text
stringlengths
335
364k
bandi sanjay fires on cm kcr జనగామ జిల్లాలో ఐదో రోజు ప్రజా సంగ్రామ పాదయత్రలో భాగంగా చీటకోడూరు రచ్చబండలో సంచార జాతులతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడారు. సంచార జాతులు తలచుకుంటే ప్రభుత్వాలు మారతాయని పేర్కొన్నారు. ఏడాది నుంచి తామూ సంచార జీవనమే గడుపుతున్నామని వారు బండి సంజయ్​తో చెప్పారు. bandi sanjay fires on cm kcr సంచార జాతులు తలచుకుంటే ప్రభుత్వాలు మారతాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. జనగామ జిల్లాలో ఐదో రోజు ప్రజా సంగ్రామ పాదయత్రలో భాగంగా... చీటకోడూరు రచ్చబండలో సంచార జాతులతో బండి సంజయ్‌ మాట్లాడారు. కేసీఆర్ సర్కారును గద్దె దించే అవకాశం వచ్చిందని వెల్లడించారు. సంచార జాతుల బాధలు చూస్తే దుఃఖం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది నుంచి తామూ సంచార జీవనమే గడుపుతున్నామని బండి సంజయ్ తెలిపారు. bandi sanjay on sanchara jathulu సంచార జీవుల కష్టాలు స్వయంగా చూశామని చెప్పారు. అధికారంలోకి వస్తే సంచార జాతులను ఆదుకుంటామని హామీనిచ్చారు. బీసీ ద్రోహి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఇదే పాదయాత్రలో భాగంగా.. జీఎస్టీ మినహాయించాలంటూ బండి సంజయ్‌కి చేనేత కార్మికులు వినతిపత్రం ఇచ్చారు. జీఎస్టీ మినహాయింపునకు కృషి చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. మీరు తలచుకుంటే ప్రభుత్వాలు మారతాయి. కేసీఆర్ సర్కారును గద్దె దించే అవకాశం ఇదే. సంచార జాతుల బాధలు చూస్తే దుఃఖం వస్తుంది. ఏడాది నుంచి మేమూ సంచార జీవనమే గడుపుతున్నాం. సంచార జీవుల కష్టాలు స్వయంగా చూశాం. భాజపా అధికారంలోకి వస్తే సంచార జాతులను ఆదుకుంటాం. బీసీ ద్రోహి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ల బాధలు చూస్తే దుఃఖం వస్తోందన్న బండి సంజయ్‌ BandiSanjay In Jangaon ఈ ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ మొదటి నుంచి కేసీఆర్ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ వచ్చారు. తెరాస వైఫల్యాలు, కేసీఆర్ పాలనలో జరిగిన అక్రమాలను ఊరూరా వివరించారు. ఒక దశలో కేసీఆర్ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు పరిధులు దాటాయని భావించిన తెరాస నాయకులు భాజపాపై విరుచుకుపడ్డారు. bandi sanjay padayatra మరోవైపు మూడో విడత పాదయాత్ర యాదాద్రిలో ప్రారంభం కాగా... ఈ యాత్రలో బండి సంజయ్ ఊరూరా తిరుగుతూ తెరాస పాలనను ఎండగట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు పనితీరును విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, రాష్ట్ర ఆరోగ్య రంగం పనితీరుపై విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
బాహుబలి, బాహుబలి 2కి మించి ఉన్న ప్రభాస్ నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ లిస్ట్‌ చూసి నార్త్ స్టార్స్‌ కి చెమటలు పట్టక మానవు. ప్రభాస్ పుష్ప సినిమాతో బన్నీ పేరు పాన్‌ ఇండియా లెవల్లో మారుమ్రోగడం చూశాం. బాలీవుడ్ ప్రేక్షకులే పుష్ప 2 కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ RRR సినిమాతో రామ్‌ చరణ్‌ నట విశ్వరూపం చూశాం. ఈ ఒక్క సినిమాతో రామ్ చరణ్‌ క్రేజ్‌, రేంజ్‌ పాన్‌ ఇండియా స్థాయిని చేరుకుంది. రామ్‌ చరణ్‌ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌ ఎంత సక్సెస్‌ ఫుల్‌ హీరోనో మనకు తెలుసు. RRR సినిమాతో తారక్‌ స్థాయి పాన్‌ ఇండియా లెవల్లో తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్‌ రజనీకాంత్‌ కు రీసెంట్ హిట్స్‌, భారీ కలెక్షన్స్ లేకపోవచ్చు. కానీ, ఒక్క సరైన కథ పడితే యావత్‌ దేశాన్ని ఊపేసే సత్తా, క్రేజ్‌ ఆయన సొంతం. రజనీకాంత్ పాన్‌ ఇండియా అనే ట్యాగ్‌ లేకుండానే విజయ్‌ కలెక్షన్స్ వర్షం కురిపిస్తాడు. మినిమం రూ.200 కోట్లు గ్యారెంటీ యాక్టర్‌ విజయ్‌. విజయ్ నెట్‌ఫ్లిక్స్‌ తీస్తున్న రూ.1500 కోట్ల ప్రాజెక్ట్‌ లో ధనుష్‌ నటిస్తున్నాడనే వార్త నార్త్ హీరోలనే ఎక్కువగా కలవర పెడుతోంది. ధనుష్ భాషతో సంబంధం లేకుండా అజిత్‌ కు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అజిత్‌ హీరో అంటే ఆ సినిమాకి పక్కా పైసా వసూల్ అనే చెప్పాలి. అజిత్ కేజీఎఫ్‌ సినిమా బాలీవుడ్ లో సృష్టించిన రికార్డులు చూసి చాలా మంది దర్శకనిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. రాకింగ్ స్టార్‌ యష్‌ ఏ ఇండస్ట్రీ అయినా మనవాడు అని వోన్‌ చేసుకునే నటుడు దుల్కర్ సల్మాన్. సరైన కథ దొరికితే కచ్చితంగా పాన్‌ ఇండియా స్టార్ అవుతాడు. ఈ సౌత్‌ స్టార్స్‌ అందరూ బాలీవుడ్‌ బిగ్ షాట్స్‌ ను వణికిస్తూనే ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మూడు మ్యాచులు. మూడు సమస్యలు!.