sloka
stringlengths
77
449
verse
int64
1
78
chapter
int64
1
18
audio
stringlengths
59
63
w2w_meaning
stringlengths
213
1.29k
te_translation
stringlengths
127
741
commentry
stringlengths
0
11.1k
ధృతరాష్ట్ర ఉవాచ । ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః । మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ।। 1 ।।
1
1
https://www.holy-bhagava…udio/001_001.mp3
ధృతరాష్ట్ర ఉవాచ — ధృతరాష్ట్రుడు పలికెను; ధర్మ-క్షేత్రే — ధర్మ భూమి; కురు-క్షేత్రే — కురుక్షేత్రం వద్ద; సమవేతాః — చేరియున్న; యుయుత్సవః — యుద్ధ కాంక్షతో; మామకాః — నా పుత్రులు; పాండవా — పాండు పుత్రులు; చ — మరియు; ఏవ — నిజముగా; కిం — ఏమి; అకుర్వత — చేసినారు; సంజయ — ఓ సంజయా.
BG 1.1: ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి, మరియు యుద్ధ కాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండు పుత్రులు ఏమి చేసిరి?
ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోనే గుడ్డి వాడే కాక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లోపించిన వాడు. తన పుత్ర వ్యామోహమే అతడిని ధర్మపథం నుండి తప్పించి, న్యాయపరంగా పాండవులకు చెందిన రాజ్యాన్ని లాక్కునేటట్లు చేసింది. ఆయనకు తన తమ్ముని కుమారులే అయిన పాండు పుత్రులకు తను చేసిన అన్యాయం తెలుసు. తన అంతఃకరణలో తప్పు చేసిన భావన, అతడు యుద్ధం యొక్క ఫలితాన్ని గురించి ఆందోళన చెందేట్టు చేసింది, అందుకే కురుక్షేత్ర యుద్ధభూమిలో ఏమి జరుగుతోందని సంజయుడిని అడిగాడు. ఈ శ్లోకంలో, ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగింది ఏమిటంటే, యుద్ధభూమిలో కూడి ఉండి, తన పుత్రులు మరియు పాండురాజు పుత్రులు ఏమి చేసారు? అని. ఇప్పుడు, యుద్ధభూమిలో సమావేశమైనది స్పష్టంగా యుద్ధం కోసమే కదా. వారు సహజంగానే యుద్ధమే చేస్తారు. మరి ధృతరాష్ట్రుడికి, వారందరూ ఏమి చేసారని ప్రశ్న అడగాలని ఎందుకు అనిపించింది? అతని సందేహాన్ని తను ఉపయోగించిన పదాల ద్వారా గ్రహించవచ్చు—ధర్మక్షేత్రే, అంటే, ధర్మ భూమి. కురుక్షేత్రం ఒక పవిత్రమైన ప్రదేశం. యజుర్వేదం లోని శతపథ బ్రహ్మన్, యందు ఇలా చెప్పబడింది: కురుక్షేత్రం దేవ యజనం. ‘కురుక్షేత్రం దేవతల యజ్ఞస్థలం.’ కాబట్టి అది ధర్మాన్ని వర్ధిల్లచేసిన ప్రాంతం. పవిత్ర భూమి అయిన కురుక్షేత్ర ప్రభావం వలన తన పుత్రులలో పాప-పుణ్యాల వివక్ష పెరిగి తమ బంధువులైన పాండవులని సంహరించటం తప్పని భావిస్తారని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ఈవిధంగా ఆలోచించి, వారు శాంతి ఒప్పందం చేసుకోవచ్చు. ఆ సంభావ్యత ధృతరాష్ట్రుడికి తీవ్ర అసంతృప్తిని కలిగించింది. తన కుమారులు శాంతి-ఒప్పందం కుదుర్చుకుంటే, పాండవులు ఎప్పటికైనా వారికి ఒక అవరోధంలా మిగిలిపోతారు. కాబట్టి యుద్ధం జరగటమే మంచిది అని తలచాడు. అదే సమయంలో, యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సంశయంతో, తన పుత్రుల ప్రారబ్ధం ఎలా ఉందో తెలుసుకోగోరాడు. అందుకే ఇరుసైన్యాలు సన్నద్ధమైయున్న కురుక్షేత్ర యుద్ధరంగ విశేషాలని సంజయుడిని అడిగాడు.
సంజయ ఉవాచ । దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా । ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ।। 2 ।।
2
1
https://www.holy-bhagava…udio/001_002.mp3
సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; దృష్ట్వా — గమనించిన పిదప; తు — కానీ; పాండవ-అనీకం — పాండవ సైన్యమును; వ్యూఢం — సైనిక వ్యూహ రచనతో నిలిచి యున్న; దుర్యోధనః — రాజైన దుర్యోధనుడు; తదా — అప్పుడు; ఆచార్యం — గురువు గారు; ఉపసంగమ్య — సమీపించి; రాజా — రాజు; వచనం — మాటలను; అబ్రవీత్ — పలికెను.
BG 1.2: సంజయుడు పలికెను: సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి, ఈ విధంగా పలికెను.
తన పుత్రులు ఎలాగైనా యుద్ధం మొదలు పెడతారనే ధ్రువీకరణ కోసం ధృతరాష్ట్రుడు ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రశ్న వెనకున్న ధృతరాష్ట్రుని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సంజయుడు, ఖచ్చితంగా యుద్ధం జరగబోతోందని, పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా సైనిక నిర్మాణంతో ఉందని చెప్పాడు. అంతేకాక దుర్యోధనుడు ఏమి చేస్తున్నాడనే దిశగా, సంభాషణ విషయాన్ని మరల్చాడు. ధృతరాష్ట్రుని పెద్ద కొడుకు అయిన దుర్యోధనుడు చాల దుష్ట, క్రూర స్వభావం కలవాడు. ధృతరాష్ట్రుడు అంధుడు అవటం వలన, అతని తరఫున, నిజానికి దుర్యోధనుడే హస్తినాపుర రాజ్యాన్ని పరిపాలించాడు. అతను పాండవ ద్వేషి. ఎలాగైనా పాండవులని అడ్డు తొలగించుకొని రాజ్యాన్ని ఎదురు లేకుండా పాలించాలని నిశ్చయించుకున్నాడు. తన సైన్యాన్ని ఎదుర్కోగలిగినంత సైన్యాన్ని పాండవులు సమీకరించుకోలేరు, అని అనుకున్నాడు. కానీ దానికి విరుద్ధంగా జరిగింది, మరియు అపారమైన పాండవుల సైనిక సామర్ధ్యాన్ని చూచి వ్యాకులతతో ఆందోళన చెందాడు. దుర్యోధనుడు తన యుద్ధ-గురువు ద్రోణాచార్యుని సమీపించటం, యుద్ధ పరిణామం మీద అతనికి వున్న భయాన్ని తెలియపరుస్తోంది. నమస్కరించాలనే నెపంతో ద్రోణాచార్యుని దగ్గరకి వెళ్ళినా, అతని నిజమైన ఆంతర్యం తన ఆందోళనని ఉపశమనం చేసుకోవటమే. ఈ ఇప్పుడు దుర్యోధనుడు తదుపరి శ్లోకంతో మొదలిడి తొమ్మిది శ్లోకాలని పలికెను.
పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ । వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ।। 3 ।।
3
1
https://www.holy-bhagava…udio/001_003.mp3
పశ్య — చూడుము; ఏతాం — ఈ యొక్క; పాండు-పుత్రాణామ్ — పాండురాజు పుత్రులు; ఆచార్య — గురువర్య; మహతీం — గొప్పదైన; చమూమ్ — సైన్యము; వ్యూఢాం — సైనిక వ్యూహాత్మకంగా నిలుపబడిన; ద్రుపద-పుత్రేణ — ద్రుపదుని పుత్రుడు ధృష్టద్యుమ్నుడు; తవ శిష్యేణ — మీ శిష్యుని చేత; ధీ-మతా — తెలివైనవాడు.
BG 1.3: దుర్యోధనుడు అన్నాడు: గౌరవనీయులైన గురువర్యా! ద్రుపదుని పుత్రుడైన, ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహా సైన్యాన్ని చూడుము.
తన అస్త్రవిద్యా గురువు ద్రోణాచార్యుడికి గతంలో ఆయన చేసిన తప్పుని, యుక్తితో ఎత్తి చూపాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది. వైరంతో ఆగ్రహం చెందిన ద్రుపదుడు, ఒక యజ్ఞం చేసి, ద్రోణాచార్యుడిని సంహరించగలిగే పుత్రుడు కలగాలనే వరం పొందాడు. ఆ వరం ఫలితంగా ద్రుపదునికి ధృష్టద్యుమ్నుడు పుట్టాడు. ద్రోణాచార్యుడికి ధృష్టద్యుమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా సరే, తన వద్దకు సైనిక విద్యని అభ్యసించడానికి వచ్చినప్పుడు, పెద్ద మనసుతో, ధృష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్యనంతా సంకోచించకుండా బోధించాడు. ఇక ఇప్పుడు యుద్ధంలో, ధృష్టద్యుమ్నుడు, పాండవ పక్షంలో సర్వ సైన్యాధిపతిగా చేరి ఉన్నాడు మరియు పాండవుల సేనా-వ్యూహాన్ని ఏర్పాటు చేసింది కూడా అతడే. ఆయన (ద్రోణుడు) గతంలో చూపిన కనికరమే ప్రస్తుత సంకట స్థితికి కారణమయిందని తన గురువుగారికి సూచిస్తూ, ఇకనైనా ద్రోణాచార్యుడు ఇంకా మరింత కనికరం చూపించకుండా పాండవులతో యుద్ధం చేయాలని సూచిస్తున్నాడు, దుర్యోధనుడు.
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి । యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।। 4 ।। ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ । పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ।। 5 ।। యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ । సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ।। 6 ।।
4
1
https://www.holy-bhagava…/001_004-006.mp3
అత్ర — ఇక్కడ; శూరాః — శక్తివంతమైన యోధులు; మహా-ఇశు-ఆసాః — గొప్ప ధనుర్ధారులు; భీమ-అర్జున-సమాః — భీముడు-అర్జునుడులతో సమానమైన; యుధి — యుద్ధ విద్యలో; యుయుధానః — యుయుధానుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; ద్రుపదః — ద్రుపదుడు; చ — మరియు; మహా-రథః — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు; ధృష్టకేతు — ధృష్టకేతుడు; చేకితానః — చేకితానుడు; కాశిరాజః — కాశీరాజు; చ — మరియు; వీర్య-వాన్ — వీరోచిత; పురుజిత్ — పురుజితుడు; కుంతిభోజః — కుంతిభోజుడు; చ — మరియు; శైబ్యః — శైబ్యుడు; చ — మరియు; నర-పుంగవః — ఉత్తమ పురుషులు; యుధామన్యుః — యుధామన్యుడు; చ — మరియు; విక్రాంత — ధైర్యవంతుడైన; ఉత్తమౌజాః — ఉత్తమౌజుడు; చ — మరియు; వీర్య-వాన్ — వీరుడైన; సౌభద్రః — సుభద్ర కుమారుడు; ద్రౌపదేయాః — ద్రౌపది పుత్రులు; చ — మరియు; సర్వే — అందరును; ఏవ — నిజంగా; మహా-రథాః — పదివేలమంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు
BG 1.4-6: వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి - యుయుధానుడు, విరాటుడు, మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు - వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా, ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు, వీరందరూ శ్రేష్ఠమైన యుద్ధ వీరులే.
రాబోయే పెను విపత్తు భయానికి, దుర్యోధనుడికి, పాండవులు సమీకరించిన సైన్యం, ఉన్న దాని కన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది. తన ఆందోళనని వ్యక్తం చేస్తూ, పాండవుల పక్షంలోనున్న మహారథులను (పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులు) చూపాడు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారే.
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి । యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।। 4 ।। ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ । పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ।। 5 ।। యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ । సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ।। 6 ।।
5
1
https://www.holy-bhagava…/001_004-006.mp3
అత్ర — ఇక్కడ; శూరాః — శక్తివంతమైన యోధులు; మహా-ఇశు-ఆసాః — గొప్ప ధనుర్ధారులు; భీమ-అర్జున-సమాః — భీముడు-అర్జునుడులతో సమానమైన; యుధి — యుద్ధ విద్యలో; యుయుధానః — యుయుధానుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; ద్రుపదః — ద్రుపదుడు; చ — మరియు; మహా-రథః — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు; ధృష్టకేతు — ధృష్టకేతుడు; చేకితానః — చేకితానుడు; కాశిరాజః — కాశీరాజు; చ — మరియు; వీర్య-వాన్ — వీరోచిత; పురుజిత్ — పురుజితుడు; కుంతిభోజః — కుంతిభోజుడు; చ — మరియు; శైబ్యః — శైబ్యుడు; చ — మరియు; నర-పుంగవః — ఉత్తమ పురుషులు; యుధామన్యుః — యుధామన్యుడు; చ — మరియు; విక్రాంత — ధైర్యవంతుడైన; ఉత్తమౌజాః — ఉత్తమౌజుడు; చ — మరియు; వీర్య-వాన్ — వీరుడైన; సౌభద్రః — సుభద్ర కుమారుడు; ద్రౌపదేయాః — ద్రౌపది పుత్రులు; చ — మరియు; సర్వే — అందరును; ఏవ — నిజంగా; మహా-రథాః — పదివేలమంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు
BG 1.4-6: వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి - యుయుధానుడు, విరాటుడు, మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు - వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా, ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు, వీరందరూ శ్రేష్ఠమైన యుద్ధ వీరులే.
రాబోయే పెను విపత్తు భయానికి, దుర్యోధనుడికి, పాండవులు సమీకరించిన సైన్యం, ఉన్న దాని కన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది. తన ఆందోళనని వ్యక్తం చేస్తూ, పాండవుల పక్షంలోనున్న మహారథులను (పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులు) చూపాడు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారే.
