సలకం పెద తిరుమలరాజు పరం చేసి సర్వదా అంతఃపురములోనే గడిపినట్లు, దానితో ప్రభుత్వం నీరసించినట్లు తెలుస్తున్నది.ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.75 తుదకు అచ్యుతరాయలు ప్రజాభిమానం కోల్పోయి 1542లో మరణించాడు. మరణానంతర రాజకీయ పరిస్థితులు అచ్యుతరాయల మరణంతో రామరాయలు, సలకం తిరుమలల మధ్య స్పర్ధలు తీవ్రమై రాజ్యాన్ని అంతర్యుద్ధంలో ముంచెత్తాయి. అచ్యుతరాయలు కొడుకైన వెంకటపతిని సింహాసనంపై ఎక్కించి, తాను సంరక్షకునిగా అధికారం హస్తగతం చేసుకుని సింహాసనం ఆక్రమించటానికి తిరుమల ప్రయత్నం చేశాడు. దీనికి వ్యతిరేకంగా రాయరాయలు గుత్తి దుర్గంలో సదాశివరాయల్ని రాజుగా ప్రకటించాడు. సదాశివరాయలు అచ్యుతరాయల అన్న రంగరాయల కుమారుడు. అందుచే అచ్యుతరాయల కంటే విజయనగర సింహాసనంపై సదాశివునకు బలమైన హక్కు ఉందని చాటడం రామరాయల ఉద్దేశం. తిరుమల, రామరాయల మధ్య సంవత్సరంపాటు జరిగిన అంతర్యుద్ధం అవకాశంగా తీసుకొని ఇబ్రహీం ఆదిల్‌షా రెండుసార్లు విజయనగరంపై దండెత్తాడు. మొదట్లో తిరుమలుని దురాశ నుండి తన కుమారుడు వెంకటపతిని రక్షించే ఉద్దేశముతో వరదాంబిక ఆదిల్‌షాను ఆహ్వానించింది. కానీ తిరుమలుడతనితో ఒప్పందం చేసుకొని వెనుకకు మరలించాడు. తిరిగి రామరాయల అభ్యర్ధనపై ఆదిల్‌షా విజయనగరంపై దండెత్తినాడు. ప్రజలు భయభ్రాంతులై సలకం తిరుమలుని విజయనగర సింహాసనం ఎక్కించారు. తిరుమల దేవ మహారాయలనే పేర పట్టాభిషిక్తుడై ఆదిల్‌షాను ఓడించి పారదోలటమే కాక రాజధానికి తిరిగి వచ్చి మేనల్లుడు వెంకటపతిని హత్యచేసి, తనకు ప్రతికూలురైన రాజోద్యోగులను హింసించాడు. అతని నిరంకుశపాలనకు ప్రజలు విసుగెత్తారు. పరిస్థితిని గమనించి, రామరాయలు గుత్తి నుండి దండెత్తి వచ్చి తుంగభద్రా తీరములో తిరుమలను ఓడించి, సదాశివరాయలను రాజధానిలో పట్టాభిషిక్తుని చేసాడు. వ్యక్తిత్వము న్యూనిజ్ రచనలు అచ్యుతరాయలను వ్యసనలోలునిగా, కౄరునిగా చిత్రీకరించినా, ఈయన ప్రశంసనీయుడని, సామ్రాజ్యపు గౌరవాన్ని, సంపదను నిలబెట్టేందుకు పోరాడాడని చెప్పటానికి ఆ తరువాత కాలములో శాసన, సాహిత్య ఆధారాలు లభించాయి.వి.వ్రిద్ధగిరీషన్, పేజీ.15 ఇతడు సమర్ధుడనే కృష్ణదేవరాయలు తన వారసునిగా ఎన్నుకున్నాడు. అచ్యుతరాయల యొక్క జీవితము, పాలనను రెండు సంస్కృత కావ్యాలు, రెండవ రాజనాథ డిండిమ రాసిన అచ్యుతాభ్యుదయం, అచ్యుతరాయల భార్య తిరుమలాంబ రచించిన వరదాంబికా పరిణయం వివరముగా వర్ణిస్తాయి.వరదాంబికా పరిణయ చంపూ - తిరుమలాంబ (ఆచార్య సూర్యకాంత శాస్త్రి సంపాదకత్వము) అచ్యుత రాయలు విజయనగర సామంతుడైన సలకరాజు కుమార్తె వరదాంబికను వివాహమాడినాడు. వరదాంబికా పరిణయములో అచ్యుతరాయలు పెళ్ళినాటికే చక్రవర్తిగా రాసిన శాసనాధారాలు అచ్యుతరాయలు పట్టాభిషిక్తుడయ్యేనాటికి వరదాంబికతో వివాహమై, కుమారుడు చిన వెంకటపతి కూడా జన్మించియున్నాడని తెలుస్తున్నది. అచ్యుతరాయలతో వియ్యమందిన తరువాత సలకరాజు కుమారులు సలకం తిరుమలుల రాజకీయ ప్రాభవం పెరిగినా పెళ్ళికి ముందునుండే సలకం చిన తిరుమలుడు విజయనగరంలో సేనానిగా పనిచేస్తున్నాడని తెలుస్తున్నది. కళాపోషణ thumb|left|హంపిలోని అచ్యుతరాయ ఆలయ ముఖద్వారము ఇతని పరిపాలనా కాలములో హంపిలోని తిరువేంగళనాధుని ఆలయము నిర్మించాడు. ఈ ఆలయం అక్కడ కొలువై ఉన్న దేవుని పేరుమీదుగా కంటే అచ్యుతరాయ ఆలయము అన్న పేరుతోనే ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కపిల తీర్ధముగా ప్రసిద్ధమైన తిరుపతి లోని ఆళ్వార్ తీర్ధాన్ని అచ్యుతరాయలు నిర్మింపజేశాడు. తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు. 1533లో స్వామివారి పుష్కరిణి మెట్లు బాగుచేయించి పాత పుష్కరిణి పక్కనే కొత్త పుష్కరిణిని కట్టించాడు. తిరుమలలో ఆలయానికి దక్షిణము వైపున అచ్యుతరాయలు, ఆయన భార్య వరదాంబికల రాతి విగ్రహాలు చూడవచ్చు. తమిళనాట దిండిగల్కు సమీపంలో వున్న తాడికొంబు ఆలయాన్ని తిరుమలరాయలు నిర్మింపజేసాడు. కృష్ణదేవరాయల లాగానే అచ్యుతరాయలు కూడా సాహిత్య పోషకుడు. ప్రతి సంవత్సరం ఒక గ్రంథం రాయించి తిరుపతి వెంకటేశ్వరునికి సమర్పించేవాడు.ఆరుద్ర, పేజీ.237-238 అచ్యుతరాయలు స్వయంగా తాళమహోదధి అనే గ్రంథం సంస్కృతంలో రాశాడు. ఈయన ఆస్థానములో కన్నడ కవి చాటు విఠలనాధుడు, ప్రముఖ సంగీతకారుడు పురందరదాసు, సంస్కృత విద్వాంసుడు రెండవ రాజనాథ డిండిమభట్టు ఉండేవారు. డిండిమభట్టు అచ్యుతరాయాభ్యుదయముతో పాటు సంస్కృతములో భాగవత చంపు వ్రాసి అచ్యుతరాయలకు అంకితమిచ్చాడు. ఈయన ఆస్థానములోని తెలుగు కవులలో రాధామాధవ కవి ముఖ్యుడు. ఈయన రచించిన తారకబ్రహ్మరాజీయమును అచ్యుతరాయల మంత్రి నంజ తిమ్మనకు అంకితం చేశాడు. కృష్ణరాయల సభ భువనవిజయములాగే, అచ్యుతరాయల సభను వెంకట విలాస మండపము అని పిలిచేవారు. అచ్యుత రాయల కాలములో స్త్రీలు కూడా చక్కని గ్రంథాలు రాశారు. తిరుమలాంబ వరదాంబిక పరిణయమనే కావ్యము రాసి అందులో అచ్యుత రాయల జీవిత విశేషాలు (చిన వెంకటాద్రిని యువరాజుగా అభిషిక్తుని చేసేవరకు) వివరించింది. ఈ కాలములో ఓడూరి తిరుమలాంబ అనే విదూషీమణి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అచ్యుతరాయలు విఠ్ఠలనాథుని ఆలయానికి బహుకరించిన స్వర్ణ మేరువును పొగుడుతూ ఈమె రాసిన శ్లోకాలు హంపిలోని విఠ్ఠలనాధుని దేవాలయములో ఉన్నాయి.ఆరుద్ర, పేజీ.14-15 ఈ ఓడూరి తిరుమలాంబ, వరదాంబికా పరిణయము రాసిన తిరుమలాంబ ఒకరేనని కొందరు భావిస్తున్నారు.వరదాంబికా పరిణయ చంపూ - తిరుమలాంబ (ఆచార్య సూర్యకాంత శాస్త్రి సంపాదకత్వము) ఈ కాలములోనే మోహనాంగి అనే మరో రచయిత్రి ఉంది. ఈమె మారిచీపరిణయం వ్రాసింది. ఈమె కృష్ణరాయల కుమార్తె అనీ, అళియ రామరాయల భార్య అనీ కూడా ప్రతీతి.ఆరుద్ర, పేజీ.14-15 అచ్యుత రాయలు స్వయంగా మంచి వీణా విద్వాంసుడు కూడా.Filliozat (1999), పేజీ.50-51 ఈయన ఉపయోగించిన ప్రత్యేక వీణ అచ్యుతభూపాళీ వీణగా పేరొందినది.రామయామాత్య (బయకార రామప్ప) రచించిన స్వరమేళకళానిధి మూలాలు వనరులు బయటి లింకులు అచ్యుత రాయలు జారీ చేసిన నాణేలు , ఇంకా కొన్ని అచ్యుతరాయ ఆలయము చిత్రాలు అచ్యుతరాయ ఆలయము గురించి మరింత సమాచారము వర్గం:1542 మరణాలు వర్గం:విజయ నగర రాజులు వర్గం:జనన సంవత్సరం తప్పిపోయినవి వర్గం:హిందూ రాజులు వర్గం:ఈ వారం వ్యాసాలు
సదాశివ రాయలు
https://te.wikipedia.org/wiki/సదాశివ_రాయలు
ఇతను కేవలం నామమాత్ర పరిపాలకుడు మాత్రమే, అధికారము మొత్తం పెదతిరుమలయ్యదేవమహారాయలు చేతిలో ఉండెడిది. కానీ తరువాత అళియ రామ రాయలు కూడా అధికారం కోసం పోటీ పడినాడు. ఈ కాలమున విజయనగరం అంతఃకలహములకు తీవ్రంగా లోనయ్యింది, పరిస్థితులు ఎంతవరకూ వచ్చినాయంటే, పెద తిరుమలయ్యదేవమహారాయలు రాజధానిలోనికి ఆదిల్షాను సైన్యసమేతంగా ఆహ్వానించాడు. అంతకు ముందే పెద తిరుమలయ్య దేవమహారాయలు తన మేనల్లుడూ, రాజ్యానికి వారసుడూ, అచ్యుత రాయలు కుమారుడు అయిన చిన వేంకటపతి రాయలును హత్యాగావించి తనే సింహాసనం అధిస్టించాడు! ఈ సుల్తాను రాజధానిలోనికి రావడంలో సిగ్గుపడి, భయపది, అవమానపడిన అళియ రామ రాయలు పెద తిరుమలయ్యను ఒప్పించి సుల్తానుకు ధనం అప్పగించి ఇంటికి పంపించాడు. తరువాత మాత్రం అళియ దేవ రాయలు తిరుగుబాటు కొనసాగించారు, అయితే పెద తిరుమలయ్య పాపానికి చింతించి, ఆత్మహత్య గావించుకున్నాడు. తరువాత అచ్యుత దేవ రాయలు సోదరుని కుమారుడగు సదా శివ రాయలు సింహాసనం అధిష్టించాడు, కానీ అధికారం మాత్రం అళియ రామ రాయలు చేతిలోనే ఉండేది. అనంతర కాలంలో సుల్తానుల కూటమితో విజయనగర సామ్రాజ్యం రాక్షస తంగడి యుద్ధంలో ఘోర పరాజయం పాలై అళియ రామరాయలు యుద్ధంలో మరణించారు. ఈ యుద్ధానంతరం సుల్తానుల సైన్యం మొత్తంగా రాజధానియైన విజయనగరం మూలమట్టంగా నాశనం చేసింది. దీనితో అళియ రామరాయల తమ్ముడైన తిరుమల దేవరాయలు సదాశివరాయలను, విజయనగర సామ్రాజ్య ఖజానాను తీసుకుని పెనుకొండకు పారిపోయారు. పెనుకొండలో కూడా ఇతనిని సింహాసనంపై ఉంచి తిరుమల దేవరాయలే పరిపాలించారు. చివరకు 1570లో సదాశివ రాయలను తిరుమల దేవరాయలు సంహరించి తాను అధికారం చేపట్టారని రాబర్ట్ న్యూయల్ భావించారు. కానీ సదాశివ రాయల శాసనాలు 1575 వరకూ కనిపిస్తూండడంతో ఇది వాస్తవం కాదని చరిత్రాకారులు అభిప్రాయపడుతున్నారు. మూలాలు వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
రామ రాయలు
https://te.wikipedia.org/wiki/రామ_రాయలు
దారిమార్పు రామ రాయ
తిరుమల దేవ రాయలు
https://te.wikipedia.org/wiki/తిరుమల_దేవ_రాయలు
తిరుమల దేవరాయలు, ఆరవీటి వంశ స్థాపకుడు, రామరాయల తమ్ముడు, శ్రీ కృష్ణదేవరాయల చిన్న అల్లుడు. తళ్లికోట యుద్ధములో రాయరాయలతో పాటు పోరాడాడు. ఆ యుద్ధములోనే ఒక కన్ను కోల్పోయాడు. ఈయన 1570 నుండి 1572 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పెనుగొండ రాజధానిగా పరిపాలించాడు. యుద్ధానికి పూర్వము కూడా ఈయన పెనుగొండను పాలించినట్లు ఫెరిస్తా రచనల వల్ల తెలుస్తున్నది. యుద్ధము నుండి ప్రాణాలతో బయటపడి నామమాత్ర పాలకుడైన సదాశివరాయలతో సహా 1550 ఏనుగులమీద విజయనగర ఖజానానంత ఎత్తుకొని పెనుగొండకు వచ్చాడు. సుల్తానులు నలుగురూ విజయనగరాన్ని వదిలిన తరువాత ఇతను రాజధాని చేరుకోని బాగుచేయ ప్రయత్నించాడు. కానీ తరువాత మూడు సంవత్సరాలకు ఆ శ్మశానంలో ఉండలేక రాజధానిని పెనుగొండకు మార్చాడు. అళియ రామరాయల కొడుకైన పెదతిరుమలుడు పినతండ్రి అధికారాన్ని నిరసించి అతన్ని అధికారము నుండి తొలగించి పెనుగొండను సాధించడానికి అలీ ఆదిల్‌షా సహాయం అర్ధించాడు. పెదతిరుమలుని కోరికపై ఆదిల్‌షా పెనుగొండ మీదికి ఖిజర్ ఖాన్ నాయకత్వంలో సైన్యాన్ని పంపాడు. పెనుగొండ దుర్గపాలకుడైన సవరం చెన్నప్ప ఈ దాడిని తిప్పికొట్టినాడు. తళ్లికోట యుద్ధం తర్వాత పంచపాదూషాలలో ఐకమత్యం లోపించి యధాప్రకారముగా కలహించుకోసాగినారు. స్వీయరాజ్యరక్షణకు వారి వ్యవహారాలలో కలజేసుకోవటము అవసరమని తిరుమలరాయలు భావించాడు. కుతుబ్‌షా, నైజాంషాలు కలసి ఆదిల్‌షాపై చేసిన యుధ్హములో తిరుమలరాయలు మిత్రకూటమితో చేరినాడు. అందుకు ఆగ్రహించి అలీ ఆదిల్‌షా 1568లో ఆదోని, పెనుగొండలపై దాడిచేసాడు. పెనుగొండపై దాడి విఫలమైనది కానీ ఆదోని పాలకుడైన కోనేటి కొండమరాజు ఓడిపోయి బీజాపూరు సామంతుడైనాడు. ఆదోని రాజ్యము శాశ్వతంగా బీజాపూరు రాజ్యములో చేరింది. తిరుమల రాయలు, 1570 లో సదాశివరాయలను హతమార్చి అధికారము చేజిక్కించుకొన్నాడని రాబర్ట్ సూయల్ అభిప్రాయపడ్డాడు. అయితే 1576 వరకు సదాశివరాయల యొక్క పేరు శాసనాలలో ప్రస్తావించడము వల్ల అప్ప్టిదాక ఆయన జీవించే ఉన్నాడని మరొక వర్గపు వాదన. తిరుమల రాయలు రాజ్యానికి వచ్చేసరికి వృద్ధాప్యము వల్ల ఎంతో కాలము పరిపాలించలేకపోయాడు. ఇతనికి ముగ్గురు కుమారులు, ఒక్కొక్కరినీ ఒక్కొక్క ప్రాంతానికి ప్రతినిధులుగా చేసెను. రామరాయలు, శ్రీరంగపట్టణం రాజధానిగా కన్నడ ప్రాంతాలను, శ్రీరంగ రాయలు పెనుగొండ రాజధానిగా తెలుగు ప్రాంతాలను, మూడవ కొడుకు వెంకటాద్రి చంద్రగిరి రాజధానిగా తమిళ ప్రాంతాలను పాలించారు. రాకుమారుల మధ్య పరస్పర సహకారం లోపించడముతో రాజ్యం బలహీనమై సుల్తానుల విస్తరణకు అవకాశం కల్పించింది. తిరుమలరాయలు శ్రీకృష్ణదేవరాయల రెండవ భార్య చిన్నమాదేవి కుమార్తె అయిన వెంగళాంబను వివాహము చేసుకొన్నాడు. ఈయనకు నలుగురు కుమారులు : రఘునాథ రాయలు, శ్రీరంగ రాయలు, రామరాయలు, వెంకటరాయలు. రఘునాథ రాయలు నిజాంషాను ఓడించి సుల్తాను సేనలను కృష్ణానది ఆవలికి పారద్రోలాడు. అయితే తిరుమలరాయలు రాజ్యానికి వచ్చేనాటికి ఈయన జీవించి ఉండకపోవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. కళాపోషణ తిరుమల రాయలు పాలకునిగానే కాక సాహితీకర్తగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈయన పైనే అన్నాతిగూడ హరుడవే అన్న చాటు పద్యాన్ని రామరాజభూషణుడు చెప్పాడని ప్రతీతి. రామరాజభూషణుడు రాసిన వసుచరిత్రను తిరుమలరాయలకు అంకితమిచ్చాడు. ఈయన సభలోఉన్న లక్ష్మీధరుడనే కవి సంగీతము పై భరతశాస్త్ర గ్రంథము రచించాడుKarnataka Darshana: Volume Presented to Shri R.R. Diwakar on His Sixtieth Birthday By R. S. Hukkerikar. పేజీ.229. తిరుమలలోని గర్భగుడి ప్రాంగణములో రంగమండపము పక్కన కల సాళువ నరసింహరాయలు కట్టించిన ఉంజల్ మండపం లేదా సాళువ మండపం శిథిలావస్థకు చేరటముతో తిరుమలరాయలు దానిని విస్తరించి పునరుద్ధరించాడు. అప్పటినుండి దానికి తిరుమలరాయ మండపము అని పేరు వచ్చింది. ఇక్కడ ఈయన విగ్రహము కూడా ఉంది. సాళువ నరసింహరాయలు 1468లో ప్రారంభించిన వసంత తిరునాలను తిరుమలరాయలు మరింత వైభవోపేతమైన పండుగగా తీర్చిదిద్దాడు*తిరుమల చరిత్ర . మూలాలు బయటి లింకులు తిరుమలరాయలు కాలము నాటి నాణేలు వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
శ్రీరంగ దేవ రాయలు
https://te.wikipedia.org/wiki/శ్రీరంగ_దేవ_రాయలు
శ్రీరంగ రాయలు అరవీటి వంశానికి చెందిన విజయనగర చక్రవర్తి. ఇతని పాలనా కాలం 1572 - 1586. ఇతడు తిరుమల దేవ రాయలు రెండవ కుమారుడు. ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. కొన్ని చోట్ల విజయం సాధించినా కొంత భూభాగం నష్టపోయాడు. ఇతను గోల్కొండ నవాబు అయిన ఇబ్రహీం కుతుబ్ షాతో మంచి స్నేహం చేసాడు. 1576లో అలీ ఆదిల్షా పెనుగొండపైకి దండయాత్రకు వచ్చి కొంత రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు, అంతే కాకుండా రాజును బంధీ చేసుకోని వెళ్ళినాడు. తరువాత సామంతులు కూడా స్వతంత్రులు అవ్వ ప్రయత్నించారు. 1577లో రాజు చెర నుండి బయటకి వచ్చి, మరలా సామంతులందరినుండి కప్పాలు వసూలు చేశాడు. సైన్యాన్ని వృద్ది పరచాడు. 1578లో బీజాపూరు సేనలు మరలా యుద్ధానికి పెనుగొండపైకి వచ్చినాయి. కానీ అపజయంతో తీరని నష్టంతో వెనుతిరిగినాయి. ఈ యుద్ధంలో పెనుగొండ సేనాని జగదేవరాయడు చక్కని వ్యూహంతో ఘోరమైన యుద్ధం చేశాడు. 1578లోనే ఇబ్రహీం కుతుబ్ షా ఆక్రమించిన అహోబిళం ప్రాంతాన్ని శఠగోపస్వామి అర్దింపుపై రాజు సోదరులు సైన్య సమేతంగా వెళ్ళి విముక్తం చేశాడు. 1579లో గోల్కొండ సుల్తానులతో యుద్ధమున చాలా వరకూ భూభాగాన్ని కోల్పోయినారు. శ్రీరంగదేవరాయలు 1586లో మరణించాడు. అతనికి వారసులు లేనందున చిన్నతమ్ముడు వేంకటపతి దేవ రాయలు రాజయ్యాడు. వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
డిసెంబర్ 24
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_24
డిసెంబర్ 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 358వ రోజు (లీపు సంవత్సరములో 359వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 7 రోజులు మిగిలినవి. సంఘటనలు 1865: శ్వేతజాతి ఆధిపత్యం తగ్గిపోవడాన్ని సహించలేని కొందరు దురహంకారులు కుక్లక్స్‌ క్లాన్‌ అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ సభ్యులు నల్లజాతివారిపై చేసిన అత్యాచారాలకు అంతేలేదు. 1914: మొదటి ప్రపంచయుద్ధంలో భాగంగా జర్మనీ-బ్రిటన్‌ల మధ్య పోరు జరుగుతోంది. డిసెంబర్‌ 24 రాత్రి జర్మన్‌ సైనికులు తమ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కొవ్వొత్తులతో అలంకరించి పాటలు పాడటం ప్రారంభించారు. ఇంగ్లిష్‌ సైనికులు కూడా వారితో గొంతు కలిపారు. ఇరుపక్షాల సైనికులూ సిగార్లూ మద్యంసీసాలు బహుమతులుగా ఇచ్చిపుచ్చుకున్నారు. క్రిస్‌మస్‌ ట్రూస్‌గా పేరొందిన ఇలాంటి సంఘటన ప్రపంచ చరిత్రలో మరెప్పుడూ జరగలేదు. 1968: నాసా అంతరిక్షనౌక అపోలో 8లో ప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు. 1986:పార్లమెంటు ఆమోదించిన 'వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. నాటి నుంచి ఈ రోజును జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. 1925: ప్రాట్ & విట్నీ మొట్టమొదటి విమాన ఇంజెను తయారుచేయటం పూర్తిచేసింది 1999: ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కామ్దహార్‌కు హైజాక్ చేయబడింది. 1989: మనదేశంలో మొట్టమొదటి ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ 'ఎస్సెల్‌ వరల్డ్‌' ముంబయిలో ప్రారంభమైంది. 1999: కాఠ్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు హైజాక్‌ చేశారు. thumb|విశ్వనాథన్ ఆనంద్ 2000: భారత్కు చెందిన చదరంగం ఆటగాడు, విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియనయ్యాడు. ఆ ఘనత సాధించిన తొలి ఆసియా ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌. 2002: ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించాడు. జననాలు 1907: బులుసు వెంకట రమణయ్య, తెలుగు కవి, రచయిత. (మ.1989) 1924: మహమ్మద్ రఫీ, హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు. (మ.1980) 1924: సి.కృష్ణవేణి, తెలుగు సినిమా నటీమణి, గాయని, నిర్మాత. 1956: అనిల్ కపూర్, భారతీయ నటుడు, నిర్మాత. మరణాలు thumb|ఎం.జి.రామచంద్రన్‌ 1924: గరికిపర్తి కోటయ్య దేవర, సంగీత విద్వాంసుడు, ఆంధ్రగాయక పితామహుడు అనే బిరుదును పొందినవాడు. (జ.1864) 1987: ఎం.జి.రామచంద్రన్‌, సినిమా నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (జ.1917) 1988: మోదుకూరి జాన్సన్, నటులు, నాటక కర్త. (జ.1936) 2005: భానుమతి, దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. (జ.1925) 2022: తునీషా శర్మ, భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటి. (జ.2002) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం జాతీయ వినియోగారుల హక్కుల దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 23 - డిసెంబర్ 25 - నవంబర్ 24 - జనవరి 24 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 25
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_25
డిసెంబర్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 359వ రోజు (లీపు సంవత్సరములో 360వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 6 రోజులు మిగిలినవి. సంఘటనలు 1927 : మహారాష్ట్రలోని రాయ్‌ఘర్ జిల్లాలోని మహాద్ ప్రాంతంలో అంబేద్కర్, అతని అనుచరులు 1927 డిసెంబరు 25న అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ మనుస్మృతి ప్రతిని తగలబెట్టారు. 2000: రూ.60వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన గ్రామీణ రహదారుల పథకం, అంత్యోదయ అన్న పథకాలను అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభించారు. 2007: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడి మూడవసారి ప్రమాణస్వీకారం. జననాలు 1861: మదన్ మోహన్ మాలవ్యా, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1946) 1876: భారత్ ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటు చేసిన నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా (మ.1948) 1901: తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు/[మ.1990] 1910: కల్లూరి తులశమ్మ, సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. (మ.2001) 1924: అటల్ బిహారీ వాజపేయి, పూర్వ భారత ప్రధానమంత్రి.(మ.2018) 1917: ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కవయిత్రి, పరిశోధకురాలు, గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత (మ.1996) 1927: రాం నారాయణ్, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళాకారుడు. 1933: పటేల్ అనంతయ్య, ఉర్దూ అకాడెమీ "తెలుగు - ఉర్దూ నిఘంటువు" ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆకాశవాణిలో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు. 1936: ఇస్మాయిల్ మర్చెంట్, భారతదేశంలో జన్మించిన సినీ నిర్మాత, సుదీర్ఘ కాలంలో మర్చెంట్ ఐవరీ ప్రొడక్షన్స్‌తో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా బాగా సుపరిచితుడు 1950: ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018) 1951: చంద్రకళ , తెలుగు చలన చిత్ర నటి , నిర్మాత.(మ.1999) 1956: ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (మ.2011) 1971: ఎ.కరుణాకర్ , చలన చిత్ర దర్శకుడు . 1974: నగ్మా, తెలుగు, తమిళ, చిత్రాల నటి, రాజకీయ నాయకురాలు. 1977: ప్రియా రాయ్, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నీలి చిత్రాల నటి. 1991: సుహాని కలిత , తెలుగు, హిందీ, మళయాళ , బెంగాలీ చిత్రాల నటి. మరణాలు thumb|చక్రవర్తి రాజగోపాలాచారి 1846: స్వాతి తిరునాళ్, కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (జ.1813) 1970: దాడి గోవిందరాజులు నాయుడు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (జ.1909) 1972: చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (జ.1878) 1972: కాకాని వెంకటరత్నం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి. 1996: హరిత కౌర్ డియోల్, భారత ఎయిర్ ఫోర్సుకు చెందిన మొట్టమొదటి మహిళా పైలట్. (జ.1972) 1997: జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (జ.1911) 1998: పెనుమర్తి విశ్వనాథశాస్త్రి, తెలుగు వచన కవితా ప్రవీణులు. 2009: అజిత్ నాథ్ రే, భారతదేశ సుప్రీంకోర్టు పద్నాల్గవ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1912) 2011: ఇలపావులూరి పాండురంగారావు, హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు. (జ.1930) 2015: మెట్ల సత్యనారాయణ రావు, రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (జ.1942) 2022: తమ్మారెడ్డి చలపతిరావు, సినిమా నటుడు (జ.1944) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ క్రిస్మస్ పండగ రోజు జాతీయ సుపరిపాలన దినోత్సవం . బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 24 - డిసెంబర్ 26 - నవంబర్ 25 - జనవరి 25 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 26
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_26
డిసెంబర్ 26, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 360వ రోజు (లీపు సంవత్సరములో 361వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 5 రోజులు మిగిలినవి. సంఘటనలు 1893: పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పునర్నిర్మాణానికి పాటుపడిన మావోజెడాంగ్‌ జన్మదినం. 1907: భారత జాతీయ కాంగ్రెస్‌ 23వ మహాసభలో పార్టీ సభ్యులు అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయారు. అతివాద వర్గానికి బాలగంగాధర తిలక్‌, మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వం వహించారు. 2004: హిందూ మహాసముద్రంలో వచ్చిన పెను భూకంపం కారణంగా సునామి వచ్చింది. వివిధ దేశాల్లో సునామి సృష్టించిన విధ్వంసంలో దాదాపు 2,75,000 మంది వరకు చనిపోయారు. 2009: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ పదవికి రాజీనామా సమర్పించాడు. 1982: టైమ్‌ మ్యాగజైన్‌ ఏటా ఇచ్చే 'మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌' పురస్కారాన్ని ఆ ఏడాది 'పర్సనల్‌ కంప్యూటర్‌'కు ఇచ్చింది. మనిషికి కాకుండా ఆ గౌరవాన్ని ఒక యంత్రానికి ప్రకటించడం అదే మొదటిసారి. 2004: హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా వచ్చిన సునామి పలుదేశాల్లో విధ్వంసం సృష్టించింది. దాదాపు 2,75,000 మంది చనిపోయారు. రిక్టర్‌ స్కేలుపై భూకరప తీవ్రత 9.3గా నవోదైంది. ఈ భూకంపంలో విడుదలైన శక్తి 0.8టీఎన్‌టీలకు సమానం. జననాలు thumb|ఉద్దమ్ సింగ్ 1893: మావో జెడాంగ్, చైనాలో కమ్యూనిష్ఠు నాయకుడు. 1899: ఉద్దమ్ సింగ్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. 1914: మరళీధర్ దేవదాస్ ఆమ్టే, సంఘసేవకుడు. (మ.2008) 1915: జూపూడి యజ్ఞనారాయణ, న్యాయవాది, రాజకీయవేత్త, కళాకారుడు. 1946: బి.నరసింగరావు , చలన చిత్ర దర్శకుడు. 1951: నరసింహరాజు, తెలుగు చలన చిత్ర నటుడు(ఆంధ్రా కమలహాసన్ గా పేరు). 1980: తనూరాయ్ , దక్షిణ భారత చలన చిత్రాలతోపాటు, బెంగాలీ చిత్రాల నటి, ప్రచారకర్త. మరణాలు 1986: అంట్యాకుల పైడిరాజు, చిత్రకారుడు, శిల్పి. (జ.1919) 1981: కొమ్మారెడ్డి సావిత్రి, తెలుగు సినీ ప్రపంచంలో మహానటి. (జ.1936) 1988: వంగవీటి మోహనరంగా 2010: ఏ.వి.సుబ్బారావు, తెలుగు రంగస్థల నటుడు, పద్య గాయకుడు. (జ.1930) 2021: మాణిక్య వినాయగం, ప్లేబ్యాక్ సింగర్, జానపద సంగీతం(జ 1943) పండుగలు , జాతీయ దినాలు జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 25 - డిసెంబర్ 27 - నవంబర్ 26 - జనవరి 26 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 27
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_27
డిసెంబర్ 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 361వ రోజు (లీపు సంవత్సరములో 362వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 4 రోజులు మిగిలినవి. సంఘటనలు 1911: జనగణమనను మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు. 2012; తిరుపతిలో నాలుగవ ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా ప్రారంభమైనవి నేటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అధ్యక్షతన జరిగినవి జననాలు 1571: జోహాన్స్ కెప్లర్, ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. (మ.1630) 1822: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (మ.1895) 1934: లారిసా లాటినినా, సోవియట్ జిమ్నాస్ట్. ఒలింపిక్ క్రీడలలో 18 పతకాలను సాధించింది. 1953: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్. మరణాలు thumb|Benazir Bhutto 1933: కాకర్ల శ్రీరాములు, మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి. 1998: ధూళిపూడి ఆంజనేయులు, సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత, సంపాదకులు. 2007: బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (జ.1953) 2009: నర్రా వేంకటేశ్వర రావు , సహాయ, ప్రతినాయక, హాస్య పాత్రల నటుడు (జ.1947) పండుగలు , జాతీయ దినాలు - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 26 - డిసెంబర్ 28 - నవంబర్ 27 - జనవరి 27 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 28
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_28