పవర్‌ హిట్టింగ్‌, డెత్‌ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో మెరుగయ్యేందుకు టీమ్‌ ఇండియా సఫారీతో సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఐసీసీ 2022 టీ20 ప్రపంచకప్‌ ముంగిట భారత్‌కు ఇదే తుది సన్నాహకం. ప్రపంచకప్‌లో ధనాధన్‌ షోపై కన్నేసిన రోహిత్‌సేన.. ఈ మూడు టీ20ల్లో ఆ ప్రణాళిక అమలు చేసేందుకు రంగంలోకి దిగుతోంది. వరల్డ్‌ నం.1 భారత్‌ సవాల్‌ను ఎదుర్కొనేందుకు వరల్డ్‌ నం.3 దక్షిణాఫ్రికా సైతం సిద్ధంగా ఉంది. పొట్టి ప్రపంచకప్‌ ముంగిట సఫారీ, భారత్‌ తుఫాన్‌ షురూ!. - రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో.. - దక్షిణాఫ్రికాతో తొలి టీ20 నేడు - దూకుడుపై కన్నేసిన టీమ్‌ ఇండియా నవతెలంగాణ-తిరువనంతపురం ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తోంది. వరల్డ్‌ నం.1 టీమ్‌ ఇండియా టైటిల్‌పై కన్నేసింది. ఆ కల తీర్చుకునేందుకు, భారత్‌ ఎదుట కొన్ని సమస్యలు ఉన్నాయి. మూడు మ్యాచులు మాత్రమే మిగిలి ఉండటంతో టీమ్‌ ఇండియా తుది ప్రణాళికలను ఇక్కడ రిహార్సల్‌గా అమలు చేయనున్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు భారత బ్యాటర్ల పవర్‌ హిట్టింగ్‌ సమస్యగా మారింది. అందుకే, ఈ సిరీస్‌లో భారత్‌ అవసరమైతే తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని స్వీయ సవాల్‌ స్వీకరించే అవకాశం లేకపోలేదు. మరోవైపు, దక్షిణాఫ్రికా సైతం బలంగా ఉంది. ఆ జట్టులో హిట్టర్లకు కొదవలేదు. నాణ్యమైన పేసర్లు సైతం ఉన్నారు. క్వింటన్‌ డికాక్‌కు భారత్‌కు తిరుగులేని రికార్డుంది. భారత్‌, దక్షిణాఫ్రికా తొలి టీ20 నేడు. డెత్‌లో మెరుస్తారా? : విఫల ప్రయత్నం ఆసియా కప్‌ సహా ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత్‌ బ్యాటింగ్‌ ఇక్కట్లు చూడలేదు. బ్యాటర్లు అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ప్రతిసారి ఒకరిద్దరు అద్వితీయ ప్రదర్శనలతో చెలరేగుతున్నారు. అయినా, టాప్‌ ఆర్డర్‌లో కెఎల్‌ రాహుల్‌ నిలకడ సాధించాల్సి ఉంది. మిడిల్‌ ఆర్డర్‌లో రిషబ్‌ పంత్‌కు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అవసరం ఏర్పడగా.. దినేశ్‌ కార్తీక్‌ చివర్లో ఎక్కువ బంతుల్ని ఎదుర్కొవాల్సి ఉంది. హార్దిక్‌ పాండ్యకు విశ్రాంతి ఇవ్వటంతో టాప్‌ ఆర్డర్‌ బాధ్యత మరింత పెరగనుంది. పంత్‌కు ఆసీస్‌ సిరీస్‌లో బ్యాట్‌ పట్టే అవకాశమే దక్కలేదు. దీంతో పాండ్య స్థానంతో పంత్‌ నేరుగా తుది జట్టులోకి రానున్నాడు. విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌ హైదరాబాద్‌లో అదరగొట్టారు. అదే జోరు దక్షిణాఫ్రికాపై చూపించేందుకు సిద్ధమవుతున్నారు. సఫారీతో సిరీస్‌లో భారత్‌ ప్రధానంగా ఎదుర్కొంటున్న సవాల్‌ డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌. భువనేశ్వర్‌ కుమార్‌ నిలకడగా డెత్‌ ఓవర్లో చేతులెత్తేశాడు. ఈ సిరీస్‌లో భువికి విశ్రాంతి లభించింది. డెత్‌ ఓవర్లలో ఉత్తమ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌తో కలిసి జశ్‌ప్రీత్‌ బుమ్రా చివరి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయనున్నాడు. డెవిడ్‌ మిల్లర్‌ వంటి ప్రమాదకర హిట్టర్‌ను ఈ జోడీ ఏ విధంగా నిలువరిస్తుందో చూడాలి. భువనేశ్వర్‌ స్థానంలో దీపక్‌ చాహర్‌ కొత్త బంతిని అందుకోనున్నాడు. హార్దిక్‌ పాండ్య లేకపోవటంతో.. ఐదుగురు బౌలర్లతోనే భారత్‌ బరిలోకి దిగుతోంది. అక్షర్‌ పటేల్‌, యుజ్వెంద్ర చాహల్‌ స్పిన్‌ విభాగంలో ఉండగా.. దీపక్‌ చాహర్‌, అర్షదీప్‌ సింగ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రాలు పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. కూర్పు కష్టాలు : సఫారీ సారథి తెంబ బవుమా తన నియంత్రణలో లేని సమస్యలను ఎదుర్కొంటున్నాడు. సఫారీ టీ20 లీగ్‌ ఎస్‌ఏ20 వేలంలో అమ్ముడుపోలేదు!. విరామం అనంతరం జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో గత నాలుగు మ్యాచుల్లో మూడు అర్థ సెంచరీలు బాదిన ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. స్ట్రయిక్‌రేట్‌పై విమర్శలు ఎదుర్కొంటున్న బవుమా.. వరల్డ్‌కప్‌ ముంగిట ఆ సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాడు. సఫారీ జట్టులో భారత్‌కు ప్రధానంగా సవాల్‌ విసరుతున్న బ్యాటర్లు ముగ్గురు. టాప్‌లో క్వింటన్‌ డికాక్‌, మిడిల్‌లో ఎడెన్‌ మార్కరం, లోయర్‌లో డెవిడ్‌ మిల్లర్‌లు బౌలర్ల కష్టం పెంచనున్నారు. ఈ ముగ్గురు బ్యాటర్లను నిలువరించటంపైనే భారత బౌలర్ల ఫోకస్‌ కనపడనుంది. ఇక బౌలింగ్‌ విభాగంలో కగిసో రబాడ, మార్కో జాన్సెన్‌, డ్వేన్‌ ప్రిటోరియస్‌, ఎన్రిచ్‌ నోకియాలతో పాటు షంషి ఉండనున్నాడు. యువ కెరటం ట్రిస్టన్‌ స్టబ్స్‌, రైలీ రొస్సో సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు. పిచ్‌, వాతావరణం : తిరువనంతపురంలో నేడు వర్ష సూచనలు ఉన్నాయి. మ్యాచ్‌కు చిరుజల్లులతో కూడిన వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. గ్రీన్‌ఫీల్డ్‌ మైదానంలో ఇప్పటివరకు రెండు టీ20లే జరిగాయి. బ్యాటర్లకు, బౌలర్లకు సమతూకంగా పిచ్‌ అనుకూలిస్తుందనే అంచనాలు కనిపిస్తున్నాయి. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకునేందుకు మొగ్గుచూపవచ్చు. తుది జట్లు (అంచనా) : భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, దినేశ్‌ కార్తీక్‌ (వికెట్‌ కీపర్‌), దీపక్‌ చాహర్‌, అర్షదీప్‌ సింగ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, యుజ్వెంద్ర చాహల్‌. దక్షిణాఫ్రికా : క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), తెంబ బవుమా (కెప్టెన్‌), రైలీ రొసో, ఎడెన్‌ మార్కరం, డెవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, డ్వేన్‌ ప్రిటోరిస్‌, మార్కో జాన్సెన్‌, కగిసో రబాడ, ఎన్రిచ్‌ నోకియా, తబ్రియజ్‌ షంషి.