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి । యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।। 4 ।। ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ । పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ।। 5 ।। యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ । సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ।। 6 ।।
6
1
https://www.holy-bhagava…/001_004-006.mp3
అత్ర — ఇక్కడ; శూరాః — శక్తివంతమైన యోధులు; మహా-ఇశు-ఆసాః — గొప్ప ధనుర్ధారులు; భీమ-అర్జున-సమాః — భీముడు-అర్జునుడులతో సమానమైన; యుధి — యుద్ధ విద్యలో; యుయుధానః — యుయుధానుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; ద్రుపదః — ద్రుపదుడు; చ — మరియు; మహా-రథః — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు; ధృష్టకేతు — ధృష్టకేతుడు; చేకితానః — చేకితానుడు; కాశిరాజః — కాశీరాజు; చ — మరియు; వీర్య-వాన్ — వీరోచిత; పురుజిత్ — పురుజితుడు; కుంతిభోజః — కుంతిభోజుడు; చ — మరియు; శైబ్యః — శైబ్యుడు; చ — మరియు; నర-పుంగవః — ఉత్తమ పురుషులు; యుధామన్యుః — యుధామన్యుడు; చ — మరియు; విక్రాంత — ధైర్యవంతుడైన; ఉత్తమౌజాః — ఉత్తమౌజుడు; చ — మరియు; వీర్య-వాన్ — వీరుడైన; సౌభద్రః — సుభద్ర కుమారుడు; ద్రౌపదేయాః — ద్రౌపది పుత్రులు; చ — మరియు; సర్వే — అందరును; ఏవ — నిజంగా; మహా-రథాః — పదివేలమంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు
BG 1.4-6: వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి - యుయుధానుడు, విరాటుడు, మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు - వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా, ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు, వీరందరూ శ్రేష్ఠమైన యుద్ధ వీరులే.
రాబోయే పెను విపత్తు భయానికి, దుర్యోధనుడికి, పాండవులు సమీకరించిన సైన్యం, ఉన్న దాని కన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది. తన ఆందోళనని వ్యక్తం చేస్తూ, పాండవుల పక్షంలోనున్న మహారథులను (పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులు) చూపాడు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారే.
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ । నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ।। 7 ।।
7
1
https://www.holy-bhagava…udio/001_007.mp3
అస్మాకం — మన; తు — కానీ; విశిష్టాః — శ్రేష్ఠమైన వారు; యే — ఎవరు; తాన్ — వారిని; నిబోధ — తెలుసుకొనుము; ద్విజ-ఉత్తమ — బ్రాహ్మణ శ్రేష్ఠుడా; నాయకాః — నాయకులు; మమ — మన; సైన్యస్య — సైన్యానికి; సంజ్ఞా-అర్థం — ఎఱుక కొరకు; తాన్ — వారిని; బ్రవీమి — తెలుపుతున్నాను; తే — మీకు.
BG 1.7: ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము, వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎఱుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను.
దుర్యోధనుడు, కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని ద్విజోత్తమ (ద్విజులలో అంటే బ్రాహ్మణులలో ఉత్తముడైన వాడు) అని సంబోధించాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఆ పదాన్ని వాడాడు. నిజానికి ద్రోణాచార్యుడు వృత్తి రీత్యా యోధుడు కాడు; సైనిక విద్యని నేర్పించే గురువు మాత్రమే. ఒక కపట నాయకుడి లాగా దుర్యోధనుడు, తన గురువుగారి విధేయతపట్లనే సిగ్గుమాలిన సందేహాలను కలిగి ఉన్నాడు. దుర్యోధనుడి మాటల్లో ఉన్న గూడార్థం ఏమిటంటే, ఒకవేళ ద్రోణాచార్యుడు ధైర్యవంతంగా పోరాడక పోతే అతను దుర్యోధనుడి రాజ మందిరంలో విలాస భోజనానికి ఆశపడే సామాన్య బ్రాహ్మణుడు మాత్రమే అవుతాడు అని. ఈ విధంగా మాట్లాడిన దుర్యోధనుడు, తన స్వంత ఉత్సాహాన్ని మరియు తన గురువు గారి యొక్క ఉత్సాహాన్ని పెంచటానికి తమ పక్షంలో ఉన్న మహాయోధుల గురించి పేర్కొనటం మొదలు పెట్టాడు.
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః । అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ।। 8 ।।
8
1
https://www.holy-bhagava…udio/001_008.mp3
భవాన్ — స్వయంగా మీరు; భీష్మః — భీష్ముడు; చ — మరియు; కర్ణః — కర్ణుడు; చ — మరియు; కృపః — కృపాచార్యుడు; చ — మరియు; సమితింజయః — యుద్ధంలో విజయుడు; అశ్వత్థామా — అశ్వత్థామ; వికర్ణ — వికర్ణుడు; చ — మరియు; సౌమదత్తిః — భూరిశ్రవుడు (సోమదత్తుని కుమారుడు); తథా — ఈ విధంగా; ఏవ — కూడా; చ — మరియు.
BG 1.8: మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు - వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే.
అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః । నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ।। 9 ।।
9
1
https://www.holy-bhagava…udio/001_009.mp3
అన్యే — ఇతరులు; చ — కూడా; బహవః — చాలామంది; శూరాః — వీర యోధులు; మత్-అర్థే — నా కోసం; త్యక్త-జీవితాః — ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు; నానా-శస్త్ర-ప్రహరణాః — అనేక ఆయుధములు కలిగినవారు; సర్వే — అందరూ; యుద్ధ-విశారదాః — యుద్దరంగంలో నిపుణులు.
BG 1.9: ఇంకా చాలా మంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్దంగా వున్నారు. వీరందరూ యుద్ధవిద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగిఉన్నారు.
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్। పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం ।। 10 ।।
10
1
https://www.holy-bhagava…udio/001_010.mp3
అపర్యాప్తం — అపరిమితమైన; తత్ — అది; అస్మాకం — మన యొక్క; బలం — బలము; భీష్మ — భీష్మ పితామహుడిచే; అభిరక్షితాం — సురక్షితంగా ఏర్పాటుచేయబడ్డ; పర్యాప్తం — పరిమితమైన; తు — కానీ; ఇదం — ఈ; ఏతేషాం — వారియొక్క; బలం — బలము; భీమ — భీముడు; అభిరక్షితాం — సావధానంగా రక్షింపబడుచున్న.
BG 1.10: మన సైనిక బలం అపరిమితమైనది, మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము, కానీ, భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటుచేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం, పరిమితమైనది.
దుర్యోధనుడి ప్రగల్భాలు సొంత గొప్పలు చెప్పుకునేవాడికి సాధారణమే. గొప్పలకు పోయేవారు, అంత్యకాలం సమీపించినప్పుడు, పరిస్థితిని నిజాయితీతో అంచనావేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు. భీష్ముడిచే రక్షింపబడుచున్న తనసైన్యం అపరిమితమైనది అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోతోంది. భీష్మపితామహుడు కౌరవ పక్షానికి సర్వసైన్యాధ్యక్షుడు. తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించటం చాలా కష్టం. పాండవపక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడి బద్ధశత్రువు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు, భీష్ముడి సామర్ధ్యాన్ని భీముడి బలంతో పోల్చాడు. కానీ, భీష్ముడు, కౌరవులకి, పాండవులకీ ఇరువురికీ కూడా పితామహుడే, ఇరు పక్షాల క్షేమం కోరేవాడే. పాండవులపై అతనికి (భీష్ముడికి) వున్న ప్రేమ, తనను మనస్పూర్తిగా యుద్ధం చేయనివ్వదు. అంతేకాక, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఉన్న ఈ ధర్మయుద్ధంలో, భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అధర్మ పక్షానికి గెలుపుని సాధించలేదు, అని భీష్ముడికి తెలుసు. కానీ, హస్తినాపుర వాసులకి మరియు కౌరవులపట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా, భీష్ముడు, పాండవుల ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేయటానికి నిశ్చయించుకున్నాడు. ఈ నిర్ణయం భీష్ముని యొక్క నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తెలుపుతోంది.
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః । భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ।। 11 ।।
11
1
https://www.holy-bhagava…udio/001_011.mp3
అయనేషు — వ్యూహాత్మక స్థానాల యందు; చ — మరియు; సర్వేషు — అన్నీ; యథా-భాగం — మీ మీ స్థానంలో; అవస్థితాః — నిలిచివుండి; భీష్మం — భీష్మ పితామహుడిని; ఏవ — మాత్రమే; అభిరక్షంతు — రక్షించండి; భవంతః — మీరు; సర్వే — అందరు; ఏవ హి — కూడా.
BG 1.11: కావున, కౌరవ సేనానాయకులందరికీ, మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను.
శత్రువులకు అసాధ్యుడైన భీష్ముడిని, తన సైన్యానికి స్ఫూర్తిగా, శక్తిగా పరిగణించాడు దుర్యోధనుడు. కాబట్టి, సేనావ్యూహంలో తమ తమ కీలక స్థానాలని కాపాడుకుంటూనే, భీష్ముడిని పరిరక్షించమని తన సేనా నాయకులని కోరాడు.
తస్య సంజనయన్హర్షం కురువృద్ధః పితామహః । సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ।। 12 ।।
12
1
https://www.holy-bhagava…udio/001_012.mp3
తస్య — అతనికి; సంజనయన్ — కలిగించుచు; హర్షం — సంతోషమును; కురు-వృద్ధః — కురు వంశములో వృద్ధుడు (భీష్ముడు); పితామహః — తాత గారు; సింహ-నాదం — సింహ గర్జన; వినద్య — శబ్దం చేసి; ఉచ్చైః — పెద్ద స్వరంతో; శంఖం — శంఖమును; దధ్మౌ — మ్రోగించెను; ప్రతాప-వాన్ — తేజోవంతమైన.
BG 1.12: అప్పుడు, కురువృద్ధుడు, మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు, సింహంలా గర్జించాడు, మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ, దుర్యోధనుడికి హర్షమును కలుగచేసెను.
భీష్మ పితామహుడు తన మనవడి హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకున్నాడు, మరియు సహజంగా అతని మీద వున్న వాత్సల్యంతో, అతన్ని సంతోషపరచటానికి పెద్ద శబ్దంతో తన శంఖాన్ని పూరించాడు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే అవతలి పక్షంలో ఉండటంచే, దుర్యోధనుడి విజయానికి ఏమాత్రం అవకాశం లేదని తెలిసినా, తన ధర్మాన్ని నిర్వర్తిస్తానని మనవడికి తెలియచేసాడు. అప్పటి యుద్ధ నియమాల ప్రకారం ఇది యుద్ధ ప్రారంభానికి సంకేతం.
తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః । సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ ।। 13 ।।
13
1
https://www.holy-bhagava…udio/001_013.mp3
తతః — ఆ తరువాత; శంఖాః — శంఖములు; చ — మరియు; భేర్యః — భేరీలు; చ — మరియు; పణవ-ఆనక — డోళ్ళు మరియు ఢంకాలు; గో-ముఖాః — కొమ్ము వాద్యములు; సహసా — అకస్మాత్తుగా ఒక్కపెట్టున; ఏవ — నిజంగా; అభ్యహన్యంత — పెద్దగా మ్రోగినవి; సః — ఆ యొక్క; శబ్దః — శబ్దము; తుములః — భయానకముగా; అభవత్ — ఉండెను.
BG 1.13: ఆ తరువాత, శంఖములు, డోళ్ళు, ఢంకాలు, భేరీలు, మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి, మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను.
యుద్ధానికి భీష్ముడి యొక్క గొప్ప ఉత్సాహాన్ని గమనించిన కౌరవ సైన్యం కూడా ఉత్సాహవంతులై రణగొణ ధ్వని చేసారు. పణవ అంటే ఢంకాలు, ఆనక అంటే డోళ్ళు/ఢంకాలు, మరియు గో-ముఖ అంటే కొమ్ము వాద్యములు. ఇవన్నీ వాద్య పరికరములే, మరియు వీటన్నిటీ ఒక్కుమ్మడి శబ్దం మిక్కిలి కోలాహలాన్ని కలుగచేసింది.
తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ । మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ।। 14 ।।
14
1
https://www.holy-bhagava…udio/001_014.mp3
తతః — ఆ తరువాత; శ్వేతైః — తెల్లని; హయైః — గుఱ్ఱములు; యుక్తే — కట్టబడిన; మహతి — శ్రేష్ఠమైన; స్యందనే — రథము; స్థితౌ — కూర్చొనిఉన్న; మాధవః — శ్రీ కృష్ణుడు, సౌభాగ్యదేవత అయిన లక్ష్మీదేవి భర్త; పాండవః — అర్జునుడు; చ — మరియు; ఏవ — కూడా; దివ్యౌ — దివ్యమయిన; శంఖౌ — శంఖములను; ప్రదధ్మతుః — పూరించారు.
BG 1.14: ఆ తరువాత, పాండవ సైన్యం మధ్యలోనుండి, తెల్లని గుఱ్ఱములు పూన్చి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న, మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు.
కౌరవ సైన్య పక్షం నుండి వచ్చిన ధ్వని సద్దుమణిగిన పిదప, శ్రీ కృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు, అద్భుతమైన రథంలో కూర్చొని వుండి, భయరహితులై, తమ తమ శంఖములను శక్తివంతంగా పూరించారు. దీనితో పాండవ పక్షంలో కూడా యుద్ధానికి ఉత్సాహం రగిలింది. సంజయుడు శ్రీ కృష్ణుడికి 'మాధవ' అన్న పేరు వాడాడు. 'మా' అంటే, లక్ష్మీదేవిని సూచిస్తుంది; 'ధవ' అంటే భర్త అని. శ్రీ కృష్ణుడు తన విష్ణు మూర్తి రూపంలో, ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీ దేవికి భర్త. సౌభాగ్య దేవత యొక్క అనుగ్రహం పాండవుల పక్షాన ఉన్నదని, వారు త్వరలో యుద్ధంలో విజేయులై తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారు అని ఈ శ్లోకం సూచిస్తున్నది. పాండవులు అంటే పాండురాజు కుమారులు అని. ఐదుగురు అన్నదమ్ముల్లో ఎవరినైనా 'పాండవ' అని సంబోధించవచ్చు. ఇక్కడ ఈ పదం అర్జునుడికి వాడబడుతున్నది. అతను కూర్చున్న అద్భుతమైన రథం అతనికి అగ్ని దేవుడిచే ప్రసాదించబడినది.
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః । పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ।। 15 ।।
15
1
https://www.holy-bhagava…udio/001_015.mp3
పాంచజన్యం — పాంచజన్యం అని పేరు గల శంఖము; హృషీక-ఈశః — శ్రీ కృష్ణుడు, మనస్సు, ఇంద్రియముల అధిపతి; దేవదత్తం — దేవదత్తం అని పేరు గల శంఖము; ధనంజయః — అర్జునుడు, ఐశ్వర్యమును జయించేవాడు; పౌండ్రం — పౌండ్రం అని పేరుగల శంఖము; దధ్మౌ — పూరించెను; మహా-శంఖం — ఒక బ్రహ్మాండమైన శంఖమును; భీమ-కర్మా — అత్యంత కష్టసాధ్యకార్యములను చేయునట్టి; వృక-ఉదరః — భీముడు, గొప్పగా భుజించేవాడు.
BG 1.15: హృషీకేశుడు, పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు, మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించే వాడు, అత్యంత కష్టసాధ్యకార్యములను చేయునట్టి భీముడు, పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను.