డిసెంబర్ 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 362వ రోజు (లీపు సంవత్సరములో 363వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 3 రోజులు మిగిలినవి. సంఘటనలు 1885: భారత జాతీయ కాంగ్రెసు స్థాపన జరిగింది. మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ. 1921: మొదటిసారి వందేమాతరం గీతాన్ని కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు. జననాలు thumb|రతన్ టాటా 1856: ఉడ్రోవిల్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. 1859: మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబరు 25 మరణం 1859 డిసెంబర్ 28). (ఇతడే భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు). 1875: బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, పండితుడు, కవి.(మ.1914) 1932: ఇండియా - ధీరుభాయ్ అంబానీ, పారిశ్రామికవేత్త. 1932: నేరెళ్ళ వేణుమాధవ్, మిమిక్రీ కళాకారుడు. వీరికి 'ధ్వన్యనుకరణ సామ్రాట్' అనే బిరుదం కూడా కలదు 1937: ఇండియా - రతన్ టాటా, పారిశ్రామికవేత్త. 1940: వంకాయల సత్యనారాయణ, సహాయ నటుడుగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించారు 1945: నేపాల్ - బీరేంద్ర, రాజు. 1952: ఇండియా - అరుణ్ జైట్లీ, రాజకీయవేత్త. 1955: చైనా - లియూ క్సియాబొ, నొబుల్ శాంతి బహుమతి గ్రహీత. మరణాలు 1859: మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబరు 25 మరణం 1859 డిసెంబర్ 28). (ఇతడే భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు). 2022: శ్రీభాష్యం విజయసారథి, సంస్కృత కవి, పండితుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1936) 2023: విజయకాంత్, తమిళ ,తెలుగు చిత్రాల నటుడు, రాజకీయ నాయకుడు.(జ.1952) పండుగలు , జాతీయ దినాలు బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 27 - డిసెంబర్ 29 - నవంబర్ 28 - జనవరి 28 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 29
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_29
డిసెంబర్ 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 363వ రోజు (లీపు సంవత్సరములో 364వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 2 రోజులు మిగిలినవి. సంఘటనలు 1530: బాబరు పెద్దకొడుకు హుమాయూన్‌ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. 1812: అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్‌ సేనలు బఫెలో, న్యూయార్క్‌ నగరాలను తగలబెట్టాయి. 1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్‌ఆలీ కమీషన్‌ ఏర్పాటయింది. ( 1953 డిసెంబర్ 22 అని ఆదివారం ఆంధ్రభూమి 2011 జూన్ 19 పుట 10) 1965: భారత్ తయారుచేసిన మొదటి యుద్ధటాంకు, వైజయంత ఆవడి కర్మాగారం నుండి బయటకు వచ్చింది. జననాలు thumb|రోనాల్డ్ కోస్ 1808: ఆండ్రూ జాన్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. 1901: పింగళి నాగేంద్రరావు, సినీ రచయిత.(మ.1971) 1910: రోనాల్డ్ కోస్, ఆర్థికవేత్త. 1930: టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. (మ.2012) 1942: రాజేష్ ఖన్నా హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. (మ.2012) 1960: డేవిడ్ బూన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1971: హీరా , దక్షిణ భారత చలన చిత్ర , హిందీ నటి. 1974: ట్వింకిల్ ఖన్నా , సినీ నటి, రచయత్రి , భారతీయ ఇంటీరియర్ డిజైనర్. 1979: కౌసల్య , దక్షిణాది సినీ నటి , మోడల్. మరణాలు 1994: కువెంపు, కన్నడ రచయిత, కవి మరణం (జ.1904) 2014: బైరిశెట్టి భాస్కరరావు, సినీ దర్శకుడు. (జ.1936) 2016: కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని. (జ.1937) 2022: పీలే, బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు. (జ.1940) పండుగలు , జాతీయ దినాలు -ఐర్లాండ్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం. మంగోలియా స్వాతంత్ర్య దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 28 - డిసెంబర్ 30 - నవంబర్ 29 - జనవరి 29 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 30
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_30
డిసెంబర్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 364వ రోజు (లీపు సంవత్సరములో 365వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 1 రోజు మిగిలినది. సంఘటనలు 1906: భారత్లో తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ లాంటి పార్టీ అవసరమని భావించిన ముస్లిం ప్రముఖులు ఢాకాలో సమావేశమై ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు. 1922: రష్యన్‌ సోవియట్‌ ఫెడరేషన్‌, ట్రాన్స్‌కకేషియన్‌, ఉక్రేనియన్‌, బెలారసియన్‌ సోవియట్‌ రిపబ్లిక్‌లు నాలుగూ కలిసి ద యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌గా ఏర్పడ్డాయి. 1968: ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ట్రిగ్వేలీ మరణించాడు. 1985: తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడానికి గల కారణాలలో ముఖ్యమైనది జీ.వో.610ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జారీచేసింది. 2003: శ్రీజయ ఆర్ట్స్ సంస్థను హైదరాబాద్ లో ఇదేరోజున సినీ, టీవీ, రంగస్థల నటి, దర్శకురాలు, డాక్టర్ శ్రీజ సాధినేని గారు స్థాపించారు. ఈ సంస్థలో కళలపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తూ నటులుగా తీర్చి దిద్దుతున్నారు. అలాగే శ్రీజయా ఆర్ట్స్ నాటక పరిషత్తు పేరిట అఖిల భారత స్థాయిలో నాటికల పోటీలను నిర్వహిస్తున్నారు. 2006: ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దామ్ హుసేన్ ను ఉరితీసారు. 2008: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రమాణస్వీకారం. 2009: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూసోరెన్ ప్రమాణస్వీకారం చేశాడు. జననాలు 1865: రుడ్యార్డ్ కిప్లింగ్, ఆంగ్ల రచయిత, కవి. (మ.1936) 1879: రమణ మహర్షి, బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు 1887: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో పేరొందిన జంట సోదర కవులు 1898: యలమంచిలి వెంకటప్పయ్య, స్వాతంత్ర్య సమర యోధుడు. కాకినాడలో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు, 1935: మాన్యువెల్ ఆరన్ భారతదేశపు చదరంగం ఆటగాడు. 1948: సురీందర్ అమర్‌నాథ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్‌మెన్. 1968: సబీర్ భాటియా హాట్ మెయిల్ ఈమెయిల్ సర్వీసు సహ-వ్యవస్థాపకుడు. 1984: లెబ్రాన్ జేమ్స్ అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు. మరణాలు thumb|Vikram Sarabhai 1955: వేమూరి గగ్గయ్య, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1895) 1971: విక్రం సారాభాయ్‌, శాస్త్రవేత్త. 1973: చిత్తూరు నాగయ్య, తెలుగు సినిమా నటుడు. 1992: వడ్డాది పాపయ్య, చిత్రకారుడు. 2006: పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. (జ.1918) 2009: విష్ణువర్ధన్, దక్షిణ భారత చలన చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో సహాయ పాత్రల నటుడు.(జ.1950) పండుగలు , జాతీయ దినాలు - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 29 - డిసెంబర్ 31 - నవంబర్ 30 - జనవరి 30 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 31
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_31
డిసెంబర్ 31, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 365వ రోజు (లీపు సంవత్సరములో 366వ రోజు ). ఇది సంవత్సరములో చివరి రోజు. సంఘటనలు 2010: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో పరిష్కారం కాని కేసులు 1,98,056. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని మూడు ప్రాంతాల లోని (రాయలసీమ, కోస్తా, తెలంగాణ) దిగువ స్థాయి కోర్టులలో, పరిష్కారం కాని కేసులు 9,63,190. జననాలు thumb|ఆంథోని హాప్కిన్స్ 1870: ఎంబా ఘోటో, 146 సంవత్సరాలు జీవించిన ఇండోనేషియా జాతీయుడు. (మ.2017) 1907: కొత్త సత్యనారాయణ చౌదరి, సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది, ఉభయ భాషా ప్రవీణుడు. (మ.1974) 1918: పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు, సాహితీవేత్త. 1928: కొంగర జగ్గయ్య, తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (మ.2004) 1930: కె. రామలక్ష్మి, ప్రముఖ రచయిత్రి. (మ. 2023) 1937: ఆంథోనీ హాప్కిన్స్, నటుడు. 1947: కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, కవి. (మ.2009) 1953: ఆర్.నారాయణమూర్తి, విప్లవ సినిమాల నిర్మాత, దర్శకుడు, నటుడు. 1964: విన్‌స్టన్ బెంజిమన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1965: లక్ష్మణ్ శివరామకృష్ణన్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1977: సుచేతా కడేత్కర్, సాహసయాత్రికురాలు. ఆసియాలో అతిపెద్దదైన గోబీ ఎడారిని విజయవంతంగా దాటింది. 1979: మలింగ బండార, శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు. మరణాలు 1900: బుడ్డా వెంగళరెడ్డి, 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (జ.1840) 1965: వి. పి. మెనన్, భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి. (జ.1893) 2004: గెరాల్డ్ డిబ్రూ, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. 2020: నర్సింగ్ యాదవ్, తెలుగు సినీ నటుడు. (జ. 1968) పండుగలు , జాతీయ దినాలు వరల్డ్ స్పిరిట్యువల్ డే. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 30 - జనవరి 1 - నవంబర్ 30 - జనవరి 31 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 4
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_4
డిసెంబర్ 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 338వ రోజు (లీపు సంవత్సరములో 339వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 27 రోజులు మిగిలినవి. సంఘటనలు 1829: సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు. 1936: అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది. జననాలు thumb|అజిత్ అగార్కర్ 1877: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (మ.1958) 1898: కె శ్రీనివాస కృష్ణన్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (మ.1961) 1910: ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009) 1919: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (మ.2012) 1922: ఘంటసాల వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. (మ.1974) 1929: గడ్డం రాంరెడ్డి, దూరవిద్య ప్రముఖులు, సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు" (మ. 1995) 1945: ఇంద్రగంటి జానకీబాల, నవలా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు, ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి. 1962: ఆర్.గణేష్, ఎనిమిది భాషలలో శతావధానం చేశాడు. 1977: అజిత్ అగార్కర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1981: రేణూ దేశాయ్, తెలుగు నటి, రూపదర్శి, కాస్ట్యూం డిజైనర్. 1982: ఆస్ట్రేలియాకు చెందిన ఒక వక్త, క్రైస్తవ మత ప్రచారకుడు నిక్ వుజిసిక్ మరణాలు 2021: కొణిజేటి రోశయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు (జ. 1933) పండుగలు , జాతీయ దినాలు భారతదేశ నౌకాదళ దినోత్సవం బయటి లింకులు BBC: On This Day This Day in History డిసెంబర్ 3 - డిసెంబర్ 5 - నవంబర్ 4 - జనవరి 4 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 3
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_3
డిసెంబర్ 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 337వ రోజు (లీపు సంవత్సరములో 338వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 28 రోజులు మిగిలినవి. సంఘటనలు ప్రపంచం 2007: ఆస్ట్రేలియా 26వ ప్రధానమంత్రిగా కెవిన్ రడ్ ప్రమాణస్వీకారం. భారత దేశము 1971: భారత్-పాకిస్తాన్ 3వ యుద్ధం ప్రారంభం. 1984: భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు. జననాలు thumb|Food Minister Rajendra Prasad during a radio broadcast in Dec 1947 cropped 1884: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (మ.1963) 1889: ఖుదీరాం బోస్, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ.1908) 1931: విజయ్‌కుమార్ మల్హోత్రా, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, రచయిత. మరణాలు 1939: ఓలేటి వేంకటరామశాస్త్రి, జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (జ.1883) 1968: బందా కనకలింగేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (జ.1907) 1979: ధ్యాన్ చంద్, భారత హాకీ క్రీడాకారుడు. (జ.1905) 1998: పసల అంజలక్ష్మి, గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి. (జ.1904) 2009: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (జ.1986) 2011: దేవానంద్, హిందీ చలనచిత్ర నటుడు. (జ.1923) 2022: కొచ్చు ప్రేమన్, మలయాళ సినిమా, టెలివిజన్ నటుడు. (జ.1955) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం బయటి లింకులు BBC: On This Day This Day in History డిసెంబర్ 2 - డిసెంబర్ 4 - నవంబర్ 3 - జనవరి 3 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 2
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_2
డిసెంబర్ 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 336వ రోజు (లీపు సంవత్సరములో 337వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 29 రోజులు మిగిలినవి. సంఘటనలు 1985: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటయింది. 1989: భారత ప్రధానమంత్రిగా వి.పి.సింగ్ నియమితుడైనాడు. 1991: సోవియట్ యూనియన్ నుండి ఉక్రెయిన్ స్వాతంత్ర్యం గుర్తించడానికి కెనడా, పోలాండ్ భూమిపై మొదటి దేశాలుగా మారాయి. 1993: స్పేస్ షటిల్ ప్రోగ్రామ్: ఎస్ టి ఎస్-61 - హబుల్ స్పేస్ టెలిస్కోప్ రిపేరు చేయడానికి నాసా ఒక స్పేస్ షటిల్ ఎండీవర్ మిషన్‌ను ప్రయోగించింది. 1999: గ్లెన్‌బ్రూక్ రైలు ప్రమాదం: సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ దగ్గర రెండు రైళ్లు కొట్టుకొని ఏడుగురు ప్రయాణీకులు మరణించారు. 2002: జనరల్ నిర్మల్ చంద్‌విజ్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. జననాలు thumb|బి.నాగిరెడ్డి 1912: బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (మ.2004). 1930: గారీ బెకర్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2014). 1937: మనోహర్ జోషి, మహారాష్ట్ర 15వ ముఖ్యమంత్రి. 1955: ఉన్ని మీనన్ , మలయాళ, తమిళ, నేపథ్య గాయకుడు 1960: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి (మ.1996). 1974: అపూర్వ, తెలుగు సినిమా నటి. 1981:పార్నంది భగవతీ లక్ష్మీ కృష్ణ ప్రసాద్, ఆధునిక కవి, నవలా రచయిత,వేమన కళా పీఠం సాహిత్య అవార్డు గ్రహీత. మరణాలు 1996: మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1919) 1997: లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి (జ.1907). పండుగలు , జాతీయ దినాలు - జాతీయ దినాలు ప్రపంచ కాలుష్య నియంత్రణ దినం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క జాతీయదినం లావోస్ యొక్క జాతీయదినం అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన రోజు క్యూబా సాయుధ దళాల రోజు ఆచారములు తూర్పు సంప్రదాయ సామూహిక ప్రార్థనలు క్రిస్టియన్ విందు రోజు పండుగలు ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం. బయటి లింకులు BBC: On This Day This Day in History డిసెంబర్ 1 - డిసెంబర్ 3 - నవంబర్ 2 - జనవరి 2 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 1
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_1
డిసెంబర్ 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 335వ రోజు (లీపు సంవత్సరములో 336వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 30 రోజులు మిగిలినవి. సంఘటనలు 1963: నాగాలాండ్ భారతదేశానికి 16 వ రాష్ట్రంగా అవతరించింది. 1965: భారతదేశంలో సరిహద్దు భద్రతా దళాన్ని ఏర్పాటు చేసారు. 1965: తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి ప్రారంభం. 2006: 15వ ఆసియా క్రీడలు దోహా లో ప్రారంభమయ్యాయి. జననాలు thumb|Emperor Rafi Uddar Jat 1699: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి (మ.1719). 1878: జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణ కార్యదర్శి. (మ.1945) 1908: నార్ల వేంకటేశ్వరరావు, ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జననం (మ.1985). 1918: జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (మ.1991) 1946: రేగులపాటి కిషన్ రావు, కవి, నవల రచయిత (మ. 2023) 1954: మేధా పాట్కర్, నర్మదా బచావో ఉద్యమంతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి. 1955: ఉదిత్ నారాయణ్ , నేపథ్య గాయకుడు. 1970: జె.కె.భారవి , రచయిత . 1944: డి.ఎస్.ఎన్. మూర్తి, రంగస్థల నటుడు, దర్శకుడు, అభినయ అధ్యాపకుడు. 1980: ముహమ్మద్ కైఫ్, భారత క్రికెట్ క్రీడాకారుడు. ర్యాలి ప్రసాద్ , వచన కవితా సహస్రావధాని, రచయిత మరణాలు 1995: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (జ.1947) 2002: అబు అబ్రహాం,ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత. (జ.1924) 2020: నోముల నర్సింహయ్య, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ. 1956) పండుగలు , జాతీయ దినాలు 2003: ప్రపంచ ఎయిడ్స్ దినం. నాగాలాండ్ దినోత్సవం. సరిహద్దు భద్రతా దళ ఏర్పాటు దినోత్సవం. మయన్మార్ జాతీయ దినం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 1 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబర్ 30 - డిసెంబర్ 2 - నవంబర్ 1 - జనవరి 1 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 2
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_2
సెప్టెంబర్ 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 245వ రోజు (లీపు సంవత్సరములో 246వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 120 రోజులు మిగిలినవి. సంఘటనలు 1947: తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో శాంతి ర్యాలీ తీస్తున్న వందలాది మందిపై నిజాం రజాకార్లు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, కొంత మందిని గ్రామాల్లో చేట్లకు కట్టివేసి చంపడం జరిగింది. ఈ సంఘటనలో 21మంది మృతిచెందగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు. 2012 : నిర్మల్లో తెలంగాణ రచయితల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి. జననాలు 1914: వాసిరెడ్డి భాస్కర రావు, నాటక రచన, బుర్రకథలు, సినీ పాటల రచయిత, సంభాషణల రచయిత (మ.1957) 1923: ముదివర్తి కొండమాచార్యులు, రచయిత, పండితుడు. 1928: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీవేత్త. (మ.2013) 1936: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (మ.1989) 1942: బాడిగ రామకృష్ణ, 14 వ లోక్‌సభ సభ్యుడు. 1943: మల్లావఝ్జల సదాశివ్ కవి, రచయిత, సాహితీవేత్త. (మ.2005) 1956: నందమూరి హరికృష్ణ, నటుడు, రాజకీయ నాయకుడు, నందమూరి తారక రామారావు కుమారుడు (మ. 2018). 1965: సురేఖ యాదవ్, భారతీయ మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్ 1968: జీవిత, నటి, రాజకీయ నాయకురాలు. 1968: అనుపమ , ప్లే బ్యాక్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ , నటి. 1971: పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా కథానాయకుడు. 1986: పార్నంది భగవతి కృష్ణ శర్మ, ఆధునిక కవి, జానపద కళాకారుడు, గాయకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత, పండితుడు. మరణాలు 1973: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు (జ.1892). 1992: బార్బరా మెక్‌క్లింటక్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ. 1902). 2009: వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు (జ.1949). 2022: మందాడి సత్యనారాయణ రెడ్డి, రాజకీయనాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే. (జ.1936) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ కొబ్బరి దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 2 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 1 - సెప్టెంబర్ 3 - ఆగష్టు 2 - అక్టోబర్ 2 -- అన్ని తేదీలు వర్గం:తేదీలు
సెప్టెంబర్ 3
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_3
సెప్టెంబర్ 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 246వ రోజు (లీపు సంవత్సరములో 247వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 119 రోజులు మిగిలినవి. సంఘటనలు 1831 : కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబర్ 3, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు. 2009: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య పదవీబాధ్యతలు చేపట్టాడు. జననాలు 1893: కాంచనపల్లి కనకమ్మ, సంస్కృతాంధ్ర రచయిత్రి. (మ.1988) 1905: కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, కవి, రచయిత. (మ.1986) 1905: కార్ల్ డేవిడ్ అండర్సన్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొన్న వ్యక్తి. (మ.1991) 1908: జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. (మ.1953) 1924: కావూరి పూర్ణచంద్రరావు, అష్టావధాని, గ్రంథరచయిత. 1935: శరద్ అనంతరావు జోషి, రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (మ.2015) 1940: ప్యారెలాల్ ,(సంగీత దర్శకుల ద్యయంలోఒకరు) సంగీత దర్శకుడు. 1952: శక్తికపూర్, భారతీయ భాషల నటుడు, హాస్యనటుడు. 1965: కార్లోస్ ఇర్విన్ ఎస్టవెజ్, అమెరికన్ నటుడు. 1971: కిరణ్ దేశాయ్, భారతదేశ రచయిత్రి. 1974: మల్లి మస్తాన్‌ బాబు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పర్వతారోహకుడు. (మ.2015) 1978: అర్జన్ బజ్వా, ఒక భారతీయ సినీ నటుడు.ఎక్కువగా బాలీవుడ్, తెలుగు సినిమాల్లో నటించాడు. మరణాలు 1962: వినాయకరావు కొరాట్కర్, మాజీ భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1895) 1969: హొ చి మిన్ వియత్నాం సామ్యవాద నాయకుడు, ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. (జ.1890) 1987: రమేష్ నాయుడు, తెలుగు సినీ సంగీత దర్శకుడు. (జ.1933) 2011: నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయరంగ ముఖ్యుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (జ.1927) 2011: ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, పారిశ్రామిక వేత్త. (జ.1921) పండుగలు , జాతీయ దినాలు - ఖతర్ స్వాతంత్ర్యదినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 3 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 2 - సెప్టెంబర్ 4 - ఆగష్టు 3 - అక్టోబర్ 3 -- అన్ని తేదీలు వర్గం:తేదీలు
సెప్టెంబర్ 4
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_4
సెప్టెంబర్ 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 247వ రోజు (లీపు సంవత్సరములో 248వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 118 రోజులు మిగిలినవి. సంఘటనలు 1781: 44మంది నివసించటంతో లాస్ ఏంజెల్స్ నగరం, "బహియా డి లాస్ ఫ్యూమ్" (పొగల లోయ - వేలీ ఆఫ్ స్మోక్స్) లో స్థాపించబడింది 1833: మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ - న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). దీనిని బట్టి ఈ రోజుని, "పేపర్ బాయ్స్ " అందరూ "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" జరుపుకోవచ్చును. 1866: మొదటి హవాయిన్ దినపత్రిక ప్రచురణ మొదలు పెట్టారు. 1870: తమ రాజును, పదవి నుంచి తొలగించినట్లు, 3వ ప్రెంచి రిపబ్లిక్ ప్రకటించింది. 1882: విద్యుత్ కాంతులు వెలిగిన మొట్టమొదటి జిల్లా న్యూయార్క్. (న్యూయార్క్ ‌లోని పెరల్ స్ట్రీట్ స్టేషను) 1885: న్యూయార్క్ సిటీలో, మొట్టమొదటి "కేఫ్టీరియ"ను ప్రారంభించారు. 1888: జార్జ్ ఈస్ట్‌మెన్ తన మొదటి "రోల్ ఫిల్మ్" కెమెరాకు పేటెంటు తీసుకుని, కోడక్ సంస్థను రిజిస్టర్ చేసాడు. 1933: మొదటిసారిగా విమానం గంటకి 300 మైళ్ళ (483 కి.మీ) వేగాన్ని దాటి ప్రయాణించింది పైలట్లు జె.ఆర్.వెండెల్, గ్లెన్‌వ్యూ Il. 1967: భారతదేశంలోని కొయ్‌నా డాం దగ్గర జరిగిన భూకంపం (6.5 రెక్టర్ స్కేలు) వలన 200 మంది చనిపోయారు 2009: కొణిజేటి రోశయ్య, ఆంధ్రప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. జననాలు 1825: దాదాభాయి నౌరోజీ, భారత జాతీయ నాయకుడు. (మ.1917) 1924: కె.వి.రఘునాథరెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి. త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.2002) 1935: కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు రచయిత. (మ.2004) 1942: కే.రాణీ , నేపథ్య గాయని (మ.2018) 1962: కిరణ్ మోరే, భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్ 1980: స్మితా, తెలుగు గాయని, నర్తకి 1987: రితు పాతక్, బాలీవుడ్ నేపథ్య గాయని. మరణాలు . .1983: ఛాయాదేవి, పాతతరం తెలుగు సినీ నటి (జ.1928) 1999: చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలీస్ ఉన్నతోద్యోగి. (జ.1966) 2007: భమిడిపాటి రాధాకృష్ణ, నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు, హస్య రచయిత. (జ.1929) 2007: వై.రుక్మిణి, తెలుగు, తమిళ, హిందీ నటి. పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం. (తెలంగాణ/ఆంధ్రప్రదేశ్) బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 4 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 3 - సెప్టెంబర్ 5 - ఆగష్టు 4 - అక్టోబర్ 4 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 5