1. సాగు తదితర ప్రయోజనాల కోసం నీటిని కేటాయించడంతో పాటు నదీ బేసిన్లలో నీటి లభ్యతను హైడ్రొలోజికల్ మదింపు చేయడం. 2. సాగునీటి పారుదల వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేయడం. 3. రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి కోసం సాగునీటి సామర్ధ్యాన్ని ఏర్పాటు చేయడానికి కొత్త ప్రాజెక్టులు నిర్మించడం. 4. పురాతన ప్రాజెక్టులు పునఃనిర్మించడం ద్వారా ప్రస్తుత ఆయకట్టుము స్థిరీకరించడం. 5. పురాతన భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకరించడం. 6. సంభందిత శాఖలన్నీ ఏకీకృత, సహకార ప్రయత్నాల ద్వారా నీటి యాజమాన్యాన్ని, నీటి వినియోగ సామర్ధ్యాన్ని మెరుగుపరచడం. 7. ప్రస్తుత సాగునీటి ప్రోజెక్టుల కోసం నిర్వహణ అమలు, నిర్వహణ ప్రణాలికను తాయారు చేయడం. 8. వరద నిర్వహణ. 9. వరద గట్ల పునరుద్ధరణ మరియు నిర్వహణ 10. పారిశ్రామిక, తదితర వినియోగాల కోసం సాగునీటి పారుదల ప్రాంతాన్ని మదింపు చేయడం, నీటి రాయల్టీ చార్జీలను మదింపు చేయడం. 11. నీటి లభ్యతపై సమాచారం, విశ్లేషలను సమర్పించడం, అంతర్ రాష్ట్ర నదీ బేసిన్లను వినియోగించడం, సంబంధిత ఆయా ట్రిబ్యునళ్లకు సమాచారాన్ని అందచేయడం 12. కొత్త ప్రాజెక్టు ఆయాకట్లను అన్వేషించడం శాఖ వ్యవస్థీకృత ఏర్పాటు : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవసరాలకు అనుగుణంగా మరియు ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రస్తుతమున్న యూనిట్లను సృష్టించడం ద్వారా సాగునీటి పారుదల మరియు సిఏడి డిపార్టుమెంటును బలోపేతం చేయడం జరిగినది. పునర్ వ్యవస్థీకరణ జరిగిన తర్వాత సాగునీటి పారుదల 23 చీఫ్ ఇంజినీర్లతో పనిచేస్తుంది. అందులో సచివాలయ స్థాయిలో చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్ చీఫ్ ఇంజనీర్ (ఎంక్వయిరీలు), చీఫ్ ఇంజనీర్ (విజిలెన్సు)పనిచేస్తున్నారు.ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్లు స్వతంత్రంగా తమ సంబంధిత యూనిట్లకు శాఖాధిపతులుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ స్థాయి లో పరిపాలనాపరమైన విషయాలకు సంబంధించిన విధానాలు, బడ్జెటు, ఆర్థికపరమైన వ్యవహారాలను వారి సంయుక్త కార్యదర్శులు మొదలైన వారి సహాయంతో ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు పర్యవేక్షిస్తారు. సాగునీటి శాఖకు ఇంజనీర్-ఇన్-చీఫ్ (పరిపాలన) ముఖ్య అధిపతిగా ఉంటారు.ఈయన శాఖకు చెందిన సమగ్ర పరిపాలనకు ఇన్ చార్జిగా ఉంటారు . ఈ శాఖకు మరో ఇంజనీర్-ఇన్-చీఫ్ (సాగునీరు) అధిపతిగా ఉంటారు. ఈయన రాష్ట్రంలోని మొత్తం సాగునీటి ప్రోజెక్టులు అన్నింటికీ ఇంఛార్జిగా వ్యవహరిస్తారు. ఈ ఇంజనీర్స్-ఇన్-చీఫ్, ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటూ, శాఖాపరమైన కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉంటారు. సూపరింటెండింగ్ ఇంజినీర్లు సంబంధిత చీఫ్ ఇంజినీర్ల కింద పనిచేస్తూ ఒక సర్కిల్ కు ఇంఛార్జిగా వ్యవహరించే రీజినల్ అధికారులుగా ఉంటారు. వీరి అధికార పరిధి ఒక జిల్లాకు మించి ఉంటుంది. ఒక డివిజన్ కు ఇంఛార్జిగా ఉండే కార్యనిర్వాహక ఇంజినీరు సదరు డివిజన్ లోని అన్ని సాగునీటి పనుల నిర్మాణం, నిర్వహణకు ఇంఛార్జిగా ఉంటారు. ఉప కార్యనిర్వాహక ఇంజినీరు ఒక సబ్ డివిజన్ కు ఇంఛార్జిగా , సాగునీటి పనుల నిర్మాణం, నిర్వహణ ఇంచార్జీగా ఉంటారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నియంత్రణ లో పనిచేస్తారు. సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు / సహాయక ఇంజనీర్ సాగునీటి నిర్మాణ మరియు నిర్వహణ పనులకు విభాగంలోపు ఇంఛార్జిగా , డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు నియంత్రణలో పనిచేస్తారు. ఈ శాఖలో నాణ్యత కొరకు / నాణ్యత నియంత్రణ నిఘా విభాగం ప్రత్యేకంగా పని చేస్తుంది. పనుల విషయంలో ఎలాంటి అక్రమాలు జరిగినా తక్షణమే స్పందించి లోపభూయిష్ట పనులను నిరోధించుటకు మరియు ఎలాంటి అవినీతి జరిగిన తగిన చర్యలు తీసుకుంటుంది. ఇంజినీరింగు, పరిశోధన, సామర్ధ్యం నిర్మాణ కార్యకలాపాలను చేపట్టేందు కోసం నీటి పారుదల శాఖలో వాలంతరి డైరెక్టర్ జనరల్ నియంత్రణలో ఒక ఇంజనీరింగ్ రీసెర్చ్ లాబరేటరీ మరియు ఒక శిక్షణా సంస్థ వాలంతరీలను బలోపేతం చేయడం జరిగింది.