శ్రీ కృష్ణుడికి వాడబడిన 'హృషీకేశః' అన్న పదం, ఆయన మనస్సు మరియు ఇంద్రియములకు అధిపతి అని సూచిస్తుంది. శ్రీ కృష్ణుడు తన యొక్క, మరియు అందరి యొక్క మనసు, ఇంద్రియములకు సర్వోన్నత అధిపతి. తన అద్భుతమైన లీలలను ఈ భూలోకంలో ప్రదర్శించేటప్పుడు కూడా తన మనస్సు, ఇంద్రియముల పై కృష్ణుడు, పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు.
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః । నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ।। 16 ।। కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః । ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ।। 17 ।। ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే । సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ।। 18 ।।
16
1
https://www.holy-bhagava…/001_016-018.mp3
అనంత-విజయం — అనంతవిజయం అని పేరు గల శంఖము; రాజా — రాజు; కుంతీ-పుత్రః — కుంతీ దేవి పుత్రుడు; యుధిష్ఠిరః — యుధిష్ఠిరుడు; నకులః — నకులుడు; సహదేవః — సహదేవుడు; చ — మరియు; సుఘోష-మణిపుష్పకౌ — సుఘోషము, మణిపుష్పకము అను పేర్లుగల శంఖములు; కాశ్యః — కాశీ రాజు; చ — మరియు; పరమ-ఇషు-ఆసః — శ్రేష్ఠమైన విలుకాడు; శిఖండీ — శిఖండి; చ — మరియు; మహా-రథః — పదివేల సామాన్య యోధుల బలానికి ఒక్కరిగా సరితూగే యోధులు; ధృష్టద్యుమ్నః — ధృష్టద్యుమ్నుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; సాత్యకిః — సాత్యకి; చ — మరియు; అపరాజితః — అజేయుడైన; ద్రుపదః — ద్రుపదుడు; ద్రౌపదేయాః — ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు; చ – మరియు; సర్వశః — అందరూ; పృథివీ-పతే — భూగోళాన్ని పాలించేవాడు; సౌభద్రః — అభిమన్యుడు, సుభద్ర కుమారుడు; చ — మరియు; మహా-బాహుః — గొప్ప బాహువులు కలవాడు; శంఖాన్ — శంఖములు; దధ్ముః — పూరించారు; పృథక్ పృథక్ — వేరు వేరుగా.
BG 1.16-18: ఓ భూమండలాన్ని పాలించేవాడా! యుధిష్ఠిర మహారాజు అనంతవిజయాన్ని పూరించాడు, నకుల సహదేవులు, సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీ రాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, మరియు భుజబలము కలవాడు, సుభద్రా పుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు.
పాండవ అన్నదమ్ముల్లో యుధిష్ఠిరుడు పెద్దవాడు. ఇక్కడ ఆయన ‘రాజా’ అని సంబోధించబడుతున్నాడు; 'రాజసూయ యజ్ఞం' చేసి, ఇతర రాజులందరి ప్రశంసలు అందుకుని అతను ఆ బిరుదుని సంపాదించుకున్నాడు. రాజ మందిరంలో వున్నా, అరణ్యవాసంలో ఉన్నా అతనిలో రాజసం, విశాల-హృదయ స్వభావం ఉట్టిపడేవి. సంజయుడు ధృతరాష్ట్రుడిని 'పృథివీపతే' (భూగోళాన్ని పరిపాలించేవాడా) అని సంబోధిస్తున్నాడు. ఒక దేశాన్ని కాపాడటం లేదా వినాశకరమైన యుద్ధంలోకి నెట్టి వేయటం అనేది రాజు చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ సంబోధనకి ఉన్న నిగూఢ అర్థం ఏమిటంటే, ‘ఇరు సైన్యాలు యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాయి. ఓ రాజా, ధృతరాష్ట్రా, నీవు ఒక్కడివే వారిని వెనుకకు పిలువగలవు. ఏమి నిర్ణయించబోతున్నావు?’ అని.
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః । నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ।। 16 ।। కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః । ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ।। 17 ।। ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే । సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ।। 18 ।।
17
1
https://www.holy-bhagava…/001_016-018.mp3
అనంత-విజయం — అనంతవిజయం అని పేరు గల శంఖము; రాజా — రాజు; కుంతీ-పుత్రః — కుంతీ దేవి పుత్రుడు; యుధిష్ఠిరః — యుధిష్ఠిరుడు; నకులః — నకులుడు; సహదేవః — సహదేవుడు; చ — మరియు; సుఘోష-మణిపుష్పకౌ — సుఘోషము, మణిపుష్పకము అను పేర్లుగల శంఖములు; కాశ్యః — కాశీ రాజు; చ — మరియు; పరమ-ఇషు-ఆసః — శ్రేష్ఠమైన విలుకాడు; శిఖండీ — శిఖండి; చ — మరియు; మహా-రథః — పదివేల సామాన్య యోధుల బలానికి ఒక్కరిగా సరితూగే యోధులు; ధృష్టద్యుమ్నః — ధృష్టద్యుమ్నుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; సాత్యకిః — సాత్యకి; చ — మరియు; అపరాజితః — అజేయుడైన; ద్రుపదః — ద్రుపదుడు; ద్రౌపదేయాః — ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు; చ – మరియు; సర్వశః — అందరూ; పృథివీ-పతే — భూగోళాన్ని పాలించేవాడు; సౌభద్రః — అభిమన్యుడు, సుభద్ర కుమారుడు; చ — మరియు; మహా-బాహుః — గొప్ప బాహువులు కలవాడు; శంఖాన్ — శంఖములు; దధ్ముః — పూరించారు; పృథక్ పృథక్ — వేరు వేరుగా.
BG 1.16-18: ఓ భూమండలాన్ని పాలించేవాడా! యుధిష్ఠిర మహారాజు అనంతవిజయాన్ని పూరించాడు, నకుల సహదేవులు, సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీ రాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, మరియు భుజబలము కలవాడు, సుభద్రా పుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు.
పాండవ అన్నదమ్ముల్లో యుధిష్ఠిరుడు పెద్దవాడు. ఇక్కడ ఆయన ‘రాజా’ అని సంబోధించబడుతున్నాడు; 'రాజసూయ యజ్ఞం' చేసి, ఇతర రాజులందరి ప్రశంసలు అందుకుని అతను ఆ బిరుదుని సంపాదించుకున్నాడు. రాజ మందిరంలో వున్నా, అరణ్యవాసంలో ఉన్నా అతనిలో రాజసం, విశాల-హృదయ స్వభావం ఉట్టిపడేవి. సంజయుడు ధృతరాష్ట్రుడిని 'పృథివీపతే' (భూగోళాన్ని పరిపాలించేవాడా) అని సంబోధిస్తున్నాడు. ఒక దేశాన్ని కాపాడటం లేదా వినాశకరమైన యుద్ధంలోకి నెట్టి వేయటం అనేది రాజు చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ సంబోధనకి ఉన్న నిగూఢ అర్థం ఏమిటంటే, ‘ఇరు సైన్యాలు యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాయి. ఓ రాజా, ధృతరాష్ట్రా, నీవు ఒక్కడివే వారిని వెనుకకు పిలువగలవు. ఏమి నిర్ణయించబోతున్నావు?’ అని.
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః । నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ।। 16 ।। కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః । ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ।। 17 ।। ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే । సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ।। 18 ।।
18
1
https://www.holy-bhagava…/001_016-018.mp3
అనంత-విజయం — అనంతవిజయం అని పేరు గల శంఖము; రాజా — రాజు; కుంతీ-పుత్రః — కుంతీ దేవి పుత్రుడు; యుధిష్ఠిరః — యుధిష్ఠిరుడు; నకులః — నకులుడు; సహదేవః — సహదేవుడు; చ — మరియు; సుఘోష-మణిపుష్పకౌ — సుఘోషము, మణిపుష్పకము అను పేర్లుగల శంఖములు; కాశ్యః — కాశీ రాజు; చ — మరియు; పరమ-ఇషు-ఆసః — శ్రేష్ఠమైన విలుకాడు; శిఖండీ — శిఖండి; చ — మరియు; మహా-రథః — పదివేల సామాన్య యోధుల బలానికి ఒక్కరిగా సరితూగే యోధులు; ధృష్టద్యుమ్నః — ధృష్టద్యుమ్నుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; సాత్యకిః — సాత్యకి; చ — మరియు; అపరాజితః — అజేయుడైన; ద్రుపదః — ద్రుపదుడు; ద్రౌపదేయాః — ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు; చ – మరియు; సర్వశః — అందరూ; పృథివీ-పతే — భూగోళాన్ని పాలించేవాడు; సౌభద్రః — అభిమన్యుడు, సుభద్ర కుమారుడు; చ — మరియు; మహా-బాహుః — గొప్ప బాహువులు కలవాడు; శంఖాన్ — శంఖములు; దధ్ముః — పూరించారు; పృథక్ పృథక్ — వేరు వేరుగా.
BG 1.16-18: ఓ భూమండలాన్ని పాలించేవాడా! యుధిష్ఠిర మహారాజు అనంతవిజయాన్ని పూరించాడు, నకుల సహదేవులు, సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీ రాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, మరియు భుజబలము కలవాడు, సుభద్రా పుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు.
పాండవ అన్నదమ్ముల్లో యుధిష్ఠిరుడు పెద్దవాడు. ఇక్కడ ఆయన ‘రాజా’ అని సంబోధించబడుతున్నాడు; 'రాజసూయ యజ్ఞం' చేసి, ఇతర రాజులందరి ప్రశంసలు అందుకుని అతను ఆ బిరుదుని సంపాదించుకున్నాడు. రాజ మందిరంలో వున్నా, అరణ్యవాసంలో ఉన్నా అతనిలో రాజసం, విశాల-హృదయ స్వభావం ఉట్టిపడేవి. సంజయుడు ధృతరాష్ట్రుడిని 'పృథివీపతే' (భూగోళాన్ని పరిపాలించేవాడా) అని సంబోధిస్తున్నాడు. ఒక దేశాన్ని కాపాడటం లేదా వినాశకరమైన యుద్ధంలోకి నెట్టి వేయటం అనేది రాజు చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ సంబోధనకి ఉన్న నిగూఢ అర్థం ఏమిటంటే, ‘ఇరు సైన్యాలు యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాయి. ఓ రాజా, ధృతరాష్ట్రా, నీవు ఒక్కడివే వారిని వెనుకకు పిలువగలవు. ఏమి నిర్ణయించబోతున్నావు?’ అని.
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ । నభశ్చ పృథివీం చైవ తుములోఽభ్యనునాదయన్ ।। 19 ।।
19
1
https://www.holy-bhagava…udio/001_019.mp3
సః — అట్టి; ఘోషః — శబ్దము; ధార్తరాష్ట్రాణాం — ధృతరాష్ట్రుని పుత్రుల యొక్క; హృదయాని — గుండెలను; వ్యదారయత్ — బ్రద్దలు చేసెను; నభః — ఆకాశము; చ — మరియు; పృథివీం — భూమి; చ — మరియు; ఏవ — నిజముగా; తుములః — భీకరమైన శబ్దం; అభ్యనునాదయన్ — ప్రతిధ్వనింపచేయుచు.
BG 1.19: ఓ ధృతరాష్ట్రా, ఆ భీకరమైన శబ్దానికి భూమ్యాకాశములు దద్దరిల్లెను; అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను.
పాండవ సైన్యం పూరించిన శంఖనాద శబ్దం కౌరవ సైన్య గుండెలను బ్రద్దలుచేసింది. అయితే, కౌరవ సైన్యం తమ శంఖాలను పూరించినప్పుడు పాండవ సైన్యంపై అలాంటి ప్రభావం ఏమీ పడినట్లు చెప్పబడలేదు. పాండవులు భగవంతుని ఆశ్రయించి ఉండటం వలన వారికి తాము సంరక్షిపబడుతాము అన్న విశ్వాసం ఉంది. అటుపక్క, కౌరవులు, తమ స్వీయ బలం మీదనే ఆధారపడి మరియు మనఃసాక్షిలో నేరం చేసాము అన్న వేదన వల్ల, ఓటమి భయానికి లోనయ్యారు.
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః । ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ।। 20 ।। హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే ।
20
1
https://www.holy-bhagava…udio/001_020.mp3
అథ — అనంతరము; వ్యవస్థితాన్ — క్రమంగా నిలిచివున్న; దృష్ట్వా — చూసి; ధార్తరాష్ట్రాన్ — ధృతరాష్ట్రుని తనయులు; కపి-ధ్వజః — వానరమును (కోతి) జండాపై కలవాడు; ప్రవృత్తే — ప్రారంభించటానికి సిద్దంగా వున్న; శస్త్ర సంపాతే — ఆయుధములు వాడటానికి; ధనుః — ధనుస్సు (విల్లు) ను; ఉద్యమ్య — పైకెత్తి; పాండవః — అర్జునుడు, పాండు పుత్రుడు; హృషీకేశం — శ్రీ కృష్ణునితో; తదా — అప్పుడు; వాక్యం — పదములు; ఇదం — ఇవి; ఆహ — పలికెను; మహీ-పతే — రాజా.
BG 1.20: ఆ సమయంలో, తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగివున్న పాండుపుత్రుడు అర్జునుడు, తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచిఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.
శక్తిశాలి అయిన హనుమంతుడు తన రథం (జెండా) మీద ఉన్నాడు కాబట్టి, అర్జునుడికి కపి ధ్వజుడు అన్న పేరు ఉంది. దీనికి ఒక పూర్వ వృత్తాంతం ఉంది. ఒకసారి అర్జునుడు విలు విద్యలో తనకున్న ప్రావీణ్యానికి గర్వపడి, శ్రీ రామచంద్రుని సమయంలో వానరములు భారతదేశం నుండి లంకకు సేతువు (బ్రిడ్జి)ని నిర్మించటానికి ఎందుకు అంత కష్టపడ్డారో తనకు అర్థం కావటంలేదు అని, శ్రీ కృష్ణునితో అన్నాడు. తనే గనక వుంటే, బాణములతో ఒక వారధిని చేసేవాడిని అన్నాడు. శ్రీ కృష్ణుడు, అది ఎలా చేసేవాడో చూపించమన్నాడు. అర్జునుడు తన శర పరంపరతో ఒక వంతెనని నిర్మించాడు. శ్రీ కృష్ణుడు హనుమంతుడిని ఆ వంతెనని పరీక్షించడానికి రమ్మని పిలిచాడు. హనుమ దానిపై నడవటం ప్రారంభించగానే ఆ వంతెన కూలిపోవటం మొదలయింది. తన బాణాలతో చేసిన వారధి రాముని అపారమైన (వానర) సైన్య బరువుని తట్టుకోలేదని అర్జునుడికి అర్థం అయింది మరియు అర్జునుడు తన తప్పుకి క్షమాపణ వేడుకున్నాడు. అప్పుడు హనుమంతుడు అర్జునుడికి, ఎప్పుడూ తన ప్రావీణ్యం చూసుకొని గర్వపడొద్దని హితవు చెప్పాడు. హనుమ దయాళువై, మహాభారత యుద్ధంలో నీ రథంపై కూర్చుంటాను అని అర్జునుడికి వరం ఇచ్చాడు. ఈ విధంగా, అర్జునుడి రథం, హనుమంతుని చిహ్నంతో ఉన్న జెండాని కలిగి వుంది. దీనితో అతనికి 'కపి ధ్వజుడు', అంటే జెండాపై వానరుడు ఉన్నవాడు, అన్న పేరొచ్చింది.