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_5
సెప్టెంబర్ 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 248వ రోజు (లీపు సంవత్సరములో 249వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 117 రోజులు మిగిలినవి. సంఘటనలు 1973: నాల్గవ అలీన దేశాల సదస్సు అల్జీర్స్ లో ప్రారంభమైనది. జననాలు thumb|సర్వేపల్లి రాధాకృష్ణన్ 1803: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (మ.1890) 1884: కల్లోజు గోపాలకృష్ణమాచార్యులు, ఆంధ్ర విశ్వకర్మ వంశీయుడు. 1888: సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. (మ.1975) 1914: నికొనార్‌ పారా, చిలీ కవి. 'అకవిత్వం' అనే ప్రక్రియ సృష్టికర్త. 1922: రెంటాల గోపాలకృష్ణ, పత్రికా రచయిత, కవి. (జ.1922) 1926: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (మ. 2014) 1927: పల్లెంపాటి వెంకటేశ్వర్లు, పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు. (మ.2016) 1955: ఎం.కోదండరాం, తెలంగాణ ఉద్యమ నాయకుడు. 1966: గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి: సాహితీవేత్త, పరిశోధకుడు, పత్రిక సంపాదకుడు. (మ. 2023) మరణాలు 1986: గణపతి తనికైమొని భారతీయ పాలినాలజిస్ట్. (జ.1938) 1997: మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (జ.1910) 2010: హోమీ సేత్నా, భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (జ.1923) 2013: చల్లా కృష్ణనారాయణరెడ్డి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మాజీ శాసన సభ్యుడు. (జ.1925). 2017: గౌరీ లంకేష్‌, భారతీయ జర్నలిస్టు, ఉద్యమకారిణి, బెంగళూరు, కర్ణాటక. (జ. 1962). పండుగలు, జాతీయ దినాలు జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం ప్రపంచ యువజన దినోత్సవం అంతర్జాతీయ ఛారిటీ దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 5 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 4 - సెప్టెంబర్ 6 - ఆగష్టు 5 - అక్టోబర్ 5 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 6
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_6
సెప్టెంబర్ 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 249వ రోజు (లీపు సంవత్సరములో 250వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 116 రోజులు మిగిలినవి. సంఘటనలు 1968 : స్వాజీలాండ్ స్వతంత్ర దేశంగా అవతరించింది. 2018 : తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయబడింది. జననాలు 1766: జాన్‌ డాల్టన్ పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేసిన బ్రిటీష్ శాస్త్రవేత్త 1892: సర్ ఎడ్వర్డ్ విక్టర్ ఏపిల్టన్, నోబుల్ బహుమతి గ్రహీత జన్మించాడు. (మ. 1965) 1936: అద్దేపల్లి రామమోహన రావు, తెలుగు కవి, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు. (మ.2016) 1950: గండ్లూరి దత్తాత్రేయశర్మ, సుప్రసిద్ధ అవధాని. 1950: నమిలికొండ బాలకిషన్ రావు, ప్రముఖ కవి, న్యాయవాది, పత్రిక సంపాదకుడు. (మ. 2023) thumb|చెరుకూరి సుమన్ మరణాలు 1966: ఆవుల గోపాలకృష్ణమూర్తి, హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు. (జ.1917) 1996: తూమాటి దొణప్ప, ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి. (జ.1926) 1998 : జపనీస్ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్ అకీరా కురొసావా (జ.1910) 2005: పెరుగు శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (జ.1920) 2012: చెరుకూరి సుమన్, బుల్లితెర రచయిత, నటుడు, దర్శకుడు, చిత్రలేఖకుడు, సినీ నటుడు. (జ.1966) 2017 : కొమ్ము పాపయ్య, శాసన సభ్యుడు. పండుగలు , జాతీయ దినాలు - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 6 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 5 - సెప్టెంబర్ 7 - ఆగష్టు 6 - అక్టోబర్ 6 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు వర్గం:2005
సెప్టెంబర్ 7
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_7
సెప్టెంబర్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 250వ రోజు (లీపు సంవత్సరములో 251వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 115 రోజులు మిగిలినవి. సంఘటనలు 1953 - 2017: తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్‌రాజ్ వంగరి 'వికీవత్సరం' అనే కాన్సెప్ట్‌తో వరుసగా 365రోజులు - 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తం వికీపీడియాల్లో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు. 2016, సెప్టెంబరు 8వ తేది నుండి తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2017, సెప్టెంబరు 7న 'వికీవత్సరం' పూర్తిచేశాడు. జననాలు 1533: ఇంగ్లాండ్ యొక్క ఎలిజబెత్ I, ఇంగ్లాండు మహారాణి. (మ.1603) 1914: జరుక్ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో పేరడీలకు ఆద్యుడు. (మ.1968) 1925: భానుమతి, దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. (మ.2005) 1953: మమ్ముట్టి, మలయాళ సినీ నటుడు. 1983: గుత్తా జ్వాల, బాడ్మింటన్ క్రీడాకారిణి. 1985: రాధికా ఆప్టే , మరాఠీ , తెలుగు, హిందీ, నటి 1991: తనీష్, బాల నటుడిగా ప్రవేశించిన తెలుగు నటుడు మరణాలు 1976: భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (జ.1905) 1986: పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (జ.1918) 1990: ఉషశ్రీ, రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. (జ.1928) 1991: రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాట నాయకుడు. (జ.1908) 2004: కృష్ణాజిరావు సింధే, తెలుగు టాకీ చిత్రమైన భక్తప్రహ్లాద లో ప్రహ్లాదునిగా నటించిన బాలనటుడు. సురభి నాటక సమాజంలో రంగస్థల నటుడు. (జ.1923) పండుగలు , జాతీయ దినాలు బ్రెజిలియన్ స్వాతంత్ర దినోత్సవం - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 7 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 6 - సెప్టెంబర్ 8 - ఆగష్టు 7 - అక్టోబర్ 7 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 8
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_8
సెప్టెంబర్ 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 251వ రోజు (లీపు సంవత్సరములో 252వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 114 రోజులు మిగిలినవి. సంఘటనలు 1970: మూడవ అలీన దేశాల సదస్సు లుసాకా లో ప్రారంభమైనది. జననాలు thumb|Thangi Satyanarayana1 1862: వేంకట శ్వేతాచలపతి రంగారావు, బొబ్బిలి జమీందారీకి రాజు (మ1921). 1879: మొక్కపాటి సుబ్బారాయుడు, పరిపాలనా దక్షుడు, పండితుడు. (మ.1918) 1908: చెలికాని అన్నారావు, తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న కార్యనిర్వహణాధికారి. 1910: త్రిపురనేని గోపీచంద్, తెలుగు రచయిత, హేతువాది, నాస్తికుడు, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. (మ.1962) 1922: పామర్తి సుబ్బారావు , రంగస్థల నటుడు, దర్శకుడు, క్రీడాకారుడు (మ.2004) 1931: తంగి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకరు. (మ.1984) 1933: ఆశా భోస్లే, హిందీ సినిమా గాయని. 1933: కరుటూరి సూర్యారావు, గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామికవేత్త. (మ.2011) 1936: చక్రవర్తి, సంగీత దర్శకుడు. (మ.2002) 1951: మాధవపెద్ది సురేష్, తెలుగు సినీ సంగీత దర్శకుడు. 1964: సులక్షణ: బాల నటి గా ప్రవేశించిన దక్షిణ భారత చలన చిత్రాలలో నటించిన నటి. 1975: స్వర్ణలతా నాయుడు, తెలుగు కవయిత్రి. (మ.2016) 1986: పారుపల్లి కశ్యప్, భారతదేశ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 1982: ఎం.ఎం . శ్రీలేఖ,సంగీత దర్శకురాలు , ఎక్కువ సంగీత చిత్రాల దర్శకురాలిగా ఘనత. మరణాలు 1918: రాయచోటి గిరిరావు, సంఘ సేవకులు, విద్యావేత్త. (జ.1865) 1963: గరికపాటి రాజారావు, తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రయోక్త, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు. (జ.1915) 1981: మాస్టర్ వేణు, తెలుగు సినిమా సంగీత దర్శకులు. (జ.1916) 1996: మైలవరపు గోపి, తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (జ.1949) 2012: కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. (జ.1949) 2020: జయప్రకాశ్ రెడ్డి, రంగస్థల సినీ నటుడు, దర్శకుడు. (జ.1946) 2022: ఎలిజబెత్ II, యునైటెడ్ కింగ్‌డమ్ & 14 కామన్వెల్త్ రాజ్యాల రాణి. (జ.1926) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవం (ఫిజియోథెరపీ) బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 8 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 7 - సెప్టెంబర్ 9 - ఆగష్టు 8 - అక్టోబర్ 8 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 9
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_9
సెప్టెంబర్ 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 252వ రోజు (లీపు సంవత్సరములో 253వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 113 రోజులు మిగిలినవి. సంఘటనలు 1908 - ఆంధ్రపత్రిక ప్రారంభించబడింది. తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం బాధ్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1914 ఏప్రిల్ 1 నాడు దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై) జననాలు thumb|కుడి|వేదాంతం సత్యనారాయణశర్మ 1892: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, పండితులు, రచయిత. (మ.1981) 1898: కొచ్చెర్లకోట రంగధామరావు, స్పెక్ట్రోస్కోపీ రంగంలో పేరొందిన భౌతిక శాస్త్రవేత్త. (మ.1972) 1914: కాళోజీ నారాయణరావు, తెలుగు కవి, తెలంగాణావాది. (మ.2002) 1935: వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (మ.2012) 1940: రాపాక ఏకాంబరాచార్యులు, తెలుగు రచయిత, అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త (మ.2020) 1953: సి.హెచ్. మల్లారెడ్డి, 16వ లోక్‌సభలో మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు. 1953: మంజుల భారతీయ సినీ నటీమణి. (మ.2013) 1957: జయచిత్ర , తెలుగు ,తమిళ చిత్రాల నటి 1961: సీమా ప్రకాశ్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త. టిష్యూకల్చర్‌లో నిపుణురాలు. 1963: లక్ష్మీ. టి, రంగస్థల నటి. 1970: బిజూ మీనన్, మళయాళ, తెలుగు,తమిళ చిత్రాల సహాయ నటుడు , జాతీయ అవార్డ్ గ్రహీత. 1987: తథాగత్ అవతార్ తులసి, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన బాలమేధావి. మరణాలు 1952: వేపా కృష్ణమూర్తి, తెలుగువాడైన ఇంజనీరు. (జ.1910) 1978: జాక్ ఎల్. (లియోనార్డ్) వార్నర్ (ఐషెల్ బామ్), చిత్రాల రారాజు. హాలీవుడ్లో వార్నర్ బ్రదర్స్ ఒకటి. (జ. 2 ఆగష్టు 1892) 1978: బైరాగి , ప్రముఖకవి , కథ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత(జ.1925) 2003: గులాబ్‌రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1927) పండుగలు , జాతీయ దినాలు తెలంగాణ భాషా దినోత్సవం. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే . బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 9 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 8 - సెప్టెంబర్ 10 - ఆగష్టు 9 - అక్టోబర్ 9 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 10
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_10
సెప్టెంబర్ 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 253వ రోజు (లీపు సంవత్సరములో 254వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 112 రోజులు మిగిలినవి. సంఘటనలు 1509: కాన్స్టాంటినోపుల్లో భూకంపం. 1939: రెండవ ప్రపంచ యుద్ధంలో కెనడా ఆలీస్ జట్టులో చేరి జెర్మనీపై యుద్ధం ప్రకటించడం. 2002: ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్యత్వం తీసుకున్న స్విజర్లాండ్ జననాలు thumb|Kavisamrat Viswanadha Satyanarayana 1860 : ద్వారబంధాల చంద్రయ్య "గోదావరి జిల్లాల మొదటి తరం స్వాతంత్ర్య సమర యోధుడు (మ. 1891) 1895: విశ్వనాథ సత్యనారాయణ "కవి సమ్రాట్", తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.1976) 1905: ఓగిరాల రామచంద్రరావు, పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. (మ.1957) 1912: బి.డి.జెట్టి, భారత మాజీ ఉప రాష్ట్రపతి (మ.2002). 1920: కల్యంపూడి రాధాకృష్ణ రావు, గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు, అమెరికన్ భారతీయుడు. 1921: వడ్డాది పాపయ్య, చిత్రకారుడు. (మ.1992) 1922: యలవర్తి నాయుడమ్మ, చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (మ.1985) 1931: ఎం. నారాయణరెడ్డి, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (మ.2020) 1935: జి. వి. సుబ్రహ్మణ్యం, సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. (మ.2006) 1935: పి.ఎల్. నారాయణ, విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త. (మ.1998) 1972: అనురాగ్ కశ్యప్, భారతీయ చిత్ర దర్శకుడు, చిత్ర రచయిత. 1984: చిన్మయి, భారతీయ భాషాశాస్త్రవేత్త, సంగీత విద్వాంసురాలు, సినీ గాయని, డబ్బింగ్ కళాకారిణి. 1992: కేథరిన్ ద్రేసా , మళయాళ, కన్నడ, తెలుగు చిత్రాల నటి. మరణాలు 1944: సర్దార్ దండు నారాయణ రాజు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1889) 1985: చాకలి ఐలమ్మ, తెలంగాణా వీరవనిత. (జ.1919), (పాలకుర్తి గ్రామం,జనగామ జిల్లా వాస్తవ్యులు.) 2001: పొట్లపల్లి రామారావు, కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు (జ. 1917). 2022: బి. బి. లాల్, పురాతత్వ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1921) పండుగలు, జాతీయ దినాలు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం హర్యానా, పంజాబ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 10 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 9 - సెప్టెంబర్ 11 - ఆగష్టు 10 - అక్టోబర్ 10 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 11
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_11
సెప్టెంబర్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 254వ రోజు (లీపు సంవత్సరములో 255వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 111 రోజులు మిగిలినవి. సంఘటనలు 1906 : మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం ప్రారంభించాడు. 2001: ఆల్కాయిదా ఉగ్రవాదులు అమెరికా లోని నాలుగు ప్రధాన పట్టణాలలో విమానాలను ఉపయోగించి ఉగ్రవాదాన్ని ప్రదర్శించారు జననాలు 1911: లాలా అమర్‌నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ (మ.2000). 1895: వినోబా భావే, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (మ.1982) 1915: పుపుల్ జయకర్, భారతదేశ కళాకారిణి, రచయిత్రి. (మ.1997) 1955: బయ్యారపు ప్రసాదరావు, కాంతి తరంగ సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పిగా బాధ్యతలు స్వీకరించారు. 1986: శ్రియా సరన్, సినీ నటి. 1986: అంజలి , తమిళ, తెలుగు, సినీ నటి. 1995: సంయుక్త మీనన్ , దక్షిణ భారత చలన చిత్ర నటి మరణాలు right|thumb|మహాదేవి వర్మ 1921: సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు. (జ.1882) 1947: దువ్వూరి రామిరెడ్డి, దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది. (జ.1895) 1948: ముహమ్మద్ అలీ జిన్నా, 20 వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడు. (జ.1876) 1983: ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (జ.1909) 1987: మహాదేవి వర్మ, ఆధునిక హిందీ కవయిత్రి. (జ.1907) 2014: గోవిందరాజు సీతాదేవి, కథ, నవలా రచయిత్రి. 2022: ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు, తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు. (జ.1940) పండుగలు , జాతీయ దినాలు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 11 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రోజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 10 - సెప్టెంబర్ 12 - ఆగష్టు 11 - అక్టోబరు 11 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
పుల్లరి
https://te.wikipedia.org/wiki/పుల్లరి
పుల్లరి అనగా పచ్చికమైదానములపై విధించే పన్ను, దీనిని పశువులు మేపడానికి వచ్చేవారిపై విధించేవారు. చరిత్రలో ఈ పన్ను కొంత ప్రాముఖ్యమును కలిగి ఉన్నది, విజయనగర రాజ్యంలో ఈ పన్ను విధించేవారు, అలాగే కాటమరాజు కథలో గొడవలు, యుద్ధాలుకు కారణం కూడా ఈ పన్నే! పుల్లరి సత్యాగ్రహం thumb|237x237px|పుల్లరికి వ్యతిరేకంగా పోరాడిన కన్నెగంటి హనుమంతు ఎవరైనా జనులు తమ వద్ద ఎలాంటి పశువున్నా... దానికి శిస్తు కట్టాల్సిందే. ఆ శిస్తుకే పుల్లరి అని పేరు పెట్టారు. ఈ విధానాన్ని తొలిసారిగా ఎదిరించిన వ్యక్తి ఓ తెలుగువాడు కావడం విశేషం. ఆయనే కన్నెగంటి హనుమంతు. ఇదే పుల్లరి కారణంగా బ్రిటిషు వారి కాలంలో పలనాట ఒక సత్యాగ్రహోద్యమం జరిగింది. పుల్లరి కట్టేందుకు నిరాకరించి, పలనాటి ప్రజలు కన్నెగంటి హనుమంతు నాయకత్వాన బ్రిటిషు ప్రభుత్వాన్ని ఎదిరించారు. అదే పుల్లరి సత్యాగ్రహంగా ప్రసిద్ధి చెందింది. కన్నెగంటి హనుమంతు బ్రిటీషు వారి నిరంకుశ పాలన వల్ల సామాన్యులు అనుభవిస్తున్న బాధలను చూసి రగిలిపోయి పోరుబాట పట్టాడు. వారి సుంకం చెల్లించేది లేదని.. తెగేసి చెప్పాడు. పలనాటి సీమలో తెల్లవారి ఆగడాలకు ఎదురు నిలిచాడు. ప్రజలందరితో కలసి పుల్లరి సత్యాగ్రహం చేశాడు. బ్రిటిషువారు రూదర్ ఫర్డు నాయకత్వంలో ఆ సత్యాగ్రహాన్ని క్రూరంగా అణచివేసారు. సామాన్యులను తీసుకెళ్లి జైళ్లలో పెట్టారు. పుల్లరి కడితేనే అరెస్టు చేసిన వారిని విడిచిపెడతామని బ్రిటీష్ ప్రభుత్వం తెలిపింది. అలాంటి సందర్భంలో సుంకం చెల్లించలేని వారందరి తరఫున తాను చెల్లిస్తానని ముందుకొచ్చాడు కన్నెగంటి హనుమంతు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న హనుమంతుపై దాడి చేసి అతనిని చంపారు. చివరికి కన్నెగంటి హనుమంతు మరణంతో ఆ సత్యాగ్రహం ముగిసింది. మూలాలు వర్గం:పన్నులు
వినాయక చవితి
https://te.wikipedia.org/wiki/వినాయక_చవితి
వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. చరిత్ర 1892 లో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య తిలక్, బ్రిటీష్ వారిపై భారత స్వాతంత్ర్యోద్యమం మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు. దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు మొదటిసారిగా ప్రారంభించి సాధించాడు. భారతీయుల పూజా మందిరాల్లో జరిగే గణేశ పూజకు సామూహికమైన, సామాజికమైన, సార్వజనీనమైన ప్రాధాన్యత అందించడంలో అతను చేసిన కృషి అనన్య సామాన్యం. పూజా విశేషాలు వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. మాచీ పత్రం/మాచిపత్రి - బృహతీ పత్రం/ములక బిల్వ పత్రం/మారేడు దూర్వా పత్రం/గరిక దత్తూర పత్రం/ఉమ్మెత్త బదరీ పత్రం/రేగు అపామార్గ పత్రం/ఉత్తరేణి తులసీ పత్రం/తులసి చూత పత్రం/మామిడి కరవీర పత్రం/గన్నేరు విష్ణుక్రాంత పత్రం/శంఖపుష్పం దాడిమీ పత్రం/దానిమ్మ దేవదారు పత్రం/దేవదారు మరువక పత్రం/ధవనం, మరువం సింధువార పత్రం/వావిలి జాజి పత్రం/జాజిమల్లి గండకీ పత్రం/లతాదూర్వా (కామంచి ఆకులు) శమీ పత్రం/జమ్మి అశ్వత్థ పత్రం/ రావి అర్జున పత్రం/ తెల్ల మద్ది అర్క పత్రం/జిల్లేడు. విఘ్నేశ్వరుని కథ సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు. పూర్వం గజ రూపం కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి?' అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు. కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్థించి, 'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడవలసింది' అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు. శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అనగా, విష్ణుమూర్తి 'ఇది మహమైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు, సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి, నా చర్మం నీ వస్త్రంగా ధరించమని' వేడుకొన్నాడు. అభయమిచ్చిన తరువాత, విష్ణుమూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి 'ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది' అని చెప్పి అంతర్థానమయ్యాడు వినాయక జననం కైలాసంలో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదంగావించి లోపలికి వెళ్లాడు.అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని, పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల 'గజాననుడు'గా పేరు పొందాడు. అతని వాహనం అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి పుట్టాడు. అతని వాహనం నెమలి. అతను మహా బలశాలి. విఘ్నేశాధిపత్యం ఒక రోజు దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి 'మాకు ఏ పనిచేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని' కోరారు. ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు, 'మీలో ఎవరైతే ముల్లోకాలలోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందు వస్తారో, వాళ్లే ఈ పదవికి అర్హులు' అన్నాడు. దానికి అంగీకరించిన కుమార స్వామి వెంటనే తన నెమలి వాహనమెక్కి వెళ్లి పోయాడు. గజాననుడు మాత్రం చిన్న బోయిన ముఖంతో 'తండ్రీ! నా బలాబలాలు తెలిసీ మీరిలాంటి షరతు విధించటం సబబేనా? నేను మీ పాద సేవకుడిని కదా! నా మీద దయ తలచి ఏదైనా తరుణోపాయం చెప్పమని కోరాడు. అంతట శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు. "సకృన్‌ నారాయణే త్యుక్త్వా పుమాన్‌ కల్పశత త్రయం! గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక!'కుమారా! ఇది నారాయణ మంత్రం! ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్య నదులలో స్నానం చేసినట్టవుతుంది. షరతు విధించిందీ తండ్రే, తరుణోపాయం చూపిందీ తండ్రే కాబట్టి, ఇంక తాను గెలవగలనో లేదో, కుమార స్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను? అని సందేహించకుండా, ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచూ, మూడు మార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండి పోయాడు.అక్కడ కుమార స్వామికి, మూడు కోట్ల యాభై నదులలో, ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు. అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అన్నగారు, తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండీ' అన్నాడు. ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు, విఘ్నేశ్వరుడైనాడు. ఆ రోజు అన్ని దేశాల లోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకం, వడ పప్పు సమర్పిస్తారు. విఘ్నేశ్వరుడు, తృప్తి పడి తిన్నంత తిని, తన వాహనానికి పెట్టి, తీసుకెళ్ల గలిగినంత తీసుకుని భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరుకున్నాడు. ఎప్పటిలాగా తల్లి దండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు. చేతులసలు నేల కానితేనా? పొట్ట వంగితేనా? అలా విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే, శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పక పకా నవ్వాడు. చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములన్నీదొర్లు కుంటూ బయటకు వస్తాయి.పార్వతీ దేవి దుఃఖించుచూ, చంద్రుని ఇలా శపించింది. 'ఓరి పాపాత్ముడా! నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్లు, పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు.' ఋషి పత్నులు నీలాప నిందలు పొందుట ఆ సమయంలోనే సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదిక్షణాలు చేస్తున్నారు. అగ్ని దేవుడు ఆ ఋషి పత్నులను చూసి మోహించాడు. కాని ఋషుల శాపాలకు భయ పడ్డాడు. అతని కోరిక గ్రహించిన అగ్ని దేవుని భార్య, ఒక్క అరుంధతీ రూపం తప్ప మిగతా అందరి రూపం ధరించి అతనికి ప్రియం చేసింది. ఋషులది చూసి తమ భార్యలేనని తలచి వాళ్లను వదిలి వేసారు. దీనికి కారణం, వారు చంద్రుని చూడటమే! దేవతలు, మునులు వెళ్లి శ్రీ మహా విష్ణువుకు విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, అసలు విషయం తెలుసుకుని ఋషులకు వివరించి, వాళ్ల కోపం పోగొట్టాడు. కైలాసానికి వచ్చి విఘ్నేశ్వరుని పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు. అప్పుడు దేవతలు మొదలగు వారంతా 'ఓ పార్వతీ! నీవిచ్చిన శాపం వల్ల లోకానికే ముప్పు. నీ శాపాన్ని ఉపసంహరించు' అన్నారు. పార్వతి కూడా తన కుమారుని ముద్దాడి, 'ఏ రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడ రాదు' అని శాపోపశమనాన్ని కలుగ చేసింది. ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి. ఆ రోజు చంద్రుని చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఇలా కొన్నాళ్లు జరిగింది. శ్యమంతకోపాఖ్యానం ద్వాపర యుగంలో ద్వారకలోనున్న కృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ఆ కబురూ, ఈ కబురూ చెప్పి, చంద్రుని మీద శాపం విషయం కూడా చెప్పాడు. "ఆ శాపం పొందిన వినాయక చవితి ఈ రోజే కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి" అనేసి స్వర్గానికి వెళ్లిపోయాడు. కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుడ్ని చూడవద్దని చాటింపు వేసాడు. అతనికి పాలంటే ప్రీతి కదా! తనే స్వయంగా పాలుపితుకుదామని, అకాశం కేసి చూడకుండా ఆవు దగ్గర కెళ్ళి పాలు పితుకుతూంటే పాలలో చంద్రబింబం కనిపించింది. 'హతవిధీ! నేనేమీ నీలాప నిందలు పడాలో కదా!' అనుకున్నాడు.కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరకి వచ్చాడు. అతని దగ్గర శ్యమంతక మణి ఉంది. అది సూర్యవరం వల్ల పొందాడు. శ్రీ కృష్ణుడది చూసి ముచ్చటపడి తనకిమ్మని అడిగాడు. 'అది రోజుకు ఎనిమిది బారువులు బంగారాన్నిస్తుంది. అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు ' అన్నాడు సత్రాజిత్తు. దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు.ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్లాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసమనుకుని అతనిని చంపి మణిని తీసుకుని పోతూండగా జాంబవంతుడనే ఒక భల్లూకం సింహమును చంపి మణిని తన గుహకు తీసుకుని పోయి తన కూతురికి ఆట వస్తువుగా యిచ్చాడు. ఇదంతా తెలియని సత్రాజిత్తు 'ఇంకేముంది మణి నివ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముడ్ని చంపి మణి తీసుకున్నాడని ' చాటింపు వేసాడు. శ్రీ కృష్ణుడు 'తను భయపడినట్టుగా నీలాపనిందలు రానేవచ్చాయి. దానినెలాగైనా రూపుమాపాలి ' అని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. అక్కడ ప్రసేనుడి శవం, సింహం అడుగుజాడలు, గుహవైపుకి భల్లూకం అడుగు జాడలు కనిపించాయి.ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్ళి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని వస్తూంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసింది.అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదకి యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్య యిరువయ్యెనిమిది రోజులు రాత్రింబగళ్ళు హోరాహోరి యుద్ధం జరిగింది. రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలుపెట్టాడు. అప్పుడతడు తనతో యుద్ధం చేస్తుంది ఎవరో కాదు, త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామ చంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి 'దేవాదిదేవా! ఆర్తజనరక్ష! నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామ చంద్రునిగా గుర్తించాను.ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే, నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందు ముందు తీరుతుందన్నావు. అప్పటినుంచీ నీ నామస్మరణ చేస్తూ నీ కోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను. నాయింటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడిని స్వామీ! నాలో శక్తి క్షీణిస్తోంది. జీవితేచ్చ నశిస్తోంది. నా అపచారం మన్నించి నన్ను కాపాడు. నీవే తప్ప నితః పరంబెరుగను ' అని పరిపరి విధాల ప్రార్థించాడు.శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి 'జంబవంతా! శ్యమంతక మణిని అపహరించానన్న నింద వచ్చింది. దాన్ని రూపుమాపడానికి వచ్చాను. నువ్వు ఆ మణినిస్తే నేను వెళ్ళివస్తాను ' అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా మణిని, తన కూతురు జాంబవతినీ కూడా కానుకగా ఇచ్చాడు.తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో, శ్యమంతకమణితో, జాంబవతితో సత్రాజిత్తు దగ్గరకెళ్ళి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు. సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది లేని పోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు. ఆ పాపపరిహారంగా తన కుమార్తె, సత్యభామని భార్యగా స్వీకరించమని అ మణిని కూడా కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సత్యభామని స్వీకరించి, మణిని మృదువుగా తిరస్కరించాడు.ఒక శుభముహుర్తాన శ్రీకృష్ణుడు సత్యభామనీ, జాంబవతినీ పెళ్ళి చేసుకున్నాడు. దానికి వచ్చిన దేవాది దేవతలు, ఋషులు శ్రీకృష్ణునితో 'స్వామీ! మీరు సమర్థులు కనుక నీలాపనిందలు తొలగించుకున్నారు. మాబోటి అల్పుల మాటేమిటి?' అన్నారు. శ్రీహరి వారియందు దయతలిచి 'భాద్రపద శుద్ధ చవితిరోజు ప్రమాదవశాన చంద్ర దర్శనం అయినా, ఆ రోజు ప్రొద్దున గణపతిని యథావిధిగా పూజించి, శ్యమంతకమణి కథను విని పూజాక్షతలు తలమీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరు గాక' అని ఆనతీయగా దేవతలు, మునులు సంతోషించారు.కాబట్టి మునులారా! అప్పటినుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి రోజు దేవతలు, మహర్షులు, మనుష్యులు, అందరూ తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు ' అని సూతముని శౌనకాది మునులతో చెప్పారు. ఇది వినాయక మహత్యం వినాయక నిమజ్జనం భాద్రపద శుద్ధ చవితి తరువాత వినాయకుడికి నవరాత్రి పూజలు చేసిన తరువాత, మట్టి వినాయకులను ఆడంబరంగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కాని సముద్రంలో కాని నిమజ్జనం చేస్తారు. వినాయక చతుర్థి- జ్యోతిర్వేదం సూర్యుడు అస్తమించగానే తూర్పున కొన్ని చుక్కలు ఉదయించును. ఆ చుక్కలు రాత్రియంతయు ఆకాశాన మెరసి, సూర్యోదయమగు వేళకు పడమట అస్తమించును. అదేవేళకు మరికొన్ని చుక్కలు తూర్పున ఉదయించును. పున్నమినాడు సూర్యుడస్తమించే వేళకే చంద్రుడు తూర్పున ఉదయించును. అవేళ చంద్రోదయమప్పుడు తూర్పున ఏచుక్క ఉదయించునో ఆచుక్కను బట్టి ఆనెలకు పేరు ఏర్పడింది. ఈ విధంగా ఆయామాసములనుబట్టియు, కాలగతులనుబట్టియు చుక్కలు మన భూమిచుట్టును తిరుగుచున్నట్లు కనబడును. ఈ పరిభ్రమణ సందర్భాలలో కొన్ని చుక్కలు సుమారు రెండు వారాల కాలం సూర్యునితోనే ఉదయించి, సూర్యునితోనే అస్తమించుచూ, రాత్రులు ఏ వేళప్పుడు చూచినను మనకు కనబడవు. ఆ దినాలు ఆ నక్షత్రమునకు '''కార్తె''' దినం అందురు. సూర్యాస్తమైన తరువాత సూర్యోదయమగువరకును, రాత్రి ఏ వేళ చూచినను ఏ నక్షత్రపు కార్తెలో ఆనక్షత్రం మనకు కనబడదు. గ్రహముల విషయంలో ఈ కాలంను '''మూఢం''' అంటారు. మూఢం పోగానే ఇవి మరలా కనబడును. ఏనుగు తొండం, లంబోదరం, ఎలుక వాహనంతో కూడిన నక్షత్రస్వరూపుడగు విఘ్నరాజు ఉత్తరాకాశాన ఆనాడు సూర్యోదయ పూర్వం తూర్పున ఉదయించును. తొలినాడు విఘ్నేశ్వర చవితి. మరునాడే ఋషిపంచమి. కాబట్టి సప్త ఋషులు ప్రక్కనే మనం విఘ్నేశ్వర నక్షత్రాలను చూడగలం. సప్త ఋషులు ఏడు కొంగలు ఎగురుచున్నట్లు కనబడునని భాసుడు వర్ణించాడు. పడమటి దేశాలవారు ఇవి నాగలి వలె ఉన్నవందురు. మరి కొందరు భల్లూకం-పెద్ద ఎలుగుబంటి (The Great Bear or Ursa Major) రూపంలో ఉన్నాయంటారు. ఈ విఘ్నేశ్వర నక్షత్రాలు (ఎలుక-ఏనుగు) కనిపిస్తున్నవని పలు శాస్త్రకారులు నిరూపించారు. Grimaldi రచించిన Catalogue of Zodiacs and Planispheres Etc. అనే గ్రంథంలో 31 పుటలో చీనా నక్షత్రటలముల పట్టికలో నెం146 రు నమోదులో ఎలుక రూపం గ్రంథస్థము చేయబడింది. భూభ్రమణం మొదలగు అనేక కారణములవలన ఒకనాటి సూర్యోదయానికు ముందు ఉదయించిన నక్షత్రం మరునాడు నాలుగు నిముషాల ముందు ఉదయించును. పదునైదు దినాలలో 15 X 4 =60 నిముషాలు, అనగా ఒక గంటకు ముందు ఉదయించును. నెలరోజులలో రెండుగంటలు ముందు ఉదయించును. 6 నెలలో 12 గంటలముందు ఉదయించును. అనగా సూర్యస్తమానం వేళకు తూర్పున ఉదయించును. కాగా, భాద్రపద శుద్ధచవితినాడు సూర్యోదయానికు ముందు తూర్పున ఉదయించిన విఘ్నేశ్వర నక్షత్రం చైత్రశుద్ధ చవితినాడు సూర్యాస్తమైన తరువాత తూర్పున కనబడును. కాబట్టి ఆనాడు వేదాలలో గణేశపూజ చేయమని చెప్పబడింది. మాఘశుద్ధ చతుర్థి లెక్క ప్రకారం చైత్రశుద్ధ చవితినాడే వినాయక నక్షత్రం సూర్యాస్తమయం కాగానే తూర్పున లభించవలసింది. కానీ విఘ్నేశ్వర నక్షత్రాలు, సప్తఋషులును ధ్రువసమీపాన కానవస్తారు. ధ్రువునకును, ధ్రువుని చుట్టు అతిసమీపంలో ప్రదిస్ఖిణం చేయు లఘుఋక్షపు చుక్కలకును ఉదయాస్తమానాలు లేవు. ఆ నక్షత్రాలకు సప్తఋషులును, విఘ్నేశ్వరనక్షత్రములును ఎంతో దూరమందు లేవు. క్రాంతి వృత్త స్థలమగు అశ్విని, భరణి, కృత్తిక మొదలగు నక్షత్రాలవలె తూర్పున ఉషఃకాల ప్రథమ దర్శనం మొదలు సాయం సమయ ప్రథమదర్శనంనకు మధ్య ఈ విఘ్నేశ్వరనక్షత్రంలకు 6 నెలలు గడిచిపోనక్కర్లేదు; సప్తఋషులు మఘనక్షత్రంతోనే ఉదయమగుదురు. ఆ ప్రక్కనున్న విఘ్నేశ్వరుడు అంతకుముందే ఉదయమగును. కనుక మాఘశుద్ధ చతుర్థి నాటికే ప్రత్యక్షంగా విఘ్నేశ్వరుని సాయంకాలాన సూర్యాస్తమానం కాగానే చూడగలుగుదుం. ఈ కారణం చేతనే మన పంచాంగకర్తలు గతానుగతకంగా మాఘశుద్ధ చతుర్థినాడు గణేశపూజ విధించారు. కీ.శే. జ్యోతిశ్శాస్త్రపండితులు డి.స్వామికణ్ణుపిళ్ళై- దివాన్ బహుదూర్ ఈ మాఘశుద్ధ చవుతి గణేశచతుర్థియని రాసారు ఖగోళదృశ్యాలలో విఘ్నేశ్వరుని కథ ఖగోళంలో అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు మూడును నాగవీధి అనియు, రోహిణి, మృగశిర, ఆర్ద్రనక్షత్రాలు గజవీధి అనియు పురాణాలన్నియూ తెలుపుచున్నవి. కాబట్టి ఆర్ద్రనక్షత్రం రుద్రుడు-ఈశ్వరుడు. ఈశ్వరుడు గజవీధిలో అనగా గజునిలో ఇరుకుకొని ఉండవలసి వచ్చింది. పిమ్మట రాశీవిభాగం వచ్చింది. మొదటి మూడురాసులును మేషం, వృషభం, మిథునం. అందు మేషం అశ్విని+భరణి+ కృత్తిక1/4; వృషభం కృత్తిక 3/4 + రోహిణి + మృగశిర 1/2. ఈ వృషభరాశియే నంది. ఈ వృషభం వచ్చి నందిని చంపింది. కాగా మృగరాశిలో సగం; ఆర్ద్రనక్షత్రం పూర్తిగాను, పునర్వసులో 3/4-అవి మిథునం లోనికి పోయినవి. గజవీధినుండి -అనగా గజనిలో నుండి ఆర్ద్రం వెలికితీసి, వృషభం ఆర్ద్రకు వాహనంను, ధ్వజాన్ని నై ఆర్ద్రను మిధునంలో చేర్చుటకు తోడ్పడింది. అంతకుముందు గజుని మూలముగా వేరైన పార్వతీపరమేశ్వర మిథునమిపుడేకం కాగల్గింది. గజచర్మ రూపాన్ని స్ఫురింపజేయు చిన్న చుక్కలు అనేకంగా ఆరుద్ర సమీపాన మీదుగా ఉన్నాయి. పార్వతీ పరమేశ్వరులకు ముద్దుబిడ్డడై, గజముఖుడై, పునర్వసుచుక్కలకు సమీపంలో సప్తఋషుల పక్కనే విఘ్నేశ్వరడున్నాడు. శివకేశవులందు భక్తిభావము గలవారికి విఘ్నేశ్వరుడు ప్రథమపూజ్యుడై ఖగోళములో సంబంధము కలుపుచున్నాడు. శివాలయాలలో నందులు Zodiacal Bull (వృషభరాశి) సంౙ్కములై ఉన్నాయి. శ్యమంతకోపాఖ్యానం మఘ+పుబ్బ+ఉత్తర 1/4- సింహరాశి. సప్తఋషులు మఘనక్షత్రముతో ఉదహరింతురు. సప్తఋషులకు సంస్కృతంలో బృహదృక్షం, అనగా పెద్ద ఎలుగుబంటి అని పేరు. అదే ఈ కథలో జాంబవంతుడు.సప్తఋషులలో పడమటి చుక్కలు రెండును ఇటు మఘ, అంగా సింహంను, అటు ధ్రువుని చూపును. ధ్రువుడు చిన్న ఎలుగుబంటి అనే లఘుఋక్షంలోనివాడు. చిన్న ఎలుగుబంటే జాంబవంతుని కుమారుడు.శ్యమంతకమణి ఆకాశాన నుండి సింహరాశిని, సప్తర్షిమందలమును, లఘుఋక్షమును దాటి పడిన ఒక వజ్రమని ఊహించవచ్చును. విశిష్టమైన తేజస్సు (Radio Activity) చురుకు గలిగినదై నీచలోహలను అపరిమితంగా బంగారము క్రింద మార్చగలిగిన శక్తి ఉందని ఊహించవచ్చు. లేక సూర్యునినే మణిక్రింద వర్ణించిరో? ఆమణికి రాశితోడను, సప్తర్షిమండలంతోను, లఘుఋక్షంతోను ఎదో సంబంధం కలిగి ఉన్నట్లు కనబడుతుంది. విఘ్నేశ్వరచవితినాడు సాధారణంగా హస్తనక్షత్రంతో చంద్రుడు కూడి ఉండును. అనగా ఆవేళ నక్షత్రం హస్త. హస్తి అనగా ఏనుగు తొండం గల జంతువు. విఘ్నేశ్వరునికి ఏనుగు తొండముంది. హస్త నక్షత్రానికి సవితృ అభిదేవత. సవితృ అనగా సూర్యుడని అర్థం. సత్రాజిత్తు సూర్యుని ఆరాధించి శ్యమంతకమణిని సంపాదించెనని పురాణాలు చెపుతున్నాయి. ఇక్కడ మరికొన్ని విషయాలు తెలియవలసి ఉన్నాయి. ఈ నక్షత్రాలకు శ్యమంతకోపాఖ్యానమునకు గల వివరాలు మరికొంత పరిశీలించవలసి ఉంది. ఇవీకూడా చూడండి వినాయక వ్రత కల్ప విధానం వినాయక చవితి (సినిమా) వినాయక జయంతి వినాయకుడి దేవాలయాల జాబితా వినాయకుడి 108 పేర్లు మూలాలు వెలుపలి లంకెలు వర్గం:హిందువుల పండుగలు వర్గం:ఉత్సవాలు వర్గం:వినాయకుడు వర్గం:ఈ వారం వ్యాసాలు
వినాయక వ్రతకల్ప విధానం
https://te.wikipedia.org/wiki/వినాయక_వ్రతకల్ప_విధానం
శ్రీ వినాయక వ్రతం శ్లోకం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ఆచమనం: ఓం కేశవాయ స్వాహాః నారాయణాయ స్వాహాః మాధవాయ స్వాహాః (అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను) గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః దైవ ప్రార్థన (గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను). 1. యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం 2. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన: 3. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం 4. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. తాత్పర్యము: మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను. {ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షింతలు దేవునిపై చల్లవలెను.} ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచీపురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు|| భూతోచ్చాటన: (క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.) శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే తా: భూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట. చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము. ప్రాణాయామం (మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం) ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ || ||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్|| కారణము: (గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం, కుంభకం, రేచకం అంటారు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అంటారు. బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.) అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || (అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్ళు చల్లవలెను. శుద్ధి చేసినట్టుగా) ప్రాణాయామం సంకల్పము: (ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమి కోరి, ఏ పనిచేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అంటారు.) మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణదిగ్భాగే, …….. నదీ సమీపే……… ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, …………… (దక్షిణాయనే), …….. (వర్ష) ఋతౌ, ……… (భాద్రపద) మాసే, ……… (శుక్ల) పక్షే,..….. (చతుర్థ్యాం) తిథి ………………. వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్థం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (నీరు ముట్టుకొనవలెను) భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం షోడశోపచారపూజ ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥ శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ ఆవాహయామి మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥ ఆసనం సమర్పయామి గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥ ఆర్ఘ్యం సమర్పయామి గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥ పాద్యం సమర్పయామి అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥ ఆచమనీయం సమర్పయామి. దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥ మధుపర్కం సమర్పయామి. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥ పంచామృత స్నానం సమర్పయామి. గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥ శుద్దోదక స్నానం సమర్పయామి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥ వస్త్రయుగ్మం సమర్పయామి. రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥ ఉపవీతం సమర్పయామి. చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥ గంధాన్ సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥ అక్షతాన్ సమర్పయామి. సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥ పుష్పాణి పూజయామి. అథాంగ పూజ (పుష్పములతో పూజించవలెను) ఓo గణేశాయ నమః - పాదౌ పూజయామి Padamulaku Pooja Cheyandi? ఓo ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి Madimalaku Pooja Cheyandi? ఓo శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి Mokallu ఓo విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి Pikkalu ఓo ఆఖువాహనాయ నమః - ఊరూo పూజయామి Thodalu ఓo హేరంబాయ నమః - కటిం పూజయామి Nadumu ఓo లంబోదరాయ నమః - ఉదరం పూజయామి Bojja ఓo గణనాథాయ నమః - నాభిం పూజయామి Nabhi ఓo గణేశాయ నమః - హృదయం పూజయామి Hrudayamu ఓo స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి Kanthamu ఓo Skandagrajaya Namaha Skandow Poojayami Moopulu ఓo Pasahasthaya Namaha Hasthow Poojayami Chethulu ఓo గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి Mukhamu ఓo విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి Kannulu ఓo శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి Chevulu ఓo ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి Nosata ఓo సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి Sirasu ఓo విఘ్నరాజాయ నమః - సర్వాంగాణి పూజయామి Anni Angamunaku Pooja Cheyyali!! ఏకవింశతి పత్రపూజ (21 విధముల పత్రములతో పూజింపవలెను) సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి। గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి। ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి। గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి। లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి। గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి। గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి, ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి, వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి। భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి, వటవేనమః - దాడిమీపత్రం పూజయామి, సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి, ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి, హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి, సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి, ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి, వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి, సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి। కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి। శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి. శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥ ధూపమాఘ్రాపయామి॥ సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే దీపందర్శయామి। సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్, భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక, నైవేద్యం సమర్పయామి। సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక సువర్ణపుష్పం సమర్పయామి. పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి। ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ నీరాజనం సమర్పయామి। అథ దూర్వాయుగ్మ పూజా గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। సర్వసిద్ది ప్రదాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। మూషక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి। ఏకదంతైకవదన తథామూషక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి। నమస్కారము, ప్రార్థన ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన, ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి, అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన, పునరర్ఘ్యం సమర్పయామి, ఓం బ్రహ్మవినాయకాయ నమః నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన, ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్ వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. శ్రీ వినాయక వ్రత కథ గణపతి జననము సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను। గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి, కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించి ఆపై శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు। ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు। భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేని స్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువునర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాదు। నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు। గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అన్నాడు। విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చాడు। శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు। గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది। తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించాడు। అయినా మాట తప్పుట కుదరదు। కుక్షియందున్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది। నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది" అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు। నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు। శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు। అక్కడ పార్వతి భర్త రాక గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది। తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది। అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది। దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది। అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసినది। ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది। శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు। జరిగిన దానిని విని పార్వతి విలపించింది। శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించాడు। గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు। విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి: గణేశుడు అగ్రపూజనీయుడు ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది। శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు। శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు। "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు। కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు। గజాననుడు మిగిలిపోయినాడు। త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించాడు। వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు। నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు। అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు। వినాయకునికే ఆధిపత్యము లభించినది। చంద్రుని పరిహాసం గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ। ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు। (చంద్రుడు మనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడననుసరణీయుడైనాడు। ఆతని మాన్యత నశించింది। నింద్యుడయినాడు। ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి। అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు। నిందలకు గురియగుతారు। చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించాడు. భాద్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించాడు. ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడింది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడింది. శ్యమంతకోపాఖ్యానము చంద్ర దర్శనం నీలాపనింద: ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారమునీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు. అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయింది. నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు. ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది. అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించింది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఒక దినము కాదు, రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది. అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించాడు. అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కనుక అప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు. శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యథార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని, తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి, సత్యభామను స్వీకరించాడు. వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై బాధ్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది. పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు... సింహ ప్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడింది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడింది. సర్వేజనాః సుఖినో భవంతు. విఘ్నేశ్వర చవితి పద్యములు ప్రార్థన : తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌. కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌. తలచెదనే గణనాథుని తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా దలచెదనే హేరంబుని దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌ అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌ నిటలాక్షు నగ్రసుతునకు బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌. వినాయక మంగళాచరణము ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు - జయమంగళం నిత్య శుభమంగళం ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌. కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌. మరొక పద్యం కూడా విద్యార్థులకు ఉచితమైనది. తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయవయ్య నిని ప్రార్థన సేసెద నేకదంత నా వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా! ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్థనా శ్లోకము సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి ఇవి కూడా చూడండి వినాయకుడు వినాయక చవితి బయటి లింకులు సంకష్టహర గణపతి వ్రతం వర్గం:హిందువుల పండుగలు వర్గం:వినాయకుడు వర్గం:వ్రతములు