Telugu News » Career jobs » Jee main results 2021 february expected today direct link cut off at jeemain nta nic in ఇవాళ జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఫైనల్ కీ విడుదల చేసిన అధికారులు.. ర్యాంక్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021 (జేఈఈ మెయిన్) ఫలితాలు ఇవాళ విడుదల అయ్యే అవకాశం ఉంది. Balaraju Goud | Mar 08, 2021 | 8:35 AM JEE Main Result 2021 : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021 (జేఈఈ మెయిన్) ఫలితాలు ఇవాళ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదల కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఫైనల్ కీ ని అధికారులు విడుదల చేశారు. మరోవైపు, ఫలితాల విడుదలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సర్వం సిద్ధం చేసిందని సమాచారం గత నెలలో జేఈఈ మెయిన్ 2021 పరీక్ష నిర్వహించడం తెలిసిందే. పరీక్షకు హాజరైన అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవాలని ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది నాలుగు పర్యాయాలు జేఈఈ మెయిన్స్ నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్ జనవరి నెలలో ప్రకటించారు. ఇవాళ జేఈఈ మెయిన్ ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.nic.in/ లో ఫలితాలు, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ 2021లో భాగంగా ఫిబ్రవరిలో తొలి పరీక్ష నిర్వహించారు. మార్చి, ఏప్రిల్ మరియు మే నెలలోనూ మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ సైతం సిద్ధం చేశారు. మెయిన్ పర్సంటైల్ స్కో, పర్సంటైల్ ర్యాంక్‌ను స్కోరు లేదా పర్సంటైల్ ర్యాంక్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయనుంది. ఆరుగురు విద్యార్థుల మార్కుల ఆధారంగా 100 శాతం పర్సంటైల్ ర్యాంకును ప్రకటిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 పరీక్షా ఫలితాలు విడుదల చేసిన తరువాత కటాఫ్ మార్కులు ప్రకటించనున్నారు. ఇదిలావుంటే, ఈ ఏడాది నుంచి మాతృభాషలో పరీక్ష రాసే అవకాశం కల్పించడంతో పాటు నెగటివ్ మార్కులను సైతం తొలగించారు. మొత్తంగా 11 భాషల్లో విద్యార్థులు పరీక్ష రాసుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకాశం కల్పించింది.
నాటకం రసవత్తరంగా సాగడం లేదు. నడవాల్సిన విధంగా సన్నివేశం నడవడం లేదు. నటించాల్సిన విధంగా పాత్రధారులు ఎవరూ నటించడం లేదు. అందులోనూ అది రోహిణీ కార్తె. పేరుకు మాత్రమే అది రాత్రి కానీ, వేడి, ఉక్క మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రోజంతా భానుడి ప్రతాపానికి బలైపోయిన ప్రజలు, రాత్రివేళ, అంత ఉక్కబోతలోనూ ఆ నాటకం చూసి కొంతలో కొంత సేదతీరుదామని కొండంత ఆశతో వస్తే, ఇదుగో… ఈ హరిశ్చంద్ర నాటకం… ఇలా… చప్పగా… చేదుగా… సాగుతోంది. ప్రేక్షకులందరికీ విసుగూ, చిరాకూ క్షణక్షణానికీ పెరిగిపోతున్నాయి. ఇంతలో ఇంకొక విచిత్రం జరిగింది. చంద్రమతి పాత్రధారి రంగస్థలం పైన శోకాన్ని అభినయించడం ప్రారంభించాడు. అతగాడి అభినయం చూసి, దుఃఖంతో వివశులైపోవాల్సిన ప్రేక్షకజనంలో కొందరు పగలబడి నవ్వారు. క్షణాలలో ప్రేక్షకులందరూ నవ్వడం ప్రారంభించారు. నాటకశాల అంతా నవ్వుల వేదికైపోయింది. చంద్రమతి పాత్రధారి ప్రేక్షకుల హేళనను భరించలేకపోయాడు. ఆవేశంలో తన పాత్రను మరచిపోయాడు. కోపంతో ఊగిపోతూ గట్టిగా అరిచాడు. నా అంత మహానటుడ్ని, చూసి నవ్వుతున్నారా మీరు? ధైర్యముంటే, మీలో ఎవరైనా ముందుకొచ్చి, నటించి చూపించండి, లేదా మీరందరూ నోటికి తాళం వేసుకోండి అంటూ రంగస్థలంపై నుండి అరుస్తున్నాడు. అన్నివందల మంది ప్రేక్షకులూ ఒక్క సారిగా మౌనం వహించారు. చీమచిటుక్కు మన్నా వినిపించే పరిస్థితి అది. ఎవరికీ ఏంచేయాలో తెలియడం లేదు. ప్రేక్షకుల అధైర్యం చూసి రంగస్థలంపై నున్న చంద్రమతి పాత్రధారి విజయదరహాసం చేస్తూ… ఏం… ఎవరూలేరా… మీలో ఎవరూ లేరా? చంద్రమతి పాత్ర పోషించగలిగే మగాళ్ళు ఎవరూ లేరా? అంటూ గట్టిగా అరుస్తూంటే, ఉన్నాను… నేనున్నాను… అంటూ ఓ స్వరం వినబడింది. ఆ స్వరం వినబడగానే ప్రేక్షక జనమందరూ ఆశ్చర్యంతో వెనక్కి చూశారు. ప్రక్కకి చూశారు. ముందుకు చూశారు. తాము విన్నది నిజమేనా అని మరీ… మరీ … చూశారు. రంగస్థలంపై ఉన్న నటుడికి కూడా అది లీలగా వినబడింది. దాంతో అతగాడు మరింత రెచ్చిపోయాడు. ఎవరు? ఎవరది? అంటూ గట్టిగా గద్దించాడు. ఎడమవైపు మండపం