అర్జున ఉవాచ । సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ।। 21 ।। యావదేతాన్ నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్ । కైర్మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే ।। 22 ।।
21
1
https://www.holy-bhagava…/001_021-022.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; సేనయోః — సైన్యములు; ఉభయోః — రెండు; మధ్యే — మధ్యలో; రథం — రథము; స్థాపయ — నిలిపిఉంచు; మే — నా యొక్క; అచ్యుత — శ్రీ కృష్ణా, సంపూర్ణ దోషరహితుడా; యావత్ — ఎంతవరకు అయితే; ఏతాన్ — ఈ యొక్క; నిరీక్షే — చూసి; అహం — నేను; యోద్ధు-కామాన్ — యుద్ధం కొరకు; అవస్థితాన్ — నిలిపిఉన్న; కైః — ఎవరితో; మయా — నా చే; సహ — కూడి; యోద్ధవ్యమ్ — యుద్ధం చేయవలసి; అస్మిన్ — ఈ యొక్క; రణ-సముద్యమే — మహా పోరాటంలో.
BG 1.21-22: అర్జునుడు ఇలా అన్నాడు: ఓ అచ్యుతా (శ్రీకృష్ణా), దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహా పోరాటంలో, రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి.
సమస్త సృష్టికి పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడి భక్తుడు అర్జునుడు. అయినప్పటికీ, ఈ శ్లోకంలో, అర్జునుడు భగవంతుడిని తన రథాన్ని తాను కోరుకున్న చోటికి తీసుకెళ్లమన్నాడు. ఇది భగవంతునికి తన భక్తులతో ఉండే సంబంధం యొక్క మాధుర్యాన్ని తెలియచేస్తోంది. తన పట్ల భక్తుల ప్రేమకు ఋణపడి, భగవంతుడు వారికి దాసుడు అయిపోతాడు. అహం భక్త పరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ సాధుభిర్ గ్రస్త-హృదయో భక్తైర్ భక్త-జన-ప్రియః (భాగవతం 9.4.63) ‘నేను సర్వ స్వతంత్రుడను అయినా, నా భక్తులకు బానిస అయిపోతాను. వారు నాకు అత్యంత ప్రియమైన వారు, మరియు నేను వారి ప్రేమకు ఋణ పడిపోతాను.’ అర్జునుడు సుఖంగా రథంలో కూర్చుని తనకి ఆదేశాలు ఇస్తుంటే, అతని భక్తికి వశుడైపోయిన శ్రీ కృష్ణ పరమాత్మ రథాన్ని నడిపే సారధి స్థానాన్ని తీస్కున్నాడు.
అర్జున ఉవాచ । సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ।। 21 ।। యావదేతాన్ నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్ । కైర్మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే ।। 22 ।।
22
1
https://www.holy-bhagava…/001_021-022.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; సేనయోః — సైన్యములు; ఉభయోః — రెండు; మధ్యే — మధ్యలో; రథం — రథము; స్థాపయ — నిలిపిఉంచు; మే — నా యొక్క; అచ్యుత — శ్రీ కృష్ణా, సంపూర్ణ దోషరహితుడా; యావత్ — ఎంతవరకు అయితే; ఏతాన్ — ఈ యొక్క; నిరీక్షే — చూసి; అహం — నేను; యోద్ధు-కామాన్ — యుద్ధం కొరకు; అవస్థితాన్ — నిలిపిఉన్న; కైః — ఎవరితో; మయా — నా చే; సహ — కూడి; యోద్ధవ్యమ్ — యుద్ధం చేయవలసి; అస్మిన్ — ఈ యొక్క; రణ-సముద్యమే — మహా పోరాటంలో.
BG 1.21-22: అర్జునుడు ఇలా అన్నాడు: ఓ అచ్యుతా (శ్రీకృష్ణా), దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహా పోరాటంలో, రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి.
సమస్త సృష్టికి పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడి భక్తుడు అర్జునుడు. అయినప్పటికీ, ఈ శ్లోకంలో, అర్జునుడు భగవంతుడిని తన రథాన్ని తాను కోరుకున్న చోటికి తీసుకెళ్లమన్నాడు. ఇది భగవంతునికి తన భక్తులతో ఉండే సంబంధం యొక్క మాధుర్యాన్ని తెలియచేస్తోంది. తన పట్ల భక్తుల ప్రేమకు ఋణపడి, భగవంతుడు వారికి దాసుడు అయిపోతాడు. అహం భక్త పరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ సాధుభిర్ గ్రస్త-హృదయో భక్తైర్ భక్త-జన-ప్రియః (భాగవతం 9.4.63) ‘నేను సర్వ స్వతంత్రుడను అయినా, నా భక్తులకు బానిస అయిపోతాను. వారు నాకు అత్యంత ప్రియమైన వారు, మరియు నేను వారి ప్రేమకు ఋణ పడిపోతాను.’ అర్జునుడు సుఖంగా రథంలో కూర్చుని తనకి ఆదేశాలు ఇస్తుంటే, అతని భక్తికి వశుడైపోయిన శ్రీ కృష్ణ పరమాత్మ రథాన్ని నడిపే సారధి స్థానాన్ని తీస్కున్నాడు.
యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః । ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః ।। 23 ।।
23
1
https://www.holy-bhagava…udio/001_023.mp3
యోత్స్యమానాన్ — యుద్ధానికి వచ్చినవారు; అవేక్షే అహం — నాకు చూడాలని వుంది; యే — ఎవరు; ఏతే — వారు; అత్ర — ఇక్కడ; సమాగతాః — కూడిఉన్న; ధార్తరాష్ట్రస్య — ధృతరాష్ట్రుని పుత్రునికి; దుర్బుద్ధేః — దుర్భుద్ధి కలవాడు; యుద్ధే — యుద్ధంలో; ప్రియ-చికీర్షవ — సంతోషపెట్టడం కొరకు.
BG 1.23: దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రున్ని సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చియున్న అందరిని ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది.
పాపిష్టి-బుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులు పాండవులకు చెందిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు, కాబట్టి వారి పక్షంలో పోరాడే వారు కూడా సహజంగా దురుద్దేశంతో ఉన్నవారే. అర్జునుడు తను ఎవరితో యుద్ధం చేయాల్సి వుందో వారిని ఒకసారి చూడదలచాడు. ప్రారంభంలో అర్జునుడు పరాక్రమంతో యుద్ధానికి ఆతురతతో ఉన్నాడు. దుర్యోధనుడు ఎన్నోసార్లు పాండవుల వినాశనానికి కుట్రలు పన్నాడు అని గుర్తుచేస్తూ, దుష్టబుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులను ప్రస్తావించాడు. అర్జునుడి దృక్పథం ఇలా వుంది, ‘న్యాయబద్ధంగా రాజ్యంలో సగభాగం మాదే, కానీ అతను దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. వాడు దుష్టబుద్ధి కలవాడు, ఇంకా ఈ రాజులు వాడికి సహాయం చేయటానికి ఇక్కడ గుమికూడారు, కాబట్టి వారు కూడా దుర్మార్గులే. యుద్ధం కోసం ఇంత ఆతురతతో ఉన్న యోధులని నేను పరికించి చూడాలి. వారు అధర్మం వైపు మొగ్గుచూపుతున్నారు, కాబట్టి మా చేత నాశనం అయిపోతారు.’
సంజయ ఉవాచ । ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత । సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ।। 24 ।।
24
1
https://www.holy-bhagava…udio/001_024.mp3
సంజయ ఉవాచ — సంజయుడు చెప్పెను; ఏవం — ఈ విధంగా; ఉక్తః — చెప్పబడిన; హృషీకేశః — శ్రీ కృష్ణుడు, ఇంద్రియములకు అధిపతి; గుడాకేశేన — అర్జునుడి చేత, నిద్రని జయించినవాడు; భారత — భరత వంశీయుడా; సేనయోః — సైన్యములు; ఉభయోః — రెండు; మధ్యే — మధ్యలో; స్థాపయిత్వా — నిలిపి; రథ-ఉత్తమమ్ — ఉత్తమమైన రథమును.
BG 1.24: సంజయుడు ఇలా అన్నాడు: ఓ ధృతరాష్ట్రా, ఈ విధంగా, నిద్రని జయించినవాడైన, అర్జునుడు కోరిన విధంగా, శ్రీ కృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను.
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ । ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ।। 25 ।।
25
1
https://www.holy-bhagava…udio/001_025.mp3
భీష్మ — పితామహుడు భీష్ముడు; ద్రోణ — ద్రోణాచార్యుడు; ప్రముఖతః — సమక్షంలో; సర్వేషాం — అందరు; చ — మరియు; మహీ-క్షితాం — ఇతర రాజులు; ఉవాచ — పలికెను; పార్థ — అర్జునుడు, ప్రిథ తనయుడు; పశ్య — చూడుము; ఏతాన్ — ఈ యొక్క; సమవేతాన్ — చేరియున్న; కురూన్ — కురు వంశస్థులు; ఇతి — ఈ విధంగా.
BG 1.25: భీష్ముడు, ద్రోణాచార్యుడు, మరియు ఇతర రాజుల సమక్షంలో, శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పార్థా, ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడుము.
కురు అన్న పదం కౌరవులకు, పాండవులకు ఇద్దరికీ వర్తిస్తుంది, వారు ఇరువురు కురు వంశానికి చెందిన వారే. శ్రీ కృష్ణుడు, ఉద్దేశపూర్వకంగా కావాలనే ఈ పదాన్ని వాడి, అర్జునుడిలో బంధుత్వ భావన తెప్పించి, వారందరూ ఒకటే అన్న భావన కలిగిస్తున్నాడు. బంధుత్వ భావన మమకారానికి దారి తీసి, అది అర్జునుడిని గందరగోళానికి గురిచేస్తే, రాబోయే కలికాలంలో మానవులకు ప్రయోజనకారిగా ఉండే, భగవద్గీత ప్రభోదించే అవకాశం రావాలని శ్రీ కృష్ణుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ధార్తరాష్ట్రాన్ (ధృతరాష్ట్రుని పుత్రులు) అన్న పదానికి బదులు, కురూన్ (కురు వంశస్థులు) అన్న పదాన్ని వాడుతున్నాడు. ఎలాగైతే శస్త్ర చికిత్స వైద్యుడు కురుపుతో ఉన్న రోగికి మొదట్లో దానికి చీముపట్టి ముదిరే మందు ఇచ్చి, తరువాత ఆ యొక్క రోగగ్రస్తమైన భాగాన్ని తీసివేయటానికి శస్త్ర చికిత్స చేస్తాడో, భగవంతుడు కూడా ఆ విధంగానే పని చేస్తున్నాడు. మొదట అర్జునుడిలో అంతర్గతంగా వున్న మోహాన్ని (భ్రమ) ప్రేరేపించేది, ఆ తరువాత దాన్ని నిర్మూలించటానికే.
తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ । ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా ।। 26 ।। శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి ।
26
1
https://www.holy-bhagava…udio/001_026.mp3
తత్ర — అక్కడ; అపశ్యాత్ — చూసి; స్థితాన్ — నిలిచిఉన్న; పార్థః — అర్జునుడు; పితౄన్ — తండ్రులు (పినతండ్రులు, పెదతండ్రులు); అథ — తరువాత; పితామహాన్ — తాతలు; ఆచార్యాన్ — గురువులు; మాతులాన్ — మేనమామలు; భ్రాతౄన్ — సోదరులు; పుత్రాన్ — పుత్రులు; పౌత్రాన్ — మనుమలు; సఖీన్ — మిత్రులు; తథా — ఇంకా ; శ్వశురాన్ — మామలు; సుహృదః — శ్రేయోభిలాషులు; చ — మరియు; ఏవ — నిజముగా; సేనయోః — సైన్యములు; ఉభయోః — రెంటిలో; అపి — కూడా.
BG 1.26: అక్కడ, రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మేనల్లుళ్లను, మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను.
తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ ।। 27 ।। కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ ।
27
1
https://www.holy-bhagava…udio/001_027.mp3
తాన్ — ఇవి; సమీక్ష్య — చూసిన పిదప; సః — వారు; కౌంతేయః — అర్జునుడు; కుంతీ పుత్రుడు; సర్వాన్ — అందరూ; బంధూన్ — బంధువులు; అవస్థితాన్ — ఉన్నటువంటి; కృపయా — కరుణతో; పరయా — మిక్కిలి; ఆవిష్టః — కూడినవాడై; విషీదన్ — మిక్కిలి విచారం; ఇదం — ఈ విధంగా; అబ్రవీత్ — పలికెను.
BG 1.27: అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతీ పుత్రుడు అర్జునుడు, కారుణ్య భావం ఉప్పొంగినవాడై, తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను.
తన బంధువులందరినీ కలిపి యుద్ధభూమిలో చూడటం వలన, ఈ యొక్క భ్రాతృహత్యాపూరిత యుద్ధ పరిణామాలు, అర్జునుడి మనస్సుకి మొదటిసారి స్పష్టమైనాయి. శత్రువులను మృత్యు ద్వారాలకు పంపించేయటానికి మానసికంగా సిద్ధమై మరియు పాండవులపై జరిగిన ఎన్నో అన్యాయాలకు ప్రతీకారేచ్ఛతో సమరానికి వచ్చిన పరాక్రమవంతుడైన అర్జునుడికి అకస్మాత్తుగా మనస్సు మారిపోయింది. తోటి కురు వంశజులు శత్రు సైన్యంలో బారులు తీరి ఉండటం అతని హృదయాన్ని క్రుంగ తీసింది; అతని బుద్ధి గందరగోళానికి లోనయ్యింది, అతని శౌర్యానికి బదులుగా, తన విధి పట్ల పిరికితనం వచ్చేసింది, మరియు పరాక్రమమైన రాతి గుండె స్థానంలో మృదుహృదయత్వం చేరింది. అందుకే సంజయుడు అతని మృదుహృదయాన్ని మరియు ఆదరించే స్వభావాన్ని సూచిస్తూ, తన తల్లి కుంతీ దేవి తనయుడా అని సంబోధించాడు.
అర్జున ఉవాచ । దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ।। 28 ।। సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ।
28
1
https://www.holy-bhagava…udio/001_028.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు అన్నాడు; దృష్ట్వా — చూసాక; ఇమమ్ — ఈ యొక్క; స్వ-జనం — బంధువులు (సొంతవారు); కృష్ణ — కృష్ణ; యుయుత్సుం — యుద్ధానికి ఉత్సాహంతో; సముపస్థితమ్ — చేరిఉన్న; సీదంతి — వణుకుతున్న; మమ — నా యొక్క; గాత్రాణి — అంగములు; ముఖం — నోరు; చ — మరియు; పరిశుష్యతి — ఎండిపోవుచున్నది.
BG 1.28: అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణా, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి, నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది.
వాత్సల్యం అనేది ప్రాకృతికమైనది అయివుండవచ్చు లేదా ఆధ్యాత్మికమైనది అయివుండవచ్చు. బంధువుల పట్ల అనురాగం అనేది మనము ఈ శరీరమే అన్న భావన వల్ల వచ్చే భౌతిక ఉద్వేగము. ఈ ప్రకారంగా, మనము ఈ శరీరమే అనుకున్నప్పుడు మన శారీరక బంధువుల పట్ల అనురాగం పెంచుకుంటాము. ఇలాంటి అనురాగము అజ్ఞానం వల్ల కలుగుతుంది మరియు ఇది మనిషిని మరింత భౌతికవాద స్పృహ లోనికి నెట్టివేస్తుంది. అంతిమంగా, ఆ అనురాగము వేదనతో ముగుస్తుంది ఎందుకంటే శరీరం అంతమయినప్పుడు కుటుంబబంధాలు కూడా అంతమౌతాయి. మరోవైపు, పరమేశ్వరుడైన భగవంతుడు మన ఆత్మకి తండ్రి, తల్లి, స్నేహితుడు, యజమాని, మరియు సఖుడు. కాబట్టి ఆ భగవంతునితో సంబంధం, ఆత్మ దృష్ట్యా, ఆధ్యాత్మికమైన భావన. ఇది ఆత్మశక్తిని ఉద్ధరించి, బుద్ధిని ప్రకాశింప చేస్తుంది. భగవత్ ప్రేమ ఒక సముద్రం వంటిది, అన్నీ అందులోనే ఇమిడి వుంటాయి, కానీ శారీరక సంబంధీకులపై ప్రేమ సంకుచితమైనది మరియు తారతమ్యమును చూపేది. ఇక్కడ, అర్జునుడు భౌతిక అనుబంధాన్ని అనుభూతి చెందుతున్నాడు. ఇది అతన్ని నిరాశా సముద్రంలో ముంచివేస్తూ, తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి కూడా భయపడేట్టు చేస్తున్నది.
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ।। 29 ।। గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే । న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ।। 30 ।। నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ । న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ।। 31 ।।
29
1
https://www.holy-bhagava…/001_029-031.mp3
వేపథుః — వణుకుచున్న; చ — మరియు; శరీరే — శరీరమునందు; మే — నా యొక్క; రోమ-హర్షః — వెంట్రుకలు నిక్కబోడుచుకొనుట; చ — మరియు; జాయతే — కలుగుచున్నది; గాండీవం — అర్జునుడి విల్లు; స్రంసతే — జారిపోవుతున్నది; హస్తాత్ — (నా) చేతి నుండి; త్వక్ — చర్మము; చ — మరియు; ఏవ — నిజముగా; పరిదహ్యతే — అంతటా మంటపుడుతున్నది; న చ శక్నోమి — సాధ్యము కావటంలేదు నాకు; అవస్థాతుం — స్థిరంగా ఉండుట; భ్రమతి ఇవ — తిరుగుతున్నట్టుగా; చ — మరియు; మే — నా యొక్క; మనః — మనస్సు; నిమిత్తాని — శకునములు; చ — మరియు; పశ్యామి — చూస్తున్నాను; విపరీతాని — అశుభములైన; కేశవ — శ్రీ కృష్ణ , కేశి అనే రాక్షసుడను సంహరించినవాడా; న — లేదు; చ — మరియు; శ్రేయః — మంచి; అనుపశ్యామి — చూడగలుగుతున్నాను; హత్వా — చంపటం వలన; స్వ-జనం — సొంత బంధువులను; ఆహవే — యుద్ధంలో.
BG 1.29-31: నా శరీరమంతా వణుకుచున్నది; నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా విల్లు, గాండీవం, చేజారిపోతున్నది, మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది; ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణా, కేశి రాక్షసుడను సంహరించినవాడా, అంతటా అశుభ శకునములే కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన, మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను.
యుద్ధ పరిణామాల గురించి ఆలోచించేసరికి, అర్జునుడు కలతచెంది శోకానికి గురి అయ్యాడు. ఏ వింటి శబ్దానికి బలమైన శత్రువులే భీతి చెందారో, అదే గాండీవం అతని చేజారి పోతున్నది. యుద్ధం చేయటం పాపము అన్న ఆలోచనతో అతని తల తిరుగుతున్నది. ఈ యొక్క అస్థిరమైన మానసికస్థితిలో, చివరికి, ఘోరమైన వైఫల్యాలను మరియు రాబోయే పరిణామాలను సూచించే మూఢ నమ్మకాలతో ఉన్న శకునములను అంగీకరించే స్థాయికి దిగజారి పోయాడు.
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ।। 29 ।। గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే । న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ।। 30 ।। నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ । న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ।। 31 ।।
30
1
https://www.holy-bhagava…/001_029-031.mp3
వేపథుః — వణుకుచున్న; చ — మరియు; శరీరే — శరీరమునందు; మే — నా యొక్క; రోమ-హర్షః — వెంట్రుకలు నిక్కబోడుచుకొనుట; చ — మరియు; జాయతే — కలుగుచున్నది; గాండీవం — అర్జునుడి విల్లు; స్రంసతే — జారిపోవుతున్నది; హస్తాత్ — (నా) చేతి నుండి; త్వక్ — చర్మము; చ — మరియు; ఏవ — నిజముగా; పరిదహ్యతే — అంతటా మంటపుడుతున్నది; న చ శక్నోమి — సాధ్యము కావటంలేదు నాకు; అవస్థాతుం — స్థిరంగా ఉండుట; భ్రమతి ఇవ — తిరుగుతున్నట్టుగా; చ — మరియు; మే — నా యొక్క; మనః — మనస్సు; నిమిత్తాని — శకునములు; చ — మరియు; పశ్యామి — చూస్తున్నాను; విపరీతాని — అశుభములైన; కేశవ — శ్రీ కృష్ణ , కేశి అనే రాక్షసుడను సంహరించినవాడా; న — లేదు; చ — మరియు; శ్రేయః — మంచి; అనుపశ్యామి — చూడగలుగుతున్నాను; హత్వా — చంపటం వలన; స్వ-జనం — సొంత బంధువులను; ఆహవే — యుద్ధంలో.
BG 1.29-31: నా శరీరమంతా వణుకుచున్నది; నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా విల్లు, గాండీవం, చేజారిపోతున్నది, మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది; ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణా, కేశి రాక్షసుడను సంహరించినవాడా, అంతటా అశుభ శకునములే కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన, మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను.
యుద్ధ పరిణామాల గురించి ఆలోచించేసరికి, అర్జునుడు కలతచెంది శోకానికి గురి అయ్యాడు. ఏ వింటి శబ్దానికి బలమైన శత్రువులే భీతి చెందారో, అదే గాండీవం అతని చేజారి పోతున్నది. యుద్ధం చేయటం పాపము అన్న ఆలోచనతో అతని తల తిరుగుతున్నది. ఈ యొక్క అస్థిరమైన మానసికస్థితిలో, చివరికి, ఘోరమైన వైఫల్యాలను మరియు రాబోయే పరిణామాలను సూచించే మూఢ నమ్మకాలతో ఉన్న శకునములను అంగీకరించే స్థాయికి దిగజారి పోయాడు.
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ।। 29 ।। గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే । న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ।। 30 ।। నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ । న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ।। 31 ।।
31
1
https://www.holy-bhagava…/001_029-031.mp3
వేపథుః — వణుకుచున్న; చ — మరియు; శరీరే — శరీరమునందు; మే — నా యొక్క; రోమ-హర్షః — వెంట్రుకలు నిక్కబోడుచుకొనుట; చ — మరియు; జాయతే — కలుగుచున్నది; గాండీవం — అర్జునుడి విల్లు; స్రంసతే — జారిపోవుతున్నది; హస్తాత్ — (నా) చేతి నుండి; త్వక్ — చర్మము; చ — మరియు; ఏవ — నిజముగా; పరిదహ్యతే — అంతటా మంటపుడుతున్నది; న చ శక్నోమి — సాధ్యము కావటంలేదు నాకు; అవస్థాతుం — స్థిరంగా ఉండుట; భ్రమతి ఇవ — తిరుగుతున్నట్టుగా; చ — మరియు; మే — నా యొక్క; మనః — మనస్సు; నిమిత్తాని — శకునములు; చ — మరియు; పశ్యామి — చూస్తున్నాను; విపరీతాని — అశుభములైన; కేశవ — శ్రీ కృష్ణ , కేశి అనే రాక్షసుడను సంహరించినవాడా; న — లేదు; చ — మరియు; శ్రేయః — మంచి; అనుపశ్యామి — చూడగలుగుతున్నాను; హత్వా — చంపటం వలన; స్వ-జనం — సొంత బంధువులను; ఆహవే — యుద్ధంలో.
BG 1.29-31: నా శరీరమంతా వణుకుచున్నది; నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా విల్లు, గాండీవం, చేజారిపోతున్నది, మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది; ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణా, కేశి రాక్షసుడను సంహరించినవాడా, అంతటా అశుభ శకునములే కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన, మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను.
యుద్ధ పరిణామాల గురించి ఆలోచించేసరికి, అర్జునుడు కలతచెంది శోకానికి గురి అయ్యాడు. ఏ వింటి శబ్దానికి బలమైన శత్రువులే భీతి చెందారో, అదే గాండీవం అతని చేజారి పోతున్నది. యుద్ధం చేయటం పాపము అన్న ఆలోచనతో అతని తల తిరుగుతున్నది. ఈ యొక్క అస్థిరమైన మానసికస్థితిలో, చివరికి, ఘోరమైన వైఫల్యాలను మరియు రాబోయే పరిణామాలను సూచించే మూఢ నమ్మకాలతో ఉన్న శకునములను అంగీకరించే స్థాయికి దిగజారి పోయాడు.
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ । కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ।। 32 ।। యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ । త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ।। 33 ।।
32
1
https://www.holy-bhagava…/001_032-033.mp3
న కాంక్షే — నేను కోరుకోవటంలేదు; విజయం — గెలుపు; కృష్ణ — కృష్ణా; న చ రాజ్యం — రాజ్యము కూడా వద్దు; సుఖాని చ — సంతోషములు కూడా; కిం — ఏమిటి; నః — మనకు; రాజ్యేన — రాజ్యముతో; గోవింద — కృష్ణ, ఇంద్రియములకు సుఖము నిచ్చేవాడా, ఆవులంటే ఇష్టమైన వాడా; కిం — ఏమిటి; భోగైః — విలాసములు; జీవితేన — జీవితము; వా — లేదా; యేషామ్ అర్థే — ఎవరి కోసమైతే; కాంక్షితం — కోరుకున్నామో; నః — మా చేత; రాజ్యం — రాజ్యము; భోగాః — విలాసములు; సుఖాని — సంతోషము; చ — ఇంకా; తే — వారు; ఇమే — వీరును; అవస్థితా — నిలిచిఉన్న; యుద్ధే — యుద్ధం కొరకు; ప్రాణాన్ — ప్రాణాలను; త్యక్త్వా — వదులుకొనటానికి; ధనాని — ధనము; చ — కూడా.
BG 1.32-33: ఓ కృష్ణా, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటివల్ల వచ్చే సుఖం కానీ అక్కరలేదు. మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు, రాజ్యంతో కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది?
చంపటం ఒక పాపపు పని అయితే, సొంత బంధువులనే హతమార్చటం మరింత పాపిష్టి పని అనే భావన వలన అర్జునుడు అయోమయానికి లోనయ్యాడు. రాజ్యం కోసం ఇంత క్రూరమైన పని చేసినా, ఆ గెలుపు అంతిమంగా సంతోషాన్ని ఇవ్వలేదు, అని అర్జునుడు అభిప్రాయపడ్డాడు. స్నేహితులతో బంధువులతో రాజ్య వైభవాన్ని పంచుకోలేడు, ఎందుకంటే ఆ గెలుపు కోసం వారినే సంహరించాలి. ఈ సందర్భంలో, అర్జునుడు తక్కువ స్థాయి మనోభావాలని ప్రదర్శించి వాటిని మహనీయమైనవిగా అభిప్రాయపడుతున్నాడు. ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక అభ్యుదయం పట్ల ఉదాసీనత మెచ్చుకోదగిన ఆధ్యాత్మిక సద్గుణమే, కానీ అర్జునుడు అనుభవించేది ఆధ్యాత్మిక మనోభావం కాదు. అతని మానసిక అయోమయం, జాలి హృదయం లాగా బయటకి కనపడుతోంది. ధార్మిక మనోభావాలు, మనకు అంతర్గత ప్రశాంతతని, తృప్తిని, మరియు ఆత్మానందాన్ని కలిగిస్తాయి. అర్జునుడి కారుణ్య భావన అలౌకికమైనది అయ్యుంటే, తాను ఆ భావనచే ఉన్నత స్థాయిని అనుభవించేవాడు. కానీ, అతని అనుభవం దీనికి విరుద్ధంగా వుంది - తన మనసు, బుద్ధి కలత నొందాయి, చేయవసిన పని పట్ల అసంతృప్తి మరియు, లోలోన తీవ్ర దుఃఖం కలిగాయి. అతని మనోభావం తన మీద చూపిన ప్రభావం వలన అతని కారుణ్యం నిజానికి మానసిక భ్రమ నుండి ఉత్పన్నమైనదే అని తెలుస్తోంది.
