title
stringlengths
1
90
url
stringlengths
31
120
text
stringlengths
0
504k
సమరసింహారెడ్డి
https://te.wikipedia.org/wiki/సమరసింహారెడ్డి
సమరసింహా రెడ్డి బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్, అంజలా జవేరీ, జయప్రకాశ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన 1999 నాటి ఫ్యాక్షన్ సినిమా. తారాగణం బాలకృష్ణ సిమ్రాన్ జయ ప్రకాష్ రెడ్డి పృథ్వీ రాజ్ కైకాల సత్యనారాయణ బ్రహ్మానందం ఎమ్మెస్ నారాయణ కోట శ్రీనివాసరావు దేవరాజ్ సుమిత్ర నిర్మాణం అభివృద్ధి సినిమాకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ తాను సిందూరపువ్వు అనే తమిళ సినిమా నుంచి సమరసింహారెడ్డి ప్రధాన ఇతివృత్తాన్ని స్వీకరించానని తెలిపారు. సింధూర పువ్వు కథలో ఒకావిడ తన కూతుర్ని బాగా చూసుకుని, సవతి పిల్లల్ని బాగా చూడదు. అది నచ్చని ఆవిడ సవతి కొడుకు, తన చెల్లెల్ని వదిలేసి పారిపోయి ఓ కథానాయకుడి (విజయకాంత్) దగ్గర డ్రైవర్ గా చేరతాడు. కథానాయకుడు పెద్ద డాన్, అతనిపై ప్రత్యర్థులు దాడి చేసినప్పుడు కాపాడేందుకు డ్రైవర్ చనిపోతాడు. అతని వెనుక ఉన్న కథను తెలుసుకున్న కథానాయకుడు, అతని కుటుంబంలోకి అతని పేరుమీదే వెళ్ళి వాళ్ళని కష్టాల నుంచి బయటపడేస్తాడు. ఈ ప్రధానమైన ఇతివృత్తాన్ని స్వీకరించి చనిపోయిన పనివాడు కథానాయకుడి చేతిలోనే పొరబాటున చనిపోవడం, కథను ఫ్లాష్ బాక్ విధానంలో చెప్పడం వంటి మార్పులు చేర్పులు చేశారు. థీమ్స్, ప్రభావాలు సమరసింహారెడ్డి సినిమాలో రాయలసీమ ముఠాకక్షలు (ఫ్యాక్షనిజం) నేపథ్యంగా తీసుకున్నారు. ఆపైన రాయలసీమ ముఠాకక్షల నేపథ్యం దశాబ్దానికి పైగా తెలుగు సినిమాలను విపరీతంగా ప్రభావితం చేసింది. ఐతే ఈ సినిమాను మొదట కథారచయిత విజయేంద్రప్రసాద్ బొంబాయి మాఫియా నేపథ్యంలో రాద్దామని భావించారు. కానీ అప్పటికి విజయేంద్రప్రసాద్ కి సహాయకునిగా పనిచేస్తున్న రత్నం సలహా మేరకు రాయలసీమ ఫాక్షన్ ని నేపథ్యంగా చేసుకున్నారు. ఒకసారి విజయవాడ రైల్వేస్టేషన్లో స్థానికంగా బలం ఉండి, గ్రూపు కక్షలు ఉన్న దేవినేని, వంగవీటి కుటుంబాల వారు ఒకేసారి రైలు దిగే పరిస్థితి ఏర్పడింది. దాంతో వారి కోసం వచ్చిన ఇరువర్గాల ఎదురుపడి ఉద్రిక్తత నెలకొనడం, దానివల్ల పోలీసుల్లో టెన్షన్ కలగడం ఈ సినిమాకి రచనా సహకారం చేసిన రత్నం నిజజీవితంలో స్వయంగా చూశారు. ఆ సంఘటన స్ఫూర్తిగా సినిమాలో ప్రధానమైన రెండు వర్గాల మధ్య రైల్వేస్టేషన్లో ఉద్రిక్తతలు ఏర్పడడం, ఘర్షణ కలగడం వంటి సన్నివేశాలు రాసుకున్నారు. పాటలు అందాల ఆడ బొమ్మ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఉదిత్ నారాయణ్ , సుజాత చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు, రచన:భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర అడ్డీస్ అబ్బబ్బా అల్లం మురబ్బా , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. మనో, రాధిక రావయ్యా ముద్దుల మామ , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర నందమూరి , రచన: భువన చంద్ర, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర లేడీ లేడీ , రచన:భువన చంద్ర గానం. మనో, సుజాత. మూలాలు వర్గం:ఫ్యాక్షనిజం నేపథ్యంలో సినిమాలు వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు వర్గం:సత్యనారాయణ నటించిన చిత్రాలు వర్గం:కడప మాండలికం వాడబడ్డ చలన చిత్రాలు
బహమనీ సామ్రాజ్యం
https://te.wikipedia.org/wiki/బహమనీ_సామ్రాజ్యం
బహమనీ సామ్రాజ్యము దక్షిణ భారత దేశమున దక్కన్‌ యొక్క ఒక ముస్లిం రాజ్యము. ఈ సల్తనత్‌ను 1347లో టర్కిష్ గవర్నర్ అల్లాద్దీన్‌ హసన్‌ బహ్మన్‌ షా, ఢిల్లీ సుల్తాన్‌, ముహమ్మద్ బిన్ తుగ్లక్కు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి స్థాపించాడు. అతని తిరుగుబాటు సఫలమై, ఢిల్లీ సామ్రాజ్యము యొక్క దక్షిణ ప్రాంతాలతో దక్కన్‌లో ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచాడు. 1347 నుండి దాదాపు 1425 వరకు బహమనీల రాజధాని ఎహసానాబాద్‌ (గుల్బర్గా). ఆ తరువాత రాజధాని, మహమ్మదాబాద్‌ (బీదర్‌) కు తరలించారు. బహమనీలు దక్కన్‌ మీద ఆధిపత్యానికై దక్షిణాన ఉన్న హిందూ ఓరుగల్లు ముసునూరి చక్రవర్తులపై, విజయనగర వారిపై పోటీ పడేవారు. ఈ సల్తనత్ యొక్క అధికారము మహమూద్‌ గవాన్ యొక్క వజీరియతులో (1466–1481) ఉచ్ఛస్థాయి చేరుకొన్నది. 1518 తర్వాత అంతఃకలహాల వలన బహమనీ సామ్రాజ్యము ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విచ్ఛిన్నమైనది. ఆ ఐదు రాజ్యములు అహ్మద్‌నగర్, బీరార్, బీదర్, బీజాపూర్, గోల్కొండ సల్తనత్, దక్కన్‌ సల్తనత్ లుగా పేరు పొందాయి. సామ్రాజ్య స్థాపకుడి చరిత్రపై కథనం బహమనీ సామ్రాజ్య స్థాపకుడు హసన్ గంగు గురించి ఒక కథనం ప్రచారంలో ఉంది. సన్ గంగు ఒక బ్రాహ్మణుడి వద్ద పొలం పనులు చేస్తూండేవాడు. ఒకరోజు పొలం దున్నుతూండగా, అతడికి ఒక నిధి దొరికింది. ఆ నిధిని తీసుకువెళ్ళి బ్రాహ్మణునికి ఇచ్చాడు. అతడి నిజాయితీకి సంతోషించిన బ్రాహ్మణుడు, అతణ్ణి, రాజు కొలువులో పని ఇప్పించాడు. తిరుగుబాటు తరువాత, అతడు రాజైనపుడు, మద్రాసు ప్రెసిడెన్సీలో గోదావరి జిల్లా చరిత్ర - పేజీ 211 . అయితే ఈ కథనాన్ని ధ్రువపరచే చారిత్రిక ఆధారాలు దొరకలేదు. బహమనీ సుల్తానుల జాబితా అల్లాద్దీన్‌ హసన్‌ బహ్మన్‌ షా 1347 - 1358 మహమ్మద్‌ షా I 1358 - 1375 అల్లాద్దీన్‌ ముజాహిద్‌ షా 1375 - 1378 దావూద్‌ షా 1378 మహమ్మద్‌ షా II 1378 - 1397 ఘియాతుద్దీన్‌ 1397 షంషుద్దీన్‌ 1397 తాజుద్దీన్ ఫిరోజ్‌ షా 1397 - 1422 అహ్మద్‌ షా I వలీ 1422 - 1436 అల్లాద్దీన్‌ అహ్మద్‌ షా II 1436 - 1458 అల్లాద్దీన్‌ హుమాయున్‌ జాలిమ్‌ షా 1458 - 1461 నిజాం షా 1461 - 1463 మహమ్మద్‌ షా III లష్కరి 1463 - 1482 మహమ్మద్‌ షా IV (మెహమూద్‌ షా) 1482 - 1518 అహ్మద్‌ షా III 1518 - 1521 అల్లాద్దీన్‌ 1521 - 1522 వలీ అల్లా షా 1522 - 1525 కలీమల్లా షా 1525 - 1527 బయటి లింకులు దక్కన్‌ పాలకుల కాలక్రమము మూలాలు వర్గం:భారతదేశాన్ని పరిపాలించిన వంశములు వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:తెలంగాణ చరిత్ర వర్గం:1347 స్థాపితాలు వర్గం:చరిత్ర
బంగాళఖాతము
https://te.wikipedia.org/wiki/బంగాళఖాతము
దారిమార్పు బంగాళాఖాతం
భారత దేశ విద్యా వ్యవస్థ - చరిత్ర
https://te.wikipedia.org/wiki/భారత_దేశ_విద్యా_వ్యవస్థ_-_చరిత్ర
చదువు అనేది చాలా ముఖ్యమైనది.ఓ సంఘం యొక్క అభివృద్ధి అందులోని ప్రజల విద్యా వివేకాలపై ఆధారపడి ఉంటుంది. విద్య వెలుగునిస్తుంది. దీనిని భారతీయ సమాజం ఆదినుండి గుర్తించినది, తొలినాళ్ళనుండి విద్యకు చక్కని ప్రాముఖ్యత ఉన్నది, ఈ వ్యాసంలో మనము వివిధ కాలములలో, వివిధ రాజుల వద్ద భారతదేశంలో విద్యావ్యవస్థ ఎలా ఉన్నదో పరిశీలించుదాము. ( ) వైదిక యుగంలో విద్యావ్యవస్థ పురాతన కాలంలో విద్యను మనిషి మూడవ కన్నుగా భావించారు. జ్ఞానానికి మార్గముగా ఈ చదువును భావించారు. ఆనాటి విద్య యొక్క చివరి లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం, కానీ తక్షణ గమ్యం మాత్రం తమ అభిరుచులకు, శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా ఉపాదిపొంది సమాజానికి తమ వంతు సహాయం చేయడం.విద్య జీవితానికి వెలుగునిస్తుందని, అది లేనివాడు గుడ్డివానితో సమానమని భావించేవాళ్ళు. విద్యను వారు చాలా గౌరవంగా భావించారు.వారి మాటల్లోనే చెప్పాలంటే "స్త్రీపురుషులకు విద్య చాలా ముఖ్యమైనది, అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, తల్లిలాగా పోషిస్తుంది, తండ్రిలా మార్గదర్శిలా నిలుస్తుంది, భార్యలాగా సుఖసౌఖ్యాలను ప్రసాదిస్తుంది, కీర్తిని సంపాదిస్తుంది,కష్టాలు తొలిగిస్తుంది,స్వచ్చమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది, నాగరికునిగా మారుస్తుంది, పొరుగుదేశంలో ప్రయాణిస్తుంటే మంచి తోడుగా నిలుస్తుంది.కనుకనే దానిని కల్పవృక్షంగా భావిస్తారు". ఉపనిషత్తుల కాలంలో విద్యావ్యవస్థ ఇక్కడ కూడా పరిస్థితి పూర్వంలాగానే ఉండినది, కాకపోతే కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి, పాఠ్యాంశములు పెరిగినాయి, వైశ్యులు, శూద్రుల విద్య గురించిన సమాచారము లేదు, విద్య పూర్తిగా మతపరమైనదిగానే సాగినది.దీనిని మనం క్రీస్తు పూర్వం 1400 నుండి క్రీస్తు పూర్వం 600 వరకూ గల కాలముగా చెప్పుకొనవచ్చు. ఈ కాలంలోనే బ్రాహ్మణములు, ఆర్యణకములు, ఉపనిషత్తులు వృద్ధిచేయబడినాయి. లక్ష్యం ఆత్మ సాక్షాత్కారము గురువుల స్థానం చాలా ఉన్నత స్థితిలో ఉండేది బోధనా పద్ధతులు శ్రవణం, మననం, నిధిధ్యాస (అనుభవం) కులములు బ్రాహ్మణులు, క్షత్రియుల గురించి వివరములు కలవు, మిగిలిన రెండు కులముల గురించి వివరములు తెలీదు స్త్రీ విద్య కొంత మంది స్త్రీ గురువులు గురించిన సమాచారం కలదు బౌద్ద మతం వర్థిల్లిన కాలంలో విద్యావ్యవస్థ బౌద్దమతము వచ్చిన తరువాత విద్యావ్యవస్థలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.విద్య గురుకులాలనుండి ఆరామాలకు చేరుకున్నది, అనగా గురుకులాల్లో అయితే కేవలం ఒకే ఒక గురువు ఉంటాడు.అతనికి ఇద్దరు ముగ్గురు ప్రధాన శిష్యులు సహాయంగా ఉండేవారు.కానీ బౌద్ద ఆరామాలలో చాలా మంది గురువులు ఉండి ఇప్పటి మన విశ్వవిద్యాలయాలలాగా బోధన ఉండేది.ఇప్పుడే ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు అయిన నలందా విశ్వవిద్యాలయం, తక్షశిల విశ్వవిద్యాలయంలు వచ్చినాయి.ఈ కాలంలో మరో రెండు ముఖ్యమైన మార్పులు విద్యాబోధన సంస్కృతమునుండి ప్రజాభాషకు వచ్చినది, అయినప్పటికీ సంస్కృతమునకు తగినంత ప్రాముఖ్యత మాత్రం ఉండినది, మరొక మార్పు వేదాలకు ప్రధాన గౌరవం లేకుండా పొయినది, మొదటిసారిగా! ముస్లిం పరిపాలకుల ప్రాంతాలలో విద్యావ్యవస్థ హిందూ పరిపాలకుల ప్రాంతాలలో విద్యావ్యవస్థ బ్రిటీషువారి ప్రాంతాలలో విద్యావ్యవస్థ బ్రిటీషు వారి కాలంలో భారత దేశ విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి.ముఖ్యముగా రెండు మార్పులు చెప్పుకోవాలి: ఒకటి అప్పటివరకూ ఎన్ని మార్పులు జరిగినా భారతదేశంలో విద్యావ్యవస్థ మతప్రధానమైనదిగానే ఉండినది, అయితే హిందూ మతము, లేదా బౌద్ద మతము లేదా ముస్లిం మతము, కానీ బ్రిటీషు వారు వచ్చిన తరువాత భౌతిక విద్యకు ప్రాధాన్యం పెరిగినది, వేదాలు చదవడం మానేసి ప్రజలు సైన్సు మొదలగున్నవి చదవడం మొదలుపెట్టినారు. ఇహ రెండవ ముఖ్యమైన మార్పు ఇంగ్లీషు భాషలో విద్యాబోధన, అప్పటివరకు వివిధ భారతీయ భాషలలో ముఖ్యముగా సంస్కృతములో లేదా అరబిక్ లేదా ఉర్దూ లలో జరిగే విద్యా బోధన ఇంగ్లీషుభాషలోనికి మార్చబడినది, అంటే మొత్తం మార్చబడినది అని కాదు, కానీ పరిపాలకుల ఆర్థిక సహాయం కేవలం ఇంగ్లీషు బోధించు పాఠశాలకే ఇవ్వసాగినారు, దానితో ఇంగ్లీషునకు ప్రాముఖ్యత పెరిగింది. బ్రిటీషు వారి విద్యావిధానంలో ఎన్నో కమిటీలు వేసినారు, ఎన్నో సంస్కరణలు తేప్రయత్నించారు, కానీ వారు భారత దేశాన్ని వదిలే సమయానికి దేశంలో అక్షరాస్యత పది శాతం కూడాలేదు.దీనికి కారణం వారు పాటించిన జల్లెడ పద్ధతి లేదా ఫిల్టరు పద్ధతి.దీని ద్వారా కేవలం పై తరగతి వారికి చదువు చెప్తితే వారు క్రింది తరగతి వారికి నేర్పుతారు అని భావించడం జరిగింది.కానీ అది ఆచరణలో పెద్ద ఫెయిల్యూరుగా మిగిలినది। సంస్థానాలలో విద్యావ్యవస్థ నిజాం సంస్థానంలో విద్యావ్యవస్థ నిజాం కాలంలోని విద్యావ్యవస్థ గురించి మనకు చాలా ఆధారములు ఉన్నాయి.ముఖ్యముగా చివరి నిజాం కాలం గురించి పీ వీ నరసింహరావు గారి ది ఇన్ సైడర్ లేదా లోపలి మనిషి నుండి దాసరథి రంగాచార్య వారి ఆత్మ కథ నుండి తెలుస్తున్నదేమిటంటే, ఆ రోజులలో రాజు సహాయం చేసిన విద్య అరబిక్ భాషలో ఉండేదనీ, లేదా ఉర్దూ భాషలోనైనా ఉండేదనీ, తెలుగు భాషద్వారా విద్యావ్యాప్తికి బొత్తిగా రాజాశ్రయం లేదని తెలుస్తున్నది, తరువాత వచ్చిన గ్రంథాలయోద్యమం వంటివాటి ద్వారా ఎక్కువ మంది ప్రజల మాతృభాష అయిన తెలుగు ద్వారా విద్యావ్యాప్తికి ప్రయత్నాలు జరిగినాయని తెలుస్తున్నది.స్వాతంత్ర్యయం తరువాత ఈ సంస్థానములలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకునాయి.చాలా పల్లెలు పోటీ పడి పాఠశాలలు నెలకొల్పినాయి. బరోడా సంస్థానం ఈ సంస్థానంలోని రాజులు ప్రజలకు ప్రాథమిక విద్య (అనగా ఐదవ తరగతి వరకూ) పూర్తి ఉచితం మరియూ తప్పనిసరి చేసారు, దీనివల్ల స్ఫూర్తి పొందిన గోఖలే మహానుభావుడు ఈ విధానాన్ని భారతదేశం మొత్తం ప్రవేశపెట్టాలని మూడుమార్లు విఫలయత్నాలు చేసాడు. స్వాతంత్రానంతర విద్యావ్యవస్థ ప్రస్తుత పరిస్థితి చూడండి విద్య భారతదేశంలో విద్య మూలాలు వర్గం:భారతదేశ విద్యావ్యవస్థ
వైదిక యుగంలో విద్యావ్యవస్థ
https://te.wikipedia.org/wiki/వైదిక_యుగంలో_విద్యావ్యవస్థ
పురాతన కాలంలో విద్యను మనిషి మూడవ కన్నుగా భావించారు. జ్ఞానానికి మార్గముగా ఈ చదువును భావించారు. ఆనాటి విద్య యొక్క చివరి లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం, కానీ తక్షణ గమ్యం మాత్రం తమ అభిరుచులకు, శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా ఉపాధి పొంది సమాజానికి తమ వంతు సహాయం చేయడం. విద్య జీవితానికి వెలుగునిస్తుందని, అది లేనివాడు గుడ్డివానితో సమానమని భావించేవాళ్ళు. విద్యను వారు చాలా గౌరవంగా భావించారు. వారి మాటల్లోనే చెప్పాలంటే "స్త్రీపురుషులకు విద్య చాలా ముఖ్యమైనది, అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, తల్లిలాగా పోషిస్తుంది, తండ్రిలా మార్గదర్శిలా నిలుస్తుంది, భార్యలాగా సుఖసౌఖ్యాలను ప్రసాదిస్తుంది, కీర్తిని సంపాదిస్తుంది, కష్టాలు తొలిగిస్తుంది, స్వచ్ఛమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది, నాగరికునిగా మారుస్తుంది, పొరుగుదేశంలో ప్రయాణిస్తుంటే మంచి తోడుగా నిలుస్తుంది, కనుకనే దానిని కల్పవృక్షంగా భావిస్తారు". ఇంకా చెప్పాలంటే స్వదేశ పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనగా "రాజు తన రాజ్యంలోనే పూజించబడతాడు, కానీ విద్వాంసుడు అన్ని దేశాలలోనూ పూజించబడతాడు" ఈ కాలంలోని విద్యావ్యవస్థ ముఖ స్వరూపం ఫీజు ఉచితంరాజకీయ నియంత్రణ లేదుగురువుల, ఉపాధ్యాయుల గౌరవం, స్థితిఉన్నత స్థితిప్రదేశంగురుకులాలులక్ష్యం, గమ్యంఆత్మసాక్షాత్కారంతక్షణ గమ్యంవృత్తి విద్య (కులాలను అనుసరించి ?)బోధనా పద్ధతి వల్లెవేయడం, గుర్తుంచుకోవడం, ఒక్కొక్కరికీ చెప్పడం, ప్రయాణం ద్వారా అనుభవాల ద్వారాభాష సంస్కృతందండన పద్ధతులు స్వయం నియంత్రణ, corporal స్త్రీ విద్య బాగానే ఉండేదిశాస్త్రీయ విద్య ఖనిజాల త్రవ్వకం, లోహపు పని, ఆర్కిటెక్చరు, గణితము, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం మొదలగునవి వ్యాపారాత్మక విద్య కొద్దిగా ఉండేదిగణితము చాలా బాగుండేది, రేఖాంశ శాస్త్రము మంచి వృద్ధిలో ఉండేది, ఆర్యభట్టారకుడు రచించిన శుల్వసూత్రములు, క్రీస్తు పూర్వం 400 నుండి క్రీస్తు శకం 200 మధ్యకాలంలో, చాలా ప్రముఖమైనవి, సున్నా కూడా ఈ కాలంలోనే కనుగొన్నారు. ఈ కాలంలో గురు శిష్య సంబంధాలు చాలా గొప్పగా ఉండేవి, గురువు శిష్యునికి తండ్రిలాగా ఉండేవాడు. లోపాలు జడమయమైనది, మార్పునకు అవకాశం తక్కువ పాఠ్యాంశాలు కఠినమైనవి క్రమశిక్షణ మరీ ఎక్కువ స్త్రీ విద్య ఉన్నా, తక్కువే పూర్తిగా మతపరమైన విద్య వ్యక్తిత్వ వికాసం ఈ కాలంలో నాలుగు స్థంబాలపై ఆధారపడి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసేవారు, స్వయం గౌరవం, ఆత్మ గౌరవం ఆత్మ విశ్వాసం ఆత్మ సంయమనం యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం ఈ కాలంలో విద్య తప్పనిసరి, అన్ని తరగతుల వారికినీ, కొన్ని పాఠ్యాంశములు వ్యాకరణ శాస్త్రము తత్వ శాస్త్రము హేతు శాస్త్రము ఆయుర్వేదము కళలు గణితము ఖగోళము అస్త్ర విద్య అర్థ శాస్త్రం నాలుగు వేదాలు శిక్ష కల్పము నిరుక్తము ? జ్యోతిష్యాస్త్రము ధర్మము నీమాంశ తర్క పురాణాలు మొదలగున్నవి ఇప్పటి కాలానికి మల్లె పిల్లలకు రాజభోగాలుండేవి కావు. రాజు కొడుకైనా బడుగు బాపడి కుమారుడైనా సరే ఒకేలా ఉండాలి. బిక్ష వృత్తి ద్వారా రోజూ పొట్టపోసుకోవాలి, కానీ సమాజంలో వీరికి గౌరవం మెండుగా ఉండేది, ఇంటికి వచ్చిన విద్యార్థికి లేదని చెప్పడం అపచారంగా భావించేవారు. విద్య అందరికీ ఉచితంగానే ఉండేది. ఇవీ చూడండి పర్ణశాలలు ప్రాచీన విద్యాలయాలు వర్గం:భారతదేశ విద్యావ్యవస్థ వర్గం:భారతదేశంలో విద్యా విధానం వర్గం:విద్య
బౌద్ద మతం విద్యావ్యవస్థ
https://te.wikipedia.org/wiki/బౌద్ద_మతం_విద్యావ్యవస్థ
మొదట కేవలం బౌద్ద సన్యాసులకు మాత్రమే పరిమితమైన విద్యావిధానం తరువాత అందరికీ అనుమతించాడినది. ఆరామాలు విద్యాకేంద్రాలుగా విలసిల్లినాయి. సంస్కృతము ప్రముఖమైన స్థానం పొందినప్పటికీ దేశభాషలాలోనే విద్యావిధానం వ్యాప్తిలో ఉండేది. విద్యార్థి జీవితం మొదట సహజ (ముందుకు వెళ్ళడం) అనే ఒక ఉత్సవం ద్వారా విద్యార్థిని ఆరు సంవత్సరాల ప్రాయంలో ఆరామంలోనిని అనుమతించేవారు. తరువాత పన్నెండు సంవత్సరాల ప్రాయంలో ఉపసంపద అనే మరో కార్యక్రమం ద్వారా అతనిని కొద్దిగా పెద్దవానిని చేసేవారు. ఇప్పటినుంది బిక్షం వేసుకోవడం, కాషాయం ధరించడం, చెట్ల క్రింద బ్రతకడం, ఆవు మూత్రం ఔషదంగా తీసుకోవడం, శృంగారానికి దూరంగా ఉండటం, దొంగతనాలు చేయకుండటం, చంపకుండా ఉండుటం వంటివి చేయాలి. విద్యా విధానం ఎంతో మంది ఉపాద్యాయులు ఉండేవారు. ఇప్పటిలాగానే తరగతులు ఉండేవి. పాఠ్యాంశాలు మతపరమైనవి సాహిత్యం పాళీ, సంస్కృతం బుద్ధుని బోధనలు కవిత్వం ఖగోళశాస్త్రం తత్వ శాస్త్రం హిందూ ధర్మాలు, మతం, మొదలగున్నవి ఫీజులు ఉచితం, పూర్తి ఉచితంగా బోధన, నివాసం, వస్త్రాలు ఇచ్చేవారు. బిక్షాటన తప్పనిసరి, ముఖ్యముగా పన్నెండు సంవత్సరాల తరువాత. రాజులు, ధనికులు ఈ విద్యాలయాల పోషన చూసుకునేవారు. విశ్వవిద్యాలయాల నిర్వహణ ఈ కాలంలో గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు వచ్చినాయి. వీటి నిర్వహణ ఇప్పటివలే ఉండేది ఒక బౌద్ద బిక్షువు పెద్దగా ఉండేవారు, ఇతనిని వయసు, అనుభవం, వ్యక్తిత్వం ఆధారంగా నిర్ణయించేవారు. (ఇప్పటి మన VC లాగా అన్నమాట) తరువాత అతనిక్రింద రెండు కౌన్సిల్లు ఉండేవి (లేదా మండలాలు ఉండేవి). ఒకటి విద్యా మండలి (మన teaching staff), వీరు బోధన, విద్యార్థులను చేర్చుకోవడం, పాఠ్యాంశాల నిర్ణయం, పరీక్షలు నిర్వహించడం చేసేవారు. తరువాతది నిర్వాహ మండలి (వీరు మన non teaching staff లాగా అన్నమాట). వీరు నిర్మాణాలు, ఆహారం, బట్టలు, వైద్యం, వసతి సౌకర్యాలు, ఆర్థిక వ్యవహారాలు చూసుకునేవారు. హిందూ పద్దతి నుండి మార్పులు విశ్వవిద్యాలయాలు వచ్చినాయి గురుకులాలు పోయి పెద్ద పెద్ద ఆరామాలు వచ్చినాయి కానీ పాఠ్యాంశాలు మాత్రం అంతే పెద్దగా వచ్చినాయి, వేదాలు పోయి బౌద్ద మత గ్రంథాలు వచ్చినాయి, అంతే తేడా స్త్రీవిద్య బహు ప్రాచుర్యం పొందినది, ముఖ్యముగా నాలుగవ శతాబ్దం వరకూ. ఈ కాలంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఈ కాలంలో అనేక ప్రముఖ విశ్వ విద్యాలయాలు వచ్చినాయి. వాటిలో చెప్పుకోవలసినవి నలందా, తక్షశిల, కంచి, మిథిల మొదల్గున్నవి వర్గం:భారతదేశ విద్యావ్యవస్థ
ప్రాచీన భారత దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాకేంద్రాలు
https://te.wikipedia.org/wiki/ప్రాచీన_భారత_దేశంలోని_ప్రముఖ_విశ్వవిద్యాకేంద్రాలు
కన్యాకుబ్జము(కనౌజ్)‌ కన్యాకుబ్జము హిందూ విద్యాకేంద్రముగా విలసిల్లినది. ముఖ్యముగా యశోవర్థనుడు దీని ప్రాముఖ్యతలో ప్రశంశనీయమైన స్థానం వహించాడు. ఇతను దీనిని సుమారుగా క్రీస్తు శకం 675 లో అభివృద్ధిచేసాడు. ఇక్కడ ముఖ్యమైన అభివృద్ధి పూర్వ మీమాంసలో జరిగింది. ఇక్కడి గురువులు బహుభూతి, అతని గురువు కుమార లీలాభట్టు. కంచి కంచి లేదా కాంచీపురం మరొక విద్యా కేంద్రం. ఇక్కడ హుయాన్ త్సాంగ్ వచ్చినప్పుడు ధర్మపాల అను పండితుడు నూరుమంది సింహళ దేశ పండితులను ఓడించాడు. ఈ వాదం ఒక వారం రోజులు జరిగింది. కాశి కాశీ లేదా బెనారస్‌, ఒక విద్యా కేంద్రం. ముఖ్యముగా ఏడవ శతాబ్దం నుండే దీనిలో విద్యా సువాసనలు దేశమంతా వ్యాపించినాయి. అశోకుని కాలంలో దీని ఖ్యాతి దశదిశలా వ్యాపించింది. ఇక్కడ పదిహేను వందల మంది బౌద్ధ సన్యాస విద్యార్థులు ఉండేవారు. పన్నెండవ శతాబ్దం అరకూ ఇది బౌద్ధ విద్యా క్షేత్రంగా ఉండేది.తరువాత హిందూ విద్యా నిలయంగా మారినది. పదకొండవ శతాబ్దంలో ఇది ముఖ్య స్థానం వహించింది. శంకరాచార్యులు కూడా ఇక్కడికి వచ్చి, ఇక్కడి పండితులను ఓడించారు. ఇక్కడి పండితులతో వాదన ఓ ముఖ్యమైన ప్రక్రియ. దక్షిణాది నుండి చాలా మంది పండితులు వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్బర్, షాజహాన్, దారా షికోవ్ వంటి ముస్లిం ప్రభువులు కూడా దీనికి ధన సహాయం చేసారు. మిథిల మిథిల లేదా విదేహ, ప్రాచీన కాలం నుండి ఒక విద్యా కేంద్రము. ఇక్కడి జనకుడు జగద్విఖ్యాతుడు. తరువాత కామేశ్వర వంశం (1350 - 1515) కాలంలో మరింత ప్రసిద్ధి పొందినది. ఇక్కడి జగద్దర పండితునికి చాలా కీర్తి ఉంది. కవి విద్యాపతి కూడా ఇక్కడి వాడే. న్యాయ విభాగం యొక్క అభివృద్ధి ఇక్కడ జరిగింది. దీనిని గంగేశ పండితుడు, పక్షధార పండితుడు కలిసి అభివృద్ధి చేసారు. ఇక్కడ పరీక్ష పద్ధతులలో ఓ చమత్కారం ఉన్నది, ఓ పెద్ద పుస్తకాన్ని తెచ్చి ఓ సూదిని దానిలోనికి గుచ్చుతారు. ఆ సూది ఎంతవరకూ వెళ్తే ఆ తరువాత తాళ పత్రాన్నుండి ప్రశ్నలు వేస్తారు. దీనిని శాలక పరీక్ష అనేవారు. నదియ లక్ష్మణ సేన పండితుడు, 1106 - 1138, ఇక్కడివాడు. హల్యాయుద్ధ అను గొప్ప జ్ఞాని మరియూ ప్రధానమంత్రీ, శూలపాణి అను న్యాయ శాస్త్ర నిపుణుడు, గీత గోవిందం విరచించిన జయదేవ కవి ఇక్కడివారే. నదియా భారత సాంఘిక వ్యవస్థలో జోక్యం చేసుకోని ముస్లిం పరిపాలకుల కాలంలో చాలా ప్రఖ్యాతి వహించింది. ఇది హిందూ శాస్త్ర పరిశోధనకూ, వాగ్యుద్ధాలకూ వేదికగా నిలిచింది. ఈ కాలంలో మిథిల చాలా జటిలంగా తయారయింది. ఎందుకంటే అక్కడనుండి ఏ శాస్త్రాన్నీ కూడా బయటకు పంపేవారు కాదు. కనీసం చిన్న తాళపత్ర గ్రంథాన్ని కూడా పంపించేవారు కాదు. ఇటువంటి పరిస్థితులలో నదియాకి చెందిన ప్రఖ్యాత సార్వభౌమ భట్టారకుడు రెండు పుస్తకాలను మిథిలలో చదివి తరువాత వాటిని తు. చ. తప్పకుండా లిఖించారు. ఈ సార్వభౌమ భట్టారకుడినే నిమాయి పండితుడుగా పేరుగాంచిన శ్రీ చైతన్య మహా ప్రభువు వాదనలో ఓడించినాదు. ఈ వివరాలు చైతన్య చరితామృతం, చైతన్య భాగవతం అను పుస్తకాలలో చెప్పబడినాయి. నలంద ఆహా! నలందా విశ్వ విద్యాలయం ఖ్యాతి తెలియనిది ఎవరికి? దేశ విదేశాలనుండి ఇక్కడికి పండితులు వచ్చేవారు, విద్యార్థులు వచ్చేవారు. వైశాల్యంలోకానీ, సంఖ్యలలో కానీ గుణంలోకానీ, నిర్వహణలో కానీ ఇది ఇప్పటి విశ్వవిద్యాలయాలకు ఏమాత్రం తీసిపోదు. భవనాలు పాటలీపుత్రం (పాట్నా)కు నలభై మైళ్ళ దూరంలో దక్షిణంగా ఉండేది. ఇక్కడి త్రవ్వకాల ఆధారంగా ఓ మైలు పొడవు, అరమైలు వెడల్పు ఉన్న ఆవరణలో పెద్ద, పెద్ద భవనాలు ఉండేవని నిర్ధారణ అవుతున్నది. ఏడు పెద్ద గదులు కల పెద్ద కేంద్ర కళాశాల, మూడు వందల చిన్న తరగతి గదులూ ఉన్నాయి. ఎన్నో అంతస్తులు కల అద్భుతమైన నిర్మాణం ఇది. ఇక్క నివాస, వసతులకు అన్నీ రెండంతస్తుల భవనాలే. ఇందు ఒకటి లేదా రెండు మంచాలు కల గదులు ఉన్నాయి. ఇక్కడి వంటశాల చాలా పెద్దది. ఆదాయ మార్గాలు దీనికి ఆదాయ వనరులుగా రెండు వందల గ్రామాలు ఉండేవి, అంతే కాకుండా రాజులు, ధనికులు ఇతోధికంగా సహాయం చేస్తుండేవారు. వసతులు ఇక్కడి విద్యార్థులకు పూర్తిగా ఉచిత భోజనం, వసతి, బట్టలూ ఇచ్చేవారు. విద్యార్థుల సంఖ్య హుయన్‌ త్సాంగ్‌ చెప్పిన ప్రకారం ఏడవ శతాబ్దంలో ఇక్కడ సుమారుగా పదివేల మంది విద్యార్థులు ఉండేవారు. గ్రంథాలయం ఇక్కడ ఓ పెద్ద గ్రంథాలయం ఉండేది, చైనా విద్యార్థులు ఎన్నో నకళ్లు ఇక్కడనుండి తయారు చేసుకొని వెళ్ళేవారు. పాఠ్యాంశాలు ఈ విశ్వ విద్యాలయము ముఖ్యముగా మహాయాన తెగకు చెందినది. అయినా హీనయానము కూడా బోధించేవారు. హిందూ మత విషయములు కూడా బోధించేవారు. తరువాత వ్యాకరణము, తర్కము‌, సాహిత్యము, వేదాలు, వేదాంతాలు, సాంఖ్యము మొదలగునవి బోధించేవారు. ఉపాధ్యాయుల సంఖ్య ఇక్కడ సుమారుగా వెయ్యి మంది మంచి అనుభవం కల సన్యాస ఉపాధ్యాయులు ఉండేవారు. ప్రతి దినము నూరు తరగతుల వరకు జరిగేవి. విద్యార్థులు వివిధ పాఠ్యాంశాలనుఎన్నుకోవచ్చు. తక్ష శిల ఇది రావల్ఫిండి నుండి పశ్చిమంగా ఇరవై మైళ్ళ దూరంలో ఉండేది. ఇది గాంధార రాజ్యానికి రాజధాని. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలోనే ఇక్కడ‌ ముఖ్యమైన నిర్మాణాలు ఉండేవి అనడానికి ఆధారాలు ఉన్నాయి. అలెగ్జాండరు ఇక్కడ నుండి గొప్ప తత్వ శాస్త్ర పండితులను తన రాజ్యానికి తీసుకొని వెళ్లినాడు. ఇది ఓ పెద్ద విశ్వ విద్యాలయం లాగా కాకుండా, చిన్న చిన్న సంస్థలు వ్యక్తుల ద్వారా నడపబడుతూ ఉండేవి. ఎక్కువలో ఎక్కువ ఇక్కడ ఓ సంస్థకు ఐదు వందల మంది విద్యార్థులు ఉండేవారు. ఇక్కడ కేవలం ఉన్నత విద్య మాత్రమే లభించేది. కేవలం జిజ్ఞాసులు, అధికమైన జ్ఞానము కలవారు మాత్రమే ఇక్కడికి మరింత జ్ఞానార్జన కోసం వెళ్ళేవారు. పాఠ్యాంశాలు తత్వ శాస్త్రము, పద్దెనిమిది శిల్పాలు, వైద్యము, శస్త్ర చికిత్స, విలు విద్య, ఖగోళ శాస్త్రము, జ్యోతిషశాస్త్రము, రేఖా గణితము, భూగోళ శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, వ్యవసాయము, తంత్రవిద్య(మాయమంత్రములు)‌, నాట్యం, బొమ్మలు వేయుట. వల్లభి వల్లభి ఒక పురాతన విశ్వ విద్యాలయం. ఇది క్రీసు శకం ఐదవ శతాబ్దం నుండి క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం వరకు ప్రఖ్యాతి గాంచింది. ఇది హీనయాన బౌద్ధ మతానికి చెందినది. ఇక్కడ ధర్మ, మత విషయాలు, నీతి విషయాలు, ఆయుర్వేదం బోధించేవారు. విక్రమశిల విక్రమశిల విశ్వ విద్యాలయాన్ని ధర్మపాల మహారాజు ఎనిమిదవ శతాబ్దంలో అభివృద్ధి పరచాడు. నాలుగు శతాబ్దాలు ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి వహించింది. ముఖ్యముగా త్రివిష్టపము(టిబెట్)‌ నకు ఇక్కడికీ మంచి సంబంధాలు ఉండేవి. ఇక్కడ పన్నెండవ శతాబ్దంలో సుమారుగా మూడువేల మంది విద్యార్థులు ఉండేవారని తెలుస్తున్నది. ఇక్కడ ఉన్న గ్రంథాలయం చాలా పెద్దది. ఇక్కడ మంచి నిర్మాణాత్మక నిర్వహణ ఉండేది. కాని ఖిల్జీ దీనిని ఓ కోటగా పొరబడి నాశనం చేసాడు, అని చెప్తారు. ఇందులో పట్టాలూ, బిరుదులూ ఇచ్చేవారు! వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:విశ్వవిద్యాలయాలు
తెలుగు సంస్కృతి
https://te.wikipedia.org/wiki/తెలుగు_సంస్కృతి
తెలుగు సాంస్కృతిక చరిత్ర కళలు, నిర్మాణ శైలి, సాహిత్యం, ఆహారపుటలవాట్లు, ఆంధ్రుల దుస్తులు, మతం, తత్త్వాలుగా విభజించవచ్చు. ఇక్కడి వాగ్గేయకారులు, కూచిపూడి (నృత్యము) సుసంపన్నమైన సంస్కృతి-సంప్రదాయాలకి నిలువెత్తు సాక్ష్యాలు. కర్ణాటక సంగీతం లో, శాస్త్రీయ సంగీతంలో తెలుగు భాష ఇట్టే ఇమిడి పోవటంతో ఆంధ్ర ప్రదేశ్ సంగీతానికి, సాహిత్యానికి, నృత్యానికి మాతృకగా వ్యవహరించింది. హైదరాబాదు ప్రాంతంలో పర్షియా నిర్మాణ శైలికి స్థానిక కళాత్మకత మేళవించి కట్టడాలని నిర్మించారు. వరంగల్లులో గ్రానైటు, సున్నపురాయి ల కలయికలతో కట్టడాలని నిర్మించారు. శాతవాహనులు ఆధ్యాత్మిక సూక్ష్మాలని తెలిపే శిల్పకళతో కూడిన కట్టడాలు అమరావతిలో నిర్మించారు. ప్రాచీన భాషగా గుర్తింపబడ్డ తెలుగు యొక్క సాహిత్య సంస్కృతి విశాలమైనది. అనేక ప్రాచీన కవుల, రచయితల వలన తెలుగు ఉత్తాన పథాన్ని చేరినది. ఆధ్యాత్మిక, సంగీత, తత్వ రచనలకి అనువుగా ఉండటంతో తెలుగువారితో బాటు, తెలుగేతరుల మెప్పు పొందినది. ఇటాలియన్ భాష వలె అజంతాలతో ఉండటం వలన ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని సంబోధించబడ్డది. అంతరించిపోతున్న అద్భుత భాషకి మరల జవసత్వాలని అందించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్తో తెలుగు ఖండాంతరాలకి వ్యాప్తి పొందినది. అనేక ఆధునిక రచయితలు తెలుగు భాషని క్రొత్త పుంతలు త్రొక్కించారు. బెంగుళూరు, చెన్నై నగరాలలో ఆంధ్ర శైలి భోజన శాలలు విరివిగా ఉండటం, వీటిలో తెలుగువారితో బాటు, స్థానికులు, (తెలుగు వారు కాని) స్థానికేతరులు వచ్చి సుష్ఠుగా భోం చేసి వెళ్ళటం, తెలుగువారి ఆహారం యొక్క ప్రాశస్త్యం గురించి చెబుతాయి. గోంగూర, తాపేశ్వరం కాజా, పూతరేకులు, ఆవకాయ, హైదరాబాదీ బిరియాని, హలీమ్, ఇరానీ చాయ్లు తెలుగు ప్రజల వంటలుగా సుప్రసిద్ధాలు. కళలు ఆంధ్రప్రజలు తమ జీవనవిధానంలో వినోదానికెప్పుడూ పెద్ద పీటనే వేసారు. కళాకారులను కళలనూ గుర్తించి, గౌరవించి పోషించుట చేతనే చాలాకాలం అజరామరంగా జీవించాయి. ఆంగ్లభాష ప్రబలి విద్యుతాధార వినోదం ప్రజలకు అందుబాటులోకి రావడంతో మెల్లమెల్లగా ఒక్కొక్క కళ కనుమరుగవుతూ ప్రస్తుతం అంతరించే స్థితికి చేరుకున్నాయి. అలాంటి కళలు కొన్ని - ముగ్గులు thumb|right|అందమైన ముగ్గులు వేయడానికి ఇదొక పద్ధతి తూర్పు తెలతెలవారుతుండగా, పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు వరిపిండితోనూ సున్నపు పిండితోనూ వేసి వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు. ముగ్గు కేవలం సంస్కృతి-సంప్రదాయాలలో భాగం మాత్రమే కాదు. దీని వెనుక శాస్త్రీయాంశము కూడా ఉంది. ఇంటి ముందు కళ్ళాపు చల్లి దాని పై ముగ్గు వేస్తే వీటిలో నున్న జీవ రసాయనాలు క్రిమి కీటకాలని వెలుపలి నుండి ఇంటిలోనికి రాకుండా నిరోధిస్తాయి. వివిధ రకాల సూక్ష్మక్రిముల ద్వారా ప్రబలే రోగాలని ఇవి నిరోధిస్తాయి. ఇంటి లోగిళ్ళకి ముగ్గులు అలంకారం కూడా తెచ్చిపెడతాయి. కాంక్రీటు అడవులు నిర్మించబడుతున్న ఆధునిక యుగం లో, ఇరుకైన అపార్టుమెంట్ల సంస్కృతి పెరగటంతో ముగ్గులు నగరాలలో అక్కడక్కడా కనిపించిననూ కళ్ళాపు మాత్రం దాదాపు కనుమరుగైనది. ఉగాది వేపపువ్వు, చెరుకుముక్కలు, కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు, బెల్లం, చింతపండు, అరటి పండు కలిపిన ఉగాది పచ్చడి ఎంతో శ్రద్ధతో తయారు చేస్తారు. వ్యక్తి జీవితంలో సుఖదుఃఖాలకు ప్రతీక అయిన తీపి, చేదుల వేపపువ్వు పచ్చడి ప్రసాదం తీసుకోకుండా ఉగాదినాడు ఏ పనినీ తలపెట్టకూడదని ప్రజల నమ్మకం. జానపద నృత్యాలు అన్ని సంస్కృతులకు ఉన్నట్లే తెలుగువారికే ప్రత్యేకమైన జానదకళలు అనేకం ఉన్నాయి. కొమ్మునృత్యం కొమ్మునృత్యం గోదావరి తీర ప్రాంతాలలో నివసించే గిరిజనుల సంప్రదాయ నృత్యం. ఈ నృత్యం ప్రదర్శించే కోయలు వారి భాషలో ఈ నృత్యాన్ని పెరియకోక్ ఆట అని అని అంటారు. కోయ భాషలో పెరియకోక్ అంటే దున్నపోతు కొమ్ములు అని అర్థం. దున్నపోతు కొమ్ములు ధరించి, దున్నలు కుమ్ముకునే రీతిలో నృత్యం చేస్తారు కాబట్టి ఈ నృత్యం కొమ్ము నృత్యంగా వ్యవహరింపబడుతున్నది. వీరు ఉపయోగించే వాద్యం "డోలు కొయ్య". చైత్రమాసంలో భూదేవి పండుగను ఘనంగా చేసుకుంటారు కోయలు. ఆ పండుగ సమయంలో పురుషులు అడవులలోకి వేటకి వెళ్ళడం పరిపాటి. వేట ముగించుకుని విజయవంతంగా ఇంటికి చేరుకున్న సందర్భంగా కోయలు దున్నపోతు కొమ్మలు, నెమలి ఈకల గుత్తిని పొదిగిన బుట్టను తలకు అలంకరించుకుని రంగు రంగుల బట్టలు వేసుకుని ఆయా సంప్రదాయ వాద్యాల్ని వాయిస్తూ చేసే నృత్యం, ఈ కొమ్ము నృత్యం. తప్పెటగుళ్ళు thumb|right|జంగం దెవర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో యాదవ కులానికి చెందినవారు చేసే నృత్యాన్ని తప్పెటగుళ్ళు అంటారు. ఎదురు రొమ్ముపై ధరించిన రేకు తప్పెటలను వాయిస్తూ వీరు ముఖ్యంగా శ్రీకృష్ణగాథలను గానం చేస్తారు. వీరు ఎదురురొమ్ముపై తప్పెట గుళ్ళను కాళ్ళకు చేతులకు చిరు మువ్వలను దరించి అందరూ ఒకే పద్ధతిలో కదులుతూ గానం చేస్తుంటారు. డప్పు పల్లెల్లో ప్రముఖమైన ప్రచార సాధనం డప్పు. అది ఏ ఉత్సవానికైనా పల్లెల్లో విశేషంగా ఉపయోగపడే వాద్యం. ఉద్రేకాన్ని, ఉత్తేజాన్ని కలిగించే డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ చేసే నృత్యం డప్పు నృత్యం. ముందు మెల్లగా ప్రారంభమయ్యే ఈ నృత్యం రాను రాను పదవిన్యాసంతో పాటు వాద్యం కూడా ఉధృతమై, ఉత్తేజం కలిగిస్తుంది. ఆంధ్రదేశంలోని అన్ని పల్లె ప్రాంతాలలోను డప్పు ఉనికి మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. జముకు పూర్వపు రోజులలో శక్తి గ్రామ దేవతల కొలుపులు చేసేటప్పుడు బవనీలు అనబడేవారు అతి బీభత్సంగా జముకు అనే వాద్యాన్ని గుండెలదిరేలా మ్రోగించేవారు. కల్లు, సారాయి లాంటి మత్తు పదార్థాల్ని సేవించి కణకణలాడే కళ్ళతో శక్తి ముందు చిందులు తొక్కుతూ గొర్రెలను, మేకలను గావు పట్టేవారు. గావు పట్టడం అంటే బలి పశువును నోటితో మెడకొరికి చంపడం అని అర్థం. ఆ పైన నెత్తురు గ్రోలి, దాని ప్రేగులు ధరించి, దొబ్బలు నోటకరిచి, జముకులను వాయిస్తూ వీధుల వెంట తిరిగేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయం పోయింది. కాలక్రమేణా ఈ వాద్యం ఆధారంగా కాటం రాజు మొదలైన కథా గీతికల్ని ఆలపించడం, ఆ కథలు జముకుల కథలుగా ప్రసిద్ధి చెందడం జరిగింది. శరభనృత్యం వంటినిడా విభూతి పుండ్రాలు ధరించి శరభ శరభా, హశ్శరభ శరభా అని వీరంగం వేస్తూ, చిందులు తొక్కుతూ, పొడవాటి పలుపు తాడుతో వీపులపై తాటించుకుంటూ ఖడ్గాలను చేత ధరించి వాటిని తిప్పుతూ నృత్యం చేస్తారు. మరొక పద్ధతిలో శూలాలతోనూ శూలాల చివర నూనె గుడ్డలు చుట్టి దానికి మంటలు పెట్టి వాటిని త్రిప్పుతూ నృత్యం చేస్తారు. ఇది కూడా పల్లెలలో ప్రసిద్దమైన జానపద కళ. ఇప్పటికీ ఈ నృత్యాన్ని చాలా చోట్ల వీరభధ్రస్వామి దేవాలయాలలో, నిప్పుల గుండం తొక్కే సందర్భాలలోనూ చూడవచ్చు. ఉరుముల నృత్యం వీరభద్ర ప్రస్తాయం అనునది వీరాశైవులు భక్తితో వీరభద్రుని పూజిస్తారు... ఇ కార్యక్రమం లో దండకలు బాగా ఉంటాయి డప్పరి నృత్యం గొంతెలమ్మ అశ్వనృత్యం వాలకం నృత్యం చెంచునృత్యం ఘటనృత్యం ఘటనృత్యం లేదా గరగనృత్యంగా పిలిచే ఈ ప్రక్రియలో తలపై కలిశాకారం కలిగిన ఘటాన్ని ఎత్తుకొని డప్పులశబ్ధానికి లయగా నృత్యం చేస్తారు. ఐదు లేదా మూడు సర్పాల ఘటాలతో జాతరలలో ఎక్కువగా వెరు నృత్యం చేస్తుంటారు. జానపద కళలు కొమ్మదాసరి చిందు భాగవతం Katipapala Parusha Ramudu gadhwal jila jiladudinne gramu wadapali modalam మందులవారి వేషాలు ప్రదర్శనలు బుట్టబొమ్మలు thumb|right|బుర్రకథ కళా కారులు బుట్టబొమ్మలు ఆంధ్ర ప్రాంతములో పెళ్ళి ఊరేగింపులలోనూ దేవుని కళ్యాణ ఉత్సవ సమయాల్లోనూ, పెద్ద పెద్ద తిరునాళ్లలోనూ, జాతర్లలోనూ వినోదము కొరకు ప్రదర్శింపబడుతూ ఉంటాయి. బుట్టబొమ్మలు ప్రజా సమూహాల మధ్య ఎత్తుగా ఉండి అందరికీ కనిపించే తీరులో అందర్నీ ఆకర్షిస్తూ ఉంటాయి. బుట్టబొమ్మలు ఎత్తుగా ఉండి నడుము భాగమునుండి క్రిందికి దిగేకొద్దీ లోపల కాళీగా మారుతూ పెద్దగా బుట్ట ఆకారంలో మారుతుంది. అందువలననే వీటిని బుట్టబొమ్మలంటారు. బొమ్మల పై భాగమంతా బొమ్మ ఆకారంగా ఉండి లోపలి భాగం డొల్లగా ఉండి బొమ్మ యొక్క కళ్ళభాగంలోనూ, నోటి దగ్గరా రంధ్రాలుంటాయి. ఆటగాడు ఈ లోపలి భాగంలో దూరి, తలను దూర్చి నృత్యంచేస్తే కేవలం బొమ్మే అభినయించినట్లుంటుంది. బుట్ట బొమ్మలు ఎవరితోనూ మాట్లాడవు. ప్రజల మధ్య తిరుగుతూ వినోద పరుస్తాయి. బుట్టబొమ్మలలో పలురకాలు కలవు మోడీ ప్రదర్శన గారడీ ప్రదర్శన జిత్తులగారడీ ఆచారాలు భారతీయ మత సంప్రదాయాలలో కొన్ని తెలుగునాట కూడా ఆచరించబడుతూ ఉన్నాయి. బొమ్మలకొలువు ఏడాది పొడుగునా అల్మారాలలో దాగిన రంగురంగుల దేవతల బొమ్మలు, జంతువుల బొమ్మలు, దొరబొమ్మలు, దేశభక్తుల బొమ్మలు, కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి, మరి కొన్నిచోట్ల దసరాకి ప్రత్యక్షమై ధూప, దీప, నైవేద్యాలు అందుకుంటూ కొలువు తీరుతాయి. బొమ్మల కొలువులు చిన్న పిల్లలతో పెట్టించి చుట్టుపక్కల నివసించే ఇల్లాండ్రను పిలిచి రాజూ-రాణీ, లేదా పెళ్ళికొడుకు-పెళ్ళికూతురు బొమ్మలకు పెళ్ళి చేయడమో లేదా పేరంటం చేయడమో చేసి వచ్చిన ఇల్లాళ్ళకు వాయినమిచ్చి పంపిస్తారు. భజన ఉత్సవాలు ప్రభలు thumb|కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లుతున్న ప్రభ ప్రభ అనేది దేవుని ఊరేగింపుకు పల్లకీ లేనిచోట్ల ఉపయోగించే అరపలాంటి నిర్మాణము. చిన్న చిన్న దేవాలయములలో రెండు కర్రలపై నలుగురు పట్టుకొనేలా ఒక అరపను చేసి దానిపై దేవుని విగ్రహము లేదా బొమ్మను పెట్టి వెనుక దేవాలయము మాదిరి ఒక కట్టడాన్ని తేలికపాటి గడకర్రలతో రంగుల కాగితాలతో తయారుచేసి దానిపై దేవుని ఊరేగించేవారు. అది రానురానూ అంతటా వ్యాపించింది. మరొక తెలుగు సంప్రదాయం ప్రభలు. ఎంత ఎత్తు ప్రభ అయితే అంత గొప్ప. కోటప్పకొండ తిరణాలకి వందలాది రంగు రంగుల ప్రభలు శోభ చేకూర్చుతాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రభకు బహుమతిని అందచేస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని కోటప్ప కొండ ప్రసిద్ధమైన శైవక్షేత్రం. మహాశివరాత్రికి చాలా పెద్ద ఎత్తున తిరునాళ్లు జరుగుతాయి. లక్షలాది భక్తులు ఆనాడు అక్కడ ఉత్సవాలకు హాజరవుతారు. ముఖ్యంగా చూడవలసింది ప్రభల ప్రదర్శన. వందలాదిగా ప్రభలు ఆ ఉత్సవాలలో పాల్గొంటాయి. అవికాక ఇంకా కోలాటం, వీరంగం, హరికథలు మొదలైనవి ఉంటాయి. తల నీలాల మొక్కుబడులకు కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి. శివరాత్రికి రుద్రాభిషేకం, సహస్రనామార్చనలు జరుగుతాయి. ఇక్కడి శివుడిని కోటేశ్వరుడు, త్రికోటేశ్వరస్వామి అంటారు. ఆ పేరే తెలుగులో కోటప్ప అయింది. తెప్పోత్సవాలు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో, విజయదశమి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆఖరి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవం జరుగుతుంది. హంస ఆకారంలో తెప్పను రమణీయంగా అలంకరిస్తారు. దానిలో అమ్మవారిని ఉంచి నదిలో ఊరేగిస్తారు. ఒడ్డును చేరిన వేలాది భక్తులకు అది కన్నుల పండుగ. కథాకాలక్షేపాలు బుర్రకథ thumb|బుర్ర కథ కళాకారులు ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈనాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళా రూపం బుర్రకథ. యక్షగాన పుత్రికలయిన జంగం కథ, శారద కథలకు రూపాంతరమే బుర్రకథ. అది సంగీతం, నృత్యం, నాటకం -ఈ మూడింటి మేలుకలయిక. బుర్రకథలో నవరసాలూ పలుకుతాయి. ముఖ్యంగా వీర, కరుణరసాలను బాగా ఒప్పించే ప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీరగాథలను గానం చేసేందుకు ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తుంది. బుర్రకథ అనగానే నాజర్ పేరు గుర్తుకు వస్తుంది. ఆయనకు ఎందరెందరో ఏకలవ్య శిష్యులు బుర్రకథనే జీవనాధారం చేసుకొని బ్రతుకుతున్నారు. నాజర్ పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం బహుళ ప్రచారం పొందినవి. బుర్రకథ ప్రాచీనమైన తెలుగు జానపద కళ. ముగ్గురు బృందముగా ఉండే ఈ ప్రదర్శనలో మధ్య పాత్రధారి ముఖ్య కథకుడు గానూ, మిగిలిని ఇద్దరిలో ఒకరు వంత కథకు, మరొకరు హాస్య కథకులుగానూ ఉంటారు. సాధారణంగా ఇది నిలుచుని చెప్పే కథ ఐనా, సౌలభ్యత కోసం కూర్చుని కూడా బుర్రకథ చెప్పి శ్రోతలను రంజింపజేయగలవారు కొన్ని ప్రాంతాలలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపాన దొడ్డిపట్ల గ్రామంలో కూర్చుని బుర్రకథ చెప్పే బృందాలు ఉన్నాయి. బుడిగే జంగాలు బుర్రకథలకు పూర్వ రూపమే జంగం కథ. ఈ కథను చెప్పే వారినే జంగాలని బుడిగే జంగాలని అంటారు. ఒకప్పుడు దేశభక్తి మత ప్రచారాలకు ఎంతో తోడ్పడినా ప్రస్తుతం తెరమరుగై కొందరి ఉధర పోషణార్ధం కొరకే పనికొస్తున్నాయి. హరికథ హరికథ అన్నది తెలుగు వారి సంప్రదాయ కళారూపం. హిందూ మతపరమైన భక్తి కథలు, ప్రధానంగా హరిలీలలను సంగీత, సాహిత్యాల సంగమంగా చెప్పడాన్ని హరికథ అంటారు. గిరిజన నృత్యాలు గిరిజనులకు ప్రత్యేకమైన పలు ఆచారాలు తెలుగునాట కూడా ప్రబలమై ఉన్నాయి. తండాలనృత్యం thumb|లంబాడీ స్త్రీల నృత్యం