వేంకట పతి రాయలు
https://te.wikipedia.org/wiki/వేంకట_పతి_రాయలు
దారిమార్పురెండవ శ్రీరంగ రాయలు#వేంకట పతి రాయలు
రెండవ శ్రీరంగ రాయలు
https://te.wikipedia.org/wiki/రెండవ_శ్రీరంగ_రాయలు
రెండవ శ్రీరంగ రాయలు (1642-1678 / 1681 CE) విజయనగర సామ్రాజ్యం యొక్క చివరి పాలకుడు, అతను మామ వెంకట III మరణం తరువాత 1642 లో అధికారంలోకి వచ్చాడు. అతను అళియ రామరాయల మునిమనవడు కూడా. తిరుగుబాట్లు సింహాసనాన్ని అధిష్టించే ముందు, రెండవ శ్రీరంగ రాయలు తన మామ వెంకట III పై తిరుగుబాటు చేసాడు. అతను బీజాపూర్ సుల్తాన్ సహాయం తీసుకుని 1638 లో చంద్రగిరి - వెల్లూరులో వెంకట III పై దాడి చేశాడు. 1642 లో ఈ రెండింటిపై అతడు చేసిన మరొక దండయాత్రను వెంకట III సైన్యం ఓడించింది. ఆ సమయంలో వీరు మద్రాసు సమీపంలో గోల్కొండ సైన్యాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యాత్మక పరిస్థితులలో వెంకట III మరణించాడు. బీజాపూర్ సైన్యంతో ఉన్న రెండవ శ్రీరంగ రాయలు వారిని విడిచిపెట్టి వెల్లూరుకు తిరిగి వచ్చి తనను తాను విజయనగర రాజుగా చేసుకున్నాడు. పాలన శ్రీరంగ రాయలు మాజీ రాజుపై తిరుగుబాటు చేయడంలో అతడు చేసిన కుట్ర వలన జింజీకి చెందిన నాయకుడు, మద్రాసు నాయకుడు దామర్ల వెంకటాద్రి నాయకుడు వంటి వారు చాలా మంది అతన్ని ఇష్టపడలేదు. బీజాపూర్, గోల్కొండ సుల్తాన్ల మధ్య గొడవలు రెండవ శ్రీరంగ రాయలుకి కొంతకాలం సహాయపడ్డాయి. 1644 లో గోల్కొండ సుల్తాను విస్తారమైన సైన్యంతో దాడిచేసాడు, కాని రెండవ శ్రీరంగ రాయలు చేతిలో ఓడిపోయాడు. రెండవ శ్రీరంగ రాయలు, ఇప్పుడు దక్షిణాది నాయకుల నుండి డబ్బు డిమాండ్ చేసేంత బలంగా ఉన్నాడు. దక్షిణ దిశగా దాడి వెళ్ళాడు. 1640 లలో, ఫోర్ట్ సెయింట్ జార్జ్ (మద్రాస్) ఉన్న స్థలాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఏజెంట్లకు మంజూరు చేశాడు. విరించిపురం యుద్ధం 1646 లో మైసూర్, జింజీ, తంజావూరుల సాయంతో పెద్ద సైన్యాన్ని సేకరించుకుని, గోల్కొండ దళాలపై దాడి చేసాడు. ముస్లిం దళాలు తొలుత నష్టపోయినా, దక్కన్ నుండి అదనపు సైన్యాలు వచ్చి చేరడంతో అవి ముందుకు సాగాయి. 1652 వరకు యుద్ధం కొనసాగింది. 1649 లో మదురై తిరుమలాయ నాయకుడు బీజాపూర్ పాలకుడికి మద్దతుగా తన బలగాలను పంపాడు. కాని జింజీ కోట వద్ద కలుసుకున్న తరువాత, బీజాపూర్, గోల్కొండలు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు, మదురై దళాలు గందరగోళాన్ని సృష్టించి, జింగీ సైన్యంతో కలిసిపోయాయి. ఇది 1649 లో జింగీ నాయక పాలనను ముగించడానికి దారితీసింది. 1652 నాటికి, రెండవ శ్రీరంగ రాయలుకి వెల్లూరు కోట మాత్రమే మిగిలింది. దాన్ని కూడా చివరికి గోల్కొండ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ సమయానికి ఆయనకు మైసూర్ మద్దతు మాత్రమే మిగిలి ఉంది. తంజావూరు ముస్లిం దళాలకు లొంగిపోగా, మదురై నాయకులు ముస్లిం దళాలకు భారీ మొత్తాలను చెల్లించారు. కాని ముగ్గురూ తమ రాజ్యాలను నిలుపుకున్నారు. అంత్య కాలం రెండవ శ్రీరంగ రాయలు తన చివరి సంవత్సరాలను తన ప్రధాన నాయకులలో ఒకరైన ఇక్కేరికి చెందిన శివప్ప నాయకుని మద్దతుతో గడిపాడు. ముస్లిం దళాల నుండి వెల్లూరును తిరిగి పొందగలనన్న ఆశతో ఉన్నాడు. రెండవ శ్రీరంగ రాయలుకి తిరుమలాయ నాయకుడు చేసిన ద్రోహం కారణంగా మైసూరు పాలకుడు కంఠీరవ నరసరాజు I మదురైతో వరుస యుద్ధాలు చేసి, కోయంబత్తూరు, సేలం భూభాగాలను స్వాధీనం చేసుకున్నాడు. 1800 వరకు ఈ ప్రాంతాలు మైసూరు రాజ్యం లోనే ఉండేవి. మరణం మైసూరి పాలకుడు కంఠీరవ నరసరాజు I శ్రీరంగను రాజుగానే గుర్తించాడు. శ్రీరంగ 1678/1681 లో రాజ్యం లేని రాజుగా మరణించాడు, భారతదేశంలో మూడు శతాబ్దాలకు పైగా సాగిన విజయనగర పాలనకు అంతం పలికాడు. శ్రీరంగ ఏకైక కుమార్తెకు నరసింహచార్య వంశీకుడు శ్రీవల్లభతో వివాహం జరిపించాడు. వేంకట పతి రాయలు వేంకట పతి రాయలు శ్రీరంగ రాయల కుమారుడు. వేంకటపతి రాయలు తండ్రి తరువాత సింహాసనము అధిస్టించి రెండు సంవత్సరములు పాలించినాదు, అది కూడా కేవలము నామ మాత్ర పరిపాలనే, ఇంతటితో ఆరవీటి వంశము అంతరించింది. మూలాలు వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు వర్గం:హిందూ రాజులు
పెద వేంకట రాయలు
https://te.wikipedia.org/wiki/పెద_వేంకట_రాయలు
పెద వేంకట రాయలు 1632-1642 కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాడు. ఇతన్ని పెద వేంకట రాయలు అని చారిత్రికులు ఉదహరిస్తారు. ఇతడు తెలుగు కుటుంబానికి చెందినవాడు, అళియ రామరాయల మనవడు. అతని బావమరదులు దామర్ల వెంకటప్ప నాయకుడు, దామర్ల అయ్యప్ప నాయకుడు. ఈ ఇద్దరూ దామర్ల చెన్నప్ప నాయకుడి కుమారులు తిమ్మరాజు ఆక్రమణ వెంకటపతి రాయల బాబాయి, మొదటి శ్రీరంగ రాయల సోదరుడూ అయిన తిమ్మరాజు, రాజయ్యే అర్హత తనకే ఎక్కువ ఉందని భావించి, వెల్లూరు కోటను స్వాధీనం చేసుకున్నాడు. పెద వేంకట రాయలు తన స్వంత ఊరు అనెకొండలోనే ఉండేలా చేశాడు. జింగీ, తంజోర్, మదురై నాయకులు పెద వేంకట రాయలుకు మద్దతు ప్రకటించగా, తిమ్మరాజుకు ఎవ్వరి మద్దతూ లేదు. అందరూ అతన్ని కుట్రదారుగా భావించారు. అయినప్పటికీ తిమ్మరాజు చాలా ఇబ్బంది పెట్టాడు. 1635 లో అతడు మరణించే వరకూ అంతర్గత కల్లోలం కొనసాగుతూనే ఉంది. ప్రారంభంలో అతను గెలిచాడు, రాజు పెద వెంకట రాయల మేనల్లుడు రెండవ శ్రీరంగ రాయలు మైదానంలోకి వెళ్లి తిమ్మ రాజును పులికాట్‌లోని డచ్‌వారి సహాయంతో ఓడించాడు. పెద వెంకట రాయల వాదనను అంగీకరించక తప్పలేదు. కొన్ని భూభాగాలను తిమ్మరాజు ఉంచుకోవడానికి పెద వేంకట రాయలు అనుమతించాడు. కాని తిమ్మరాజు మళ్ళీ ఇబ్బంది పెట్టాడు. ఈసారి, 1635 లో, అతడు జింజీ నాయకుడు చంపేసాడు. చివరకు శాంతి పునరుద్ధరించబడింది. పెద వేంకట రాయలు బాధ్యతలు స్వీకరించడానికి వెల్లూరుకు తిరిగి వచ్చాడు. మద్రాసు భూదానం 1639 ఆగస్టు 22 న ఈస్ట్ ఇండియా కంపెనీ కోరమాండల్ తీరంలో వాణిజ్య కార్యకలాపాల కోసం కర్మాగారాన్ని, గిడ్డంగినీ నిర్మించేందుకు గాను, పెద వేంకట రాయలు కంపెనీకి చెందిన చెందిన ఫ్రాన్సిస్ డేకు కొంత భూమిని దానం చేసాడు. ఈ ప్రాంతం కాళహస్తి, వండవాసికి చెందిన రేచెర్ల వెలమ నాయకుడు, దామెర్ల వెంకటాద్రి నాయకుడి ఆధీనంలో ఉండేది. వెంకటాద్రి నాయకుడు దామెర్ల చెన్నప్ప నాయకుడి కుమారుడు. చెన్నై (మద్రాస్) మహానగరానికి పునాది పడిన ఘటన ఇది. దీన్ని మద్రాస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. దక్షిణాది నాయకుల నుండి ఇబ్బంది 1637 లో, తంజావూరు మదురై నాయకులు, కొన్ని సమస్యల కారణంగా, పెద వేంకట రాయలును ఓడించేందుకు ఉద్దేశంతో వెల్లూరుపై దాడి చేశారు కాని ఓడిపోయారు. శాంతి నెలకొంది. రెండవ శ్రీరంగ రాయల తిరుగుబాటు రాజుకు నమ్మకమైన మేనల్లుడు, రెండవ శ్రీరంగ రాయలు కొన్ని కారణాల వల్ల 1638 లో రాజుకు ఎదురు తిరిగాడు. బీజాపూర్ నుండి దండయాత్రకు రూపకల్పన చేశాడు. బీజాపూర్ - రెండవ శ్రీరంగ రాయల సంయుక్త సైన్యం మొదట్లో బెంగళూరుపై దాడి చేసింది, పెద వేంకట రాయలు చాలా వెల చెల్లించి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1641 లో మళ్ళీ అదే సంయుక్త సైన్యం మరొక దాడి చేసింది. వెల్లూరు కోట నుండి కేవలం 12 మైళ్ళ దూరంలో ఉండగా, వారి శిబిరంపై దక్షిణాది నాయకుల మద్దతుతో దాడి పెద వేంకట రాయలు దాడి చేసి తరిమేసాడు గోల్కొండ దళాలు ఈ అశాంతిని గమనిస్తూ ఉన్న గోల్కొండకు చెందిన కుతుబ్ షాహి రాజవంశం, తరువాతి సంవత్సరంలో (1641) తూర్పు తీరం వెంబడి భారీ సైన్యాన్ని పంపింది. గోల్కొండ సైన్యం, మద్రాసు సమీపంలో వెంకటపతి రాయల సైన్యం నుండి గట్టి ప్రతిఘటన ఎదుర్కొంది. కాళహస్తికి చెందిన దామెర్ల వెంకటాద్రి నాయకుడు, జింజీ నాయకుడు అతడికి తోడ్పడ్డారు. వీళ్ళ ప్రతిఘటనను ఎదుర్కొంటూనే గోల్కొండ సైన్యం వెల్లూరు కోట దిశగా కదిలింది. అన్ని వైపుల నుండి ముంచుకొచ్చిన ముప్పు చూసి పెద వేంకట రాయలు, చిత్తూరు అడవుల్లోకి పారిపోయి, అక్కడే 1642 అక్టోబరులో మరణించాడు. పెద వేంకట రాయలుకు కుమారుడు లేడు. అతని తరువాత అతని నమ్మకద్రోహ మేనల్లుడు రెండవ శ్రీరంగ రాయలు, బీజాపూర్ శిబిరాన్ని విడిచిపెట్టి వెల్లూరు కోటకు వచ్చి గద్దెనెక్కాడు. మూలాలు వర్గం:తెలుగు రాజులు వర్గం:1642 మరణాలు వర్గం:హిందూ రాజులు
సెప్టెంబర్ 12
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_12
సెప్టెంబర్ 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 255వ రోజు (లీపు సంవత్సరములో 256వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 110 రోజులు మిగిలినవి. సంఘటనలు 1686: బీజాపూరు రాజ్యం, ఔరంగజేబుతో యుద్ధంలో ఓడిపోయి, మొఘల్ సామ్రాజ్యం కలిసిపోయింది. ఆదిల్‌షాహీ వంశ పతనం. జననాలు 1885: గౌస్ బేగ్ సాహెబ్, పేరాల ఉద్యమంలో నెలకొల్పిన కఠోర నియమాలను పాటించి పోలిసు జులుమును భరించి క్రమశిక్షణతో సత్యాగ్రహంచేసి మునిసిపల్ శాసనాన్ని రద్దుచేయించారు 1892: తల్లావఝుల శివశంకరస్వామి ప్రసిద్ద సాహితీవేత్త. భావకవితా ఉద్యమ పోషకుడు. (మ.1972) 1920: పెరుగు శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (మ.2005) 1925: జోలెపాళ్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ (మ.2017) 1943: రవ్వా శ్రీహరి, ఆధునిక తెలుగు నిఘంటుకర్త, వ్యాకరణవేత్త, ఆచార్యుడు (మ. 2023) 1952: అల్లాబక్షి బేగ్ షేక్‌, రంగస్థల రచయిత, నటుడు. 1967: అమల అక్కినేని , తెలుగు చలనచిత్ర నటి 1989: కళ్యాణి , దక్షిణ భారత చలన చిత్ర నటీ. 1997: శాన్వీ మేఘన , తెలుగు సినీ నటి. మరణాలు thumb|నార్మన్ బోర్లాగ్ 2009: నార్మన్ బోర్లాగ్, హరిత విప్లవ పితామహుడు. 2009: రాజ్‌సింగ్ దుంగార్పూర్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ అధ్యక్షుడు. 2010: స్వర్ణలత, దక్షిణ భారత గాయని. (జ.1973) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం 2008 సెప్టెంబర్ 12 తేదీని మొదటిసారిగా ప్రపంచ నోటి ఆరోగ్య దినంగా ప్రకటించారు. 1978 సెప్టెంబర్ 12వ తేదీనాడు ఎఫ్ డి ఐ వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య రక్షణ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. ఎప్ డి ఐ వ్యవస్థాపకుడు డాక్టర్ చార్లెస్ గాడన్ 1854 సెప్టెంబర్ 12వ తేదీన జన్మించారు.. - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 12 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 11 - సెప్టెంబర్ 13 - ఆగష్టు 12 - అక్టోబర్ 12 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 13
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_13
సెప్టెంబర్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 256వ రోజు (లీపు సంవత్సరములో 257వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 109 రోజులు మిగిలినవి. సంఘటనలు 1948: హైద్రాబాద్ పైకి పటేల్ సైన్యాన్ని పంపాడు. జననాలు 1910: వేపా కృష్ణమూర్తి, తెలుగు ఇంజనీరు. (మ.1952) 1913: సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు. (మ.1984) 1926: జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి. (మ.2006) 1940: సజ్జా జయదేవ్ బాబు, కార్టూనిస్టు. 1946 : రామస్వామి పరమేశ్వరన్, భారత సైనిక దళం నకు చెందిన సైనికాధికారి. 1960: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, 16వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 1960: కార్తీక్, తమిళ తెలుగు చిత్రాల నటుడు, గాయకుడు,రాజకీయ నాయకుడు. 1965: ముచ్చర్ల అరుణ , తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ సినీనటి. 1966: శ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు. (మ.2015) మరణాలు 1929: జతీంద్ర నాథ్ దాస్, స్వతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు. (జ.1904) 1989: ఆచార్య ఆత్రేయ, తెలుగులో నాటక, సినీ రచయిత. (జ.1921) 1966: దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (జ.1886) 2012: రంగనాథ్ మిశ్రా, 21వ భారత ప్రధాన న్యాయమూర్తి. (జ.1926) పండుగలు , జాతీయ దినాలు కోల సోమసాయి బస్వంత్ జననం ప్రపంచ మనీషా తంగేటి దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 13 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 12 - సెప్టెంబర్ 14 - ఆగష్టు 13 - అక్టోబర్ 13 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 14
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_14
సెప్టెంబర్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 257వ రోజు (లీపు సంవత్సరములో 258వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 108 రోజులు మిగిలినవి. సంఘటనలు 1949 - భారత రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని జాతీయభాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. జననాలు thumb|Gadicherla Harisarvothama Rao 1883: గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ. (మ.1960) 1923: రామ్ జెఠ్మలానీ: భారతీయ న్యాయవాది, రాజకీయనాయకుడు. 1931: బొమ్మ హేమాదేవి, తొలితరం నవలా రచయిత్రి(మ.1996) 1937: ఎస్.మునిసుందరం, కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (మ.2015) 1949: కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. (మ.2012) 1951: కొమ్మాజోస్యుల ఇందిరాదేవి, రంగస్థల నటి. 1958: గరికపాటి నరసింహారావు, తెలుగు రచయిత, అవధాని, పద్మశ్రీ అవార్డు గ్రహీత. 1962: మాధవి, సినీ నటి. 1974: ప్రియా రామన్ , దక్షిణ భారత చలన చిత్ర నటి. 1993: అమూల్య , కన్నడ చిత్రాల సినీనటి. మరణాలు 1967: బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (జ.1899). 2020: కొంకాల శంకర్, గాయకుడు, రచయిత, బుల్లితెర నటుడు, ఉప్పరపల్లి గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ. పండుగలు , జాతీయ దినాలు హిందీ భాషా దినోత్సవం ప్రపంచ ప్రధమ చికిత్స దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 14 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 13 - సెప్టెంబర్ 15 - ఆగష్టు 14 - అక్టోబర్ 14 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 15
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_15
సెప్టెంబర్ 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 258వ రోజు (లీపు సంవత్సరములో 259వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 107 రోజులు మిగిలినవి. సంఘటనలు 1931: భక్త ప్రహ్లాద [తొలి తెలుగు టాకీ (మాటలు వచ్చిన సినిమా)] విడుదల. ఇందులో 40 పాటలున్నాయి. పద్యాలు ఉన్నాయి. బొమ్మ సరిగా కనిపించక పోయినా, మాటలు కొన్నిచోట్ల సరిగా వినిపించక పోయినా, ప్రేక్షకులు విరగబడి చూశారు. 2000: 27వ వేసవి ఒలింపిక్ క్రీడలు సిడ్నీలో ప్రారంభమయ్యాయి. 2006: 14వ అలీన దేశాల సదస్సు క్యూబా రాజధాని నగరం హవానా లో ప్రారంభమైనది. 2009: తిరుపతి లడ్డుకు భౌగోళిక అనుకరణ హక్కు లభించింది. జననాలు 1856: నారదగిరి లక్ష్మణదాసు, పాలమూరు జిల్లాకు చెందిన కవి, వాగ్గేయకారుడు. (మ.1923) 1861: మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశపు ఇంజనీరు. (మ.1962) 1890: పులిపాటి వెంకటేశ్వర్లు, తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు (మ.1972) 1892: పృథ్వీసింగ్ ఆజాద్, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1989) 1900: కేదారిశ్వర్ బెనర్జీ, భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ రే క్రిస్టలోగ్రఫీలో నిపుణుడు. (మ.1975) 1909: రోణంకి అప్పలస్వామి, సాహితీకారుడు. (మ.1987) 1923: నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, రేడియో కళాకారులు. 1925: శివరాజు సుబ్బలక్ష్మి, రచయిత్రి, చిత్రకారిణి. 1926: అశోక్ సింఘాల్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు (మ. 2015). 1927: నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు, తెలుగు రచయిత. 1942: సాక్షి రంగారావు, రంగస్థల, సినిమా నటుడు. (మ.2005) 1961: పాట్రిక్ ప్యాటర్సన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1967: రమ్యకృష్ణ, నటి. 1970: శశి ప్రీతం , సంగీత దర్శకుడు,గాయకుడు , గీత రచయిత. 1985: నేహా ఒబెరాయ్ , బాలీవుడ్ నటి. 1988: శ్రీమణి , తెలుగు సినీ గీత రచయిత మరణాలు 1963: పొణకా కనకమ్మ, గొప్ప సంఘ సంస్కర్త, నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది. (జ.1892) 1972: కె.వి.రెడ్డి , తెలుగు చలనచిత్ర దర్శకుడు .(జ.1912) 1998: జే.రామేశ్వర్ రావు, వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1923) 2015: వై.బాలశౌరిరెడ్డి, హిందీభాషాప్రవీణుడు, హిందీ చందమామ సంపాదకుడు. (జ.1928) పండుగలు , జాతీయ దినాలు జాతీయ ఇంజనీర్ల దినోత్సవము అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సంఛాయక దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 15 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 14 - సెప్టెంబర్ 16 - ఆగష్టు 15 - అక్టోబర్ 15 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 16
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_16
సెప్టెంబర్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 259వ రోజు (లీపు సంవత్సరములో 260వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 106 రోజులు మిగిలినవి. సంఘటనలు 2016 - ఆపిల్ సి.ఇ.ఓ శాన్ ఫ్రాన్సిస్కోలో ఐఫోన్ 7ను విడుదల చేసాడు. జననాలు thumb|ఎం.ఎస్.సుబ్బలక్ష్మి 1857: కల్లూరి వేంకట రామశాస్త్రి, తెలుగు కవి. (మ.1928) 1916: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. (మ.2004) 1923: లీ క్వాన్‌ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్‌ జాతి పితగా పిలుస్తారు. (మ.2015) 1959:రోజా రమణి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీనటి. 1969: ప్రమీలా భట్ట్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారిణి. 1975: మీనా, దక్షిణ భారత సినిమా నటి. మరణాలు 1763: సలాబత్ జంగ్, మొదటి అసఫ్ జా నాలుగవ కుమారుడైన నిజాం ఆలీ ఖాన్ రెండవ అసఫ్ జా బిరుదుతో నిజాం అయ్యాడు. ఇతని కాలం నుండే అసఫ్ జాహీ ప్రభువులు నిజాం ప్రభువులుగా ప్రసిద్ధిచెందారు. 1931: ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (జ.1858) 1932: రోనాల్డ్ రాస్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1857) 1987: దొడ్డపనేని ఇందిర, రాజకీయవేత్త, మంత్రివర్యులు. (జ.1937) 2012: సుత్తివేలు, తెలుగు హాస్య నటులు. (జ.1947) 2013: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, హేతువాది, వామపక్షవాది. (జ.1920) 2016: బొజ్జా తారకం, హేతువాది. పౌరహక్కుల నేత. (జ.1939) 2019: కోడెల శివప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, రాజకీయనాయకుడు. (జ.1947) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం (అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం) ప్రపంచ శాంతి దినోత్సవం మలేషియా దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 16 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 15 - సెప్టెంబర్ 17 - ఆగష్టు 16 - అక్టోబర్ 16 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 17
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_17
సెప్టెంబర్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 260వ రోజు (లీపు సంవత్సరములో 261వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 105 రోజులు మిగిలినవి. సంఘటనలు 1948: హైదరాబాదు సంస్థానం నిజాం పరిపాలన నుండి విముక్తి పొంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది. 1978: ఇజ్రాయిల్-ఈజిప్టు దేశాల మధ్య కాంప్‌డేవిడ్ శాంతి ఒప్పందం కుదిరింది. 2008: థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్‌సవత్ ఎన్నికైనాడు. జననాలు 1879: పెరియార్ రామస్వామి నాయకర్ ఉద్యమకారుడు, రాజకీయనాయకుడు, సంఘసంస్కర్త, నాస్తికవాది. 1906: వావిలాల గోపాలకృష్ణయ్య, గాంధేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ సభ్యుడు. (మ.2003) 1915: ఎమ్.ఎఫ్. హుస్సేన్, భారతీయ చిత్రకారుడు. (మ.2011) 1943: తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త 1950: భారతదేశ 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడి జన్మించారు. 1986: ప్రియా ఆనంద్ , తమిళ, మలయాళ, హిందీ,కన్నడ,తెలుగు, చిత్రాల నటి . 1990 బండారు శివప్రసాద్ జర్నలిస్ట్, అధ్యాపకుడు, తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. మరణాలు 1922: ముత్తరాజు సుబ్బారావు, శ్రీకృష్ణ తులాభారం నాటక రచన ద్వారా ప్రసిద్ధులయ్యారు, ఇతర రచనలు ఉత్తర రామచరిత్ర, రాజ్యశ్రీ, చంద్రగుప్త. వీటిలో రాజ్యశ్రీ నాటకాన్ని చెన్నపురిలోని సుగుణవిలాస సభవారు ఏర్పరచిన పోటీలకు రాసింది (జ.1888). పండుగలు , జాతీయ దినాలు తెలంగాణ విమోచన దినోత్సవం విశ్వకర్మ జయంతి మహిళల మైత్రీ దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 17 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 16 - సెప్టెంబర్ 18 - ఆగష్టు 17 - అక్టోబర్ 17 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 18
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_18
సెప్టెంబర్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 261వ రోజు (లీపు సంవత్సరములో 262వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 104 రోజులు మిగిలినవి. సంఘటనలు 1953 - జననాలు 1752: అడ్రియన్ మేరీ లెజెండ్రీ, ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త. (మ.1833) 1819: లీయాన్ ఫోకాల్ట్, ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. (మ.1868) 1899: గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1985) 1900: శివసాగర్ రాంగులామ్, మారిషస్ తొలి ప్రధానమంత్రి, గవర్నర్ జనరల్ (మ.1985) 1914: కోగంటి రాధాకృష్ణమూర్తి, రచయిత, సంపాదకుడు, హేతువాది. (మ.1987) 1950: విష్ణువర్ధన్, దక్షిణ భారత చలన చిత్ర, సహాయ నటుడు.(మ.2009 ) 1951: కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. 1964: తంగిరాల చక్రవర్తి, కవి, రచయిత, విమర్శకుడు, నాటకకర్త. 1968: ఉపేంద్ర, సినిమా నటుడు. 1975: శ్రుతి , కన్నడ, తెలుగు చిత్రాల నటి.రాజకీయవేత్త . 1979: వినయ్ రాయ్, తమిళ, తెలుగు, చిత్రాల నటుడు. 1976: రొనాల్డో, బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు. 1989: అశ్విని పొన్నప్ప, భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 1990: నందిని రాయ్, తెలుగు చలన చిత్ర నటి , మోడల్. 1993: అదితి ఆర్య , భారతీయ నటి , మోడల్, రీసెర్చ్ అనలిస్ట్. 1994: రుహాని శర్మ , భారతీయ సినీ నటీ , మోడల్. మరణాలు 1783: లియొనార్డ్ ఆయిలర్, స్విట్జర్లాండుకు చెందిన ఒక గణిత శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రజ్ఞుడు. (జ.1707) 1977: సుధీ రంజన్ దాస్, భారతదేశ సుప్రీంకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1894) 2017: ఆర్.గోవర్ధన్ ,సంగీత దర్శకుడు ( జ.1928) 2022: నిజాం వెంకటేశం, కవి, అనువాదకుడు, ప్రచురణకర్త. (జ. 1948) 2023: రియాజ్ అహ్మద్, మాజీ వాలీబాల్ ఆటగాడు. (జ. 1939) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం ప్రపంచ వెదురు దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 18 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 17 - సెప్టెంబర్ 19 - ఆగష్టు 18 - అక్టోబర్ 18 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 19
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_19
సెప్టెంబర్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 262వ రోజు (లీపు సంవత్సరములో 263వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 103 రోజులు మిగిలినవి. సంఘటనలు 1953 - జననాలు 1887: తాపీ ధర్మారావు నాయుడు, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. (మ.1973) 1905: చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్, భాగవతార్ సుప్రసిద్ధ హరికథా కళాకారుడు, రంగస్థల, సినిమా నటుడు. 1911: బోయి భీమన్న, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పద్మభూషణ పురస్కార గ్రహీత. (మ.2005) 1924: కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ.2010) 1929: బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. (మ.2002) 1935: మౌలానా అబ్దుల్‌ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్‌లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (మ.2016) 1965: సునీతా విలియమ్స్, యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి, నాసా వ్యోమగామి. 1970: రాజా రవీంద్ర , తెలుగు చలనచిత్ర నటుడు 1976: ఇషా కొప్సికర్ ,మోడల్, హిందీ, తెలుగు,తమిళ,కన్నడ, మరాఠీ ,భాషల నటి, రాజకీయ నాయకురాలు. 1980: మేఘన నాయుడు , భారతీయ సినీ నటీ. 1984: కావ్య మాధవన్, మలయాళ సినీనటి, గాయని, పాటల రచయిత . 1987: సూరజ్ సంతోష్ , గాయకుడు . మరణాలు thumb|U. Srinivas 2009 1719: రెండవ షాజహాన్, 11వ మొఘల్ చక్రవర్తి. (జ.1698) 1965: బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (జ. 1900) . 2014: ఉప్పలపు శ్రీనివాస్, మాండలిన్ విద్వాంసుడు. (జ.1969) 2015: నడిచే గణితవిజ్ఞాన సర్వస్వంగా పేరుగాంచిన ఆచార్య నల్లాన్ చక్రవర్తుల పట్టాభిరామాచార్యులు, తన 82వ ఏట, వరంగల్లులో చనిపోయాడు. (చూ. సాక్షి, తే.21-9-2015) ఆయన వరంగల్లు లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.ఐ.టి.) లో గణిత ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు (జ.1933). పండుగలు , జాతీయ దినాలు తెలుగు మాధ్యమాల దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 19 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 18 - సెప్టెంబర్ 20 - ఆగష్టు 19 - అక్టోబర్ 19 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 20