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ । కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ।। 32 ।। యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ । త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ।। 33 ।।
33
1
https://www.holy-bhagava…/001_032-033.mp3
న కాంక్షే — నేను కోరుకోవటంలేదు; విజయం — గెలుపు; కృష్ణ — కృష్ణా; న చ రాజ్యం — రాజ్యము కూడా వద్దు; సుఖాని చ — సంతోషములు కూడా; కిం — ఏమిటి; నః — మనకు; రాజ్యేన — రాజ్యముతో; గోవింద — కృష్ణ, ఇంద్రియములకు సుఖము నిచ్చేవాడా, ఆవులంటే ఇష్టమైన వాడా; కిం — ఏమిటి; భోగైః — విలాసములు; జీవితేన — జీవితము; వా — లేదా; యేషామ్ అర్థే — ఎవరి కోసమైతే; కాంక్షితం — కోరుకున్నామో; నః — మా చేత; రాజ్యం — రాజ్యము; భోగాః — విలాసములు; సుఖాని — సంతోషము; చ — ఇంకా; తే — వారు; ఇమే — వీరును; అవస్థితా — నిలిచిఉన్న; యుద్ధే — యుద్ధం కొరకు; ప్రాణాన్ — ప్రాణాలను; త్యక్త్వా — వదులుకొనటానికి; ధనాని — ధనము; చ — కూడా.
BG 1.32-33: ఓ కృష్ణా, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటివల్ల వచ్చే సుఖం కానీ అక్కరలేదు. మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు, రాజ్యంతో కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది?
చంపటం ఒక పాపపు పని అయితే, సొంత బంధువులనే హతమార్చటం మరింత పాపిష్టి పని అనే భావన వలన అర్జునుడు అయోమయానికి లోనయ్యాడు. రాజ్యం కోసం ఇంత క్రూరమైన పని చేసినా, ఆ గెలుపు అంతిమంగా సంతోషాన్ని ఇవ్వలేదు, అని అర్జునుడు అభిప్రాయపడ్డాడు. స్నేహితులతో బంధువులతో రాజ్య వైభవాన్ని పంచుకోలేడు, ఎందుకంటే ఆ గెలుపు కోసం వారినే సంహరించాలి. ఈ సందర్భంలో, అర్జునుడు తక్కువ స్థాయి మనోభావాలని ప్రదర్శించి వాటిని మహనీయమైనవిగా అభిప్రాయపడుతున్నాడు. ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక అభ్యుదయం పట్ల ఉదాసీనత మెచ్చుకోదగిన ఆధ్యాత్మిక సద్గుణమే, కానీ అర్జునుడు అనుభవించేది ఆధ్యాత్మిక మనోభావం కాదు. అతని మానసిక అయోమయం, జాలి హృదయం లాగా బయటకి కనపడుతోంది. ధార్మిక మనోభావాలు, మనకు అంతర్గత ప్రశాంతతని, తృప్తిని, మరియు ఆత్మానందాన్ని కలిగిస్తాయి. అర్జునుడి కారుణ్య భావన అలౌకికమైనది అయ్యుంటే, తాను ఆ భావనచే ఉన్నత స్థాయిని అనుభవించేవాడు. కానీ, అతని అనుభవం దీనికి విరుద్ధంగా వుంది - తన మనసు, బుద్ధి కలత నొందాయి, చేయవసిన పని పట్ల అసంతృప్తి మరియు, లోలోన తీవ్ర దుఃఖం కలిగాయి. అతని మనోభావం తన మీద చూపిన ప్రభావం వలన అతని కారుణ్యం నిజానికి మానసిక భ్రమ నుండి ఉత్పన్నమైనదే అని తెలుస్తోంది.
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః । మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ।। 34 ।। ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన । అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ।। 35 ।।
34
1
https://www.holy-bhagava…/001_034-035.mp3
ఆచార్యాః — గురువులు; పితరః — తండ్రులు (పిన తండ్రులు, పెద తండ్రులు); పుత్రాః — కుమారులు; తథా — ఇంకా; ఏవ — వాస్తవంగా; చ — మరియు; పితామహాః — తాతలు; మాతులాః — మేనమామలు; శ్వశురాః — మామలు; పౌత్రాః — మనుమలు; శ్యాలాః — బావ-బావమరుదులు; సంబంధినాః — బంధువులు; తథా — కూడా; ఏతాన్ — వీరు; న హంతుమ్ ఇచ్ఛామి — చంపుటకు నాకు ఇష్టంలేదు; ఘ్నతః — చంపబడి; అపి — అయినప్పటికీ; మధుసూదన — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడను సంహరించినవాడా; అపి — అయినప్పటికీ; త్రై-లోక్య-రాజ్యస్య — ముల్లోకములపై అధిపత్యం; హేతోః — కొరకు; కిం ను — ఎం చెప్పాలి? మహీ-కృతే — భూమండలము కొరకు.
BG 1.34-35: గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావ మరుదులు, ఇంకా ఇతర బంధువులు, వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ, ఇక్కడ చేరి వున్నారు. ఓ మధుసూదనా, నా మీద వారు దాడి చేసిననూ నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించిననూ, ఈ భూ-మండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే, ఏం తృప్తి ఉంటుంది మనకు?
ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు అర్జునుని గురువులు; భీష్ముడు మరియు సోమదత్తుడు అతని పితామహులు; భూరిశ్రవుడు (సోమదత్తుని తనయుడు) వంటి వారు అతనికి తండ్రి వరుస; పురుజిత్తు, కుంతిభోజుడు, శల్యుడు, మరియు శకుని అతని మేనమామలు; ధృతరాష్ట్రుని వంద మంది కొడుకులు తన సోదరులు; లక్ష్మణుడు (దుర్యోధనుని తనయుడు) తన బిడ్డ వంటి వాడు. యుద్ధరంగంలో వేంచేసి ఉన్న ఈ వివిధములైన బంధువులని అర్జునుడు పేర్కొంటున్నాడు. 'అపి' (అంటే 'అయినప్పటికీ' అని అర్థం), అన్న పదాన్ని రెండు సార్లు వాడాడు. మొదట, ‘నేను వారి బంధువును మరియు శ్రేయోభిలాషిని అయినప్పటికీ వారు నన్నెందుకు చంపడానికి పూనుకున్నారు? రెండవసారి, ‘వారు నన్ను హతం చేయాలని కోరుకున్నప్పటికీ, నేను వారిని వధించాలనుకోవటం ఎందుకు?’ అని.
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః । మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ।। 34 ।। ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన । అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ।। 35 ।।
35
1
https://www.holy-bhagava…/001_034-035.mp3
ఆచార్యాః — గురువులు; పితరః — తండ్రులు (పిన తండ్రులు, పెద తండ్రులు); పుత్రాః — కుమారులు; తథా — ఇంకా; ఏవ — వాస్తవంగా; చ — మరియు; పితామహాః — తాతలు; మాతులాః — మేనమామలు; శ్వశురాః — మామలు; పౌత్రాః — మనుమలు; శ్యాలాః — బావ-బావమరుదులు; సంబంధినాః — బంధువులు; తథా — కూడా; ఏతాన్ — వీరు; న హంతుమ్ ఇచ్ఛామి — చంపుటకు నాకు ఇష్టంలేదు; ఘ్నతః — చంపబడి; అపి — అయినప్పటికీ; మధుసూదన — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడను సంహరించినవాడా; అపి — అయినప్పటికీ; త్రై-లోక్య-రాజ్యస్య — ముల్లోకములపై అధిపత్యం; హేతోః — కొరకు; కిం ను — ఎం చెప్పాలి? మహీ-కృతే — భూమండలము కొరకు.
BG 1.34-35: గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావ మరుదులు, ఇంకా ఇతర బంధువులు, వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ, ఇక్కడ చేరి వున్నారు. ఓ మధుసూదనా, నా మీద వారు దాడి చేసిననూ నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించిననూ, ఈ భూ-మండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే, ఏం తృప్తి ఉంటుంది మనకు?
ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు అర్జునుని గురువులు; భీష్ముడు మరియు సోమదత్తుడు అతని పితామహులు; భూరిశ్రవుడు (సోమదత్తుని తనయుడు) వంటి వారు అతనికి తండ్రి వరుస; పురుజిత్తు, కుంతిభోజుడు, శల్యుడు, మరియు శకుని అతని మేనమామలు; ధృతరాష్ట్రుని వంద మంది కొడుకులు తన సోదరులు; లక్ష్మణుడు (దుర్యోధనుని తనయుడు) తన బిడ్డ వంటి వాడు. యుద్ధరంగంలో వేంచేసి ఉన్న ఈ వివిధములైన బంధువులని అర్జునుడు పేర్కొంటున్నాడు. 'అపి' (అంటే 'అయినప్పటికీ' అని అర్థం), అన్న పదాన్ని రెండు సార్లు వాడాడు. మొదట, ‘నేను వారి బంధువును మరియు శ్రేయోభిలాషిని అయినప్పటికీ వారు నన్నెందుకు చంపడానికి పూనుకున్నారు? రెండవసారి, ‘వారు నన్ను హతం చేయాలని కోరుకున్నప్పటికీ, నేను వారిని వధించాలనుకోవటం ఎందుకు?’ అని.
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన । పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ।। 36 ।। తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ । స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ।। 37 ।।
36
1
https://www.holy-bhagava…/001_036-037.mp3
నిహత్య — చంపటంవలన; ధార్తరాష్ట్రాన్ — ధృతరాష్ట్ర తనయులను; నః – మన; కా — ఏమిటి? ప్రీతిః — సంతోషము; స్యాత్ — కలుగును; జనార్దన — శ్రీ కృష్ణా, అందరి జనులను పోషించేవాడా; పాపమ్ — పాపము; ఏవ — తప్పక; ఆశ్రయేత్ — ప్రాప్తిస్తుంది; అస్మాన్ — మనకు; హత్వా — చంపుట వలన; ఏతాన్ — వీరందరూ; ఆతతాయినః — దూకుడు గల దుష్టులను; తస్మాత్ — కాబట్టి; న — ఎప్పుడూ లేదు; అర్హాః — అర్హత; వయం — మనము; హంతుం — చంపటానికి; ధార్తరాష్ట్రాన్ — ధృతరాష్ట్రుని పుత్రులను; స్వ-బాంధవాన్ — స్వజనులతో కూడి; స్వ-జనం — బంధువులు; హి — తప్పకుండా; కథం — ఎట్లు; హత్వా — చంపటం వలన; సుఖినః — సుఖంగా; స్యామ — కాగలము; మాధవ — శ్రీ కృష్ణా, యోగమాయా శక్తి యొక్క భర్త.
BG 1.36-37: ఓ జనార్దనా, (సర్వ భూతముల సంరక్షకుడు, పోషకుడు అయినవాడా), ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులయినా, వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవా (కృష్ణా), మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము?
తన స్వజనులను సంహరించకూడదు అన్న అభిప్రాయాన్ని సమర్థించుకోవటానికి 'అయినా సరే' అని రెండు సార్లు ఇంతకు పూర్వ శ్లోకం లోనే అన్నా, అర్జునుడు మళ్ళీ ‘నేను వారిని సంహరించినా సరే, అలాంటి విజయం నుండి ఏమి సుఖం పొందుతాను?’ అని అంటున్నాడు. పోట్లాడటం, చంపటం చాలా మటుకు సందర్భాలలో పాపిష్టి పనే, అవి పశ్చాత్తాపాన్ని, అపరాధం చేసిన భావనని కలుగజేస్తాయి. అహింస ఒక గొప్ప సద్గుణమని వేదాలు చెప్పాయి, మరియు తీవ్ర పరిస్థితులలో తప్ప హింస ఒక పాపము: మా హింస్యాత్ సర్వ భూతాని ‘ఏ ప్రాణిని కూడా చంపకు’ అని చెప్పబడింది. ఇక్కడ, అర్జునుడు తన బంధువులను చంపటానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే అతను అది పాపపు పని అని భావించాడు. కానీ, ఆరు విధములైన దుర్మార్గుల నుండి ఆత్మరక్షణ అధికారం మనకు వుంది అని వశిష్ఠ స్మృతి (3.19వ శ్లోకం) చెపుతోంది: సంపదకి నిప్పు పెట్టే వారు, ఆహారంలో విషం కలిపే వారు, చంపటానికి ప్రయత్నించే వారు, సొత్తుని కొల్లగొట్టే వారు, భార్యని అపహరించ వచ్చిన వారు, మరియు రాజ్యాన్ని అన్యాయంగా లాక్కొనే వారు. ఇలాంటి వారిని, ఆత్మ రక్షణ కోసం చంపటం పాపము కాదు అని మను-స్మృతి (8.351) పేర్కొన్నది.
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన । పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ।। 36 ।। తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ । స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ।। 37 ।।
37
1
https://www.holy-bhagava…/001_036-037.mp3
నిహత్య — చంపటంవలన; ధార్తరాష్ట్రాన్ — ధృతరాష్ట్ర తనయులను; నః – మన; కా — ఏమిటి? ప్రీతిః — సంతోషము; స్యాత్ — కలుగును; జనార్దన — శ్రీ కృష్ణా, అందరి జనులను పోషించేవాడా; పాపమ్ — పాపము; ఏవ — తప్పక; ఆశ్రయేత్ — ప్రాప్తిస్తుంది; అస్మాన్ — మనకు; హత్వా — చంపుట వలన; ఏతాన్ — వీరందరూ; ఆతతాయినః — దూకుడు గల దుష్టులను; తస్మాత్ — కాబట్టి; న — ఎప్పుడూ లేదు; అర్హాః — అర్హత; వయం — మనము; హంతుం — చంపటానికి; ధార్తరాష్ట్రాన్ — ధృతరాష్ట్రుని పుత్రులను; స్వ-బాంధవాన్ — స్వజనులతో కూడి; స్వ-జనం — బంధువులు; హి — తప్పకుండా; కథం — ఎట్లు; హత్వా — చంపటం వలన; సుఖినః — సుఖంగా; స్యామ — కాగలము; మాధవ — శ్రీ కృష్ణా, యోగమాయా శక్తి యొక్క భర్త.
BG 1.36-37: ఓ జనార్దనా, (సర్వ భూతముల సంరక్షకుడు, పోషకుడు అయినవాడా), ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులయినా, వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవా (కృష్ణా), మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము?
తన స్వజనులను సంహరించకూడదు అన్న అభిప్రాయాన్ని సమర్థించుకోవటానికి 'అయినా సరే' అని రెండు సార్లు ఇంతకు పూర్వ శ్లోకం లోనే అన్నా, అర్జునుడు మళ్ళీ ‘నేను వారిని సంహరించినా సరే, అలాంటి విజయం నుండి ఏమి సుఖం పొందుతాను?’ అని అంటున్నాడు. పోట్లాడటం, చంపటం చాలా మటుకు సందర్భాలలో పాపిష్టి పనే, అవి పశ్చాత్తాపాన్ని, అపరాధం చేసిన భావనని కలుగజేస్తాయి. అహింస ఒక గొప్ప సద్గుణమని వేదాలు చెప్పాయి, మరియు తీవ్ర పరిస్థితులలో తప్ప హింస ఒక పాపము: మా హింస్యాత్ సర్వ భూతాని ‘ఏ ప్రాణిని కూడా చంపకు’ అని చెప్పబడింది. ఇక్కడ, అర్జునుడు తన బంధువులను చంపటానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే అతను అది పాపపు పని అని భావించాడు. కానీ, ఆరు విధములైన దుర్మార్గుల నుండి ఆత్మరక్షణ అధికారం మనకు వుంది అని వశిష్ఠ స్మృతి (3.19వ శ్లోకం) చెపుతోంది: సంపదకి నిప్పు పెట్టే వారు, ఆహారంలో విషం కలిపే వారు, చంపటానికి ప్రయత్నించే వారు, సొత్తుని కొల్లగొట్టే వారు, భార్యని అపహరించ వచ్చిన వారు, మరియు రాజ్యాన్ని అన్యాయంగా లాక్కొనే వారు. ఇలాంటి వారిని, ఆత్మ రక్షణ కోసం చంపటం పాపము కాదు అని మను-స్మృతి (8.351) పేర్కొన్నది.
యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః । కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ।। 38 ।। కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ । కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ।। 39 ।।
38
1
https://www.holy-bhagava…/001_038-039.mp3
యది అపి — అయినా సరే; ఏతే — వారు; న పశ్యంతి — చూడలేకున్నా; లోభ — దురాశ; ఉపహత — కమ్ముకున్న; చేతసః — ఆలోచనలతో; కుల-క్షయ-కృతం — బంధువులను నాశనం చేయటంలో; దోషం — తప్పు; మిత్ర-ద్రోహే — స్నేహితులపై ద్రోహం చేయటం వలన; చ — మరియు; పాతకం — పాపము; కథం — ఎందుకు; న జ్ఞేయం — తెలుసుకోరాదు; అస్మాభిః — మనము; పాపాత్ — పాపము నుండి; అస్మాత్ — ఇవి; నివర్తితుం — మరలిపోవుట; కుల-క్షయ — బంధువులను సంహరించటం; కృతం — చేసి; దోషం — నేరము; ప్రపశ్యద్భిః — తెలిసిన వారమై; జనార్దన — అందరి పోషణ, రక్షణ చూసుకునే వాడా, శ్రీ కృష్ణా.
BG 1.38-39: వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి, బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో గానీ, వారు దోషం చూడటం లేదు. కానీ, ఓ జనార్దనా (కృష్ణా), మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము, ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు?
వృత్తి రీత్యా యోధుడే అయినా, అర్జునుడు అనవసరపు హింసని అసహ్యించుకొన్నాడు. మహాభారత యుద్ధం చివరిలో జరిగిన ఒక ఘట్టం అతని యొక్క ఈ గుణాన్ని వెల్లడిస్తుంది. వంద మంది కౌరవులు చంపబడ్డారు, కానీ దానికి ప్రతీకారంగా, ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ, రాత్రి వేళ పాండవ శిబిరం లోనికి చొరబడి ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను, వారు నిద్రిస్తుండగా చంపివేశాడు. అశ్వత్థామని పట్టుకుని అతన్ని పశువులాగా కట్టివేసి, అతడిని, శోకిస్తూ వున్న ద్రౌపది కాళ్ళ వద్ద పడవేశాడు అర్జునుడు. కానీ, క్షమాగుణము మరియు సున్నిత హృదయం కలిగిన ద్రౌపది, అశ్వత్థామ తమ గురువు ద్రోణాచార్యుని పుత్రుడు అయినందువల్ల అతణ్ణి క్షమించాలి అని అన్నది. మరో పక్క, అశ్వత్థామని వెంటనే చంపివేయాలని భీముడు అభిప్రాయపడ్డాడు. ఈ సందిగ్ధావస్థలో, అర్జునుడు శ్రీ కృష్ణుని వైపు పరిష్కారం కోసం చూసాడు. కృష్ణుడు అన్నాడు, ‘గౌరవింపదగిన బ్రాహ్మణుడు తాత్కాలికంగా ధర్మపథం నుండి తప్పినా అతణ్ని తప్పకుండా క్షమింపవలసినదే. కానీ, ఆయుధాన్ని పట్టి చంపటానికి వచ్చిన వాడిని తప్పకుండా శిక్షించవలసినదే.’ అని. అర్జునుడు ఈ విరుద్ధమైన సూచనలను అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామను చంపలేదు కానీ, అతని తల వెనుక పిలకను కత్తిరించి, అతని నుదురుపై ఉన్న మణిని తొలగించి, అతణ్ని శిబిరం నుండి బహిష్కరించాడు. కాబట్టి, సాధ్యమైనంత వరకు హింసని విడనాడటం అర్జునుడి సహజ స్వభావం. ఈ ప్రత్యేక పరిస్థితిలో, పెద్దలని, బంధువులని చంపటం తగని పని అని తనకు తెలుసునంటున్నాడు. ఋత్విక్ పురోహితాచార్యైర్ మాతులాతిథి సంశ్రితైః బాలవృద్దాతురైర్ వైద్యైర్ జ్ఞాతిసంబంధిబాంధవైః (మను స్మృతి 4.179) ‘యజ్ఞం చేసే బ్రాహ్మణుడు (ఋత్వికుడు), పురోహితుడు, గురువు, మేనమామ, అతిథి, తనపై ఆధారపడి ఉన్నవారు, పిల్లలు, పెద్దలు, వైద్యుడు, మరియు బంధువులు - వీరితో కలహం పెట్టుకోరాదు.’ దురాశకు వశమైపోయిన కౌరవులు విచక్షణా జ్ఞానం కోల్పోయి ధర్మపథం నుండి తప్పుకున్నా, ఏ దురుద్దేశం లేని తను, ఈ పాడు పని ఎందుకు చేయాలి అని అర్జునుడు భావించాడు.
యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః । కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ।। 38 ।। కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ । కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ।। 39 ।।
39
1
https://www.holy-bhagava…/001_038-039.mp3
యది అపి — అయినా సరే; ఏతే — వారు; న పశ్యంతి — చూడలేకున్నా; లోభ — దురాశ; ఉపహత — కమ్ముకున్న; చేతసః — ఆలోచనలతో; కుల-క్షయ-కృతం — బంధువులను నాశనం చేయటంలో; దోషం — తప్పు; మిత్ర-ద్రోహే — స్నేహితులపై ద్రోహం చేయటం వలన; చ — మరియు; పాతకం — పాపము; కథం — ఎందుకు; న జ్ఞేయం — తెలుసుకోరాదు; అస్మాభిః — మనము; పాపాత్ — పాపము నుండి; అస్మాత్ — ఇవి; నివర్తితుం — మరలిపోవుట; కుల-క్షయ — బంధువులను సంహరించటం; కృతం — చేసి; దోషం — నేరము; ప్రపశ్యద్భిః — తెలిసిన వారమై; జనార్దన — అందరి పోషణ, రక్షణ చూసుకునే వాడా, శ్రీ కృష్ణా.
BG 1.38-39: వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి, బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో గానీ, వారు దోషం చూడటం లేదు. కానీ, ఓ జనార్దనా (కృష్ణా), మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము, ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు?
వృత్తి రీత్యా యోధుడే అయినా, అర్జునుడు అనవసరపు హింసని అసహ్యించుకొన్నాడు. మహాభారత యుద్ధం చివరిలో జరిగిన ఒక ఘట్టం అతని యొక్క ఈ గుణాన్ని వెల్లడిస్తుంది. వంద మంది కౌరవులు చంపబడ్డారు, కానీ దానికి ప్రతీకారంగా, ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ, రాత్రి వేళ పాండవ శిబిరం లోనికి చొరబడి ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను, వారు నిద్రిస్తుండగా చంపివేశాడు. అశ్వత్థామని పట్టుకుని అతన్ని పశువులాగా కట్టివేసి, అతడిని, శోకిస్తూ వున్న ద్రౌపది కాళ్ళ వద్ద పడవేశాడు అర్జునుడు. కానీ, క్షమాగుణము మరియు సున్నిత హృదయం కలిగిన ద్రౌపది, అశ్వత్థామ తమ గురువు ద్రోణాచార్యుని పుత్రుడు అయినందువల్ల అతణ్ణి క్షమించాలి అని అన్నది. మరో పక్క, అశ్వత్థామని వెంటనే చంపివేయాలని భీముడు అభిప్రాయపడ్డాడు. ఈ సందిగ్ధావస్థలో, అర్జునుడు శ్రీ కృష్ణుని వైపు పరిష్కారం కోసం చూసాడు. కృష్ణుడు అన్నాడు, ‘గౌరవింపదగిన బ్రాహ్మణుడు తాత్కాలికంగా ధర్మపథం నుండి తప్పినా అతణ్ని తప్పకుండా క్షమింపవలసినదే. కానీ, ఆయుధాన్ని పట్టి చంపటానికి వచ్చిన వాడిని తప్పకుండా శిక్షించవలసినదే.’ అని. అర్జునుడు ఈ విరుద్ధమైన సూచనలను అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామను చంపలేదు కానీ, అతని తల వెనుక పిలకను కత్తిరించి, అతని నుదురుపై ఉన్న మణిని తొలగించి, అతణ్ని శిబిరం నుండి బహిష్కరించాడు. కాబట్టి, సాధ్యమైనంత వరకు హింసని విడనాడటం అర్జునుడి సహజ స్వభావం. ఈ ప్రత్యేక పరిస్థితిలో, పెద్దలని, బంధువులని చంపటం తగని పని అని తనకు తెలుసునంటున్నాడు. ఋత్విక్ పురోహితాచార్యైర్ మాతులాతిథి సంశ్రితైః బాలవృద్దాతురైర్ వైద్యైర్ జ్ఞాతిసంబంధిబాంధవైః (మను స్మృతి 4.179) ‘యజ్ఞం చేసే బ్రాహ్మణుడు (ఋత్వికుడు), పురోహితుడు, గురువు, మేనమామ, అతిథి, తనపై ఆధారపడి ఉన్నవారు, పిల్లలు, పెద్దలు, వైద్యుడు, మరియు బంధువులు - వీరితో కలహం పెట్టుకోరాదు.’ దురాశకు వశమైపోయిన కౌరవులు విచక్షణా జ్ఞానం కోల్పోయి ధర్మపథం నుండి తప్పుకున్నా, ఏ దురుద్దేశం లేని తను, ఈ పాడు పని ఎందుకు చేయాలి అని అర్జునుడు భావించాడు.
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః । ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోఽభిభవత్యుత ।। 40 ।।
40
1
https://www.holy-bhagava…udio/001_040.mp3
కుల-క్షయే — వంశ నాశనము వలన; ప్రణశ్యంతి — నశించిపోవును; కుల-ధర్మాః — వంశాచారములు; సనాతనాః — సనాతనమైన; (ఎంతో కాలం నుండి వున్న); ధర్మే — ధర్మము; నష్టే — అంతరించిపోవును; కులం — కుటుంబం; కృత్స్నం — సమస్తమైన; అధర్మః — అధర్మము; అభిభవతి — జయించును; ఉత — నిజముగా.
BG 1.40: వంశ నాశనం జరిగినప్పుడు, ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును, మరియు మిగిలిన కుటుంబసభ్యులు అధర్మపరులగుదురు.
కుటుంబ పెద్దలు తమ వంశము యొక్క పురాతన సాంప్రదాయాలు, ఏంతో కాలంగా ఉన్న ఆచారముల ఆధారంగా విలువలను, ఆదర్శాలను తమ ముందు తరాలవారికి అందచేస్తారు. ఈ సాంప్రదాయాలు, మానవీయ విలువలను మరియు ధార్మిక పద్ధతులను పాటించటానికి కుటుంబ సభ్యులకి దోహదపడుతాయి. కుటుంబ పెద్దలందరూ అకాలమరణం పాలయితే, వారి వచ్చే తరాల వారికి పెద్దల మార్గదర్శకత్వం, శిక్షణ లభించవు. అర్జునుడు ఈ విషయాన్ని తెలుపుతూ, వంశములు నాశనమైనప్పుడు, వాటితోపాటే ఆయా సాంప్రదాయాలు కూడా నశిస్తాయని, అప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు ఆధార్మిక, అనైతిక అలవాట్లు పెంచుకొని, తమ ఆధ్యాత్మిక ఉద్ధరణ అవకాశాన్ని కోల్పోతారని అంటున్నాడు. ఈ విధంగా, అర్జునుడి ఉద్దేశంలో, కుటుంబ పెద్దలు ఎన్నటికి సంహరింపబడరాదు.
అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః । స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ।। 41 ।।
41
1
https://www.holy-bhagava…udio/001_041.mp3
అధర్మా — అధర్మము; ఆభిభవాత్ — ప్రబలిపోవుట; కృష్ణ — శ్రీ కృష్ణా; ప్రదుష్యంతి — నీతి తప్పిన వారై; కుల-స్త్రియః — కుటుంబంలోని స్త్రీలు; స్త్రీషు — స్త్రీలు; దుష్టాసు — దుర్నీతి పరులై; వార్ష్ణేయ — వృష్ణి వంశస్థుడా; జాయతే — పుడతారు; వర్ణ-సంకరః — అవాంఛిత సంతానం.
BG 1.41: దుర్గుణాలు ప్రబలిపోవటం వలన, ఓ కృష్ణా, కులస్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు; మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన, ఓ వృష్ణి వంశస్థుడా, అవాంఛిత సంతానం జన్మిస్తారు.
వైదిక నాగరికత, స్త్రీలకు చాలా ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించింది మరియు స్త్రీలు పవిత్రంగా ఉండటానికి ఎంతో ప్రాముఖ్యత నిచ్చింది. అందుకే మను-స్మృతిలో ‘యత్ర నార్యస్ తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః (3.56) ‘ఎక్కడెక్కడైతే స్త్రీలు పవిత్రమైన, పరిశుద్ధమైన నడవడికతో ఉంటారో, మరియు ఆ యొక్క పవిత్రతకు వారు మిగతా సమాజంచే పూజింపబడుతారో, అక్కడ దేవతలు హర్షిస్తారు.’ కానీ, స్త్రీలు నీతిబాహ్యమైన ప్రవర్తనతో ఉన్నప్పుడు, బాధ్యతారహితమైన పురుషులు తమ జారత్వానికి, దాన్ని అదునుగా తీసుకొనుటం వలన అవాంఛిత సంతానం కలుగుతారు.
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ । పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః ।। 42 ।।
42
1
https://www.holy-bhagava…udio/001_042.mp3
సంకరః — అవాంఛిత సంతానం; నరకాయ — నరకప్రాయమైన; ఏవ — నిజముగా; కుల-ఘ్నానాం — కులనాశనము చేసిన వారిని; కులస్య — కులమును; చ — మరియు; పతంతి — పతనము; పితరః — పూర్వీకులు; హి — యథార్థముగా; ఏషామ్ — వారి యొక్క; లుప్త — లేకుండా అవును; పిండోదక-క్రియాః — శ్రాద్ధ తర్పణములు.