లంబాడీలు, సుగాలీలు, బంజారాలు అని వివిధ నామాలతో పిలువబడే ఆదిమ జాతివారు నాగరిక సమాజానికి దగ్గరగా పల్లెలలో, పట్టణాలలో నివసిస్తున్నా తమ కట్టు, బొట్టు, మాట, పాట, ఆట, ఆచార వ్యవహారాలను సంస్కృతిని వందలాది ఏళ్ళుగా నిలుపుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా లంబాడీ మహిళల రంగురంగుల దుస్తులు, రకరకాల ఆభరణాలు చూడముచ్చటగా ఉంటాయి. వీరు తండాలుగా జీవిస్తారు. పెళ్ళిళ్ళలో, జాతరలలో, వీరి సాంప్రదాయక సామూహిక నృత్యం నేత్రపర్వంగా ఉంటుంది. ఆదిలాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రాంతాలలో వీరి నృత్యాలను చూసే అవకాశం ఉంది. గుసాడీ ఆదిలాబాదు జిల్లాలో రాజగోండులకు దీపావళి పెద్ద పండుగ. పౌర్ణమి నాడు ప్రారంభించి నరకచతుర్దశి వరకు గోండులు ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. నెమలి పింఛాలతో తయారు చేసిన పాగా, కృత్రిమమైన గడ్డాలు, మీసాలతో వేషం కట్టి, మెడలో గవ్వల హారాలు, తుంగకాయల దండలు, నడుముకు, మణికట్టుకు చిరు గంటలు, గజ్జెలు ధరించి, కంటి చుట్టూ తెల్లని రంగు పూసుకుని, చేతిలో కర్ర పట్టుకుని గుసాడీ నాట్యం చేస్తారు. థింసా థింసా నృత్యం విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలలో విశేషాదరణ పొందిన జానపద సామూహిక నృత్యాలలో ఒకటి. ఇది గిరిజనుల సంప్రదాయ నృత్యం. ఆడా, మగా వయసుతో నిమిత్తం లేకుండా అన్ని కొండ జాతులవారు ఈ జానపద నాట్య సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ నాట్యాన్ని ప్రతి పండుగ సందర్భంలోనూ, వివాహాది సందర్భాలలోనూ చేస్తుంటారు. వీరి దైనందిన జీవితానికి, ఆచార వ్యవహారాలకు ఈ నాట్యం అద్దం పడుతుంది. రంగస్థల ప్రదర్శనలు యక్షగానం యక్షగాన పరిణామ చరిత్ర అతి విచిత్రమైనది. రచనలో, ప్రదర్శనలో, తరతరాలకు మార్పు చెందుతూ వచ్చింది. మొదట యాత్రా స్థలాలు, కామందుల లోగిళ్ళు తదుపరి పల్లెపట్టుల రచ్చసావిడి, రాచదేవిడీలు యక్షగాన ప్రదర్శనల కథిస్థానములైనవి. వర్తమానంలో అప్పటికప్పుడు ఏ వూరి మొగనో, ఏ కోవెల వాకిటనో, ఏ సంపన్న గృహస్థు ఇంటి ముందటనో, తాటాతూటముగా నిర్మింపబడిన కమ్మల పందిరి కింద, కళ్ళాపి జల్లిన కటికనేలయే దాని రంగస్థలము. గ్రామవాసుల పందాలు ఎడ్లపందాలు తెలుగు పల్లెలలో ఎడ్ల బలాబలాలను పరీక్షించే బండ లాగుడు పందాలు సర్వ సామాన్యం. కోడి పందాలు thumb|right|200px|గ్రామీణ ప్రాంతములో కోడిపందాలు ఇప్పుడు జంతు హింసగా వీటిని నిషేధించారుగాని, ఒకప్పుడు సంక్రాంతికి ఊరూరా కోడి పందాలు తప్పనిసరిగా జరిగేవి. పల్నాటి యుద్ధానికి ఒక కారణం కోడి పందెమే. ఒకప్పుడు గ్రామాలలో కోడి పందాలు అంటే కేవలం కోడిపందాలు మాత్రమే కాదు - పందాలు జరిగే ప్రాంతములో గుండాటలు, పేక మేజిక్ ప్రదర్శనలు, బొమ్మల దుకాణాలు, మిఠాయి దుకాణాలు ఇలా వివిధములతో దాదాపు తిరునాళ్ళ వాతావరణము ప్రతిబింబిస్తూ ఉండేవి. అందుచేతే పందాలంటే ఉదయంనుంచే హడావిడి మొదలయ్యేది గ్రామాలలో. పేరుకు నిషేధం విధించినా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. సంచార ప్రదర్శనలు పగటివేషం పగటివేష కళాకారులకు రంగస్థలంతో పనిలేదు. పాత్రోచితము, రసోచితము, ప్రాంతీయోచితమైన వేషభాషలతో, నృత్య గానాలతో పట్టపగలు వేషాలు వేసుకుని హావ భావ నటనలు చిలికిస్తూ, రాగ, మేళ, తాళాలతో, పండిత పామరులను మెప్పించడం పగటివేష కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. వీరు ఊరూరా తిరుగుతూ ప్రదర్శించే ఈ రకాలైన ప్రక్రియలలో యక్షగానం ఒకటి. జంగందేవరలు తలపైన ఫణిచక్రం కలిగిన కిరీటం, నుదుట విభూతి రేఖలు, చంకలో జోలె, ఒక చేతిలో ఇత్తడి గంట, మరో చేతిలో కర్ర, జంగందేవరల ఆహార్యంగా ఉంటుంది. సంక్రాంతి రోజుల్లో బుడబుక్కలవాడు అర్థరాత్రి వచ్చి బుడబుక్కని వాయిస్తూ వెళ్ళగానే వేకువ ఝామున శంఖం ఊదుతూ, గంటను మ్రోగిస్తూ, శివుని కీర్తిస్తూ జంగం దేవర ఊరంతా కలియతిరుగుతూ, ప్రతి ఇంటి ముందు ఆగి గృహస్థులను దీవిస్తూ ముందుకు కదులుతాడు. బుడబుక్కలవాడు ఇప్పుడు బుడబుక్కల వాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. గతంలో బుడబుక్కల వాళ్లు శ్మశానం సమీపంలో నివసించే వాళ్లు. వీరు కాటికాపర్లు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే గ్రామాల్లోకి వచ్చేవాళ్లు. సంక్రాంతి పండుగకు ముందు కేవలం ఓ వారం పది రోజుల పాటు మాత్రమే వీళ్లు ఊళ్లోకి వచ్చేవాళ్లు. తమ చేతిలో డమరుకం తరహాలోని వాయిద్యాన్ని వాయించుకుంటూ ఇల్లిల్లూ తిరిగి... ఆ ఇంటికి సంబంధించి, ఇంటి సభ్యులకు సంబంధించి భూత భవిష్యత్తు వర్తమానాల గురించి రాగయుక్తంగా వినిపించేవారు. అప్పట్లో బుడబుక్కల వారి జోస్యాన్ని ప్రజలు ఎంతగానో విశ్వసించేవారు. శ్మశానంలో కొలువుండే రుద్రుడే వీరి నోట తమ జాతకాన్ని పలికిస్తారని నమ్మేవారు. జోస్యం తమకు అనుకూలంగా ఉన్నా.. ప్రతికూలంగా ఉన్నా.. ఇంటి యజమాని సదరు బుడబుక్కల వాడికి సంతృప్తి కలిగేలా ధాన్యాన్ని ముట్టజెప్పేవారు. వీరి చేతిలోని డమరుకం చేసే శబ్దం డబుక్కు డబుక్కు అంటూ వినిపించేది. అదే, వ్యావహారికంలో బుడబుక్కు బుడబుక్కు అని.. డమరుకాన్ని డబుక్కు బుడబుక్కు అన్న శబ్దం వచ్చేలా వాయించే వారిని బుడబుక్కల వాళ్లు అనీ పిలిచే వారు. నిజానికి వీరు జంగమ దేవరలు. ఒంటినిండా రకరకాల వర్ణాల వస్త్రాలను ధరించేవారు. మొలకు పంచె కట్టు ఉండేది. తలకు వర్ణరంజితమైన వస్త్రంతో పాగా చుట్టుకునే వారు. కళ్లకు ఇంతలేసి కాటుక పూసేవారు. నుదుటన భస్మాన్ని దట్టించేవారు. అసలు వీళ్లని చూడగానే పిల్లలకు భయమేసేది. అందుకే తల్లిదండ్రులు మారాం చేసే పిల్లల్ని బుడబుక్కలోడికి పట్టిస్తా జాగ్రత్త అంటూ బెదిరించి దారిలోకి తెచ్చేవారు. వీరు శ్మశానానికి సమీపంలోనే గుడిసె వేసుకొని నివసిస్తూ ఉండేవారు. మారిన కాలంతో పాటే.. వీరి వృత్తిగత జీవితమూ మారిపోయింది. ఇప్పుడు కాటికాపర్లు ఎవరూ ఊళ్లలోకి రావడం కానీ.. జోస్యాలు చెప్పడం కానీ చేయడం లేదు. శ్మశానంలోనే.. చనిపోయిన వారి బంధువుల వద్ద తమకు కావలసినంత మొత్తాన్ని డిమాండ్‌ చేసి తీసుకుంటున్నారు. కాటికాపర్లు పాములాడించేవారు హరిదాసులు thumb|సంకీర్తన చేయుచూన్న హరిదాసు|alt= ఒకచేత చిడతలు, మరొకచేత తంబురా మీటుతూ, ఇంటింటి ముంగిట ఆగి "ఏ తీరుగ నను దయ చూచెదవో.." అంటూ ఏదో కీర్తన పాడుతూ హరిలో రంగహరి అని కదిలే హరిదాసులు ధనుర్మాస రాయబారులు. చక్కని ఎర్ర రంగు పంచె కట్టుకొని, ఛాతీ మీద, భుజాలపై, నుదిటి మీద విష్ణు నామాలను పెట్టుకొని అపర నారదుల వలె అగుపించే హరిదాసులు, వారి కీర్తనలు సంక్రాంతి సమయంలో పల్లెకు కొత్త శోభను తెస్తాయి.ఈ కళలో భిక్షాటన ఒక భాగం అయినప్పటికీ ఇందులో దాగి ఉన్న భక్తిభావం పుచ్చుకునే హరిదాసు పట్ల గౌవాన్ని కలిగిస్తుంది. గృహాన్ని వెదుక్కుంటూ వచ్చే కళాప్రక్రియలలో ఇది ఒకటి. ఇది తెలుగు నేలమీద మాత్రమే కనిపించే కళాప్రక్రియ. తెలుగువారి ప్రత్యేకతలలో ఇది ఒకటి. హరిదాసు తలమీద గుమ్మడికాయ వంటి పాత్రను ధరించడం ప్రత్యేకత. ఒక చేతిలో చిడత మరొక చేతిలో తంబురా శ్రావ్యమైన కీర్తనను కొనసాగిస్తూ హరిదాసు లాఘవంగా మొత్తంగా వంగి భిక్షస్వీకరించడం ఒక సుందరదృశ్యంగా భావించవచ్చు. పులివేషం సర్కారు జిల్లాలలో దసరా పండుగకు, తెలంగాణాలో పీర్ల పండుగకు పులివేషం కడతారు. డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, పులి ఇతర జంతువులను ఎలా ఒడుపుగా వేటాడుతుందో చక్కగా ప్రదర్శిస్తారు ఈ కళాకారులు. ఈ వేషం వేయడంలో విజయవాడకు చెందిన గర్రె అప్పారావు, విజయనగరానికి చెందిన పైడి గురువులు సిద్ధహస్తులు. పకీరు వేషం గోరింటాకు కాళ్లకు పారాణి ఎలాగో చేతులకు గోరింటాకు అలాగ. గోరింటాకు శోభ ముందు నేటి గోళ్ల రంగులు దిగదుడుపే. రుంజ రుంజ అనే ఈ చర్మ వాద్యం అతి ప్రాచీనమైనది. శైవ సంప్రదాయానికి చెందినది. ఇప్పుడు కోస్తా జిల్లాలలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్న ఈ రుంజ వాద్యాన్ని విశ్వబ్రాహ్మణులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. తరం నుంచి తరానికి ఈ వాద్యకళ కొనసాగుతూ వస్తున్నది. 32 రకాలుగా దీన్ని వాయించవచ్చునట. thumb|right|200px|సంక్రాంతి సంభరాల్లో గంగిరెద్దులు గంగిరెద్దులు ధనుర్మాసం వస్తూనే తెలుగునాట గంగిరెద్దులు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఆడించడంలో ఎన్నో వింత పోకడలున్నాయి. గంగిరెద్దు వెంట వచ్చే వ్యక్తి రంగురంగుల దుస్తులు తలపాగాల పంచేకట్టు ధరించి నుదుట నామం మెడలో అనేకరకాల దండలతో ప్రత్యేకంగా ఉంటాడు. ఎద్దు కూడా చక్కగా శిక్షణ పొంది గంరద్దులవాడు చెప్పినదానికి తలఆడిస్తూ చూసేవారికి వినోదం కలిగిస్తుంది. ఇంటింటికీ పోయి వారిచ్చే పాతదుస్తులను తీసుకోవడం ఇందులో ఒక భాగం. గృహస్తు గంగిరెద్దులవాడికి పాతదుస్తులు, కొంత ధాన్యం ఇస్తుంటారు. భిక్షాటన కూడా ఇందులో ఒక భాగమైనా ఇల్లు వెతుక్కుంటూ వచ్చే కళాప్రదర్శనలలో ఇది ఒకటి కనుక ఇది ఇచ్చేవారికి తీసుకునేవారికి కూడా ఆనందం కలిగిస్తుంది.గంగిరద్దులవాడు గృహస్థును, గృహిణిని పొగడ్తలతో ఆనందింపజేయడం ఇందులో ప్రత్యేకత. ఆటపాటలు చోడిగాడి కలాపం కోలాటం thumb|కోలాటం|alt= కోలాటం అనేది బృదగానతో కూడిన లలితమైన బృందనృత్యం. దీనిని స్త్రీపురుష బృందాలు కూడా చేస్తుంటారు. ఇది సాధారణంగా ఉత్సవసందర్భంలో చేస్తుంటారు. తిరుపతి బ్రహ్మోత్సవాలలో కూడా కోలాటబృందాలు పాల్గొంటూ ఉంటాయి. బృందంలోని వారు రెండుచేతులలో రెండు కర్రలను పట్టుకుంటూ పాటలకు అనుగుణంగా అడుగులు వేస్తూ కర్రలను కలుపుతూ విడదీస్తూ ఎదుటి వారితో చేరి కర్రలతో కలిపి తాళం వేస్తూ నృత్యం సాగిస్తారు. బృందానికి ఒక నాయకుడు ఉంటాడు. పాటలగా మాత్రం భక్తిగీతాలను ఆలాపిస్తుంటారు. ఒకే విధమైన దుస్తులను వేసుకుని నృత్యం చేస్తే ఇది మరింత సుందరంగా ఉంటుంది. ఇది తెలుగు ప్రజల ప్రత్యేకతలలో ఒకటి. ఆటలు పల్లెటూళ్ళలో పిల్లలు తమ నిజమైన బాల్యాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తారు.ఈ బాల్య జీవితమే తమ భవిష్యత్తులో ప్రక్రుతిపై ప్రేమ,కల్మషం లేని మనస్తత్వం వంటి గుణాలకు ఆయువు పోస్తుంది. పిల్లల మానసిక వికాసంలోనూ, ప్రకృతితో మమేకమవడం సొంత వూరి పై ప్రేమ వంటి గుణాలన్ని కేవలం ఆటల ద్వారా మాత్రమే పిల్లలకు లభిస్తుంది. పసితనములో బూచి అంటు అమ్మనాన్నలు పిల్లలతో ఆడుకుంటూ మురిసి పోతారు.ప్రతి పిల్లవాడు వూరంతా తనదే అన్న భావనతో తన తోటి పిల్లలతో కలసి ఎక్కడి దొంగలక్కడే గప్చుప్ అంటూ<దాగుడుమూతలు ఆడుకుంటూ అన్నం వేళలు సైతం మరచిపోయి అమ్మ వచ్చి బువ్వకు పిలిచేదాకా అలుపెరుగక ఆడుతూ వుంటారు.అమ్మయిలేమో పొద్దున్నే మంచినీల్లకి వాగులోని చెలమల వద్దకు వెల్లి అక్కడే గన్నాలు ఏరుకొని వచ్చి అచ్చనగన్నాలాట,మామిడి టెంకతో తొక్కుడుబిళ్ళ,గుజ్జనగూళ్ళు వంటి ఆటలతో మైమరిచి పోతారు.అబ్బాయిలేమోకర్ర బిళ్ళ క్రికెట్ వంగుడుదూకుడు వంటి అటలు ఆడుతూ పొలాలకు వెళ్ళి అక్కడ చెట్లతో అనుబంధం పెంచుకుంటూ అక్కడే తాటి ముంజలు తింటూ పక్షులతో గడుపుతూ కుటుంబం స్నేహితులతో బంద్గువులతో సంతొషిస్తారు.వెన్నెల రాత్రుళ్ళో చెప్పవలసిన అవసరమే లేదు.బజారులో పిల్లలందరూ దాక్కొనే ఆట,నీడ తొక్కే ఆట,వంటీవి ఆడూతూనే ఉంటారు. ఇలా మానసిక వికాసంతో పాటు మంచి అలవాట్లు,కలివిడితనం,వంటి లక్షణాలు ఆటల ద్వారానే అలవడతాయి.కాని ప్రస్తుతం బాల్యం బందీ అవుతుంది.ఆటలు ఆడతానికి స్వేచ్ఛ లేదు.పోటి నెపంతో పిల్లలు బాల్యం అనుభవించకుండానె పెరుగుతున్నారు.పట్నమ్లో అయితే మరీ.ఒక గదిలో బంధించి వుంచబడుతాడు.ఈ పరిస్థితి మారాలి. నృత్యసంప్రదాయాలు దేవదాసినృత్యం ఆంధ్ర దేశంలో దేవదాసీలు, భాగవతులూ నృత్య కళను పోషించి అభివృద్ధిలోకి తీసుకు వచ్చారు. దేవదాసీల నృత్యకళ, భాగవతుల నృత్య కళ అని అది వేరు వేరుగా అభివృద్ధి పొందింది. దేవదాసీలు దేవాలయాల నృత్యమండపాలలో, దేవుని సన్నిధానంలో శైవ, వైష్ణవ సంప్రదాయాలననుసరించి అరాధన నృత్యాలూ, అష్టదిక్పాలక నృత్యాలు, కేశికా ప్రదర్శనాలూ, కలాపాలూ మొదలైన నృత్యాలను ప్రదర్శించేవారు. కూచిపూడి నృత్యం పిట్టలదొర నాకు తెలియదు లంబాడి గన్నెగాడు వివాహవేడుకలు కనక తప్పెట్లు డప్పుల వాయిధ్యాన్నే రాయలసీమలో కనక తప్పెట్లు అంటారు. వీటిని సాధారణంగా జాతరలకు, వివాహాలకు, చాటింపులకు ఉపయోగిస్తూ ఉంటారు. దప్పులతో గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతూ వివిధ వరుసలలో లయగా వాయిస్తూ లయబద్దంగా నృత్యం చేస్తారు. విప్రవినోధం కొలుపులు దేవతాకొలువులు దండగానం జోస్యం ఎరుకలసాని చిలుక జోస్యం హస్తసాముద్రికం మతవిశేషాలు వీర శైవులు గొల్ల సుద్దులు పగటి వేషాలు జానపదకళలు ఆదరణ తక్కువ కావడంచేత చాలా కళలు భిక్షుకవృత్తిగా మారిపోయాయి. బుర్రకథ, వీధినాటకం, యక్షగానం వంటి కళారూపాలు భిక్షుకవృత్తిగా మారిపోయిన దశ కనిపిస్తుంది. అట్లాంటి కళారూపాలలో పగటివేషాలు ఒకటి. చాలా జానపద కళారూపాలు మతపరంగానో, కులపరంగానో, వాద్యాలపేరుతోనో పిలువబడితే కేవలం ప్రదర్శనాసమయాన్ని బట్టి పిలువబడేది పగటివేషాలు కళ. అనేకమైన వేషాలు ప్రదర్శింపబడడంచేత, పగటిపూటనే ప్రదర్శింపబడడంచేత ఇవి పగటివేషలయ్యాయి. పగటి వేషాలనే పైటేషాలని కూడా అంటారు. పగటి వేషాలు జానపద కళారూపాల్లో ప్రముఖమైనవి. యక్షగానం, వీధినాటకాలనుండి బ్రోకెన్ డౌన్ మిత్ అన్న వాదం ప్రకారం వీధినాటకాలే పగటివేషాలుగా మారాయని పరిశోధకుల అభిప్రాయం. ప్రదర్శించే వేళను బట్టి, సమయాన్ని బట్టి వీటికి పగటివేషాలని పేరు వచ్చింది. కేవలం పగటిపూట మాత్రమే వీటిని ప్రదర్శిస్తారు. పగటివేషాలను, సంచారిపగటివేషాలని, స్థానిక పగటివేషాలని విభజించవచ్చు. సంచారిపగటివేషాల వాళ్ళు దాదాపుగా సంచారజీవనం చేస్తూ ప్రదర్శనలిస్తుంటారు. వీళ్ళనే బహురూపులు అనికూడా అంటారు. పగటివేషాల ప్రదర్శన ఒక ఊళ్ళొ నెలల పాటు ఉంటుంది. ప్రతి రోజు ప్రదర్శించి తరువాత చివరి రోజున సంభావనలు తీసుకుంటారు. జానపద కళలూ చాలా వరకు యాచక వృత్తిగా మారిపోయాయి. అట్లా మారిన వాటిలో పగటివేషాలు ఒకటి. వచ్చిన సంభావన అందరు పంచుకుంటారు. వీరు ఆహార్యం, అలంకరణ పట్ల శ్రద్ధ వహిస్తారు. సంభాషణలు, వీరు చెప్పే పద్యాలు రక్తి కట్టిస్తాయి. ప్రాచీన కాలంలో అనేక పగటివేషాలు ప్రదర్శింపబడేవి. కాని ఇప్పుడు అన్ని వేషాలు వేయడం లేదు. కారణం జీవనంలో వచ్చిన మార్పులేనని వీరు చెబుతారు. ఒకప్పుడు బోడి బాపనమ్మ వేషం వేసేవారు. కాని ఉదయమే ఈ విధవ మోహం చూడలేమని ఈ వేషంతో మా యింటి వద్దకు రావద్దని చెప్పడం మూలాన ఈ వేషం వేయడంలేదని వీరు వివరించారు. అట్లే కులాలకు, మతాలకు చెందిన సాత్తని వేషం, బ్రాహ్మణ వేషం వంటివి వేయడంలేదు. వీరు ప్రదర్శించే వేషాలలో అర్థనారీశ్వర వేషం ప్రత్యేకమైనది. ఈ వేషం మేకప్ వేయడానికి దాదాపుగా 3 గంటల సమయం పడుతుందని, సాయంకాలం దాకా ఈ మేకప్ ఉండాలికాబట్టి ప్రత్యేకమైన రంగులు వాడతామని వీరు చెబుతారు. ఒకే వ్యక్తి స్త్రీ, పురుష వేషాలు ధరించి సంభాషణలు చెప్పడం అంటే సామాన్యం కాదు. పగటి వేషాలు చారిత్రకత జనవ్యవహారంలో ఉన్నకథలను బట్టి పగటివేషాలు రాజు కళింగ గంగుకథ, సంబెట గురవ రాజు కథ, విజయనగర రాజుల కథలు ప్రస్తావనలోకొస్తాయి. పగటి వేషల గురించి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ప్రొ. ఎస్. గంగప్ప పరిశోధించి పగటి వేషాలు వాయసంలోను, కూచిపూడి భాగవథులు ప్రదర్శించే వేషాలను పగటి వేషాలుగా వివరించారు. పగటి వేషాలకు చారిత్రకాధారాలున్నాయి. భిక్షుకవృత్తిగా ప్రారంభమైన ఈ కళ కాలక్రమంలో ఒక సంక్లిష్ఠ రూపంగా మారింది. శాతవాహనుల పరిపాలనా కాలమందే ఈ కళారూపం ఉందని, హాలుని గాథాసప్తశతిలో దీని ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. మార్గ, దేశి, శిష్ఠ సాహిత్య లక్షణాలన్ని మూర్తీభవించిన కళ పగటివేషాలు. thumb|పగటి వేష గాళ్ళు|alt= పగటివేషాలు - వర్గీకరణ పగటి వేషాలు ఒకప్పుడు దాదాపుగా 64 ఉండేవని కాని ఇప్పుడు 32 వేషాలు మాత్రమే వేస్తున్నామని నంద్యాల కళాకారులు అంటారు. ఇతివృత్తం ఆధారంగా పగటివేషాలను ఐదు విధాలుగా విభజించవచ్చు. మతపరమైనవి: ఆదిబైరాగి వేషం, చాతాది వైష్ణవ వేషం, కొమ్ము దాసరి వేషం, హరిదాసు వేషం, ఫకీరు వేషం, సహెబుల వేషం. కులపరమైనవి: బుడబుక్కల వేషం, సోమయాజులు-సోమిదేవమ్మ వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం, వీరబాహు వేషం, గొల్లబోయిడు వేషం, కోయవాళ్ళ వేషం, దేవరశెట్టి వేషం, దేవాంగుల వేషం, ఎరుకలసోది వేషం వంటివి. పురాణపరమైనవి: జంగం దేవర వేషం, శక్తి లేదా శూర్పణఖ వేషం, అర్థనారీశ్వర వేషం వంటివి. జంతు ప్రదర్శన పరమైనవి: గంగిరెద్దుల వేషం, పాములోల్ల వేషం, ఇతరములు: పిట్టలదొర వేషం, చిట్టి పంతులు వేషం, కాశీకావిళ్ళ వేషం వంటివి. పగటివేషాలు- ప్రదర్శన రీతులు పగటివేషాల్లో కొన్నింటిలో సంభాషణలకు ప్రాధాన్యత ఉంటే మరికొన్నింటిలో పద్యాలకు, అడుగులకు, వాద్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. బుడబుడకల వేషం, ఎరుకలసాని వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం వంటి వాటిలో సంభాషణలకు ప్రాముఖ్యత ఉంటుంది. పురాణ వేషల్లో హార్మోనియం, తబలా వంటి వాద్యాలతో పాటు యక్షగాన శైలిలో ప్రదర్శన ఉంటుంది. కుల సంబంధమైన పగటివేషాలు సంఘంలోని అనేక కులాల వారి జీవనవిధానాన్ని వ్యంగ్యంగా ప్రదర్శిస్తాయి. ప్రతి కులాన్ని గురించి తెలియ చేస్తూ ఆ కులాలపై సమాజం యొక్క అభిప్రాయాలను విమర్శిస్తాయి. పగటివేషాల లక్ష్యం వ్యంగ్యమే. వీరికి రంగస్థలం అంటూ లేదు. ఇంటిగడప, వీధులు, సందులు, గొందులు, అన్ని వీరి రంగస్థలాలే. ప్రదర్శన సమయాల్లో ప్రేక్షకులు, ప్రదర్శకుల మధ్య వ్యత్యాసముండదు. పగటి వేషాల్లోనే ప్రత్యేకత, ప్రావీణ్యత కలిగిన వేషం అర్థనారీశ్వర వేషం. ఒక వ్యక్తి మధ్యలో తెర కట్టుకొని ఒకవైపు నుండి పార్వతి, మరోవైపునుండి శివుడుగా అలంకరణ చేసుకొని ప్రదర్శనలిస్తాడు. తెర మార్చుకుంటున్నప్పుడు ఒక వైపు నుండి చూస్తే శివుడు మరో వైపునుండి చూస్తే పార్వతిని చూసిన అనుభూతి కలుగుతుంది. తెర మార్చుకోవడంలోనే వీరి నైపుణ్యమంతా దాగిఉంది. గిరిజన ఉత్సవాలు బతుకమ్మ తెలంగాణా ప్రాంతంలో ఆచరించే పూల పండుగ, పూబోడుల పండుగ, బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు ఎంతో ఉత్సాహంతో మహిళలు జరిపే ఈ పండుగ చివరి రోజును సద్దలు అని వ్యవహరిస్తారు. దసరాకు ఒకటి రెండు రోజుల ముందు ఈ పండుగ వస్తుంది. రంగు రంగుల పూలను ఎంతో మెళుకువతో పిరమిడ్ ఆకారంలో పేర్చి, ఆ పువ్వుల కుచ్చెన నడిబొడ్డులోగాని, శిఖరంలోగాని గౌరమ్మను అమరుస్తారు. ఈ పువ్వుల పళ్లెరాన్ని వాకిట్లో ఉంచి కొత్త దుస్తులు ధరించి స్త్రీలు, బాలికలు చేరి దీని చుట్టూ క్రమంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు. తర్వాత ఊరేగించి ఈ బతకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. thumb|right|గొర్రెల మంద నాగోబా జాతర సారక్కసమ్మక్క జాతర మూగజీవాలతో అనుబంధం అన్నదాతలకు దూరమవుతున్న ఆత్మ బంధువులు. పొలంలో రైతన్నలకు అసలైన నేస్తాలు ఈ మూగ జీవాలే. ఆవులు..గేదెలు..ఎద్దులు కళ్ల ముందు కనిపించకపోతే చాలా మంది రైతులు విలవిలాడిపోతారు. రోజంతా వాటితోనే కాలక్షేపం చేస్తారు. భాష రాకపోయినా ఎన్నో ఊసులు చెప్తారు. అవి చూపించే హావభావాలు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటారు. వాటికి కష్టం వస్తే తల్లడిల్లిపోతారు. ఏదైనా ఊరు వెళితే అవి గడ్డి తిన్నాయో లేదో.. నీళ్ళు తాగాయో లేదోనని అన్నదాతలు బెంగపెట్టుకుంటారు. ఎందుకంటే వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న బంధం అది. కేవలం 20 ఏళ్లలో ప్రపంచం మారిపోయింది. అందరికీ అన్నం పెట్టే అన్నదాత బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఒక వేళా గుండె నిబ్బరంతో బతుకుదామనుకుంటే మన విధానాలు బతకనివ్వడం లేదు. మూగజీవాలు ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవు . ఒకవేళ వాటికి కూడా భాష..భావం తెలిస్తే తమ ప్రియ నేస్తం రైతన్న పడుతున్న అగచాట్లు చూస్తే అవే ముందే ఆత్మహత్య చేసుకుంటాయి !!! పల్లెదృశ్యాలు గొర్రెల మందలు గొర్రెల మందలను కాయడం ఒక వర్గం ప్రజలకు వృత్తి. గొర్రెలు పాలు ఇస్తాయి, ఉన్ని ఇస్తాయి. పైగా వ్యవసాయ భూములలో మందలను వదలి పెట్టడం వల్ల ఆ భూములకు ఎరువులు సమకూరి సారం పెరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కాపరులు గొర్రెలను తోలుకుపోవడం తెలుగునాట తరుచుగా కనబడే చక్కని దృశ్యాలలో ఒకటి. పండుగలు ఉగాది వేపపువ్వు, చెరుకుముక్కలు, కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు, బెల్లం, చింతపండు, అరటి పండు కలిపిన ఉగాది పచ్చడి ఎంతో శ్రద్ధతో తయారు చేస్తారు. వ్యక్తి జీవితంలో సుఖదుఃఖాలకు ప్రతీక అయిన తీపి, చేదుల వేపపువ్వు పచ్చడి ప్రసాదం తీసుకోకుండా ఉగాదినాడు ఏ పనినీ తలపెట్టకూడదని ప్రజల నమ్మకం. మొహరం పండుగ మృతవీరులు - హసన్, హుస్సేన్ సంస్మరణార్థం మొహరం మాసంలో పది రోజులు జరిపే పండుగ మొహరం. ఏభై సంవత్సరాల క్రితం హైదరాబాదు నగరంలో మొహరం ఊరేగింపు చూడడం ఒక గొప్ప అనుభవం. నానాటికి ఈ విషాద గర్భిత ఉత్సవం ఆచరించుకునే తీరులో మార్పులు వస్తున్నట్టు గమనించవచ్చు. ఈ పండుగనే పీర్ల పండుగగా తెలుగులో వ్యవహరిస్తారు. ఈ పండుగ సందర్భంగా సున్నీ తెగవారు ఆకుపచ్చ దుస్తులు, షియా తెగవారు నల్లని వస్త్రాలను ధరిస్తారు. స్త్రీలు సంతాప సూచకంగా ఆభరణాలు ధరించరు. తల వెండ్రుకలు కూడా ముడవరు. చేతి గాజులు తొలగిస్తారు. వినాయకచవితి హిందువుల పండుగలలో అతి ముఖ్యమైనది వినాయక చవితి. దీన్ని ఔత్తరాహులు గణేశ్ చతుర్థి అంటారు. తలపెట్టిన పనులు విఘ్నరహితంగా నెరవేరాలని కోరుతూ వినాయకుడిని ఆనాడు పూజిస్తారు. అన్ని రకాల పత్రి, పువ్వులు, ఫలాలు, పూజాద్రవ్యాలు, వినాయకునికి ఇష్టమైన కుడుములు ఆనాటి పిండి వంటలలో ముఖ్యభాగం. పూజానంతరం వినాయకుని కథ చదివి అక్షింతలు నెత్తిపై చల్లుకుంటే తప్ప పండుగ పూర్తికాదు. పూజ చెయ్యకుండా ఆ రాత్రి చవితి చంద్రుడిని చూడరాదని కట్టడి. పూర్వం మన పల్లెటూళ్ళలో ఏ ఉత్సవం జరిగినా, తిరునాళ్ళు జరిగినా బుట్ట బొమ్మలు ప్రత్యక్షమయ్యేవి. ఈ బుట్టబొమ్మలు ధరించిన కళాకారులు వాద్యాలకు అనుగుణంగా లయాన్వితంగా నాట్యం చేస్తారు. క్రమంగా ఈ కళ అంతరించి పోతున్నది. కన్నెపిల్లలు కన్నెపిల్లల అలంకరణలు కాళ్లకు పారాణి అచ్చమైన తెలుగు సంప్రదాయం. కాళ్లకు పారాణి పూసుకుని పావడా కుచ్చెళ్లు ఎత్తిపట్టుకుని వెండి పట్టాలు ఘల్లు ఘల్లుమంటూండగా కన్నెపిల్లలు నట్టింట నడయాడడం ఎంతో అందమైన దృశ్యం. కన్నేపిల్లల ఆటపాటలు తొక్కుడు బిళ్ళలు చెమ్మచెక్క చెమ్మచెక్క - చేరడేసి మొగ్గ అంటూ ఆడే ఇలాంటి పడుచు పిల్లల్ని చూసే కవి తిలక్ నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని, అని ఉంటాడు. గవ్వలాట గుజ్జనగూళ్ళు గచ్చనగాయలు ఉయ్యల గొబ్బిపాటలు గుజ్జనగూళ్ళు బాలల ఆటపాటలు గోళీలు గోళీలు యావత్ భారతదేశంలోని పిల్లలందరికీ సుపరిచితాలే. అయితే వీటిని ఆడే విధానాలలో పలు తేడాలు గలవు. తెలంగాణలో వీటిని ఆడటానికి ఇసుకలో కర్రతో గానీ, నేలపై బొగ్గు/సుద్దముక్కతో గానీ ఒక చతురస్రాకారంలో డబ్బా, కొంత దూరంలో ఒక గీత గీస్తారు. ఆటలో పాల్గొనే ఒక్కొక్కొళ్ళు ఎన్నేసి గోళీలు పందెం వేయాలో నిర్ణయించుకొంటారు. అందరి గోళీలని మొదటి ఆటగాడు తీసుకొని, గీత వద్ద నిలబడి గోళీలని డబ్బాలో వేయాలి. డబ్బాలోని గీతల మీద/గీతల వెలుపల పడ్డ గోళీలని చొన్గా వ్యవహరిస్తారు. డబ్బాలో పడ్డ గోళీలలో ఏదో ఒక దానిని ఇతర ఆటగాళ్ళు చూపిస్తారు. గీత వద్దనున్న ఆటగాడు ఇతరులు చూపిన గోళీని మాత్రమే తన వద్ద ఉన్న గోళీతో (దీనిని ట్యాంపర్ అంటారు) బయటికి కొట్టాలి. గోళీ బయటపడితే ఆ గోళీ కొట్టినవాడి సొంతం. పడకుంటే మళ్ళీ దానిని డబ్బాలో ఎక్కడో ఒక అక్కడ ఉంచవచ్చును. అయితే చొన్ లని మాత్రం ఎడమ చేత్తో (ఎడమ చేయి వాటం వారు కుడి చేత్తో) కొట్టాలి. రాయలసీమలో తోక, తొంబ, నింబ అని ఒకే గోళీని వివిధ దూరాల నుండి కొట్టే ఆట ఉంది. బొంగరాలు బచ్చాలు గిల్లాకర్ర చెడుగుడు thumb|right|200px|పల్లెల్లో చెడుగుడు ఉత్తరాదివారు కబడ్డీ అంటారు. తెలుగు వారు చెడుగుడు అంటారు. ఏ పేరుతో ఆడినా అందరికీ ఆసక్తి కలిగిస్తుంది ఈ ఆట. రెండు జట్లుగా జరిగే ఈ ఆటలో పది నుండి ఐదు వరకూ ఒకోజట్టులో సభ్యులుంటారు. కూత అనే ప్రక్రియతో అవతలి జట్టుమీదకు రెండవ జట్టు నుండి ఒకరు వెళతారు. అతడు నోటితో చేసే ఆకూత అనే శబ్దం ఆపేలోపుగా అవతలి జట్టులో ఎవరినైనా ముట్టాలి. అవతలి జట్టు అతని కూత ఆపి పారిపోయేలోగా పట్టూకొంటే అతను బయట నిలుచోవలసి వస్తుంది. వీరకంబం కోక్కో లాలిపాటలు నోములు, వ్రతాలు సత్యనారాయణ వృతం ఈ వృతానికి చేసే ప్రసాదం, పంచామృతం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, వెన్నలని కలిపి అందులో పండ్ల ముక్కలు వేస్తారు. ఇది చాలా రుచికరంగా ఉండటమే కాక మంచి బలవర్ధకమైన ఆహారము. కార్తీక నోములు నిర్మాణ శైలి thumb|right|అమరావతి స్తూపం నమూనా (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలలో ఉన్న చిత్రం తెలుగు నేలని పాలించిన మౌర్యులు, శాతవాహనులు, తూర్పు గాంగేయులు, పల్లవులు, చాళుక్యులు, చోళులు ద్రావిడులు, నాగరులు, కళింగుల ప్రభావం ఇక్కడ నిర్మించబడ్డ గుడుల పై ఉంది. అంతేకాక జైన మందిరాలు, చర్చిలు, మసీదులు, సమాధులపై వివిధ పాలకుల ప్రభావం ఉంది. పూర్వపు చరిత్ర క్రీ.పూ 3వ శతాబ్దం ద్వితీయార్థంలో మధ్య, దక్షిణ దక్కను ప్రాంతం (అనగా ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ)లలో గ్రానైటు కొండల పైన, వాటి చుట్టు ప్రక్కలా దీర్ఘ చతురస్రాకార గృహాలలో ప్రజలు నివసించేవారు. ఈ ఇళ్ళ గోడలని కర్ర, మట్టి, బంక మట్టి లతో నిర్మించేవారు. పైకప్పులు చదునుగా గానీ, శంఖాకృతిలో గానీ ఉండేవి. బౌధ్ధ నిర్మాణాలు క్రీ.పూ 2వ శతాబ్దానికి పూర్తి అయిన అమరావతి స్థూపం శాతవాహనులచే కట్టింపబడింది. ప్రస్తుతం దీని అవశేషాలు మాత్రమే లభ్యమైననూ దీని చిత్రపటం చూచి అప్పటి వైవిధ్య నిర్మాణ శైలిని అర్థం చేసుకొనవచ్చును. ఇదే కాలానికి చెందిన కట్టడాలని గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం) లోనూ చూడవచ్చును. నిలబడి ఉన్న పలు బుద్ధ విగ్రహాలు, పలు స్థూపాలు, బౌద్ధ విహారాలు రాతిపై చెక్కబడ్డాయి. 7వ శతాబ్దానికి చెందిన బౌద్ధ కట్టడాలని శంకారం (అనకాపల్లి)లో కూడా కనబడతాయి. తర్వాతి కాలంలో వీటిని హైందవ ప్రార్థనా మందిరాలుగా వినియోగించటం జరిగింది. హైందవ నిర్మాణాలు ఇదే కాలంలో తూర్పు దక్కను ప్రాంతాన్ని కొండవీటి రాజులు పాలించారు. నెల్లూరు జిల్లాలోని భైరవకొండలో రాతిపై చెక్కిన శివాలయాలు, ఇతర ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ శివలింగాలు, శివుని, ఇతర దేవుళ్ళ చిత్రపటాలు ఉన్నాయి. తమిళనాడులోని పల్లవులు నిర్మాణశైలి భైరవకొండలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇదే శతాబ్దంలోనే ఉండవల్లిలో గుహాలయాలు నిర్మించబడ్డాయి. వీటిలో అన్నింటికన్నా పెద్దది నాలుగు అంతస్తులు గలది. పై అంతస్తు క్రింది అంతస్తుకంటే వైశాల్యం తగ్గేలా దీనిని నిర్మించారు. నారద, తుంబురుల, సింహాల ప్రతిమలని మూడవ అంతస్తులో చుట్టు ప్రక్కలా చూడవచ్చును. వీటిలో నాలుగు మండపాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. స్తంభాలు, గోడలపై అనంతశయనుడి, గరుడాధిరోహిత విష్ణువు యొక్క శిల్పాలని చెక్కబడి ఉన్నాయి. thumb|right|250px|ఉండవల్లి గుహలు పాపనాథ (భారతీయ-ఆర్య) నిర్మాణ శైలి ఆలంపూర్లోని గుళ్ళ శిఖరాలు భారతీయ-ఆర్య సంస్కృతికి నిదర్శనాలు. ఇవి పాపనాథ/పత్తఢకల్ శైలిలో నిర్మించబడ్డాయి. ఇవి పెద్ద గుళ్ళు కాకపోయిననూ, వీటి నిర్మాణశైలిలో చాలా పరిపక్వత కనబడుతుంది. 7-8వ శతాబ్దాల కాలంలో తుంగభద్ర నదీతీరం పై పూర్వ చాళుక్యులు నిర్మించిన గుళ్ళు తొమ్మిది ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ బ్రహ్మగా సంబోధించిననూ, ఇవన్నీ శైవ క్షేత్రాలే. వీటి నిర్మాణశైలిలో మధ్య భారత, పశ్చిమ భారత శిఖరాల ప్రభావం చూడవచ్చును. 11వ శతాబ్దంలో నిర్మించబడిన పాపనాశి దేవాలయాల సమూహము ఈ ప్రదేశపు మతప్రాధాన్యతని తెలుపుతుంది. thumb|right|250px|ఆలంపూర్ లో చాళుక్యుల కాలం నాటి దేవాలయాలు కాకతీయ నిర్మాణ శైలి చాళుక్య నిర్మాణ శైలినే ఇంకొంత అభివృద్ధి చేసి, స్థానిక స్థితిగతులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి, కాకతీయులు తమకంటూ ఒక ప్రత్యేక నిర్మాణశైలిని ఏర్పరచుకొన్నారు. చాళుక్యుల వంపులకి, నిలువుగా ఉండే ఉత్తరాది నిర్మాణశైలికి భిన్నంగా కాకతీయులు శిఖరాలని మెట్లవలె చెక్కుకుంటూ వచ్చేవారు. 1210లో కాకతీయ రాజు గణపతి దేవుడిచే నిర్మించబడ్డ రామప్ప దేవాలయము విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఇక్కడ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడు లకు గుళ్ళు ఉన్నాయి. 1261వ సంవత్సరం నాటికి పూర్తయిన వరంగల్ కోటని కాకతీయ వంశానికి చెందిన గణపతి దేవుడు కట్టించాడు. ఇవన్నీ ఇప్పటికీ విహార యాత్రికుల ఆకర్షణలే! దక్కను-ఒడిస్సీ మిశ్రమ శైలి 13వ శతాబ్దానికి చెందిన తూర్పు గాంగేయులు ప్రస్తుత విశాఖపట్నం పొలిమేరలలో ఒక కొండ పై వరాహ నరసింహస్వామి ఆలయాన్ని కట్టించారు. ఈ గుడి దక్కను, ఒడిస్సీ మిశ్రమ శైలికి ఉదాహరణ. రెడ్డిరాజుల నిర్మాణశైలి కొండపల్లి కోట, కొండవీటి దుర్గం రెడ్డి రాజుల నిర్మాణ శైలికి జ్ఙాపకాలు. విజయనగర సామ్రాజ్య నిర్మాణ శైలి పెనుగొండ కోట, లేపాక్షి వీరభద్రాలయం లోని నాగలింగం, నంది, తాడిపత్రి లోని గుళ్ళు, శ్రీశైలం, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట, అహోబిలం, తిరుమల, తిరుపతి లోని గుళ్ళలో విజయనగర సామ్రాజ్యము యొక్క విశాలమైన నిర్మాణశైలి స్పష్టంగా కనబడుతుంది. కుతుబ్ షాహి శైలి దక్కను ప్రాంత రాజ్యాలకు పర్షియా, టర్కీ, అరేబియా లతో సంబంధాలుండటంతో ఇక్కడి పూర్వ తుగ్లక్ శైలితో నిర్మించబడే కోటలపై వాటి ప్రభావాలు ఉండేవి. ఈ ప్రభావాలతో సాంప్రదాయ హైందవ భూమిపై ఒక సరిక్రొత్త సంస్కృతి చొప్పించబడింది. కుతుబ్ షాహిలు పెద్ద పెద్ద గ్రానైటు గోడలని వారి నిర్మాణాలలో ఉపయోగించేవారు. స్థానికంగా లభ్యమయ్యే గ్రానైటు-ఇసుక-సున్నపు మిశ్రమాలను గోల్కొండ కోట, పైగా సమాధులు, చార్మినార్, ఇతర సమాధులలో చూడవచ్చును. సాధారణంగా ఈ సమాధులు చతురస్రాకారాలలో కట్టబడి ఉంటాయి. హైదరాబాదులోని తొట్టతొలి కుతుబ్ షాహి కట్టడం గోల్కొండ వద్దనున్న సఫా మసీదు. ఇది 1518లో, బహమనీ సుల్తానుల నుండి ప్రాప్తించిన విముక్తి జ్ఞాపకార్థం నిర్మించబడింది. 1543 లో గోల్కొండలో నిర్మించబడ్డ మొట్టమొదటి (సుల్తాన్ కులి) కుతుబ్ షాహి సమాధికి బీదరులో నిర్మించబడ్డ మొహమ్మదు సమాధికి సామ్యాలు ఉన్నాయి. కుతుబ్ షాహి రాజులలో ఐదవ రాజు అయిన మొహమ్మద్ కులీ కుతుబ్ షాహ్, చార్మినార్ ని నిర్మించి గోల్కొండ వద్ద నుండి చార్మినార్ వద్దకి తన రాజ్యాన్ని మార్చాడు. కావున హైదరబాదుని కనుగొన్న ఘనత ఇతనికే చెందును. తర్వాతి కాలంలో కుతుబ్ షాహి నిర్మాణ శైలి కొంత ఆధునికీకరించబడింది. మక్కా మసీదు, జుమ్మా మసీదులు ఈ శైలిలోనే నిర్మించబడినవి. అసఫ్ జాహీ శైలి thumb|right|చౌమహల్లా రాజభవనం|link=Special:FilePath/Chowmahalla palace inside.jpg కుతుబ్ షాహిలని ముట్టడించిన తర్వాత మొఘల్ రాజుల అధికారంలో అసఫ్ జాహీ శైలిలో నిర్మాణాలు జరిగాయి. ఇతరాలు సాహిత్యం తెలుగు సాహిత్యం పై సంస్కృత సాహిత్యం, హైందవ గ్రంథాల ప్రభావం అధికంగా ఉంది. కవిత్రయంగా పేరుగాంచిన నన్నయ, తిక్కన, ఎఱ్రాప్రగడలు మహా భారతమును తెలుగులోకి అనువదించారు. వేద వ్యాసుడు రచించిన మహాభాగవతంను బమ్మెర పోతన శ్రీమదాంధ్ర భాగవతంగా అనువదించాడు. ఆదికవి నన్నయ పురాతనమైన తెలుగు-కన్నడ లిపి నుండి ప్రస్తుత తెలుగు లిపిని కూర్చారు. శ్రీ కృష్ణదేవ రాయలుఆముక్తమాల్యదను రచించటమే కాక దేశభాషలందు తెలుగు లెస్స అని అన్నాడు. యోగి వేమన తన పద్యాల ద్వారా తాత్త్విక చింతనని వినిపించగా,విశ్వనాథ సత్యనారాయణ, సింగిరెడ్డి నారాయణరెడ్డి వంటి ఆధునిక కవులు తెలుగు భాషకి క్రొత్త సొబగులు అద్దారు. శ్రీశ్రీ, గద్దర్ లాంటి విప్లవ కవులు తమ భావాలని భాష ద్వారా వ్యక్తపరచి జనంలోకి చొచ్చుకుపోయారు. తెలుగు సాహిత్యమునకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికములోనైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం. నన్నయ్య వ్రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాధా సప్తశతిలో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉంది. ఆహారపుటలవాట్లు 240px|thumb|right|శుభకార్యాలకి వడ్డించబడే శాకాహార భోజనం భారతదేశంలో కెల్లా అత్యధిక మసాలా దినుసులు వాడే వంటకాలుగా తెలుగు వంటకాలు ప్రశస్తి. ప్రదేశానుసారం, సంప్రదాయానుసారం తెలుగు వంటకాలలో వివిధ రకాలు గలవు. పచ్చళ్ళు, ఊరగాయలు మొదలుకొని అల్పాహారాలకి, పరిపూర్ణ భోజనాలకి, తెలుగు వంటలు పెట్టింది పేరు. దాదాపు అన్ని కూరగాయలతోనూ పచ్చళ్ళు ఉండగా, గోంగూర పచ్చడి మాత్రం తెలుగు వారి ప్రత్యేకం. (తమిళులకి, కన్నడిగులకి, మలయాళీలకి గోంగూర తెలియదు). అన్నం తెలుగు వారి వంటకాలలో ప్రధానాంశం . ప్రతిరోజు చేసే భోజనంలో అన్నాన్ని నెయ్యితో బాటు, వివిధ రకాల పొడులు, పచ్చళ్ళు, పప్పుతో భుజిస్తారు. కూరగాయలతో వేపుళ్ళు, తాళింపులతో బాటు, సాంబారు, రసం (చారు), మజ్జిగ, మజ్జిగ పులుసు, పెరుగు, మిఠాయి, అరటి పండు, అప్పడాలు, వడియాలు తెలుగు వారి భోజనంలో భాగాలే. భోజనాలలోనే కాకుండా, ఇడ్లీ, దోశ, వంటి అల్పాహారాలలో బియ్యం వాడవలసిన అవసరం ఉంది. పొంగలి, పులిహోర, దద్ధ్యోజనం వంటి వాటిలో కూడా అన్నం ప్రధానాంశం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న నానుడి తెలుగునాట ఉంది. 14వ శతాబ్దం నుండి తెలంగాణ ప్రదేశాన్ని ఏలిన మహమ్మదీయుల ప్రభావం హైదరాబాదీ వంటలపై స్పష్టంగా కనబడుతుంది. మంసాహారాలైన ఇక్కడి హైదరాబాదీ బిరియానీ, హలీమ్ లు, ప్రతి వీధిలోనూ దొరికే ఇరానీ చాయ్లు ప్రపంచ ప్రసిద్ధాలు. తెలుగు వంట తెలుగు వారి ఇంటి వంట. ఆంధ్ర ప్రదేశ్కే ప్రత్యేకం కాకుండా తెలుగు వారు నివసించే అన్ని ప్రాంతల్లో తెలుగు వంటలు ఉంటాయి. తెలుగు వంటకాలలో ప్రత్యేకతను సంతరించుకున్నవి ఊరగాయలు. ఆవకాయ మొదలుకొని అన్ని రకాల కూరగాయలతో ఊరగాయ చేసుకోవడం తెలుగు వారికే చెల్లయింది. దుస్తులు పురుషుల పంచెకట్టు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. కోస్తా ఆంధ్రలో పంచెని ధోవతి వలె కట్టటం ఎక్కువ. రాయలసీమలో తమిళుల వలె నడుము చ్టుటూ కట్టే పంచెకట్టుని ఎక్కువగా వినియోగిస్తారు. వ్యవసాయం/సైకిలు త్రొక్కటం వంటి పనులు చేసే సమయంలో కట్టే ధోవతులు/పంచెకట్టులు, తలపాగా కట్లు, ఇతర సమయాలలో కట్టే కట్లతో భేదాలు ఉన్నాయి. ఉత్తర భారత స్త్రీలు సాధారణంగా పైట చెంగు కుడి భుజం పైకి కడతారు. ఆంధ్రలో (ఆ మాటకొస్తే దక్షిణ రాష్ట్రాలన్నింటిలో) ఇది ఎడమ వైపుకు ఉంటుంది. పురుషుల వస్త్రధారణ తలపాగా కుర్తా, కండువా పంచె స్త్రీల వస్త్రధారణ చీర యువతుల వస్త్రధారణ లంగా ఓణి మతం తెలుగువారిలో అన్ని రకాల మతస్తులు కలరు. ప్రాథమికంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు గలరు. వీరితో బాటు దూదేకుల వారు కూడా గలరు. ప్రాచీన హైందవ సంప్రదాయాల, మధ్య యుగ బౌద్ధ సంప్రదాయాలు, నవీన ఇస్లామీయ-హైందవ సమ్మిళిత సంప్రదాయాలు, ప్రస్తుత క్రైస్తవ-హైందవ సమ్మిళిత సంప్రదాయాలు తెలుగు సంస్కృతిని ప్రభావితం చేశాయి. ధరణికోట, నాగార్జున కొండ, సంబంధిత సాహిత్యం అశోకుని కాలపు బౌద్ధ మతం గురించి ప్రస్తావిస్తాయి. తిరుపతి శైవ-వైష్ణవ సంప్రదాయాల విలీనం గురించి తెలుపుతుంది. ఉత్తర ప్రదేశ్, బీహార్ ల తర్వాత అత్యధిక బౌద్ధారామాలు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉన్నాయి. మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకుల పాలనలో బౌద్ధ మతం విలసిల్లినది. 2వ శతాబ్దంలో నాగార్జునాచార్యులు మాధ్యమ బౌద్ధ తత్త్వ గురుకులాన్ని హైదరాబాదుకి దక్షిణ దిశగా 150 కి.మీ ల దూరంలో (ప్రస్తుత నాగార్జున సాగర్ ప్రాంతంలో) ఏర్పాటు చేశారు. విశాఖపట్నం-విజయవాడల మధ్య అనేక ఇతర బౌద్ధారామాలు ఉన్నాయి. తత్వం త్యాగరాజు అన్నమయ్య, వేమన, జిడ్డు కృష్ణమూర్తి, ముంతాజ్ అలీ వంటి వారెందరో తెలుగు సంస్కృతి పై చెరగని ముద్ర వేశారు. ఇవి కూడా చూడండి తెలుగు ప్రజలు మూలాలు, వనరులు వ్యాసం యావత్తూ లాంగ్వేజ్ టెక్నాలగీస్ వారి సైటు నుండి సంగ్రహించినది. ఈ సైటు ప్రస్తుతం సచేతనంగా లేదు తరువాత కొంతమంది ఆటలు వంటివి కలిపి ముఖ్య సవరణలు చేయడం జరిగింది. ఏపీ ఆన్లైన్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నిర్మాణశైలుల గురించి కొంత సమాచారం పెద్దబాలశిక్ష నుండి మూలాలు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు వర్గం:తెలుగు సంస్కృతి వర్గం:జానపద కళారూపాలు
ఈదుమూడి
https://te.wikipedia.org/wiki/ఈదుమూడి