ప్రక్కనున్న స్తంభం దగ్గర కూర్చొన్న, ఓ అమ్మాయి లేచి నిలబడింది. దగ్గర్లో ఉన్నవాళ్ళు గబగబా అగ్గిపుల్లలు గీసి, ఆ వెలుగు ఆమె ముఖం దగ్గరకీ పెట్టారు. పదహారేళ్ళ పడుచు. యవ్వనంలో అడుగుపెడుతున్న అందమైన రూపం, గ్రామీణ జీవనంలో కన్పించే ఓ వినమ్రత సహృదయం, సౌజన్యం అన్నింటికీ మించి, వెలుగుతున్న నక్షత్రాల వంటి ఆ కళ్ళు …. ఆ కళ్ళలో కన్పించే అనంతాంబరపు ఆలోచనా పథాలు … స్పష్టమైన నాసిక, పట్టుదల సూచించే నుదురు… ఆ అమ్మాయి వేదికవైపు నడిచింది. ప్రేక్షకులందరూ తప్పుకొని దారి ఇచ్చారు. రంగస్థలం సమీపించింది. మనసులో ఒక్కసారి నటరాజుకు నమస్కరించింది. రంగస్థలంపై ఎగిరి దూకింది. ఆనాడు రంగస్థలంపై ఎగిరిదూకిన ఆ అమ్మాయే! ఆ పదహారేళ్ళ జవ్వనే! నాట్యకళా విశారద పసుపులేటి కన్నాంబ. అది జరిగింది దాదాపుగా 1926వ సంవత్సరం. ఆ రోజుల్లోనే పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడింది. అంతవరకూ కృష్ణాలో ఉన్న ఏలూరును పశ్చిమగోదావరికి ముఖ్యపట్టణం చేశారు. అదిగో… ఆ ఏలూరులోనే ఈ కథంతా జరిగింది. ఇంతకీ రంగస్థలం మీద ఆ తరువాత ఏంజరిగిందో నేను చెప్పనేలేదు కదా! చంద్రమతి పాత్రలో ఆమె నటన అద్భుతంగా సాగింది. రంగస్థలంమీద పాత్రలో ఆమె కరిగిపోయింది. సమస్త ప్రేక్షకులూ కరుణ రసంలో తడిసిపోయారు. అదొక అపూర్వమైన ఘట్టం. అంతవరకూ అన్ని అరుపులూ అరిచిన చంద్రమతి పాత్రధారి అవాక్కయిపోయాడు. చేతులు జోడించి వినమ్రంగా నిలిచాడు. మరునాటి నుండే కన్నాంబ ఆనాటక సంఘంలో సభ్యురాలైపోయింది. ఎన్నెన్నో గొప్ప పాత్రల్ని పోషించడం ప్రారంభించింది. కన్నాంబ ఎప్పుడు జన్మించింది ? నిజానికి ఇది చాలా పెద్ద ప్రశ్న. కొందరు ఆమె 1910లో జన్మించింది అనీ, మరికొందరు ఆమె జన్మ 1912లో అనీ, మరికొందరు ఆమె 1913లో జన్మించిందనీ పేర్కొన్నారు. పేర్కొంటున్నారు కూడా! వారి మాటల్ని, వారి వ్రాతల్ని కాదనడం లేదు, వాటిని అంగీకరిస్తూనే ఇంకా ఏదైనా మంచి ఆధారం దొరికే అవకాశం ఉందా అని ప్రయత్నించినప్పుడు, ఓ ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. 1949వ సంవత్సరం అక్టోబర్ నెలలో “పేస్సుమ్పదమ్” అనే తమిళ సినీపత్రికకు పసుపులేటి కన్నాంబ ఓ ఇంటర్వ్యూ వచ్చింది. అందులో అనేక విషయాలు ముచ్చటిస్తూ, తన జననం 1911వ సంవత్సరం అక్టోబర్ 5వ తేదీ అని ఆమె స్వయంగా వెల్లడించిందట. ఈ విషయాన్ని ఈ మధ్యనే ది హిందూ ఆంగ్ల దినపత్రికలో ప్రచురించారు. తిరుమలలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామికి తొలిగడప వంటిది కడప. ఎందరెందరో మహానుభావులకు జన్మస్థలం కడప. అటువంటి కడపలో లోకాంబ, వెంకటనరసయ్య దంపతులు గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించింది కన్నాంబ. కడపలో జన్మించినా, కన్నాంబ బాల్యం పశ్చిమగోదావరిలోని ఏలూరులో సాగింది. ఆమె తాత ఆయుర్వేద వైద్యుడు. అమ్మమ్మ ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేది. వారిద్దరిదీ అనుకూల దాంపత్యం. వారి ఆదరణలో పెరిగిన కన్నాంబ పై వారి ప్రభావం ఎంతో ఉంది. పైగా తాతగారి పాండిత్యం, సంగీతజ్ఞానం కూడా ఆబాలికను ఎంతగానో తీర్చిదిద్దాయి. అనసూయ, సావిత్రి, యశోద వంటి గొప్ప పాత్రల్లో కన్నాంబ ప్రతిభ శతవిధాల కన్పించింది. పరిపూర్ణమైన రూపసంపద, స్వరబేధాలను విస్పష్టంగా చూపగల వాక్పటిమ, మధురాతి మధురమైన గానసంపద ఇలా ఈ త్రిశక్తులతో కన్నాంబ త్రివేణీ సంగమంలా, ప్రేక్షకులకు ఆరాధ్యనీయమూర్తిగా అనతికాలంలో గణుతి కెక్కింది. కన్నాంబ నటనా ప్రతిభకు అద్దంపట్టిన మరో గొప్పనాటకం రంగూన్ రౌడీ. మహా నటుడు దొమ్మేటి సూర్యనారాయణతో కలిసి వందలాది ప్రదర్శనలిచ్చి, రంగూన్ రౌడీ నాటకానికి ప్రాణప్రతిష్ట చేసింది కన్నాంబ. 1934వ సంవత్సరం ఏప్రిల్ నెల. అది ఆమెకు ఇరవై మూడవ ఏడు. వివాహానికి ఎదిగిన వయసు. నాటకసంస్థ నిర్వాహకులు, సహృదయులు అయిన కడారు నాగభూషణంతో ఆమె మనసు కలిసింది. వారిద్దరూ ఓ ఇంటివారయ్యారు. సాధారణంగా నటీమణుల జీవితాల మీద భాగస్వామి ప్రభావం ఎంతో ఉంటుంది. వివాహం అయ్యేక నటనసాగిస్తూ, నిలద్రొక్కుకోవడంలో జీవనభాగస్వామి పాత్ర ఎంతో ఉంటుంది. అందులో మోసపోయిన విధివంచితులు ఎందరో ఉన్నారు. విజయ హాసంతో జీవనసాగరాన్ని దాటి విశ్రాంతిగా నిలచిన వారూ మరెందరో, కన్నాంబది ఈ రెండో తరగతి. నాగభూషణం వివాహం కన్నాంబ నటజీవితాన్ని మరింతగా పండించింది. వారిద్దరూ కలసి వారి స్వంత నాటకసమాజాన్ని స్థాపించారు. అదే సుప్రసిద్ధమైన శ్రీరాజరాజేశ్వరీ నాట్యమండలి. నాటకరంగంలో