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_20
సెప్టెంబర్ 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 263వ రోజు (లీపు సంవత్సరములో 264వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 102 రోజులు మిగిలినవి. సంఘటనలు 1953 - జననాలు 1569 : జహాంగీర్, మొఘల్ సామ్రాజ్యపు నాలుగవ చక్రవర్తి (మ.1627). 1914: అయ్యగారి సాంబశివరావు, ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు. (మ.2003) 1924: అక్కినేని నాగేశ్వరరావు, తెలుగు నటుడు, నిర్మాత. (మ.2014) 1944: అన్నయ్యగారి సాయిప్రతాప్, భారత పార్లమెంటు సభ్యుడు. 1948: మహేష్ భట్, భారతీయ చలనచిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత 1954: ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.2013) 1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. 1984: సాయిచంద్ తెలంగాణ కళాకారుడు, గాయకుడు (మ. 2023) మరణాలు 1933: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (జ.1847) 1967: బుచ్చిబాబు , అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు, నవలలు, నాటికలు , వ్యాసాలు,రచయిత ,కవి,(జ.1916) 1999: టి.ఆర్.రాజకుమారి, తమిళ సినిమా నటి. (జ.1922) 2013: ఛాయరాజ్, కవి, రచయిత. (జ.1948) పండుగలు , జాతీయ దినాలు రైల్వే భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 20 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 19 - సెప్టెంబర్ 21 - ఆగష్టు 20 - అక్టోబర్ 20 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 21
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_21
సెప్టెంబర్ 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 264వ రోజు (లీపు సంవత్సరములో 265వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 101 రోజులు మిగిలినవి. సంఘటనలు 2013: తెలంగాణ రచయితల సంఘం రెండవ సదస్సు కరీంనగర్‌లో ప్రారంభమైంది. జననాలు 1862: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (మ.1915) 1898: అద్దంకి శ్రీరామమూర్తి, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, సంగీత విశారదుడు. (మ.1968) 1921: భూపతి నారాయణమూర్తి, స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త, హేతువాది, దళితవాద రచయిత 1927: గురజాడ కృష్ణదాసు వెంకటేష్, దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు. (మ.1993). 1931: సింగీతం శ్రీనివాసరావు, భారతీయ సినిమా దర్శకుడు. 1939: రంగనాయకమ్మ, రచయత్రి. 1944: ఎమ్వీయల్. నరసింహారావు, సాహితీవేత్త, సినిమా నిర్మాత. (మ.1986). 1947: స్టీఫెన్ కింగ్, కింగ్ ఆఫ్ హారర్ గా పేరుపొందిన అమెరికన్ రచయిత. 1955: గుల్షన్ గ్రోవర్, బాలీవుడ్, హాలీవుడ్ నటుడు,నిర్మాత 1957: కెవిన్ రడ్డ్, ఆస్ట్రేలియా 26 వ ప్రధానమంత్రి. 1963: కర్ట్‌లీ ఆంబ్రోస్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1964: సుధా చంద్రన్ , భరత నాట్య నృత్యకారిని.చలనచిత్ర నటి, టీ.వి.నటి. 1966: బి.వి.వి.ప్రసాద్, కవి. 1979: క్రిస్ గేల్, వెస్టీండీస్ క్రికెట్ క్రీడాకారుడు. 1981: రిమీసేన్ , హిందీ, తెలుగు, బెంగాలీ, చిత్రాల నటి. 1985: క్రిస్ అలెన్, అమెరికా గాయకుడు, గేయరచయిత. 1991: నాగరాజు కువ్వారపు, వర్ధమాన సినీ గేయరచయిత. 2003: కృతి శెట్టి , తెలుగు సినీ నటి. మరణాలు thumb|1 Maharaja Sawai Jai Singh II ca 1725 Jaipur. British museum 1743: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (జ.1688) 1832: సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ నవలా రచయిత. (జ.1771) 1969: స్వామి జ్ఞానానంద, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరులు, భౌతిక శాస్త్రవేత్త 1985: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి , నాటక,సినీ గేయ రచయిత (జ.1934 1994: రామకృష్ణ బజాబ్, భారత పారిశ్రామికవేత్త. 2011: తుమ్మల వేణుగోపాలరావు, విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928) 2012: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు. (జ.1915) పండుగలు , జాతీయ దినాలు బయోస్ఫియర్ దినం. అంతర్జాతీయ శాంతి దినోత్సవం ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 21 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 20 - సెప్టెంబర్ 22 - ఆగష్టు 21 - అక్టోబర్ 21 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 22
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_22
సెప్టెంబర్ 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 265వ రోజు (లీపు సంవత్సరములో 266వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 100 రోజులు మిగిలినవి. సంఘటనలు 1953 - జననాలు 1791: మైకేల్ ఫెరడే, ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త. (మ.1867) 1841: ముడుంబ నృసింహాచార్యులు, సంస్కృతాంధ్ర కవి (జ. 1927 సెప్టెంబరు 22). 1919: నందగిరి ఇందిరాదేవి, స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలితరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు. (మ.2007) 1927: బి.గోపాలం , తెలుగు సంగీత దర్శకుడు(మ.2004) 1930: ప్రతివాది భయంకర శ్రీనివాస్, చలనచిత్ర నేపథ్యగాయకుడు. (మ.2013) 1931: పి.నర్సారెడ్డి, స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. 1936: విజయ బాపినీడు , చలన చిత్ర దర్శకుడు, ఇండియన్ ఫిల్మ్ పత్రికా సంపాదకులు, బొమ్మరిల్లు, విజయ, నీలిమ, పత్రికా సంపాదకులు.(మ.2019) 1948: మల్లాది గోపాలకృష్ణ, రంగస్థల నటుడు, దర్శకుడు, రూపశిల్పి, నటశిక్షణ అధ్యాపకులు. 1969: శాంతి ప్రియ , తెలుగు, తమిళ, హిందీ ,చిత్రాల నటి . 1970: శ్రీనివాస్ గద్దపాటి, కవి, ఉపాధ్యాయుడు. 1987:ఉన్ని ముకుందన్ , మలయాళ,తమిళ, తెలుగు, నటుడు . మరణాలు 1927: ముడుంబ నృసింహాచార్యులు, సంస్కృతాంధ్ర కవి (జ. 1841 సెప్టెంబరు 22). 1952: అడివి బాపిరాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. (జ.1895) 2004: బొడ్డు గోపాలం, తెలుగు సినిమా సంగీత దర్శకులు. (జ.1927) 2009: ఎస్.వరలక్ష్మి, తెలుగు సినిమా నటీమణి, గాయని. (జ.1927) పండుగలు , జాతీయ దినాలు క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం. గులాబీల దినోత్సవం . ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 22 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 21 - సెప్టెంబర్ 23 - ఆగష్టు 22 - అక్టోబర్ 22 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 23
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_23
సెప్టెంబర్ 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 266వ రోజు (లీపు సంవత్సరములో 267వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 99 రోజులు మిగిలినవి. సంఘటనలు 2009: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట నుంచి ఓషన్ శాట్-2, మరో 6 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. 2009 నుంచి, HP ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్‌' గా EDS మార్కెట్ కార్యకలాపాలు మొదలుపెట్టింది, ' జననాలు thumb|అంబటి రాయుడు 1886: దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (మ.1966) 1893: బులుసు అప్పన్నశాస్త్రి, తర్కశాస్త్ర పారంగతులు. 1902: స్థానం నరసింహారావు, రంగస్థల నటుడు. (మ.1971) 1914: ఒమర్ అలీ సైఫుద్దీన్ 3, బ్రూనై దేశపు 28వ సుల్తాన్. (మ.1986) 1917: అసీమా చటర్జీ, భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (మ.2006) 1922: ఈమని శంకరశాస్త్రి, వైణికుడు. (మ.1987) 1926: బాచు అచ్యుతరామయ్య రంగస్థల నటుడు, రాజకీయ నాయకుడు, క్రీడాకారుడు. (మ.2018) 1934: పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త. (మ.2008) 1939: కందుల వరాహ నరసింహ శర్మ, రచయిత. 1943: తనుజ, ఒక భారతీయ నటి 1957: కుమార్ సాను, గాయకుడు. 1972: కోరుకంటి చందర్ తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. 1979 : భాస్కర్, తెలుగు చలనచిత్ర దర్శకుడు, చిత్రానువాదకుడు, రచయిత . 1985: అంబటి రాయుడు, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు. 1993: షాలిని పాండే, తెలుగు చలనచిత్ర నటి. మరణాలు 1939: సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1856) 1973: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1904) 1974: జయచామరాజ వడయార్‌ బహదూర్‌, మైసూర్‌ సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (జ.1919) 1996: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి. (జ.1960) 2010: కె.బి. తిలక్, స్వాతంత్ర్య సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (జ.1926) 2010: భావరాజు సర్వేశ్వరరావు, భారత ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త. (జ.1915) 2019: అత్తిలి లక్ష్మి, తెలుగు చిత్రాల సహాయ నటీ 2020: కోసూరి వేణుగోపాల్, టెలివిజన్, సినిమా నటుడు. పండుగలు , జాతీయ దినాలు -డాటర్స్ డే అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం . బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 23 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 22 - సెప్టెంబర్ 24 - ఆగష్టు 23 - అక్టోబర్ 23 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 24
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_24
సెప్టెంబర్ 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 267వ రోజు (లీపు సంవత్సరములో 268వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 98 రోజులు మిగిలినవి. సంఘటనలు 1932: భారత్లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య పూనా ఒప్పందం కుదిరింది. 2007: మొట్టమొదటి ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్ ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ పై విజయం సాధించింది. జననాలు 1921: ధూళిపాళ సీతారామశాస్త్రి, ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. (మ.2007) 1923: కొరటాల సత్యనారాయణ, ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు. (మ.2006) 1931: మోతే వేదకుమారి, భారత పార్లమెంటు సభ్యురాలు, గాయని. ఆకాశవాణి గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి. 1940: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (మ.1994) 1945: డా. తిరునగరి రామానుజయ్య, సాహితీవేత్త, పద్యకవి. (మ. 2021) 1946: రమోల, తెలుగు గాయనీ, రంగస్థల నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్. 1950: మోహిందర్ అమర్‌నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1961: కుడుముల పద్మశ్రీ, నెల్లూరు లోక్‌సభ సభ్యుడు. 1966: అతుల్ బెదాడే, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1972: శ్రీను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు. 1974: పార్థ సారథి, తెలుగు చలన చిత్ర గాయకుడు . మరణాలు 1975: చక్రపాణి, బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు. (జ.1908) 1992: సర్వ్ మిత్ర సిక్రి, భారతదేశ సుప్రీంకోర్టు పదమూడవ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1908) 2004: రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (జ.1929) 2010: సింహాద్రి సత్యనారాయణ, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. (జ.1929) 2012: అశ్వని, తెలుగు, తమిళ సినిమా నటి. పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ హృదయ దినోత్సవం. ప్రపంచ నదుల దినోత్సవం. (సెప్టెంబర్ నెల చివరి ఆదివారం) ఎన్.ఎస్.ఎస్ దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 24 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 23 - సెప్టెంబర్ 25 - ఆగష్టు 24 - అక్టోబర్ 24 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 25
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_25
సెప్టెంబర్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 268వ రోజు (లీపు సంవత్సరములో 269వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 97 రోజులు మిగిలినవి. సంఘటనలు జననాలు 1849: దంపూరు వెంకట నరసయ్య - నేటివ్ అడ్వొకేట్, నెల్లూరు పయొనీర్, పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్ర భాషా గ్రామవర్తమాని అనే పత్రికల సంపాదకుడు. (మ.1909) 1920: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (మ.2002) 1924:ఎ.బి.బర్థన్, భారత కమ్యూనిష్ఠు పార్టీ సీనియర్ నాయకుడు. (మ.2015) 1939 : భారతీయ నటుడు, హిందీ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ జననం (మ.2009). 1948: రేమెళ్ళ అవధానులు, తెలుగు శాస్త్రవేత్త. 1948: భూపతిరాజు సోమరాజు, పేరొందిన గుండె వ్యాధి నిపుణుడు, కేర్ హాస్పిటల్ హెడ్, ఛైర్మన్. 1969: కాథరిన్ జీటా-జోన్స్, ఒక వెల్ష్ నటీమణి 1974: ఎ.ఆర్. మురుగ దాస్, తమిళ, తెలుగు, హిందీ, చిత్ర దర్శకుడు. మరణాలు 1955: రుక్మాబాయి రావత్, బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (జ.1864) 1958: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘసంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (జ.1877) 1985: చెలికాని రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, 1వ లోక్‌సభ సభ్యుడు. (జ.1901) 2005: ఎ.వెంకోబారావు, సైక్రియాట్రిస్ట్. (జ.1927) 2019: వేణుమాధవ్ తెలుగు సినిమా హాస్యనటుడు, మిమిక్రీ ఆర్టిస్టు (జ.1969) 2020 :ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం, గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ( జ.1946) పండుగలు , జాతీయ దినాలు వరల్డ్ ఫార్మసిస్ట్- డే ప్రపంచ కుమార్తెల దినోత్సవం . అంత్యోదయ దివస్ బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 25 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 24 - సెప్టెంబర్ 26 - ఆగష్టు 25 - అక్టోబర్ 25 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 26
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_26
సెప్టెంబర్ 26, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 269వ రోజు (లీపు సంవత్సరములో 270వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 96 రోజులు మిగిలినవి. సంఘటనలు 2018 - కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి పిన్నవయస్కుడు అనీష్‌ భన్వాలా. జననాలు thumb|చిలకమర్తి లక్ష్మీనరసింహం 1820: ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌, బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు. (మ.1891) 1829: లెవీ స్ట్రాస్, అమెరికా పారిశ్రామికవేత్త. (మ.1902) 1867: చిలకమర్తి లక్ష్మీనరసింహం, తెలుగు రచయిత. (మ.1946) 1899: ఎన్.ఎం.జయసూర్య, హోమియోపతీ వైద్యుడు, సరోజినీ నాయుడు కుమారుడు. (మ.1964) 1906: కాట్రగడ్డ బాలకృష్ణ, అసాధారణ మేధావి. (మ.1948) 1907: ఆమంచర్ల గోపాలరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, చరిత్రకారుడు, చలనచిత్ర దర్శకుడు. (మ.1969) 1912: కొండూరు వీరరాఘవాచార్యులు తెలుగు సాహితీవేత్త, పండితుడు (మ.1995) 1923: దేవానంద్, హిందీ చలనచిత్ర నటుడు. (మ.2011) 1932: 13వ భారత ప్రధాని మన్మోహన్ సింగ్. పుట్టిన చోటు పంజాబ్ లోని గాహ్ (ఇప్పుడు చక్వాల్ జిల్లా, పాకిస్తాన్లో ఉంది). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు). (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు). 1949: డా. దివాకర్, రోగాలకు మందులేయాల్సిన మనిషి రంగస్థలం తన నివాసమన్నాడు. నాడి పట్టుకోవలసిన వైద్యుడు నాటకాల్లో వేషాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. 1960: గస్ లోగీ, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1962: అర్చన పురాణ సింగ్ , భారతీయ నటి , టీ.వి.వ్యాఖ్యాత , బాలీవుడ్ హాస్య నటి. 1991: మదాలస శర్మ , భారతీయ సినీ నటీ. మరణాలు 1947: బంకుపల్లె మల్లయ్యశాస్త్రి, సంఘసంస్కర్త, రచయిత, పండితుడు (జ.1876) 1966: అట్లూరి పిచ్చేశ్వర రావు, కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త. (జ.1925) 1999: పి. సుదర్శన్ రెడ్డి, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. 2008: పాల్ న్యూమాన్, అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, సాహసికుడు, మానవతావాది. (జ.1925) పండుగలు , జాతీయ దినాలు -ఈక్వెడార్ జాతీయ పతాక దినోత్సవం. -యెమెన్ రెవల్యూషన్ డే. -చెవిటి వారి దినోత్సవం. యూరోపియన్ భాషల దినోత్సవం ప్రపంచ గర్బ నిరోధక దినోత్సవం . బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 26 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 25 - సెప్టెంబర్ 27 - ఆగష్టు 26 - అక్టోబర్ 26 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 27
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_27
సెప్టెంబర్ 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 270వ రోజు (లీపు సంవత్సరములో 271వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 95 రోజులు మిగిలినవి. సంఘటనలు 1821: మెక్సికో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందినది. 1962: రేచెల్ కార్సన్ రచించిన పర్యావరణ విజ్ఞాన పుస్తకం సైలెంట్ స్ప్రింగ్ వెల్వడించబడింది. ఈ పుస్తకం పురుగుమందుల విచ్చలవిడి వాడకం వల్ల కలిగే పర్యావరణ హానిని ప్రపంచానికి తెలియజేసింది. 1989: భారతదేశ మొదటి ఐ ఆర్ బి ఎమ్, ఒరిస్సా నుండి పృథ్విని రెండవసారి విజయవంతంగా ప్రయోగించారు. 1998: గూగుల్ తన పుట్టిన రోజుని ఈ రోజుగా పేర్కొంది. 2002: జూల అనే సెనెగల్ ఓడ, గాంబియా తీరం దగ్గర బోల్తా కొట్టడంతో సుమారు 1900 మంది (టైటానిక్ కంటే ఎక్కువ మంది) మరణించారు. 2008: చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది. 2008: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితుడైనాడు. 2013: భారతదేశంలోని ముంబైలో భవనం కూలిన తర్వాత 60 మంది మరణించారు. 2018: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నిబంధనల ప్రకారం 158 సంవత్సరాల పాత నిబంధన, సెక్షన్ 497, వివాహేతర సంబంధం చట్టవిరుద్ధం, ఎందుకంటే ఇది మహిళల పట్ల వివక్షతో కూడుకున్నది. 2020: వివాదాస్పద నాగోర్నో-కరబఖ్ సరిహద్దు వద్ద అర్మేనియా, అజర్బైజాన్‌ల మధ్య భారీ ఘర్షణ చెలరేగి 2020 నవంబరు దాకా కొనసాగింది. జననాలు thumb|కొండా లక్ష్మణ్ బాపూజీ 1873: విఠల్ భాయ్ పటేల్, శాససభ్యుడు ఇంకా రాజకీయ నేత. 1898: కుందూరి ఈశ్వరదత్తు, పాత్రికేయుడు. ది లీడర్ ఆంగ్ల దినపత్రిక ప్రధాన సంపాదకుడు. (మ.1967) 1909: ముప్పవరపు భీమారావు, రంగస్థల నటుడు. (మ.1969) 1915: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు. (మ.2012). 1924: పరవూర్ గోవిందన్ దేవరాజన్, ఒక భారతీయ సంగీత స్వరకర్త. 1924: సంధ్య (వేదవల్లి) తెలుగు,తమిళ, చిత్రాల నటి. ఈమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తల్లి . (1971). 1926: గరికపాటి వరలక్ష్మి జన్మించారు. ఈమె ప్రముఖ తెలుగు, తమిళ నటి, గాయని ఇంకా దర్శకురాలు. 1932: యష్ చోప్రా జన్మించారు. ఈయన హిందీ చిత్రాలలో పనిచేసిన భారతీయ దర్శకుడు ఇంకా చిత్ర నిర్మాత. 1933: నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు, రంగస్థల నటుడు. (మ.2009) 1936: పర్వతనేని ఉపేంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2009) 1953: మాతా అమృతానందమయి, మానవతా కార్యక్రమాల ద్వారా ఆమె పేరొందారు. 1955: మహేష్ మహదేవన్, సంగీత దర్శకుడు (మ.2002) 1958: సుజన్ ఆర్. చినోయ్, మాజీ భారత దౌత్యవేత్త ప్రస్తుత మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. 1961: మాథ్యూ టి. థామస్, భారతీయ రాజకీయవేత్త ఇంకా శాసనసభ సభ్యుడు. 1968: రాహుల్ దేవ్ భారతీయ సినీ నటుడు ఇంకా మాజీ మోడల్. 1974: రక్షందా ఖాన్, భారతీయ మోడల్, టెలివిజన్ నటి ఇంకా యాంకర్.. 1984: గాయత్రి జయరామన్, తమిళ, తెలుగు, కన్నడ,మలయాళ చిత్రాల నటి. మరణాలు 1719: జార్జ్ స్మాల్రిడ్జ్, బ్రిస్టల్ ఇంగ్లీష్ బిషప్. (జ.1662) 1833: రాజా రామ్మోహన రాయ్, భారత సాంస్కృతిక ఉద్యమ పితామహుడు (జ.1772). 1933: కామిని రాయ్, బెంగాలీ కవియత్రి, సామాజిక కార్యకర్త ఇంకా బ్రిటిష్ భారతదేశపు స్త్రీవాది. (జ.1864) 1939: దాసు విష్ణు రావు, న్యాయవాది. (జ.1876) 1972: షియాలి రామామృత రంగనాథన్, భారతదేశానికి చెందిన లైబ్రేరియన్ ఇంకా గణిత శాస్త్రవేత్త. (జ.1892) 1996: నజీబుల్లా, అప్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు (జ.1947). 1997: మండలి వెంకటకృష్ణారావు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి (జ.1926). 2001: కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రి (జ.1920). 2004: శోభ గుర్టు, తేలికపాటి హిందుస్తానీ శాస్త్రీయ శైలిలో భారతీయ గాయని. (జ.1925) 2009: రమేష్ బాలశేఖర్, దివంగత శ్రీ నిసర్గదత్త మహారాజ్ శిష్యుడు ఇంకా అలాగే ప్రఖ్యాత అద్వైత మాస్టర్. (జ.1917) 2020: జస్వంత్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు (జ.1938) పండుగలు , జాతీయ/దినాలు ప్రపంచ పర్యాటక దినోత్సవం: 1980 నుండి సెప్టెంబర్ 27ను ప్రపంచ పర్యాటక దినంగా United Nations World Tourism Organization (UNWTO) ప్రకటించింది. ప్రపంచ పర్యాటక రంగంలో ఇది ఒక మైలురాయిగా అభివర్ణిస్తారు. ప్రపంచ దేశాల మధ్య సాంఘిక, రాజకీయ, ఆర్థిక, జీవన విధానాల మీద అవగాహన దీని ముఖ్య ఉద్దేశం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 27 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 26 - సెప్టెంబర్ 28 - ఆగష్టు 27 - అక్టోబర్ 27 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 28
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_28
సెప్టెంబర్ 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 271వ రోజు (లీపు సంవత్సరములో 272వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 94 రోజులు మిగిలినవి. సంఘటనలు 1745: బ్రిటన్ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది కింగ్' మొదటిసారిగా పాడిన రోజు. 1837: బహదూర్ షా- II సింహాసనాన్ని అధిష్టించాడు. అతని తండ్రి అక్బర్ షా- II మరణం తరువాత 62 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ చక్రవర్తి అయ్యాడు. 1908: మూసీ నది వరదల వల్ల హైదరాబాదులో భారీగా ఆస్తినష్టం జరిగింది. 1924: ఢిల్లీలో జరుగుున్న అలర్లు ఆగలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు మహాత్మా గాంధీ. 1928: పెన్సిలిన్ను అనుకోకుండా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నారు. 1954: హైదరాబాదు తూర్పు ప్రాంతంలో వరద దెబ్బతిన్న వంతెనపై నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి 137 మంది మరణించారు 1984: తొలిసారి భారతదేశంలో ఫ్లడ్లైట్స్ క్రింద క్రికెట్ మ్యాచ్ జరిగింది. న్యూ ఢిల్లీలో ఆస్ట్రేలియా ఇండియా నడుమ జరిగిన మ్యాచ్ను ఫ్లడ్లైట్స్ క్రింద ఆడారు. 1985: భారతదేశంలో మొదటిసారి తెరచాప పడవలో భూగోళాన్ని చుట్టే గుఱితో భారతీయ సేన జట్టు బొంబాయి నుండి తృష్ణ అనే చిన్నోడలో బయలుదేరింది.(పూర్తి 10-1-87) 1993: కరకాస్ జాతీయ రహదారి క్రింద గ్యాస్ పైపు పేలి 58 మంది ప్రాణాలు కోల్పోయారు. 1996: ఆస్తుల కేసులో సుఖ్ రామ్ తీహార్ జైలుకు పంపబడ్డాడు. 2008: అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది. 2013: పాలమూరు (మహబూబ్‌నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ భారీ "తెలంగాణ ప్రజాగర్జన" బహిరంగ సభ నిర్వహించబడింది. 2016: యూరీలో ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదులు దాడులు జరిపినందుకు పగసనదీర్పుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్-2 అనే దాడి జరిపింది. జననాలు thumb|Lata Mangeshkar - still 29065 crop 0551 క్రీ.పూ.: కన్ఫ్యూషియస్, కన్ఫ్యూషియస్ మత స్థాపకుడు. (మ.0479 క్రీ.పూ.). 1835: షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు, సాధువు, ఫకీరు. (మ.1918) 1895: గుర్రం జాషువా, ప తెలుగు కవి. (మ.1971) 1907: భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1931) 1909: పైడి జైరాజ్, భారత సినీరంగ నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.2000) 1915: స్థానాపతి రుక్మిణమ్మ, సంస్కృతాంధ్ర పండితురాలు, రచయిత్రి. 1929: లతా మంగేష్కర్, గాన కోకిల. (మ. 2022) 1946: మాజిద్ ఖాన్, భారతీయ- పాకిస్థానీయ క్రికెటర్. 1965: కవిత , తెలుగు,తమిళ చిత్రాల నటి. 1966: పూరి జగన్నాథ్, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. 1969: వేణు మాధవ్ , తెలుగు సినీ నటుడు .(2019) 1982: అభినవ్ బింద్రా, తొలి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న భారతీయ గురిపందెం ఆటగాడు. 1982: రణబీర్ కపూర్, హిందీ సినీ నటుడు, నిర్మాత. మరణాలు 1895: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (జ.1822) 1940: పండిత్ సుందర్ లాల్ శర్మ, "ఛత్తీస్‌గఢ్ గాంధీ", స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త (జ.1881) 1968: కూర్మాపు నరసింహం, చిత్రకారుడు. 1973: ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప భాషా శాస్త్రవేత్త. (జ.1890) 1980: రావాడ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్‌. (జ.1911) 1991: శంకర్ గుహ నియోగి, ఛత్తీస్గఢ్ కార్మికోద్యమ నాయకుడు. 1994: వెల్దుర్తి మాణిక్యరావు, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు. (జ.1912) 2004: ముల్క్ రాజ్ ఆనంద్, భారతీయ ఆంగ్ల రచయిత. (జ.1905) 2006: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1911) 2007: పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (జ.1920) పండుగలు, జాతీయ దినాలు అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం. ప్రపంచ రేబీస్ దినోత్సవం గన్నర్స్ డే అంతర్జాతీయ సురక్షిత గర్భస్రావ దినోత్సవం ప్రపంచ నదుల దినోత్సవం .(సెప్టెంబర్ నెల చివరి ఆదివారం) బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు: సెప్టెంబర్ 28 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు పెన్సిలిన్ కనుగొన్న రోజు సెప్టెంబర్ 27 - సెప్టెంబర్ 29 - ఆగష్టు 28 - అక్టోబర్ 28 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 29