thumb|200px|right|ఈదుమూడి గ్రామం.భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు. ఈదుమూడి ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నాగులుప్పలపాడు నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన చీరాల నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 793 ఇళ్లతో, 2748 జనాభాతో 613 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1370, ఆడవారి సంఖ్య 1378. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 921 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 43. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591043. పిన్ కోడ్: 523186. ఈ గ్రామం ఉప్పుగుండూరుకు 5కిమీ వుంటుంది. సమీప గ్రామాలు దుద్దుకూరు 4 కి.మీ, రాచపూడి 5 కి.మీ, ఉప్పుగుండూరు 6 కి.మీ, గొనసపూడి 6 కి.మీ. నూజెళ్లపల్లి 8 కి.మీ. మౌలిక వసతులు బ్యాంకులు ఈ గ్రామంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉంది. ఈ బ్యాంకును ఆధునీకరించి, 2014, జూలై-15వ తేదీనాడు పునఃప్రారంభించారు. గ్రామ పంచాయతీ 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో కూనం సత్యవాణి, సర్పంచిగా ఎన్నికైనారు. దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం శివాలయం - ఈ ఆలయం ధ్వజస్తంభం దెబ్బతినడంతో, గ్రామస్థులు ఆలయ జీర్ణోద్ధరణ పనులను, 2015, నవంబరు-30వ తేదీ సోమవారంనాడు ప్రారంభించారు. నూతనంగా పునర్నిర్మాణం చేసిన ఈ ఆలయంలో 2017, జూన్-14వతేదీ బుధవారంనాడు, ముందుగా హోమాలు నిర్వహించి, అనంతరం, శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామి, గణపతి, నందీశ్వరుడు, కాలభైరవుడు, ఆదిత్యాది నవగ్రహాలు, జీవధ్వజ, కలశ, శిఖర ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్దయెత్తున అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. గ్రామ విశేషాలు హైదరాబాదులో స్థిరపడిన ఈ గ్రామ వాసులు, మొత్తం 70 కుటుంబాలవారు, 3-10-2013 నాడు కూకట్ పల్లిలో, ఉదయం 10 గం. నుండి 4 గం. వరకూ ఆత్మీయ సమావేశం జరుపుకుని సందడి చేశారు. పిల్లలూ, మహిళలకు పలు ఆసక్తికరమైన పోటీలు నిర్వహించి, గెలుపొందినవారికి బహుమతి ప్రదానం చేశారు. గ్రామ విషయాలు మాట్లాడుకొని, గ్రామంలోని తమ బంధుమిత్రుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబరు-2న ఈదుమూడి ఆత్మీయ సమావేశం, హైదరాబాదులో జరుగును. మాదిగ దండోరా ఉద్యమం thumb|బహిరంగసభలో ప్రసంగిస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకుడు మంద కృష్ణ మాదిగ ఈదుమూడి గ్రామంలో 1994 జూలై 7న మంద కృష్ణ మాదిగ నేత్రత్వంలో ఎమ్మార్పీఎస్‌ (మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి) సంఘం ఆవిర్భవించింది.అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎస్సీలను ఎబిసిడి లుగా వర్గీకరిస్తూ జీవో జారీ చేసింది. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కోర్టుకు ఎక్కడంతో వర్గీకరణ అమలుకాకుండా నిలపివేశారు. రిజర్వేషన్లు వర్గీకరించడం పార్లమెంటు ద్వారా జరగాలని రాష్ట్రాలకు విభజించే హక్కులేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పడంతో వర్గీకరణ నిలిచిపోయింది. దండోర ఉద్యమం తరువాత ఆత్మ గౌరపోరాట ఉద్యమంగా మానవతా ఉద్యమంగా రూపాంతరం చెందింది. గణాంకాలు ఈ గ్రామ జనాభాలో కమ్మ, కురుమ, మాదిగ, కుమ్మరి, చాకలి, మంగలి కులస్తులు ఎక్కువగా ఉన్నారు. 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,824. ఇందులో పురుషుల సంఖ్య 1,378, మహిళల సంఖ్య 1,446, గ్రామంలో నివాస గృహాలు 761 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 613 హెక్టారులు. విద్యా సౌకర్యాలు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి ఉప్పుగుండూరులో ఉంది.సమీప జూనియర్ కళాశాల ఉప్పుగూడూరులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల తిమ్మసముద్రంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ వేటపాలెంలోను, మేనేజిమెంటు కళాశాల చేకూరుపాడులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల వేటపాలెంలోను, అనియత విద్యా కేంద్రం ఒంగోలులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల చీరాల లోనూ ఉన్నాయి. కె.కె.సి.ఉన్నత పాఠశాల 1988లో ఈ గ్రామానికి ఉన్నత పాఠశాల రావటంతో పిల్లలకు దుద్దుకూరు 2.8 కి.మీ నడచి వెళ్ళే శ్రమ తప్పింది. ఈ పాఠశాలలో చదువుచున్న కొప్పా అనూషారాణి, "టెన్నిస్, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా" అధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మినీ జాతీయ టెన్నిస్, వాలీబాల్ ఛాంపియన్ షిప్ 2015-16 పోటీలలో, అంధ్రప్రదేశ్ జట్టులో పాల్గొన్నది. ఆ పోటీలలో ఈ జట్టు రన్నర్-అప్ గా నిలిచింది. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం ఈదుమూడిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది. పారిశుధ్యం మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. సమాచార, రవాణా సౌకర్యాలు ఈదుమూడిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. విద్యుత్తు గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూమి వినియోగం ఈదుమూడిలో భూ వినియోగం కింది విధంగా ఉంది: వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 60 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 552 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 538 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 14 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు ఈదుమూడిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. బావులు/బోరు బావులు: 14 హెక్టార్లు ఉత్పత్తి ఈదుమూడిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధాన పంటలు నువ్వులు, ప్రత్తి, శనగ మూలాలు వెలుపలి లంకెలు
డొక్కల కరువు
https://te.wikipedia.org/wiki/డొక్కల_కరువు
thumb|440x440px|కరువు - ప్రతీకాత్మక చిత్రం 1832-1833లో గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలలో వచ్చిన మహా కరువును డొక్కల కరువు, నందన కరువు లేదా గుంటూరు కరువు అని పిలుస్తారు. 1831లో కురిసిన భారీ వర్షాల కారణంగా, కొత్త పంటలు వేయడానికి రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది. దాని తరువాతి సంవత్సరంలో (1832) తుఫాను వచ్చి వేసిన కొద్ది పంటను నాశనం చేసింది. అలా కొనసాగి 1833లో అనావృష్టి పెరిగిపోయింది. ఆ సమయంలో ఒంగోలు-మచిలీపట్నం రహదారి పైనా, గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్ళే రహదారి పైనా బోలెడన్ని శవాలు పడి ఉండేవిమంగళగిరి చరిత్ర వ్యాసంలో డొక్కల కరువు ప్రస్తావన. - సేకరించిన తేదీ: జూన్ 28, 2007.. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తి, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. కేవలం గుంటూరు జిల్లా లోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ళ వరకు ప్రజలు, పొలాలు కూడా సాధారణ స్థితికి రాలేక పోయాయి. కరువు బీభత్సం గుంటూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండటం చేత దీనిని గుంటూరు కరువు అని కూడా అన్నారు. కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు (ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలుస్తారు కులానికి వ్యతిరేకంగా రాసిన ఒక జీవిత చరిత్ర సంగ్రహంలో డొక్కల కరువు ప్రస్తావన పదొవ పేరా లో చూడండి. - సేకరించిన తేదీ: జూన్ 28, 2007.. అంతేకాదు ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. ఆఖరుకి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తినేసేవాళ్ళు. దాతలు పలువురు మహనీయులు డొక్కల కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు తమవంతు కృషి చేసి చరిత్రలో నిలిచిపోయారు. వారిలో కొందరి పేర్లు: thumb|150x150px|సి.పి.బ్రౌన్సి.పి.బ్రౌన్ : 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. ఏనుగుల వీరాస్వామయ్య : ప్రవృత్తి రీత్యా యాత్రాచరిత్రకారుడు, పుస్తకప్రియుడు, వృత్తి రీత్యా చెన్నపట్టణం సుప్రీంకోర్టులో ఇంటర్‌ప్రిటర్ అయిన వీరాస్వామయ్య నందన కరువులో చాలామంది పేదలకు అన్నవస్త్రాలిచ్చి ఆదుకున్నారు. కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై : చెన్నపట్టణంలో సంపన్నుడు, విద్యాదాత, సంస్కరణాభిలాషి అయిన శ్రీనివాసపిళ్ళై దాతృత్వంతో ఈ కరువు నుంచి కొందరిని కాపాడి చరిత్రలో నిలిచారు. ఇవి కూడా చూడండి 1943 బెంగాల్ కరువు దక్షిణ భారత కరువు 1876–1878 మూలాలు వెలుపలి లంకెలు డొక్కల కరువును గూర్చి రాయలసీమలో జానపదులు పాడుకునే పాట వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:ప్రకృతి వైపరీత్యాలు వర్గం:1832 పతనాలు వర్గం:బ్రిటిషు భారతదేశంలో కరువులు వర్గం:ఆంధ్రప్రదేశ్‌లో కరువులు వర్గం:కరువులు
ఆంధ్రప్రదేశ్ జలవనరులు
https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్_జలవనరులు
300px|thumb| ఆంధ్రప్రదేశ్ ఉపరితల జలవనరులు, పారుదల వ్యవస్థ సహజ సిద్ధమైన జలవనరుల విషయంలో భారతదేశంలోని సుసంపన్నమైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. కృష్ణా, గోదావరి వంటి పెద్ద నదులతో పాటు, శబరి నది, పెన్న, నాగావళి వంటి చిన్న నదులు రాష్ట్రానికి నీటి అవసరాలను తీరుస్తున్నాయి. వందలాదిగా ఉన్న వాగులు, వంకలు కూడా సహజ సిద్ధ జలవనరులలో ముఖ్యమైనవి. వీటికి తోడు వేలాది మానవ నిర్మిత జలవనరులు కూడా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. శతాబ్దాల క్రితం ఆనాటి పాలకులు త్రవ్వించిన చెరువులు ఈనాటికీ ప్రజావసరాలను తీరుస్తున్నాయి. కాకతీయులు, విజయనగర రాజులు త్రవ్వించిన చెరువులు ఈనాటికీ ఉపయోగంలో ఉన్నాయి.ఆధునిక కాలంలో సహజ సిద్ధమైన జలవనరులను ప్రభావవంతంగా వాడుకొనేందుకు ప్రభుత్వాలు ఎన్నో బృహత్పథకాలను చేపట్టి విజయం సాధించాయి. నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు ఇటువంటి పెద్ద ప్రాజెక్టులే. ఇంకా ఎన్నో ఇతర ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో నిర్మాణంలో ఉన్నాయి. అలాగే వర్షపు నీటిని వృధాగా పోనీయకుండా చిన్న ఆనకట్టలు కట్టి ప్రజల త్రాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చే మార్గాలను కూడా అనుసరిస్తున్నారు. చెక్‌డాములు, వాటర్‌షెడ్లు ఈ కోవ లోకి వస్తాయి. విభజన జలవనరులను ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి: సహజ వనరులు నదులు, వాగులు, వంకలు మానవ నిర్మిత వనరులు చెరువులు, దొరువులు, బావులు, నూతులు, చెక్‌డాంలు, వాటర్‌షెడ్లు, కాలువలు, నదీలోయ ప్రాజెక్టులు 2019-20 ప్రాధాన్యతలు 2019-20 సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల కొరకు రూ.13,139.13 కోట్ల బడ్జెట్ ప్రాధాన్యతలు. ఒక సంవత్సర కాలంలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు సొరంగం - 1 ని పూర్తి చేయటం. దీనివల్ల 1.19 లక్షల ఎకరాలకు నీటిని అందించవచ్చు. మిగిలిన ఆయకట్టు ఏర్పాటు చేయడానికి 2 సంవత్సరాల కాలం లోపుగా సొరంగం-2, 2వ దశను పూర్తి చేయడం జరుగుతుంది. అవుకు సొరంగాన్ని పూర్తి చేస్తూ ఒక సంవత్సరంలో గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు 1వ దశను పూర్తి చేసేందుకు, గండికోట రిజర్వాయరులో వీటి నిల్వ, కడప జిల్లాలోని ఆయకట్టుదారులకు నీటి సరఫరా కర్నూలు, అనంతపురం జిల్లాలలోని 1.98 లక్షల ఎకరాలకు సాగునీటిని కల్పించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి 1 వ దశను పూర్తి చేయటం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో సత్వర సాగునీటి సౌకర్యాలను కల్పించడానికి వంశధార ప్రాజెక్టు, సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయటం. ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ 106 ప్రాజెక్టులు నిర్వహిస్తుంది. అందులో కొన్ని గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు హంద్రీ నీవా సుజల స్రవంతి - దశ 1 హంద్రీ నీవా సుజల స్రవంతి - దశ 2 కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ జలాశయం ప్రాజెక్టు కెఎల్ రావు సాగర్ పులిచింతల నాగార్జునసాగర్ ప్రాజెక్టు పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం బ్యారేజీ శ్రీశైలం కుడి కాలవ తెలుగు గంగ ప్రాజెక్టు ఇవి కూడా చూడండి ఆంధ్రప్రదేశ్ నదులు మూలాలు వెలుపలి లంకెలు జల వనరులు వర్గం:జల వనరులు వర్గం:జలాశయాలు
శ్రీనాధుడు
https://te.wikipedia.org/wiki/శ్రీనాధుడు
దారిమార్పు శ్రీనాథుడు
బ్రిటీషువారి ప్రాంతాలలో విద్యావ్యవస్థ
https://te.wikipedia.org/wiki/బ్రిటీషువారి_ప్రాంతాలలో_విద్యావ్యవస్థ
బ్రిటిష్ కాలంలో భారతదేశం-విద్య బ్రిటీషు వారి కాలంలో భారతదేశ విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి, ముఖ్యముగా రెండు మార్పులు చెప్పుకోవాలి: ఒకటి అప్పటివరకూ ఎన్ని మార్పులు జరిగినా భారతదేశంలో విద్యావ్యవస్థ మతప్రధానమైనదిగానే ఉండినది, అయితే హిందూ మతము, లేదా బౌద్ధ మతము లేదా ఇస్లాం మతము, కానీ బ్రిటీషు వారు వచ్చిన తరువాత భౌతిక విద్యకు ప్రాధాన్యం పెరిగినది, వేదాలు చదవడం మానేసి ప్రజలు సైన్సు మొదలగున్నవి చదవడం మొదలుపెట్టినారు. ఇహ రెండవ ముఖ్యమైన మార్పు ఆంగ్ల భాషలో విద్యాబోధన, అప్పటివరకు వివిధ భారతీయ భాషలలో ముఖ్యముగా సంస్కృతములో లేదా అరబిక్ లేదా ఉర్దూ లలో జరిగే విద్యా బోధన ఆంగ్ల భాషలోనికి మార్చబడినది, అంటే మొత్తం మార్చబడినది అని కాదు, కానీ పరిపాలకుల ఆర్థిక సహాయం కేవలం ఆంగ్లము బోధించు పాఠశాలకే ఇవ్వసాగినారు, దానితో ఆంగ్లమునకు ప్రాముఖ్యత పెరిగింది. బ్రిటీషు వారి విద్యావిధానంలో ఎన్నో కమిటీలు వేసినారు, ఎన్నో సంస్కరణలు ప్రయత్నించారు, కానీ వారు భారత దేశాన్ని వదిలే సమయానికి దేశంలో అక్షరాస్యత పది శాతం కూడాలేదు. దీనికి కారణం వారు పాటించిన జల్లెడ పద్ధతి లేదా ఫిల్టరు పద్ధతి, దీని ద్వారా కేవలం పై తరగతి వారికి చదువు చెప్తితే వారు క్రింది తరగతి వారికి నేర్పుతారు అని భావించడం జరిగినది, కానీ అది ఆచరణలో పెద్ద విఫల ప్రయత్నముగా మిగిలినది. ఇవీ చూడండి విద్య భారతదేశంలో విద్య వర్గం:భారతదేశ విద్యావ్యవస్థ
మహాప్రస్థానం
https://te.wikipedia.org/wiki/మహాప్రస్థానం
thumbnail|శ్రీశ్రీ మహాప్రస్థానం కవర్ పేజీ శ్రీశ్రీ రచించిన సంచలన కవితా సంకలనం మహా ప్రస్థానం, ఇది వెలుబడిన తరువాత తెలుగు సాహిత్యపు ప్రస్థానానికే ఓ దిక్సూచిలా వెలుగొందినది, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని 'మహా ప్రస్థానానికి ముందు, మహా ప్రస్థానానికి తరువాత' అని విభజించవచ్చు అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇది ఒక అభ్యుదయ కవితా సంపుటి. దీనిలో మొత్తం నలబై కవితలు ఉన్నాయి. ఇందులో శ్రీశ్రీ కార్మిక కర్షిక శ్రామిక వర్గాలను ఉత్తేజితులను చేస్తూ, నూతనోత్సాహం కలిగిస్తూ, ఉర్రూతలూగిస్తూ గీతాలు వ్రాసినాడు. ఇది తెలుగు కవితకే ఓ మార్గదర్శి అయినది. మహా ప్రస్థానం కవితా సంపుటికి యోగ్యతాపత్రం శీర్షికన ఉన్న ముందుమాట ప్రముఖ తెలుగు రచయిత గుడిపాటి వెంకట చలం వ్రాసినారు. మహాప్రస్థాన కవితల రచన మొత్తంగా 1930 దశకంలో జరిగింది. మరీ ముఖ్యంగా 1934కూ 1940కీ నడుమ వ్రాసినవాటిలో గొప్ప కవితలను ఎంచుకుని 1950లో ప్రచురించారు శ్రీశ్రీ. ఈ కవితలు తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వమనే కవితావిప్లవాన్ని సృష్టించడానికి ఒకానొక కారణంగా భావించారు. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని విశ్లేషిస్తూ వెలువడిన అనేక వ్యాసాల పరంపరలో అద్దేపల్లి రామమోహనరావు వ్రాసిన శ్రీశ్రీ కవితాప్రస్థానం పేర్కొనదగింది. రచనా నేపథ్యం 1930 దశకం ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం వల్ల నిరుద్యోగులైన యువకుల జీవితాలు మొదలుకొని చిరుద్యోగుల వరకూ సమాజంలోని అనేకమైన వర్గాల జీవితాలు అల్లకల్లోలమైన సమయం. ఆ కాలాన్ని ఆకలి ముప్పైలు (హంగ్రీ థర్టీస్) అని పిలిచారు. ఈ దశలో వ్యక్తిగతంగానూ, సాంఘికంగానూ శ్రీశ్రీ చుట్టూ జరిగిన సాంఘిక పరిణామాలు ఆయన రచనా వస్తువులను నిర్దేశించాయి. రచనా క్రమంలో కూడా మొదట పద్యాలను భావకవుల ప్రభావం వ్రాస్తున్న శ్రీశ్రీ క్రమంగా ఇతర భాషల్లో వస్తున్న ప్రక్రియాపరమైన మార్పులు అర్థం చేసుకుంటూ ఒకానొక పరిపక్వమైన దశకు చేరుకున్నారు. అలాంటి స్థితిలో 1934 నుంచి 1940 వరకూ తాను రాసిన కవితల్లోని ఉత్తమమైన, మానవజాతి ఎదుర్కొంటున్న బాధల గురించి, క్రొత్తగా వెలువడాల్సిన సాహిత్యం గురించి వ్రాసిన కవితలను మాత్రం తీసుకుని 1950ల్లో ప్రచురించారు. సంకలనంగా కాక విడివిడిగా ప్రచురణ పొందిన, వేర్వేరు కవితావేదికలపై కవితాగానం చేస్తున్న దశలోనే మహాప్రస్థానంలోని కవితలు పేరు ప్రఖ్యాతులు పొందాయి. కవితా! ఓ కవితా!!ను నవ్యసాహిత్య పరిషత్తు వేదికపై తన ధోరణిలో గొణుగుడు లాంటి స్వరంతో చదువుతుండగా అదే వేదికపై అధ్యక్షునిగా కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఉన్నారు. తొలినాళ్ళలో శ్రీశ్రీకి అభిమానపాత్రుడైనవాడు, అప్పటికే గొప్పకవిగా పేరు సంపాదించినవాడు విశ్వనాథ సత్యనారాయణ కవిత పూర్తవుతుండగానే తడిసిన కన్నులతో వేదికపైన అటు నుంచి ఇటు నడచుకుంటూ వచ్చి కౌగలించుకుని ప్రస్తుతించారు. కాకినాడలో కమ్యూనిస్టు యువకుల మహాసభలో శ్రీశ్రీ చదివిన గేయం కూడా ఇందులో ఉంది. దానిని విని అడవి బాపిరాజు, శ్రీరంగం నారాయణబాబు దానిని అనుకరించే ప్రయత్నాలు చేయగా, ముద్దు కృష్ణ తన పత్రికయైన జ్వాలలో పట్టుపట్టి ప్రచురించుకున్నారు. జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి పాడి వినిపించగా చలం కన్నీళ్ళు పెట్టుకునేలా చేసిన చేదుపాట అనే గేయం కూడా ఇందులో చేరింది. సంకలనంగా ప్రచురణకు ముందే ఇందులోని చాలా కవితలను అడవి బాపిరాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి అప్పటికే చేస్తున్న సభల్లో పలువురు కవుల పాటలతో కలిపి పాడేవారు. ఆ విధంగా కూడా ఈ గీతాలు ప్రాచుర్యం పొందాయి. నవ్యసాహిత్య పరిషత్తు వేదికపై కవితా ఓ కవితా గేయాన్ని విన్న విశ్వనాథ అక్కడిక్కడే శ్రీశ్రీని ఆర్ద్రంగా అభినందించడంతో పాటుగా దానిని ప్రచురిస్తానని అన్నారు. ఆ గ్రంథానికి పీఠిక చలమే రాయాల్సిందని మరో రచయిత చింతా దీక్షితులు ద్వారా కబురుపెట్టారు. అయిత చలం ముందుమాటగా యోగ్యతా పత్రం వ్రాసినా విశ్వనాథ వారు కారణాంతరాల వల్ల ప్రచురించలేకపోయారు. 1950న మహాప్రస్థానం మొట్టమొదటిసారిగా నళినీకుమార్ ఆర్థిక సహాయం ప్రచురణ పొందింది. నళినీమోహన్ పూర్తిపేరు ఉండవల్లి సూర్యనారాయణ. ఈ పుస్తకాన్ని 1938లో అకాల మరణం పొందిన శ్రీశ్రీ స్నేహితుడు, సాహిత్యకారుడు కొంపెల్ల జనార్ధనరావుకు అంకితమిచ్చారు. ఇతివృత్తాలు మహాప్రస్థానం గేయాల్లోని ఇతివృత్తాలు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా మానవజాతి ఎదుర్కొంటున్న బాధలు, వీటికి నేపథ్యంగా ఉన్న చారిత్రిక పరిణామాలు, పీడితుల పక్షాన నిలవాల్సిన కవికి అవసరమైన లక్షణాలు, నూతనమైన ఈ అంశాలపై రావాల్సిన కవిత్వమూ, తన కవిత్వానికి లక్షణాలు, పీడితులను ఇంకా పీడించేందుకు సహాయకారిగా ఉండే తాత్త్వికతలపై తిరుగుబాటు వంటివి ఉన్నాయి. వీటన్నిటికీ మూలమైన నేపథ్యంగా తన కవితాతాత్త్వికతనీ, దానికి వెనుకనున్న సంఘర్షణనీ అపురూపంగా వెల్లడించిన కళాఖండమైన కవితా ఓ కవితా కూడా ఉంది. మొదటి గేయం మహాప్రస్థానం. అదొక కవాతు పాట లాంటిది. పదండి ముందుకు పదండి త్రోసుకు అంటూ ప్రబోధించే ఈ గేయం హరోం! హరోం హర! హరోం! హరోం హర!హర! హర! హర! అంటూ యుద్ధనినాదం చేసుకుంటూ కదలమన్నాడు. ఐ గేయంలో తాను స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం అని చెప్పుకున్నారు, నా మహోద్రేకాలు భవభూతి శ్లోకాలు, పరమేష్ఠి జూకాలు అంటూ తన గురించి వ్రాసుకున్నారు. దీనిని విమర్శకులు నిర్ద్వంద్వంగా, నిరాఘాటంగా చేసుకున్న ఆత్మస్తుతిగా పేర్కొన్నారు. మూడో కవిత జయభేరి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను అంటూ సాగే ఈ గేయంలో తన వల్ల అయ్యేది తాను చేయగలగడం మొదలుకొని తుదకు ఆ తానే భువన భవనపు బావుటానై పైకి లేస్తానని, నా కుహూరుతశీకరాలే, లోకమంతా జల్లులాడే, ఆ ముహూర్తా లాగమిస్తాయి అన్నారు. యోగ్యతా పత్రం యోగ్యతా పత్రం - మహాప్రస్థానం పుస్తకానికి 1940 లో చలం రాసిన పీఠిక. తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప పీఠికలలో ఇది ఒకటి. ఆ పుస్తకం ఎవరు చదవాలో, ఎందుకు చదవాలో, ఎలా చదవాలో వివరించే పీఠిక అది. "రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రపంచ ఘోషం ఝంఝానిల షడ్జధ్వానం" విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి." అంటూ పుస్తకం చదవడానికి పాఠకుడిని సమాయత్త పరచే పీఠిక అది. యోగ్యతాపత్రంలో చలం రాసిన కొన్ని వాక్యాలు మచ్చుకు: ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాథం లోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరి బిక్కిరై తుఫాను హోరు చెవుల గింగురు మని, నమ్మిన కాళ్ళ కింది భూమి తొలుచుకు పోతోవుంటే, ఆ చెలమేనయమని వెనక్కి పరిగెత్త చూస్తారు. తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీ శ్రీ అడిగితే, కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చెలం. "తూచవద్దు, అనుభవించి పలవరించ" మన్నాడు శ్రీ శ్రీ. శ్రీశ్రీ నిర్వహించిన ప్రజ శీర్షిక లో పిచ్చయ్య అనే పాఠకుడు ఇలా ప్రశ్నించాడు "యోగ్యతా పత్రం చదివితే మహాప్రస్థానం చదవనక్కరలేదని నేను అంటాను, మీరేమంటారు". అతిశయోక్తి అయినా, అంతటి గుర్తింపు పొందిన పీఠిక అది. అయితే శ్రీశ్రీ ఆ పాఠకుడి ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు: "మీరు సార్థక నామధేయులంటాను" కవితా సూచిక యోగ్యతా పత్రం కొంపెల్లి జనార్ధన రావు కోసం జయభేరి ఒక రాత్రి గంటలు ఆకాశ దీపం అవతారం ఆశా దూతలు ఐ ! శైశవ గీతి అవతలి గట్టు సాహసి కళారవి భిక్షు వర్షీయసి ఒక క్షణంలో పరాజితులు ఆ ః ! ఉన్మాది స్విన్‌బర్న్ కవికి వాడు అభ్యుదయం వ్యత్యాసం మిథ్యావాది కవితా! ఓ కవితా ! జ్వాలా తోరణం మానవుడా ! దేనికొరకు ? పేదలు గర్జించు రష్యా ! నిజంగానే ? నీడలు జగన్నాథుని రథచక్రాలు ముద్రణలు తొలి ప్రచురణ తర్వాత 70 సంవత్సరాలకు, శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు, "శ్రీశ్రీ మహాప్రస్థానం మొదలైన గీతాలు" అనే శీర్షికతో పెద్ద పరిమాణంలో మహాప్రస్థానం రూపకల్పన చేసి ప్రచురించారు. నిలువుటద్దం అని విజయవాడలో ఈ పుస్తకాన్ని తనికెళ్ళ భరణి ఆవిష్కరించాడు. భరణి ఈ పుస్తకాన్ని నిలువుటద్దంగా అభివర్ణించాడు. మహాప్రస్థానం రచన పుట్టుక, తొలిసారి చదివిన వివరాలు, ముద్రణలకు నోచుకున్న తీరు, పలుముద్రణల ముఖచిత్రాలు వివరాలు కూడా దీనిలో వున్నాయి. మూలాలు బయటి లింకులు ఈనాడు సాహిత్య సంపద లింకు యూనీకోడ్ లో వర్గం:శ్రీశ్రీ రచనలు వర్గం:తెలుగు పుస్తకాలు వర్గం:తెలుగు వచన కవిత్వం
తెలుగు సినిమాలు 1931
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1931
ఇది తెలుగు సినిమాకు జన్మ దినోత్సవ సంవత్సరం. 1931 సెప్టెంబరు 15న విజయవాడలో మారుతీ, కాకినాడలో క్రౌన్‌, మద్రాస్‌లోని గెయిటీ, మచిలీపట్నంలోని మినర్వా టాకీసుల్లో విడుదలైన తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద' దర్శకుడు హెచ్‌.యమ్‌.రెడ్డి తెలుగువారే అయినా, ఆ చిత్ర నిర్మాత, ఇంపీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీ అధినేత ఆర్దెషీర్‌ ఇరానీ. ఆయన తెలుగువారు కాదు. 1931 ప్రారంభంలో మాటలైనా, పాటలైనా పూర్తిగా సెట్‌లోనే రికార్డు చేసేవారు. ఎక్కడ ఏ శబ్దం ఉన్నా- అది రెండు ఛానళ్లలో ఫిల్మ్‌మీదే రికార్డయ్యేది. అందుకే- పాటలు పాడగలిగే నటీనటులు ఉంటే, మరొక వంక కెమెరాను చూస్తూ ఒక మైక్‌లో పాడుతోంటే, కెమెరా పరిధిలోకి రాని విధంగా రెండో మైక్‌లో వాద్యబృందంవారి మ్యూజిక్‌ ఉండేది. 1931 చలన చిత్రాల జాబితా భక్తప్రహ్లాద సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1932
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1932
1932 సంవత్సరంలొ రెండే రెండు తెలుగు చలన చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలను 'సాగర్‌' సంస్థ నిర్మించింది. అవి పాదుకా పట్టాభిషేకం, శకుంతల. వీటి ద్వారా నాటి సుప్రసిద్ధ రంగస్థల నటుడు యడవల్లి సూర్యనారాయణ చిత్రసీమలో ప్రవేశించాడు. వీటిలో సురభి కమలాబాయి నాయిక పాత్ర ధరించింది. సినిమాలు పాదుకా పట్టాభిషేకం బాదామి సర్వోత్తం దర్శకత్వంలో, చిలకలపూడి రామాజనేయులు, సురభి కమలాబాయి తదితరులు ముఖ్యపాత్రల్లో, సాగర్ స్టూడియోస్ నిర్మించిన తెలుగు పౌరాణిక చిత్రం. 1932లో నిర్మితమైన ఈ సినిమా రెండవ తెలుగు టాకీ పేరొందింది. శకుంతల ప్రసిద్ధమైన కాళిదాసు రచన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. పాదుకా పట్టాభిషేకం సినిమా నిర్మించిన సంస్థయే ఈ సినిమాను కూడా నిర్మించింది. మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1933
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1933
ఈ యేడాది తెలుగు నాట తొలిసారి పోటీ చిత్రాలు రూపొందాయి. ఇంపీరియల్‌ సంస్థ (బొంబాయి), ఈస్ట్‌ ఇండియా సంస్థ (కలకత్తా) ఒకే ఇతివృత్తంతో రామదాసు అనే పేరుతో చెరొక చిత్రాన్ని నిర్మించాయి. సావిత్రి పేరుతో రెండు చిత్రాలు పోటీగా రూపొందాయి. వీటిలో ఓ చిత్రాన్ని సి.పుల్లయ్య దర్శకత్వంలో ఈస్ట్‌ ఇండియా సంస్థ, మరో చిత్రాన్ని బి.వి.రామానందం దర్శకత్వంలో కృష్ణా ఫిలిమ్స్‌ కంపెనీ నిర్మించాయి. ఈస్ట్‌ ఇండియా సంస్థ నిర్మించిన సావిత్రి, రామదాసు రెండు చిత్రాలూ ప్రజాదరణ చూరగొన్నాయి. ఇదే యేడాది ఆంధ్రదేశంలో తొలి శాశ్వత‌ సినిమా థియేటర్‌ను నిర్మించిన పోతిన శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈలపాట రఘురామయ్య నటించిన పృధ్వీపుత్ర, చింతామణి విడుదలయ్యాయి. చింతామణి పృధ్వీపుత్ర రామదాసు (కృష్ణా ఫిలిమ్స్) రామదాసు (ఈస్టిండియా ఫిలిమ్స్) సావిత్రి(కృష్ణా ఫిలిమ్స్) సావిత్రి(ఈస్టిండియా) సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1934
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1934
thumb|లవకుశబందరులోని మినర్వా టాకీసు అధినేత పినపాల వెంకటదాసు మద్రాసు వెళ్ళి వేల్‌ పిక్చర్స్‌ స్టూడియోస్‌ స్థాపించి, తీసిన సీతాకళ్యాణం బాగా ప్రజాదరణ పొందింది. ఇది దక్షిణాదిలో నిర్మించిన మొదటి సినిమా. సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన లవకుశ కూడా హిట్‌ చిత్రంగా నిలిచింది. ఇదే యేడాది మూడో చిత్రంగా విడుదలైన అహల్య పరాజయాన్ని చవిచూసింది. అహల్య లవకుశ సీతాకళ్యాణం సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1935
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1935
thumb|ఎస్.రాజెశ్వరరావు ఈ సంవత్సరం ఏడు చిత్రాలు విడుదలయ్యాయి. ఎస్‌. రాజేశ్వరరావు చిన్నికృష్ణుడుగా నటించిన 'శ్రీకృష్ణలీలలు' విశేషాదరణ పొందింది. కన్నాంబ, శ్రీరామమూర్తి, పి.పుల్లయ్య తొలి చిత్రం అయిన హరిశ్చంద్ర కూడా బాగా ఆడింది. చూడండి: 1935లో సినిమాలు 1935 1936లో సినిమాలు 1930లలో సినిమాలు సంవత్సరాల వారిగా తెలుగు సినిమా సతీ అనసూయ హరిశ్చంద్ర కృష్ణలీలలు (శ్రీకృష్ణలీలలు) కుచేల రాణి ప్రేమలత :ఇది 1935లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని మదన్ థియేటర్స్ నిర్మించింది. సక్కుబాయి కృష్ణ తులాభారం మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1982
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1982
thumb|అందగాడు ఈ యేడాది 85 చిత్రాలు విడుదలయ్యాయి. విజయమాధవీ కంబైన్స్‌ 'బొబ్బిలిపులి' సెన్సార్‌ సమస్యలు ఎదుర్కొని, ఆలస్యంగా విడుదలై సంచలన విజయం సాధించి, 365 రోజులు ప్రదర్శితమైంది. 'జస్టిస్‌ చౌదరి' కూడా సూపర్‌హిట్‌ అయి, 250 రోజులు ప్రదర్శితమైంది. ఇంకా "అనురాగదేవత, నా దేశం, ప్రేమమూర్తులు, స్వయంవరం, దేవత, ఇల్లాలి కోరికలు, బంగారుభూమి, ఈనాడు, ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణయ్య, గృహప్రవేశం, తరంగిణి, త్రిశూలం, నాలుగు స్తంభాలాట, పట్నం వచ్చిన పతివ్రతలు, విప్లవశంఖం, శుభలేఖ" శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇంకా "ప్రతిజ్ఞ, యమకింకరుడు" కూడా సక్సెస్‌ఫుల్‌ చిత్రాలుగా నిలిచాయి. ఇక్కడ నుండి ఉదయం ఆటల సీజన్‌ బాగా పెరిగి, 'ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య' - 516 రోజులు, 'తరంగిణి' - 365 రోజులు, 'త్రిశూలం' - 300 రోజులు ప్రదర్శితమయ్యాయి. విడుదలైన చలనచిత్రాలు తెలుగునాడు అందగాడు అనురాగదేవత రాగదీపం బంగారు కొడుకు తల్లీకొడుకుల అనుబంధం గృహప్రవేశం ఇద్దరు కొడుకులు కలియుగ రాముడు డాక్టర్ మాలతి ధర్మవడ్డీ కృష్ణార్జునులు నిప్పుతో చెలగాటం బంగారు కానుక విప్లవ శంఖం జయసుధ డాక్టర్ సినీ యాక్టర్ మల్లెపందిరి ప్రేమ మూర్తులు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య నాలుగు స్తంభాలాట కలహాల కాపురం జస్టిస్ చౌదరి శ్రీలక్ష్మీనిలయం శుభలేఖ రాధమ్మ మొగుడు కోరుకున్న మొగుడు పెళ్ళిళ్ళపేరయ్య నివురుగప్పిన నిప్పు మహాప్రస్థానం (సినిమా) చందమామ గోపాలకృష్ణుడు బొబ్బిలిపులి ఇది పెళ్లంటారా? ప్రతీకారం పెళ్లీడు పిల్లలు సీతాదేవి రాధా మై డార్లింగ్ పుణ్యభూమి కళ్ళు తెరిచింది ప్రేమ నక్షత్రం స్వయంవరం చలాకీ చెల్లెమ్మ ఈ చరిత్ర ఏ సిరాతో? వయ్యారి భామలు వగలమారి భర్తలు గోల్కొండ అబ్బులు జగన్నాధ రథచక్రాలు పగబట్టిన సింహం కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి ఎంత ఘాటు ప్రేమయో దేవత జగ్గు కృష్ణావతారం మేఘసందేశం టింగు రంగడు పట్నం వచ్చిన పతివ్రతలు ఏకలవ్య పూల పల్లకి బిల్లా రంగా షంషేర్ శంకర్ యమకింకరుడు తెలుగువాడు ఇల్లాలి కోరికలు నాదేశం తరంగిణి ప్రేమ సంకెళ్ళు మొండిఘటం కొత్తనీరు ఇల్లంతా సందడి మంచుపల్లకి భక్త ధృవ మార్కండేయ కదలి వచ్చిన కనకదుర్గ బంధాలు అనుబంధాలు ఓ ఆడది ఓ మగాడు కలవారి సంసారం అనంతరాగాలు ప్రళయరుద్రుడు ఈనాడు త్రిశూలం యువరాజు బలిదానం మనిషికో చరిత్ర నవోదయం ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు ఏది ధర్మం ఏది న్యాయం నిజం చెబితే నేరమా నెలవంక ప్రేమపిచ్చోళ్ళు బెజవాడ బెబ్బులి ప్రళయగర్జన అక్కమొగుడు చెల్లెలి కాపురం కుంకుమ తిలకం ముద్దుల మొగుడు ధర్మ పోరాటం పల్లెటూరి మొనగాడు గాజు బొమ్మలు ఊరంతా సంక్రాంతి ఇదికాదు ముగింపు పిచ్చిపంతులు ముందడుగు సింహం నవ్వింది మా ఇంటాయన కథ ఈ దేశంలో ఒకరోజు కోడలు కావాలి అభిలాష కిరాయి కోటిగాడు ప్రజాశక్తి రాముడుకాదు కృష్ణుడు అమాయక చక్రవర్తి చట్టానికి వేయికళ్లు రెండు జెళ్ళ సీత కీర్తి కాంత కనకం బందిపోటు రుద్రమ్మ ముగ్గురు మొనగాళ్ళు ఈ పిల్లకు పెళ్ళవుతుందా తోడూ నీడ శక్తి రాజకుమార్ మూడు ముళ్ళు పోలీసు వెంకటస్వామి రాకాసి లోయ ధర్మాత్ముడు కళ్యాణ వీణ శ్రీరంగ నీతులు ప్రజారాజ్యం దేవీ శ్రీదేవి భార్యాభర్తల సవాల్ కాలయముడు నేటి భారతం సింహపురి సింహం అగ్నిసమాధి ఖైదీ శుభ ముహూర్తం లంకెబిందెలు చండీరాణి త్రివేణి సంగమం రుద్రకాళి మూగవాని పగ మా ఇంటికి రండి పోరాటం మనిషికి మరోపేరు కొంటె కోడళ్ళు పులిదెబ్బ చండి చాముండి విముక్తికోసం సంఘర్షణ రాజు రాణీ జాకి మరో మాయాబజార్ చిలక జోస్యం అడవి సింహాలు పల్లెటూరి పిడుగు కోకిలమ్మ బహుదూరపు బాటసారి ఆంధ్రకేసరి చండశాసనుడు సిరిపురం మొనగాడు సాగరసంగమం శివుడు శివుడు శివుడు పులి బెబ్బులి రంగులపులి అమాయకుడు అసాధ్యుడు గూఢచారి నెం.1 దుర్గాదేవి అగ్నిజ్వాల మగమహారాజు గ్రహణం విడిచింది రామరాజ్యంలో భీమరాజు రోషగాడు ముక్కుపుడక స్వరాజ్యం కోటికొక్కడు మా ఇంటి ప్రేమాయణం పండంటి కాపురానికి 12 సూత్రాలు అమరజీవి పన్నీరు పుష్పాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1981
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1981
thumb|47 రోజులు ఈ యేడాది 107 చిత్రాలు విడుదలయ్యాయి. విషాదాంత ప్రేమకథగా రూపొందిన అన్నపూర్ణ సినీస్టూడియోస్‌ 'ప్రేమాభిషేకం' చిత్రం అనూహ్య విజయం సాధించి, తెలుగు చలనచిత్ర చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. రజతోత్సవాల్లోనూ, స్వర్ణోత్సవాల్లోనూ రికార్డులు నెలకొల్పి, 75 వారాలపాటు ప్రదర్శితమై, ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్లాటినమ్‌ జూబ్లీ చిత్రంగా నిలిచింది. ఎనిమిది కేంద్రాలలో (రెగ్యులర్‌ షోలతో నాలుగు, నూన్‌ షోలతో నాలుగు) స్వర్ణోత్సవాలు జరుపుకొని నేటికీ రికార్డుగా నిలిచి ఉంది. అంతే కాకుండా గుంటూరులో సింగిల్‌ థియేటర్‌లో 380 రోజులు ప్రదర్శితమై నేటికీ చెరిగిపోని రికార్డును సొంతం చేసుకుంది. ఇదే యేడాది విడుదలైన రోజామూవీస్‌ 'కొండవీటి సింహం' సంచలన విజయం సాధించి, అప్పటి వరకు ఉన్న కలెక్షన్స్‌ రికార్డులను అధిగమించి, అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని, 300 రోజులకు పైగా ప్రదర్శితమైంది. ఈ చిత్రం అనకాపల్లిలో లేట్‌ రిలీజ్‌ (వందరోజుల తరువాత)గా విడుదలై డైరెక్టుగా 178 రోజులు ప్రదర్శితమై, లేట్‌ రన్‌లో స్టేట్‌ రికార్డుగా నేటికీ నిలిచి ఉంది. "శ్రీవారి ముచ్చట్లు, గజదొంగ, ఊరికి మొనగాడు, పండంటి జీవితం, ఇల్లాలు, ఆకలిరాజ్యం, ఎర్రమల్లెలు, గురుశిష్యులు, చట్టానికి కళ్ళులేవు, న్యాయం కావాలి, భోగిమంటలు, ముద్దమందారం, రాధాకళ్యాణం, సప్తపది, సీతాకోకచిలుక" చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకోగా, "కిరాయిరౌడీలు, దీపారాధన, పాలు-నీళ్ళు, పులిబిడ్డ, భోగభాగ్యాలు, మహాపురుషుడు, రగిలేజ్వాల, రాణీకాసుల రంగమ్మ, వారాలబ్బాయి, సత్యభామ" సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి. ఈ ఏడే మహానటి సావిత్రి డిసెంబరు 26న మరణించారు. 47 రోజులు అగ్గిరవ్వ అగ్నిపూలు అమావాస్య చంద్రుడు అమృతకలశం అత్తగారి పెత్తనం అద్దాలమేడ అంతం కాదిది ఆరంభం అల్లుడు గారూ జిందాబాద్ ఆకలి రాజ్యం ఆడవాళ్ళూ మీకు జోహార్లు ఆశాజ్యోతి ఇల్లే స్వర్గం ఇల్లాలు ఊరుకిచ్చిన మాట ఎర్రమల్లెలు ఓ అమ్మకథ ఓ ఇంటి కథ కొత్తనీరు కిరాయి రౌడీలు కెప్టెన్ రాజు కొండవీటి సింహం కొత్త జీవితాలు క్రాంతి గడసరి అత్త సొగసరి కోడలు గజదొంగ గువ్వలజంట గిరిజా కళ్యాణం గురు శిష్యులు (1981 సినిమా) గోలనాగమ్మ ఘరానా గంగులు చిన్నారి చిట్టిబాబు చట్టానికి కళ్లులేవు చిలిపి మొగుడు జగమొండి జతగాడు జీవితరథం జేగంటలు జగద్గురు ఆది శంకరాచార్య టాక్సీడ్రైవర్ డబ్బు డబ్బు డబ్బు తెలుగునాడు తిరుగులేని మనిషి తోడుదొంగలు త్యాగయ్య తొలికోడి కూసింది దారితప్పిన మనిషి దీపారాధన దేవీ దర్శనం దేవుడు మామయ్య నామొగుడు బ్రహ్మచారి నేనూ మాఆవిడ న్యాయం కావాలి నాదే గెలుపు నాయుడుగారి అబ్బాయి నోముల పంట పక్కింటి అమ్మాయి పాలు నీళ్లు పార్వతీ పరమేశ్వరులు ప్రణయ గీతం ప్రేమాభిషేకం ప్రేమమందిరం ప్రేమ నాటకం ప్రియ పులిబిడ్డ ప్రేమ సింహాసనం పండంటి జీవనం పటాలం పాండు పేదల బ్రతుకులు ప్రేమ కానుక బంగారుబాట? బాలనాగమ్మ భలే బుల్లోడు భోగభాగ్యాలు భోగిమంటలు భక్తుడు భగవంతుడు? మహా పురుషుడు మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము మరో కురుక్షేత్రం ముద్దమందారం మంత్ర శక్తి దైవ భక్తి మరియా మై డార్లింగ్ నా మొగుడు బ్రహ్మచారి మాయదారి అల్లుడు మావూరి పెద్దమనుషులు మినిస్టర్ మహాలక్ష్మి మౌన గీతం రహస్య గూఢచారి రామదండు రామలక్ష్మణులు రామాపురంలో సీత రాణీకాసుల రంగమ్మ రాధా కళ్యాణం రుద్రతాండవం రగిలే జ్వాల లక్ష్మి వాడనిమల్లి వారాల అబ్బాయి విప్లవ జ్యోతి విశ్వరూపం శ్రీదేవి శ్రీలక్ష్మినిలయం శ్రీవారి ముచ్చట్లు శ్రీరస్తు శుభమస్తు సంధ్యారాగం సంగీత సప్తపది సరదాబాబు సత్యం శివం సత్యభామ సావిత్రి సీతాకోకచిలుక సుబ్బారావుకి కోపం వచ్చింది స్వర్గం హరిశ్చంద్రుడు సింహస్వప్నం మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1980
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1980
ఈ యేడాది తెలుగు సినిమా రంగం తొలిసారి శతాధిక చిత్రాలను చూసింది. 117 చిత్రాలు విడుదలయ్యాయి. 'శంకరాభరణం' చారిత్రక విజయం సాధించి, ఖండాంతరాలలో కీర్తిని గడించి, తమిళనాడు, కర్ణాటకలలో సైతం జైత్రయాత్ర సాగించి, డైలాగులు మలయాళంలో, పాటలు తెలుగులోనే ఉండి కేరళలోనూ ఘనవిజయం సాధించింది. 50 వారాలు ప్రదర్శితమైంది. సంగీతపరమైన చిత్రాలకు మళ్ళీ ఓ ట్రెండ్‌ను సృష్టించి, విశ్వనాథ్‌ ఈ తరహా చిత్రాలను మరికొన్ని రూపొందించడానికి ఆక్సిజన్‌ను అందించిందీ చిత్రం. 'సర్దార్‌ పాపారాయుడు' కూడా సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలచి, 300 రోజులకు పైగా ప్రదర్శితమైంది. "ఏడంతస్తుల మేడ, సర్కస్‌ రాముడు, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త, ఘరానాదొంగ, మామాఅల్లుళ్ళ సవాల్‌, చుట్టాలున్నారు జాగ్రత్త, పున్నమినాగు, మొగుడుకావాలి, యువతరం కదలింది, గోపాలరావుగారి అమ్మాయి, సీతారాములు" శతదినోత్సవాలు జరుపుకోగా, "ఆటగాడు, గురు, ఛాలెంజ్‌ రాముడు, నిప్పులాంటి నిజం, బుచ్చిబాబు, బెబ్బులి, రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌, శివమెత్తిన సత్యం, సంధ్య, సుజాత, సూపర్‌మేన్‌, స్వప్న" సక్సెస్‌ఫుల్‌ చిత్రాలుగా నిలిచాయి. మాదాల రంగారావు 'యువతరం కదిలింది' కమ్యూనిస్టు బాణీ విప్లవ చిత్రాలకు నాంది పలికింది. ఇదే యేడాది విడుదలైన సమాంతర సినిమా 'మా భూమి' ఉదయం ఆటలతో సంవత్సరం పాటు ప్రదర్శితమైంది. విడుదలైన చిత్రాలు ఆడది గడపదాటితే నాగమల్లి (సినిమా) ఆలయం ఆరనిమంటలు ఆటగాడు అదృష్టవంతుడు అగ్ని సంస్కారం అల్లరిబావ అల్లుడు పట్టిన భరతం అమ్మాయికి మొగుడు మామకు యముడు బడాయి బసవయ్య బండోడు గుండమ్మ బంగారు బావ బంగారులక్ష్మి బెబ్బులి భలే కృష్ణుడు తల్లి దండ్రులూ జాగ్రత్త భావిపౌరులు బొమ్మల కొలువు బుచ్చిబాబు ఛాలెంజ్ రాముడు చండీప్రియ చిలిపి వయసు చుక్కల్లో చంద్రుడు చుట్టాలున్నారు జాగ్రత్త సినిమా పిచ్చోడు సర్కస్ రాముడు దేవుడిచ్చిన కొడుకు ధర్మ చక్రం ధర్మం దారి తప్పితే ఏడంతస్తుల మేడ గురు హరే కృష్ణ హలో రాధ జాతర జన్మహక్కు కక్ష కాళి కలియుగ రావణాసురుడు కల్యాణ చక్రవర్తి కేటుగాడు కిలాడి కృష్ణుడు కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త కొంటెమొగుడు పెంకిపెళ్ళాం కొత్త జీవితాలు కొత్తపేట రౌడీ కుక్క లవ్ ఇన్ సింగపూర్ మహాలక్ష్మి మంగళ గౌరి మాయదారి కృష్ణుడు మొగుడు కావాలి మూడు ముళ్ళ బంధం మూగకు మాటొస్తే మునసబు గారి అల్లుడు నాదే గెలుపు నాగమల్లి నకిలీ మనిషి నవ్వుతూ బ్రతకాలి నాయకుడు వినాయకుడు నిప్పులాంటి నిజం ఓ అమ్మకథ ఒకనాటి రాత్రి పారిజాతం పగడాల పడవ పగటి కలలు పసిడి మొగ్గలు పసుపు పారాణి పట్నం పిల్ల పెళ్ళిగోల పిల్లజమీందార్ పొదరిల్లు ప్రేమ తరంగాలు పున్నమినాగు రచయిత్రి రగిలే హృదయాలు రాజాధిరాజు రామాయణంలో పిడకలవేట రామ్ రాబర్ట్ రహీమ్ రాముడు - పరశురాముడు రౌడీ రాముడు కొంటె కృష్ణుడు సమాధి కడుతున్నాం చందాలివ్వండి సంసారం సంతానం సంధ్య సంఘం చెక్కిన శిల్పాలు సంగీత లక్ష్మి సన్నాయి అప్పన్న సరదా రాముడు సర్దార్ పాపారాయుడు సీతారాములు శాంతి సిరిమల్లె నవ్వింది శివమెత్తిన సత్యం శివశక్తి స్నేహమేరా జీవితం శ్రీవారి ముచ్చట్లు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి శుభోదయం సుజాత సూపర్ మేన్ స్వప్న తల్లిదీవెన త్రిలోక సుందరి వందేమాతరం వెంకటేశ్వర వ్రత మహాత్యం లక్ష్మీపూజ మాభూమి మా వారి మంచితనం మావూళ్ళో మహాశివుడు మహాశక్తి మనవూరి మారుతి మండే గుండెలు మంగళ తోరణాలు మరో సీత కథ మొదటి రాత్రి ముద్దు ముచ్చట ముద్దుల కొడుకు ముత్తయిదువ నాయిల్లు నావాళ్ళు నగ్నసత్యం నిజం నిండు నూరేళ్ళు ఒక చల్లని రాత్రి ఊర్వశీ నీవే నా ప్రేయసి పెద్దిల్లు చిన్నిల్లు ప్రెసిడెంట్ పేరమ్మ ప్రియబాంధవి పునాదిరాళ్ళు రారా కృష్ణయ్య రంగూన్ రౌడీ రామబాణం రావణుడే రాముడైతే సమాజానికి సవాల్ సంసార బంధం శంకరాభరణం శంఖుతీర్థం సీతే రాముడైతే శ్రీమద్విరాటపర్వం శ్రీరామబంటు శ్రీ వినాయక విజయం శృంగార రాముడు సృష్టి రహస్యాలు తూర్పు వెళ్ళే రైలు టైగర్ వీడని బంధాలు విజయ వియ్యాలవారి కయ్యాలు ఎవడబ్బ సొమ్ము యుగంధర్ మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1979
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1979
ఈ సంవత్సరం 93 చిత్రాలు విడుదలయ్యాయి. రోజామూవీస్‌ 'వేటగాడు' సంచలన విజయం సాధించి, 60 వారాలు ప్రదర్శితమైంది. 'డ్రైవర్‌ రాముడు' కూడా రజతోత్సవం జరుపుకుంది. "కార్తీక దీపం, గోరింటాకు, వియ్యాలవారి కయ్యాలు, మండే గుండెలు, ముద్దులకొడుకు, ఇంటింటి రామాయణం, రంగూన్‌ రౌడీ, విజయ" శతదినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. "ఇది కథకాదు, కోతలరాయుడు, కోరికలే గుర్రాలయితే, జూదగాడు, ప్రెసిడెంట్‌ పేరమ్మ, బంగారు చెల్లెలు, యుగంధర్‌, శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, శ్రీరామబంటు, సొమ్మొకడిది- సోకొకడిది, హేమాహేమీలు" చిత్రాలు సక్సెస్‌ఫుల్‌ మూవీస్‌గా విజయం సాధించాయి. ఛాయ (సినిమా) అల్లరి వయసు అజేయుడు అమ్మ ఎవరికైనా అమ్మ అందాలరాశి అందడు ఆగడు అండమాన్ అమ్మాయి అందమైన అనుభవం అంతులేని వింతకథ ఆణిముత్యాలు ఇది కథ కాదు ఇద్దరూ అసాధ్యులే ఇదో చరిత్ర ఇల్లాలి ముచ్చట్లు ఇంటింటి రామాయణం ఏది పాపం? ఏది పుణ్యం? ఏడడుగుల అనుబంధం ఐ లవ్ యూ కలియుగ మహాభారతం కల్యాణి (1979) కమలమ్మ కమతం కంచికి చేరని కథ కార్తీక దీపం కుడి ఎడమైతే కుక్క కాటుకు చెప్పు దెబ్బ కెప్టెన్ కృష్ణ కొత్త అల్లుడు కొత్త కోడలు కోరికలే గుర్రాలైతే కోతల రాయుడు గాలివాన గంధర్వ కన్య (1979 సినిమా) గోరింటాకు గుప్పెడు మనసు జూదగాడు డప్పు సాయిగాడు డ్రైవర్ రాముడు తిరుగులేని మొనగాడు దశ తిరిగింది దేవుడు మామయ్య దొంగలకు సవాల్ బంగారు చెల్లెలు బొమ్మా బొరుసే జీవితం బొట్టూకాటుక భువనేశ్వరి మండే గుండెలు మరో సీత కథ లవ్ మ్యారేజ్ వేటగాడు హేమా హేమీలు మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
సంవత్సరాల వారిగా తెలుగు సినిమాలు
https://te.wikipedia.org/wiki/సంవత్సరాల_వారిగా_తెలుగు_సినిమాలు