కన్నాంబ పేరు ఎంతగా ప్రసిద్ధికెక్కిందంటే ఆమెతో ఒక్కపాత్రనైనా నటించాలని కోరుకోని నటుడు. ఆమె ఆలపించే ఒక్కపద్యానికైనా, గీతానికైనా సంగీత సహకారం అందించాలని ఆశించని కళాకారుడు లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా అనసూయ, చంద్రమతి పాత్రల్లో ఆమె ప్రతిభ అనన్యసామాన్యం. మరీముఖ్యంగా చంద్రమతి పాత్రలో ఆనంద, విషాద, శోక, కరుణ, రస ఘట్టాలలో కన్నాంబ చూపిన మహోన్నతమైన నటన, ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసి, ఏదో అలౌకికమైన భావనా స్థితిలోకితీసుకువెళ్ళిపోయేదిట. నాటకం పూర్తయిన నాలుగు అయిదు రోజుల వరకూ ప్రేక్షకులు ఆ పరిస్థితిలోనే ఉండేవారని మహానటులు మల్లాది సూర్యనారాయణ గారు నాతో ముఫ్ఫై అయిదేళ్ళ క్రిందట ఓసారి మాటల్లో అన్నారు. కన్నాంబ నటజీవితం మరోమలుపు తిరిగింది. స్టార్ కంబైన్స్ అధినేత ఎ. రామయ్య చలనచిత్రం నిర్మించదలచి ఆమెను కలవడం, ఆమె అంగీకరించడం, కొల్హాపూర్లోని శాలినీ సినీ టౌన్ లోహరిశ్చంద్ర చిత్రం రూపు దిద్దుకోవడం వెనువెంటనే జరిగాయి. ఆ తరువాత సరస్వతీ టాకీ కంపెనీ, బెజవాడ వారి ఆధ్వర్యంలో అదే కొల్హాపూర్లో సుప్రసిద్ధ చలనచిత్రం ద్రౌపదీ వస్త్రాపహరణం రూపు దిద్దుకొంది. అందులో ఆమె ద్రౌపదిగా తన విశ్వరూపాన్ని చూపింది. వేల్ పిక్చర్స్ వారి కనకధారతో, కన్నాంబ అగ్రశ్రేణి నటిగా ఎదిగింది. తెలుగు చలనచిత్ర పితామహుడిగా చెప్పుకోదగ్గ హనుమంత రెడ్డి మునియప్పరెడ్డి, హెచ్.ఎమ్. రెడ్డి)తో కలసి, గృహలక్ష్మితో నిర్మాణరంగంలో కాలుమోపింది. ఆతరువాత జయా ఫిలిమ్స్ వారి కాళిదాసులో నటించింది. పాత్రపోషణలో కన్నాంబ చేసిన కృషి తెలుసుకొంటే,ఆమార్గాన్ని అనుసరించగలిగితే, నటనతో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు. 1940లో భవానీ ఫిలిమ్స్ చండిక చిత్రం తీసారు. అందులో కన్నాంబ చండిక పాత్ర నటించింది. అది అంతవరకూ ఆమె నటించిన పాత్రలు అన్నిటి కన్నా, భిన్నమైనది. కోపం ఆక్రోషం, ఆవేశం, క్రౌర్యం ముప్పిరిగొన్న పాత్ర అది. అందులో కన్నాంబ నటన మాటల్లో చెప్పలేనిది. ఆ చిత్రంలో చిరుతపులులతో నటించాలి. ఇలా స్త్రీలు క్రూరజంతువులతో నటించిన తొలి చిత్రం చండికే. అయితే అందులో చిరుతపులులతో సహజత్వాన్ని కోల్పోకుండా నటించడం కోసం, రోజూ ఖాళీ సమయాలలో పులులకి ఆహారం వేస్తూ, వాటిని మచ్చిక చేసుకొంటూ నటించే దంటే, ఒక్కసారి ఊహించండి, నటనపై ఆమె కున్న శ్రద్ధ, పాత్రపోషణలో ఆమెకున్న ఆసక్తి. రంగస్థలం మీద ఆమె రాణి, వెండితెరపై ఆమె రారాణి. తెలుగు, తమిళ చిత్రసీమలు ఆమెకు జేజేలు పలికాయి. గారాబు చెల్లెలుగా, ప్రేమను పంచిన సహోదరిగా, అనురాగంగా పంచిన ధర్మపత్నిగా, అక్కున జేర్చుకొన్న అమ్మగా, కోడల్ని ఆరడి పెట్టే అహంకారి అత్తగారుగా, సకల సంపదలతో తులతూగే మహారాణిగా, అతి దీనస్థితిలో బ్రతుకుతున్నా ఆత్మాభిమానం కోల్పోని ఆదర్శగృహిణిగా సమస్త పాత్రల్నీ అభినయించి, సకల ప్రేక్షకుల హృదిని దోచిన నాట్యకళావిశారద కన్నాంబ. నటిగా ఆమె ఎంత విఖ్యాతురాలో, అంతకన్నా ఘనతరమైన కీర్తి ఆమెకు ఆమె పాడిన గ్రామఫోన్ రికార్డుల వల్ల వచ్చింది. ఆమెపాడిన ఎన్నో గీతాలు సమస్త దక్షిణ భారతదేశాన్నే సంగీత సాగరంలో ఓల లాడించాయి. కృష్ణం భజే రాధా అన్న ఆమెగీతం ఒక్కటి చాలు. ఆమె నామాన్ని చిరస్థాయిగా నిలపడానికి. ఏమే ఓ కోయిలా, అక్షయ లింగవిభో వంటి పాటలు అశేషమైన జనా దరణను స్వంతం చేసుకొని, గ్రామఫోన్ కంపెనీకి కనకవర్షాన్ని కురిపించాయి. కన్నాంబ నిర్మించిన నవజీవనం 1949లో ఉత్తమ చిత్రంగా ఎంపికై, ఆ దంపతులు మద్రాసు ప్రభుత్వం చేత ఘనంగా సత్కరించ బడ్డారు. ఆంధ్రనాటక కళాపరిషత్ కూడా ఆ దంపతుల్ని ఎంతో సత్కరించింది. ఎంతో కీర్తిని, ఎంతో సంపదను అందు కొన్న మహానటి కన్నాంబ. రెండు చేతులా సంపాదించినా, ఆమెలో గర్వాహంకారాలు తలెత్త లేదు. ఈర్ష్యాసూయలు నిలబడలేదు. అవసరమైన వారికి ఎన్నో విధాలా సహాయ పడింది. ఆర్తుల్ని ఆదుకొంది. ఆపన్నులకు స్నేహ హస్తం అందించింది. వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితుల్ని ఓదార్చింది. చేతికి ఎముకలేకుండా దానధర్మాలు చేసి. నిలిచింది. అందుకే 1964వ సంవత్సరం మే నెల ఏడవ తేదీ తెల్లవారు ఝామున 4.40కి భౌతిక ప్రపంచాన్ని వీడి, స్వర్గస్తురాలైనప్పుడు తెలుగు, తమిళ, కన్నడ ప్రపంచంతో పాటుగా, యావత్తు నాటకరంగం, అంతకుమించి అశేష ప్రజానీకం తమ రక్తసంబంధీకురాల్ని కోల్పోయినట్లుగా విలపించారు. మధురస్మృతుల్ని గుండెల్లో పదిలపరుచుకొంటూ నటీశిరోమణికి చేతులెత్తి జోహార్లర్పించారు. చాలామంది నాటకాభి మానులు ఆమె మరణించిన పదవరోజున కృష్ణా, గోదావరి నదుల్లో పుణ్యస్నానాలు చేసి, మరణించిన కన్నాంబ దివ్యస్మృతికి ధర్మోదకాలు సమర్పించారట. కేవలం రక్తసంబంధీకులు చనిపోయినప్పుడు ఇచ్చే ధర్మజలసమర్పణ, ఏ సంబంధంలేని ఓ నటికి అన్ని వందల, వేల మంది ఎందుకు సమర్పించారు? ఎలా సమర్పించారు? అదే నాటకం చెప్పే సత్యం. ఈ భవభందాలకన్నా, ఈ రక్తసంబంధాలకన్నా, ఈ బంధుత్వాలకన్నా,ఈ చుట్టరికాలకన్నా గొప్ప బంధం, గొప్ప అనుబంధం నాటక నటనానుబంధం. దానికి కులం లేదు, మతం లేదు, గొప్ప తక్కువలు లేవు, భాషాబేధాలు, ప్రాంతీయ బేధాలు లేనేలేవు. ఉన్నదల్లా ఒక్కటే. అదే ప్రేమబంధం. అది పొందిన ,నటీనటుల బ్రతుకు ధన్యం, చిరస్మరణీయం. అమ్మా! కన్నాంబా! అందుకే నీవు ధన్యురాలివి, చిరస్మరణీయురాలివి. నీనటనా ప్రతిభకు చేతులెత్తి నమస్కరిస్తూ, ప్రేమతో పలుకరిస్తున్నాం.
Telugu News » World » American medical advisor fauci advice to impliment full lock down in india to control covid Lock Down In India: భార‌త్‌లో ప‌రిస్థితులు అదుపులోకి రావాలంటే లాక్‌డౌన్ పెట్టాల్సిందే: అమెరికా చీఫ్ మెడికల్ అడ్వైజర్.. Lock Down In India: భార‌త్‌లో రోజురోజుకీ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. కేసుల‌తో పాటు మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా ఆక్సిజ‌న్, బెడ్స్... Lockdown In India Narender Vaitla | May 10, 2021 | 6:08 PM Lock Down In India: భార‌త్‌లో రోజురోజుకీ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. కేసుల‌తో పాటు మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా ఆక్సిజ‌న్, బెడ్స్ కొర‌తతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమ‌వారం ఒక్క‌రోజే ఏకంగా 3,66,161 కేసులు న‌మోద‌య్యాయంటే ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక 3,754 మ‌ర‌ణాలతో ప‌రిస్థితులు దారుణంగా మారిపోయాయి. దేశంలో వైద్య వ్వ‌వ‌స్థ పూర్తిగా అస్త‌వ్య‌స్థ‌మ‌వుతోన్న నేప‌థ్యంలో.. పెరిగిపోతున్న కేసులు తగ్గించడానికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గ‌మ‌ని ఇప్ప‌టికే ఎంతో మంది నిపుణులు సూచిస్తున్నారు. దేశం లోప‌ల‌, వెలుప‌ల నుంచి ప‌లువురు నిపుణులు భార‌త్‌లో క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గ‌మని తేల్చి చెబుతున్నారు. దీంతో భారత ప్ర‌భుత్వంపై రోజురోజుకీ ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు క‌ర్ఫ్యూల పేరుతో నిబంధ‌న‌లు పెడుతోన్న ఇవేవీ వైర‌స్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేయ‌లేవ‌ని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా అమెరికా చీఫ్ మెడిక‌ల్ అడ్వైజ‌ర్ ఆంథోనీ ఫౌసీ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం భారత్‌లో ఉన్న ప‌రిస్థితుల‌ను అడ్డుక‌ట్ట వేయాలంటే లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గ‌మ‌ని ఆయన తేల్చి చెప్పారు. ఇప్ప‌టికే దేశంలోని ప‌లు రాష్ట్రాలు ఈ దిశ‌లో అడుగులు వేస్తున్న‌ప్ప‌టికీ వైర‌స్ చైన్‌ను బ్రేక్ చేయాలంటే పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించాల్సిన‌ అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న సూచించారు. లాక్‌డౌన్ అంటే ఆరు నెల‌ల‌పాటు అన్నీ మూసివేయ‌డం కాద‌ని.. క‌నీసం రెండు నుంచి మూడు వారాల‌పాటు నిబంధ‌న‌లు విధించాల‌ని పేర్కొన్నారు. దీనివ‌ల్ల వైర‌స్ చైన్‌కు అడ్డుక‌ట్ట పడుతుంద‌ని ఆయ‌న తెలిపారు. మూడు వారాల త‌ర్వాత కేసులు వాటంతట అవే త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ని తెలిపిన ఫౌసీ… వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ కూడా వేగ‌వంతం చేయాల‌ని సూచించారు. ఇదిలా ఉంటే తాజాగా ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ కూడా దేశంలో లాక్‌డౌన్ విధించ‌మ‌ని ప్ర‌ధానికి లేఖ రాసిన విష‌యం విధిత‌మే మ‌రి.. భారత ప్ర‌భుత్వం ఈ విష‌య‌మై ఎప్పుడు నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి. Also Read: Chennai Railway Police: చెన్నై రైల్వేస్టేషన్ లో పోలీసుల ఎంజాయ్ ఎంజామీ.. ఎందుకో తెలుసా.. Viral Video Happy hypoxia: హ్యాపీ హైపోక్సియా..కరోనా కొత్తలక్షణం..తెలియకుండానే ప్రాణం తీసేస్తుంది..ఇది ఏమిటి? తెలుసుకోవడం ఎలా?