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_29
సెప్టెంబర్ 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 272వ రోజు (లీపు సంవత్సరములో 273వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 93 రోజులు మిగిలినవి. సంఘటనలు 1916: రాక్ సెల్లార్ ప్రపంచంలో తొలి బిలియనీర్గగా అవతరించారు. 1959: ఇంగ్లీషు ఛానెల్ ను 16 గంటల 20 నిమిషాలలో ఈదిన తొలి భారతీయ మహిళగా ఆరతి సాహా అయ్యారు. 1962: కలకత్తాలో బిర్లా ప్లానెటోరియం మొదలయ్యింది. 1981: భారత విమానం బోయింగ్-737ను ఖలిస్తాన్ తీవ్రవాదులు లాహోర్‌కు హైజాక్ చేశారు. 2002: 14వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని బుసాన్ లో ప్రారంభమయ్యాయి. 2009: అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ 75 కేజీల వర్గంలో బిజేందర్ కుమార్ కి మొదటి స్థానం దక్కింది. 2011: దళితులపై అఘాయిత్యాలకు పాల్పడిన 269 మంది అధికారులను, వారిలో అత్యాచార‌ ఆరోపణ రుజువయ్యిన 17 మందిని వాచ్చాతి కేసులో‌ ధర్మపురి జిల్లా సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. జననాలు 1725: రాబర్ట్ క్లైవ్, బెంగాల్ ప్రెసిడెన్సీ బ్రిటీష్ గవర్నర్ జనరల్‌.(మ.1774) 1899: లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త. (మ.1985) 1901: ఎన్ రికో ఫెర్మి, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.1954). 1928: బ్రజేష్ మిశ్రా, భారతీయ దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు, తొలి జాతీయ భద్రతా సలహాదారుడు (మ. 2012) 1932: మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు (మ.2004). 1943: లే'క్ వాలెన్సా, శాంతి నోబెల్ బహుమతి గ్రహీత, మాజీ పోలెండ్ అధ్యక్షుడు. 1945: బాలి (చిత్రకారుడు), మంచి చిత్రకారులలో ఒకడు. ఈయన వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశాడు. ఈయన అసలు పేరు ఎం. శంకర రావు. 1947: మతుకుమల్లి విద్యాసాగర్, రాయల్ సొసైటీకి చెందిన ఫెలో, కంట్రోల్ ధియరిస్టు. ఆయన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త. 1947: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (మ.2016) 1970: కుష్బూ, ఒక భారతీయ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. 1978: ఆశా సైనీ, మోడల్, తెలుగు, తమిళ, హిందీ,కన్నడ చిత్రాల నటి . 1985: అంజనా సౌమ్య, జానపద, సినీ గాయని, మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది 1990: శ్రద్దా శ్రీనాథ్, భారతీయ చలనచిత్ర నటి, మోడల్. మరణాలు 1913: రుడాల్ఫ్ డీజిల్, డీజిల్ ఇంజన్ ఆవిష్కర్త 1920: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకుడు (జ.1872). 1977: కొలచల సీతారామయ్య, ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణుడు (జ.1899). 2007: కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (జ.1920) 2008: జాగర్లమూడి వీరాస్వామి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ గా, కులనిర్మూలన సంఘ అధ్యక్షునిగా చేశాడు (జ.1919). 2008: పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త (జ.1934). 2008: సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ, ఎం.ఐ.ఎం పార్టీ నాయకుడు. (జ.1931) 2013: సత్యనారాయణ గోయెంకా, విపశ్యనా ధ్యాన గురువు.(జ.1924). 2014: పైడి తెరేష్ బాబు, కవి (జ.1963). 2017: టామ్ ఆల్టర్, హిందీ సినిమా నటుడు (జ.1950). 2020: కె.సి.శివశంకరన్, "శంకర్"గా సుపరిచితుడైన చిత్రకారుడు. (జ.1924) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ హృదయ దినోత్సవం అంతర్జాతీయ ఆహార నష్టం, వ్యర్థాల అవగాహన దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 29 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు సెప్టెంబర్ 28 - సెప్టెంబర్ 30 - ఆగష్టు 29 - అక్టోబర్ 29 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 26
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_26
ఏప్రిల్ 26, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 116వ రోజు (లీపు సంవత్సరములో 117వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 249 రోజులు మిగిలినవి. సంఘటనలు 1916 : అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు. 1986 : అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది. 2012 : హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. జననాలు 570: మహమ్మదు ప్రవక్త, ఇస్లాం మతస్థాపకుడు (మ. 632) 1762: శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (మ.1827) 1908: సర్వ్ మిత్ర సిక్రి, భారతదేశ సుప్రీంకోర్టు పదమూడవ ప్రధాన న్యాయమూర్తి. (మ. 1992) 1914: ఆర్.సుదర్శన్ ,సంగీత దర్శకుడు (మ.1991) 1931: గణపతి స్థపతి స్థపతి, వాస్తుశిల్పి. (మ.2017) ) 1932: ఎం: రంగారావు , కన్నడ,తెలుగు సంగీత దర్శకుడు (మ 1990) 1942: కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (మ.2017) 1955: కొమరవోలు శివప్రసాద్, సంగీతకారులు ఈలపాటలో పేరొందినవారు. 1968: సురేష్ పీటర్, గాయకుడు 1973: సముద్ర ఖని , తమిళ తెలుగు, మళయాళ, చిత్ర దర్శకుడు, నటుడు, గాయకుడు మరణాలు thumb|శ్రీనివాస రామానుజన్ 1748: మొహమ్మద్ షా 12వ మొఘల్ చక్రవర్తి (జ.1702) 1920: శ్రీనివాస రామానుజన్, భారతీయ గణితవేత్త. (జ.1887) 1987: శంకర్, సంగీత దర్శకుల ద్వయం శంకర్ జైకిషన్. పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం. సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 26 . ఏప్రిల్ 25 - ఏప్రిల్ 27 - మార్చి 26 - మే 26 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 27
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_27
ఏప్రిల్ 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 117వ రోజు (లీపు సంవత్సరములో 118వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 248 రోజులు మిగిలినవి. సంఘటనలు 1908 : నాలుగవ ఒలింపిక్ క్రీడలు లండన్లో ప్రారంభమయ్యాయి. 1961 : సియర్రా లియోన్ దేశానికి స్వతంత్రం లభించింది. 1994 : దక్షిణ ఆఫ్రికా దేశానికి స్వతంత్రం లభించింది. 2001 : తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయింది. జననాలు 1791: శామ్యూల్ మోర్స్, అమెరికన్ ఆవిష్కర్త, చిత్రకారుడు, మోర్స్ కోడ్ ఆవిష్కర్త, (మ. 1872) 1820: హెర్బర్ట్ స్పెన్సర్ విక్టోరియన్ శకానికి చెందిన ఒక ఆంగ్లభాషా తత్వజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు, సమాజశాస్త్రజ్ఞుడు, సాంప్రదాయకమైన ఉదారవాద రాజకీయ సిద్ధాంతవాది. (మ.1903) 1989: నిషా అగర్వాల్, తెలుగు,తమిళ,భాషల్లోనటీ మరణాలు 1974: శ్రీ రంజని , పాత తరం తెలుగు సినీ నటి (జ.1927) 1989: తమనపల్లి అమృతరావు, తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు. 2009: ఫిరోజ్ ఖాన్, హిందీ సినిమా నటుడు. (జ.1939) 2017: విను చక్రవర్తి, తమిళ హాస్యనటుడు, సినీ రచయిత, దర్శకుడు (జ.1945) 2017: వినోద్ ఖన్నా బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. (జ.1946) పండుగలు , జాతీయ దినాలు - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 27 . ఏప్రిల్ 26 - ఏప్రిల్ 28 - మార్చి 27 - మే 27 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 28
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_28
ఏప్రిల్ 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 118వ రోజు (లీపు సంవత్సరములో 119వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 247 రోజులు మిగిలినవి. సంఘటనలు 2001: డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా చరిత్రలో నిలిచాడు. జననాలు 1758: జేమ్స్ మన్రో, అమెరికా రాజకీయవేత్త, 5 వ అధ్యక్షుడు. (మ.1831) 1871: కాళ్ళకూరి నారాయణరావు, నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణకర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు. (మ.1927) 1897: భమిడిపాటి కామేశ్వరరావు, రచయిత, నటుడు, నాటకకర్త. (మ.1958) 1924: కెన్నెథ్ కౌండా, జింబాబ్వే మొదటి అధ్యక్షుడు. 1942: ఎ.జి.కృష్ణమూర్తి, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు (మ.2016) 1947: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మరిన కవి. 1947: హుమాయున్ ఆజాద్, బంగ్లాదేశ్ రచయిత. 1987: సమంత, తెలుగు, తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి. 1991: విదిశ శ్రీవాస్తవ , దక్షిణ భారత చలన చిత్ర నటి , ప్రచారకర్త . మరణాలు thumb|Benito Mussolini 1917 1740: పేష్వా బాజీరావ్ I మరాఠా సామ్రాజ్యానికి చెందిన 6వ పేష్వా. (జ.1700) 1945: ముస్సోలినీ, ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (జ.1883) 1978: మహమ్మద్ డౌద్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ మొదటి అధ్యక్షుడు. (జ. 1909) 1998 : రమాకాంత్ దేశాయ్, భారత క్రికెటర్. (జ.1939) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ భద్రతా దినోత్సవం. ఒడిషాలో లాయర్స్ దినం. ప్రపంచ పశు చికిత్సా దినం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 28 . ఏప్రిల్ 27 - ఏప్రిల్ 29 - మార్చి 28 - మే 28 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 30
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_30
ఏప్రిల్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 120వ రోజు (లీపు సంవత్సరములో 121వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 245 రోజులు మిగిలినవి. సంఘటనలు 1946: మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు. 1975: దక్షిణ వియత్నాం (సైగాన్) ఉత్తర వియత్నాం దేశానికి లొంగిపోయి వియత్నాం యుద్ధానికి ముగుంపు పలికింది. 1986: ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. 2023: హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ను ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించాడు. జననాలు 1777: కార్ల్ ఫ్రెడ్రిచ్ గాస్, జర్మన్ గణిత శాస్త్రవేత్త. (మ.1855) 1870: దాదాసాహెబ్ ఫాల్కే, చలనచిత్ర దర్శకుడు. (మ.1944) 1891: గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి. శతావధాని, నాటకాలంకార సాహిత్యగ్రంథాలను పూర్తిచేశాడు. అష్టావధానాలు, శతావధానాలు అటు గద్వాల మొదలుకొని ఇటు మద్రాసు వరకు లెక్కకు మించి చేశాడు. 1901: సైమన్ కుజ్‌నెట్స్, ఆర్థికవేత్త . 1902: థియోడర్ షుల్జ్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత . 1910: శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (మ.1983) 1926: శ్రీనివాస్ ఖాలె, భారత సంగీత దర్శకుడు, (మహారాష్ట్ర) (మ.2011) 1968: దాడిచిలుక వీర గౌరీశంకర రావు, మత్తుమందు వైద్యుడు, రాజకీయ నాయకుడు. 1972: వి.ఎన్.ఆదిత్య ,రచయిత , నిర్మాత దర్శకుడు. 1979:/హరిణి, భారతీయ నేపథ్య గాయని 1987 : రోహిత్ శర్మ, భారత దేశ క్రికెట్ క్రీడాకారుడు. 1990: నందిత శ్వేత, భారతీయ చలనచిత్ర నటి మరణాలు 1030: మొహమ్మద్ ఘజనీ, ఘజనీ సామ్రాజ్య పాలకుడు. (జ. 971) 1945: అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ నియంత (జ.1889) 1957: దుర్భాక రాజశేఖర శతావధాని, లలిత సాహిత్య నిర్మాత, పండితుడు, శతావధాని. (జ.1888) 1975: కేదారిశ్వర్ బెనర్జీ, సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ రే క్రిస్టలోగ్రఫీలో నిపుణుడు. (జ.1900) 1979: అబ్బూరి రామకృష్ణారావు, పదగుంఫన అబ్బూరి ప్రత్యేక ప్రతిభ. గీతాలలో గొప్ప హుందాతనం గోచరిస్తుంది. 1983: ఆరెకపూడి రమేష్ చౌదరి, పత్రికా రచయిత. (జ.1922) 2011: దోర్జీ ఖండు, అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ. 1955) 2017: ఎంబా ఘోటో, 146 సంవత్సరాలు జీవించిన ఇండోనేషియా జాతీయుడు. (జ.1870) 2017: దూసి ధర్మారావు, తెలుగుకవి, సాహితీకారుడు, రచయిత, గీత రచయిత, సంఘసేవకుడు. 2019: ఎస్. పి. వై. రెడ్డి పార్లమెంట్ సభ్యుడు, పారిశ్రామికవేత్త (జ.1950) పండుగలు , జాతీయ దినాలు బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 30 . ఏప్రిల్ 29 - మే 1 - మార్చి 30 - మే 30 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 1
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_1
ఏప్రిల్ 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 91వ రోజు (లీపు సంవత్సరములో 92వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 274 రోజులు మిగిలినవి. సంఘటనలు 1914: ఆంధ్రపత్రిక, వారపత్రిక నుంచి దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై) . తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ( 1908 సెప్టెంబరు 9) ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1935: భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది. 1936: కళింగ లేదా ఉత్కళ్ అని పిలువబడే ఒడిషా భారతదేశంలో క్రొత్త రాష్ట్రంగా అవతరించింది. 1957: డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబరు 1958 న ప్రవేశ పెట్టారు. 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి కొలమానం (యూనిట్) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు. 1960: TIROS-1 ఉపగ్రహం టెలివిజన్ మొదటి చిత్రాన్ని అంతరాళం నుండి ప్రసారం చేసింది. 1973: పులుల సంరక్షన పథకం - కోర్బెట్ట్ నేషనల్ పార్కులో పులుల సంరక్షణా పథకాన్ని ప్రారంబించారు. 2001: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం నెదర్‌లాండ్స్. 2010 : RTE- విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం.. edit by. మాధవ చారి.. జననాలు 1578: విలియం హార్వే, రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు. (మ.1657) 1856: అకాసియో గాఅబ్రియెల్ వేగాస్, భారత దేశ ప్రముఖవైద్యుడు. (మ.1933) 1889: డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (మ.1940) 1911: ఫాజా సింగ్, భారత అథ్లెట్. 1911: ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత. (మ.1949) 1936: తరున్ గొగోయ్, భారత రాజకీయ వేత్త, అసోం ముఖ్యమంత్రి. 1941: అజిత్ వాడేకర్, భారత క్రికెటర్. 1963: వినోద్ కుమార్, ప్రముఖ సినీ నటుడు. 1972: వెంకట్ గోవాడ, రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్మాత, టి.వి., చలనచిత్ర నటుడు. 1988: లహరి గుడివాడ, రంగస్థల నటి. 1993: శ్రీదివ్య, బాల నటి గా ప్రవేశించి తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది. మరణాలు 1922: హెర్మన్ రోషాక్, స్విడ్జర్లాండ్‌కు చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1884) 1943: మైలార మహాదేవప్ప, కర్ణాటకకు చెందిన విప్లవ వీరుడు. (జ.1911) 1999: మధురాంతకం రాజారాం, రచయిత. (జ.1930) 2012: ఎన్.కె.పి.సాల్వే, భారత రాజకీయవేత్త. (జ. 1921) 2018: రాజ్యం. కె, రంగస్థల నటి. (జ.1956) 2022: శరత్ , తెలుగు చలన చిత్ర దర్శకుడు. పండుగలు, జాతీయ దినాలు ఒడిషా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. - ఇతర విశేషాలు ఏప్రిల్‌ 1ని ఏప్రిల్ ఫూల్ రోజు అంటుంటారు. thumb|డెన్మార్క్‌లో ఏప్రిల్ ఫూల్ ఇందుకు ఒక వివరణ: పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్‌లో కూడా సంవత్సరాది మార్చి మధ్యలోనే వచ్చేది. యూరప్‌లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు, వసంత కాలపు ఉత్సవాలు ఓ పది రోజుల పాటు జరిగేవి. ఏప్రిల్‌ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు లాంఛనప్రాయంగా బహుమానాలు ఇచ్చుకునేవారు. ఇలా సజావుగా జరిగిపోతూన్న జీవితాలలో ఒక పెనుమార్పు వచ్చి పడింది. అప్పటి ఫ్రాన్సు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తారీఖుకి మార్చుతూ ఒక తాఖీదు జారీ చేసేడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టెలివిజన్లు లేవు. (దండోరా వేయించి ఉంటాడు.) కాని రాజు గారి తాఖీదు అందరికీ అందలేదు. అందిన వాళ్ళు కూడా పాత అలవాట్లని గభీ మని మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా, దేశపు మూలల్లో ఏప్రిల్‌ 1 న లాంఛనప్రాయంగా బహుమానాలు ఇచ్చుకోవటం మానలేదు. అందుకని వాళ్ళని ఎగతాళికి ఏప్రిల్‌ ఫూల్స్‌ అనేవారు. పాత అలవాట్లు చావవు కదా. అందుకని ఇప్పటికీ కొంటె బహుమానాలు ఇచ్చుకోవటం, ఎగతాళి చేసుకోవటం మిగిలేయి. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 1 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు మార్చి 31 - ఏప్రిల్ 2 - మార్చి 1 - మే 1 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 2
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_2
ఏప్రిల్ 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 92వ రోజు (లీపు సంవత్సరములో 93వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 273 రోజులు మిగిలినవి. 2011: భారత్ టీం ( టీమిండియా ) 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది. జననాలు 1725: గియాకోమో కాసనోవా, వెనిస్‌కు చెందిన ఒక సాహసికుడు, రచయిత (మ. 1798) 1781: భగవాన్ స్వామినారాయణ్, భారత ఆధ్యాత్మిక గురువు (మ. 1830) 1915: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1969) 1942: వశిష్ఠ నారాయణ సింగ్, బీహారుకు చెందిన గణిత శాస్త్రవేత్త. 1969: అజయ్ దేవగన్, భారత సినీ నటుడు 1981: మఖేల్ క్లార్క్, ఆస్ట్రేలియా క్రికెటర్ మరణాలు 1872: సామ్యూల్ F. B. మోర్స్, అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త, (జ. 1791) 1933: మహారాజా రంజిత్‌ సింహ్‌జీ, క్రికెట్ ఆటగాడు. ఈయన పేరిటే భారత్‌లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు. (జ.1872) 2023: కాస్ట్యూమ్ కృష్ణ , తెలుగు సినిమా సహాయ నటుడు , నిర్మాత .(జ.1937) పండుగలు , జాతీయ దినాలు పోలీస్ పతాక దినం. అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం. ప్రపంచ ఆటిజం అవగాహన డే. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 2. ఏప్రిల్ 1 - ఏప్రిల్ 3 - మార్చి 2 - మే 2 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 3
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_3
ఏప్రిల్ 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 93వ రోజు (లీపు సంవత్సరములో 94వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 272 రోజులు మిగిలినవి. సంఘటనలు 1984: మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలో ప్రయాణించాడు. జననాలు 1715: విలియం వాట్సన్, ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త. (మ.1787) 1914: మానెక్‌షా, భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. (మ.2008) 1917: పొందూరి వెంకట రమణారావు, మైక్రో బయాలజిస్టు. (మ.2005) 1955: హరిహరన్, భారతదేశ గాయకుడు. 1961: ఎడీ మర్ఫీ, అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత, గాయకుడు. 1962: జయప్రద, తెలుగు సినీనటి, పార్లమెంటు సభ్యురాలు. 1965: లక్ష్మీనారాయణ (సీబీఐ.జేడీ), సీబీఐ డీఐజీగా 2006 జూన్‌లో హైదరాబాదు‌లో విధుల్లో చేరారు. ఈయన సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారిన సీబీఐ హైదరాబాదు‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌. 1973: నీలేష్ కులకర్ణి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు . 1973: ప్రభు దేవా, భారతదేశ చలనచిత్ర నృత్యదర్శకుడు, నటుడు. మరణాలు thumb|RaigadFort5 1680: ఛత్రపతి శివాజీ, మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు. (జ. 1630) 2010: భండారు సదాశివరావు, రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (జ.1925) పండుగలు , జాతీయ దినాలు బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 3. ఏప్రిల్ 2 - ఏప్రిల్ 4 - మార్చి 3 - మే 3 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 4
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_4
ఏప్రిల్ 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 94వ రోజు (లీపు సంవత్సరములో 95వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 271 రోజులు మిగిలినవి. సంఘటనలు 1818: అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13 చారలు, 20 నక్షత్రాల జాతీయ జండాను నిర్ధారించింది. 1905: కాంగ్రా భూకంపంలో 20,000 మంది ప్రజలు మరణించారు. 1969: డా.డెంటన్ కూలీ మొట్టమొదటి కృత్రిమ హృదయాన్ని ఉపయోగించారు. 1975: మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది. జననాలు 1942: చల్లా సత్యవాణి, ఆధ్యాత్మిక తెలుగు రచయిత్రి. 1944: చిలుకూరి రామచంద్రారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. (మ. 2023) 1976: సిమ్రాన్ తెలుగు, తమిళం సినిమాలలో పేరొందిన కథానాయిక. మరణాలు thumb|మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1841: విలియం హెన్రీ హారిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు . 1919: సర్ విలియం క్రూక్స్, ఇంగ్లీష్ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. (జ. 1832) 1932: విలియం ఆస్ట్వాల్డ్, జర్మన్ రసాయన శాస్త్రవేత్త. (జ. 1853) 1948: రాజా నర్సాగౌడ్, సంఘసేవకుడు, మహాదాత. (జ.1866) 1968: మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికాకు చెందిన పాస్టర్, ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు (జ.1929) 1979: అబ్బూరి రామకృష్ణారావు, భావకవి 1991: గ్రాహం గ్రీన్, బ్రిటీష్ రచయిత. 2013 : రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు. పండుగలు , జాతీయ దినాలు గనుల అవగాహన దినోత్సవం - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 4. ఏప్రిల్ 3 - ఏప్రిల్ 5 - మార్చి 4 - మే 4 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 5
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_5
'ఏప్రిల్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 95వ రోజు (లీపు సంవత్సరములో 96వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 270 రోజులు మిగిలినవి. సంఘటనలు 1957 : భారతదేశంలో కేరళలో మొదటిసారిగా కమ్యూనిస్టులు విజయం సాధించారు.ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు. జననాలు 1892: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు. (మ.1971) 1908: జగ్జీవన్ రాం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. 1918: ఇటికాల మధుసూదనరావు, యవ్వనప్రాయంలోనే ఆర్యసమాజ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు 1937: చేగొండి వెంకట హరిరామజోగయ్య, భారత మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగు సినిమా నిర్మాత 1942: క్రాంతి కుమార్ , నిర్మాత,దర్శకుడు (మ.2003) 1950: ప్రబోధానంద యోగీశ్వరులు, ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, అర్ధ శతాధిక గ్రంథకర్త. 1979: బిత్తిరి సత్తి, టెలివిజన్ వ్యాఖ్యాత, సినీ నటుడు. 1985: పూనమ్ బజ్వా , భారతీయ సినీ నటీ. 1993: కళ్యాణి ప్రియదర్శన్ , భారతీయ చలనచిత్ర నటి. 1996: రష్మికా మందన్న , భారతీయ సినీ నటీ . మరణాలు thumb|కుడి|దివ్యభారతి 1959: అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, తెలుగు కవి, పండితుడు. (జ. 1888) 1974: శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి, సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు 1993 : దివ్యభారతి, ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి. (జ. 1974) 2018: చంద్రమౌళి, తెలుగు సినిమానటుడు. పండుగలు , జాతీయ దినాలు నేషనల్ మారిటైమ్ డే. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 5. ఏప్రిల్ 4 - ఏప్రిల్ 6 - మార్చి 5 - మే 5 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఆరవీడు వంశం