thumb|1931 తెలుగు సినిమాకు జన్మ దినోత్సవ సంవత్సరం.  తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద' దర్శకుడు హెచ్‌.యమ్‌.రెడ్డి సంవత్సరాల వారిగా తెలుగు సినిమాల పట్టిక 1930లు 1931 - 1932 - 1933 - 1934 - 1935 - 1936 - 1937 - 1938 - 1939 - 1940లు 1940 - 1941 - 1942 - 1943 - 1944 - 1945 - 1946 - 1947 - 1948 - 1949 - 1950లు 1950 - 1951 - 1952 - 1953 - 1954 - 1955 - 1956 - 1957 - 1958 - 1959 - 1960లు 1960 - 1961 - 1962 - 1963 - 1964 - 1965 - 1966 - 1967 - 1968 - 1969 - 1970లు 1970 - 1971 - 1972 - 1973 - 1974 - 1975 - 1976 - 1977 - 1978 - 1979 - 1980లు 1980 - 1981 - 1982 - 1983 - 1984 - 1985 - 1986 - 1987 - 1988 - 1989 - 1990లు 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000లు 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 - 2006 - 2007 - 2008 - 2009 - 2010లు 2010 - 2011 - 2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - __NOTOC__
తెలుగు సినిమాలు 1970
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1970
thumb|అక్కాచెల్లెలు దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు సినిమా 'స్వర్ణయుగాన్ని' చవిచూసిన తెలుగు చిత్రాలకు ఇది ఆఖరు సంవత్సరం. ఈ ఇరవై ఏళ్ళలో నందమూరి, అక్కినేని తమ అభినయంతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించడమే కాకుండా, నవతరం హీరోలకు కూడా తమ చిత్రాలలో అవకాశాలు కల్పించి, పరిశ్రమను నమ్ముకున్న కుటుంబాల మనుగడకు ఎంతగానో తోడ్పడ్డారు. 'స్వర్ణయుగం'లో తొలి దశాబ్దం పాటు విడుదలైన చిత్రాల సంఖ్యలో సగభాగం ఈ మహానటులు నటించిన చిత్రాలే ఉండడం గమనార్హం. ఈ యేడాది 66 చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో 51 డైరెక్టు చిత్రాలు కాగా 15 డబ్బింగ్ చిత్రాలు. 51 డైరెక్టు చిత్రాలలో 14 తమిళ భాషా చిత్రాలను, ఒక కన్నడ చిత్రాన్ని తెలుగులో పునర్నించారు. నందమూరి 10 చిత్రాల్లోనూ, అక్కినేని ఐదు చిత్రాల్లోనూ నటించారు. 'కోడలు దిద్దిన కాపురం' ఘనవిజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. 'ధర్మదాత' కూడా సూపర్‌ హిట్‌గా నిలిచింది. "తల్లా-పెళ్ళామా, పెత్తందార్లు, చిట్టి చెల్లెలు, ఒకే కుటుంబం, అక్కాచెల్లెలు, ఇద్దరమ్మాయిలు" శతదినోత్సవం జరుపుకోగా, " ఆలీబాబా 40 దొంగలు, కథానాయిక మొల్ల, మా మంచి అక్కయ్య, సంబరాల రాంబాబు" కూడా విజయపథంలో పయనించాయి. తొలి యాక్షన్‌ హీరోయిన్‌గా పేరొందిన విజయలలిత నటించిన 'రౌడీరాణి' బ్రహ్మాండమైన కలెక్షన్లు రాబట్టి, హిట్‌గా నిలచింది. చూడండి: 1970లో సినిమాలు 1935 1970లో సినిమాలు 1970లలో సినిమాలు సంవత్సరాల వారిగా తెలుగు సినిమా అక్కా చెల్లెలు అఖండుడు జన్మభూమి (సినిమా) అదృష్టదేవత అడవి రాజా అగ్నిపరీక్ష అదృష్ట జాతకుడు అల్లుడే మేనల్లుడు అమ్మకోసం ఆడజన్మ ఆలీబాబా 40 దొంగలు ఇంటి గౌరవం ఇద్దరు అమ్మాయిలు ఎవరిని నమ్మాలి - దర్శకత్వం: లక్ష్మణ్ గోరె, తారాగణం: హరనాధ్, రాజశ్రీ; నిర్మాణ సంస్థ: నటరాజన్ పిక్చర్స్ ఎవరీ పాపాయి ఒకే కుటుంబం కథానాయిక మొల్ల కిలాడి సింగన్న కిల్లాడి సీఐడి 999 కోడలు దిద్దిన కాపురం కోటీశ్వరుడు ఖడ్గవీర చిట్టిచెల్లెలు జన్మభూమి జగత్ జెట్టీలు జాక్పాట్లో గూఢచారి జైజవాన్ తల్లితండ్రులు తల్లా పెళ్ళామా తాళిబొట్టు దసరాబుల్లోడు దేశమంటే మనుషులోయ్ దొంగను వదిలితే దొరకడు ద్రోహి ధర్మదాత పగ సాధిస్తా పచ్చని సంసారం (1970 సినిమా) పసిడిమనసులు పెత్తందార్లు పెళ్లి కూతురు (1970 సినిమా) పెళ్ళి సంబంధం బలరామ శ్రీకృష్ణ కథ బస్తీ కిలాడీలు భయంకర్ గూడాచారి బాలరాజు కథ భలే ఎత్తు చివరకు చిత్తు మరో ప్రపంచం మళ్ళీ పెళ్ళి మనసు-మాంగల్యం మారిన మనిషి మా నాన్న నిర్దోషి మా మంచి అక్కయ్య మాయని మమత మూగప్రేమ మెరుపు వీరుడు యమలోకపు గూఢచారి రెండు కుటుంబాల కథ రౌడీ రాణి లక్ష్మీకటాక్షం విజయం మనదే విచిత్ర వివాహం విధివిలాసం శ్రీదేవి(సినిమా) సుగుణసుందరి కథ సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1971
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1971
thumb|అడవి వీరులు ఈ యేడాది 69 చిత్రాలు విడుదలయ్యాయి. జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ 'దసరాబుల్లోడు' సంచలన విజయం సాధించి, 365 రోజులు ప్రదర్శితమైంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ 'ప్రేమనగర్‌' కూడా బ్రహ్మాండమైన విజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. ఈ యేడాది ఇంకా "పవిత్రబంధం, రైతుబిడ్డ, శ్రీకృష్ణసత్య, చెల్లెలికాపురం, బొమ్మా-బొరుసా, మట్టిలో మాణిక్యం, తాసిల్దారుగారి అమ్మాయి, మోసగాళ్ళకు మోసగాడు" శతదినోత్సవాలు జరుపుకోగా, "జీవితచక్రం, చిన్ననాటి స్నేహితులు, శ్రీమంతుడు, మొనగాడొస్తున్నాడు జాగ్రత్త" చిత్రాలు ఏవరేజ్‌గా నడిచాయి. కృష్ణను స్టార్‌ హీరోగా మార్చిన తొలి కౌబాయ్‌ తరహా చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు' మంచి కలెక్షన్లు రాబట్టింది. అప్పటివరకు హీరోగా నటిస్తున్నా, కొన్ని చిత్రాల్లో సైడ్‌ హీరోగానూ నటించారాయన. ఇక్కడ నుండి ఆయన సోలో హీరోగా ముందుకు సాగిపోయారు. 'తాసిల్దారుగారి అమ్మాయి' సక్సెస్‌తో శోభన్‌బాబు కూడా హీరోగా స్థిరపడ్డారు. అందం కోసం పందెం అందరికి మొనగాడు అడవి వీరుడు అత్తలు కోడళ్లు అనురాధ ఆనందనిలయం ఆదిపరాశక్తి అమాయకురాలు అమ్మమాట కత్తికి కంకణం కథానాయకురాలు కల్యాణ మండపం కిలాడి సింగన్న కూతురు కోడలు గూఢచారి 003 గూఢచారి 115 గోల్కొండ గజదొంగ ఘరానా దొంగలు చలాకీ రాణి కిలాడీ రాజా చిన్ననాటి స్నేహితులు చెల్లెలి కాపురం జగత్ కంత్రీలు జగత్ జెంత్రీలు జగత్ మొనగాళ్ళు జాతకరత్న మిడతంభొట్లు జీవిత చక్రం జేమ్స్ బాండ్ 777 తల్లీ కూతుళ్ళు తల్లిని మించిన తల్లి తాసిల్దారుగారి అమ్మాయి దసరా బుల్లోడు దెబ్బకు ఠా దొంగల ముఠా నమ్మకద్రోహులు నా తమ్ముడు నిండు దంపతులు నేనూ మనిషినే పగబట్టిన పడుచు పట్టిందల్లా బంగారం పట్టుకుంటే లక్ష పవిత్ర బంధం పవిత్ర హృదయాలు ప్రేమ జీవులు ప్రేమనగర్ బంగారు కుటుంబం (1971 సినిమా) బంగారుతల్లి బస్తీ బుల్‌బుల్ బుల్లెమ్మ బుల్లోడు బొమ్మా బొరుసా భలేపాప భాగ్యవంతుడు భార్యాబిడ్డలు మట్టిలో మాణిక్యం మనసిచ్చి చూడు మనసు మాంగల్యం మా ఇలవేల్పు మాస్టర్ కిలాడి మూగప్రేమ మొనగాడొస్తున్నాడు జాగ్రత్త మోసగాళ్ళకు మోసగాడు మేమే మొనగాళ్ళు మేరీ మాత రంగేళీ రాజా రాజకోట రహస్యం రామాలయం (సినిమా) రివాల్వర్ రాణి రైతుబిడ్డ రౌడీ రంగడు రౌడీలకు రౌడీలు వింత సంసారం విచిత్ర దాంపత్యం విచిత్ర ప్రేమ విక్రమార్క విజయం [[వెంకటేశ్వర వైభవం] శ్రీ కృష్ణ లీల శ్రీకృష్ణ విజయం శ్రీకృష్ణ సత్య శ్రీమంతుడు సతీ అనసూయ సిసింద్రీ చిట్టిబాబు సి.ఐ.డీ.రాజు సుపుత్రుడు స్వప్నసుందరి సంపూర్ణ రామాయణం (1971 సినిమా) మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1972
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1972
ఈ యేడాది 60 చిత్రాలు విడుదలయ్యాయి. జయప్రద పిక్చర్స్‌ 'పండంటికాపురం' సూపర్‌ హిట్టయి, 365 రోజులు ప్రదర్శితమైంది. "విచిత్రబంధం, ఇల్లు- ఇల్లాలు" చిత్రాలు రజతోత్సవం జరుపుకున్నాయి. "రైతు కుటుంబం, మంచిరోజులొచ్చాయి, కొడుకు-కోడలు, బడిపంతులు, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, అంతా మనమంచికే, కలెక్టర్‌ జానకి, కాలం మారింది, పాపం పసివాడు, బాలభారతం, బుల్లెమ్మా బుల్లోడు, మానవుడు - దానవుడు, సంపూర్ణ రామాయణం" శతదినోత్సవం చేసుకున్నాయి. అదృష్ట దేవత అమ్మ మాట అబ్బాయిగారు - అమ్మాయిగారు అక్కాతమ్ముడు అత్తనుదిద్దిన కోడలు అల్లరి అమ్మాయిలు అంతా మనమంచికే ఆజన్మ బ్రహ్మచారి ఇల్లు ఇల్లాలు ఇన్స్పెక్టర్ భార్య ఊరికి ఉపకారి కన్నతల్లి కన్యాకాపరమేశ్వరి కథ కత్తుల రత్తయ్య కలవారి కుటుంబం కలెక్టర్ జానకి కాలంమారింది కిలాడీ బుల్లోడు కులగౌరవం కొడుకు కోడలు కొరడారాణి కోడలుపిల్ల ఖైదీ బుల్లోడు గూడుపుఠాని చిట్టి తల్లి డబ్బుకు లోకం దాసోహం తాత మనవడు దత్తపుత్రుడు దేవీ లలితాంబ దేవుడమ్మ నిజం నిరూపిస్తా నీతి నిజాయితీ - నీతి నిజాయితి పండంటికాపురం ప్రజానాయకుడు పాపం పసివాడు ప్రాణ స్నేహితులు పిల్లా-పిడుగు పెద్ద కొడుకు బడిపంతులు బస్తీమే సవాల్ బంగారు బాబు బందిపోటు భయంకర్ బాలభారతం బాలమిత్రుల కథ - బాలమిత్రుల కథ బావ దిద్దిన కాపురం బీదలపాట్లు బుల్లెట్ బుల్లోడు భలే మోసగాడు భార్యాబిడ్డలు మంచి రోజులొచ్చాయి మంచివాళ్ళకు మంచివాడు మరపురాని తల్లి మొహమ్మద్ బీన్ తుగ్లక్ మాతృమూర్తి మాఇంటి జ్యోతి మాఇంటి కోడలు మానవుడు - దానవుడు మాఇంటి వెలుగు మావూరి మొనగాళ్ళు మేనకోడలు రాజమహల్ రంగన్న శపధం రైతుకుటుంబం వంశోద్ధారకుడు విచిత్రబంధం వింత దంపతులు శభాష్ పాపన్న శాంతి నిలయం శ్రీకృష్ణాంజనేయ యుద్ధం సంపూర్ణ రామాయణం సోమరిపోతు హంతకులు దేవాంతకులు మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1973
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1973
1973 సంవత్సరంలో డబ్బిగ్ చిత్రాల 9 తో కలుపుకుని 79 చిత్రాలు విడుదలయ్యాయి. పద్మాలయా పిక్చర్స్‌ 'దేవుడు చేసిన మనుషులు' ఘనవిజయం సాధించగా, దాంతో పాటు"దేశోద్ధారకులు, బంగారుబాబు, దాసరి నారాయణ రావును దర్శకునిగా పరిచయం చేసిన 'తాత-మనవడు', శారద" చిత్రాలు సూపర్‌ హిట్స్‌గా నిలిచి, రజతోత్సవాలు జరుపుకున్నాయి. "డబ్బుకు లోకం దాసోహం, వాడే-వీడు, భక్త తుకారాం, అందాల రాముడు, పల్లెటూరి బావ, గాంధీ పుట్టిన దేశం, జీవనతరంగాలు, పుట్టినిల్లు-మెట్టినిల్లు, మాయదారి మల్లిగాడు, మీనా, నేరము-శిక్ష, మైనర్‌బాబు" శతదినోత్సవాలు చేసుకున్నాయి. ఈ యేడాది వాణిశ్రీ అందరు అగ్రహీరోల సరసన హిట్‌ ఫిలిమ్స్‌లో నటించింది. ఆ రోజుల్లో ఆమె హెయిర్‌ స్టైల్స్‌, కాస్ట్యూమ్స్‌కు మహిళాప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ ఉండేది. జాబితా అభిమానవంతులు అందాల రాముడు ఆజన్మ బ్రహ్మచారి ఇదా లోకం ఇంటి దొంగలు ఎర్రకోట వీరుడు (డబ్బింగ్) ఏసుప్రభువు (డబ్బింగ్) ఒక నారి – వంద తుపాకులు కనకదుర్గ పూజామహిమ (1973) కన్నకొడుకు (1973) కన్నవారి కలలు (1974) కన్నెవయసు ఖైదీ బాబాయ్ గంగ మంగ గాంధీ పుట్టిన దేశం గీతా గురు దక్షిణ (డబ్బింగ్) జగమేమాయ జీవన తరంగాలు జీవితం జ్యోతిలక్ష్మి డబ్బుకు లోకం దాసోహం డాక్టర్ బాబు తల్లీ కొడుకులు తాతా మనవడు దసరా పిచ్చోడు (డబ్బింగ్) దీర్ఘ సుమంగళి దేవీ లలితాంబ దేవుడమ్మ దేవుడు చేసిన మనుషులు దేశోద్ధారకులు ధనమా దైవమా నేను – నా దేశం నేరము – శిక్ష నిజం చెబితే నమ్మరు నిజరూపాలు నిండు కుటుంబం పంజరంలో పసిపాప పద్మవ్యూహం పరోపకారి (డబ్బింగ్) పల్లెటూరి బావ పల్లెటూరి చిన్నోడు పసి హృదయాలు పసివాని పగ పుట్టినిల్లు - మెట్టినిల్లు పూల మాల పెద్ద కొడుకు బంగారు బాబు బంగారు మనసులు బస్తీపిల్ల భలేదొంగ (డబ్బింగ్) బాలమిత్రుల కథ బుల్లెబ్బాయి పెళ్ళి (డబ్బింగ్) భక్త తుకారాం మహా శక్తి మహిమలు మల్లమ్మ కథ మమత మంచివాళ్ళకు మంచివాడు మనువు - మనసు మరపురాని మనిషి మాయదారి మల్లిగాడు మీనా మేమూ మనుషులమే మైనరు బాబు రామరాజ్యం రాముడే దేముడు లోకం మారాలి (డబ్బింగ్) లోకం చుట్టిన వీరుడు (డబ్బింగ్) వాడే వీడు వారసురాలు విచిత్ర వివాహం వింత కథ విశాలి వైభవం శారద శ్రీవారు మావారు స్నేహ బంధం స్త్రీ గౌరవం స్త్రీ (1973) హలో పార్టనర్ మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1975
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1975
thumb|అనురాగాలు ఈ సంవత్సరం 66 సినిమాలు వెలుగు చూశాయి. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ 'సోగ్గాడు' బ్రహ్మాండమైన విజయం సాధించింది, సూపర్‌హిట్‌గా నిలిచి 24 వారాలు ప్రదర్శితమైంది. శోభన్‌బాబు కెరీర్‌లో ఆరు (డైరెక్ట్‌గా 5, షిఫ్టుతో 1) శత దినోత్సవ చిత్రాలను చూడడం మరో విశేషం! బాపు 'ముత్యాలముగ్గు' గొప్ప సంచలనాన్ని సృష్టించి స్వర్ణోత్సవం జరుపుకుంది. అందరూ కొత్తవారితో దాసరి చేసిన లో-బడ్జెట్‌ ప్రయోగం 'స్వర్గం - నరకం' కూడా సూపర్‌ హిట్టయింది. అక్కినేని ఆరోగ్య కారణాలవల్ల ఈ యేడాది ఒక్క చిత్రంలోనూ నటించలేదు. "శ్రీరామాంజనేయయుద్ధం, సంసారం, అన్నదమ్ముల అనుబంధం, తీర్పు, ఎదురులేని మనిషి, దేవుడు చేసిన పెళ్ళి, జీవనజ్యోతి, బలిపీఠం, జేబుదొంగ, కె.రాఘవేంద్రరావుని దర్శకునిగా పరిచయం చేసిన 'బాబు', యశోదాకృష్ణ" శతదినోత్సవాలు జరుకున్నాయి. "కొత్త కాపురం, దేవుడే దిగివస్తే, పూజ, పచ్చనికాపురం, కథానాయకుని కథ" కూడా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి. ఈ యేడాది రిపీట్‌ రన్‌లో వినోదా వారి 'దేవదాసు' హైదరాబాదు‌లో ఉదయం ఆటలతో 250 రోజులు ప్రదర్శితం కాగా, విశ్వశాంతివారి 'కంచుకోట' హైదరాబాదు‌లో రోజూ 3 ఆటలతో 105 రోజులు ప్రదర్శితమైంది. ఈ రెండు చిత్రాలకు విజయోత్సవాలు నిర్వహించడం విశేషం! అభిమానవతి అక్కాచెల్లెలు అనురాగాలు అమ్మాయిల శపథం అమ్మాయిలూ జాగ్రత్త అమ్మానాన్న అయినవాళ్ళు ఆడదాని అదృష్టం ఆస్తికోసం ఇల్లు - వాకిలి ఈ కాలపు పిల్లలు ఈకాలం దంపతులు ఎదురులేని మనిషి కవిత కొండవీటి వీరుడు కొత్తకాపురం కోటలో పాగా గాజుల క్రిష్ణయ్య గుణవంతుడు చదువు సంస్కారం చల్లని తల్లి చిట్టెమ్మ చిలకమ్మ చిన్ననాటి కలలు చీకటి వెలుగులు జేబుదొంగ జమీందారుగారి అమ్మాయి తీర్పు తోట రాముడు దేవుడులాంటి మనిషి దున్నేవానిదే భూమి నాకూ స్వతంత్రం వచ్చింది నిప్పులాంటి ఆడది పచ్చని కాపురం పండంటి సంసారం పరివర్తన పిచ్చిమారాజు పుట్టింటి గౌరవం పూజ పెద్దమనిషి పెళ్ళికాని తండ్రి బాబు బలిపీఠం భాగస్తులు బ్రతుకే ఒక పండుగ భక్త తుకారాం భారతి భారతంలో ఒక అమ్మాయి మల్లెల మనసులు మంచి కోసం మాఇంటి దేవుడు మావూరి గంగ మాయామశ్చీంద్ర ముత్యాలముగ్గు యశోదకృష్ణ రాజ్యంలో రాబందులు రక్తసంబంధాలు లక్ష్మి నిర్దోషి లక్ష్మణరేఖ వనజ గిరిజ వైకుంఠపాళి సంసారం సంతానం - సౌభాగ్యం స్వర్గం నరకం సినిమా వైభవం సోగ్గాడు సౌభాగ్యవతి మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1976
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1976
thumb|అంతులేని కథ ఈ యేడాది 65 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మహానటుడు అక్కినేని తనకు ప్రభుత్వం కేటాయించిన 14 ఎకరాల స్థలంలో అన్నపూర్ణ సినీస్టూడియోస్‌ను జనవరి 14న ఆరంభించారు. మరో మహానటుడు నందమూరి ముషీరాబాద్‌లోని తన సొంతస్థలం మూడున్నర ఎకరాలలో రామకృష్ణా సినీస్టూడియోస్‌ను జూన్‌ 7న ప్రారంభించారు. ఈ యేడాది భాస్కరచిత్ర 'ఆరాధన' సూపర్‌ హిట్‌గా నిలిచి రజతోత్సవం జరుపుకుంది. కె.బాలచందర్‌ విభిన్న శైలిలో రూపొందించిన 'అంతులేని కథ' కూడా సూపర్‌ హిట్‌ అయింది. "మనుషులంతా ఒక్కటే, నేరం నాదికాదు ఆకలిది, సెక్రటరీ, పాడిపంటలు, ఇద్దరూ ఇద్దరే, భక్త కన్నప్ప, సిరిసిరిమువ్వ" డైరెక్టుగా శతదినోత్సవం జరుపుకున్నాయి. అంతకు ముందు డైరెక్టుగా లేదా సింగిల్‌ షిఫ్టుతో మన చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. కాని ఇక్కడ నుండి ఎక్కువ షిప్టింగులతో శతదినోత్సవాలు జరుపుకోవడం మొదలయింది. ఆ విధంగా "అమెరికా అమ్మాయి, అల్లుడొచ్చాడు, జ్యోతి, తూర్పు-పడమర, నా పేరే భగవాన్‌, బంగారు మనిషి, భలే దొంగలు, మొనగాడు" శతదినోత్సవాలు జరుపుకున్నాయి. బాపు 'సీతాకళ్యాణం' ప్రజాదరణ పొందలేకపోయినా విమర్శకుల ప్రశంసలు పొందింది. కె.రాఘవేంద్రరావు, క్రాంతి కుమార్‌ కలయికలో రూపొందిన 'జ్యోతి' మంచి విజయం సాధించింది. జయప్రద, జయసుధ నటీమణులుగా ఈ యేడాది గుర్తింపు సంపాదించారు. అంతులేని కథ అల్లుడొచ్చాడు అమెరికా అమ్మాయి అత్తవారిల్లు ఆడవాళ్లు అపనిందలు ఆదిమానవులు ఆరాధన ఉత్తమురాలు ఊరుమ్మడి బ్రతుకులు ఒక అమ్మాయి కథ ఒక దీపం వెలిగింది ఓ మనిషి తిరిగి చూడు కొల్లేటి కాపురం పాడవోయి భారతీయుడా బంగారుమనిషి భలేదొంగలు బ్రహ్మముడి భక్త కన్నప్ప తల్లిమనసు తూర్పు పడమర దశావతారాలు దేవుడిచ్చిన భర్త దేవుడే గెలిచాడు దేవుడు చేసిన బొమ్మలు దొరలు దొంగలు నాడు నేడు నా పేరే భగవాన్ నేరం నాదికాదు ఆకలిది నిజం నిద్రపోదు పల్లెసీమ ప్రచండ వీరుడు పాడవోయి భారతీయుడా పిచ్చోడి పిళ్ళి పీటలమీద పెళ్ళి పెద్దన్నయ్య పెళ్ళి కాని పెళ్ళి పొగరుబోతు పొరుగింటి పుల్లకూర ప్రేమాయణం ప్రేమ బంధం మనిషి మృగము మనిషి మృగము మనుషులంతా ఒక్కటే మగాడు మహాత్ముడు మహాకవి క్షేత్రయ్య మహేశ్వరి మహత్యం మనవడి కోసం మన ఊరి కథ మంచికి మరోపేరు మాదైవం మాయావి మాంగల్యానికి మరో ముడి ముద్దబంతి పువ్వు ముగ్గురు మూర్ఖులు ముత్యాల పల్లకి మొనగాడు మోసగాడు మోసగాళ్ళకు సవాల్ యవ్వనం కాటేసింది రాధ రాజు వెడలె రామరాజ్యంలో రక్తపాతం రత్తాలు రాంబాబు వధూవరులు వింతఇల్లు సంతగోల వేములవాడ భీమకవి శీలానికి శిక్ష శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం సంసారంలో సరిగమలు స్వామి ద్రోహులు సిరిసిరి మువ్వ సీతాకళ్యాణం సీతమ్మ సంతానం సుప్రభాతం సెక్రటరీ మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1977
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1977
thumb|అడవిరాముడు ఈ సంవత్సరం 78 చిత్రాలు విడుదలయ్యాయి. సత్యచిత్ర 'అడవిరాముడు' చరిత్రలో కలకాలం నిలచిపోయేరీతిలో భారీ సూపర్‌హిట్‌గా విజయం సాధించి, కమర్షియల్‌ సినిమాకు (ఇప్పటికీ అనుసరిస్తున్న) కొత్త గ్రామర్‌ను నేర్పింది. అదే విధంగా కలెక్షన్లలో, రన్‌లో అంతకు ముందున్న చిత్రాలకంటే రెండు, మూడు రెట్లు ఎక్కువగా రికార్డ్‌ సృష్టించి, అనూహ్య విజయం సాధించిందీ చిత్రం. అంతకు ముందు తెలుగు సినిమా అత్యధిక కలెక్షన్‌ కోటి రూపాయలు రికార్డు కాగా, ఈ చిత్రం ఏకంగా యేడాదిలోనే రూ.4 కోట్లు సంపాదించి, అన్ని భాషా చిత్రరంగాల్లో చర్చనీయాంశమైంది. ఒకే రాష్ట్రంలో నాలుగు కేంద్రాలలో రెగ్యులర్‌ షోలతో స్వర్ణోత్సవాలు జరుపుకొని అంతకు ముందున్న 'షోలే' (మహారాష్ట్రలో మూడు కేంద్రాలు) రికార్డును అధిగమించింది. ఈ రికార్డును ఇప్పటివరకు మరే చిత్రం అధిగమించలేదు. తరువాత ఒక తెలుగు చిత్రం, ఒక హిందీ చిత్రం ఈ రికార్డును సమం చేశాయి. చాలా రోజుల తరువాత ఒకే ఇతివృత్తంతో 'దానవీరశూర కర్ణ', 'కురుక్షేత్రం' పోటీ చిత్రాలుగా విడుదలయ్యాయి. "దానవీర శూర కర్ణ, యమగోల" చిత్రాలు సంచలన విజయం సాధించి, 250 రోజులు ప్రదర్శితం కాగా 'అమరదీపం' (డైరెక్టుగా),'ఆలుమగలు' రజతోత్సవాలు జరుపుకొని, ఘనవిజయం సాధించాయి. ఇంకా "సావాసగాళ్ళు, దొంగలకు దొంగ, చక్రధారి, బంగారుబొమ్మలు, చిల్లరకొట్టు చిట్టెమ్మ, చాణక్య-చంద్రగుప్త, ఎదురీత (సింగిల్‌ షిఫ్ట్‌)" చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. "ఆమె కథ, ఇదెక్కడి న్యాయం, ఈనాటి బంధం ఏనాటిదో, చిలకమ్మ చెప్పింది, దేవతలారా దీవించండి, ప్రేమలేఖలు, సంసారంలో సరిగమలు" సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి. అడవిరాముడు అదృష్టవంతురాలు అమరదీపం అర్ధాంగి అత్తపోరు అందమె ఆనందం అందాలరాజా అన్నదమ్ముల శపధం ఆలుమగలు ఆమెకథ ఆత్మీయుడు ఇదెక్కడి న్యాయం ఇంటిని దిద్దిన ఇల్లాలు ఇంద్రధనస్సు ఈనాటి బంధం ఏనాటిదో ఈతరం మనిషి ఎదురీత ఎవరు దేవుడు ఒక ఊరి కథ ఒక తల్లి కథ ఒకే రక్తం కల్పన కన్యాకుమారి కురుక్షేత్రం కోయిలమ్మ కూసింది ఖైదీ కాళిదాసు గడుసు అమ్మాయి గడుసు పిల్లోడు గంగా యమునా సరస్వతి గీత సంగీత గృహప్రవేశం చాణక్య చంద్రగుప్త చక్రధారి చరిత్రహీనులు చిలకమ్మ చెప్పింది చిల్లరకొట్టు చిట్టెమ్మ చిరంజీవి రాంబాబు జరుగుతున్న కథ జన్మజన్మల బంధం జడ్జిగారి కోడలు జీవనతీరాలు జీవితనౌక జీవితంలో వసంతం జీవితమే ఒక నాటకం తల్లే చల్లని దైవం తల్లి లేని పిల్ల తరం మారింది తొలిరేయి గడిచింది శ్రీ తిరుపతిక్షేత్ర మహాత్మ్యం దాన వీర శూర కర్ణ దొంగకు దొంగ దేవతలారా దీవించండి ధర్మాత్ముడు నేరం ఎవరిది? పంచాయితీ పంతులమ్మ ప్రయాణంలో పదనిసలు ప్రేమలేఖలు ప్రేమించి పెళ్ళిచేసుకో బంగారక్క బంగారు బొమ్మలు భలే అల్లుడు భలే రాజు భద్రకాళి మనస్సాక్షి మా ఇద్దరి కథ మార్పు మంచిని పెంచాలి మంచి రోజు మొరటోడు యమగోల రాగద్వేషాలు రాజా రమేష్ రంభ ఊర్వశి మేనక సతీ సావిత్రి సావాసగాళ్లు సీత గీత దాటితే సీతారామ వనవాసం సూర్యచంద్రులు స్వర్గానికి నిచ్చెనలు స్నేహం మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1978
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1978
చిరంజీవి నటునిగా తొలిసారి 'ప్రాణం ఖరీదు' చిత్రంతో తెరపై కనిపించింది ఈ ఏడే. ఈ యేడాది 84 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దేవర్‌ ఫిలిమ్స్‌ 'పొట్టేలు పున్నమ్మ' సూపర్‌ హిట్టయింది. కె.బాలచందర్‌ 'మరోచరిత్ర' ప్రేమకథల్లో కొత్త ప్రయోగంగా రూపొంది, సూపర్‌ హిట్‌గా నిలచింది. ఈ సినిమా మద్రాస్‌ - సఫైర్‌లో ఉదయం ఆటలతో 556 రోజులు ప్రదర్శితమై సంచలనం సృష్టించి, ప్లాటినమ్‌ జూబ్లీకి నాంది పలికింది. "రామకృష్ణులు, మల్లెపువ్వు, అన్నదమ్ముల సవాల్‌, చిలిపికృష్ణుడు, కటకటాల రుద్రయ్య, కరుణామయుడు, కుమారరాజా, కేడీ నంబర్‌ వన్‌, యుగపురుషుడు, పదహారేళ్ళ వయసు, బొమ్మరిల్లు, మనవూరి పాండవులు" శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇంకా "అంగడి బొమ్మ, శివరంజని, ఏజెంట్‌ గోపి, జగన్మోహిని, పంతులమ్మ, వయసు పిలిచింది" కూడా సక్సెస్‌ఫుల్‌ చిత్రాలుగా నిలిచాయి. అంగడిబొమ్మ అడవి మనుషులు అక్బర్ సలీం అనార్కలి అల్లరి బుల్లోడు అతనికంటే ఘనుడు ఆడదంటే అలుసా అనుగ్రహం ఎదురులేని కథానాయకుడు ఎంకి నాయుడుబావ ఏజెంట్ గోపి కేడి నంబర్ 1 కాలాంతకులు కలియుగ స్త్రీ కన్నవారి ఇల్లు కరుణామయుడు కటకటాల రుద్రయ్య కుమారరాజా ఖైదీ నెం. 77 గోరంత దీపం చలిచీమలు చెప్పింది చేస్తా చల్ మోహనరంగా చిలిపి కృష్ణుడు జగన్మోహిని డూడూ బసవన్న తాయారమ్మ బంగారయ్య తుఫాన్ మెయిల్ దేవదాసు మళ్లీ పుట్టాడు దొంగల వేట నాలాగ ఎందరో నాగకన్య నాయుడుబావ నిండు మనిషి పదహారేళ్ల వయసు పట్నవాసం పొట్టేలు పున్నమ్మ ప్రత్యక్ష దైవం పదహారేళ్ల వయసు బొమ్మరిల్లు మల్లెపువ్వు మనవూరి పాండవులు మంచి బాబాయి మంచి మనసు మనిషిలో మనిషి మరో చరిత్ర మేలుకొలుపు మూడుపువ్వులు ఆరుకాయలు ముగ్గురు మూర్కురాళ్ళు ముగ్గురూ ముగ్గురే మార్పు యుగపురుషుడు రాధాకృష్ణ రాజపుత్ర రహస్యం రామకృష్ణులు రిక్షారాజి లాయర్ విశ్వనాధ్ విచిత్ర జీవితం శివరంజని శ్రీరామరక్ష శ్రీరామ పట్టాభిషేకం సాహసవంతుడు సీతామాలక్ష్మి సీతాపతి సంసారం సింహబలుడు స్వర్గసీమ సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1936
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1936
thumb|మాయాబజార్ 1936లో 12 చిత్రాలు వెలుగు చూశాయి. పోటీ చిత్రాలుగా వచ్చిన ద్రౌపదీ మానసంరక్షణం విమర్శకుల ప్రశంసలు మాత్రమే పొందిన పరాజయం పాలుకాగా, ద్రౌపదీ వస్త్రాపహరణం హిట్‌గా నిలిచింది. పి.వి.దాస్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మాయాబజార్ కూడా ప్రజాదరణ చూరగొంది. ఇదే యేడాది వచ్చిన వీరాభిమన్యు ద్వారా కాంచనమాల వెండితెరకు పరిచయమైంది. తెలుగులో తొలి సాంఘిక చిత్రంగా ప్రేమవిజయం ఇదే సంవత్సరం రూపొందింది. అయితే ఆ నాటి పౌరాణిక చిత్రాల నడుమ ఆ సినిమా విజయం సాధించలేకపోయింది. రాజమండ్రికి బెందిన ఆంధ్ర సినీ టోన్ వారిచే రాజమండ్రిలోనే నిర్మించబడీన సంపూర్ణ రామాయణం, ఆంధ్రలో నిర్మించిన మొదటి చిత్రంగా నిలిచింది. అనసూయ ( ఈస్టిండియా) భక్త కబీరు (1936 సినిమా) లంకాదహనం మాయాబజార్ మోహినీ భస్మాసుర ప్రేమవిజయం - మొదటి సాంఘిక చిత్రం సంపూర్ణ రామాయణం సతీ తులసి వీరాభిమన్యు సతీ సులోచన ద్రౌపదీ మానసంరక్షణం ద్రౌపదీ వస్త్రాపహరణం సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1937
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1937
thumb|తమిళ బాలయోగిని సినిమాలో బేబి సరోజతో, కె.ఆర్.చెల్లమ్. 1937 వ సంవత్సరం 10 తెలుగు సినిమాలు చిత్రాలు విడుదల అయ్యాయి. వాటిలో కనకతార హిట్‌ చిత్రంగా నిలిచింది. బాల యోగిని, సారంగధర కూడా ప్రజాదరణ పొందాయి. జి.కె.మంగరాజు తొలి పంపిణీసంస్థగా 'క్వాలిటీ పిక్చర్స్‌'ను స్థాపించారు; ఆయన ఆధ్వర్యంలోనే దశావతారాలు చిత్రం రూపొంది, విడుదలయింది. విడుదలైన సినిమాలు వీరాభిమన్యు నిర్మాత: సుందెరల్ నెహ్తా, దర్శకుడు: వి.డి.అమిన్ దశావతారాలు దర్శకత్వం: ఎం.వి.రమణమూర్తి కనకతార : దర్శకత్వం: హెచ్.వి.బాబు నరనారాయణ దర్శకత్వం: కొచ్చెర్లకోట రంగారావు రుక్మిణీ కళ్యాణం దర్శకత్వేం: విభూతి దాస్. సారంగధర (1937 సినిమా) దర్శకత్వం: పి.పుల్లయ్య విజయదశమి (1937 సినిమా) దర్శకత్వం: డి.జె.గూనె విప్రనారాయణ ( అరోరా) : దర్శకత్వం: అహీంద్ర చౌదరి బాల యోగిని దర్శకులు: కె.సుబ్రహ్మణ్యం, గూడవల్లి రామబ్రహ్మం మోహినీ రుక్మాంగద (1937 సినిమా) దర్శకత్వం:చిత్రపు నరసింహారావు మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1938
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1938
ఈ సంవత్సరం అత్యధికంగా 14 చిత్రాలు విడుదలయ్యాయి. గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన మాలపిల్ల సంచలన విజయం సాధించి, సమాజం మీద ప్రభావం చూపగలిగే మాధ్యమంగా సినిమాకు గుర్తింపును తీసుకు వచ్చింది. అప్పటివరకు మన తెలుగు సినిమాలు నాలుగు ప్రింట్లతోనే విడుదలయ్యేవి. 'మాలపిల్ల' చిత్రం ఎనిమిది ప్రింట్లతో విడుదలయింది. కన్నాంబ, రామానుజాచార్యులతో హెచ్‌.ఎమ్‌.రెడ్డి రూపొందించిన గృహలక్ష్మి బాగా ప్రజాదరణ పొంది, మంచి వసూళ్ళు సాధించింది. రాజమండ్రి నిడమర్తి సూరయ్య స్టూడియోలో సి.పుల్లయ్య ఒకేసారి 'చమ్రియా' వారికి " సత్యనారాయణవ్రతం, కాసుల పేరు, చల్‌ మోహనరంగా" అనే మూడు చిత్రాలను తీసిపెట్టారు.thumb|గృహలక్ష్మి గృహలక్ష్మి - చిత్తూరు నాగయ్య మొదటి చిత్రం గులేబకావళి జరాసంధ మాలపిల్ల కచ దేవయాని సత్యనారాయణ వ్రతం కాసుల పేరు చల్‌ మోహనరంగా భక్త జయదేవ (1938 సినిమా) చిత్రనళీయం భక్త మార్కండేయ (1938 సినిమా) మోహినీ భస్మాసుర (1938 సినిమా) మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1939
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1939
thumb|రైతుబిడ్డ ఈ యేడాది 12 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన రైతుబిడ్డ ఈసారీ సంచలనం సృష్టించింది. మూడు జిల్లాల్లో జమీందార్లు ఈ చిత్ర ప్రదర్శనను ఆపు చేయించారు. అయినా రాత్రిపూట పొలాల్లో తెరలు కట్టి ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తే జనం తండోపతండాలుగా వచ్చి చూడటం గురించి ఆ నాటి ప్రేక్షకులు నేటికీ కథలుగా చెప్పుకుంటారు. వాహినీ పతాకంపై బి.యన్‌.రెడ్డి తెరకెక్కించిన వందేమాతరం, వై.వి.రావు రూపొందించిన మళ్ళీ పెళ్ళి, పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన శ్రీ వేంకటేశ్వర మహత్యం, భానుమతి తొలి చిత్రం వరవిక్రయంకూడా ప్రజాదరణ పొందాయి. వందేమాతరం సినిమాలో మొదటిసారిగా నేపథ్య గానాన్ని వాడుకున్నారు. కానీ ఇది చిన్నపిల్లవానికి కావడం వల్ల దేవత సినిమాకు పాడిన ఎమ్.ఎస్.రామారావు మొదటి నేపథ్య గాయకుడిగా గుర్తింపు పొందాడు. జయప్రద మహానంద మళ్ళీ పెళ్ళి పాండురంగ విఠల్ పాశుపతాస్త్రం రాధాకృష్ణ రైతుబిడ్డ ఉష వందేమాతరం వరవిక్రయం --> భానుమతి తొలి చిత్రం అమ్మ బాలాజీ లేదా శ్రీ వేంకటేశ్వర మహత్యం సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1940
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1940
thumb|భూకైలాస్ తెలుగు సినిమా మాట నేర్చిన తొలి దశాబ్దంలో ఎక్కువగా నాటకీయ ఫక్కీలోనే చిత్రాలు రూపొందాయి. అయితే అడపాదడపా సమకాలీన సమస్యలను చర్చిస్తూ రూపొందిన చిత్రాలలోనే కొంత సాంకేతిక విలువలు కనిపించాయి. గూడవల్లి, బి.యన్‌. రెడ్డి రాకతో మన సినిమాల్లో కళాత్మక విలువలు చోటు చేసుకున్నాయి. ఈ సంవత్సరం 14 చిత్రాలు వెలుగు చూశాయి. ఈ యేడాది ఎక్కువ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోర్లా పడడం విశేషం! చండిక హిట్‌ చిత్రం కాగా, మొత్తం కన్నడతారలతో రూపొందిన భూకైలాస్ కూడా ప్రజాదరణ పొందింది. బి.యన్.రెడ్డి రూపొందించిన సుమంగళి విమర్శకుల ప్రశంసలు పొందినా, యాంటీ సెంటిమెంట్‌ వల్ల పరాజయం పాలయింది. ఇల్లాలు జీవనజ్యోతి కాలచక్రం మైరావణ మాలతీ మాధవం మీరాబాయి సుమంగళి విశ్వమోహిని ఆలీబాబా నలభై దొంగలు బారిష్టరు పార్వతీశం (సినిమా) భోజకాళిదాసు భూకైలాస్ (1940 సినిమా) బోండాం పెళ్ళి చండిక సినిమాలు
తెలుగు సినిమాలు 1941
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1941
thumb|దేవతఈ యేడాది 19 చిత్రాలు విడుదలయ్యాయి. బి.యన్‌.రెడ్డి దేవత హిట్‌ చిత్రంగా నిలిచింది. కడారు నాగభూషణం, కన్నాంబ కలసి రాజరాజేశ్వరి సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా నిర్మించిన తల్లిప్రేమ, 13 యేళ్ళ అక్కినేని నాగేశ్వరరావు ఓ చిన్న పాత్ర ద్వారా పరిచయమైన ధర్మపత్ని చిత్రాలు ప్రజాదరణ పొందాయి. ఇదే యేడాది ఘంటసాల బలరామయ్య ప్రతిభా సంస్థను స్థాపించి, పార్వతీ కళ్యాణం తీశారు. దక్షయజ్ఞం గజలక్ష్మి హరవిలాసం మహాత్మాగాంధీ జీవితము (1941 సినిమా) పార్వతీ కళ్యాణం సుమతి తారాశశాంకం తారుమారు ధర్మపత్ని దేవత --> మొదటి నేపథ్యగానం చూడామణి చంద్రహాస భక్తమాల అపవాదు తెనాలి రామకృష్ణ తల్లిప్రేమ భలే పెళ్ళి మూలాలు సినిమాలు
తెలుగు సినిమాలు 1942
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1942
thumb|బాలనాగమ్మఈ యేడాది 11 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. జెమినీవారి బాలనాగమ్మ విజయం సాధించి, కాంచనమాల, గోవిందరాజుల సుబ్బారావుకు మంచి పేరునివ్వగా, దీనికి పోటీగా వచ్చిన 'శాంతవారి బాలనాగమ్మ' పరాజయం పాలయింది. కె.వి.రెడ్డి తొలి చిత్రం భక్త పోతన బ్రహ్మాండమైన విజయం సాధించి, చిత్తూరు నాగయ్యను చరిత్రలో ఆ తరహా పాత్రలకు స్పూర్థిగా నిలిపింది. రాజరాజేశ్వరి సంస్థ నిర్మించిన 'సుమతి' కూడా సుమారుగా ఆడింది. భక్తపోతనలో పాడి బెజవాడ రాజారత్నం మొదటి నేపథ్య గాయని అయ్యారు బభ్రువాహన దీనబంధు హానెస్ట్ రోగ్ (ఘరానా దొంగ లేక సత్యమే జయం) జీవన్ముక్తి పత్ని బాలనాగమ్మ ( జెమినీ) సత్యభామ భక్త ప్రహ్లాద (శోభనాచల) భక్త పోతన సుమతి బాలనాగమ్మ (శాంతా) సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1943
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1943
విడుదలైన సినిమాలు కృష్ణప్రేమ పంతులమ్మ పతిభక్తి భక్తకబీర్ ( చమ్రియా) భాగ్యలక్ష్మి చెంచులక్ష్మి గరుడ గర్వభంగం విశేషాలు ఈ యేడాది ఎనిమిది చిత్రాలు విడుదల అయ్యాయి కృష్ణప్రేమ, చెంచులక్ష్మి చిత్రాలు విజయం సాధించాయి. చిత్తూరు నాగయ్య సొంతగా రేణుకా ఫిలిమ్స్‌ సంస్థను స్థాపించి తీసిన తొలి చిత్రం భాగ్యలక్ష్మి సుమారుగా నడిచింది ఇదే యేడాది విడుదలైన పంతులమ్మ కూడా ఓ మోస్తరు విజయాన్నే మూటకట్టుకుంది. సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1944
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1944
thumb|సీతారామ జననంఈ యేడాది ఏడు చిత్రాలు విడుదల అయ్యాయి. అక్కినేని నాగేశ్వరరావును హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన శ్రీ సీతారామ జననం ప్రజాదరణ పొందింది. ఈ చిత్రంలో ఘంటసాల ఓ గ్రూప్‌ సాంగ్‌లో గళం కలిపి పరిచయమయ్యారు. సర్కస్ కింగ్ అనే చిత్రంతో ఆదుర్తి సుబ్బారావు పాటల రచయితగా పరిచయమయ్యారు. సర్కస్ కింగ్ : ఈ సినిమా 1944 జూన్ 23న విడుదలైంది. భరత్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. ఒక రోజు రాజు సంసార నారది శ్రీ సీతారామ జననం తాహసీల్దార్ భీష్మ అనవసర ప్రయాణం మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1945
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1945
thumb|స్వర్గసీమఈ యేడాది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆంక్షల కారణంగా కేవలం ఐదు సినిమాలే విడుదలయ్యాయి. వాహినీ వారి స్వర్గసీమ సూపర్‌హిట్‌ అయి విజయవాడ, బెంగుళూరులలో వంద రోజులకు పైగా ప్రదర్శితమై తొలి తెలుగు శతదినోత్సవ చిత్రంగా నిలచింది. ఈ చిత్రంలోనే ఘంటసాల పూర్తి స్థాయి గాయకుడయ్యారు. ఇదే సంవత్సరం గూడవల్లి రామబ్రహ్మం మాయాలోకం కూడా విడుదలై మంచి వసూళ్ళు సాధించి, హిట్‌గా నిలిచింది. ఈ యేడాది గూడవల్లి దక్షిణభారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆ యేడాది వచ్చిన చిత్రాలన్నీ ప్రభుత్వ ఉత్తర్వును అనుసరించి 11 వేల అడుగుల లోపు నిడివితో నిర్మితమయ్యాయి. మాయాలోకం మాయామశ్చీంద్ర పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా) స్వర్గసీమ వాల్మీకి సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1946
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1946
thumb|ముగ్గురు మరాఠీలుఈ యేడాది 10 చిత్రాలు విడుదల అయ్యాయి. సినిమాల నిడివిపై అంతకు ముందు (1945లో) జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నాగయ్య రూపొందించిన త్యాగయ్య బ్రహ్మాండమైన విజయం సాధించింది. సారథి వారి గృహప్రవేశం, ప్రతిభావారి ముగ్గురు మరాఠీలు మంచి ప్రజాదరణ పొందాయి. తెలుగు సినిమా పరిణామక్రమంలో ప్రధాన భూమిక పోషించిన గూడవల్లి రామబ్రహ్మం, బళ్ళారి రాఘవ ఈ యేడాదే అమరులయ్యారు. ఎస్వీ.రంగారావు వరూధిని చిత్రం ద్వారా చలన చిత్రరంగ ప్రవేశం చేశారు గృహప్రవేశం చిత్రం ద్వారా ఎల్వీ.ప్రసాద్ దర్శకులయారు భక్త తులసీదాస్ ధృవ గృహప్రవేశం నారద నారది ఇది మా కథ రిటర్నింగ్ సోల్జర్ సేతుబంధనం ముగ్గురు మరాఠీలు త్యాగయ్య వరూధిని వనరాణి సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1947
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1947
thumb|యోగివేమనఈ యేడాది 7 చిత్రాలు విడుదల అయ్యాయి. సి.పుల్లయ్య దర్శకత్వంలో శోభనాచల సంస్థ నిర్మించిన గొల్లభామ ( శోభనాచల) బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా అంజలీదేవి కథానాయకి‌గా పరిచయమయ్యారు. గూడవల్లి రామబ్రహ్మం మరణానంతరం ఎల్.వి.ప్రసాద్ పూరించిన 'పల్నాటి యుద్ధం' కూడా ప్రజాదరణ పొందింది. కె.వి.రెడ్డి 'యోగి వేమన' గొప్ప చిత్రంగా ప్రశంసలు పొందినా, తగిన ప్రజాదరణ పొందలేక పోయింది. భానుమతి, ఆమె భర్త రామకృష్ణ కలసి 'భరణీ సంస్థ'ను స్థాపించి, తొలి ప్రయత్నంగా 'రత్నమాల' చిత్రాన్ని నిర్మించారు. బ్రహ్మరథం ( శ్రీవెంకట్రామ) గొల్లభామ ( శోభనాచల) పల్నాటి యుద్ధం (1947 సినిమా) రాధిక యోగివేమన(1947 సినిమా) సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1948
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1948
thumb|బాలరాజు విడుదలైన చిత్రాలు భక్తశిరియాల బాలరాజు ద్రోహి గీతాంజలి మదాలస సువర్ణమాల రత్నమాల వింధ్యరాణి విశేషాలు ఈ సంవత్సరం ఎనిమిది చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ యేడాదే కె.యస్‌.ప్రకాశరావు 'స్వతంత్ర ఫిలిమ్స్‌' స్థాపించి యల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో తీసిన ద్రోహి సుమారుగా ఆడింది. సి.పుల్లయ్య 'వింధ్యరాణి' ద్వారా పింగళి నాగేంద్రరావు రచయితగా పరిచయమయ్యారు. ప్రతిభావారి 'బాలరాజు' అఖండ విజయం సాధించింది. ఫిబ్రవరి 26న మొదటి బ్యాచ్‌లో 10 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా ఏప్రిల్‌ 9న విడుదలైన 'చంద్రలేఖ' తమిళ చిత్రంతో కొన్ని కేంద్రాలలో షిప్టు చేయబడింది. ఏలూరు-గోపాలకృష్ణ, బెజవాడ - జైహింద్‌, గుంటూరు - సరస్వతి, రాజమండ్రి- కృష్ణా (మినర్వా నుండి కృష్ణాకు షిప్టు చేయబడి) వందరోజులు పూర్తి చేసుకుంది. కాగా జూన్‌ 4 నుండి 7 వరకు ఈ చిత్రం వందరోజులు పూర్తి చేసుకున్న కేంద్రాలలో వేడుకలు చేశారు. తెలుగు సినిమా రంగంలో 100 రోజుల వేడుకలు జరిపే సంప్రదాయానికి ఈ సినిమా శ్రీకారం చుట్టింది. అలాగే ఏలూరులో గోపాలకృష్ణ నుండి రామకృష్ణకు షిఫ్టు చేయబడి రజతోత్సవం పూర్తి చేసుకుంది. ఆగస్టు 16న రామకృష్ణ థియేటర్‌లో 25 వారాల వేడుక జరిగి, తెలుగులో తొలి రజతోత్సవ చిత్రంగా 'బాలరాజు' నిలిచింది. కాగా, ఇదే ఏడాది విడుదలైన 'చంద్రలేఖ' సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తమిళనాటనే కాకుండా ఆంధ్రదేశంలో కూడా అఖండ విజయం సాధించి, విజయవాడ- మారుతి, విజయనగరం - మినర్వాలో రజతోత్సవం జరుపుకొని తెలుగునాట సింగిల్‌ థియేటర్‌లో రజతోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది. సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1949
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1949
thumb|గుణసుందరిఈ యేడాది ఆరు చిత్రాలు విడుదల అయ్యాయి 'కీలుగుర్రం', 'గుణసుందరి కథ' ఒకదానిని మించి మరొకటి విజయం సాధించాయి. 'లైలామజ్నూ' కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఎల్.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో ఇన్‌స్పెక్టర్‌గా ఓ చిన్న పాత్రలో యన్‌.టి.రామారావు పరిచయమైన 'మనదేశం' చిత్రం సుమారు‌గా ఆడింది. హాస్యనటుడు శివరావుని హీరోగా పెట్టి తీసిన 'గుణసుందరి కథ' తరువాతి కాలంలో ఈ తరహా చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. బ్రహ్మరథం ధర్మాంగద : ధర్మాంగద హెచ్.వి.బాబు దర్శకత్వంలో, ఋష్యేంద్రమణి, గోవిందరాజుల సుబ్బారావు తదితరులు నటించిన 1949 నాటి తెలుగు చలనచిత్రం. గుణసుందరి కథ : కె. వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. కీలుగుర్రం : తెలుగు భాషలోంచి మొట్టమొదటగా వేరే భాషలోకి (తమిళం) లోకి తర్జుమా చేయబడిన సినిమా ఇది. లైలా మజ్ను మనదేశం రక్షరేఖ మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1950
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1950
thumb|పల్లెటూరి పిల్లఈ యేడాది అత్యధికంగా 17 చిత్రాలు విడుదలయ్యాయి. నందమూరి, అక్కినేని తొలిసారి కలసి నటించిన బి.ఎ.సుబ్బారావు తొలి చిత్రం పల్లెటూరి పిల్ల, ఆ ఇద్దరితోనే యల్‌.వి.ప్రసాద్‌ రూపొందించిన సంసారం చిత్రాలు ఘనవిజయం సాధించాయి. జెమినీ వారి అపూర్వ సహోదరులు, ఏవీయమ్‌ వారి జీవితం హిట్స్‌గా నిలిచాయి. చాలా కాలం తరువాత పోటీ చిత్రాలుగా విడుదలైన ప్రతిభావారి శ్రీలక్ష్మమ్మ కథ పరాజయం చవిచూడగా, శోభనాచల వారి లక్ష్మమ్మ ఆర్థికంగా ముందంజ వేసింది. నాగిరెడ్డి, చక్రపాణి 'విజయా సంస్థ'ను స్థాపించి, తొలి ప్రయత్నంగా నిర్మించిన షావుకారు చిత్రం సహజత్వానికి పెద్ద పీట వేసి, సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిచ్చి తెలుగు సినిమా పోకడను మార్చివేసింది. షావుకారు చిత్రం ద్వారా జానకి, జీవితం ద్వారా వైజయంతిమాల పరిచయమయ్యారు. సినిమా చరిత్రకారులు ఈ యేడాది నుండే తెలుగు సినిమా 'స్వర్ణయుగం' ఆరంభమైందని పేర్కొంటారు. యావత్‌ ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఐదో దశకం 'స్వర్ణయుగం'గా భాసిల్లింది. అదృష్టదీపుడు అపూర్వ సహోదరులు జీవితం తిరుగుబాటు పరమానందయ్య శిష్యుల కథ పల్లెటూరి పిల్ల బీదలపాట్లు (డబ్బింగ్?) మాయా రంభ మొదటిరాత్రి రాజ విక్రమ (డబ్బింగ్?) లక్ష్మమ్మ వాలి సుగ్రీవ శ్రీ లక్ష్మమ్మ కథ ( ప్రతిభ) శ్రీ సాయిబాబా షావుకారు సంసారం స్వప్న సుందరి సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1951
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1951