BG 1.42: అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు, కుల నాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. శ్రాద్ధ తర్పణములు లుప్తమయిన కారణముగా ఆ భ్రష్టుపట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమౌదురు.
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః । ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ।। 43 ।।
43
1
https://www.holy-bhagava…udio/001_043.mp3
దోషైః — పాపిష్ఠిపనులచే; ఏతైః — ఈ విధమైన; కుల-ఘ్నానాం — కుల నాశనం చేసే వారి యొక్క; వర్ణ-సంకర — అవాంఛిత సంతానం; కారకైః — కారకులైన; ఉత్సాద్యంతే — చెడిపోతాయి; జాతి-ధర్మాః — సామాజిక, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు; కుల-ధర్మాః — కుటుంబ సాంప్రదాయములు; చ — మరియు; శాశ్వతాః — సనాతములైన.
BG 1.43: కుటుంబ ఆచారము నాశనము చేసి, అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన అనేకానేక సామాజిక, కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును.
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన । నరకేఽనియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ।। 44 ।।
44
1
https://www.holy-bhagava…udio/001_044.mp3
ఉత్సన్న— నాశనమైపోయిన; కుల-ధర్మాణామ్ — ఎవరి కుటుంబ సాంప్రదాయములైతే; మనుష్యాణాం — అలాంటి మనుషులు; జనార్దన — జనుల బాగోగులు చూసుకునే వాడా, శ్రీ కృష్ణా; నరకే — నరకములో; అనియతం — నిరవధికముగా; వాసః — నివాసము; భవతి — ఉండును; ఇతి — ఈ విధంగా; అనుశుశ్రుమ — పండితుల నుండి వినియున్నాను.
BG 1.44: ఓ జనార్దనా (కృష్ణా), కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని, నేను పండితుల నుండి వినియున్నాను.
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ । యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ।। 45 ।। యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః । ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ ।। 46 ।।
45
1
https://www.holy-bhagava…/001_045-046.mp3
అహో — అయ్యో; బత — దారుణ ఫలితాలు; మహత్ — పెద్ద; పాపం — పాపాలు; కర్తుం — చేయుటకు; వ్యవసితాః — సిద్ధ పడితిమి; వయం — మనము; యత్ — ఎందుకంటే; రాజ్య-సుఖ-లోభేన — రాజ్య సుఖములపై కాంక్షతో; హంతుం — చంపుటకు; స్వ-జనమ్ — సొంత బంధువులను; ఉద్యతాః — అభిలాషించి; యది — ఒకవేళ; మామ్ — నన్ను; అప్రతీకారమ్ — ప్రతిఘటించకుండా; అశస్త్రం — ఆయుధాలు లేకుండా; శస్త్ర-పాణయః — చేతిలో ఆయుధములు ధరించినవారు; ధార్తరాష్ట్రాః — ధృతరాష్ట్రుని తనయులు; రణే — యుద్ధభూమి యందు; హన్యుః — చంపినా; తత్ — అది; మే — నాకు; క్షేమ-తరం — మంచిదే; భవేత్ — అవుతుంది.
BG 1.45-46: అయ్యో! ఎంత ఆశ్చర్యం, దారుణమైన పరిణామాలు కలుగచేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో, మన బంధువులనే చంపటానికి సిద్ధ పడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు, ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే, అది దీనికంటే మేలే.
జరుగబోయే యుద్ధం వలన వచ్చే ఎన్నో చెడు విశేషాలని అర్జునుడు ప్రస్తావించాడు కానీ, ఈ దుష్టులను సమాజంలో వర్ధిల్లనిస్తే, దుర్మార్గమే వ్యాపిస్తుందని, అర్జునుడు చూడలేకున్నాడు. 'అహో' అన్న పదంతో తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. 'బత' అంటే 'ఘోరమైన ఫలితాలు'. అర్జునుడు అంటున్నాడు, ‘ఎంత ఆశ్చర్యం, ఘోరమైన పరిణామాలు ఉంటాయి అని తెలిసి కూడా, మేము యుద్ధం ద్వారా ఈ పాపిష్ఠి పని చేయ నిశ్చయించాము.’ అని. తరచుగా, జనులు తమ సొంత తప్పులను చూడకుండా, వాటిని పరిస్థితులకు మరియు ఇతరులకు ఆపాదిస్తారు. అదే విధముగా, ధృతరాష్ట్రుని పుత్రులు దురాశచే ప్రేరేపింపబడ్డారని అనుకున్నాడు; తన యొక్క కారుణ్య భావ పరంపర, ఒక మహనీయమైన మనోభావం కాదనీ, అజ్ఞానంతో తను ఈ శరీరమే అనుకున్న భౌతిక వ్యామోహమని అర్జునుడు గ్రహింపలేకున్నాడు. అర్జునుడి వాదనలలో ఉన్న లోపం ఏమిటంటే - శారీరక వ్యామోహం, హృదయ దౌర్బల్యం, మరియు కర్తవ్య విస్మరణ వలన వచ్చిన తన అయోమయాన్ని సమర్థించుకొనటానికే అర్జునుడు తన వాదనలను వాడుకుంటున్నాడు. అర్జునుడి వాదనలు ఎందుకు లోపభూయిష్టమైనవో, శ్రీ కృష్ణుడు తదుపరి అధ్యాయాలలో విశదీకరిస్తాడు.
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ । యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ।। 45 ।। యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః । ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ ।। 46 ।।
46
1
https://www.holy-bhagava…/001_045-046.mp3
అహో — అయ్యో; బత — దారుణ ఫలితాలు; మహత్ — పెద్ద; పాపం — పాపాలు; కర్తుం — చేయుటకు; వ్యవసితాః — సిద్ధ పడితిమి; వయం — మనము; యత్ — ఎందుకంటే; రాజ్య-సుఖ-లోభేన — రాజ్య సుఖములపై కాంక్షతో; హంతుం — చంపుటకు; స్వ-జనమ్ — సొంత బంధువులను; ఉద్యతాః — అభిలాషించి; యది — ఒకవేళ; మామ్ — నన్ను; అప్రతీకారమ్ — ప్రతిఘటించకుండా; అశస్త్రం — ఆయుధాలు లేకుండా; శస్త్ర-పాణయః — చేతిలో ఆయుధములు ధరించినవారు; ధార్తరాష్ట్రాః — ధృతరాష్ట్రుని తనయులు; రణే — యుద్ధభూమి యందు; హన్యుః — చంపినా; తత్ — అది; మే — నాకు; క్షేమ-తరం — మంచిదే; భవేత్ — అవుతుంది.
BG 1.45-46: అయ్యో! ఎంత ఆశ్చర్యం, దారుణమైన పరిణామాలు కలుగచేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో, మన బంధువులనే చంపటానికి సిద్ధ పడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు, ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే, అది దీనికంటే మేలే.
జరుగబోయే యుద్ధం వలన వచ్చే ఎన్నో చెడు విశేషాలని అర్జునుడు ప్రస్తావించాడు కానీ, ఈ దుష్టులను సమాజంలో వర్ధిల్లనిస్తే, దుర్మార్గమే వ్యాపిస్తుందని, అర్జునుడు చూడలేకున్నాడు. 'అహో' అన్న పదంతో తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. 'బత' అంటే 'ఘోరమైన ఫలితాలు'. అర్జునుడు అంటున్నాడు, ‘ఎంత ఆశ్చర్యం, ఘోరమైన పరిణామాలు ఉంటాయి అని తెలిసి కూడా, మేము యుద్ధం ద్వారా ఈ పాపిష్ఠి పని చేయ నిశ్చయించాము.’ అని. తరచుగా, జనులు తమ సొంత తప్పులను చూడకుండా, వాటిని పరిస్థితులకు మరియు ఇతరులకు ఆపాదిస్తారు. అదే విధముగా, ధృతరాష్ట్రుని పుత్రులు దురాశచే ప్రేరేపింపబడ్డారని అనుకున్నాడు; తన యొక్క కారుణ్య భావ పరంపర, ఒక మహనీయమైన మనోభావం కాదనీ, అజ్ఞానంతో తను ఈ శరీరమే అనుకున్న భౌతిక వ్యామోహమని అర్జునుడు గ్రహింపలేకున్నాడు. అర్జునుడి వాదనలలో ఉన్న లోపం ఏమిటంటే - శారీరక వ్యామోహం, హృదయ దౌర్బల్యం, మరియు కర్తవ్య విస్మరణ వలన వచ్చిన తన అయోమయాన్ని సమర్థించుకొనటానికే అర్జునుడు తన వాదనలను వాడుకుంటున్నాడు. అర్జునుడి వాదనలు ఎందుకు లోపభూయిష్టమైనవో, శ్రీ కృష్ణుడు తదుపరి అధ్యాయాలలో విశదీకరిస్తాడు.
సంజయ ఉవాచ । ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ । విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ।। 47 ।।
47
1
https://www.holy-bhagava…udio/001_047.mp3
సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; ఏవం ఉక్త్వా — ఈ విధంగా పలికిన; అర్జునః — అర్జునుడు; సంఖ్యే — యుద్ధరంగంలో; రథ ఉపస్థే — రథములో; ఉపావిశత్ — కూర్చుండి పోయెను; విసృజ్య — వదిలివేసి; స-శరం — బాణములతో సహా; చాపం — ధనుస్సును; శోక — దుఃఖముతో; సంవిగ్న — దీనస్థితిలో; మానసః — మనస్సు.
BG 1.47: సంజయుడు పలికెను: ఈ విధంగా పలికిన అర్జునుడు, దీనస్థితిలో, తీవ్ర శోకసంతప్తుడై తన బాణాలను, ధనుస్సును పక్కన జారవిడిచి, రథంలో కూలబడ్డాడు.
మాట్లాడేటప్పుడు వ్యక్తి తరచుగా భావోద్వేగాల ప్రభావానికి లోనవుతాడు. 1.28వ శ్లోకం నుండి అర్జునుడు మొదలు పెట్టిన నిర్వేదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. తను ధర్మబద్ధంగా నిర్వర్తించవలసిన విధిని నైరాశ్యంతో వదిలివేసాడు, ఇది జ్ఞానంతో, భక్తితో భగవంతునికి శరణాగతి చేయటానికి పూర్తి విరుద్ధం. అర్జునుడు ఆధ్యాత్మిక జ్ఞానం లోపించిన అమాయకుడు ఏమీ కాదు, అన్న విషయం చెప్పటం ఇప్పుడు సమంజసం. అతడు ఊర్ధ్వ లోకాలకు వెళ్లి తన తండ్రి స్వర్గాధిపతి ఇంద్రుని దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. నిజానికి, తను పూర్వ జన్మలో ‘నరుడు’, కాబట్టి పారమార్థిక జ్ఞానం తెలిసినవాడే. (నర-నారాయణులు జంట అవతారములు, ఇందులో 'నరుడు' సిద్ధుడైన జీవాత్మ, 'నారాయణుడు' పరమాత్మ). దీనికి రుజువు ఏమిటంటే, మహాభారత యుద్ధం ముందు, యదు సైన్యాన్ని అంతా దుర్యోధనునికి వదిలేసి, అర్జునుడు శ్రీ కృష్ణుడిని తన పక్షంలోకి ఎంచుకున్నాడు. భగవంతుడే తన పక్షాన వుంటే తనకు అపజయం ఎన్నటికీ కలుగదు అని దృఢవిశ్వాసంతో ఉన్నాడు. అయినప్పటికీ, శ్రీ కృష్ణుడు, భావితరాల ప్రయోజనం కోసం, భగవద్గీత సందేశాన్ని చెప్పటానికి సంకల్పించాడు. కాబట్టి, సరియైన సమయంలో ఉద్దేశ్యపూర్వకంగానే అర్జునుడి మనస్సులో కలవరము సృష్టించాడు.
సంజయ ఉవాచ । తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ । విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః ।। 1 ।।
1
2
https://www.holy-bhagava…udio/002_001.mp3
సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; తం — అతనితో (అర్జునుడి తో); తథా — ఈ విధంగా; కృపయా — జాలితో; ఆవిష్టం — నిండినవాడై; అశ్రు-పూర్ణ — కన్నీరు-నిండి; ఆకుల — వ్యాకులతతో; ఈక్షణం — కళ్ళు; విషీదంతం — శోకంతో; ఇదం — ఈ యొక్క; వాక్యం — మాటలు; ఉవాచ — పలికెను; మధుసూదనః — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడను సంహరించిన వాడు.
BG 2.1: సంజయుడు పలికెను: జాలి నిండినవాడై, శోకతప్త హృదయంతో, కంటినిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన, శ్రీ కృష్ణుడు, ఈ విధంగా పలికెను.
అర్జునుడి మనో భావాలని వర్ణించడానికి సంజయుడు, 'కృపయా', అంటే జాలి లేదా కరుణ, అన్న పదం వాడాడు. కారుణ్యం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి - ఈశ్వర వియోగము వల్ల భౌతిక జగత్తులో వేదనని అనుభవిస్తున్న జీవాత్మలపై భగవంతుడికి, సత్పురుషులకు కలిగే దివ్యమైన కరుణ. మరియొకటి - ఎదుటివారిలో భౌతిక శారీరక కష్టాలని చూసినప్పుడు మనకు కలిగే భౌతికమైన కరుణ. భౌతికమైన కరుణ ఒక ఉత్తమ భావమే కానీ అది సంపూర్ణంగా సరియైన దిశలోనే ఉన్నటువంటిది అని చెప్పలేము. అది, కారులో కూర్చున్న డ్రైవర్ కృశించి పోతుంటే, కారు పరిస్థితి గురించి ఆందోళన చెందినట్టుగా ఉంటుంది. అర్జునుడు ఈ రెండవ శ్రేణి మనోభావాన్ని అనుభవిస్తున్నాడు. యుద్ధం కోసం చేరివున్న శత్రువులపై అతనికి భౌతికమైన కారుణ్యం పెల్లుబికింది. అర్జునుడి నిరాశ, శోకంతో తల్లడిల్లిపోతున్న పరిస్థితి చూస్తే, అతనికే కారుణ్యం/జాలి యొక్క తీవ్ర అవసరం ఉంది అని తెలుస్తోంది. కాబట్టి తనే ఇతరుల మీద దయతో ఉంటున్నాడు అని అనుకోవటం అర్థరహితమైనది. ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ‘మధుసూదన’ అని పిలవబడ్డాడు. మధు అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. ఇక్కడ, అర్జునుడి మనస్సులో జనించిన, స్వధర్మాన్ని నిర్వర్తించటానికి అడ్డుగావున్న, అనుమానపు రాక్షసిని మట్టుబెట్టబోతున్నాడు.
README.md exists but content is empty. Use the Edit dataset card button to edit it.
Downloads last month
7
Edit dataset card