https://te.wikipedia.org/wiki/ఆరవీడు_వంశం
ఆరవీటి వంశము విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన వంశాల్లో నాలుగవది, చివరిదీను. ఇది తెలుగు వంశము. వీరి వంశానికి ఆ పేరు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం తాలూకాలోని ఆరవీడు గ్రామం పేరు మీదుగా వచ్చింది. వీరు అధికారికంగా 1571 నుండి సామ్రాజ్యాన్ని పాలించినా, వీరనరసింహ రాయలు కాలం నుంచే సైన్యంలో ప్రముఖ పాత్ర పోషించారు. పరిచయము భారతదేశ చరిత్రలోనే ఒకానొక కీలకమైన, నిర్ణయాత్మకమైనదిగా చరిత్రకారులు భావించే యుద్ధం, రాక్షసి తంగడి యుద్ధం (తళ్ళికోట యుద్ధం). ఈ యుద్ధంతోనే విజయనగర మహాసామ్రాజ్యం పతనమైపోయింది. విజయనగర సామ్రాజ్యానికి ప్రధాన లక్షణాలైన వ్యవసాయం, వ్యాపారం, విదేశీ వాణిజ్యం, కళలు, సాహిత్యం అన్నీ చారిత్రిక అవశేషాలుగా మిగిలిపోయినాయి. ప్రపంచంలో ఏ నగరంలోనూ జరగనంత విధ్వంసం జరిగింది. ఈ అరాచకాలు, అల్లకల్లోలాలు సుమారు అయిదు నెలలపాటు కొనసాగినాయి. ముస్లిం సుల్తానులంతా ఏకమై ఓడించి విజయనగర సామ్రాజ్యపతనం చూసి సంబరపడ్డారు. కానీ, వారు తిరిగి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవటాన్ని అదనుగా భావించిన మొగల్ రాజ్యపాలకులు దాడి చేసి వారిని సులభంగా జయించారు. ఆరవీటి వంశము విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన నాలుగవ, చివరి వంశము. ఆరవీటి వంశము తెలుగు వంశము. రామరాయల మరణాంతరం పెనుగండ పారిపోయిన తిరుమల రాయలు పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలించాడు. అతను అరవీటి వంశస్థుడు. కనక అతని పాలనతో అరవీటి వంశ పాలన ప్రారంభమయింది. అరవీటి వంశస్తుల స్వస్థలం కర్నూలు జిల్లా ఆరెవీడు. కనక వారి వంశానికి ఆరవీటి వంశం అని పేరు వచ్చింది.ఈ వంశానికి మూలపురుషుడు ఆరవీటి సోమరాజు. విజయనగరపాలకులకు సామంతులు. సాళువనరసింహరాయల కాలంలో ఆరవీటి తిమ్మరాజు నరసింహరాయల వద్ద సేనాధిపతిగా పనిచేశారు. తిమ్మరాజుకు రామరాయలు, వెంకటాద్రి రాయలు, తిరుమలరాయలు అని ముగ్గురు కుమారులు.వారిలో రామరాయలు, వెంకటాద్రి రాయలు తళ్ళికోట యుద్ధంలో మరణించారు. వారి మరణం తరువాత తిరుమలరాయలు సదాశివ రాయలను వెంటబెట్టుకుని పెనుగొండకు పారిపోయాడు. అయిదు నెలలపాటు జరిగిన విధ్వంసం తరువాత విజయనగరానికి తిరిగివచ్చి పునర్నిర్మించటానికి ప్రయత్నించారు... కానీ సుల్తానుల దాడుల వల్ల బాగు చేయలేనంతగా ధ్వంసం అయిన విజయనగరాన్ని బాగుచేయలేమని గ్రహించి....విజయనగరాన్ని వారికి ఒదిలేయక తప్పిందికాదు... తిరుమలరాయలు (1570 - 1572) ఇతను సామ్రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించి ఆ ప్రాంతాలకు తన కుమారులను ప్రతినిధులుగా ఉంచాడు. తిరుపతి, కంచి, శ్రీరంగంలలో ఉన్న దేవాలయాలకు మరమ్మత్తులు చేయించాడు. తిరుమలరాయలు గొప్ప సాహితీవేత్త. ఇతను స్వయంగా కవి... జయదేవుని గీతగోవిందానికి వ్యాఖ్యానం వ్రాశాడు. మొదటి శ్రీరంగదేవరాయలు (1572 - 1585) ఇతను తిరుమలరాయని పెద్దకుమారుడు. ఇరుగుపొరుగు సుల్తానుల నుంచి అనేక దాడులను ఎదుర్కొన్నాడు. తొలుత అహోబిలాన్ని పోగొట్టుకున్నప్పటికీ తిరిగీ స్వాధీనం చేసుకున్నాడు. ఇతనికి సంతానం లేకపోవడం వల్ల చంద్రగిరి రాజప్రతినిధిగా ఉన్న ఇతని తమ్ముడు రెండో వెంకటరాయలు సింహాసనం అధిష్టించాడు. రెండవ వెంకటపతిరాయలు (1585 - 1614 ) విజయనగర సామ్రాజ్యానికి చెందిన గొప్ప, శక్తివంతులైన రాజుల్లో ఇతనే చివరివాడు. ఇతను కూడా దక్కన్ ముస్లిం ల దాడికి లోనయ్యాడు. వెంకటరాయలు తన సామంతులనూ, నాయకులనూ ఒకతాటిపైకి తెచ్చి గుత్తిని ఆక్రమించుకున్నాడు. రుస్తుమ్ ఖాన్ నాయకత్వంలో వచ్చిన గోల్కొండ మొత్తం సైన్యాన్ని ఓడించి, గండికోటను ఆక్రమించుకున్నాడు. ఉదయగిరితో పాటు, కృష్ణానది వరకూ ఉన్న ప్రాంతాలు వెంకటరాయల అధికారంలోకి వచ్చినాయి. రాజ్యంలోని తిరుగుబాట్లను కూడా అణచివేశాడు. మొగల్ చక్రవర్తి అక్బర్ సార్వభౌమాధికారాన్ని అంగీకరించమని రాయబారిని పంపినా ధైర్యంగా తిరస్కరించాడు. ఈతను చంద్రగిరిని రాజధానిగా చేసుకున్నాడు. ఇతను కవి పండిత పోషకుడు. ఈతని ఆస్థానంలో వేదపండితుడైన అప్పయ్యదీక్షితులు, చెన్న బసవపురాణం వ్రాసిన విరూపాక్ష పండితుడు, జైన వ్యాకరణాన్ని రచించిన బట్టలంకదేవుడు మొదలైన ప్రసిద్ధకవులు ఉండేవారు. వారేకాక భోజరాజీయాన్ని రచించిన అనంతామాత్యుడు ఉండేవారు. ఇతనికి కుమారులు లేకపోవడంవల్ల రెందో శ్రీరంగరాయలను తన వారసుడుగా నియమించాడు. రెందో శ్రీరంగరాయల (1616) తరువాత రామదేవరాయలు (1616-1630), మూడవ వెంకటపతి రాయలు (1630-1642) లు పాలించారు. వీరి తరువాత మూడో శ్రీరంగరాయలు పాలించాడు. ఆయన పరిపాలన కాలంలోనే బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వారు వర్తక సంఘంగా దక్షిణ భారతదేశంలోకి, మరీ ముఖ్యంగా తమిళ, ఆంధ్రదేశాల్లోకి చేరప్రారంభించారు. ఈస్టిండియా కంపెనీ వారు చెన్నపట్టణంలో కోటకట్టుకునేందుకు, చంద్రగిరిలో చర్చిలు నిర్మించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. మూడో శ్రీరంగరాయలు (1642 - 1675 ) అనేకానేక అంతర్యుద్ధాలు, మోసాలు...., దక్షిణాది నాయకులు కుట్రలతో బీజాపూర్ సుల్తాన్ తో చేతులుకలిపి ఇతన్ని ఓడించారు.ఇతనితోనే అరవీటి వంశమేకాకుండా విజయనగర సామ్రాజ్యంకూడా పతనమైపోయింది. విజయనగర సామ్రాజ్యంలో ఎక్కువభాగాన్ని బీజాపూరు, గోల్కొండ సుల్తానులు ఆక్రమించారు. దిగువన దక్షిణాత్యంలో విజయనగర సామంతులైన మధుర, తంజావూరు, మైసూరు, నాయకరాజులు తమ తమ ప్రాంతాలను స్వంతం చేసుకుని తమ స్వంత రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. మూలాలు వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:విజయ నగర రాజులు
గద్వాల సంస్థానం
https://te.wikipedia.org/wiki/గద్వాల_సంస్థానం
200px|right|thumb|గద్వాల సంస్ఠానాధీశులు కట్టించిన మట్టి కోట గద్వాల సంస్థానం, తుంగభద్ర, కృష్ణా నదుల మధ్య ప్రాంతంలో నడిగడ్డగా పిలువబడే అంతర్వేదిలో 800 చ.కి.మీల మేర విస్తరించి ఉండేది. 14వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ఈ గద్వాల సంస్థానాధీశులు బహుమనీ సామ్రాజ్యం సామంతులు అయ్యారు. వంశ చరిత్ర ప్రకారం గద్వాలను 1553 నుండి 1704 వరకు పెద్ద వీరారెడ్డి, పెద్దన్న భూపాలుడు, సర్గారెడ్డి, వీరారెడ్డి, కుమార వీరారెడ్డి పరిపాలించారు. 1650 ప్రాంతంలో ముష్టిపల్లి వీరారెడ్డి అయిజా, ధరూర్ మొదలైన మహళ్లకు నాడగౌడుగా ఉండేవాడు. వీరారెడ్డికి మగ సంతానం లేకపోవడం వలన తన ఏకైక కుమార్తెకు వివాహం చేసి అల్లుడు పెద్దారెడ్డిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. వీరారెడ్డి తరువాత అల్లుడు పెద్దారెడ్డి నాడగౌడు అయ్యాడు. పెద్దారెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఆనందగిరి, చిన్నవాడు సోమగిరి (ఇతననే సోమానాధ్రి, సోమన్నభూపాలుడుగా ప్రసిద్ధుడయ్యాడు). పెద్దారెడ్డి తరువాత అతని రెండవ కొడుకు సోమన్న.ఇతను 1704 నుండి నాడగౌడికం చేశాడు.ఇతను కృష్ణా నది తీరాన గద్వాల కోట నిర్మించి తుంగభద్రకు దక్షిణాన రాజ్యాన్ని బనగానపల్లె, ఆదోని, సిరివెళ్ల, నంద్యాల, సిద్ధాపురం, ఆత్మకూరు, అహోబిళం, కర్నూలు మొదలైన ప్రాంతాలకు విస్తరింపజేశాడు. ఈ సంస్థానం కింద 103 పెద్ద గ్రామాలు, 26 జాగీరులు ఉండేవి. thumb|సోమనాద్రి నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II యొక్క పరిపాలనా కాలంలో, దక్కనులోని కొన్ని ప్రాంతాలలో మరాఠుల ప్రాబల్యం పెరిగి 25 శాతం ఆదాయ పన్ను (చౌత్) వసూలు చేయడం ప్రారంభించారు. దీనిని దో-అమలీ (రెండు ప్రభుత్వాలు) అని కూడా అనేవారు. రాజా సీతారాం భూపాల్ 1840 లో మరణించాడు. ఆ తరువాత అతని దత్తపుత్రుడు రాజా సీతారాం భూపాల్ II సంస్థానంను పరిపాలించాడు. నిజాం VII ఇతనికి "మహారాజ" అనే పట్టంను ప్రధానం చేశాడు. 1924 లో మరణించే సమయానికి ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గద్వాల సంస్థానాధీశులు తమ స్వంత నాణేలను ముద్రించుకున్నారు. 1909 నాటికి కూడా ఈ నాణేలు రాయిచూరు ప్రాంతంలో చలామణీలో ఉండేవి. ImprialGazetterOfIndiaHyderabad పుస్తకం నుండి. ఇంపీరియల్ గజెట్లను మిలియన్ బుక్స్ సైటు నుండి దిగుమతి చేసుకోవచ్చు నిడ్జూర్ యుద్ధం ఢిల్లీ పీఠంపై బహద్దూర్షా బలహీన పాలనసాగుతున్న కాలంలో దక్షిణ సుభేదార్ నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. అయితే హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఉన్న గద్వాల సంస్థానాధీశుడు సోమనాద్రి మాత్రం బహద్దూర్ షా కు అనుయాయిగానే పాలన కొనసాగించాడు. ఇది సహించని నిజాం తన సేనాని అయిన దిలీప్ భానుడిని ఉసిగొల్పి గద్వాల సంస్థానంపై దండయాత్రకు పంపించాడట. దిలీప్ భానుడి సేన, సోమనాద్రి సేనలు కర్నూలు సమీపంలోని నిడ్జూర్ దగ్గర భీకరంగా తలపడ్డాయి. చివరికి ఈ యుద్ధంలో సోమనాద్రి వీరమరణం పొందగా, సోమన పెద్ద భార్య రాణి లింగమ్మ నిజాంతో సంధి కుదుర్చుకుని పాలన కొనసాగించింది. సూర్య దినపత్రిక ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక,2008, పుట- 12 . సాహితీపోషణ నిజాంరాష్ట్రంలోని సంస్థానాలలోకెల్లా గద్వాల సంస్థానంలో సాహితీపోషణ అధికంగా ఉండేది,సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము-3, 1962 ప్రచురణ, పేజీ 308 సంస్థానాధీశులు విద్యావేత్తలకు, కళాకారులను ఆదరించారు. సంస్థానంలో ప్రతి సంవత్సరం మాఘ, కార్తీక మాసాలలో సంగీత, సాహిత్య సభలు జరిగేవి. రాజాపెదసోమభూపాలుడు స్వయంగా కవి. అతను జయదేవుని గీతాగోవిందాన్ని తెలుగులోకి అనువదించాడు. 1761 నుండి 1794 వరకు పాలించిన చినసోమభూపాలుడు కవిపండితులను ఆదరించడమే కాకుండా, స్వయంగా రచనలుచేశాడు. ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజాలనే 8 మంది కవులు ఉండేవారు. ఇతని కాలాన్ని గద్వాల సంస్థానంలో ' సాహిత్య స్వర్ణయుగం ' గా చెబుతారు. ప్రముఖకవి సోమయాజులు, అలంకార శిరోభూషణం రచించిన కందాళాచార్యులు ఇక్కడివారే. ఆంధ్రదేశంలోని ఎక్కడెక్కడి కవులో ఇక్కడి రాజుల దర్శనానికి వచ్చేవారు. తిరుపతి వేంకటకవుల ఉదంతం ఆంధ్రదేశంలో తిరుపతి వేంకటకవులు తిరుగని ప్రదేశం లేదు. వారికున్న ప్రశస్తే వేరు. అలాంటి ప్రముఖ కవులకు కూడా గద్వాల సంస్థానపు రాజుల దర్శనం అంత సులభంగా దొరకలేదనటానికి ఓ ఉదాహరణ ఈ సంఘటన. ఒక రోజు తిరుపతి వెంకటకవులు గద్వాల సంస్థానానికి వచ్చారు. రాజ దర్శనం కాలేదు. ఒకటి, రెండు రోజులు గడిచిపోయింది. అయినా దర్శన భాగ్యం కాలేదు. పట్టువదలని కవులు పట్టణాన్ని వదలకుండా వండుక తిని ఎదురు చూశారు. అయినా రాజదర్శనం కాలేదు. ఇక విసుగొచ్చిన కవులు ఒక రోజు " చర్ల బ్రహ్మయ్య శాస్త్రి శబ్ధ శాస్త్రం చెప్ప / వంట నేర్పించే గద్వాల రాజు " అని ఓ కాగితం మీద రాసి రాజా వారికి పంపించారట. దానితో జరిగిన తప్పిదాన్ని తెలుసుకున్న రాజా వారు వెంటనే కవులను రప్పించి, వారి పాండిత్య ప్రదర్శనకు కావలసిన ఏర్పాట్లు చేయించి, తదనంతరం ఘనంగా సత్కరించి, సంభావనలు అందజేశారట. ఈ తిరుపతి వెంకటకవులే ఒకనాడు విజయనగర రాజుల దర్శనార్థం వెళ్ళినప్పుడు, అక్కడి దివాను కోదండరామారావు సాహిత్య సభకు కాకుండా. సన్మానానికి ఏర్పాటు చేయగా కోపమొచ్చిన తిరుపతి కవులు అతనిని ఉద్దేశించి... అటు గద్వాలిటు చెన్నపట్టణము మధ్యంగల్గు దేశమ్మునన్ జటుల స్ఫూర్తి శతావధానములు మెచ్చం జేసియున్నట్టి మా కిటు రాజీయక యున్న దర్శనము నింకెవ్వానికీ రాజొసం గుట? చెప్పంగదవయ్య పాలితబుధా! కోదండరామాభిధా!తిరుపతి వెంకటకవులు(మూలం: ఆంధ్రరచయితలు,శ్రీమధనాంపతుల సత్యనారాయణ శాస్త్రి), తెలుగు వాచకం, 10 వ తరగతి(పాతది), ప్రభుత్వ ప్రచురణలు,1984, పుట- 77. అంటూ చెప్పిన'' పద్యంలో.... సాహిత్యానికి గద్వాల ఒక గొప్ప స్థానమన్న విషయం ఋజువవుతుంది. thumb|మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ గద్వాల సంస్థానంను పాలించిన రాజులు బుడ్డారెడ్డి గద్వాల సంస్థానానికు మూలపురుషుడు.సంగ్రహ ఆంధ్రవిజ్ఞాన కోశము-3, 1962 ప్రచురణ, పేజీ 304 మొత్తం 11 రాజులు, 9 రాణులు ఈ సంస్థానాన్ని పాలించారు. వీరిలో ముఖ్యులు. రాజ శోభనాద్రి రాణి లింగమ్మ (1712 - 1723) రాణి అమ్మక్కమ్మ (1723 - 1724 ) రాణి లింగమ్మ ( 1724 - 1738 ) రాజా తిరుమలరావు రాణి మంగమ్మ ( 1742 - 1743) రాణి చొక్కమ్మ ( 1743 - 1747 ) రాజా రామారావు రాజా చిన్నసోమభూపాలుడు రాజా చిన్నరామభూపాలుడు రాజా సీతారాం భూపాలుడు రాణి లింగమ్మ (1840 - 1841 ) రాజా సోమభూపాలుడు రాణి వెంకటలక్ష్మమ్మ రాజారాంభూపాలుడు రాణి లక్ష్మీదేవమ్మ మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ ( 1924 - 1949 ) సూర్య దినపత్రిక ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక,2008, పుట- 12 సంస్థాన రాజుల వంశవృక్షంసమగ్ర ఆంధ్ర సాహిత్యం,12 వ సంపుటం, కడపటిరాజుల యుగం,రచన:ఆరుద్ర, ఎమెస్కో, సికిందరాబాద్,1968, పుట-48 ఇవి కూడా చూడండి గద్వాల పట్టణం గద్వాల కోట జోగులాంబ గద్వాల జిల్లా మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ దోమకొండ సంస్థానం మూలాలు, వనరులు వెలుపలి లంకెలు వర్గం:మహబూబ్ నగర్ జిల్లా సంస్థానాలు వర్గం:తెలంగాణ సంస్థానాలు వర్గం:సంస్థానాలు వర్గం:గద్వాల
జటప్రోలు సంస్థానం
https://te.wikipedia.org/wiki/జటప్రోలు_సంస్థానం
thumbnail|కొల్లాపూరులోని సంస్థానపు రాజభవనము జటప్రోలు సంస్థానము మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది తీరాన వెలిసిన ఒక అత్యంత ప్రాచీనమైన చారిత్రక సంస్థానము. ఈ సంస్థానాధీశులు కొల్లాపూరును రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని కొల్లాపూరు సంస్థానమనికూడా వ్యవహరిస్తారు. వీరు మొదట జటప్రోలు రాజధానిగా పాలించి తర్వాత కొల్లాపూర్, పెంట్లవెల్లి రాజధానులుగా పాలించారు. ఈ సంస్థానం కృష్ణా నది ఒడ్డున ఉన్న సువిశాలమైన నల్లమల అటవీ ప్రాంతంనందు విస్తరించి ఉండేది. వీరి పాలన ఎప్పుడు ప్రారంభమైందనే విషయం ఖచ్చింతంగా వెలుగులోకి రాలేదు. అయితే చారిత్రక పరిశోధకుల ప్రకారం సా.శ.6-7 వ శతాబ్దిలో వీరి పాలన ప్రారంభమైనట్లు తెలుస్తుంది. పాలకులందరూ సురభి వంశస్థులే. అందుకే వీరికి సురభి సంస్థానాధీశులందురు. ఈ సంస్థానములో క్రీ.పూ. 2వ శతాబ్దముకు చెందిన పురావస్తు సంపదల ఆనవాళ్లు ఉన్నాయి. 1500 సంవత్సరాలకు పూర్వము కట్టించిన అనేక వందల పురాతన దేవాలయములను నేటికీ ఇక్కడ చూడ వచ్చును. కృష్ణా నది ఒడ్డునే కల సోమశిల దేవాలయం ఈ సంస్థానానికే చెందినది. నిజాము యొక్క పరిపాలనలో జటప్రోలు సంస్థానము చెప్పుకోదగిన పాత్ర పోషించింది. స్వాతంత్ర్య సమరయోధుడు మందుముల నర్సింగరావు ఈ సంస్థానాధీశుల బంధువే.ఈనాడు పత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 23-12-2003 ఇతను కొల్లాపూర్ నుంచి ఎన్నికై మంత్రి పదవి కూడా చేపట్టాడు. thumb|శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం, జటప్రోలు స్థాపన పిల్లలమర్రి బేతల రెడ్డి / నాయుడు జటప్రోలు సంస్థానాధీశుల యొక్క మూలపురుషుడే కాక, గంజాం జిల్లాలోని బొబ్బిలి రాజ వంశము, గోదావరి జిల్లాలోని పిఠాపురం, కృష్ణా జిల్లా లోని మల్లేశ్వరం, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి మొదలైన రాజ వంశములకు మూలపురుషుడని భావిస్తారు. 15వ శతాబ్దం చివరిలో ఈ వంశానికి చెందిన మాదానాయుడు కృష్ణా, తుంగభద్ర సంగమ సమీపంలోని జటప్రోలు ప్రాంతానికి వచ్చి అక్కడ కోటను కట్టడం ప్రారంభించాడు. మూడు తరాల తర్వాత ఈయన వారసులలో ఒకడైన మల్ల భూపతినాయుడు 1507లో విజయనగర రాజులనుండి ఈ ప్రాంతాన్ని పాలించడానికి సనదు (ప్రభుత్వ ఉత్తర్వు) ను పొందాడు. కృష్ణదేవరాయల పట్టాభిషేకానికి వెలుగోటి నాయకునిగా విచ్చేసిన సామంతుడు ఈయనేనని చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయ, విజయనగర సామ్రాజ్యాలు ఈ సంస్థానాధీశులకు సైనిక పోషణకై పట్టాలిచ్చారు. కానీ ఆయా సామ్రాజ్యల పతనం చెందినప్పుడు సంస్థానాధీశులు చాకచక్యంతో తమ రాజ్యాన్ని నిలబెట్టుకొని దక్షిణాపథంలో కొత్తగా ఆవిర్భవించిన శక్తులతో మనగలిగారు. 1513లో అప్పుడే కొత్తగా ఏర్పడిన గోల్కొండ సామ్రాజ్యంపై దండయాత్రకు సన్నాహాలు చేస్తూ, కృష్ణదేవరాయలు యుద్ధబలగాలను బేరీజు వేయటానికి, ఇతర సామంతులతో పాటు జటప్రోలు రాజు వెలుగోటి యాచమ నాయున్ని కూడా పిలిపించాడు. ఆ సంవత్సరం రాయచూరు అంతర్వేదిలో జరిగిన యుద్ధంలో జటప్రోలు సంస్థానము కూడా పాల్గొన్నది. ఔరంగజేబు దక్షిణాపథంపై దండెత్తి కుతుబ్‌షాహీలను ఓడించినప్పుడు స్థానిక రాజవంశాలను నిర్మూలించక, వాటిని తన నియమించిన దండనాయకుని ఆధీనంలో వీటిని తన రాజ్యంలో సామంతులుగా విలీనం చేసుకున్నాడు. అప్పటి నుండి జటప్రోలు సంస్థానం యొక్క స్వాధికారత, ప్రాబల్యం పెరగటం ప్రారంభమైంది. అప్పటి సంస్థానాధీశుడు గోపాలరావు జటప్రోలు యొక్క ప్రాబల్యాన్ని దక్షిణాన జటప్రోలు నుండి ఉత్తరాన పానగల్, యల్జల్ల వరకు విస్తరించి పటిష్ఠపరచాడు. 1694లో సంస్థానాధీశుడైన నరసింగరావు మొఘలులపై తిరుగుబాటు చేసి మొఘులుల మల్లయోధున్ని బంధించి, గంజికోట (గండికోట), శ్రీకాకుళంపై ఆధిపత్యం కావాలని పట్టుబట్టాడు. మొఘలులు ఈయన్ను తృప్తిపరచడానికి వీటిపై అధికారమిచ్చారు. జటప్రోలుకు తొంభై మైళ్ళు దక్షిణాన ఉన్న గండికోటను అడగటంలోని ఆర్ధం ఉంది కానీ, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం అడగటానికి హేతువు తెలియుటలేదు.Kingship and Colonialism in India's Deccan: 1850-1948 19వ శతాబ్దం చివరలో జటప్రోలు సంస్థాధీశునికి సంతానము కలుగక వారసుడు లేని పరిస్థితి వచ్చింది. అప్పటికే పొరుగు సంస్థానాలైన వనపర్తి, గద్వాలలో జరుగుతున్న వారసత్వపు పోరులను గమనించిన జటప్రోలు రాజు, ముందు జాగ్రత్త చర్యగా వెంకటగిరి రాజకుమారున్ని దత్తత పుచ్చుకున్నాడు. ఈయన జటప్రోలు రాజా సింహాసనము అధిరోహించిన తర్వాత తన అసలు పేరు నవనీతకృష్ణ యాచేంద్రను విడిచి రాజా వెంకట లక్ష్మణరావు బహుదూర్‌ అనే పట్టము స్వీకరించాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఇతని హయాములో వాజపేయయాజుల రామసుబ్బరాయ కవి ఆస్థాన కవిగా ఉన్నాడు. వెంకట లక్ష్మణరావు 1929లో మరణించాడు. right|thumb|జటప్రోలు సంస్థానానికి చెందిన రథం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మ్యూజియం లో భద్రపరచినది) జటప్రోలు సంస్థానాన్ని సుమారు పదహారు తరాలుగా కొన్ని శతాబ్దాల పాటు పరిపాలన కొనసాగించిన 'సురభి' రాజులంటే కొల్లాపూర్ ప్రాంత జనులకు వల్లమాలిన అభిమానం. వీరి పరిపాలన 7, 8 వందల సంవత్సరాల క్రితం నుంచే ప్రారంభమైనట్లు చరిత్రకారులు చెబుతారు. కొల్లాపూర్ ప్రాంతంలో చారిత్రక భవనాలు, దేవాలయాలతో పాటు అనేకం సురభి రాజ వంశీయులు నిర్మించినవే. జటప్రోలు సంస్థానాధీశుల కోటను మల్ల నాయుడు నిర్మించగా, సింగపట్నంలోని నృసింహ సాగరాన్నిి సింగమనాయుడు, పెంట్లవెల్లి గ్రామంలోని కోటను, చెరువును, శివ కేశవాలయాన్ని చిన్నమాధవ రావు, కొల్లాపూర్ కోటను ప్రథమ వేంకటలక్ష్మా రావు, జటప్రోలు మదన గోపాల స్వామి ఆలయాన్ని మాధవరాయులు, బెక్కం, చిన్నమారూరు కోటల్ని నరసింగ రావులు నిర్మించారు. వీటితో పాటు శింగవట్నంలోని శ్రీవారి సముద్రం, జటప్రోలు హజ్రత్ ఇనాయత్ షా ఖాద్రి దర్గా, అద్దాల మేడ, కొల్లాపూర్ లోని న్యాయ దర్బార్ గా పిలిచే గుండు బంగ్లా, జైలు ఖానాలను సురభి రాజులు వారి పాలనలో నిర్మించారు. సురభి వంశస్తుల పాలనలో కొల్లాపూర్ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. 1871 లో నిర్మించిన కొల్లాపూర్ రాజా బంగ్లాను చంద్ర మహల్, మంత్ర మహల్, రాణి మహల్గా విభజించి సుందరంగా నిర్మించారు. 140 సంవత్సరాల క్రితం నాటి మునసబ్ కోర్టు జిల్లాలోనే ప్రథమ న్యాయస్థానం ఇక్కడ ఉంది. కొల్లాపూర్ పట్టణంలో విశాలమైన రహదారులు, రహదారులకిరు వైపులా చెట్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆనాడే ఏర్పాటు చేసారు. జనరేటర్ ఉపయోగించి విద్యుత్తును వినియోగించిన ఘనత కూడా వారికే దక్కుతుంది. త్రాగునీటి సరఫరా పైపులైను ఏర్పాటు చేసి కుళాయిలు ఆనాడే ఏర్పాటు చేసారు. 18 వ శతాబ్దం కాలంలోనే జటప్రోలు సంస్థానాధీశుల అధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ధర్మాసుపత్రిని కూడా ఏర్పాటు చేసారు. హైటెక్ పరిజ్ఞాన వినియోగంలో సురభి వంశస్థులదే అందె వేసిన చేయి. సురభి వంశస్థులు ప్రపంచ విపణిలో ఏ కొత్త వస్తువు వచ్చినా వాటిని వినియోగించుకునేవారు. వీరికి ఒక సొంత విమానం కూడా ఉండేదని. దానికి ఎయిర్ పోర్టుగా కొల్లాపూర్ పట్టణంలోని జఫర్ మైదానాన్ని ఉపయోగించినట్లుగా చెబుతారు. సురభి రాజ వంశ వారసుడైన బాలాదిత్య లక్ష్మారావు (ఇతను సంస్థానం చివరి రాజు జగన్నాథరావు కుమారుడు) హైదరాబాదులో నివాసం ఏర్పరుచుకున్నారు. కొల్లాపూర్ సంస్థానానికి మంత్రిగా పనిచేసిన మియాపురం రామకృష్ణారావు ప్రముఖ బ్రాహ్మణుడు. వీరు గొప్ప కవి. ఎన్నో గేయాలు రచించారు. మూలాలు ఇవి కూడా చూడండి జటప్రోలు వర్గం:మహబూబ్ నగర్ జిల్లా సంస్థానాలు వర్గం:తెలంగాణ సంస్థానాలు వర్గం:సంస్థానాలు వర్గం:కొల్లాపూర్
అమరచింత సంస్థానం
https://te.wikipedia.org/wiki/అమరచింత_సంస్థానం
అమరచింత సంస్థానం, ఇప్పటి వనపర్తి జిల్లా, (పునర్య్వస్థీకరణకు ముందు మహబూబ్ నగర్) జిల్లాలో 69 గ్రామాలు కలిగి దాదాపు 190 చ.కి.మీ.ల విస్తీర్ణములో వ్యాపించి ఉండేది. ఈ సంస్థానం రాజధాని ఆత్మకూరు. 1901 జనాభా లెక్కల ప్రకారము 34,147 జనాభాతో మొత్తము 1.4 లక్షల రెవెన్యూ ఆదాయం కలిగి ఉండేది. అందులో 6,363 రూపాయలు నిజాముకు కప్పంగా చెల్లించేవారు. సంస్థానం రాజుల నివాస గృహమైన ఆత్మకూరు కోట ఇప్పటికీ పఠిష్టంగా ఉంది.దీనికి మరో పేరు తిప్పడంపల్లి కోట అని కూడా వ్యవహరిస్తారు. ఆమరచింత సంస్థానం చాలా పురాతనమైన సంస్థానం. సంస్థానం దక్షిణ భాగాన గద్వాల సంస్థానం, సరిహద్దున కృష్ణా నది ప్రవహిస్తుంది.నదీ తీరం ఎత్తు వలన నది జలాలు వ్యవసాయానికి ఉపయోగించుటకు సాధ్యం కాదు. అమరచింత, ఆత్మకూరు అత్యంత నాణ్యమైన మేలు మస్లిన్‌ బట్టతో నేసిన దస్తీలు, ధోవతులు, బంగారు, పట్టు అంచులతో నేసిన తలపాగలకు ప్రసిద్ధి చెందాయి. భౌగళిక స్వరూపం అమరచింత సంస్థానం వనపర్తి జిల్లా ఏర్పడకముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఆత్మకూరు రాజధానిగా ఉండేది. మొత్తం 69 గ్రామాలతో 190 చదరపు కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉండేది. సంస్థానానికి దక్షిణాన గద్వాల సంస్థానం ఉండేది, దక్షిణ సరిహద్దున కృష్ణానది ప్రవహిస్తూండేది. ఆర్థిక వ్యవస్థ 1901 నాటికి 1.4 లక్షల ఆదాయం కలిగి, అందులో 6,363 రూపాయలు నిజాంకు కప్పం కట్టేవారు. చరిత్ర కాకతీయుల కాలంలో గోన బుద్ధారెడ్డి అధీనంలో వర్ధమానపురం ఉండేది. దానికి గోపాలరెడ్డి అను వ్యక్తి దేశాయిగా ఉండేవాడు. అతని అమూల్య సేవలకు గుర్తింపుగా బుద్ధారెడ్డి సా.శ. 1292లో మక్తల్ పరగణాను గోపాలరెడ్డికి నాడగౌడికంగా ఇచ్చాడు. గోపాలరెడ్డి అనంతరం అతని రెండో కుమారుడు చిన్న గోపిరెడ్డి నాడగౌడికానికి వచ్చాడు. మక్తల్ తో పాటు మరో నాలుగు మహాళ్ళు గోపిరెడ్డి నాడగౌడికం కిందికి వచ్చాయి. ఆ నాలుగింటిలో అమరచింత ఒకటి. ఈ చిన్న గోపిరెడ్డి మనువడి మనువడి పేరు కూడా గోపిరెడ్డే. ఇతనిని ఇమ్మడి గోపిరెడ్డి అని అంటారు. ఇతను సా.శ. 1654 ప్రాంతానికి చెందినవాడు. ఇతని అన్నగారు సాహెబ్ రెడ్డి. వారసత్వంగా వచ్చిన అయిదు మహాళ్ళలో సాహెబ్ రెడ్డికి మూడు మహాళ్ళు పోగా, మిగిలిన రెండు మహాళ్ళు వర్ధమానపురం, అమరచింత ఇమ్మడి గోపిరెడ్డి వంతులోకి వచ్చాయి. సా.శ.1676 ప్రాంతంలో ఇమ్మడి గోపిరెడ్డి కుమారుడు సర్వారెడ్డి నాడగౌడికానికి వచ్చాడు. ఆ తర్వాత ఈ అమరచింత క్రమంగా వృద్దిచెంది సంస్థానంగా రూపొందింది.సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12 వ సంపుటం, కడపటి రాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1968, పుట-32 సర్వారెడ్డి అభ్యుదయ విధానాలు కలవాడు. నీటి వనరులు పెంచడానికి పెద్దవాగుకు ఆనకట్ట కట్టించాడు. ఇతను ఔరంగజేబు సైన్యాలకు సాయం చేశాడు. తత్ఫలితంగా జండా, నగరా, 500 సవార్లు మొదలైన రాజలాంఛనాలు పొందాడు. ఇతని తరువాత మరో ఆరుగురు రాజులు ఈ సంస్థానాన్ని పాలించారు.అమరచింత సంస్థాన వంశం వారసులలో ఒకడైన రాజా శ్రీరాం భూపాల్‌ మరణించిన తర్వాత అతని భార్యకు న్యాయబద్ధంగా సంస్థానం వారసత్వం సంక్రమించింది. సంస్థాన రాజుల వంశక్రమం గోపాలరెడ్డి ( 13 వ శ.) ↓ ↓ —————————————————————————————————————↓ (........................) చిన్న గోపిరెడ్డి ↓ ( ముని మనుమలు ) ↓————————————————————————————————————————————↓ సాహెబ్ రెడ్డి ఇమ్మడి గోపిరెడ్డి ( 1654 ) ↓ సర్వారెడ్డి ( 1676 ) సంస్థానాధికారిపై తిరుపతి కవుల గ్రంథం ఈ సంస్థానాన్ని తిరుపతి కవులు సందర్శించారు. ఇక్కడి ప్రభువులను కలుసుకోవాలనే వారి కోరికకు ధర్మాధికారిగా పనిచేసే ఒక పండితకవి అడ్డుతగిలాడు. వారికి వీరికి వాదన జరిగింది. పండితకవి ప్రభువులకు చాడీలు చెప్పి, వీరికి ప్రభువుల సత్కారాన్ని దూరం చేశాడు. దీనితో ఆగ్రహించిన జంటకవులు ఆ అధికారిని అధిక + అరి అని చమత్కరిస్తూ, అన్యాపదేశంగా నిందిస్తూ 27 పద్యాలతో కూడిన లఘుకృతిని రచించారు. దీనికి శనిగ్రహం అని పేరు పెట్టారు. అందులో ఒక పద్యం.... ధరణీ నాయకుడుత్తముండవని నిన్ ధర్మాధికారమ్మునం దు రహిన్నిల్పుట తుచ్చ బుద్ధివయి క్రిందున్ మీదునుం గాన కె ల్లరి కార్యమ్ములు పాడుసేయుటకె? నీ లక్ష్యమ్ము మా బోటు తెం చరు చండాల! శనిగ్రహంబ! యిక మా సామర్థ్య ముంజూడుమా!తెలుగులో తిట్టుకవిత్వం,రచన:విద్వాన్ రావూరి దొరసామిశర్మ, ఎమెస్కో,మద్రాస్,1968, పుట-198 ఇవీ చూడండి సురపురం కేశవయ్య మూలాలు వెలుపలి లంకెలు వర్గం:మహబూబ్ నగర్ జిల్లా సంస్థానాలు వర్గం:తెలంగాణ సంస్థానాలు వర్గం:సంస్థానాలు
కొల్లాపూర్ సంస్థానము
https://te.wikipedia.org/wiki/కొల్లాపూర్_సంస్థానము
దారిమార్పు జటప్రోలు సంస్థానం