thumb|పాతాలబైరవిఈ యేడాది అత్యధికంగా 23 చిత్రాలు విడుదలయ్యాయి. 'విజయా' వారి పర్వం ఈ సంవత్సరంతోనే ఆరంభం. అప్పటి అగ్రహీరో అక్కినేని ఐదు జానపద చిత్రాలలో నటించారు. విజయావారి 'పాతాళభైరవి' అత్యద్భుత విజయం సాధించి, తెలుగు సినిమా వసూళ్ళ సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచింది. మొదటి బ్యాచ్‌లో 13 ప్రింట్లతో ఈ చిత్రం విడుదలై, తొలిసారిగా 10 కేంద్రాలలో శతదినోత్సవం, నాలుగు కేంద్రాలలో రజతోత్సవం జరుపుకొని ద్విశతదినోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. భారీ ఖర్చుతో కళాత్మక, సాంకేతిక విలువల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా నిర్మాణ సరళినే మార్చివేసింది.హీరో పాత్రలకు అతీంద్రియా శక్తులను ఆపాదించి చూపించడం ఈ చిత్రంతోనే ఆరంభమైంది. భానుమతి, యన్టీఆర్‌తో బి.యన్‌.రెడ్డి రూపొందించిన 'మల్లీశ్వరి' దేశవిదేశాల్లో కళాప్రియుల ప్రశంసలు అందుకుంది. నేటీకీ తెలుగు సినిమా కళాఖండాలలో ఈ చిత్రం అగ్రతాంబూలం అందుకుంటూనే ఉంది. ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. 'మల్లీశ్వరి' చిత్రం ద్వారా పరిచయమైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి తరువాతి కాలంలో తెలుగు సినిమా సాహితీవిలువలను పరిపుష్టం చేయడంలో అగ్రస్థానంలో నిలిచారు. ఇదే యేడాది కాంతారావు, రాజనాల 'ప్రతిజ్ఞ' ద్వారా పరిచయమయ్యారు. కృష్ణకుమారి, డబ్బింగ్‌ రచయితగా శ్రీశ్రీ కూడా ఈ యేడాదే సినిమా రంగంలో అడుగు పెట్టారు. డైరెక్ట్ సినిమాలు: అగ్నిపరీక్ష ఆకాశరాజు ఆడజన్మ చంద్రవంక జీవిత నౌక తిలోత్తమ దీక్ష నవ్వితే నవరత్నాలు నిర్దోషి పాతాళభైరవి పెంకిపిల్ల పెళ్లికూతురు పేరంటాలు మంగళ మంత్రదండం మల్లీశ్వరి మాయపిల్ల మాయలమారి రూపవతి సర్వాధికారి సౌదామిని స్త్రీ సాహసం డబ్బింగ్ సినిమా: సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1952
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1952
1952 యేడాది 24 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. యన్టీఆర్‌ మూడు చిత్రాల్లోనూ, అక్కినేని ఒక చిత్రంలోనూ నటించారు. విజయావారి పెళ్ళి చేసి చూడు ఘనవిజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. హాస్య ప్రధానంగా రూపొందే చిత్రాలకు ఈ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. సాంఘిక చిత్రాల హవా మొదలయింది కూడా ఈ చిత్రంతోనే. అంతవరకు మధ్య వయసున్న సాంఘిక హీరో పాత్రల చుట్టూ పరిభ్రమించిన తెలుగు సినిమా ఈ చిత్ర విజయంతో యుక్తవయసు హీరో పాత్రలకు నాంది పలికింది. ఇప్పటికీ అదే పంథా సాగుతోంది. లక్ష్మీరాజ్యం నిర్మించిన దాసి, సావిత్రి హీరోయిన్‌గా తొలిసారి నటించిన పల్లెటూరు కూడా విజయం సాధించి, శతదినోత్సవాలు జరుకున్నాయి. ఈ యేడాది అక్కినేని నటించిన ఏకైక చిత్రం భరణీవారి ప్రేమ పరాజయం పాలయింది. ఆకలి (డబ్బింగ్) ఆడబ్రతుకు ఆదర్శం అత్తింటి కాపురం చిన్న కోడలు చిన్నమ్మ కథ దాసి ధర్మదేవత కాంచన మానవతి మరదలు పెళ్ళి పల్లెటూరు పేదరైతు పెళ్ళిచేసి చూడు ప్రజాసేవ ప్రేమ ప్రియురాలు రాజేశ్వరి సంక్రాంతి సాహసం సవతిపోరు సింగారి శాంతి ముగ్గురు కొడుకులు టింగురంగ సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1953
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1953
ఈ యేడాది 25 చిత్రాలు విడుదలయ్యాయి. అక్కినేని సాంఘిక హీరోగా రూపాంతరం చెందడంలో వినోదా వారి 'దేవదాసు' సాధించిన ఘనవిజయం ఎంతగానో తోడ్పడింది. నాటి నుండి నేటి వరకు ఈ చిత్రం విషాదాంత ప్రేమకథలకు ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలచింది. భానుమతి తొలిసారి దర్శకత్వం వహిస్తూ ఏకకాలంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 'చండీరాణి' చిత్రాన్ని రూపొందించి, ఒకే రోజున విడుదల చేసి రికార్డు సృష్టించారు. అయితే ఈ సినిమా తెలుగులో పరాజయాన్ని చవిచూసింది. యన్టీఆర్‌ సొంత సంస్థ యన్‌. ఏ.టి. నిర్మించిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య' మంచి చిత్రంగా ప్రశంసలు పొందినా, ఆర్థికంగా ఫలితం సాధించలేక పోయింది. 'అమ్మలక్కలు', 'బ్రతుకు తెరువు' చిత్రాలు హిట్స్‌గా నిలిచి శతదినోత్సవాలు జరుపుకున్నాయి. హిందీ నుండి తెలుగుకు అనువదించిన రాజ్‌కపూర్‌ 'ప్రేమలేఖలు' విశేషాదరణ పొందింది. ఈ సినిమా ద్వారా ఆరుద్ర పరిచయమయ్యారు. అపేక్ష (డబ్బింగ్?) అమ్మలక్కలు అమరకవి ఇన్స్‌పెక్టర్ (డబ్బింగ్?) ఒక తల్లి పిల్లలు కన్నతల్లి కోడరికం గుమస్తా చండీరాణి చంద్రహారం జగన్మోహిని (డబ్బింగ్?) దేవదాసు నా చెల్లెలు నా యిల్లు పరదేశి పరోపకారం పక్కింటి అమ్మాయి పెంపుడు కొడుకు పిచ్చి పుల్లయ్య ప్రపంచం ప్రతిజ్ఞ ప్రేమలేఖలు పుట్టిల్లు బ్రతుకు తెరువు మంజరి రోహిణి లక్ష్మి వయ్యారిభామ సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1954
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1954
thumb|అగ్గిరాముడు ఈ యేడాది తొలిసారిగా 30 చిత్రాలు విడుదలయ్యాయి. యన్టీఆర్‌ ఎనిమిది చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ నాలుగు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. పక్షిరాజా వారి 'అగ్గిరాముడు' సూపర్‌హిట్టయి మాస్‌ చిత్రాల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది, 'పెద్ద మనుషులు' కూడా ఘనవిజయం సాధించగా, 'సతీ సక్కుబాయి', 'సంఘం', 'వద్దంటే డబ్బు', 'రాజు-పేద' చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ తొలి చిత్రం 'కాళహస్తీశ్వర మహాత్మ్యం' (ద్విభాషా చిత్రం) కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. యన్‌.ఏ.టి. వారి 'తోడుదొంగలు' ప్రశంసలు పొందినా, పరాజయం చవిచూసింది. ఈ యేడాది నుండే ఉత్తమ చిత్రాలకు రాష్ట్రపతి బహుమతులు ప్రదానం చేయడం ఆరంభమైంది. 'పెద్ద మనుషులు' చిత్రానికి రజత పతకం లభించగా, 'తోడుదొంగలు', 'విప్రనారాయణ' చిత్రాలు మెరిట్‌ సర్టిఫికెట్స్‌ పొందాయి. కె.యస్‌. ప్రకాశరావు 'బాలానందం' పేరుతో "బూరెల మూకుడు, కొంటె కిష్టయ్య, రాజయోగం'' పేర్లతో మూడు భాగాల పిల్లల చిత్రం రూపొందించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకునిగా, డి.వి.నరసరాజు రచయితగా ఈ యేడాదే పరిచయమయ్యారు. డైరెక్ట్ సినిమాలు అంతా మనవాళ్లే అగ్గిరాముడు అన్నదాత అమరసందేశం ఇద్దరు పెళ్ళాలు కాళహస్తీ మహత్యం చక్రపాణి జాతకఫలం జ్యోతి తోడుదొంగలు నిరుపేదలు పరివర్తన పల్లె పడుచు పెద్దమనుషులు ప్రజారాజ్యం బంగారుపాప బంగారుభూమి బాలానందం మనోహర మనోహరం మాగోపి మేనరికం రాజుగురు రాజు పేద రాజీ నాప్రాణం వద్దంటే డబ్బు విప్రనారాయణ సతీ సక్కుబాయి సంఘం డబ్బింగ్ సినిమాలు లేవు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1955
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1955
thumb|అంతే కావాలి ఈ యేడాది 20 చిత్రాలు వెలుగు చూశాయి. అక్కినేని ఆరు చిత్రాల్లోనూ, నందమూరి ఆరు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. సారథి వారి 'రోజులు మారాయి', యన్‌. ఏ.టి.వారి 'జయసింహ' అఖండ విజయం సాధించి, రజతోత్సవాలు జరుపుకున్నాయి. రాష్ట్రపతి బహుమతులలో బి.యన్‌. రెడ్డి రూపొందించిన 'బంగారుపాప' సత్యజిత్‌ రే తొలి చిత్రం 'పథేర్‌ పాంచాలి'తో పోటీపడి రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. అన్నపూర్ణ సంస్థ తొలి చిత్రంగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'దొంగరాముడు' ఘనవిజయం సాధించింది. దీంతో పాటు 'అర్ధాంగి', 'అనార్కలి', 'సంతానం', 'మిస్సమ్మ', 'సంతోషం', 'రేచుక్క', 'శ్రీకృష్ణతులాభారం' చిత్రాలు కూడా శతదినోత్సవం జరుపుకున్నాయి. 'రోజులు మారాయి'లో "ఏరువాకా సాగారో...'' పాటలో నర్తించిన వహిదా రెహమాన్‌, 'జయసింహ'లో నాయికగా నటించి, ఆ తరువాత హిందీరంగంలో అగ్రతారగా వెలుగొందారు. మాయలు, మంత్రాలు లేకుండా విజయం సాధించిన తొలి జానపద చిత్రంగా 'జయసింహ' చరిత్రకెక్కింది. గురజాడ అప్పారావు విఖ్యాత నాటిక 'కన్యాశుల్కం'ను వినోదావారు సినిమాగా రూపొందించారు. మొదట సరైన విజయాన్ని చేజిక్కించుకోలేకపోయినా ఈ సినిమా తరువాతి కాలంలో విశేషాదరణ చూరగొంది. యమ్‌.జి.రామచంద్రన్‌ నటించిన ఏకైక తెలుగు చిత్రం 'సర్వాధికారి' ఈ యేడాదే విడుదలై ప్రజాదరణ పొందింది. అనార్కలి ఆడబిడ్డ అంతా ఇంతే (డబ్బింగ్?) అంతే కావాలి అతనెవరు అర్థాంగి బీదల ఆస్తి చెరపకురా చెడేవు దొంగరాముడు జయసింహ కన్యాదానం కన్యాశుల్కం మిస్సమ్మ పసుపు కుంకుమ రోజులు మారాయి సంతానం సంతోషం శ్రీజగన్నాథ మహాత్యం శ్రీకృష్ణ తులాభారం వదిన వదినగారి గాజులు రేచుక్క (1955 సినిమా) విజయగౌరి సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1956
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1956
ఈ యేడాది 21 చిత్రాలు విడుదల కాగా, యన్టీఆర్‌ ఏడు చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ రెండు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి రెండు చిత్రాల్లోనూ నటించారు. విజయం మనదే, భలేరాముడు, ఇలవేల్పు, గౌరీమహాత్మ్యం, చరణదాసి, హరిశ్చంద్ర, నాగులచవితి' చిత్రాలు మంచి విజయం సాధించి, శతదినోత్సవాలు జరుపుకున్నాయి. తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, ఉమాసుందరి కూడా ప్రజాదరణ పొందాయి. దక్షిణభారతదేశ తొలి కలర్‌ చిత్రం 'ఆలీబాబా 40 దొంగలు' (భానుమతి, యమ్‌.జి. ఆర్‌.) తెలుగులోకి అనువాదమై విజయం సాధించింది. డైరెక్ట్ సినిమాలు భక్తమార్కండేయ బాల సన్యాసమ్మ కథ భలేరాముడు చరణదాసి చింతామణి చిరంజీవులు ఏది నిజం? ఇలవేల్పు హరిశ్చంద్ర కనకతార మేలుకొలుపు ముద్దుబిడ్డ నాగపంచమి నాగులచవితి పెంకి పెళ్లాం సదారమ సొంతవూరు తెనాలి రామకృష్ణ ఉమాసుందరి జయం మనదే శ్రీగౌరి మాహత్యం డబ్బింగ్ సినిమాలు ఆలీబాబా 40 దొంగలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1957
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1957
thumb|అల్లావుద్దీన్ అద్భుతదీపం తెలుగు వారికి మరపురాని మేటి చిత్రం ఈ సంవత్సరమే విడుదలయ్యింది. ఈ యేడాది 27 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నాటి అగ్రనటులైన నందమూరి తొమ్మిది చిత్రాలలోనూ, అక్కినేని ఐదు చిత్రాలలోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. విజయావారి 'మాయాబజార్‌' అగ్రశ్రేణి తారలతో, భారీస్థాయిలో సాంకేతిక విలువలతో రూపొంది ఘనవిజయం సాధించింది. నేటికీ తెలుగు సినిమా ప్రతిష్ఠకు మోడల్‌గా నిలచి, నాటి నుంచి నేటి వరకు విశేష ప్రజాదరణ పొందు తున్నది. ఈ చిత్రం ద్వారా తొలిసారి శ్రీకృష్ణుని పాత్ర ధరించిన యన్టీఆర్‌ ఆ తరువాత పౌరాణిక చిత్రాలకు ప్రపంచంలోనే సాటిలేని మేటిగా చరిత్ర సృష్టించడానికి ఇది శుభారంభమైంది. ఆ రోజులలోనే యన్టీఆర్‌ శ్రీకృష్ణుని గెటప్‌తో ఉన్న ఈ చిత్రం క్యాలెండర్లు ఐదు లక్షలు విజయాసంస్థ ప్రెస్‌ నుండే అధికారికంగా అమ్ముడైనట్లు సంస్థాధినేతల్లో ఒకరైన నాగిరెడ్డి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఒక సినిమా నటుని బొమ్మను పత్రికలు, పోస్టర్స్‌ నుండి పూజామందిరాల స్థాయికి తీసుకు వెళ్ళిన ఘనత 'మాయాబజార్‌' చిత్రానికే దక్కుతుంది. నెల రోజుల తేడాతో విడుదలైన అంజలీ పిక్చర్స్‌ 'సువర్ణసుందరి' కూడా అఖండ విజయం సాధించి, తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి రెండు భారీ సూపర్‌హిట్‌ చిత్రాలు సమాంతరంగా ఆడిన అద్భుతాన్ని ఈ సంవత్సరం ఆవిష్కరించింది. "తోడికోడళ్ళు, భాగ్యరేఖ, వీరకంకణం, వినాయకచవితి, సతీ అనసూయ, యమ్‌. ఎల్‌. ఏ.'' చిత్రాలు శతదినోత్సవం విజయాలు సొంతం చేసుకున్నాయి. 'సతీసావిత్రి', 'కుటుంబగౌరవం', 'భలే అమ్మాయిలు' యావరేజ్‌ విజయం సాధించాయి. ఈ యేడాది చివరలో వచ్చిన యన్‌. ఏ.టి. వారి 'పాండురంగ మహాత్మ్యం' సూపర్‌హిట్‌గా నిలచింది. ఈ యేడాదే అక్కినేని తాను నటించిన 60వ చిత్రం 'దొంగల్లో దొర' విడుదల సందర్భంగా చలనచిత్ర వజ్రోత్సవం జరుపుకున్నారు. 'ఎమ్‌.ఎల్‌.ఏ.' ద్వారా యస్‌. జానకి గాయనిగా రంగ ప్రవేశం చేశారు. డైరెక్ట్ సినిమాలు అక్కాచెల్లెళ్లు అల్లావుద్దీన్ అద్భుతదీపం] భాగ్యరేఖ భలే అమ్మాయిలు భలేబావ దాంపత్యం దొంగల్లోదొర గంధర్వకన్య కుటుంబ గౌరవం ఎం.ఎల్.ఏ. మాయాబజార్ నలదమయంతి పాండురంగ మహత్యం పెద్దరికాలు ప్రేమే దైవం రాణి రంగమ్మ రేపు నీదే సారంగధర సంకల్పం సతీ అనసూయ సతీ సావిత్రి స్వయంప్రభ తోడి కోడళ్లు వద్దంటే పెళ్ళి వరుడు కావాలి వీరకంకణం వేగుచుక్క వినాయకచవితి సువర్ణసుందరి తోడికోడళ్ళు డబ్బింగ్ సినిమాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1958
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1958
thumb|రాజనందిని ఈ యేడాది 21 చిత్రాలు విడుదల కాగా, యన్టీఆర్‌ ఆరు చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ నాలుగు చిత్రాల్లోనూ ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. "ఇంటిగుట్టు, చెంచులక్ష్మి, మంచి మనసుకు మంచి రోజులు'' ఘనవిజయం సాధించాయి; వీటితో పాటు 'శోభ', 'రాజనందిని' శతదినోత్సవాలు జరుపుకున్నాయి. 'భూకైలాస్‌', 'ముందడుగు' మంచి ఆదరణ పొందాయి. 'కార్తవరాయని కథ', 'పెళ్ళినాటి ప్రమాణాలు' యావరేజ్‌ విజయాలు సాధించాయి. అత్తా ఒకింటి కోడలే అన్నా తమ్ముడు ఆడపెత్తనం ఇంటిగుట్టు ఉత్తమ ఇల్లాలు ఎత్తుకు పైఎత్తు కార్తవరాయుని కథ కొండవీటి దొంగ గంగాగౌరీ సంవాదం చెంచులక్ష్మి దొంగలున్నారు జాగ్రత్త పెద్ద కోడలు పార్వతీ కళ్యాణం పెళ్ళినాటి ప్రమాణాలు బడిపంతులు భూకైలాస్ (1958 సినిమా)‌ బొమ్మల పెళ్ళి భూలోక రంభ మంచి మనసుకు మంచి రోజులు ముందడుగు మహాదేవి మహిషాసుర మర్ధిని రాజనందిని వీరఖడ్గం విజయకోటవీరుడు వీరప్రతాప్ శోభ శ్రీరామాంజనేయ యుద్ధం శ్రీకృష్ణగారడీ శ్రీకృష్ణమాయ సౌభాగ్యవతి స్త్రీ శపథం సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1960
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1960
ఈ యేడాది అత్యధికంగా 36 చిత్రాలు విడుదలయ్యాయి. యన్టీఆర్‌ తొమ్మిది చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ ఏడు చిత్రాల్లోనూ నటించారు. "శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం, పెళ్ళికానుక" చిత్రాలు ఘనవిజయం సాధించి, రజతోత్సవాలు జరుపుకున్నాయి. 'శాంతినివాసం', 'భట్టి విక్రమార్క' చిత్రాలు కూడా గొప్ప ప్రజాదరణ పొందాయి. వీటితో పాటు "దీపావళి, విమల, దేవాంతకుడు, జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ తొలి చిత్రం 'అన్నపూర్ణ', కులదైవం'' కూడా మంచి విజయాన్ని సాధించి శతదినోత్సవం జరుపుకున్నాయి. ఇంకా "అభిమానం, కనకదుర్గ పూజామహిమ, మహాకవి కాళిదాసు, రాజమకుటం, సహస్రశిరచ్ఛేద అపూర్వ చింతామణి" కూడా ప్రజాదరణ పొందాయి. సి.పుల్లయ్య రూపొందించిన శతదినోత్సవ చిత్రం 'దేవాంతకుడు' ఫాంటసీ చిత్రాలకు నాంది పలికింది. ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో కెల్లా ఘోర పరాజయం పొందినట్టుగా చెప్పే కాడెద్దులు-ఎకరం నేల విడుదలైంది ఈ సంవ త్సరం లోనే ! అన్నా-చెల్లెలు అభిమానం అన్నపూర్ణ భక్త రఘునాథ్ భక్త శబరి భట్టి విక్రమార్క చివరకు మిగిలేది దీపావళి దేవాంతకుడు దేవసుందరి ధర్మమే జయం జగన్నాటకం జల్సారాయుడు కాడెద్దులు ఎకరంనేల కనకదుర్గ పూజామహిమ కులదైవం కుంకుమరేఖ మాబాబు మగవారి మాయలు మహాకవి కాళిదాసు మామకుతగ్గ అల్లుడు మాంగల్యం ముగ్గురు వీరులు నమ్మిన బంటు నిత్య కళ్యాణం పచ్చతోరణం పెళ్ళికానుక పిల్లలుతెచ్చిన చల్లనిరాజ్యం రమా సుందరి రాణిరత్న ప్రభ రుణానుబంధం సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి సమాజం శాంతినివాసం విమల రాజమకుటం రేణుకాదేవి మహాత్మ్యం శ్రీకృష్ణ రాయబారం శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం వెలుగునీడలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1961
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1961
ఈ యేడాది 26 చిత్రాలు విడుదలయ్యాయి. యన్టీఆర్‌ ఎనిమిది చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ ఏడు చిత్రాల్లోనూ నటించారు. "జగదేక వీరునిక థ, భార్యాభర్తలు, సీతారామకళ్యాణం, వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు అఖండ విజయం సాధించగా "సతీ సులోచన (ఇంద్రజిత్‌), పెండ్లి పిలుపు, కలసివుంటే కలదుసుఖం, శభాష్‌ రాజా" సాధారణ విజయం సాధించాయి. 'జగదేక వీరుని కథ, ఇద్దరు మిత్రులు' రజతోత్సవం కూడా జరుపుకున్నాయి. 'ఇద్దరు మిత్రులు' చిత్రంలో అక్కినేని పూర్తి స్థాయి ద్విపాత్రాభినయాన్ని తొలిసారి ప్రదర్శించారు. ఇదే సంవత్సరం నందమూరి 'సీతారామకళ్యాణం' చిత్రంతో దర్శకత్వం చేపట్టారు. అమూల్య కానుక అనుమానం ఇద్దరు మిత్రులు ఇంటికిదీపం ఇల్లాలే ఉషాపరిణయం ఎవరు దొంగ ఋష్యశృంగ కలసి ఉంటే కలదు సుఖం కన్నకొడుకు కన్యకాపరమేశ్వరి మహాత్మ్యం కష్టసుఖాలు కత్తిపట్టిన రైతు కొరడా వీరుడు కృష్ణప్రేమ గుళ్లోపెళ్ళి చిన్నాన్న శపధం జగదేక సుందరి జగదేకవీరుని కథ జేబు దొంగ టాక్సీరాముడు తండ్రులు కొడుకులు తల్లి ఇచ్చిన ఆజ్ఞ పెళ్ళికాని పిల్లలు పెండ్లిపిలుపు భక్త జయదేవ భార్యాభర్తలు బాటసారి బికారి రాముడు మదనమంజరి యోధాన యోధులు రాణీ చెన్నమ్మ వాగ్ధానం వెలుగునీడలు వరలక్ష్మీ వ్రతం (సినిమా) విప్లవస్త్రీ విప్లవ వీరుడు విరిసిన వెన్నెల శ్రీకృష్ణ కుచేల శభాష్ రాజా శాంత సతీ సులోచన సీతారామ కల్యాణం సీత స్త్రీ హృదయం సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1962
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1962
ఈ యేడాది కూడా 26 చిత్రాలు విడుదల కాగా, అందులో యన్టీఆర్‌ తొమ్మిది చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ ఐదు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. "గుండమ్మ కథ, మంచిమనసులు, రక్తసంబంధం" చిత్రాలు అఖండ విజయం సాధించి రజతోత్సవం జరుపుకోగా, "ఆరాధన, కులగోత్రాలు, సిరిసంపదలు, గులేబకావళి కథ, భీష్మ, మహామంత్రి తిమ్మరుసు, ఆత్మబంధువు, ఖైదీ కన్నయ్య" చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. "గాలి మేడలు, దక్షయజ్ఞం, పదండి ముందుకు, మదనకామరాజు కథ" చిత్రాలు కూడా ప్రజాదరణ పొందాయి. 'పదండి ముందుకు' చిత్రంతో జగ్గయ్య నిర్మాతగానూ, 'గులేబకావళి కథ' చిత్రంతో సి.నారాయణ రెడ్డి గీత రచయితగానూ పరిచయమయ్యారు. ఆశాజీవులు ఆరాధన అప్పగింతలు ఆత్మబంధువు కలిమిలేములు కులగోత్రాలు ఖడ్గవీరుడు ఖైదీ కన్నయ్య గాలిమేడలు గులేబకావళి కథ గుండమ్మ కథ టైగర్ రాముడు చిట్టి తమ్ముడు దక్షయజ్ఞం దశావతారాలు నాగార్జున నువ్వానేనా పదండి ముందుకు పెళ్ళి తాంబూలం భీష్మ భాగ్యవంతులు మహామంత్రి తిమ్మరుసు మమకారం మంచి మనుసులు మదనకామరాజు కథ మాయా మోహిని మురిపించే మువ్వలు మోహినీ రుక్మాంగద (1962 సినిమా) రక్తసంబంధం సిరిసంపదలు స్వర్ణగౌరి స్వర్ణమంజరి సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1963
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1963
తెలుగు సినిమాలు 1963 ఈ సంవత్సరం 27 చిత్రాలు వెలుగు చూశాయి. నందమూరి 12 చిత్రాల్లోనూ, అక్కినేని రెండు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ అభినయించారు. లవకుశ తెలుగులో పూర్తి రంగుల చిత్రంగా లలితాశివజ్యోతి వారి 'లవకుశ' విడుదలై నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో సంచలన విజయం సాధించింది. తొలి విడతలో 26 ప్రింట్లతో విడుదలై, 26 కేంద్రాలలోనూ 150 రోజుల వరకు ప్రదర్శితమై, 14 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకొని, తొలిసారిగా 250 రోజులకు నాందీ పలికి, 470 రోజులు వరకు ప్రదర్శితమైంది 'లవకుశ'. పత్రికలలో కలెక్షన్లు ప్రకటించిన తొలి దక్షిణాది చిత్రంగా చరిత్రకెక్కి వందరోజులకు రూ. 25 లక్షలు పోగుచేసి, 365 రోజులకు కోటి రూపాయలను నాటి 25 పైసలు, రూపాయి టిక్కెట్లపై వసూలు చేసింది. ఆ నాటి రూపాయి విలువ నేటికి ఎన్నో రెట్లు పెరిగింది. ఆ కొలమానంలో చూసుకుంటే ఈ చిత్రం వసూళ్ళు నేటికీ రికార్డుగా నిలిచాయనే చెప్పాలి. అంతకు ముందున్న రికార్డుల కంటే ఈ చిత్రం మూడు, నాలుగు రెట్లు అధికంగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఆ నాడు మన రాష్ట్ర జనాభా 3 కోట్లు మాత్రమే, అయితే ఈ సినిమాను నూరు కేంద్రాలలో 1.98 కోట్ల మంది ప్రజలు ఆదరించినట్లు ఆ నాటి పత్రికా ప్రకటనలు చెబుతున్నాయి. అంటే ప్రతి కేంద్రంలోనూ ఆ యా కేంద్రాల జనాభా కంటే నాలుగు రెట్లు టిక్కెట్లు అమ్ముడై అప్పటికీ ఇప్పటికీ కనివినీ ఎరుగని చరిత్రను సొంతం చేసుకుందీ చిత్రం. (ఉదాహరణకు 1-1-1964 తేదీన వరంగల్‌ రాజరాజేశ్వరి థియేటర్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఆ ఊరిలో ఆ చిత్రాన్ని 4, 34, 800 మంది చూసినట్లు ఆధారం ఉంది. ఆ నాటి వరంగల్‌ జనాభా ఒక లక్ష మాత్రమే). అలాగే ఆ తరువాత కూడా ఈ చిత్రం అప్రతిహతంగా నడచి అన్ని కేంద్రాలలో సంయుక్తంగా అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలిచింది. 'నర్తనశాల'లో యన్టీఆర్‌ బృహన్నల పాత్రను పోషించడం అప్పట్లో సంచలనంగా నిలిచింది. అలాగే ఆ చిత్రం కూడా సంచలన విజయం సాధించి, రెండు వందల రోజులు ప్రదర్శితమై దేశవిదేశాల్లో కీర్తిప్రతిష్ఠలను సంపాదించింది. ఈ యేడాది విడుదలైన ఇతర చిత్రాలలో "శ్రీకృష్ణార్జున యుద్ధం, చదువుకున్న అమ్మాయిలు, పరువు - ప్రతిష్ఠ, గురువును మించిన శిష్యుడు" శతదినోత్సవం జరుపుకోగా, యన్టీఆర్‌, బి.విఠలాచార్య కలయికలో రూపొందిన తొలి చిత్రం 'బందిపోటు' కూడా పెద్ద హిట్‌అయి శతదినోత్సవం జరుపుకుంది., 'లక్షాధికారి' చిత్రం కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. 'శ్రీతిరుపతమ్మ కథ' అప్పట్లో విజయం సాధించకున్నా, రిపీట్‌ రన్‌లో బాగా ఆడింది. జాబితా అదృష్టవతి అనురాగం ఆప్తమిత్రులు అనుబంధాలు ఇరుగు పొరుగు ఎదురీత కానిస్టేబుల్ కూతురు గురువును మించిన శిష్యుడు చదువుకున్న అమ్మాయిలు చిత్తూరు రాణీ పద్మిని జ్ఞానేశ్వర్ తల్లి బిడ్డ తోబుట్టువులు దేవసుందరి దొంగ నోటు నాగ దేవత నర్తనశాల నిరపరాధి పరువు ప్రతిష్ఠ పునర్జన్మ పెంపుడు కూతురు బందిపోటు మంచి చెడు మంచిరోజులు వస్తాయి మహా వీర భీమసేన లక్షాధికారి లవకుశ వాల్మీకి విష్ణుమాయ శ్రీ తిరుపతమ్మ కథ శ్రీకృష్ణార్జున యుద్ధం సవతి కొడుకు సోమవార వ్రత మహత్యం సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1964
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1964
ఈ యేడాది 26 చిత్రాలు విడుదలయ్యాయి. యన్టీఆర్‌ 15 చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ ఆరు చిత్రాల్లోనూ నటించారు. తొలిసారి అత్యధిక భాగం ఔట్‌ డోర్‌లో చిత్రీకరణ జరుపుకున్న బాబూమూవీస్‌ వారి 'మూగమనసులు' సంచలన విజయం సాధించి, రజతోత్సవాలు జరుపుకుంది. తరువాతి కాలంలో శతచిత్ర నిర్మాతగా కీర్తి గడించిన డి.రామానాయుడు తమ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం 'రాముడు-భీముడు' (ఇదే యన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం కూడా) ఘనవిజయం సాధించింది. ఇంకా "ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, డాక్టర్‌ చక్రవర్తి, అగ్గి-పిడుగు, మంచి మనిషి, దాగుడుమూతలు, భక్త రామదాసు" చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. పత్రికలలో 'ఓపెనింగ్‌ కలెక్షన్ల' ప్రకటనకు శ్రీకారం చుట్టిన చిత్రం 'అగ్గి - పిడుగు'. భారీ చిత్ర నిర్మాణ వ్యయం రూ.5 లక్షలకు పైగా అవుతున్న ఆ రోజుల్లో ఈ చిత్రం మొదటి వారంలోనే రూ.5 లక్షలు గ్రాస్‌ వసూలు చేసింది. ఈ యేడాది విడుదలైన "మురళీకృష్ణ, గుడిగంటలు, శ్రీసత్యనారాయణవ్రత మహాత్మ్యం, బొబ్బిలియుద్ధం, నవగ్రహపూజా మహిమ, బంగారు తిమ్మరాజు" చిత్రాలు కూడా ప్రజాదరణ చూరగొన్నాయి. అగ్గిపిడుగు అడవి పిల్ల అందీఅందని ప్రేమ అమరశిల్పి జక్కన ఆత్మబలం ఆదర్శ సోదరులు ఆనందజ్యోతి ఇంటి దొంగ ఈడుజోడు కలవారి కోడలు కలియుగ భీముడు కవల పిల్లలు కర్ణ గుడిగంటలు డాక్టర్ చక్రవర్తి తోటలోపిల్ల కోటలోరాణి దాగుడు మూతలు దేశద్రోహులు దొంగను పట్టిన దొర నాదీ ఆడజన్మే నవగ్రహ పూజా మహిమ పూజాఫలం పీటలమీద పెళ్ళి బబ్రువాహన బంగారు తిమ్మరాజు బొబ్బిలి యుద్ధం మంచి మనిషి మూగ మనసులు మర్మయోగి మురళీకృష్ణ మైరావణ మాస్టారమ్మాయి రామదాసు రాముడు భీముడు వారసత్వం వివాహబంధం శభాష్ సూరి శ్రీ సత్యనారాయణ మహత్యం హంతకుడెవరు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1965
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1965
thumb|ఆడబ్రతుకు ఆ సంవత్సరంలో 31 చిత్రాలు వెలుగు చూశాయి. 12 చిత్రాలలో నందమూరి, నాలుగు చిత్రాల్లో అక్కినేని నటించారు. 'పాండవవనవాసం' చారిత్రాత్మక విజయం సాధించగా, "ఆడబ్రతుకు, వీరాభిమన్యు" చిత్రాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. వీటితో పాటు "అంతస్తులు, మనుషులు - మమతలు, నాదీ ఆడజన్మే, మంగమ్మ శపథం, తోడు-నీడ, దేవత, సి. ఐ.డి., జ్వాలాద్వీప రహస్యం, కొత్త తారలతో ఆదుర్తి రూపొందించిన వర్ణచిత్రం 'తేనెమనసులు' (ఈ చిత్రం ద్వారా కృష్ణ హీరోగా పరిచయమయ్యారు)" చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. "ప్రతిజ్ఞాపాలన, సుమంగళి, దొరికితే దొంగలు" కూడా మంచి వసూళ్ళు సాధించాయి. ఆ సంవత్సరంలో యన్టీఆర్‌ నటించిన ఎనిమిది చిత్రాలు డైరెక్టుగా శతదినోత్సవం జరుపుకొని నాటికీ, నేటికీ భారత సినీచరిత్రలోనే అపూర్వంగా నిలిచింది. అదృశ్య హంతకుడు అంతస్తులు ఆకాశరామన్న ఆడబ్రతుకు ఇల్లాలు ఉయ్యాల జంపాల కీలుబొమ్మలు కాలం మారింది ఘరానా హంతకుడు చంద్రహాస చదువుకొన్న భార్య జమీందార్ జ్వాలాద్వీప రహస్యం తేనె మనసులు తోడు నీడ దేవత దొరికితే దొంగలు దైవ శాసన పక్కలో బల్లెం ప్రచండబైరవి ప్రమీలార్జునీయం ప్రతిజ్ఞా పాలన పాండవ వనవాసం ప్రేమించి చూడు భక్త కనకదాసు భీమ ప్రతిజ్ఞ మంగమ్మ శపథం మనుషులు మమతలు మొనగాళ్లకు మొనగాడు మాంగల్యమే మగువ ధనం మారని మనుష్యులు ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు వీరాభిమన్యు - హీరోగా శోభన్ బాబుకు మొదటి చిత్రం వీలునామా విజయసింహ విశాలహృదయాలు శివరాత్రి మహత్యం సంజీవని రహస్యం సతీ సక్కుబాయి సత్య హరిశ్చంద్ర సుమంగళి - 1940, 1965, 1989 మూడు సినిమాలు సి. ఐ. డి. సింహాచల క్షేత్రమహిమ సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1966
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1966
ఈ యేడాది 32 చిత్రాలు విడుదల కాగా, యన్టీఆర్‌ 12 చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ నాలుగు చిత్రాల్లోనూ నటించారు. హాస్యప్రధానంగా రూపొందిన జానపద చిత్రం 'పరమానందయ్య శిష్యుల కథ', నాయక, ప్రతినాయక పాత్రలు పోషించి, స్వీయ దర్శకత్వంలో యన్టీఆర్‌ రూపొందించిన 'శ్రీకృష్ణ పాండవీయం', చైల్డ్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిన 'లేత మనసులు' చిత్రాలు సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. "ఆస్తిపరులు, శ్రీకృష్ణతులాభారం, పిడుగురాముడు, మొనగాళ్ళకు మొనగాడు, పొట్టి ప్లీడర్‌, పల్నాటియుద్ధం, కె.విశ్వనాథ్‌ తొలి చిత్రం 'ఆత్మగౌరవం', అక్కినేని తొమ్మిది పాత్రలు పోషించిన 'నవరాత్రి" చిత్రాలు విశేషాదరణ పొందాయి. యన్టీఆర్‌, విఠలాచార్య కలయికలో రూపొందిన 'అగ్గిబరాటా' రికార్డు ఓపెనింగ్స్‌ రాబట్టింది. 'గూఢచారి 116' ఘనవిజయంతో కృష్ణ హీరోగా మంచి గుర్తింపు సంపాదించారు. ఈ యేడాదే 'చిలకా-గోరింక' ద్వారా కృష్ణంరాజు తెరకు పరిచయమయ్యారు. కె.ఎస్.ఆర్.దాస్ 'లోగుట్టు పెరుమాళ్ళ కెరుక'తో దర్శకుడయ్యారు. అడవి యోధుడు అడుగుజాడలు అగ్గిబరాటా ఆమె ఎవరు? - జగ్గయ్య, జయలలిత ఆత్మ గౌరవం ఆస్తిపరులు ఆటబొమ్మలు కన్నులపండుగ కన్నెమనుసులు కన్నెపిల్ల కత్తిపోటు గూఢచారి 116 చిలక గోరింక జమీందారు దొంగలకు దొంగ డాక్టర్ ఆనంద్ నవరాత్రి నాగ జ్యోతి పాదుకా పట్టాభిషేకం పల్నాటి యుద్ధం (1966 సినిమా) పరమానందయ్య శిష్యులకథ పెళ్ళిపందిరి పిడుగురాముడు పొట్టి ప్లీడరు భక్త పోతన(1966 సినిమా) భీమాంజనేయ యుద్ధం మనసే మందిరం మంగళసూత్రం మోహినీ భస్మాసుర మా అన్నయ్య రంగులరాట్నం లోగుట్టు పెరుమాళ్ళకెరుక లేత మనసులు విజయశంఖం శకుంతల శ్రీమతి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణుకథ శ్రీకృష్ణ తులాభారం (1966) - జమున, ఎన్.టి.ఆర్. శ్రీకృష్ణ పాండవీయం సంగీత లక్ష్మి హంతకులొస్తున్నారు జాగ్రత్త మూలాలు సినిమాలు
తెలుగు సినిమాలు 1967
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1967
thumb|భక్త ప్రహ్లాదఈ యేడాది 41 చిత్రాలు విడుదల కాగా, వాటిలో నందమూరి 12 చిత్రాల్లోనూ, అక్కినేని ఐదు చిత్రాల్లోనూ నటించారు. ఉమ్మడి కుటుంబం సంచలన విజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. "పూలరంగడు, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణావతారం" చిత్రాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. "కంచుకోట, భామావిజయం, నిండు మనసులు, ఆడపడచు" చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. "అవే కళ్ళు, ఇద్దరు మొనగాళ్ళు, కాంభోజరాజు కథ, గోపాలుడు భూపాలుడు, చిక్కడు దొరకడు, భువనసుందరి కథ, రంగులరాట్నం, లక్ష్మీనివాసం, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న, సుఖదుఃఖాలు" మంచి కలెక్షన్లు సాధించి, విజయాల జాబితాలో చేరాయి. ఎస్.వి. రంగారావు తొలిసారి దర్శకత్వం వహించి చదరంగం చిత్రం జనాదరణ చూరగొంది. బాపు దర్శకునిగా చేసిన తొలి ప్రయత్నం సాక్షి విజయవంతమై బడ్జెట్‌ చిత్రాల్లో కొత్తపోకడకు శ్రీకారం చుట్టింది. శ్రీకృష్ణావతారం బెంగుళూరులో రజతోత్సవం జరుపుకొని, తరువాతి కాలంలో కూడా తెలుగునేలలో కన్నా కన్నడనాట విశేషాదరణ పొందింది. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న ద్వారా ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం గాయకునిగా పరిచయమయ్యారు. అంతులేని హంతకుడు అగ్గిదొర అవే కళ్ళు అనుమానం పెనుభూతం ఆడపడుచు ఇద్దరు మొనగాళ్ళు ఉమ్మడికుటుంబం ఉపాయంలో అపాయం కంచుకోట కాంభోజరాజు కథ కొంటెపిల్ల గృహలక్ష్మి - 1938, 1967, 1984 మూడు సినిమాలు ఇదేపేరుతో వచ్చాయి. గొప్పవారి గోత్రాలు గోపాలుడు భూపాలుడు చదరంగం చిక్కడు దొరకడు దేవుని గెలిచిన మానవుడు ధనమే ప్రపంచలీల నిండు మనసులు నిర్దోషి పట్టుకుంటే పదివేలు పెద్ద అక్కయ్య పిన్ని పూలరంగడు ప్రాణమిత్రులు ప్రేమలో ప్రమాదం ప్రైవేటు మాష్టారు పుణ్యవతి బ్రహ్మచారి భాగ్యలక్ష్మి భక్త ప్రహ్లాద (1967 సినిమా) - రోజారమణి భామావిజయం భువనసుందరి కథ మా వదిన మరపురాని కథ ముద్దుపాప ముగ్గురు మిత్రులు ముళ్ళ కిరీటం మంచి కుటుంబం రహస్యం రక్తసింధూరం రంగులరాట్నం లక్ష్మీనివాసం వసంతసేన వీరపూజ శభాష్ రంగ శ్రీకృష్ణావతారం శ్రీకృష్ణ మహిమ శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సాక్షి సతీ సుమతి సతీ సుమతి సుఖదుఃఖాలు సుడిగుండాలు సత్యమే జయం స్త్రీజన్మ హంతకుని హత్య సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1968
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1968
ఈ యేడాది 57 చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. యన్టీఆర్‌ 11 చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ ఐదు చిత్రాల్లోనూ నటించారు. ఏవీయమ్‌ వారి 'రాము' రజతోత్సవం జరుపుకొని, సూపర్‌హిట్‌గా నిలచింది. "మంచి కుటుంబం, తల్లి ప్రేమ, నిండుసంసారం, నిలువుదోపిడి, బంగారుగాజులు" శతదినోత్సవం జరుపుకున్నాయి. "అసాధ్యుడు, గోవులగోపన్న, తిక్కశంకరయ్య, మంచి మిత్రులు, వీరాంజనేయ, సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌" చిత్రాలు మంచి కలెక్షన్లు రాబట్టి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలుగా నిలిచాయి. పూర్తి మహిళా సాంకేతిక వర్గంతో సావిత్రి స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'చిన్నారి పాపలు' ప్రజాదరణకు నోచుకోలేదు. అగ్గిమీద గుగ్గిలం అత్తగారు కొత్తకోడలు అదృష్టవంతులు అనుభవించు రాజా అనుభవించు అమాయకుడు అర్ధరాత్రి అసాధ్యుడు (1968 సినిమా) ఉమా చండీ గౌరీ శంకరుల కథ ఉండమ్మా బొట్టుపెడతా ఎవరు మొనగాడు కలసిన మనసులు కలిసొచ్చిన అదృష్టం కుంకుమ బరణి కోయంబత్తూరు ఖైదీ గలాటా పెళ్లిళ్లు గోవుల గోపన్న గ్రామదేవతలు చల్లని నీడ చిన్నారి పాపలు చుట్టరికాలు చెల్లెలి కోసం జీవిత బంధం జీవితాలు డబ్బారాయుడు సుబ్బారాయుడు డ్రైవర్ మోహన్ తల్లిప్రేమ తిక్క శంకరయ్య దెబ్బకు దెబ్బ : శ్రీ వెంకటేశ్వర చిత్ర బ్యానర్ కింద నిర్మించిన ఈ సినిమాకు పి.పుల్లయ్య దర్శకత్వం వహించగా, ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు సంగీతాన్నందించాడు. ఈ సినిమాలో ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి,గీతాంజలి,నగేష్, నంబియార్ తదితరులు నటించారు. దేవకన్య దేవుడిచ్చిన భర్త దేవుడిచ్చిన భార్య దోపిడీ దొంగలు నడమంత్రపు సిరి నిలువుదోపిడి నిండు సంసారం నిన్నే పెళ్ళాడుతా నేనంటే నేనే నేనే మొనగాణ్ణి పంతాలు పట్టింపులు పాలమనసులు పాప కోసం పెళ్ళి రోజు పేదరాసి పెద్దమ్మ కథ ప్రేమ కథ బంగారు గాజులు బంగారు పంజరం బంగారు పిచ్చుక బంగారు సంకెళ్లు బందిపోటు దొంగలు బస్తీలో భూతం బాంధవ్యాలు బాగ్దాద్ గజదొంగ భయంకర్ బడా చోర్ : ఇది 1968 డిసెంబరు 21న విడుదలైంది. అజయ్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎం.జి.బాలు దర్శకత్వం వహించగా, పి.ఎస్.దివాకర్ సంగీతాన్నందించాడు భలే కోడళ్ళు భలే మొనగాడు భాగ్యచక్రం భార్య మాంగల్య విజయం మంచి మిత్రులు మన సంసారం మద్రాస్ టు హైదరాబాద్ మాయా మందిరం మూగ జీవులు రణభేరి రాజయోగం రాము వరకట్నం వింత కాపురం వీరాంజనేయ శ్రీమంతుడు శ్రీరామకథ సర్కార్ ఎక్స్‌ప్రెస్ సతీ అరుంధతి మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1969
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1969
ఈ యేడాది 49 చిత్రాలు వెలుగు చూశాయి. 11 చిత్రాలలో యన్టీఆర్‌, ఎనిమిది చిత్రాలలో ఏయన్నార్‌ నటించారు. రాజకీయాలు, ప్రజాసమస్యలు ప్రధాన నేపథ్యంగా రూపొందిన 'కథానాయకుడు' సూపర్‌ హిట్‌ అయి, తరువాత ఆ తరహా చిత్రాల రూపకల్పనకు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. "అదృష్టవంతులు, మూగనోము, ఆత్మీయులు, బుద్ధిమంతుడు, వరకట్నం, విచిత్ర కుటుంబం, నిండు హృదయాలు, మాతృదేవత" చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. "గండికోట రహస్యం, జగత్‌ కిలాడీలు, మహ్మద్‌ రఫీ తొలిసారి తెలుగులో అన్ని పాటలూ పాడిన 'భలే తమ్ముడు', మహాబలుడు, బందిపోటు దొంగలు" చిత్రాలు హిట్‌ అయ్యాయి. జెమినీ వారి 'మనుషులు మారాలి' చిత్రం సంచలన విజయం సాధించి, శారదకు విషాద పాత్రల నాయికగా మంచి పేరు సంపాదించిపెట్టింది, శోభన్‌బాబు పాత్ర చిన్నదే అయినా ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది. అగ్గివీరుడు అక్కాచెల్లెలు ఆత్మీయులు ఆదర్శ పెళ్లిల్లు అన్నదమ్ములు ఆస్తులు అంతస్తులు ఉక్కుపిడుగు ఏకవీర కదలడు వదలడు కర్పూర హారతి కథానాయకుడు గండికోట రహస్యం చిరంజీవి చెయ్యెత్తి జైకొట్టు జగత్ కిలాడీలు జరిగిన కథ టక్కరి దొంగ చక్కని చుక్క తల్లా పెళ్ళామా తారాశశాంకం దొరలా దొంగలా : 1969 నవంబరు12న విడుదలైన ఈ చిత్రాన్ని సులీన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాకు సి.వి.రాజేంద్రన్ దర్శకత్వం వహించగా, ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు. ధర్మపత్ని నాటకాల రాయుడు నా మాటంటే హడల్ నిండు హృదయాలు ప్రతీకారం పంచకళ్యాణి దొంగలరాణి ప్రేమకానుక బలవంతపు పెళ్ళి బందిపోటు భీమన్న బుద్ధిమంతుడు బొమ్మలు చెప్పినకథ భలే అబ్బాయిలు భలే గూఢచారి భలే మాష్టారు భలే రంగడు భలే తమ్ముడు మామకుతగ్గ కోడలు మహాబలుడు మనుషులు మారాలి మాతృదేవత మూగనోము మూహూర్తబలం రాజసింహ రాజ్యకాంక్ష లవ్ ఇన్ ఆంధ్ర విచిత్ర కుటుంబం శభాష్ సత్యం సంబరాల రాంబాబు సప్తస్వరాలు సత్తెకాలపు సత్తెయ్య సిపాయి చిన్నయ్య మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1974
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1974
ఈ యేడాది 60 సినిమాలు విడుదలయ్యాయి. పద్మాలయా పిక్చర్స్‌ 'అల్లూరి సీతారామరాజు' తొలి పూర్తిస్థాయి కలర్‌- సినిమాస్కోప్‌గా రూపొంది, ఘనవిజయం సాధించి, 365 రోజులు ప్రదర్శితమైంది. 'నిప్పులాంటి మనిషి' అనూహ్య విజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. ఈ చిత్రవిజయంతో కొంతకాలం హిందీ చిత్రాలను తెలుగులో రీమేక్‌ చేసే ట్రెండ్‌ కొనసాగింది. "మంచివాడు, బంగారుకలలు, దొరబాబు, మనషుల్లో దేవుడు, ఖైదీబాబాయ్‌, అందరూ దొంగలే, ఎవరికివారే యమునాతీరే, కృష్ణవేణి, నీడలేని ఆడది, నోము" చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. "రాధమ్మపెళ్ళి, బంట్రోతు భార్య, తాతమ్మకల, ఛైర్మన్‌ చలమయ్య, కన్నవారి కలలు" కూడా విజయవంతంగా ప్రదర్శితమయ్యాయి. బాలకృష్ణ తొలి చిత్రం 'తాతమ్మకల' కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా రూపొందింది. ఆ సమయంలో ప్రభుత్వం కుటుంబ నియంత్రణకు అనుకూలం. దాంతో ప్రభుత్వం, నిర్మాత ఓ అవగాహనతో ఈ చిత్ర ప్రదర్శనను 50 రోజులకు నిలిపివేసి, తరువాత కొన్ని మార్పులు, చేర్పులతో విడుదల చేశారు. ఇలా విడుదలై కొద్ది రోజులు ప్రదర్శితమై మళ్లీ రీ-షూట్‌ చేసి విడుదలైన చిత్రం ఇదొక్కటే! ఈ ఏడాది ఫిబ్రవరి 11నే మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పరమపదించారు. అడవిదొంగలు అల్లూరి సీతారామరాజు అమ్మాయి పెళ్ళి అనగనగా ఒక తండ్రి ఆడంబరాలు అనుబంధాలు ఆడపిల్లల తండ్రి ఆడపిల్లలు అర్ధరాత్రి హత్యలు ఇంటికోడలు ఇంటింటి కథ ఊర్వశి ఎవరికివారే యమునాతీరే ఓ సీత కథ కలిసొచ్చిన కాలం కోడెనాగు కోటివిద్యలు కూటికొరకే కృష్ణవేణి గుణవంతుడు గాలిపటాలు గౌరవము గౌరి గుండెలుతీసిన మొనగాడు ఛైర్మన్ చలమయ్య చక్రవాకం చందన జీవితాశయం తాతమ్మకల తులాభారం తులసి తిరుపతి (1974 సినిమా) ఉత్తమ ఇల్లాలు దీక్ష దేవదాసు దేవుడు చేసిన మనుషులు దేవుడు చేసిన పెళ్ళి దొరబాబు ధనవంతులు నీడలేని ఆడది నిప్పులాంటి మనిషి నిత్య సుమంగళి నోము పల్లెపడుచు పెద్దలు మారాలి ప్రేమలూ పెళ్ళిళ్ళు బంగారు కలలు బంట్రోతు భార్య భూమి కోసం మంచి మనుషులు మాంగల్య భాగ్యం మనుషుల్లో దేవుడు మనుషులు - మట్టిబొమ్మలు ముగ్గురు అమ్మాయిలు రాధమ్మ పెళ్ళి రామయ తండ్రి రామ్ రహీమ్ రాముని మించిన రాముడు వాణి దొంగలరాణి శ్రీరామాంజనేయ యుద్ధం సత్యానికి సంకెళ్ళు హారతి హనుమాన్ పాతాళ విజయం సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
పంచతంత్రం
https://te.wikipedia.org/wiki/పంచతంత్రం
thumb పంచతంత్రం ప్రపంచ సాహిత్యానికి భారతదేశం అందించిన గొప్ప రచనలలో ఎన్నదగినది. క్రీ. శ. 5వ శతాబ్దం (తేదీ వివాదాస్పదం) లో విష్ణుశర్మ అనే గురువర్యుడు సంస్కృత భాషలో రచించిన ఈ గ్రంథం ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువదింపబడి, ఎంతో ప్రాచుర్యం పొందింది. తన వద్ద విద్య నేర్చుకోదలచిన విద్యార్థులకు పాఠ్యగ్రంధంగా ఈ పుస్తకాన్ని ఆయన రచించాడు. ఐదు భాగాలుగా విభజించిన ఈ పుస్తకం అనేక చిన్నచిన్న కథ ల సమాహారం. మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో, ఆసక్తికరమైన కథనంతో విష్ణుశర్మ బోధించాడు. (మొయిద్ సిద్దికి అనే రచయిత తన "కార్పొరేట్ సోల్" పుస్తకంలో విష్ణుశర్మ, ఆర్య చాణక్యుడు ఒక్కరే అని రాశాడు.) నేపథ్యం దక్షిణ భారతాన మహిళారూప్యము అనే రాజ్యానికి అమరశక్తి రాజు. ఆతనికి బహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి అని ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు చదువుసంధ్యలు లేక మూర్ఖుల వలె తయారయ్యారు. ఎంత ప్రయత్నించినప్పటికీ వారికి చదువుపై శ్రద్ధ కలుగలేదు. మనోవేదన చెందిన రాజు తన బాధను మంత్రుల వద్ద వ్యక్తపరచి తరుణోపాయం సూచింపుమన్నాడు. ఒక మంత్రి విష్ణుశర్మ అనే పండితుడి గురించి చెప్పి, అతనికి రాకుమారులను అప్పగింపుమని సలహా ఇచ్చాడు. రాజు విష్ణుశర్మను పిలిపించి, రాకుమారుల చదువు విషయమై తన వేదనను వివరించి, 'నా బిడ్డలకు విద్యా బుద్ధులు నేర్పండి. మీకు తగిన పారితోషికం ఇస్తాను' అని అన్నాడు. విష్ణుశర్మ బదులిస్తూ 'నేను విద్యను అమ్ముకోను. నీ బిడ్డలను నీతిశాస్త్ర కోవిదులను చేస్తాను. నాకేవిధమైన పారితోషికం అవసరం లేదు' అని చెప్పి రాకుమారులను తీసుకొని వెళ్ళాడు. వారికి బోధించదలచిన పాఠ్య ప్రణాళిక ప్రకారం కొన్ని కథలను స్వయంగా రచించి, బృహత్కథ నుండి కొన్ని కథలను గ్రహించి, పంచతంత్రమును రచించాడు. ఆ కథలను వారికి చెప్పి, నీతిని బోధించి ఆరు నెలలలో వారిని నీతిశాస్త్ర కోవిదులను చేసి, రాజునకు ఇచ్చిన మాటను చెల్లించుకున్నాడు. విశిష్టత విషయ పరిజ్ఞానం, బోధనా సామర్థ్యం, చక్కని పాఠ్య ప్రణాళిక ఉంటే, చదువంటే ఇష్టము, ఆసక్తి లేని వారికి కూడా బోధించి విద్యావంతులను చెయ్యవచ్చని 5 వ శతాబ్దం లోనే (లేక క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దమా?) విష్ణుశర్మ నిరూపించాడు. 1500 సంవత్సరాల నాటి ఈ రచన ఈనాటికీ ప్రతి సమాజానికీ అనుసరణీయమే, ఆమోదయోగ్యమే! అదే పంచతంత్రం యొక్క విశిష్టత. పంచతంత్రం 5 విభాగాల, 84 కథల సంపుటి. కథలలోని పాత్రలు ఎక్కువగా జంతువులే. పాత్రల పేర్లు వాటి మనస్తత్వాన్ని, సహజ ప్రవృత్తినీ, నడతను సూచిస్తూ ఉంటాయి. కథనం సరళంగా ఉంటూ, సామెతలు, ఉపమానాలను గుప్పిస్తూ, ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. సమాజం గురించి, వ్యవస్థ, మానవ ధర్మం గురించిన ఎన్నో విషయాలు కథలలో మిళితమై వస్తాయి. పంచతంత్రం ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితం కాని, చిరస్థాయిగా నిలిచిపోయే సార్వత్రిక విజ్ఞానం. భాగాలు పంచతత్రం 5 విభాగాలుగా ఉన్న చక్కని ఆకృతి గల రచన. ప్రతి విభాగానికి ఒక విశిష్టమైన, విలక్షణమైన లక్ష్యం కనపడుతుంది. విభాగాల పేర్లు, ఒక్కొక్కదానిలోని కథల సంఖ్య ఇలా ఉన్నాయి. భాగం పేరు అర్థం కథల సంఖ్య 1 మిత్ర భేద; మిత్రభేదము మిత్రులని విడదీయడం22 2 మిత్ర సంప్రాప్త; మిత్ర లాభము మిత్రులని సంపాదించడం6 3 కాకోలూకీయము కాకులు, గుడ్లగూబలు16 4 లోభప్రనాశమ్‌; లుబ్ధ నాశము సంపదలను కోల్పోవడం11 5 అపరీక్షితకారకం; అసంప్రేక్ష్య కారిత్వము చెడు చేయకోరడం (బుద్ధిహీనంగా చర్య తీసుకోవడం ) 14 మొదటి నాలుగు భాగాలలో జంతువులు ప్రధాన పాత్రలు కాగా, ఐదవ దానిలో మానవులు ప్రధాన పాత్రలు కథాంశం పంచతంత్రం ఒక అద్భుతమైన కల్పిత కథల సంకలనం. వీటిలో ఎక్కువ కథల్లో జంతువుల పాత్రలు ఎక్కువ. ఆయా జంతువుల శీలాలు, ప్రవర్తనలు మనకి తెలిసినవే:, అనువాదకుని పరిచయం: "కనుక, సింహం బలమైనది కాని ఎద్దు చతురతను కలిగి లేదు, నక్క జిత్తులమారి, కొంగ తెలివిలేనిది, పిల్లి కపటి. ఇందులోని జంతువుల పాత్రలు మరింత స్పష్టమైన , మానవుల కంటే మరింత నగర ప్రాంతాల్లో నివసిస్తాయి, ఇక్కడ జీవితం యొక్క రూపాన్ని సిఫార్సు చేసారు- అన్ని మనోభావాలు చురుకైనవి, మోసగించనవి , స్వచ్ఛమైన అభిప్రాయాలు; ప్రతీ చెడు ఆదర్శానికి చలోక్తులను ఖండించే వీక్షణ, నిరంతర ఆనందానికి మూలాల సరిపోలని హాస్యంతో బయటిపెడుతుంది." , చూడండి ఇది ముగ్గురు అవివేకులైన రాజకుమారులకు నీతి బోధిస్తుంది.ఈ కారణంగానే, రాంసే వుడ్ దీనిని మిర్రర్స్ ఫర్ ప్రిన్సెస్ సాహిత్య ప్రక్రియకు ఒక ప్రారంభ పురోగామి వలె భావించాడు. నీతి అనేది పాశ్చాత్య భాషలలోకి అనువదించడానికి కష్టమైనప్పటికీ, దీని అర్థం "వివేకంగల ఐహికమైన ప్రవర్తన" లేదా "జీవితంలో వివేకవంతమైన ప్రవర్తన"., అనువాదకుని పరిచయం: "పంచతంత్ర అనేది ఒక నీతి-శాస్త్ర లేగా నీతి రచన. నీతి అనే పదానికి అర్థం “జీవితంలో తెలివైన ప్రవర్తన.” ఈ పదానికి సరైన అర్ధాన్ని ఇచ్చే పదం ఆంగ్లం, ఫ్రెంచ్, లాటిన్ లేదా గ్రీకుల్లో లేదని తెలుసుకున్న తర్వాత పాశ్చాత్య నాగరకత కొంతవరకు సిగ్గు పడాలి. తర్వాత నీతి అనేది ఏమిటి అని వివరించడానికి పలు పదాలు ఉన్నప్పట్టికీ, ఒకటి స్పష్టమైన, ముఖ్యమైన , సంతృప్తి పరిచింది." ఒక చిన్న పరిచయం మినహా - ఈ కథ రచయిత విష్ణు శర్మ రాకుమారులకు వివరిస్తున్నట్లు నడుస్తుంది. దీనిలో ప్రతి భాగం ఒక ప్రధాన కథను కలిగి ఉంటుంది, దీనిలో ఒక పాత్ర, మరొక పాత్రతో కథ చెబుతున్నట్లు పలు పిట్ట కథలు ఉంటాయి. ఈ కథలు రష్యన్ బొమ్మలు వలె ఒకదానిలో ఒకటి ఉంటాయి, ఒక కథాంశం వేరొకదానిలో ప్రారంభమవుతుంది, కొన్నిసార్లు మూడు లేదా నాలుగు కథలు ప్రారంభమవుతాయి. ఈ కథలు కాకుండా, పాత్రలు కూడా వాటి ఉద్దేశ్యాన్ని వివరించడానికి పలు సంక్షిప్త రచనలు పేర్కొంటాయి., అనువాదకుని పరిచయం: "ఈ గద్య భాగాలు భీతి రచనలు , పరువు , అధికారం యొక్క ఇతర వనరుల నుండి తీసుకున్న అత్యధిక భాగంగా చెప్పవచ్చు. కొన్ని ఆంగ్ల మృగ-కల్పితకథల్లో జంతువులు వలె షేక్‌స్పియర్ , బైబిల్ నుండి సూచనలచే వాటి చర్యలను సమర్దించుకుంటాయి. ఈ జ్ఞానవంతమైన గద్య భాగాలు పంచతంత్రం లోని యదార్ధ పాత్రను కలిగి ఉన్నాయి. అయితే, ఈ కథలు స్వచ్ఛమైన కథాంశం ప్రకారం చాలా అద్భుతంగా ఉంటాయి; కాని సౌమ్యం, తెలివి , హాస్యోక్తులు వంటి అంశాలు మాత్రమే ఉత్తమ కథా-పుస్తకాల్లో పంచతంత్ర ను అత్యున్నత స్థానాన్ని కల్పించాయి". మిత్రభేదం, స్నేహితులని విడదీయడం మొదటి పుస్తకంలో, అడవి రాజు అయిన పింగళక అను సింహం, సంజీవక అనే ఒక ఎద్దు మధ్య స్నేహం చిగురిస్తుంది. కరటక ('భయంకరమైన అరుపు'), దమనక ('విజయం') అనేవి సింహం రాజుకి సేవకులైన నక్కలు. కరటక సలహాకు వ్యతిరేకంగా దమనక అసూయతో సింహం - ఎద్దుల మధ్య స్నేహాన్ని పాడుచేస్తుంది. ఈ అంశం ముఫ్పై కథలుగా విభజించబడింది, వీటిలో ఎక్కువ కథలను రెండు నక్కలు చెబుతాయి. ఇది ఐదు పుస్తకాల్లో అతిపెద్ద పుస్తకం, మొత్తం రచనలో ఇది 45% ఉంటుంది. మిత్రసంప్రాప్తి, "మిత్ర లాభం, స్నేహితులను సంపాదించడం. ఇది కాకి యొక్క కథ. వలలో చిక్కుకున్న పావురాల గుంపుని విడిపించేందుకు సహాయపడిన ఎలుకను చూసి, ఇతరులు అడ్డగించినప్పటికీ, ఎలుకతో స్నేహంగా ఉండటానికి కాకి నిర్ణయించుకుంటుంది. కథలో వీటితో తాబేలు, కొంగ స్నేహం చేస్తాయి. కొంగ వలలో చిక్కుకున్నప్పుడు, దానిని రక్షించేందుకు ఒకదానికొకటి సహకరించుకుంటాయి , తర్వాత మళ్లీ వలలో చిక్కుకున్న తాబేలును రక్షించేందుకు కలిసి పనిచేస్తాయి. ఇది మొత్తం కథలో 22% ఉంటుంది. కాకోలూకీయం, కాకులు , గుడ్లగూబలు. ఇది కాకులు, గుడ్లగూబల మధ్య యుద్ధం గురించి తెలుపుతుంది. కాకుల్లో ఒక కాకి తన ప్రత్యర్థి గుడ్లగూబ బృందంలో ప్రవేశించడానికి దాని స్వంత బృందం నుండి వెళ్లగొట్టినట్లు నటిస్తుంది. ఇలా చేయడం ద్వారా వారి రహస్యాలను తెలుసుకుంటుంది , వాటి బలహీనతలను కూడా తెలుసుకుంటుంది. అది తర్వాత తన కాకుల బృందాన్ని సమావేశపరిచి, గుడ్లగూబలు నివసిస్తున్న గుహ అన్ని ప్రవేశద్వారాల్లో మంట పెట్టి, వాటి శ్వాసను అడ్డగించడం ద్వారా చంపుదామని చెబుతుంది. ఇది మొత్తం కథలో 26%ఉంటుంది. లాభప్రానాసం, సంపదలను కోల్పోవడం. ఇది కోతి, మొసలి మధ్య కృత్రిమంగా ఏర్పడిన సహజీవన సంబంధం చుట్టూ తిరుగుతుంది. మొసలి దాని భార్య కోలుకునేలా చేసేందుకు కోతి యొక్క గుండెను సాధించడానికి వారి మధ్య సంబంధంతో కుట్ర పన్నుతుంది; ఈ విషయం తెలుసుకున్న కోతి, ఈ కుట్రను ఛేదిస్తుంది. అపరీక్షితాకారణకమ్, ఆతురతతో చర్య. ఒక బ్రాహ్మణుడు తన కుమారుడిని అతని స్నేహితుడైన ఒక ముంగిసతో విడిచి పెట్టి వెళతాడు, తిరిగి వచ్చిన తర్వాత, ఆ ముంగిస నోటికి ఉన్న రక్తాన్ని చూసి, దానిని అనుమానించి చంపేస్తాడు. అతను తర్వాత ఆ ముగింస ఒక పాము బారినుండి తన కొడుకును రక్షించిందని తెలుసుకుంటాడు. అనుకరణలు 14 వ శతాబ్దం ప్రాంతాలలో నారాయణుడు అనే పండితుడు వివిధ గ్రంథాలనుండి సేకరించిన కథలతో హితోపదేశము అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. అందులో మిత్రలాభము, సుహృద్భేదము, విగ్రహము, సంధి అనే నాలుగు భాగాలు ఉన్నాయి. ఈ పుస్తకం కూడా పంచతంత్రం వలెనే ప్రారంభమై అలాగే సాగుతుంది. దీనిలో కూడా విష్ణుశర్మ అనే పండితుడు రాకుమారులకు వివిధ కథల ద్వారా విద్యాబోధన చేస్తాడు. అక్కడక్కడా కథా స్థలాలు, పాత్రల పేర్లలో మార్పులు తప్పించి, గ్రంథం పూర్తిగా పంచతంత్రం పోకడలోనే ఉంది. హితోపదేశం అచ్చు పంచతంత్రం లాగానే ఉండటంతో కాలక్రమేణా పంచతంత్రం విషయం లోని విభాగాలు ఏవి అనే విషయంపై కొన్ని సందిగ్ధాలు ఏర్పడ్డాయి. సా.శ. 1199లో పూర్ణభద్రుడు పంచాఖ్యానక అనే పేరుతో, 1656-60 లో మేఘవిజయుడు పంచాఖ్యానోద్ధార అనేపేరుతో ప్రచురించిన మరి రెండు అనుకరణలు కనబడుతున్నాయి. ఈ రచయితలిద్దరూ జైన మతస్థులు.ఇవికాక సరళమైన భాషలోకి విశేషంగా సంగ్రహపరచిన పంచతంత్రమ్పేరుతో మరియొక అనుకరణ కూడా ఉంది. ఇవి ముఖ్య అనుకరణలు కాగా, ఇరవై వరకు వేరే అనుకరణలు ఉన్నాయి. వేర్వేరు ప్రాంతాలలో విభిన్న సంక్షిప్త రూపాలలో ఇవి లభిస్తున్నవి. కాని తంత్రాఖ్యాయికి అనే పేరుతో కాశ్మీరు, నేపాలు పరిసర ప్రాంతాలలో లభించినది ప్రస్తుతం లభించినవాటిలో అతి పురాతనమైనది. బౌద్ధ, జాతక కథలే పంచతంత్రానికి మాతృకలని ఒక వాదం ఉంది.కాదు, జైన గాథలని మరొక వాదం ఉంది.కాని చాలా మంది చరిత్ర కారులు దీనిని తోసిపుచ్చారు. ఇందుకంటే బౌద్ధ, జైన ధర్మాలు బోధించే నీతికి, పంచతంత్రంలోని నీతికి తూర్పు, పడమర వ్యత్యాసం ఉంది.పంచతంత్రంలోని నీతి లౌకిక యుక్తుల ద్వారా ఏవిధంగా విజయం సాధించ గలమో, ముఖ్యంగా రాజ్యపాలనా వహించ వలసిన క్షత్రియులు ఏయే విధాల ద్వారా కార్య సాధకులు కాగలరో ఇందులో వివరించుట జరిగింది. తెలుగు అనువాదాలు తెలుగు లో అయిదు అనువాదాల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. వాటి రచయితలు: బైచరాజు వేంకటనాథుడు దూబగుంట నారాయణ కవి పరవస్తు చిన్నయసూరి వేములపల్లి ఉమామహేశ్వరరావు కందుకూరి వీరేశలింగం పంతులు పురాణ పండ రంగనాధ్ - బొమ్మల పంచతంత్రం చిన్నయసూరి తన అనువాదానికి నీతి చంద్రిక అని పేరు పెట్టాడు. తెలుగులో ప్రసిద్ధి పొందిన అనువాదం ఇదే. కానీ ఈ అనువాదం పంచతంత్రాన్ని కాక నారాయణుడి హితోపదేశాన్ని అనువదించినట్లుగా కనిపిస్తుంది. పరవస్తు చిన్నయసూరి నీతిచంద్రిక రెండు భాగములను మాత్రమే రచించగా, మిగిలిన భాగాలను కందుకూరి వీరేశలింగం పంతులు రచించాడు. తెలుగు సాంప్రదాయంగా విరామచిహ్నాలు లేకుండా సాగిన వేములపల్లి ఉమామహేశ్వర రావు అనువాదం కూడా చదవదగ్గది. పంచతంత్రం ధారావాహికగా పంచతంత్రం ధారావాహికగా తెలుగులో ప్రచురించిన ఘనత చందమామ పత్రికకు దక్కింది. సరళమైన తెలుగులో, ఆకర్షణీయమైన బొమ్మలతో కొన్ని సంవత్సరాల పాటు, పంచతంత్రం ధారావాహికగా ప్రచురించారు. ప్రపంచ సాహిత్య చరిత్రలో పంచతంత్రం పంచతంత్ర (IAST: Pañcatantra, , 'ఐదు సూత్రాలు') పద్య, గద్యాల్లో రచించబడ్డ కల్పిత కథల సంగ్రహం. కొంతమంది విద్వాంసులు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో రచించినట్లు భావించే, పరిచయం, పుట xv; , అనువాదకుని పరిచయం, హెర్టెల్ ఇలా పేర్కొన్నాడు: "సుమారు 200 B.C లో కాశ్మీర్‌లో కూర్చిన మూల రచన. అయితే, ఆ సమయంలో, పలు వ్యక్తిగత కథలు అప్పటికే పురాతనమైనవి." మూల సంస్కృత రచనను విష్ణు శర్మ రచించాడు. అయితే, ఇది "మనం ఊహించడానికి కూడా సాధ్యం కాని జంతువుల కల్పిత కథలతో" పురాతన మౌఖిక సంప్రదాయాలని ఆధారంగా చేసుకుని రచించబడింది.డోరిస్ లెస్సింగ్‌చే ప్రాబ్లెమ్స్, మైథ్స్ అండ్ స్టోరీస్ , ఇన్‌స్టిట్యూట్ ఫర్ కల్చరల్ మోనోగ్రాఫ్ సిరీస్ నం. 36, p 13, లండన్ 1999 ఇది "ఖచ్చితంగా చాల ఎక్కువగా అనువదించబడిన భారతదేశపు సాహిత్య అంశం" అని చెప్పవచ్చు.ఇంట్రడక్షన్, , కోటింగ్ . ఈ కథలు ప్రపంచంలో మంచి ప్రాచుర్యాన్ని పొందాయి., అనువాదకుని పరిచయం: "ది పంచతంత్రలో ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందిన కథలు ఉన్నాయి. ఇంకా ది పంచతంత్ర అనేది ప్రపంచంలోని మంచి కథల సేకరణగా నిర్ధారించబడింది, ఈ ప్రకటనను చాలా తక్కువమంది తప్పుగా సూచించారు , ఒక నిర్ధారణకు విజ్ఞానాన్ని కలిగి ఉన్న వారి ప్రకటనను ఆదేశంగా చెప్పవచ్చు." ఉల్లేఖన :. "రీచ్ట్" , "వర్క్ట్" అనేవి ప్రామాణిక ఉచ్ఛరణ వలె మారాయి. ప్రపంచ భాషలలోకి అనువాదాలు ఇది పలు సంస్కృతుల్లో పలు పేర్లుతో పేరు గాంచింది. భారతదేశంలోనే, ఇది సంస్కృత తంత్రాఖ్యాయికా () తో సహా కనీసం 25 పాఠాంతరాలను కలిగి ఉంది. ఇది హితోపదేశం అనే గ్రంథానికి ప్రేరణ అని చెప్పవచ్చు. ఇది 570 CEలో బోర్జుయా చే పహ్లావీ లోకి అనువదించబడింది. ఇది కళింగ, దమంగ్‌లు వలె ఒక సైరియాక్ అనువాదానికి ఆధారంగా మారింది. పర్షియన్ విద్వాంసుడు అబ్దుల్లా ఇబ్న్ ఆల్-ముక్వాఫాచే 750 CEలో అరబిక్‌లోకి Kalīlah wa Dimnah వలె అనువదించబడింది (). 12వ శతాబ్దం నుండి ఒక పర్షియన్ వెర్షన్ కలీలా, డిమ్నా () వలె పేరు పొందింది. ఇతర పేర్లల్లో Kalīleh o Demneh లేదా Anvār-e Soheylī , , (, 'ది లైట్స్ ఆఫ్ కానోపుస్') లేదా ది ప్యాబ్లెస్ ఆఫ్ బిడ్పాయి ది ఫ్యాబ్లెస్ ఆఫ్ పిల్పే , 1775 యొక్క ఖచ్చితమైన పునఃముద్రణ, డ్వార్ఫ్ పబ్లిషర్స్, లండన్ 1987 (లేదా పిల్పాయి, పలు యూరోపియన్ భాషల్లో) లేదా ది మోరాల్ ఫిలాసాపియే ఆఫ్ డోనీ (ఆంగ్లం, 1570) ఉన్నాయి. అరబిక్ సంస్కరణ మధ్య పర్షియన్ నుండి ఇబ్న్ ఆల్-ముక్వాఫా పంచతంత్ర ను కలీలా వా దిమ్మా (Kalīla wa Dimna) వలె అనువదించాడు. దీనిని "మొట్టమొదటి అద్భుతమైన అరబిక్ సాహిత్య గద్యంగా భావిస్తారు." సంస్కృత సంస్కరణ పహ్లవీ నుండి అరబిక్‌కు మారడానికి పట్టిన కొన్ని వందల సంవత్సరాల్లో కొన్ని ముఖ్యమైన తేడాలు సంభవించాయి: పరిచయం, మొదటి పుస్తకంలోని ప్రధాన కథ మారిపోయాయి. రెండు నక్కల పేర్లు కలిలా, డిమ్నాగా మారాయి. 'పంచతంత్ర' అనే సంస్కృత పదం ఒక హిందూ అంశం వలె జోరాస్ట్రియన్ పహ్లవీలో సులభమైన సమాన పదం లేనందున, వాటి పేర్లు (కలిలా , డిమ్నా ) వారి రచనలో సాధారణ, సాంప్రదాయిక పేర్లుగా మారాయి. మొదటి భాగం తర్వాత ఇబ్న్ ఆల్-ముక్వాఫాచే ఒక భాగం జోడించబడింది. ఎద్దు "షాంజాబెహ్" మరణానికి కారణంగా నక్క డిమ్నాని సంశయించి న్యాయస్థానంలో విచారణ చేస్తారు. .ఈ విచారణ రెండు రోజుల పాటు సాగుతుంది. తర్వాత పులి, చిరుతపులులు ముందుకు వచ్చి, డిమ్నాను దోషిగా నిర్ణయిస్తాయి. అతనికి చివరికి విశ్రాంతి ఇస్తారు. కొన్ని జంతువుల పేర్లు మార్చబడ్డాయి. నాల్గవ భాగంలో మొసలి ఆల్గిలిమ్‌గా మారింది. ముంగిస వెజెల్ (ఒక రకమైన ముంగిస) గా మారింది. బ్రాహ్మణుడి పాత్రను ఒక "సన్యాసి"గా మార్చారు. ప్రతి భాగానికి నీతిని జోడించాడు: ఇతరులను తప్పుగా అర్థం చేసుకోరాదు , స్నేహాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. (జోడించబడిన భాగం) నిజాన్ని ఎంతోకాలం దాచిపెట్టలేము. స్నేహితులు జీవితాన్ని పరిపూర్ణం చేసేవారు. మానసిక బలం , మోసం అనేవి చెడు స్వభావం కంటే బలమైనవి. స్నేహితులను వంచించరాదు , అన్ని సమయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. తక్షణమే నిర్ణయాలను తీసుకోరాదు. ఇతర కల్పిత కథలతో సంబంధాలు పంచతంత్ర , "ఈసప్స్" (Aesop's) కల్పిత కథల్లోని కొన్ని కథల మధ్య పోలికలు ఉన్నాయి. ఉదాహరణలు: 'యాస్ ఇన్ ప్యాంథెర్స్ స్కిన్', 'యాస్ విత్అవుట్ హార్ట్ అండ్ ఇయర్స్'.ది పంచతంత్ర 1924లో సంస్కృతం నుండి ఫ్రాంక్లిన్ ఎడ్గెర్టన్, జార్జ్ అలెన్ , ఉన్విన్‌లచే అనువదించబడింది, లండన్ 1965 ("ఎడిషన్ ఫర్ ది జనరవ్ రీడర్"), పుట 13 'ది బ్రోకెన్ పాట్' అనేది ఈసప్ యొక్క 'ది మిల్క్‌మెయిడ్ అండ్ హెర్ పెయిల్‌'తో, ఇవి రెండు ఆర్నే-థాంప్సన్-ఉతెర్ రకం జానపద కథలు 1430 వలె వర్గీకరించబడ్డాయి "ఐశ్వర్యం , కీర్తి పగటికలలు గురించి". ది గాడ్-గివింగ్ స్నేక్ అనేది ఈసప్ యొక్క ది మ్యాన్ అండ్ ది సెర్పెంట్‌తో సారూప్యతను కలిగి ఉన్నాయి.అవి రెండూ ఆర్నే-థాంప్సన్ రకం 285D యొక్క జానపద కథలు వలె వర్గీకరించబడ్డాయి. ఇతర ప్రధాన కథల్లో "టార్టాయిస్, గీస్, టైగర్, బ్రాహ్మిణ్ అండ్ ది జాకల్‌"లు ఉన్నాయి. ఇలాంటి జంతువుల కల్పితకథలు ప్రపంచంలోని ఎక్కువ సంస్కృతుల్లో కనిపిస్తాయి, అయితే కొంతమంది జానపద రచయితలు ఈ కథలకు భారతదేశాన్ని ప్రధాన వనరుగా భావిస్తారు.: "ప్రొఫెసర్ హెర్టెల్ , బెన్ఫే ఈ భూమిని కల్పితకథలు , సృజనాత్మక రచనకు ప్రధాన మూలంగా సూచించడానికి ఇవే ప్రధాన అంశాలుగా చెప్పవచ్చు." దీనిని "ప్రపంచంలోని కల్పితకథల సాహిత్యానికి ప్రధాన అంశం"గా భావిస్తారు.ఫంక్ అండ్ వాగ్నాల్స్ స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్లోర్ మైథాలజీ అండ్ లెజెండ్ (1975), p. 842 ఫ్రెంచ్ కల్పితకథారచయిత జీన్ డె లా ఫాంటైన్ అతని రెండవ కల్పితకథలకు పరిచయంలో రచనకు అతని రుణపడిన మొత్తాన్ని ప్రముఖంగా ఒప్పుకున్నాడు: "ఇది నేను ప్రజలకు అందించే రెండవ కల్పితకథల పుస్తకం... దీనిలో అత్యధిక భాగానికి నేను పిల్పే, ఒక భారతీయ సన్యాసి నుండి ప్రేరణ పొందనట్లు అంగీకరిస్తున్నాను."("Je dirai par reconnaissance que j’en dois la plus grande partie à Pilpay sage indien") అవెర్టిసెమెంట్ టూ ది సెకండ్ కాంప్లేషన్ ఆఫ్ ఫ్యాబ్లెస్, 1678, జీన్ డె లా ఫోంటైన్ ఇది అరేబియన్ నైట్స్, సింధుబాద్‌లోనూ పలు కథలకు , పలు పాశ్చాత్య పిల్లల పాటలు , జానపద గేయ గాథలకు కూడా మూలంగా చెప్పవచ్చు. మూల కథ పై వివాదాలు ఈ పంచతంత్రలోని పలు కథలు బౌద్ధ జాతక కథలులో కొన్ని కథలతో సారూప్యతను కలిగి ఉన్నాయి, దీనిని సుమారు 400 BCEలో చారిత్రాత్మక బుద్ధుడు మరణించడానికి ముందు సూచించినట్లు పేర్కొంటారు, కాని "ఈ కథలను బౌద్ధులు రచించలేదని స్పష్టమైంది. [...] రచయిత అతని కథలను జాతక కథలు నుండి కాని మహభారతం నుండి సేకరించాడో లేదా పురాతన భారతదేశంలోని మౌఖిక సాహిత్యం లోని సాధారణ కథల సంహితాన్ని చెబుతున్నాడో స్పష్టంగా తెలియలేదు." పలువురు విద్వాంసులు వీటిని ప్రారంభ జానపద సంప్రదాయాల ఆధారంగా రచించినట్లు విశ్వసిస్తారు, అయితే సరైన నిర్ధారణ లేదు.బెడెకర్: "భారతదేశంలోని కథను చెప్పే జానపద , మౌఖిక సంప్రదాయాలకు సంబంధం గురించి పలువురు సూచించారు. అయితే, భారతదేశంలో పంచతంత్ర , సంబంధిత కథా సాహిత్యాలు ప్రారంభ జానపద కథల్లో మూలాలను కలిగి ఉన్నాయని ప్రకటనలు చేయడం ఒక గొప్ప అంశంగా మారింది. అయితే, నేటి వరకు పరికల్పిత ఊహాగానాలపై దీర్ఘకాల చర్చలకు మినహా ఒక ఖచ్చితమైన రుజువును అందించలేకపోయారు." W. నోర్మాన్ బ్రౌన్ ఈ సమస్యపై చర్చించాడు, ఆధునిక భారతదేశంలో, పలు జానపద కథలు సాహిత్య మూలాల నుండి తీసుకున్నట్లు, జానపద కథల నుండి సాహిత్యాన్ని తీసుకోలేదని గుర్తించాడు.బ్రౌన్, నార్మన్ W. 1919. ది పంచతంత్ర ఇన్ మోడరన్ ఇండియన్ ఫోల్క్‌లోర్, జర్నల్ ఆఫ్ ది అమెరికన్ ఓరియెంటల్ సొసైటీ, వాల్యూమ్ 39, pp 1 &17: "సుదూర గత పలు కథలు వాటి మూలాలను తరచూ పూర్వ-సాహిత్య సమయాల్లో నిరక్షరాస్య జానపదల్లో ఉన్నాయనేది సందేహరహిత నిజం , తర్వాత సాహిత్యంలోకి తీసుకోబడింది. సాహిత్యంలో కనిపించే పలు కథలు ముందుగా వాటిలో ఉన్నవి అనే అంశం కూడా నిజం , వారి మూలానికి జానపద కథలకు సంబంధాన్ని కలిగి లేదు. కాని హిందూ కథల గురించి ప్రారంభ చరిత్రకు సంబంధించిన ప్రశ్నలను పక్కన పెట్టాలి , ఖచ్చితంగా ఆధునిక భారతీయ సృజనాత్మక రచనతో వ్యవహరించినప్పుడు, మనం జానపద కథలు సాహిత్యం నుండి దాని అంశాలను తీసుకున్నట్లు గుర్తించవచ్చు. ఈ విధంగా ఇప్పటివరకు 3000 కథలకు విస్తరించినట్లు తెలిసింది, వీటన్నింటినీ గత యాభై సంవత్సరాల్లో సేకరించారు, కనీసం వీటిలో సగం సాహిత్య వనరుల నుండి తీసినట్లు తెలిసింది. [...] ఇవి జానపద కథలు , తీసుకున్న సాహిత్య కథలు కాదు అనే సిద్ధాంతానికి మద్దతుగా రుజువులును ఈ పట్టిక కలిగి ఉంది. పంచతంత్రపై ప్రారంభ పాశ్చాత్య విద్వాంసుల్లో ఒకరు Dr. జానెస్ హెర్టెల్ పుస్తకాన్ని మాకియవెలిన్ పాత్రను కలిగి ఉన్నట్లు భావించాడు. ఇదే విధంగా, ఎడ్జెర్టన్ "ఇటువంటి 'నీతి' కథలు నైతికతపై ఆధారపడవు; అవి నీతిరహితమైనవి , తరచూ దుర్నీతి కథలు. ఇవి జీవితంలోని సంబంధాల్లో , ప్రత్యేకంగా ప్రభుత్వంలోని రాజకీయాల్లో గడసరితనం , ఆచరణీయ జ్ఞానాన్ని కీర్తిస్తాయ"ని పేర్కొన్నాడు. ఇతర విద్వాంసులు ఈ నిర్ధారణను ఏకాభిప్రాయంగా కొట్టిపారేశారు , వాటిని లేదా సరైన నీతి ప్రవర్తనను బోధించే కథలుగా భావించారు. అలాగే: ఆలివెల్లీ పరిశోధించినది: ఉదాహరణకు, మొట్టమొదటి ప్రధాన కథలో, చెడు దమనకా ('విజయం') విజయం సాధిస్తుంది, కరటాకా కాదు. ఎందుకంటే, ఇది కొంచెం కొంచెంగా పాశ్చాత్యదిశగా అనువదించబడుతున్న పరిణామంలో కాలిలా , డిమ్నా మొదటి భాగంలోని చెడు-విజయం సాధించే నేపథ్యం తరచూ జీయూష్, క్రిస్టియన్ , ముస్లిం మత గురువులచే దుర్మార్గంగా పేర్కొనబడింది - అయితే ఇబ్న్ ఆల్-ముక్వాఫా (అతని స్వంత గజిబిజి సమయంలో శక్తివంతమైన మతపరమైన మూఢభక్తులను శాంతిపర్చాలనే ఉద్దేశ్యంతోనే) జాగ్రత్తగా అతని అరబిక్ అద్భుత కథలోని మొదటి భాగం చివరిలో మొత్తం అదనపు భాగాన్ని జోడించాడు, దానిలో డిమ్నాను ఖైదు చేసినట్లు , విచారణ తర్వాత మరణ శిక్ష విధించినట్లు పేర్కొన్నాడు. పూర్వ-ఇస్లామిక్ యదార్ధ ది పంచతంత్ర లో ఇటువంటి పిడివాద నీతి బోధన లేదు. 1888లో జోసెఫ్ జాకబ్స్ పరిశీలించినప్పుడు, "...అలా ఆలోచించినట్లయితే, కల్పితకథల చాలా raison d'être అనేది నీతిని సూచించకుండా దానికి వర్తిస్తుంది.", p.48 వివిధ సంస్కృతులకు అనువాదాలు ఆరవ శతాబ్దం నుండి నేటి వరకు ఈ రచన యొక్క పలు వేర్వేరు సంస్కరణలు , అనువాదాలు వెలువడ్డాయి.చూడండి: కలీలా అండ్ డిమ్నా, సెలెక్టడ్ ప్యాబ్లెస్ ఆఫ్ బిడ్పాయి , ఇది రాంసే వుడ్‌చే మళ్లీ చెప్పబడింది (డోరిస్ లెస్సింగ్‌చే ఒక పరిచయం), దీనిని మార్గరెట్ కిల్రేనే, ఆల్ఫ్రెడ్ A నోఫ్‌చే వివరించబడింది, న్యూయార్క్ 1980 కలీలా అండ్ డిమ్నా, టేల్స్ ఆఫ్ కింగ్స్ అండ్ కమానెర్స్, సెలెక్టడ్ ప్యాబ్లెస్ ఆఫ్ బిడ్పాయి , రాంసే వుడ్‌చే మళ్లీ చెప్పబడింది, డోరిస్ లెస్సింగ్‌చే పరిచయం, ఇన్నెర్ ట్రెడిషన్స్ ఇంటర్నేషనల్, రోచెస్టెర్, వెర్మాంట్, USA 1986 టేల్స్ ఆఫ్ కలీలా , డిమ్నా, క్లాసిక్ ప్యాబ్లెస్ ఫ్రమ్ ఇండియా , రాంసే వుడ్‌చే మళ్లీ చెప్పబడింది, డోరిస్ లెస్సింగ్‌చే పరిచయం, ఇన్నెర్ ట్రెడిషన్స్ ఇంటర్నేషనల్, రోచెస్టెర్, వెర్మాంట్, USA 2000, Amazon.com. ఇది 1986 విడుదలైన అదే పుస్తకాన్ని ఒక నూతన శీర్షిక , ఒక నూతన అట్టతో మళ్లీ ప్యాక్ చేయబడింది. "Kalile e Dimna, Fiable indiane di Bidpai", cura di Ramsay Wood, Neri Pozza, Venice 2007, Internetbookshop.it డెనేస్ జాన్సన్-డేవైస్‌చే యానిమల్ టేల్స్ ఆఫ్ ది ఆరబ్ వరల్డ్ , హోపోయ్ బుక్స్, కైరో 1995 Kalila und Dimna, oder die Kunst, Fruende zu gewinnen, Fabeln des Bidpai , erzahlt von Ramsay Wood, Vorwort von Doris Lessing, ఇది ఎడ్గెర్ ఓటెన్, హెర్డెర్/స్పెక్ట్రమ్‌చే అనువదించబడింది, Freiberg 1996 Kalila y Dimna, Fabulas de Bidpai , Contadas por Ramsay Wood, Introduccio de Doris Lessing , ఆంగ్లం నుండి నికోల్ డిఆమోన్విల్లే అలెగ్రియాచే అనువదించబడింది, కైరోస్, బార్సిలోనా 1999 సులేమాన్ ఆల్-బాసమ్‌చే కలీలా వా డిమ్నా ఆర్ ది మిర్రర్ ఫర్ ప్రిన్సెస్ , ఒబెరన్ మోడరన్ ప్లేస్, లండన్ 2006, Amazon.co.uk Kalila et Dimna, Fables indiennes de Bidbai , choisies et racontées par Ramsay Wood, Albin Michel, Paris 2006 Alapage.com యదార్ధ భారతీయ సంస్కరణ మొట్టమొదటిగా 570లో బోర్జుయాచే ఒక విదేశీ భాషలోకి అనువదించబడింది, తర్వాత 750లో అరబిక్‌లోకి అనువదించబడింది , ఇది అన్ని యూరోపియన్ సంస్కరణలకు మూలంగా మారింది. ప్రారంభ వివిధ సంస్కృతుల అనువాదాలు పంచతంత్ర దాని ప్రస్తుత సాహిత్య రూపాన్ని 4వ-6వ శతాబ్దాల CEలో సాధించింది, అయితే నిజానికి 200 BCEలో రచించబడింది. 1000 CEకి ముందు సంస్కృత పాఠాలు ఏవీ ఉనికిలో లేవు. భారతీయ సాంప్రదాయం ప్రకారం, ఇది పండితుడు విష్ణు శర్మ రచించాడు. ఇది ప్రపంచ సాహిత్యంలో అత్యధిక ప్రభావంతమైన సంస్కృత రచనల్లో ఒకటిగా పేరు గాంచింది, ఇది భక్తులు వలె విచ్చేసిన బౌద్ధ మతగురువులచే ఉత్తరం నుండి టిబెట్ , చైనాకు , తూర్పు నుండి దక్షిణ తూర్పు ఆసియాకు ఎగుమతి అయ్యింది (మౌఖిక , సాహిత్య రూపాలు రెండింటిలోనూ).ఈ సన్యాసుల్లో కొంతమంది ఏ విధంగా పురాతన కాలంలో ప్రయాణం చేశారో అనే దానికి భావన కోసం, కొలిన్ తుబోర్న్, చాటో & విండస్‌చే టార్క్విన్ హాల్ యొక్క షాడో ఆఫ్ సిల్క్ రోడ్ సమీక్ష, Newstatesman.com లో లండన్ 2006 ఇవి టిబెటిన్, చైనీస్, మంగోలియా, జావానీస్ , లావో ఉత్పన్నాలతో సహా అన్ని ఆగ్నేయ దేశాల్లో సంస్కరణలకు కారణమయ్యాయి. భారతదేశం నుండి రచనను బోర్జుయే తీసుకున్న విధానం పంచతంత్ర 570 CEలో ఖోస్రూ I అనుషిరావన్ యొక్క సాసానిద్ సామ్రాజ్యంలో పశ్చిమప్రాంతాల్లో కూడా చేరుకుంది, ఇది అతను ప్రముఖ వైద్యుడు బోర్జుయే దీనిని సంస్కృతం నుంి మధ్య పర్షియన్ భాషలోకి అనువదించాడు, దీనిని Karirak ud Damanak మెడైవాల్ ఇస్లామిక్ సివిలైజేషన్, యాన్ ఎన్‌సైక్లోపిడీయా లో Dr ఫాహ్మిడా సులేమాన్‌చే "కలీలా వా డిమ్నా" శీర్షికతో కథనాన్ని చూడండి, వాల్యూ. II, p. 432-433, ed. జోసెఫ్ W. మెరీ, రూట్లెడ్జ్ (న్యూయార్క్-లండన్, 2006) IIS.ac.uk లేదా Kalile va Demne లిప్యంతరీకరించబడింది.Abdolhossein Zarrinkoub, Naqde adabi , టెహ్రాన్ 1959 pp:374-379. (కంటెంట్స్ 1.1 ప్రీ-ఇస్లామిక్ ఇరానీయన్ లిటరేచర్‌ను చూడండి) షా నామా (ది బుక్ ఆఫ్ ది కింగ్స్ , ఫెర్డోసీ రచించిన పెర్షియా యొక్క గత 10వ శతాబ్దపు జాతీయ ఇతిహాసం)లో చెప్పిన కథ ప్రకారం, బోర్జుయే "ఒక వనమూలికను ఒక మిశ్రమంలో కలిపి, దానిని ఒక మృతదేహంపై జల్లినప్పుడు, అది తక్షణమే ప్రాణం పోసుకుంటుందని" చదివి, దానిని సాధించేందుకు హిందూ దేశానికి పర్యటన చేస్తానని అతని రాజు నుండి అనుమతిని అభ్యర్థించాడు.ది షాహా నామా, ది ఎపిక్ ఆఫ్ ది కింగ్స్, రుబెన్ లెవీచే అనువదించబడింది, ఆమిన్ బనానీచే పునఃసమీక్షించబడింది, రూట్లెడ్జ్ & కీగాన్ పాల్, లండన్ 1985, భాగం XXXI (iii) గౌ బోర్జుయే బ్రాట్ ది కలీలా ఆఫ్ డెమ్నా ఫ్రమ్ హిందూస్థాన్, పేజీలు 330 - 334 అతను అక్కడికి చేరుకున్న తర్వాత, అతనికి అటువంటి వనమూలిక కనిపించలేదు, బదులుగా ఒక తెలివైన యోగి "వేరొక అంతర్వేశనాన్ని చెప్పాడు. ఆ వనమూలిక శాస్త్రజ్ఞుడు; శాస్త్రం అనేది కొండ, పలువురు దానిని చేరుకోలేకపోయారు. మృతదేహం అనేది జ్ఞానం లేని మనిషి, జ్ఞానం లేని మనిషి ఎక్కడైనా ప్రాణం లేకుండానే ఉంటాడు. జ్ఞానం ద్వారా మనిషి నూతన శక్తిని పొందుతాడు." ఆ యోగి కలీలా పుస్తకాన్ని సూచించాడు, అతను ఆ పుస్తకాన్ని చదివి, దానిని కొంతమంది పండితులతో అనువదించేందుకు రాజు యొక్క అనుమతిని పొందాడు. ఇబ్న్ ఆల్-ముక్వాఫాచే అరబిక్ రచన బోర్జుయే యొక్క 570 CE పాహ్లావీ అనువాదం (Kalile va Demne, ప్రస్తుతం ఉనికిలో లేదు) కొద్దికాలంలోనే సైరియాక్‌లోకి అనువదించబడింది, సుమారు రెండు శతాబ్దాల తర్వాత 750 CEలో ఇబ్న్ ఆల్-ముక్వాఫాచే అరబిక్‌లోకి అరబిక్ శీర్షిక Kalīla wa Dimmaతో అనువదించబడింది.ముస్లిం నీయోప్లాటోనిస్ట్: యాన్ ఇంటర్‌డక్షన్ టూ ది థాట్ ఆఫ్ ది బ్రెథ్రెన్ ఆఫ్ ఫ్యూరిటీ , ఇయాన్ రిచర్డ్ నెట్టాన్, 1991. ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీ ప్రెస్, ISBN 0-7486-0251-8 పెర్షియాలో (ఇరాన్) ముస్లిం దండయాత్ర తర్వాత, ఇబ్న్ ఆల్-ముక్వాఫ్ యొక్క సంస్కరణ (నేటికి దాని పూర్వ-ఇస్లామిక్ సంస్కృత యథార్థ రచన నుండి రెండు భాషలు తొలగించబడ్డాయి) ప్రపంచ సాహిత్యాన్ని మెరుగుపరిచే కీలకమైన ఉనికిలో ఉన్న రచన వలె ఉద్భవించింది.కలీలా వా డిమ్నా గురించి లేదా సంబంధించి పధ్నాలుగు ప్రకాశవంతమైన వ్యాఖ్యలను రాబర్ ఇర్విన్‌చే రచించడిన ది పెంగ్విన్ అనాథాలజీ ఆఫ్ క్లాసికల్ అరబిక్ లిటరేచర్ సూచిక క్రింద చూడండి, పెంగ్విన్ బుక్స్, లండన్ 2006 ఇబ్న్ ఆల్-ముక్వాఫా యొక్క రచనను మధురమైన అరబిక్ గద్య శైలికి ఒక నమూనాగా పేర్కొంటారు, జేమ్స్ క్రిట్జెక్ (1964) అంథాలజీ ఆఫ్ ఇస్లామిక్ లిటరేచర్ , న్యూ అమెరికన్ లైబ్రరీచే ప్రచురించబడిన ఒక మధ్యకాలపు పుస్తకం, న్యూయార్క్, పేజీ 73: ఇబ్న్ ఆల్-ముక్వాఫా యొక్క చారిత్రాత్మక అంశంలో అతని స్పష్టమైన సారాంశం కోసం పేజీలు 69 - 72 కూడా చూడండి. , "అరబిక్ సాహిత్య గద్యంలో మొట్టమొదటి అద్భుత రచనగా భావిస్తారు." కొంతమంది విద్వాంసులు మిత్ర లాభ (స్నేహితులను పొందడం) యొక్క సంస్కృత నియమాలను వివరిస్తున్న రెండవ భాగం యొక్క ఇబ్న్ ఆల్-ముక్వాఫా యొక్క అనువాదం బ్రీథెర్న్ ఆఫ్ ఫ్యూరిటీకి (Ikwhan al-Safa ) సంఘటిత ఆధారంగా మారింది - పేరు తెలియని 9వ శతాబ్దపు CE అరబ్ సర్వ విద్యాపారంగతులు అద్భుత సాహిత్య ప్రయత్నం ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ది బ్రెథ్రెన్ ఆఫ్ సిన్సియారిటీ భారతీయ, పర్షియన్, గ్రీకు విజ్ఞానాన్నీ క్రోడీకరించింది. గోల్జిహెర్‌చే సూచించింబడిన ఒక సలహా, తర్వాత ఫిలిప్ K. హిట్టీ తన హిస్టరీ ఆఫ్ ది అరబ్స్‌లో ఈ విధంగా పేర్కొన్నారు "ఈ నామం Kalilah wa-Dimnah లో రింగ్డోవ్ కథ నుండి తీసుకుంది, దీనిలో కొన్ని జంతువులు విశ్వాసపాత్ర స్నేహితులు వలె మెలగడం (ikhwan al-safa ) ద్వారా వేటగాళ్ల వలల నుండి తప్పించుకోవడానికి ఒక దానికి ఒకటి సహాయం చేసుకున్నాయి." వారి జాతి వ్యవస్థలో ముఖ్యమైన భాగమైన రిసాలాలో (సంహతం) పరస్పర సహాయం గురించి బ్రెథ్రెన్ మాట్లాడినప్పుడు ఈ కథను ఒక ఉదాహరణగా పేర్కొన్నాడు. మిగిలిన యూరోప్‌లో వ్యాప్తి పంచతంత్ర యొక్క పూర్వ-ఆధునిక యూరోపియన్ అనువాదాలు అన్ని ఈ అరబిక్ సంస్కరణ నుండి తీసుకోబడ్డాయి. అరబిక్ నుండి ఇది 10వ లేదా 11వ శతాబ్దంలో సిరియాక్‌లోకి మళ్లీ అనువదించబడింది, 1080లో గ్రీకులోకి, 1121లో అబ్దుల్ మాలీ నాస్ర్ అల్లా మున్షీచే 'ఆధునిక' పర్షియన్‌లోకి, 1252లో స్పెయిన్‌లోకి (పురాతన క్యాస్టిలైన్, Calyla e Dymna ) అనువదించబడింది. మరింత ముఖ్యంగా, ఇది 12వ శతాబ్దంలో రాబీ జోయెల్‌చే హీబ్రూలోకి అనువదించబడింది. ఈ హిబ్రూ సంస్కరణను జాన్ ఆఫ్ కాప్యూ Directorium Humanae Vitae, లేదా "డైరెక్టరీ ఆఫ్ హ్యూమెన్ లైఫ్" అనే పేరుతో లాటిన్‌లోకి అనువదించాడు, 1480లో ముద్రించాడు, ఇది అత్యధిక యూరోపియన్ సంస్కరణలకు మూలంగా మారింది. పంచతంత్ర యొక్క ఒక జర్మన్ అనువాదం Das Der Buch Beyspiele 1483లో ముద్రించబడింది, ఇది బైబిల్ ముద్రించిన తర్వాత గుటెన్‌బెర్గ్ యొక్క ప్రెస్ ముద్రించిన ప్రారంభ పుస్తకాల్లో ఒకటిగా పేరు గాంచింది.విజయ్ బెడెకర్, హిస్టరీ ఆఫ్ ది మైగ్రేషన్ ఆఫ్ పంచతంత్ర , ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఓరియెంటల్ స్టడీ, థానే లాటిన్ సంస్కరణను 1552లో ఆంటోనియా ఫ్రాన్సికో డోనీ ఇటాలియన్‌లోకి అనువదించాడు. ఈ అనువాదం 1570లో మొట్టమొదటి ఆంగ్ల అనువాదానికి ఆధారంగా మారింది: సర్ థామస్ నార్త్ దీనిని ఎలిజబెథీన్ ఆంగ్లంలోకి ది ఫ్యాబ్లెస్ ఆఫ్ బిడ్పాయి: ది మోరల్ ఫిలాసఫీ ఆఫ్ డోనీ (జోసెఫ్ జాకబ్స్, 1888లో మళ్లీ ముద్రించబడింది) అనే పేరుతో అనువదించాడు. లా ఫాంటైన్ 1679లో "ది ఇండియన్ సాగే పిల్పే" ఆధారంగా ది ఫ్యాబ్లెస్ ఆఫ్ బిడ్పాయిను ప్రచురించాడు. ఆధునిక కాలం తులనాత్మక సాహిత్య రంగంలో వైతాళికుడు థియోడోర్ బెన్ఫే యొక్క అధ్యయనాలకు పంచతంత్ర ఆధారంగా చెప్పవచ్చు.హార్వర్డ్ ఓరియెంటల్ సిరీస్ అతను పంచతంత్ర చరిత్ర చుట్టూ అలుముకున్న కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నాలను ప్రారంభించాడు, అతను హెర్టెల్ (, , ), రచనలో అన్నింటినీ ముగించాడు. హెర్టెల్ భారతదేశంలో పలు శాఖలను ప్రత్యేకంగా పురాతన అందుబాటులోని సంస్కృత శాఖ కాశ్మీర్‌లోని తంత్రఖాయాయికా గుర్తించాడు, 1199 CEలో జైన్ సన్యాసి పూర్ణభద్రచే ఉత్తర పాశ్చాత్య కుటుంబ సంస్కృత రచన అని పిలిచే దానిలో మూడు ప్రారంభ సంస్కరణలు విలీనం చేయబడ్డాయి, పునరమర్చబడ్డాయి. "ఇవి అన్ని దేని నుండి సంగ్రహించబడ్డాయి అనే అంశంలో కోల్పోయిన సంస్కృత రచనలో ఉపయోగకర రుజువును అందించడానికి" ప్రయత్నించి ఎడ్గెర్టన్ అన్ని రచనలు ఒక నిమిషంలో చదివాడు, అతను అసలైన సంస్కృత పంచతంత్రాన్ని పునఃరూపొందించినట్లు విశ్వసించాడు; ఈ సంస్కరణను దక్షిణ కుటుంబ రచనగా పిలుస్తారు. ఆధునిక అనువాదాల్లో, ఆర్థర్ W. రైడర్ యొక్క అనువాదం (), పద్య భాగాన్ని పద్య భాగం, ప్రాసతో కూడిన కవిత్వాన్ని కవిత్వం వలె అనువదించాడు, ఇది ప్రజాదరణ పొందింది.: "ఇది అధిక ప్రజాదరణ పొందిన , సులభంగా ప్రాప్తి చేయగల ఆంగ్ల అనువాదం వలె మారింది, పలు పునఃముద్రణలు జరిగాయి." 1990ల్లో, పంచతంత్ర యొక్క రెండు ఆంగ్ల సంస్కరణలు ప్రచురించబడ్డాయి, పెంగ్విన్ (1993) చే చంద్ర రాజన్ యొక్క అనువాదం (వాయవ్య రచన ఆధారంగా), ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రచురణ కేంద్రం (1997) చే ప్యాట్రిక్ ఆలైవెల్లీ యొక్క అనువాదం (దక్షిణ రచన ఆధారంగా) ప్రచురించబడింది. ఆలైవెల్లీ యొక్క అనువాదం క్లే శాంస్క్రీట్ లైబ్రరీచే 2006లో మళ్లీ ప్రచురించబడింది., , . అతను 45 పుట పరిచయం ప్రొఫెసర్ ఆలివెల్లీ, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ (ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ 1997) చంద్ర రాజన్ (పెంగ్విన్ 1993) యొక్క అనువాదానికి చివరి వ్యాక్యంలో ఎనిమిది పదాల సూచన, ఇది కూడా ఒక 40 పేజీల పరిచయాన్ని కలిగి ఉంది. మద్రాస్‌లోని ఒక పండితుని వద్ద స్థానిక అభ్యాసన వ్యవస్థలో తొమ్మిది సంవత్సరాల వయస్సు నుండి సంస్కృతాన్ని అభ్యసించిన ఒక భారతీయ మహిళ ఇటువంటి కనీస వ్యాఖ్యను ఊహించవచ్చు, ఆమె , ఆమె ప్రజ్ఞ US అకాడమిక్ సరిహద్దుకు వెలుపలి వలె భావిస్తారు. ఇటీవల రక్తమయమైన అబాసిద్ ఉమాయాద్ సామ్రాజాన్ని కూలదీసిన సమయంలో బాగ్దాద్‌లో ఇబ్న్ ఆల్-ముఖ్వాఫ్ అతని అద్భుత రచనను రచించేటప్పుడు అక్కడ చారిత్రాత్మక సాంఘిక పరిసరాలు బహుళసాంస్కృతిక కువైట్ కథారచయిత సులైమాన్ ఆల్-బాసిమ్‌చే ఒక మెరికలుగా ఉండే షేక్‌స్పియర్ యొక్క డ్రామా యొక్క అంశంగా (, ఎటువంటి సందేహం లేకుండా, శీర్షిక కూడా) మారింది.సులేమాన్ ఆల్-బాసమ్‌చే కలీలా వా డిమ్నా ఆర్ ది మిర్రర్ ఫర్ ప్రిన్సెస్ , ఒబెరన్ మోడరన్ ప్లేస్, లండన్ 2006 ఇరాక్‌లో నేడు క్రమంగా పెరుగుతున్న రక్తదాహానికి ఒక వివరణాత్మక రూపకం వలె ఇబ్న్ ఆల్-ముక్వాఫా యొక్క జీవిత చరిత్ర సంబంధించిన నేపథ్యం పనిచేస్తుంది - స్పష్టమైన జాతి, మతం, రాజకీయ సమానతలతో సహా ఒక అనేకత్వ స్థాయిల్లో పౌరులు కొట్లాడుకునేందుకు ఒక చారిత్రాత్మక సుడిగుండంగా మారింది. నవలారచయిత్రి డోరిస్ లెస్సింగ్ ఐదు పంచతంత్ర పుస్తకాల్లోరాంసే వుడ్ మళ్లీ చెప్పిన కలీలా , డిమ్నా, సెలెక్టడ్ ప్యాబ్లెస్ ఆఫ్ బిడ్పాయి , (డోరిస్ లెస్సింగ్‌చే ఒక పరిచయంతో), మార్గరెట్ కిల్రేనేచే వివరించబడింది, ఒక పాలాడిన్ పుస్తకం, గ్రానాడా, లండన్, 1982 మొదటి రెండు పుస్తకాల రాంసే వుడ్ యొక్క 1980 "మళ్లీ చెప్పిన కథ"కు ఆమె పరిచయంలో ఇలా పేర్కొంది మూలాలు ఎడిషన్‌లు , అనువాదాలు (కాలక్రమానుసారం క్రమీకరించబడ్డాయి.) సంస్కృత రచనలు ఇతరాలు , Google పుస్తకాలు ఆంగ్లంలో అనువాదాలు Google పుస్తకాలుGoogle పుస్తకాలు (సిల్వెస్ట్రే డే స్టాసే యొక్క వేర్వేరు అరబిక్ చిత్తుప్రతుల 1816 సమాకలనం నుండి అనువదించబడింది) అలాగే పర్షియన్ లిట్రేచర్ ఇన్ ట్రాన్సిలేషన్‌ లో కూడా ఆన్‌లైన్‌లో ఉంది. , ఫిలో ప్రెస్‌చే మళ్లీ ముద్రించబడింది, అమెస్టర్‌డ్యామ్ 1970 Google పుస్తకాలు (The Morall Philosophie of Doni నుండి సర్ థామస్ నార్త్‌చే సవరించబడింది, ప్రేరేపించబడింది, 1570) టేల్స్ విత్ఇన్ టేల్స్ - ఫ్యాబ్లెస్ ఆఫ్ పిల్పాయి నుండి సేకరించబడింది, సర్ ఆర్ధుర్ N వోలాస్టాన్, జాన్ ముర్రే, లండన్ 1909 (1956లో మళ్లీ ముద్రించబడింది, 1964లో పునఃముద్రణ, జైకో పబ్లిషింగ్ హౌస్, బొంబాయి, 1949). (హెర్టెల్ వాయవ్య కుటుంబ సంస్కృత రచన ఆధారంగా అనువాదం.) (పునఃముద్రణ: 1995) (అలాగే వాయవ్య కుటుంబ రచన నుండి.) (ఎడ్గెర్టన్ యొక్క దక్షిణ కుటుంబ సంస్కృత రచన ఆధారంగా అనువాదం.) (చంద్ర రాజన్, ప్యాట్రిక్ ఆలైవెల్లీచే అనువాదాల నుండి ఒక సంస్కృత రచన నుండి తీసుకున్న ప్రాప్తి చేయగల ప్రజాదరణ పొందిన సంకలనం.) మరింత చదవడానికి <div class="references-small" style=""> N. M. పెంజెర్ (1924), ది ఒషియన్ ఆఫ్ స్టోరీ, సోమదేవ్ యొక్క కథా సరిత సాగర యొక్క C.H. టానే యొక్క అనువాదం (లేదా ఓషియన్ స్ట్రీమ్స్ ఆఫ్ స్టోరీ) : వాల్యూమ్ V (of X), అపెండిక్స్ I: pp. 207–242 భారతదేశానికి బుర్జాయ్ యొక్క సముద్రయానం , కలిలాహ్ వా డిమ్నాహ్ ఆఫ్ బుక్ యొక్క మూలం Google పుస్తకాలు, ఫ్రాంకోయిస్ డే బ్లోయిస్, రాయల్ ఆసియాటిక్ సొసైటీ, లండన్, 1990 ఆన్ కలిలా వా డిమ్నా , పర్షియన్ నేషనల్ ఫెయిరీ టేల్స్ Transoxiana.com, Dr. పావెల్ బాషారిన్ [మాస్కో], టాంసాక్సియానా 12, 2007 ది పాస్ట్ వుయ్ షేర్ — ది నీయర్ ఈస్ట్రన్ యాన్సెస్ట్రే ఆఫ్ వెస్ట్రన్ ఫోక్ లిటరేచర్, E. L. రానేలాహ్, క్వార్టెట్ బుక్స్, హారిజన్ ప్రెస్, న్యూయార్క్, 1979 తాహిర్ షా, డబుల్డేచే ఇన్ అరేబియన్ నైట్స్ — ఏ సర్చ్ ఆఫ్ మోరాకో థ్రూ ఇట్స్ స్టోరీస్ అండ్ స్టోరీటెల్లర్స్, 2008. ఈ పుస్తకం తూర్పు నుండి పశ్చిమానికి అనుసంధానించే కథను వివరించే పురాతన సజీవ సంప్రదాయాన్ని విశ్లేషిస్తుంది, సమకాలీన మోరోకాన్ సంస్కృతిలో సర్వవ్యాప్త సచేతన స్థాయిలో ఉనికిలో ఉన్నాయి. Amazon.co.uk ఇబ్న్ ఆల్-ముక్వాఫా, ఆడ్బాలాహ్. Kalilah et Dimnah . Ed. P. లూయిస్ చెయికో. 3 ed. బెయిరుట్: ఇంప్రీమెరీ క్యాథోలిక్యూ, 1947. ఇబ్న్ ఆల్-ముక్వాఫా, అబ్దుల్లా. Calila e Dimna . Eds. జూయాన్ మాన్యువల్ కాచో బ్లెక్యూ, మారియా జీసెస్ లాకారా. మాడ్రిడ్: ఎడిటోరియల్ కాస్టాలియా, 1984. కెల్లెర్, జాన్ ఎస్టెన్, రాబర్ట్ వైట్ లింకర్. El libro de Calila e Digna . Madrid Consejo Superior de Investigaciones Cientificas, 1967. లాథమ్, J.D. "ఇబ్న్ ఆల్-ముక్వాఫా`, ప్రారంభ `అబ్బాసిడ్ ప్రోజ్." `అబ్బాసిడ్ బెలెస్-లెటర్స్ . Eds. జులియా ఆస్టియానే మొదలైనవారు. కేంబ్రిడ్జ్: కేంబ్రిడ్జ్ UP, 1989. 48-77. పార్కెర్, మార్గరెట్. ది డిడాక్టిక్ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ఇల్ లిబ్రో కాలిలా యి డిగ్నా . మియామీ, FL: ఎడిసినోస్ యూనివర్శల్, 1978. పెంజోల్, పెడ్రో. Las traducciones del "Calila e Dimna". మాడ్రిడ్,: Impr. de Ramona Velasco, viuda de P. Perez,, 1931. వాక్స్, డేవిడ్ A. "ఇబ్న్ ఆల్-ముక్వాఫా యొక్క సృష్టి Kalîla wa-Dimna, ఆల్-సారాకుస్టీ యొక్క Al-Maqamat al-Luzumiyya. జర్నల్ ఆఫ్ అరబిక్ లిటరేచర్ 34.1-2 (2003) : 178-89. బాహ్య లింకులు పంచతంత్ర అనువాదాల చరిత్ర భారతదేశం నుండి పంచతంత్ర యొక్క పాశ్చాత్య వలసపై లండన్ 2009 ICR వివరణాత్మక ప్రసంగం యొక్క వీడియో వుడ్ యొక్క 2008 నవీకరణ కలీలా అండ్ డిమ్నా - ప్యాబ్లెస్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ అండ్ బిట్రేయల్ నుండి సంగ్రహం ఆంగ్లంలో పంచతంత్ర కథలు పంచతంత్ర నుండి కథలు పంచతంత్ర నుండి కల్పితకథలు పంచతంత్రము-అనువాదం వేములపల్లి ఉమామహేశ్వర రావు - జూన్‌ 1989 తెలుగు నీతి కథలు వర్గం:తెలుగు సాహిత్యం వర్గం:భారతీయ సాహిత్యం వర్గం:తెలుగు పుస్తకాలు వర్గం:మౌఖిక సంప్రదాయం వర్గం:కథను చెప్పడం వర్గం:సంస్కృత రచనలు వర్గం:పర్షియన్ సాహిత్యం వర్గం:అరబిక్ సాహిత్యం వర్గం:సాహిత్య చరిత్రం వర్గం:మానవరూప జంతు పాత్రలను కలిగివున్న సాహిత్యం వర్గం:కల్పితకథలు వర్గం:భారతీయ జానపద కథలు
ప్రముఖ కావ్యాలు
https://te.wikipedia.org/wiki/ప్రముఖ_కావ్యాలు
దారిమార్పు ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా
తెలుగు సినిమాలు 1983
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1983
thumb|అడవిసింహాలు నటరత్న యన్‌.టి.రామారావు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, చలనచిత్ర రంగం నుండి నిష్క్రమించారు. ఈ సంవత్సరం 104 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ 'ముందడుగు' అత్యధిక వసూళ్ళు సాధించి, రజతోత్సవం జరుపుకుంది. ఈతరం పిక్చర్స్‌ 'నేటి భారతం' కూడా సూపర్‌ హిట్టయి, ద్విశతదినోత్సవం జరుపుకొని, ఉదయం ఆటలతో స్వర్ణోత్సవం చేసుకుని టి.కృష్ణ శైలి సామాజిక చిత్రాలకు, విజయశాంతి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకు నాంది పలికింది. 'ఖైదీ' సంచలన విజయం సాధించి, అప్పటి యంగ్‌ హీరో చిరంజీవిని స్టార్‌గా నిలిపి, ఉదయం ఆటలతో స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇంకా "అభిలాష, ఎమ్‌.ఎల్‌.ఎ. ఏడుకొండలు, కిరాయి కోటిగాడు, ధర్మాత్ముడు, పోరాటం, ప్రజారాజ్యం, బహుదూరపు బాటసారి, మగమహారాజు, మనిషికోచరిత్ర, రాముడు కాదు కృష్ణుడు, శక్తి, శ్రీరంగనీతులు, సాగరసంగమం, అడవి సింహాలు" శతదినోత్సవాలు జరుపుకోగా,"గూఢచారి నంబర్‌ వన్‌, చండశాసనుడు, మంత్రిగారి వియ్యంకుడు, పండంటి కాపురానికి 12 సూత్రాలు, పిచ్చిపంతులు, పెళ్ళిచూపులు, ముక్కుపుడక, మూడుముళ్ళు, రామరాజ్యంలో భీమరాజు, సంఘర్షణ" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. 'చండశాసనుడు'తో శారద ట్రాజెడీ బ్రాండ్‌ నుండి బయటకు వచ్చి దశాబ్దంపైగా సీరియస్‌ కేరెక్టర్స్‌ పోషించగలిగారు. 'ప్రేమసాగరం' డబ్బింగ్‌ సినిమా సంచలన విజయం సాధించి, ఉదయం ఆటలతో 450 రోజులు అనేక కేంద్రాలలో రిలీజ్‌ అయిన థియేటర్లలోనే ప్రదర్శితమైంది. అక్కడ నుండి తెలుగులోకి డబ్బింగ్‌ సినిమాల వెల్లువ ఆరంభమైంది. 'సాగరసంగమం' బెంగుళూరులో 511 రోజులు ఉదయం ఆటలతో ప్రదర్శితమైంది. ఈ యేడాది ఐదు డైరెక్టు శతదినోత్సవాలతో కృష్ణ కెరీర్‌లో రికార్డు నమోదు చేసింది. అక్కమొగుడు చెల్లెలి కాపురం అగ్నిజ్వాల అగ్నిసమాధి అడవి సింహాలు అభిలాష అమరజీవి అమాయక చక్రవర్తి అమాయకుడు కాదు అసాధ్యుడు ఆంధ్రకేసరి ఆడవాళ్ళే అలిగితే ఆనంద భైరవి ఆలయ శిఖరం ఇకనైనా మారండి ఇది పెళ్ళంటారా? ఇదికాదు ముగింపు ఇద్దరు కిలాడీలు ఈ దేశంలో ఒకరోజు ఈ పిల్లకు పెళ్ళవుతుందా ఊరంతా సంక్రాంతి ఎం.ఎల్.ఏ. ఏడుకొండలు కళ్యాణ వీణ కాంతయ్య - కనకయ్య కాలయముడు కిరాయి కోటిగాడు కీర్తి-కాంత-కనకం కుంకుమ తిలకం కొంటె కోడళ్ళు కోకిలమ్మ కోటికొక్కడు కోడలు కావాలి ఖైదీ గాజు బొమ్మలు గూఢచారి నెం. 1 గ్రహణం విడిచింది చండశాసనుడు చండి-చాముండి చండీరాణి చట్టానికి వేయి కళ్ళు చిలక జోస్యం డ్రైవర్ రాముడు తోడు-నీడ త్రివేణి సంగమం దుర్గాదేవి దేవి-శ్రీదేవి ధర్మపోరాటం ధర్మాత్ముడు నవోదయం నిజం చెబితే నేరమా నెలవంక నేటిభారతం పండంటి కాపురానికి 12 సూత్రాలు పల్లెటూరి పిడుగు పల్లెటూరి మొనగాడు పిచ్చిపంతులు పులిదెబ్బ పులి-బెబ్బులి పెళ్ళి చూపులు పెళ్ళిచేసి చూపిస్తాం పోరాటం పోలీసు వెంకటస్వామి ప్రజారాజ్యం ప్రజాశక్తి ప్రళయ గర్జన ప్రేమపిచ్చోళ్ళు బందిపోటు రుద్రమ్మ బలిదానం బహుదూరపు బాటసారి బెజవాడ బెబ్బులి బొబ్బిలి పులి భార్యాభర్తల సవాల్ మంత్రిగారి వియ్యంకుడు మగమహారాజు మనిషికో చరిత్ర మరో మాయాబజార్ మా ఇంటాయన కథ మాయగాడు మాయింటి ప్రేమాయణం మా ఇంటికి రండి ముందడుగు ముక్కుపుడక ముగ్గురమ్మాయిల మొగుడు ముద్దుల మొగుడు మూగవాని పగ మూడు ముళ్ళు మేఘ సందేశం రంగుల పులి రఘురాముడు రాకాసి లోయ రాజు-రాణి-జాకీ రాజ్‌కుమార్ రామరాజ్యంలో భీమరాజు రాముడు కాదు కృష్ణుడు రుద్రకాళి రెండుజెళ్ళ సీత రోషగాడు లంకె బిందెలు విముక్తికోసం శక్తి శివుడు శివుడు శివుడు శుభముహూర్తం శ్రీదత్త దర్శనము శ్రీరంగనీతులు సంఘర్షణ సాగరసంగమం సింహం నవ్వింది సింహపురి సింహం సిరిపురం మొనగాడు స్వరాజ్యం మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1984
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1984
thumb|అగ్నిగుండం ఈ యేడాది 113 చిత్రాలు వెలుగు చూశాయి. వినోదపు పన్ను వసూలుకు శ్లాబ్‌ సిస్టమ్‌ మార్చి 23 నుండి అమలయింది. రామకృష్ణా సినీస్టూడియోస్‌ వారి 'శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' మూడు సంవత్సరాలు సెన్సార్‌తో పోరాటం సాగించి, బయటకు వచ్చి సంచలన విజయం సాధించింది. బాలకృష్ణను స్టార్‌గా నిలబెట్టిన 'మంగమ్మగారి మనవడు' 565 రోజులు ప్రదర్శితమై అత్యధిక ప్రదర్శన రికార్డును నమోదు చేసింది. 'బొబ్బిలి బ్రహ్మన్న' కూడా సూపర్‌ హిట్‌గా నిలచింది. "కథానాయకుడు, ఇల్లాలు - ప్రియురాలు, ఛాలెంజ్‌, స్వాతి, శ్రీవారికి ప్రేమలేఖ, దొంగలు బాబోయ్‌ దొంగలు" శతదినోత్సవం జరుపుకోగా, "బావామరదళ్ళు, గూండా, ఆనందభైరవి, ఇంటిగుట్టు, ఇద్దరు దొంగలు, రారాజు, సితార" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. అగ్నిగుండం అనుబంధం అమ్మాయిలూ ప్రేమించండి ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు అదిగో అల్లదిగో ఈ తీర్పు ఇల్లాలిది ఎస్. పి. భయంకర్ కుటుంబ గౌరవం కాంచన గంగ కలలు కనే కళ్ళు కోడెత్రాచు కాయ్ రాజా కాయ్ కోటీశ్వరుడు కిరాయి అల్లుడు కురుక్షేత్రంలో సీత కథానాయకుడు గృహలక్ష్మి - 1938, 1967, 1984 మూడు సినిమాలు ఇదేపేరుతో వచ్చాయి. ఘరానా రౌడి చిటపట చినుకులు చదరంగం డిస్కో కింగ్ దేవుని రూపాలు దొంగలు బాబోయ్ దొంగలు దానవుడు నాగు నాయకులకు సవాల్ పల్నాటి పులి బంగారు కాపురం భారతంలో శంఖారావం భార్యామణి భాగ్యలక్ష్మి బొబ్బిలి బ్రహ్మన్న మెరుపుదాడి మానసవీణ మహానగరంలో మాయగాడు ముక్కోపి యమదూతలు రౌడీ రుస్తుం రాజమండ్రి రోమియో రచయిత్రి రైలు దోపిడి రోజులు మారాయి రావూ గోపాలరావు వసంత గీతం శ్రీమతి కావాలి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సంగీత సామ్రాట్ సంపూర్ణప్రేమాయణం సాహసమే జీవితం సీతాలు సీతమ్మ పెళ్ళి హీరో డాకూ (1984 సినిమా) శ్రీ సంతోషీమాత వ్రత మహాత్మ్యం మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1985
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1985
thumb|అగ్నిపర్వతం ఈ సంవత్సరం 107 సినిమాలు విడుదలయ్యాయి. ఉషాకిరణ్‌ మూవీస్‌ 'ప్రతిఘటన' సంచలన విజయం సాధించింది. "అగ్నిపర్వతం, అడవిదొంగ, మయూరి, మహారాజు, మాపల్లెలో గోపాలుడు, వజ్రాయుధం, విజేత" శతదినోత్సవాలు జరుపుకోగా, "అన్వేషణ, అమెరికా అల్లుడు, ఓ తండ్రి తీర్పు, చట్టంతో పోరాటం, దొంగ, పచ్చని కాపురం, పల్నాటి సింహం, భార్యాభర్తల బంధం, ముగ్గురు మిత్రులు, రేచుక్క" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. కొత్తగా వచ్చిన 3-డి టెక్నిక్‌తో రూపొందిన 'చిన్నారి చేతన' (మలయాళం నుండి అనువాదమై) విజయవిహారం చేసింది. అందరికంటే మొనగాడు అగ్గిరాజు అగ్నిపర్వతం అడవి దొంగ అనురాగ బంధం అన్వేషణ అపనిందలు ఆడవాళ్ళకేనా? అపరాధి అభిమన్యుడు అమెరికా అల్లుడు అల్లుళ్ళొస్తున్నారు అసాధ్యుడు ఆగ్రహం ఆడదాని సవాల్ ఆడపడచు ఆడపిల్లలే నయం ఆడపులి ఆత్మబలం ఆనందభైరవి ఆలయదీపం ఇంటికో రుద్రమ్మ ఇంటిగుట్టు ఇద్దరు దొంగలు ఇల్లాలికో పరీక్ష ఇల్లాలు ప్రియురాలు ఇల్లాలూ వర్ధిల్లు ఇల్లాలే దేవత ఈ చదువులు మాకొద్దు ఈ సమాజం మాకొద్దు ఉగ్రరూపం ఉద్ధండుడు ఊరికి సోగ్గాడు ఊహాసుందరి ఎదురులేని మొనగాళ్ళు ఏడడుగుల బంధం ఓ తండ్రి తీర్పు ఓటుకు విలువివ్వండి కంచుకవచం కంచుకాగడా కత్తుల కొండయ్య కళారంజని కళ్యాణ తిలకం కుటుంబ బంధం కుర్రచేష్టలు కొంగుముడి కొండవీటి నాగులు కొత్త దంపతులు కొత్తపెళ్ళి కూతురు కోటీశ్వరుడు ఖూనీ గుడిగంటలు మ్రోగాయి గూండా చట్టంతో పోరాటం చాలెంజ్ చిటపట చినుకులు చిరంజీవి జగన్ జడ గంటలు జనం మనం జనని జన్మభూమి జస్టిస్ చక్రవర్తి జాకీ జేమ్స్ బాండ్ 999 జై భేతాళ జ్వాల టెర్రర్ డేంజర్ లైట్ తాండవ కృష్ణుడు తిరుగుబాటు తెల్లగులాబి దర్జాదొంగ దాంపత్యం దేవాంతకుడు దేవాలయం దేశంలో దొంగలు పడ్డారు దొంగ దొంగల్లో దొర దోపిడి దొంగలు నటన నవమోహిని నిర్దోషి నేరస్తుడు న్యాయం మీరేచెప్పాలి పచ్చని కాపురం పట్టాభిషేకం పదండి ముందుకు పద్మవ్యూహం పల్నాటి సింహం పాతాళనాగు పారిపోయిన ఖైదీలు పుణ్యంకొద్దీ పురుషుడు పుత్తడిబొమ్మ పున్నమి రాత్రి పులి పులిజూదం పెళ్ళి మీకు అక్షింతలు నాకు ప్రచండ భైరవి ప్రళయ సింహం ప్రేమించు పెళ్ళాడు బంగారుచిలుక బందీ బాబాయ్ అబ్బాయ్ బాబులుగాడి దెబ్బ బావామరదళ్ళు బుల్లెట్ బెబ్బులివేట బ్రహ్మముడి భలే తమ్ముడు భలేరాముడు భార్యాభర్తల బంధం భోలా శంకరుడు మంగమ్మగారి మనవడు మంత్రదండం మయూరి మరో దేవత మరో మొనగాడు మహారాజు మహామనిషి మహాసంగ్రామం మాంగల్యబంధం మాంగల్యబలం మా పల్లెలో గోపాలుడు మాయదారి మరిది మాయలాడి మాయామోహిని మార్చండి మన చట్టాలు మిష్టర్ విజయ్ ముఖ్యమంత్రి ముగ్గురు మిత్రులు ముచ్చటగా ముగ్గురు ముద్దుల చెల్లెలు ముద్దుల మనవరాలు ముసుగు దొంగ మూడిళ్ళ ముచ్చట మేమూ మీలాంటి మనుషులమే మొగుడూ పెళ్ళాలూ యముడు యుద్ధం రంగుల కల రక్తసంబంధం రక్తసింధూరం రగిలే గుండెలు రణరంగం రామాయణంలో భాగవతం రారాజు రేచుక్క లంచావతారం వందేమాతరం వజ్రాయుధం వసంతగీతం వస్తాదు విజేత విషకన్య వీరభద్రుడు శిక్ష శ్రీకష్ణలీలలు శ్రీమతిగారు శ్రీవారి శోభనం శ్రీవారికి ప్రేమలేఖ శ్రీవారు శ్రీషిర్డీ సాయిబాబా మహత్యం సంచలనం సంతానం సజీవ మూర్తులు సర్దార్ సితార సుందరీ సుబ్బారావు సువర్ణసుందరి సూర్యచంద్ర స్వాతి మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1986
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1986
thumb|కిరాతకుడు ఈ ఏడాది 118 చిత్రాలు విడుదలయ్యాయి. పూర్ణోదయా వారి 'స్వాతిముత్యం' సూపర్‌ హిట్టయింది. 'ముద్దుల కృష్ణయ్య' ఆరంభంలో ఆపసోపాలు పడ్డా, తరువాత సూపర్‌హిట్‌గా నిలిచి, 365 రోజులు ప్రదర్శితమైంది. తొలి 70 యమ్‌.యమ్‌. చిత్రం 'సింహాసనం' కృష్ణను దర్శకునిగా పరిచయం చేసి, శతదినోత్సవాలు జరుపుకుంది. "అనసూయమ్మగారి అల్లుడు, కలియుగ పాండవులు, ప్రతిధ్వని, మన్నెంలో మొనగాడు, రాక్షసుడు, లేడీస్‌ టైలర్‌, విక్రమ్‌, సీతారామకళ్యాణం, తలంబ్రాలు" శతదినోత్సవాలు జరుపుకోగా, "అడవిరాజా, అపూర్వ సహోదరులు, అరుణకిరణం, ఆడపడచు, ఆదిదంపతులు, ఒకరాధ- ఇద్దరుకృష్ణులు, కలియుగ కృష్ణుడు, కొండవీటి రాజా, ఖైదీ రుద్రయ్య, తాండ్రపాపారాయుడు, దేశోద్ధారకుడు, పుణ్యస్త్రీ, బంధం, బ్రహ్మరుద్రులు, రెండురెళ్ళు ఆరు, శ్రావణసంధ్య" తెలుగు సినీ గీతాలకి కొత్త నడకలు నేర్పి ఒక కొత్త శకానికి నాంది పలికిన 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి గారి పరిచయం "సిరివెన్నెల" చిత్రం ద్వారా జరిగింది. కిరాతకుడు కృష్ణగారడి శ్రావణసంధ్య భలేమిత్రులు నాగదేవత డ్రైవర్ బాబు రెండురెళ్ళు ఆరు ఉక్కుమనిషి శ్రీదత్త దర్శనం నాంపల్లి నాగు స్రవంతి మాకూ స్వాతంత్ర్యం కావాలి కొండవీటిరాజా మావారి గోల నిప్పులాంటి ఆడది పట్నంపిల్ల పల్లెటూరిచిన్నోడు ఆక్రందన బ్రహ్మాస్త్రం కుట్ర లేడీ జేమ్స్ బాండ్ మోహినీ శపథం ముద్దుల కృష్ణయ్య మగధీరుడు స్వాతిముత్యం ఇదే నా సమాధానం ప్రతిధ్వని సింహాసనం ఖైదీరాణి మల్లెమొగ్గలు మిష్టర్ భరత్ మనోశక్తి కాష్మోరా మంచి మనసులు జయం మనదే జీవనపోరాటం సీతారామ కళ్యాణం నిరీక్షణ హాస్యాభిషేకం పవిత్ర దాగుడు మూతలు కొంటె కాపురం ఇదేనా న్యాయం ఆలాపన ప్రతిభావంతుడు మానవుడు దానవుడు వేట విక్రమ్ ఖైదీ రుద్రయ్య జీవనరాగం సిరివెన్నెల కోటిగాడు సంసారం ఒక సంగీతం ఆది దంపతులు ఇద్దరు మిత్రులు (సినిమా), 1986 రావణబ్రహ్మ అనసూయమ్మగారి అల్లుడు డాకూరాణి కర్పూరదీపం సమాజంలో స్త్రీ కిరాయి మొగుడు కారుదిద్దిన కాపురం అత్తగారూ స్వాగతం బంధం అరుణకిరణం నేటి యుగధర్మం దేశోద్ధారకుడు శ్రీ వేమన చరిత్ర లవ్ మాస్టర్ కలియుగ పాండవులు చంటబ్బాయ్ ధర్మపీఠం దద్దరిల్లింది కృష్ణపరమాత్మ కెప్టెన్ నాగార్జున ఆడపడుచు రేపటిపౌరులు నా పిలుపే ప్రభంజనం శ్రావణ మేఘాలు కలియుగ కృష్ణుడు మారుతి ఉగ్రనరసింహం మన్నెంలో మొనగాడు వేటగాళ్ళు రాక్షసుడు పోలీస్ ఆఫీసర్ పదహారేళ్ళ అమ్మాయి ఒకరాధ ఇద్దరు కృష్ణులు తాండ్ర పాపారాయుడు తలంబ్రాలు చల్లని రామయ్య చక్కని సీతమ్మ విజృంభణ పరశురాముడు దొరబిడ్డ అడవిరాజా శ్రీమతికానుక అర్థరాత్రి స్వతంత్రం పసుపుతాడు చాదస్తపు మొగుడు ఈ ప్రశ్నకు బదులేది? బ్రహ్మరుద్రులు అష్టలక్ష్మీవైభవం ఇల్లాలి ప్రతిజ్ఞ సక్కనోడు కౌబాయ్ నెం. 1 మామా కోడలు సవాల్ ధైర్యవంతుడు కోనసీమ కుర్రోడు హెచ్చరిక పరాజిత శాంతినివాసం లేడీస్ టైలర్ వివాహబంధం భయం భయం జైలుపక్షి చాణక్యశపథం పూజకు పనికిరాని పువ్వు గురుబ్రహ్మ మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
ఏప్రిల్ 6
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_6
ఏప్రిల్ 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 96వ రోజు (లీపు సంవత్సరములో 97వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 269 రోజులు మిగిలినవి. సంఘటనలు thumb|ఉప్పు సత్యాగ్రహం 1896: 1,500 సంవత్సరాల అనంతరం ఏథెన్స్ లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి. 1909: భౌగోళిక ఉత్తర ధ్రువాన్ని మొట్టమొదటి సారిగా రాబర్ట్ పియరీ అనే అమెరికన్ సాహసయాత్రికుడు చేరుకున్నాడు. 1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు చట్టం ఉల్లంఘన జరిగింది. మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధిగాంచింది జననాలు 1773: జేమ్స్ మిల్, స్కాట్లాండ్ కు చెందిన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి సిద్దాంతకర్త, తత్వవేత్త. (మ.1836) 1886: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు చివరి నిజాం. (మ.1967) 1922: శ్రీభాష్యం అప్పలాచార్యులు, వక్త, సాహితీ వ్యాఖ్యాత. 1928: జేమ్స్ వాట్సన్, DNAను కనుగొన్న శాస్త్రవేత్త. 1931: నల్లమల గిరిప్రసాద్, కమ్యూనిస్టు నేత. (మ.1997) 1954: ఆడారి వెంకటరమణ (దీపశిఖ), కథా రచయిత. 1956: దిలీప్ వెంగ్‌సర్కార్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1964: డేవిడ్ వుడార్డ్, అమెరికన్ రచయిత, సంగీతకారు. 1975: వీరభద్రం చౌదరి, తెలుగు చలనచిత్ర దర్శకుడు. 1994: వర్షిణి , భారతీయ చలనచిత్ర నటి. మరణాలు 1989: పన్నాలాల్ పటేల్, గుజరాతీ భాషా రచయిత. 1992: ఐజాక్ అసిమోవ్, అమెరికన్ రచయిత, బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (జ.1920) 2002: భవనం వెంకట్రామ్, ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబరు 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు 2011: సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (జ.1952) పండుగలు , జాతీయ దినాలు - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 6. ఏప్రిల్ 5 - ఏప్రిల్ 7 - మార్చి 6 - మే 6 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 7
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_7
ఏప్రిల్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 97వ రోజు (లీపు సంవత్సరములో 98వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 268 రోజులు మిగిలినవి. సంఘటనలు 1927 : మొదటి దూర ప్రజా టెలివిజన్ ప్రసారం ప్రారంభం (వాషింగ్టన్ డి.సి నుండి న్యూయార్క్ వరకు) 1948 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడింది. 1994 : గాట్ తుది ఒప్పందంపై 125 దేశాలు సంతకాలు చేశాయి. జననాలు thumb|పండిట్ రవిశంకర్ 1894: గడియారం వేంకట శేషశాస్త్రి, పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే 'శ్రీశివభారతం' 1920: రవిశంకర్, భారతీయ సంగీత విద్వాంసుడు. (మ. 2012) 1925: కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (మ.2012) 1935: ఎస్. పి . ముత్తురామన్ , తెలుగు, తమిళ, చిత్ర దర్శకుడు. 1939: రియాజ్ అహ్మద్, మాజీ వాలీబాల్ ఆటగాడు. (మ. 2023) 1942: జితేంద్ర, భారత చలనచిత్ర నటుడు. 1962: రాం గోపాల్ వర్మ, చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. 1962: కోవై సరళ, తెలుగు, తమిళ సినీ నటి. మరణాలు 1823: జాక్వెబ్ ఛార్లెస్, ప్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. (జ. 1746) 1857: మంగళ్ పాండే, బ్రిటీష్ ఉరితీసి, దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు. 1991: కొండవీటి వెంకటకవి, కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (జ.1918) 2002: భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1931) 2007: నార్ల తాతారావు, విద్యుత్తు రంగ నిపుణుడు. (జ.1917) 2010: భమిడిపాటి రామగోపాలం, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (జ. 1932) 2017: గణపతి స్థపతి, స్థపతి, వాస్తు శిల్పి. (జ.1931) 2019: బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి రంగస్థల నటుడు. స్త్రీ పాత్రలద్వారా పేరుగడించాడు. (జ.1936) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 7. ఏప్రిల్ 6 - ఏప్రిల్ 8 - మార్చి 7 - మే 7 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 8
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_8
ఏప్రిల్ 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 98వ రోజు (లీపు సంవత్సరములో 99వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 267 రోజులు మిగిలినవి. సంఘటనలు 1929 : 1929 ఏప్రిల్ 8 తారీకున ప్రజారక్షణ, వ్యాపార వివాదల చట్టాల ఆమోదానికి నిరసనగా భగత్ సింగ్, బతుకేస్వర్ దత్ కేంద్రీయ విధాన సభ లోకి బాంబులు విసిరారు. 1950 : భారత్, పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడికపై సంతకాలు చేశాయి. 1985 : భోపాల్ దుర్ఘటన: సుమారు 2000 మంది మరణం, 200000మంది గాయపడటంపై భారతదేశం యూనియన్ కార్బైడ్ సంస్థపై సూట్ దాఖలు చేసింది. జననాలు thumb|Kofi Annan 1846: దాసు శ్రీరాములు, కవి, పండితులు, ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎందరో స్త్రీలకు నేర్పించారు 1904: జాన్ రిచర్డ్ హిక్స్, ఆర్థికవేత్త . 1924: కుమార్ గంధర్వ, సంగీత విద్వాంసుడు. హిందుస్తానీ సంగీతంలో ఏ ఘరానాకు లోబడకుండా, ఒక ప్రత్యేక, వినూత్న శైలిలో ఆలపించే గాయకుడు. (మ.1992) 1938: కోఫీ అన్నన్, ఐక్యరాజ్య సమితి యొక్క మాజీ ప్రధాన కార్యదర్శి 1956: కె. జయరామన్, కేరళకు చెందిన భారతీయ క్రికెటర్. (మ. 2023) 1981: అనురాధ మెహతా , భారతీయ సినీ నటి,మోడల్ . 1983: అల్లు అర్జున్, తెలుగు సినిమా నటుడు. 1984: అనంత శ్రీరామ్, 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాశాడు. అందరివాడు సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది. 1988: నిత్యా మీనన్, భారతీయ సినీ నటి, గాయని. 1994: అక్కినేని అఖిల్ , తెలుగు సినీ నటుడు మరణాలు 1857: మంగళ్ పాండే, సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు. (జ.1827) 1894: బంకించంద్ర ఛటర్జీ, వందేమాతరం గీత రచయిత. (జ.1838). 1977: శంకరంబాడి సుందరాచారి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత. (జ.1914) 2000: వేములపల్లి శ్రీకృష్ణ, కమ్యూనిష్టు నేత, శాసనసభ్యులు, కవి. వీరు "చేయెత్తి జైకొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు 2013: మార్గరెట్ థాచర్, బ్రిటన్ తొలి మహిళా ప్రధాని. పండుగలు , జాతీయ దినాలు నేషనల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 8. ఏప్రిల్ 7 - ఏప్రిల్ 9 - మార్చి 8 - మే 8 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 9
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_9
ఏప్రిల్ 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 99వ రోజు (లీపు సంవత్సరములో 100వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 266 రోజులు మిగిలినవి. సంఘటనలు 1860 : మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా) 2011 :అన్నా హజారేకు అవినీతి పై వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గానూ ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారంగా ఒక కోటి రూపాయలు యిచ్చుటకు ప్రకటించారు. జననాలు 1770: థామస్ సీబెక్, జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1831) 1893: రాహుల్ సాంకృత్యాయన్, రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు (మ. 1963) 1930: మన్నవ బాలయ్య, 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాడు. 1948: జయ బచ్చన్, హింది నటి,, అమితాబ్ బచ్చన్ భార్య. 1974: జెన్నా జేమ్సన్, ప్రపంచ పేరొందిన శృంగార తార. మరణాలు 1989: ఏ.ఎం.రాజా, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. (జ. 1929) 1994: చండ్ర రాజేశ్వరరావు, కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. (జ. 1915) 2014: ఆలె నరేంద్ర, రాజకీయనాయకుడు. (జ. 1946) 2015: నర్రా రాఘవ రెడ్డి, కమ్యూనిస్టు యోధుడు, ఆరుసార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధి. (జ.1924) 2020: కావేటి సమ్మయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1952) 2022: మన్నవ బాలయ్య , తెలుగు చలన చిత్ర నటుడు, రచయిత, నిర్మాత ,దర్శకుడు,(జ.1930) పండుగలు , జాతీయ దినాలు బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 9. ఏప్రిల్ 8 - ఏప్రిల్ 10 - మార్చి 9 - మే 9 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 10
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_10
ఏప్రిల్ 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 100వ రోజు (లీపు సంవత్సరములో 101వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 265 రోజులు మిగిలినవి. సంఘటనలు 1953 : వార్నెర్ బ్రదర్స్ సృష్టించిన మొదటి 3-D చిత్రం అమెరికన్ స్టుడియోలో ప్రదర్శింపబడింది. ఆచిత్రం పేరు House of Wax. జననాలు 1880 : సి.వై.చింతామణి, పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరుపొందిన ప్రసిద్ధ పాత్రికేయుడు, ఉదారవాద రాజకీయ నాయకుడు (మ.1941). 1894: ఘనశ్యాం దాస్ బిర్లా, భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని (మ. 1983). 1898: దశిక సూర్యప్రకాశరావు,స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. 1932: ఒమర్ షరీఫ్, హాలీవుడ్ నటుడు. ఈజిప్ట్ దేశం లోని అలెగాండ్రియాలో పుట్టాడు. ఇతడి అసలు పేరు 'మైకేల్ షాలౌబ్' (మ.2015). 1941: మణి శంకర్ అయ్యర్, ఒక మాజీ భారత దౌత్యవేత్త. 1952: స్టీవెన్ సీగల్, అమెరికా యాక్షన్ చలన చిత్ర నటుడు, నిర్మాత, రచయిత, యుద్ధ కళాకారుడు, గిటారు వాద్యకారుడు 1952: నారాయణ్‌ రాణె, మహారాష్ట్రకు మాజీ ముఖ్యమంత్రి. 1986: దీపు ,సంగీత కారుడు. 1986: అయేషా తకిట , మోడల్, సినీనటి మరణాలు thumb|Morarji Desai (portrait) 1995: మొరార్జీ దేశాయి, భారత మాజీ ప్రధాన మంత్రి. (జ.1896). 1997: మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పాత్ర పోషించారు (జ.1920) 1998: విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (జ.1914) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ హోమియోపతి దినోత్సవం. అంతర్జాతీయ తోబుట్టువుల రోజు. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 10. ఏప్రిల్ 9 - ఏప్రిల్ 11 - మార్చి 10 - మే 10 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 11
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_11
ఏప్రిల్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 101వ రోజు (లీపు సంవత్సరములో 102వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 264 రోజులు మిగిలినవి. సంఘటనలు 2016 : ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు భారతదేశంలో ప్రారంభించబడింది. 1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది. జననాలు 1827: జ్యోతీరావు పూలే, సంఘ సంస్కర్త జననం. (మ. 1890) 1869: కస్తూరిబాయి గాంధీ, భారత స్వాతంత్ర్యోద్యమ కర్త, మహాత్మా గాంధీ సతీమణి. (మ. 1944) 1904: కుందన్ లాల్ సైగల్, భారత గాయకుడు,, నటుడు. (మ. 1947) 1991: పూనం పాండే, భారతీయ మోడల్, సినిమా నటి మరణాలు 1890: జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (జ. 1862). 2010: పైల వాసుదేవరావు, శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు. (జ.1932) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవం జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 11. ఏప్రిల్ 10 - ఏప్రిల్ 12 - మార్చి 11 - మే 11 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 12
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_12
ఏప్రిల్ 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 102వ రోజు (లీపు సంవత్సరములో 103వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 263 రోజులు మిగిలినవి. సంఘటనలు 1961 : రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరీ గగారిన్ Vostok 3KA-2 (Vostok 1) ఉపగ్రహంలో ప్రయాణించి మొట్టమొదట అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మానవునిగా నిలిచాడు. 1981 : ప్రపంఛపు మొట్టమొదట స్పేస్ షటిల్ (అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రాగల వ్యొమనౌక) "కొలంబియా"ను అమెరికా విజయవంతంగా ప్రయొగించింది. 2009 : థాయిలాండ్ లోని పట్టాయ నగరంలో ఆసియాన్ దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైనది. 2010 : లూధియానా, పంజాబ్, లో గల గురునానక్ స్టేడియంలో భారతీయ కబడ్డీ జట్తు పాకిస్థాన్ జట్టును 58-24 తేడాతో ఓడించి ప్రప్రథమంగా ప్రపంచ కప్ కబడ్డీ పోటీలను గెలుచుకుంది. జననాలు 599 BC: వర్థమాన మహావీరుడు, జైన మతం స్థాపకుడు. 24 వ తీర్థంకరుడు. (మ. 527 BC) 1854 : ఎస్.పి.నరసింహులు నాయుడు తమిళనాడుకు చెందిన భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు, సమాజసేవకుడు, ప్రచురణకర్త. 1879: కోపల్లె హనుమంతరావు, జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (మ.1922) 1917: వినూమన్కడ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (మ.1978) 1925: అట్లూరి పిచ్చేశ్వర రావు, కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త. (మ.1966) 1936: అమరపు సత్యనారాయణ, నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (మ.2011) 1938: జ్వాలాముఖి, రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. (మ.2008) 1991: ముక్కాని సాంసన్, సింగీతం గ్రామనివాసి, 1997: ఆకాష్ పూరీ, తెలుగు చలనచిత్ర నటుడు. మరణాలు 1940: భోగరాజు నారాయణమూర్తి, నవలా రచయిత, నాటక కర్త. (జ.1891) 1945: ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్డ్, అమెరికా 32 వ అధ్యక్షుడు . (జ. 1882) 1962: మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశపు ఇంజనీరు. (జ.1861) 1989: ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత. (జ.1938) 1992: మాకినేని బసవపున్నయ్య, మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. (జ.1914) 2006: రాజ్‌కుమార్, భారత చలనచిత్ర నటుడు, గాయకుడు. (జ.1929) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం (ప్రపంచ రోదసీ దినోత్సవం). బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 12. ఏప్రిల్ 11 - ఏప్రిల్ 13 - మార్చి 12 - మే 12 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 13
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_13
ఏప్రిల్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 103వ రోజు (లీపు సంవత్సరములో 104వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 262 రోజులు మిగిలినవి. సంఘటనలు 1796 : భారతదేశం నుండి పంపిన ఏనుగు అమెరికా చేరినది. అంతవరకు అమెరికా వాళ్ళు ఏనుగును చూచి ఎరుగరు. 1919 :పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్లో సమావేశమైన భారతీయ ఉద్యమ కారులపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు. ఈ సంఘటలనలో సుమారు379 మంది మరణించారు. 1200 మంది గాయపడ్డారు. జననాలు 1743: థామస్ జెఫర్‌సన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల మూడవ అధ్యక్షుడు. (మ.1826) 1905: న్యాయపతి రాఘవరావు, రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (మ.1984) 1908: బుర్రా కమలాదేవి, ప్రాచీనాంధ్ర, ఆంగ్ల సాహిత్యాలతో పరిచయం ఉంది. ఆమె రచించిన ఛందోహంసి పోస్ట్ గ్రాడ్యేట్ స్టడీస్, ఉభయ బాషాప్రవీణ వారికి పాఠ్యగ్రంథంగా ఎన్నుకోబడింది 1939: సీమస్ హీనీ, ఐరిష్ కవి, నాటక రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.2013) 1914: విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తిలోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (మ.1998) మరణాలు 1999: షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు. (జ.1924) 1999: దుద్దిల్ల శ్రీపాద రావు, శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు. (జ.1935) 2005: పొందూరి వెంకట రమణారావు, మైక్రో బయాలజిస్టు. (జ.1917) 2007: ధూళిపాళ సీతారామశాస్త్రి, రంగస్థల, సినిమా నటుడు. (జ.1921) 2007: వాసిరెడ్డి సీతాదేవి, రచయిత్రి. (జ.1933) పండుగలు , జాతీయ దినాలు జలియన్ వాలా బాగ్ సంస్మరణ దినోత్సవం. మూలాలు బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 13 . ఏప్రిల్ 12 - ఏప్రిల్ 14 - మార్చి 13 - మే 13 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 14
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_14
ఏప్రిల్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 104వ రోజు (లీపు సంవత్సరములో 105వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 261 రోజులు మిగిలినవి. సంఘటనలు 1699 : నానాక్షాహీ కెలండర్ ప్రకారం సిక్కు మతం ఖల్సాగా గురుగోవింద్ సింగ్ ద్వారా ప్రారంభింపబడింది. 1912: టైటానిక్ ఓడ మునిగిపోయింది. 1981: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం. 2010: చైనాలోని కిఘై ప్రావిన్సులో భారీ భూకంపం సంభవించి 400 మంది మరణించారు. 2018: ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని 2018-19 సంవత్సర బడ్జెట్‌లో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ప్రకటించారు. 2023: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనంలో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరించాడు. జననాలు thumb|Young Ambedkar 1629: క్రిస్టియన్ హైగన్స్, డచ్ గణిత శాస్త్రవేత్త. (మ. 1695) 1872: అబ్దుల్ యూసుఫ్ ఆలీ, భారత-ఇస్లామిక్ స్కాలర్,, అనువాదకుడు (మ. 1953) 1891: డా. బి.ఆర్. అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత (మ. 1956) 1892: గొబ్బూరి వెంకటానంద రాఘవరావు, తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత, జ్యోతిర్వేదమును, ఆంగ్ర గ్రంథాన్ని తెలుగు విశ్వవిద్యాలయం వారు పరిష్కరించి పునర్ముద్రించారు. 1939: గొల్లపూడి మారుతీరావు, రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు 1968: బాబు గోగినేని, హైదరాబాదుకు చెందిన హేతువాది మానవతా వాది. 1942: మార్గరెట్ అల్వా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ గవర్నర్. 1953: కొమరవోలు శ్రీనివాసరావు, రంగస్ధల, టివి, రేడియో నటుడు. 1972: కునాల్ గంజ్వాల, భారతీయ సినిమా నేపథ్య గాయకుడు. 1975: రాజేశ్వరీ సచ్‌దేవ్, భారత సినీనటి. 1976: వరికుప్పల యాదగిరి, రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు 1981: అనిత: తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల నటి, మోడల్. మరణాలు 1950: శ్రీ రమణ మహర్షి, భారత తత్వవేత్త. (మ.1879) 1930: ప్రతివాది భయంకర శ్రీనివాస్, చలనచిత్ర నేపథ్యగాయకుడు. (జ.1930) 1963: రాహుల్ సాంకృత్యాయన్, రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు (జ.1893) 2011: రామిరెడ్డి(అంకుశం రామిరెడ్డి) దక్షిణ భారత చలన చిత్రాల ప్రతినాయకుడు. 2018: ఘంటా గోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (జ.1932) పండుగలు , జాతీయ దినాలు జాతీయ అగ్నిమాపక దినోత్సవం. అంబేద్కర్ జయంతి. మహిళా పొదుపు దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 14 . ఏప్రిల్ 13 - ఏప్రిల్ 15 - మార్చి 14 - మే 14 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 15
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_15
ఏప్రిల్ 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 105వ రోజు (లీపు సంవత్సరములో 106వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 260 రోజులు మిగిలినవి. సంఘటనలు 1925: గోదావరి జిల్లా ను, కృష్ణా జిల్లాను విడదీసి, 15 ఏప్రిల్ 1925 తేదిన, పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. అప్పటినుండి, గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన తరువాత, తూర్పు గోదావరి జిల్లాగా పేరు మార్చుకొంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా ఏర్పడింది.విశాఖపట్నం జిల్లా నుంచి, శ్రీకాకుళం జిల్లా 1950 ఆగస్టు 15 నాడు ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది. చూడు: తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ వెబ్‌సైటు 1925:బ్రిటిష్‌ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1794లో కాకినాడ, రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. 1904లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరిగా మారింది) . తరువాత 1942లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు. చూడు: పశ్చిమ గోదావరి జిల్లా చూడు: మార్చి 1 2018: సీ పి యస్ విధానానికి నిరసనతెలుపుటకై తెలంగాణా ఉపాధ్యాయ, ఉద్యోగులు 103 సంఘాల వారు హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కుటుంబాలతో జనజాతర కార్యక్రమాన్ని ఉవ్వెత్తున నిర్వహించారు. జననాలు thumb|లియొనార్డో డావిన్సి] 1452: లియొనార్డో డావిన్సి, గణితజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు. 1469: గురునానక్, భారత ఆధ్యాత్మిక గురువు, సిక్కుమత స్థాపకుడు (మ. 1539) 1707: లియొనార్డ్ ఆయిలర్, స్విష్ గణిత శాస్త్రవేత్త. (మ. 1783) 1806: అలెక్సాండర్ డఫ్, స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. (మ.1878) 1913: కరీముల్లా షా, ముస్లిం సూఫీ, పండితుడు. (జ. 1838) 1932: సుదర్శన్ భట్, మరాఠీ కవి (మ. 2003) 1977: సుదర్శన్ పట్నాయక్, భారత సైకత శిల్పి. మరణాలు 1845: మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (మ.1845) 1865 : అబ్రహం లింకన్, అమెరికా 16 వ అధ్యక్షుడు. (జ.1809) 1961: రాచాబత్తుని సూర్యనారాయణ, సాతంత్ర్యసమయోధుడు. (జ.1903) 1965: బండారు రామస్వామి, నాట్య కళాకారులు, బంధిఖానా, భక్త రామదాసు, కర్ణుని స్వామిభక్తి, దమయంతి మొదలైన ఏకపాత్రాభినయం రచనలను నిర్వహించారు. 2022: జీ.వి. శ్రీరామరెడ్డి, కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. (జ.1945) పండుగలు , జాతీయ దినాలు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం. ప్రపంచ కళా దినోత్సవం సాంస్కృతిక సార్వత్రిక దినోత్సవం. సూచికలు బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 15 . ఏప్రిల్ 14 - ఏప్రిల్ 16 - మార్చి 15 - మే 15 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 16
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_16
ఏప్రిల్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 106వ రోజు (లీపు సంవత్సరములో 107వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 259 రోజులు మిగిలినవి. సంఘటనలు 1919 : అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒకరోజు "ప్రార్థన , ఉపవాసం" నిర్వహించాడు. 2001 : భారత్, బంగ్లాదేశ్ లు ఐదు రోజులపాటు వాటి సరిహద్దు వివాదం పై చర్చించాయి. అయినా పరిష్కరించుకోలేకపోయాయి. జననాలు 1813: స్వాతి తిరునాళ్ కేరళలోని తిరువాన్కూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (మ.1846) 1848: కందుకూరి వీరేశలింగం పంతులు, సంఘసంస్కర్త. (మ.1919) 1889: చార్లీ చాప్లిన్, హాస్యనటుడు. (మ.1939) 1910: ఎన్.ఎస్.కృష్ణమూర్తి, సాహిత్య, కళా విమర్శకుడు, సామాజికశాస్త్ర పండితుడు. 1914: కె.హెచ్‌. ఆరా, చిత్రకారుడు (మ. 1985) 1922: డి.యోగానంద్, సినీ దర్శకుడు (మ.2006) 1951: ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (మ.2015) 1970: జె.డీ.చక్రవర్తి , నటుడు, దర్శకుడు. 1971: సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (మ.1995) 1978: లారా దత్తా, భారత చలనచిత్ర నటి, మోడల్, 2000 సంవత్సరం మిస్ యూనివర్స్. 1990: ప్రియా బెనర్జీ, భారతీయ సినీ నటీ, మోడల్ మరణాలు 1946: బళ్ళారి రాఘవ, న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (జ.1880) పండుగలు , జాతీయ దినాలు తెలుగు నాటకరంగ దినోత్సవం - ప్రారంభాలు 1853 : బ్రిటీష్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైలు భారత దేశములో ప్రారంభించబడింది. మొదటి ప్రయాణీకుల రైలు బోరి బందర్, బొంబాయి నుండి థానే వరకు ప్రారంభించబడింది. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 16. ఏప్రిల్ 15 - ఏప్రిల్ 17 - మార్చి 16 - మే 16 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 17
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_17
ఏప్రిల్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 107వ రోజు (లీపు సంవత్సరములో 108వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 258 రోజులు మిగిలినవి. సంఘటనలు 1962: లోక్‌సభ స్పీకర్‌గా సర్దార్ హుకుం సింగ్ పదవి స్వీకరించాడు. 1964: వాయుమార్గం ద్వారా భూగోళాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళ జెర్రీ మాక్. జననాలు 1756: ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. (మ. 1805) 1897: నిసర్గదత్తా మహరాజ్, భారత అద్వైత వేదాంత ఆధ్యాత్మిక గురువు. (మ. 1981) 1915: సిరిమావో బండారునాయకే, శ్రీలంక రాజకీయవేత్త, ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి. (మ. 2000) 1947: జె. గీతారెడ్డి, భారీ పరిశ్రమల శాఖ, చక్కెర, వాణిజ్యం, ఎగుమతులు శాఖల మంత్రి. ఇదివరలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు 1950: రజితమూర్తి. సిహెచ్, రంగస్థల, టీవి నటుడు. 1966: విక్రం, తమిళ సినిమా హీరో. 1972: ఇంద్రగంటి మోహన కృష్ణ, తెలుగు సినిమా దర్శకుడు. 1979: సిద్ధార్థ్ నారాయణ్, భారత నటుడు. 1989: సునయన, భారత సినీ నటి. 1994: నైనా గంగూలీ, బెంగాలీ, హిందీ, తెలుగు చిత్రాల నటి. 1999: వాడుకరి:ARUVA RAMATEJA విద్యార్థి నాయకుడు. *1979 బందెల సుభాష్, రాష్ట్రీయ స్వయంసేవక్ స్వచ్ఛంద కార్యకర్త, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరణాలు thumb|Photograph of Sarvepalli Radhakrishnan presented to First Lady Jacqueline Kennedy in 1962 1790: బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా విప్లవంలో పాల్గొని అమెరికా దేశాన్ని, రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో ఒకరు. (జ.1706) 1942: జీన్ పెర్రిన్, ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1870) 1968: నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (జ.1896) 1975: సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. (జ.1888) 2004: సౌందర్య, సినీనటి. (జ.1972) 2012: నిత్యానంద మహాపాత్రా, భారత రాజకీయవేత్త, కవి, జర్నలిస్టు (జ. 1912) 2013: వి. ఎస్. రమాదేవి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (జ.1934) 2017: దేవినేని నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి. (జ.1954) 2017: నారాయణ సన్యాల్ భారతదేశంలో నక్సలైట్‌ ఉద్యమాన్ని ప్రారంభించిన తొలితరం నాయకుడు. పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ హీమోఫీలియో దినం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 17 . ఏప్రిల్ 16 - ఏప్రిల్ 18 - మార్చి 17 - మే 17 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 18
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_18
ఏప్రిల్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 108వ రోజు (లీపు సంవత్సరములో 109వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 257 రోజులు మిగిలినవి. సంఘటనలు 1930 : భారత స్వాతంత్ర్యోద్యమము: 1930 ఏప్రిల్ 18 తారీకున సూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి మందుగుండు, ఆయుధాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సమాచార వ్వవస్థను విచ్ఛిన్నం చేసి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పరుచుటకై చిట్టగాంగ్ లోని ఆయుధాగారాన్ని ముట్టడించారు. 1923: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది. జననాలు 1774: సవాయ్ మాధవ రావ్ II నారాయణ్ మరాఠా సామ్రాజ్యంలో 14వ పేష్వా (మ.1795). 1809: అధ్యాపకుడు, పండితుడు, కవి హెన్రీ డెరోజియో జననం (మ.1831). 1880: టేకుమళ్ళ అచ్యుతరావు, విమర్శకులు, పండితులు. (మ.1947) 1938: అత్తిలి కృష్ణారావు, వీధి నాటక రచయిత. (మ.1998) 1958: మాల్కం మార్షల్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1973; సౌమ్యరావు, నేపథ్య గాయని 1980: అనూప్ రూబెన్స్,సంగీత దర్శకుడు. 1989: సునయన, దక్షిణ భారత చలన చిత్ర నటి, మోడల్. 2012: కందిక వర్షిత్, నెక్కొండ(గ్రామం&మండలం), వరంగల్ రూరల్, తెలంగాణ. మరణాలు 1859: తాంతియా తోపే, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (జ. 1814) 1955: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, శాస్త్రవేత్త. (జ. 1879) 1974: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (జ. 1908) 2015: శ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు. (జ. 1966) 2016: దండి భాస్కర్ సీ పి ఐ రాష్ట్ర కార్యదర్శి, వార్తా దినపత్రిక జర్నలిస్ట్. పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం) బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 18 . ఏప్రిల్ 17 - ఏప్రిల్ 19 - మార్చి 18 - మే 18 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 19
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_19
ఏప్రిల్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 109వ రోజు (లీపు సంవత్సరములో 110వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 256 రోజులు మిగిలినవి. సంఘటనలు 1971 : మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రయోగం. 1975 : భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించారు. 2009: భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. జననాలు right|thumb|కె.విశ్వనాథ్ 1856: అన్నా సారా కుగ్లర్, భారతదేశంలో 47 సంవత్సరాలపాటు వైద్యసేవలను అందించిన మొట్టమొదటి అమెరికన్ వైద్య మిషనరీ. (మ.1930) 1912: గ్లెన్న్ సీబోర్గ్, అమెరికా రసాయన శాస్త్రవేత్త,నోబెల్ బహుమతి గ్రహీత. (మ. 1999) 1921: నాగభూషణం, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1995) 1930: కె.విశ్వనాథ్, తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి. 1956: వై. ఎస్. విజయమ్మ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు. పులివెందుల శాసనసభకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతిధ్యం వహిస్తున్నారు. 1956: ముకేష్ రిషి, హిందీ, తెలుగు, పంజాబీ, తమిళ కన్నడ,మలయాళ చిత్రాల ప్రతి నాయకుడు, సహాయ నటుడు. 1957: ముకేష్ అంబానీ, రిలయన్స్ కంపెనీ అధినేత. 1957: రాసాని వెంకట్రామయ్య, కథ, నవల, నాటక రచయిత, విమర్శకుడు. 1987: స్వాతి రెడ్డి , నటి, గాయకురాలు. 1990: ఈషా రెబ్బ, తెలుగు సినీ నటి. మరణాలు 1719: ఫర్రుక్‌సియార్, 9వ మొఘల్ చక్రవర్తి (జ.1685) 1882: చార్లెస్ డార్విన్, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (జ.1809) 1906: పియరీ క్యూరీ, ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ. 1859) 1969: గిడుగు వేంకట సీతాపతి, ప్రసిద్ధ భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. (జ.1885) 2006: సర్దార్ గౌతు లచ్చన్న, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర మంత్రి, ప్రసిద్ధి స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1909) 2022: తాతినేని రామారావు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1938) పండుగలు , జాతీయ దినాలు - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 19 . ఏప్రిల్ 18 - ఏప్రిల్ 20 - మార్చి 19 - మే 19 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 20
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_20
ఏప్రిల్ 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 110వ రోజు (లీపు సంవత్సరములో 111వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 255 రోజులు మిగిలినవి. సంఘటనలు 1526 : మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్, ఇబ్రహీ లోడీని ఓడించాడు. 1920: 7వ ఒలింపిక్ క్రీడలు బెల్జియం లోని ఆంట్‌వెర్ప్ లో ప్రారంభమయ్యాయి. జననాలు 570: ముహమ్మద్, ఇస్లాం స్థాపించిన . (వివాదాస్పదము) 1761: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, గుంటూరు ప్రాంతమును పరిపాలించిన కమ్మ రాజు, అమరావతి సంస్థాన పాలకుడు. (మ.1817) 1889: ఎడాల్ఫ్ హిట్లర్, జెర్మనీని 12 సంవత్సరాలు పాలించినరాజు. 1930: త్రిపురనేని మహారధి , సినీ మాటల రచయిత(2011) 1948: పి.శంకరరావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. 1950: నారా చంద్రబాబునాయుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రి. 1959: కొప్పుల ఈశ్వర్, తెలంగాణ శాసనసభ సభ్యుడు. 1972: మమతా కులకర్ణి, హిందీ సినీనటి. 1972: అంజలా జవేరి, టాలీవుడ్, బాలీవుడ్ సినీ నటి. 1985: రేఖవేదవ్యాస్, తెలుగు, తమిళ,కన్నడ,చిత్రాల నటి, మోడల్. 1989: నీనా దావులూరి, మిస్ అమెరికాగా ఎంపికైన తొలి భారతీయ అమెరికన్. మరణాలు 1992: ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (జ.1921) 1966: పి. సత్యనారాయణ రాజు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. (జ.1908) 2017: తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. (జ.1960) పండుగలు , జాతీయ దినాలు - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 20 . ఏప్రిల్ 19 - ఏప్రిల్ 21 - మార్చి 20 - మే 20 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 21
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_21
ఏప్రిల్ 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 111వ రోజు (లీపు సంవత్సరములో 112వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 254 రోజులు మిగిలినవి. సంఘటనలు 1944: ఫ్రాన్సులో మహిళలు వోటు వేయడానికి అర్హత పొందారు 1994: సౌర మండలం బయట ఇతర గ్రహాలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు 1997: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ నియమితుడైనాడు. జననాలు 1939: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (మ.2009) 1977: బండ రవిపాల్ రెడ్డి, ప్రముఖ విద్యావేత్త, వేద గణిత నిపుణులు, పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, ఎంతో మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన గురువు. ప్రకృతిని ఆరాధిస్తూ ఎన్నో మొక్కలను నాటి, తన విద్యార్థులచే నాటించిన మహనీయుడు. మరణాలు 1910: మార్క్ ట్వేయిన్, అమెరికన్ రచయిత, మానవతావాది. (జ.1835) 1938: ముహమ్మద్ ఇక్బాల్, ఉర్దూ, పారశీ భాషలలో కవి. (జ.1877). 2000: నిగార్ సుల్తానా, భారతీయ సినిమా నటి. (జ.1932) 2013: శకుంతలా దేవి, గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్త. (జ.1929) 2013: అంబటి బ్రాహ్మణయ్య, రాజకీయవేత్త. (జ.1940) 2022: దేవులపల్లి ప్రభాకరరావు, రచయిత, జర్నలిస్టు.తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ చైర్మన్.(జ.1938) 2023: రవ్వా శ్రీహరి, ఆధునిక తెలుగు నిఘంటుకర్త, వ్యాకరణవేత్త, ఆచార్యుడు (జ. 1943) పండుగలు , జాతీయ దినాలు జాతీయ పౌర సేవల దినోత్సవం కార్యదర్శుల దినోత్సవం. జాతీయ సమాచార హక్కుల దినం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 21 . ఏప్రిల్ 20 - ఏప్రిల్ 22 - మార్చి 21 - మే 21 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 22
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_22
ఏప్రిల్ 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 112వ రోజు (లీపు సంవత్సరములో 113వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 253 రోజులు మిగిలినవి. సంఘటనలు 1912 – ప్రావ్దా (Pravda), సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక ప్రచురణ ప్రారంభించబడింది. జననాలు 1724: ఇమ్మాన్యుయెల్ కాంట్, జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1804) 1870: లెనిన్, రష్యా విప్లవనేత. 1883: అంజనీబాయి మాల్పెకర్, భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. (మ.1974) 1936: మకాని నారాయణరావు, లండన్‌లోని అడ్వాన్డ్స్‌ లీగల్‌ స్టడీస్‌ ఇన్సిట్యూట్‌లో పనిచేశారు, హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 1939: శీలా వీర్రాజు, చిత్రకారుడిగా, కవిగా, కథారచయితగా, నవలారచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించాడు. 1959: దగ్గుబాటి పురంధేశ్వరి, భారత పార్లమెంటు సభ్యురాలు, వీరు బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు. 2000: శివాత్మిక , సినీ నటి, నిర్మాత. మరణాలు 1933: సర్ హెన్రీ రోయ్స్, కార్ల నిర్మాణదారుడు. 1994: రిచర్డ్ నిక్సన్, అమెరికా 37వ అధ్యక్షుడు. 2018: బాలాంత్రపు రజనీకాంతరావు, సంగీత దర్శకుడు ,(జ.1920) పండుగలు , జాతీయ దినాలు ధరిత్రి దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 22 . ఏప్రిల్ 21 - ఏప్రిల్ 23 - మార్చి 22 - మే 22 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 23
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_23
ఏప్రిల్ 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 113వ రోజు (లీపు సంవత్సరములో 114వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 252 రోజులు మిగిలినవి. సంఘటనలు 1635 : అమెరికాలో మొదటి పబ్లిక్ పాఠశాల ప్రారంభించబడింది. (బోస్టన్ లాటిన్ స్కూల్) 2012: మావోయిస్టులు ఒడిశా లోని లక్ష్మీపూర్ శాసనసభ్యుడు జిన్నూ హిక్కాకను అపహరించారు జననాలు 1791: జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1868) 1858: మాక్స్ ప్లాంక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1947) 1863: నాదెళ్ళ పురుషోత్తమ కవి, కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (మ.1938) 1891: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, రచయిత. (మ.1961) 1923: కోగంటి గోపాలకృష్ణయ్య, కొన్ని వందల గేయాలను వ్రాసిన కవి. 1926: తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ, మహబూబ్ నగర్ వ్యక్తి. 1938: ఎస్.జానకి, నేపథ్యగాయని. 1949: అక్కిరాజు సుందర రామకృష్ణ, రంగస్థల సినిమా నటుడు, గాయకుడు, అధ్యాపకుడు, మంచి వక్త. 1957: జి.వి. పూర్ణచందు, తెలుగు భాషోద్యమ ముఖ్యుడు. ఆయుర్వేద పట్టభద్ర వైద్యుల సంక్షేమం కోసం నేషనల్ మెడికల్ అసోసియేషన్ వ్యస్థాపకుల్లో ఒకరు. 1969;మనోజ్ బాజ్ పాయ్ , హిందీ తెలుగు చిత్రాల నటుడు : శ్వేతా మీనన్, భారతీయ మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత, నటి. మరణాలు thumb|SatyajitRay 1616: విలియం షేక్‌స్పియర్, నాటక రచయిత. (జ.1564) 1992: సత్యజిత్ రే, భారత సినీ దర్శకుడు. (జ.1921) 2020: ఉషా గంగూలీ, భారతీయ రంగస్థల నటి, దర్శకురాలు. (జ.1945) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ పుస్తక దినోత్సవం. ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 23 . ఏప్రిల్ 22 - ఏప్రిల్ 24 - మార్చి 23 - మే 23 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
ఏప్రిల్ 24
https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_24
ఏప్రిల్ 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 114వ రోజు (లీపు సంవత్సరములో 115వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 251 రోజులు మిగిలినవి. సంఘటనలు 1704 : మొదటి వార్తాపత్రిక అమెరికా లోని బోస్టన్ నగరం నుండి ప్రారంభించబడింది. 1993: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది. 110 సంవత్సరాల క్రితం 1882 లో రిపన్ ప్రవేశపెట్టిన "స్థానిక ప్రభుత్వము" అనే ఆలోచన, 84 సంవత్సరాల తరువాత మహాత్మా గాంధీ కలలు కన్న 'గ్రామ స్వరాజ్యము' వాస్తవంగా అమలు లోకి వచ్చిన రోజు. 1967 : వ్లాదిమిర్ కొమరోవ్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త పారాచూట్ తెరుచుకోకపోవటం వల్ల సూయజ్-1 లో మరణించాడు. ఇతడు అంతరిక్ష నౌకలో మరణించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. 1970 : చైనా పంపిన మొదటి ఉపగ్రహం, డాంగ్ ఫాంగ్ హాంగ్ 1 2005 : దక్షిణ కొరియాలో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మించిన కుక్క, స్నప్పీ. జననాలు 1884: విస్సా అప్పారావు, మద్రాసు సంగీత అకాడమి మూలస్తంభాలలో ఒకరు. 1927: నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (మ.2011) 1929: రాజ్‌కుమార్, భారత చలనచిత్ర నటుడు, గాయకుడు. (మ.2006) 1934: ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (మ.2015) 1938: కోవెలమూడి బాపయ్య , తెలుగు, హిందీ, చిత్ర దర్శకుడు 1941: షరాఫ్ తులసీ రామాచారి , పేరెన్నికగని, వేల కార్టూన్లను పత్రికలలోనూ ప్రచురించాడు. 1945: లారీ టెస్లర్, న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త. (మ.2020) 1952: చిలుకూరి దేవపుత్ర, ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు ఇత్యాది రచనల రచయిత. (మ.2016) ) 1956: తీజన్‌ బాయి, ఫోక్ సింగర్ 1969: శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, సుప్రసిద్ధ ఖగోళ, జ్యోతిష శాస్త్ర పండితుడు, జ్యోతిష శాస్త్రవేత్తగా, పండితునిగా, పురోహితునిగా ప్రసిద్ధుడు. 1973: సచిన్ టెండుల్కర్, భారత క్రికెట్ ఆటగాడు. 1985: గజాల , తెలుగు, తమిళ , మళయాళ సినీనటి. మరణాలు 1999: ఎమ్.వి.రాజమ్మ, సినిమా నటి. 2000: రామినేని అయ్యన్న చౌదరి, సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు, విద్యావేత్త. 2004: జె.వి.సోమయాజులు , సినిమా నటుడు, రంగస్థల నటుడు (జ.1928) 2011: సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (జ.1926) 2015: పందిళ్ళ శేఖర్‌బాబు, రంగస్థల (పౌరాణిక) నటులు, దర్శకులు, నిర్వాహకులైన తెలుగు నాటకరంగంలో పేరొందిన వ్యక్తి. (జ. 1961) 2023: గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి: సాహితీవేత్త, పరిశోధకుడు, పత్రిక సంపాదకుడు. (జ. 1966) పండుగలు , జాతీయ దినాలు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 24 ఏప్రిల్ 23 - ఏప్రిల్ 25 - మార్చి 24 - మే 24 -- అన్ని తేదీలు వర్గం:ఏప్రిల్ వర్గం:తేదీలు
తెలుగు సినిమాలు 1987
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1987
thumb|డబ్బెవరికి చేదు ఈ యేడాది 128 చిత్రాలతో రికార్డు సృష్టించింది. గీతా ఆర్ట్స్‌ 'పసివాడి ప్రాణం' సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచి రజతోత్సవం జరుపుకుని, 300 రోజుల వరకు ప్రదర్శితమైంది. రాజేంద్ర ప్రసాద్‌ సీజన్‌కు శ్రీకారం చుట్టిన 'అహ నా పెళ్ళంట', ఆహుతి, కలెక్టర్‌ గారి అబ్బాయి, మజ్ను, మువ్వగోపాలుడు, రాము, సంసారం ఒక చదరంగం" శతదినోత్సవాలు జరుపుకోగా, "ఇంటిదొంగ, కిరాయిదాదా, చక్రవర్తి, దొంగమొగుడు, నాకూ పెళ్ళాం కావాలి, ప్రజాస్వామ్యం, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి, ముద్దాయి, శ్రీనివాస కళ్యాణం" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. అందరికంటే ఘనుడు అక్షింతలు అగ్నిపుత్రుడు అగ్నిపుష్పం అజేయుడు అత్తగారూ జిందాబాద్ అమెరికా అబ్బాయి అరణ్యకాండ అర్జున్ అల్లరి కృష్ణయ్య అల్లరి పాండవులు అల్లుడి కోసం అహ! నా పెళ్ళంట ! ఆత్మబంధువు ఆనందతాండవం ఆరాధన ఆహుతి ఇంటిదొంగ ఇదా ప్రపంచం ఉదయం ఉమ్మడి మొగుడు ఓ ప్రేమ కథ కలెక్టర్ గారి అబ్బాయి కళ్యాణ తాంబూలం కాబోయే అల్లుడు కార్తీకపౌర్ణమి కిరాయి దాదా కులాల కురుక్షేత్రం కృష్ణ లీల ఖైదీ నాగమ్మ గాంధీనగర్ రెండవ వీధి గుండమ్మగారి కృష్ణులు గౌతమి చందమామ రావే చక్రవర్తి చిన్నారిదేవత చైతన్యం జగన్మాత జేబుదొంగ డబ్బెవరికి చేదు డామిట్ కథ అడ్డం తిరిగింది తండ్రి కొడుకుల చాలెంజ్ తల్లిగోదావరి తాయారమ్మ తాండవకృష్ణ తేనె మనసులు త్రిమూర్తులు దయామయుడు దాదా దొంగకాపురం దొంగగారూ స్వాగతం దొంగమొగుడు దొంగోడొచ్చాడు ధర్మపత్ని నమ్మినబంటు నల్లత్రాచు నాకూ పెళ్ళాం కావాలి నేనేరాజు నేనేమంత్రి న్యాయానికి సంకెళ్ళు పగ సాధిస్తా పగబట్టిన పాంచాలి పడమట సంధ్యారాగం పరాశక్తి పసివాడి ప్రాణం పుణ్యదంపతులు పున్నమిచంద్రుడు పెళ్ళిళ్ళోయ్ పెళ్ళిళ్ళు ప్రజాస్వామ్యం ప్రతిస్పందన ప్రెసిడెంట్ గారి అబ్బాయి ప్రేమ సామ్రాట్ ప్రేమదీపాలు బ్రహ్మనాయుడు భలే మొగుడు భానుమతిగారి మొగుడు భారతంలో అర్జునుడు భార్గవ రాముడు మండలాధీశుడు మకుటంలేని మహారాజు మజ్ను మదన గోపాలుడు మనవడొస్తున్నాడు మన్మధలీల కామరాజు గోల మరణ శాసనం మరణ శాసనం మహర్షి మా ఊరి మగాడు మారణహోమం ముద్దాయి ముద్దుబిడ్డ ముద్దుల మనవడు మువ్వగోపాలుడు మొనగాడు యుగకర్తలు రాక్షస సంహారం రాగలీల రాము రేపటి స్వరాజ్యం రౌడీ పోలీస్ రౌడీ బాబాయ్ లాయర్ భారతీదేవి లాయర్ సుహాసిని విజేత విక్రమ్ విశ్వనాధ నాయకుడు వీరప్రతాప్ వీరవిహారం శంఖారావం శారదాంబ శివుడే శంకరుడు శ్రీనివాస కళ్యాణం శ్రీమతి ఒక బహుమతి శ్రుతిలయలు సంకీర్తన సంసారం ఒక చదరంగం సత్యం శివం సుందరం సత్యాగ్రహం సర్దార్ కృష్ణమ నాయుడు సర్దార్ ధర్మన్న సామ్రాట్ సాహస సామ్రాట్ స్వయంకృషి స్వాతంత్ర్యానికి ఊపిరి పోయండి హంతకుడివేట మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు
దారిమార్పుతెలుగు సినిమా en:Telugu films of 1944
తెలుగు సినిమాలు 1988
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1988
thumb|అంతిమ తీర్పు ఈ సంవత్సరం 106 చిత్రాలు విడుదలయ్యాయి. డైనమిక్‌ మూవీ మేకర్స్‌ 'యముడికి మొగుడు' సూపర్‌ హిట్‌గా నిలిచింది. "ఆఖరి పోరాటం, త్రినేత్రుడు, బ్రహ్మపుత్రుడు, ఖైదీ నంబర్‌ 786, రక్తతిలకం" శతదినోత్సవాలు జరుపుకోగా, "అంతిమ తీర్పు, అభినందన, అశ్వత్థామ, ఆడదే ఆధారం, ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌, కనకమహాలక్ష్మి రికార్డింగ్‌ డాన్స్‌ట్రూప్‌, కాంచనసీత, జానకిరాముడు, నవభారతం, బజారు రౌడీ, మంచి దొంగ, మరణమృదంగం, ముగ్గురు కొడుకులు, రక్తాభిషేకం, స్టేషన్‌ మాస్టర్‌" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. మణిరత్నం 'ఘర్షణ' అనువాద చిత్రం ఉదయం ఆటలతో చాలా రోజులు ప్రదర్శితమై ఆయన చిత్రాలకు ఆంధ్రదేశంలో ఓ క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. అంతిమతీర్పు అర్చన అభినందన అశ్వత్థామ అన్నా చెల్లెలు (1988 సినిమా) అన్నా నీ అనుగ్రహం అగ్నికెరటాలు అన్నపూర్ణమ్మగారి అల్లుడు ఆత్మకథ ఆడదే ఆధారం ఆగష్టు 15 రాత్రి ఆలోచించండి ఆఖరి పోరాటం ఆస్తులు అంతస్తులు ఆడబొమ్మ ఆణిముత్యం ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ ఇంద్రధనుస్సు (1988 సినిమా) ఇంటింటి భాగవతం ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉక్కు సంకెళ్ళు ఉగ్రనేత్రుడు ఊరేగింపు ఓ భార్య కథ కళ్ళు కలియుగ కర్ణుడు కలెక్టర్ విజయ కాంచన సీత కూలీ ఖైదీ నెం. 786 చట్టంతో చదరంగం చిన్నోడు పెద్దోడు చిలిపి దంపతులు చిన్ని కృష్ణుడు చినబాబు చిక్కడు దొరకడు (1988 సినిమా) చుట్టాలబ్బాయి చూపులు కలసిన శుభవేళ జమదగ్ని జానకిరాముడు జీవన గంగ జీవన జ్యోతి ఝాన్సీ రాణి టార్జాన్ సుందరి డాక్టర్ గారి అబ్బాయి తిరగబడ్డ తెలుగు బిడ్డ తోడల్లుళ్ళు త్రినేత్రుడు దొంగరాముడు దొంగ పెళ్ళి దొంగ కోళ్లు దొరవారింట్లో దొంగోడు దొరకని దొంగ ధర్మతేజ నవభారతం నా చెల్లెలు కళ్యాణి నాలుగిళ్ళ చావడి న్యాయానికి శిక్ష న్యాయం కోసం నీకు నాకు పెళ్ళంట ప్రచండ భారతం ప్రాణ స్నేహితులు పుష్పకవిమానం పెళ్ళిచేసి చూడు పెళ్ళి కొడుకులొస్తున్నారు పెళ్ళిళ్ళ చదరంగం ప్రజా ప్రతినిధి ప్రేమాయణం ప్రేమ కిరీటం ప్రేమికుల వేట పృధ్వీరాజ్ బందిపోటు (1988 సినిమా) బజారు రౌడీ బడి బ్రహ్మపుత్రుడు బాలమురళి ఎం.ఏ బావా మరదళ్ల సవాల్ భారతంలో బాలచంద్రుడు భామాకలాపం భార్యాభర్తలు భార్యాభర్తల భాగోతం మంచి దొంగ మరణ మృదంగం మహారాజశ్రీ మాయగాడు మన్మధ సామ్రాజ్యం మా తెలుగుతల్లి మా ఇంటి మహారాజు మిస్టర్ హీరో మురళీకృష్ణుడు ముగ్గురు కొడుకులు మేన మామ మొదటి అనుభవం యముడికి మొగుడు యుద్ధభూమి యోగి వేమన (1988 సినిమా) రక్తతిలకం రక్తాభిషేకం రాకీ రావుగారిల్లు రుద్రవీణ రౌడీ నెం. 1 వారసుడొచ్చాడు వివాహ భోజనంబు వేగుచుక్క పగటిచుక్క శ్రీ దేవీకామాక్షీ కటాక్షం శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ శ్రీ తాతావతారం సంకెళ్ళు సగటు మనిషి సంసారం స్వర్ణకమలం సాహసం సేయరా డింబకా సిరిపురం చిన్నోడు స్టేషన్‌మాస్టర్ మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1989
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1989
thumb|అంకుశం ఈ యేడాది 92 సినిమాలు విడుదలయ్యాయి. భార్గవ్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ 'ముద్దుల మావయ్య' సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ 'శివ' అనూహ్య విజయం సాధించి, తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. 'అత్తకుయముడు - అమ్మాయికి మొగుడు' కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. 'అంకుశం' సంచలన విజయం రాజశేఖర్‌ను హీరోగా నిలబెట్టింది. "ఇంద్రుడు-చంద్రుడు, కొడుకు దిద్దిన కాపురం, ధ్రువ నక్షత్రం, గీతాంజలి, భలేదొంగ, సాహసమే నా ఊపిరి, స్టేట్‌రౌడీ" శతదినోత్సవాలు జరుపుకోగా, "టూ టౌన్‌ రౌడీ, పల్నాటి రుద్రయ్య, బామ్మమాట బంగారుబాట, భారతనారి, మమతల కోవెల, మౌనపోరాటం, విక్కీదాదా" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. అంకుశం అగ్ని అజాత శత్రువు అడవిలో అభిమన్యుడు అడవిలో అర్థరాత్రి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అత్తమెచ్చిన అల్లుడు అదృష్టవంతుడు అయ్యప్పస్వామి మహత్యం అశోకచక్రవర్తి ఆఖరిక్షణం ఆఖరిఘట్టం ఆదర్శవంతుడు ఆర్తనాదం ఇంద్రుడు చంద్రుడు ఎర్రమట్టి ఒంటరిపోరాటం కలియుగ విశ్వామిత్ర కృష్ణ గారి అబ్బాయి కొడుకు దిద్దిన కాపురం గండిపేట రహస్యం గడుగ్గాయి గీతాంజలి గూండా రాజ్యం గూఢచారి 117 గోపాల్రావుగారి అబ్బాయి చలాకీ మొగుడు చాదస్తపు పెళ్ళాం చిన్నారి స్నేహం చెన్నపట్నం చిన్నోళ్ళు జయమ్ము నిశ్చయమ్మురా జూ . . . . లకటక టూటౌన్ రౌడీ తాతయ్యపెళ్ళి మనవడి శోభనం దొరికితే దొంగలు ధర్మయుద్ధం ధృవ నక్షత్రం నా మొగుడు నాకే సొంతం నీరాజనం నేటి స్వతంత్రం నేరం నాదికాదు పల్నాటిరుద్రయ్య పాపే మాప్రాణం పార్ధుడు పిన్ని పూలరంగడు పైలాపచ్చీసు పోలీస్ రిపోర్ట్ ప్రజాతీర్పు ప్రేమ బంధువులొస్తున్నారు జాగ్రత్త బలిపీఠంపై భారతనారి బామ్మమాట బంగారుబాట బాలగోపాలుడు బ్లాక్ టైగర్ భగవాన్ భలే దంపతులు భలేదొంగ భారతనారి భూపోరాటం మంచి కుటుంబం మంచివారు మావారు మమతల కోవెల ముత్యమంత ముద్దు ముద్దుల మామయ్య మౌనపోరాటం యమపాశం రక్తకన్నీరు రాజకీయ చదరంగం రిక్షావాలా రుద్రనేత్ర లంకేశ్వరుడు లైలా వింత దొంగలు వింత శోభనం విక్కీదాదా విజయ్ శివ శ్రీరామచంద్రుడు సాక్షి సార్వభౌముడు సాహసమే నా ఊపిరి సింహస్వప్నం సుమంగళి సూత్రధారులు సోగ్గాడి కాపురం స్టేట్ రౌడీ స్వరకల్పన స్వాతిచినుకులు హై హై నాయకా! మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1990
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1990
thumb|అల్లుడుగారు ఈ సంవత్సరం 81 చిత్రాలు విడుదలయ్యాయి. వైజయంతీ మూవీస్‌ 'జగదేకవీరుడు- అతిలోక సుందరి' సంచలన విజయం సాధించి, 200 రోజులు ప్రదర్శితమైంది. 'బొబ్బిలిరాజా' సూపర్‌హిట్టయి, 200 రోజులకు పైగా ఆడింది. "అల్లుడుగారు, కర్తవ్యం, కొండవీటి దొంగ, కొదమసింహం, నారీ నారీ నడుమ మురారి, లారీ డ్రైవర్‌" శతదినోత్సవాలు జరుపుకోగా, "20వ శతాబ్దం, దోషి - నిర్దోషి, నాగాస్త్రం, పుట్టింటి పట్టుచీర, మగాడు, మనసు-మమత, ముద్దుల మేనల్లుడు" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. 'కర్తవ్యం' విజయంతో విజయశాంతి ఇమేజ్‌ హీరోల స్థాయికి ఎదిగింది. హిందీ 'మైనే ప్యార్‌ కియా' తెలుగులో 'ప్రేమపావురాలు'గా అనువాదమై స్ట్రెయిట్‌ చిత్రాలతో సమానంగా విజయం సాధించి, సంచలన కలెక్షన్లు వసూలు చేసింది. 20వ శతాబ్దం అంకితం అగ్గిరాముడు అగ్నిప్రవేశం అగ్నిసాక్షి అడవి దివిటీలు అన్నాతమ్ముడు అలజడి అల్లుడుగారు ఆడది ఆయుధం ఇంటింటా దీపావళి ఇంద్రజిత్ ఇదేంపెళ్ళాం బాబోయ్ ఇద్దరూ ఇద్దరే ఇరుగిల్లు పొరుగిల్లు ఉద్యమం కర్తవ్యం కలియుగ అభిమన్యుడు కొండవీటి దొంగ కొదమసింహం కోకిల ఖైదీదాదా ఘటన చెవిలో పువ్వు జగదేకవీరుడు అతిలోకసుందరి జడ్జిమెంట్ జయసింహ జస్టిస్ రుద్రమదేవి డాక్టర్ భవాని దాగుడుమూతల దాంపత్యం ధర్మ ధర్మరక్షణ నవయుగం నాగాస్త్రం నాయకురాలు నారీ నారీ నడుమ మురారి నేటి చరిత్ర నేటి దౌర్జన్యం నేటి సిద్ధార్థ పద్మావతి కళ్యాణం పాపకోసం పుట్టింటి పట్టుచీర పోలీస్ భార్య ప్రజలమనిషి ప్రాణానికి ప్రాణం ప్రేమయుద్ధం బాలచంద్రుడు బుజ్జిగాడి బాబాయ్ బొబ్బిలిరాజా మగాడు మనసు మమత మహాజనానికి మరదలుపిల్ల మాఇంటి కథ మామా అల్లుడు మామాశ్రీ మాస్టారి కాపురం ముద్దుల మేనల్లుడు యమ ధర్మరాజు రంభ రాంబాబు రతిలయలు రాజా విక్రమార్క రావుగారింట్లో రౌడీ రౌడీయిజం నశించాలి విష్ణు శిలాశాసనం సాహస పుత్రుడు మూలాలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1991
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1991
thumb|ఆదిత్య 369 శ్యామ్‌ప్రసాద్‌ ఆర్ట్స్‌ 'గ్యాంగ్‌ లీడర్‌' సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలిచింది. "అసెంబ్లీ రౌడీ, చిత్రం భళారే విచిత్రం, ప్రేమఖైదీ, మామగారు" కూడా సూపర్‌హిట్‌ అయ్యాయి. "కూలీ నంబర్‌ వన్‌, క్షణ క్షణం, నిర్ణయం, తల్లిదండ్రులు, రౌడీ అల్లుడు, సర్పయాగం, సీతారామయ్యగారి మనవరాలు" శతదినోత్సవాలు జరుపుకోగా, "ఆదిత్య 369, ఇద్దరుపెళ్ళాల ముద్దుల పోలీస్‌, కలికాలం, ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం, కొబ్బరిబోండాం, పెద్దింటల్లుడు, బావాబావా పన్నీరు, భారత్‌బంద్‌, మధురానగరిలో, రౌడీగారి పెళ్ళాం, శత్రువు, స్టూవర్ట్‌పురం దొంగలు" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. యన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా నటించి, సంచలనం రేపిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' విజయం సాధించలేక పోయింది. 'సీతారామయ్యగారి మనవరాలు'తో అక్కినేని ఓల్డ్‌ గెటప్‌ సినిమాలు, 'మామగారు'తో దాసరి నారాయణరావు నటునిగా అనేక సినిమాలు రావడానికి ఈ యేడాది దోహదం చేసింది. రాష్ట్రంలోనే నిర్మించే తెలుగు చిత్రాలకు ప్రభుత్వం వినోదపు పన్నులో అదనపు రాయితీలు కల్పించడంతో పరిశ్రమ హైదరాబాదు‌కు షిఫ్ట్‌ అయింది. సినిమాల జాబితా ఆదిత్య 369 శత్రువు 420 అగ్నినక్షత్రం అతిరధుడు అత్తింట్లో అద్దెమొగుడు అమ్మ రాజీనామా అమ్మ అమ్మకడుపు చల్లగా అల్లుడు దిద్దిన కాపురం అశ్వని అసెంబ్లీరౌడీ ఆగ్రహం ఆడపిల్ల ఆత్మబంధం ఇంట్లో పిల్లి వీధిలో పులి ఇంద్రభవనం ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం ఎర్రమందారం ఏప్రిల్ 1 విడుదల కడప రెడ్డమ్మ కలికాలం కీచురాళ్ళు అస్త్రం కులమా గుణమా? కూలీ నెం 1 కొబ్బరి బొండాం క్షణక్షణం గంగ (సినిమా) గోదావరి పొంగింది గ్యాంగ్ లీడర్ చిత్రం భళారే విచిత్రం చిన్నారి ముద్దులపాప చెంగల్వ పూదండ చైతన్య జగన్నాటకం జీవన చదరంగం జైత్రయాత్ర తరంగాలు తల్లిదండ్రులు తారకప్రభుని దీక్షా మహిమలు తేనెటీగ తొలిపొద్దు నాగమ్మ నాపెళ్ళాం నాయిష్టం నా ఇల్లే నాస్వర్గం నియంత నిర్ణయం నేనేరా పోలీస్ పందిరిమంచం పరమశివుడు పరిష్కారం పల్లెటూరి పెళ్ళాం పిచ్చిపుల్లయ్య పీపుల్స్ ఎన్కౌంటర్ పెద్దింటల్లుడు పెళ్ళిపుస్తకం ప్రయత్నం ప్రార్థన ప్రేమ ఎంతమధురం ప్రేమ చిత్రం పెళ్ళి విచిత్రం ప్రేమ తపస్సు ప్రేమఖైదీ ప్రేమపంజరం బావాబావా పన్నీరు బ్రహ్మర్షి విశ్వామిత్ర భారత్ బంద్ భార్గవ్ మంచిరోజు మధురానగరిలో మహాయజ్ఞం మామగారు ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు మైనర్ రాజా యుగళగీతం రాముడు కాదు రాక్షసుడు రౌడీ అల్లుడు రౌడీగారి పెళ్లాం లంబాడోళ్ళ రాందాస్ లేడీస్ స్పెషల్ వదిన మాట విచిత్రప్రేమ విధాత వియ్యాలవారి విందు శాంతి క్రాంతి శ్రీ ఏడుకొండల స్వామి శ్రీవారి చిందులు శ్రీశైల భ్రమరాంబికా కటాక్షం సంసారవీణ సర్పయాగం సీతారామయ్యగారి మనవరాలు సూపర్ ఎక్స్‌ప్రెస్ సూర్య ఒ. . స్టూవర్టుపురం దొంగలు స్టూవర్టుపురం పోలీసుస్టేషన్ స్వతంత్ర భారతం సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1992
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1992
thumb|అక్కమొగుడు క్రియేటివ్‌ కమర్షియల్స్‌ వారి 'చంటి' సంచలన విజయం సాధించి, వసూళ్ళలో కొత్త రికార్డులు సృష్టించగా, దేవీ ఫిలిమ్‌ ప్రొడక్షన్స్‌ 'ఘరానామొగుడు' అదేస్థాయిలో విజయం సాధించి, సంచలనం రేపిన సంవత్సరమిది. 'రౌడీ ఇన్‌స్పెక్టర్‌' కూడా సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. "అల్లరి మొగుడు, కాలేజీ బుల్లోడు, పెద్దరికం, ప్రెసిడెంట్‌గారి పెళ్ళాం, సుందరకాండ, సూరిగాడు, సీతారత్నంగారి అబ్బాయి" శతదినోత్సవాలు జరుపుకోగా, "అంకురం, అక్కమొగుడు, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, కిల్లర్‌, కలెక్టర్‌గారి అల్లుడు, జంబలకిడిపంబ, పెళ్ళాం చెబితే వినాలి, పోలీస్‌ బ్రదర్స్‌, బలరామకృష్ణులు, బృందావనం, మొండిమొగుడు-పెంకిపెళ్ళాం" కూడా హిట్స్‌గా నిలిచాయి. మణిరత్నం రూపొందించిన 'దళపతి ', 'రోజా ' అనువాద చిత్రాలైనా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అంకురం అంతం అక్కమొగుడు అగ్రిమెంట్ అత్తసొమ్ము అల్లుడుదానం అదృష్టం అప్పుల అప్పారావు అయ్యయ్యో బ్రహ్మయ్య అలెగ్జాండర్ అల్లరి మొగుడు అల్లరిపిల్ల అశ్వమేధం అసాధ్యుడు అహంకారి ఆ ఒక్కటీ అడక్కు ఆపద్బాంధవుడు ఎస్. పి. తేజ ఏటిబావా మరీనూ కరుణించిన కనకదుర్గ కలెక్టర్ గారి అల్లుడు కాలరాత్రిలో కన్నెపిల్ల కాలేజీబుల్లోడు కిల్లర్ గోమాత వ్రతం గోల్ మాల్ గోవిందం గౌరమ్మ గ్యాంగ్ వార్ ఘరానా మొగుడు చంటి చామంతి చినరాయుడు చిల్లరమొగుడు అల్లరికొడుకు ఛాంపియన్ జంబలకడిపంబ జగన్నాధం అండ్ సన్స్ జోకర్ మామ సూపర్ అల్లుడు డబ్బు బలే జబ్బు డాక్టర్ అంబేద్కర్ డిటెక్టివ్ నారద తారకప్రభుని దీక్షామహిమలు తేజ దొంగపొలీస్ దోషి ధర్మక్షేత్రం నాగకన్య నాగబాల నాని పట్టుదల పబ్లిక్ రౌడీ పర్వతాలు పానకాలు పెద్దరికం పెళ్ళంటే నూరేళ్ళపంట పెళ్ళాంచాటు మొగుడు పెళ్ళాంచెబితే వినాలి పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ పెళ్ళి నీకు శుభం నాకు పోలీస్ బ్రదర్స్ ప్రాణదాత ప్రియతమ ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ప్రేమ ద్రోహి ప్రేమవిజేత ప్రేమశిఖరం బంగారు మామ బలరామకృష్ణులు బాబాయి హోటల్ బృందావనం బ్రహ్మ భద్రం కొడుకో భలేఖైదీలు భారతం మదర్ ఇండియా మాధవయ్యగారి మనవడు మొండిమొగుడు పెంకిపెళ్ళాం మొగుడు పెళ్ళాల దొంగాట మొరటోడు నా మొగుడు యముడన్నకి మొగుడు యుగాంతం రక్తతర్పణం రగులుతున్న భారతం రాత్రి రేపటి కొడుకు రౌడీ ఇనస్పెక్టర్ లాఠీ లాల్ సలామ్ వదినగారి గాజులు వసుంధర వాలుజడ తోలుబెల్టు వింతకోడళ్ళు వెంకన్నబాబు శుక్రవారం మహాలక్ష్మి శౌర్యచక్ర శ్రీమాన్ బ్రహ్మచారి సంసారాల మెకానిక్ సమర్పణ సామ్రాట్ అశోక సాహసం సీతాపతి చలో తిరుపతి సీతారత్నంగారి అబ్బాయి సుందరకాండ సుబ్బారాయుడి పెళ్ళి సూరిగాడు స్వాతికిరణం హలో డార్లింగ్ సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1993
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1993
చిత్రరంగం నుండి నిష్క్రమించిన దశాబ్దం తరువాత యన్టీఆర్‌ మళ్ళీ నటించిన సాంఘిక చిత్రం శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ 'మేజర్‌ చంద్రకాంత్‌' సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలిచింది. 'అల్లరి ప్రియుడు' సూపర్‌ హిట్టయి, ద్విశతదినోత్సవం జరుపుకుంది. 'మాయలోడు' మంచి విజయం సాధించి, హైదరాబాదు‌లో 250 రోజులకుపైగా ప్రదర్శితమైంది. "అబ్బాయిగారు, అల్లరి అల్లుడు, ఏవండీ ఆవిడ వచ్చింది, కొండపల్లి రాజా, పరువు - ప్రతిష్ఠ, పోలీస్‌ లాకప్‌, రక్షణ, బావా బావమరిది, మనీ, మాతృదేవోభవ, ముఠామేస్త్రీ, వారసుడు" శతదినోత్సవాలు జరుపుకోగా, "ఇన్‌స్పెక్టర్‌ ఝాన్సీ, చిన్నల్లుడు, తొలిముద్దు, దొంగల్లుడు, మిస్టర్‌ పెళ్ళాం, రాజేంద్రుడు - గజేంద్రుడు" సక్సెస్‌ఫుల్‌ చిత్రాలుగా నిలిచాయి. బాలకృష్ణ నటించిన 'బంగారుబుల్లోడు', 'నిప్పురవ్వ' ఒకే రోజున విడుదలై డైరెక్టు శతదినోత్సవం జరుపుకోవడం విశేషం! 'మెకానిక్‌ అల్లుడు' కూడా శతదినోత్సవం జరుపుకుంది. శంకర్‌ తొలి డ బ్బింగ్‌ చిత్రం 'జెంటిల్‌మేన్‌' సంచలన విజయంసాధించి, కొన్ని చోట్ల స్ట్రెయిట్‌ చిత్రాలను మించిన కలెక్షన్లు కూడా వసూలు చేసింది. విడుదలైన చిత్రాలు దండోరా (సినిమా) అక్క పెత్తనం చెల్లెలి కాపురం అక్కాచెల్లెళ్ళు అత్తకి కొడుకు మామకి అల్లుడు ఆదర్శం అన్నగారు అన్నా చెల్లెలు అన్నావదిన అబ్బాయిగారు అమ్మకొడుకు అల్లరి అల్లుడు అల్లరి ప్రియుడు అసలే పెళ్ళైనవాణ్ణి ఆదివారం అమావాస్య ఆరంభం ఆలీబాబా అరడజనుదొంగలు ఆశయం ఇన్స్‌పెక్టర్ అశ్వని ఇన్స్‌పెక్టర్ ఝాన్సీ ఇల్లు పెళ్ళి ఊర్మిళ ఏవండీ ఆవిడ వచ్చింది కన్నయ్య కిట్టయ్య కలియుగం కాలచక్రం కుంతీపుత్రుడు కొంగుచాటు కృష్ణుడు కొండపల్లి రాజా కొక్కొరో కో గాయం చిటికెల పందిరి చిట్టెమ్మ మొగుడు చిరునవ్వుల వరమిస్తావా జీవనవేదం జీవితమే ఒక సినిమా జోకర్ తొలిముద్దు తోడుదొంగలు దండోరా దాడి దొంగలున్నారు జాగ్రత్త దొంగల్లుడు నక్షత్రపోరాటం నిప్పురవ్వ పచ్చని సంసారం (1993 సినిమా) పచ్చని సంసారం పరువు ప్రతిష్ఠ పిల్లలు దిద్దినకాపురం పెళ్ళిగోల పోలీస్ లాకప్ ప్రేమపుస్తకం ప్రేమేనాప్రాణం బంగారు బుల్లోడు బావ బావమరిది బ్రహ్మచారి మొగుడు భగత్ మనవరాలి పెళ్ళి మనీ మాతృదేవోభవ మామా కోడలు మాయదారి మోసగాడు మాయలోడు మావారికి పెళ్ళి మిష్టర్ పెళ్ళాం ముఠా మేస్త్రి మెకానిక్ అల్లుడు మేజర్ చంద్రకాంత్ మొగుడుగారు రక్షణ రథసారధి రాజధాని (సినిమా) రాజేంద్రుడు-గజేంద్రుడు రాజేశ్వరి కళ్యాణం రెండిళ్ళ పూజారి రేపటి రౌడీ రౌడీ రాజకీయం రౌడీ అన్నయ్య రౌడీగారి టీచర్ రౌడీమొగుడు వన్ బై టూ వారసుడు వాస్తవం శభాష్ రాము శాంభవి శివరాత్రి శ్రీనాథ కవిసార్వభౌమ సరసాల సోగ్గాడు సరిగమలు సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు
తెలుగు సినిమాలు 1994
https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1994
thumb|ముగ్గురు మొనగాళ్ళు తెలుగు సినీపరిశ్రమ పూర్తిగా హైదరాబాదు‌ తరలి వచ్చిన తరువాత మద్రాసులో నిర్మితమైన తొలి తెలుగు గ్రాఫిక్స్‌ చిత్రం చందమామా విజయాకంబైన్స్‌ వారి 'భైరవద్వీపం' ఫుల్‌ టాక్స్‌తో కూడా సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలచింది. "యమలీల, శుభలగ్నం" సూపర్‌హిట్‌గా నిలిచి రజతోత్సవం జరుపుకున్నాయి. "అన్న, ఆమె, నంబర్‌ వన్‌, బంగారుకుటుంబం, బొబ్బిలి సింహం, ముగ్గురు మొనగాళ్ళు, హలో బ్రదర్‌, తోడికోడళ్ళు" శతదినోత్సవాలు జరుపుకోగా "అల్లరి ప్రేమికుడు, మావూరి మారాజు, శ్రీవారి ప్రియురాలు" సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి. 'ఎర్రసైన్యం' సంచలన విజయం సాధించి, ఆర్‌.నారాయణ మూర్తి మార్కు చిత్రాల సీజన్‌కు నాంది పలికింది. శంకర్‌ మలి డబ్బింగ్‌ చిత్రం 'ప్రేమికుడు' సంచలన విజయం సాధించి స్ట్రెయిట్‌ చిత్రాలను మించిన కలెక్షన్లు కూడా వసూలు చేసింది. అంగరక్షకుడు అందరూ అందరే అత్తాకోడళ్ళు అన్న_(సినిమా) అల్లరి పోలీస్ అల్లరి ప్రేమికుడు అల్లరోడు అల్లుడిపోరు అమ్మాయిజోరు ఆమె ఆవేశం ఎర్రసైన్యం ఎస్.పి.పరుశురామ్ ఓతండ్రీ ఓకొడుకు కలికాలం ఆడది కిష్కింధకాండ కుర్రది కుర్రాడు కెప్టెన్ క్రిమినల్ ఖైదీ నెంబర్. 1 గాంఢీవం గోవిందా గోవిందా గ్యాంగ్ మాస్టర్ ఘరానా అల్లుడు జంతర్ మంతర్ జీవిత ఖైదీ జైలర్ గారి అబ్బాయి టాప్ హీరో తీర్పు తెగింపు తోడికోడళ్ళు దొంగ రాస్కెల్ దొంగలరాజ్యం దొరగారికి దొంగపెళ్ళాం ధర్మవిజేత నమస్తే అన్న నాన్నగారు నీకు 16 నాకు 18 నెంబర్ వన్ నేరం న్యాయరక్షణ పచ్చతోరణం పరుగో పరుగు పల్నాటి పౌరుషం పల్లెటూరి మొగుడు పుట్టినిల్లా మెట్టినిల్లా పెళ్ళికొడుకు పేకాట పాపారావు పోలీస్ అల్లుడు ప్రెసిడెంట్ గారి అల్లుడు ప్రేమ అండ్ కో బంగారుకుటుంబం బంగారు మొగుడు బాయ్ ఫ్రెండ్ బొబ్బిలి సింహం భలేపెళ్ళాం భలే మామయ్య భైరవద్వీపం మగరాయుడు మనీ మనీ మరో క్విట్ ఇండియా మావూరి మారాజు ముగ్గురు మొనగాళ్ళు ముద్దులప్రియుడు మేడమ్ యం.ధర్మరాజు ఎం.ఎ. యమలీల యస్ నేనంటే నేనే రిక్షా రుద్రయ్య రైతుభారతం రౌడీ అండ్ ఎం.ఎల్.ఏ. లక్కీచాన్స్ వింతమొగుడు శపథం శుభలగ్నం శ్రీదేవి నర్సింగ్ హోం శ్రీవారి ప్రియురాలు ష్ గప్ చుప్ సమరం 1993 సుందరవదనా సుబ్బలక్ష్మి మొగుడా సూపర్ పోలీస్ హలో అల్లుడు హలో బ్రదర్ సినిమాలు వర్గం:తెలుగు సినిమాలు