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల జిల్లా, మండల, గ్రామ పంచాయతీల స్థాయిల్లో రాష్ట్రానికి 19 అవార్డులు అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా పురస్కరాల పంట మన తెలంగాణ/హైదరాబాద్ : జాతీయ స్థాయిల్లో రాష్ట్రానికి మరోసారి అవార్డుల పంట పండింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా, మండల, గ్రామ పంచాయతీల స్థాయిలో మొత్తం 19 అవార్డులను సొంతం చేసుకుంది. ప్రతి ఏటా ఇచ్చే అవార్డులలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో అవార్డులను శనివారం ప్రకటించింది. ఇందులో ఉత్తమ జిల్లా పరిషత్‌గా సిరిసిల్లాను ఎంపిక చేసింది. కాగా ఉత్తమ మండలాలుగా వరంగల్ జిల్లా పర్వత గిరి, పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాలోని తిరుమల గిరి, జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల్ మండలాలకు అవార్డులను ప్రకటించింది. అలాగే ఉత్తమ పంచాయతీలుగా సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామం, ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్రకే గ్రామం, కరీంనగర్ జిల్లాలోని వెల్జాల, మహబూబాబాద్ జిల్లాలోని వెంకటాపూర్, సిద్దిపేట జిల్లా జక్కా పూర్, బూరుగు పల్లి, మహబూబ్ నగర్ జిల్లా గుండ్ల పోట్ల పల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా మద్దికుంట, మండే పల్లి, వరంగల్ జిల్లాలోని మరియపురం, పెద్దపల్లి జిల్లాలోని నాగారం, హరిపురం, నారాయణపేట జిల్లాలోని మంతన్‌గడ్, వనపర్తి జిల్లాలోని చందాపూర్ గ్రామలు కూడా అవార్డులను సొంతం చేసుకున్నాయి. కెసిఆర్ విజన్‌తోనే అవార్డులు రాష్ట్రానికి అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టి, అభివృద్ధి విజన్ కారణంగానే ఈ అవార్డులు దక్కాయని వ్యాఖ్యానించారు. ఇందుకు సిఎం కెసిఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు… ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే అవార్డులను ప్రకటించినందుకు కేంద్రానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
రోడ్లు, రైల్వేలు, విమానాశ్ర‌యాలు, పోర్టులు, మాస్ ట్రాన్స్‌పోర్టు, జ‌ల‌ర‌వాణా , ఆర్థిక పరివ‌ర్త‌న‌కు లాజిస్టిక్ మౌలిక‌స‌దుపాయాలు, నిరంత‌రాయ మ‌ల్టీమోడ‌ల్ అనుసంధాన‌త‌, లాజిస్టిక్‌ల‌ను ప‌ర‌స్ప‌రం ఉప‌యోగించుకునే రంగాల వంటి 7 రంగాల‌తో పి.ఎం . గ‌తిశ‌క్తి నేష‌న‌ల్ మాస్ట‌ర్ ప్లాన్‌. 2022-23 లో జాతీయ ర‌హ‌దారుల నెట్ వ‌ర్క్‌ను 2,50,000 కిలోమీట‌ర్ల‌కు విస్త‌ర‌ణ‌. స్టేక్ హోల్డ‌ర్లంద‌రికి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అందించేందుకు అప్లికేష‌న్ ప్రోగ్రామింగ్ ఇంట‌ర్‌ఫేస్ (ఎఇఐ)కోసం డిజైన్ చేసిన యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌పారం (యులిప్). 2022-23లో పిపిపి ప‌ద్ధ‌తిలో నాలుగు ప్రాంతాల‌లో మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు స్థానిక వ్యాపారాలు, స‌ర‌ఫ‌రా చెయిన్ ల‌కు స‌హాయ‌ప‌డేందుకు ఒక‌దేశం-ఒక ఉత్పత్తి ని ప్ర‌చారంలో పెడ‌తారు. 2,000 కిలోమీట‌ర్ల రైల్వే నెట్ వ‌ర్క్ ను క‌వ‌చ్ కిందికి తెస్తారు, 400 కొత్త‌త‌రం వందే భార‌త్ రైళ్ల‌ను అభివృద్ధి చేస్తారు. మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్ సుద‌పాయాల కోసం రాగ‌ల 3 సంవ‌త్స‌రాల‌లో 100 పిఎం గ‌తిశ‌క్తి కార్గో టెర్మిన‌ళ్లు అభివృద్ధి చేస్తారు. పిపిపి ప‌ద్ధ‌తిలో నేష‌న‌ల్ రోప్ వే డ‌వ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రామ్‌ను చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది. 2022-23 లో 60 కిలొమీట‌ర్ల మేర 8 రోప్ వే ప్రాజెక్టుల‌కు కాంట్రాక్టులు ఇస్తారు. Posted On: 01 FEB 2022 12:49PM by PIB Hyderabad పి.ఎం. గ‌తిశ‌క్తి ప‌రివ‌ర్త‌నాత్మ‌క ఆర్థిక ప్ర‌గ‌తి, సుస్థిరాభివృద్ధి విధానం. ఈ విధానం ప్ర‌ధానంగా ఏడు రంగాలైన రోడ్లు, రైల్వేలు, విమానాశ్రాయ‌లు, పోర్టుల‌, మాస్ ట్రాన్స్‌పోర్టు, జ‌ల‌ర‌వాణా, లాజిస్టిక్ మౌలిక‌స‌దుపాయాలు చోద‌క‌శ‌క్తిగా క‌లిగిన‌ది. 2022-23 ఆర్ధిక సంవ‌త్స‌రానికి బ‌డ్జెట్ ప్రవేశ‌పెడుతూ కేంద్ర ఆర్థిక , కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌, ఈ అన్ని ఏడు రంగాలు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఏకోన్ముఖంగా ముందుకు తీసుకుపోనున్నాయ‌న్నారు. వీటికి మ‌ద్ద‌తుగా ఇంధ‌న స‌రఫ‌రా, ఐటి క‌మ్యూనికేష‌న్లు, బ‌ల్క్ వాట‌ర్‌, సీవ‌రేజ్‌, సామాజిక మౌలిక‌స‌దుపాయాలు మ‌ద్ద‌తునిస్తాయ‌న్నారు. మొత్తానికి ఈ విధానం ప‌రిశుధ్ద‌మైన ఇంధ‌నం, స‌బ్ కా ప్ర‌యాస్ తో శ‌క్తిమంత‌మౌతుంద‌న్నారు.కేంద్ర‌ప్ర‌భుత్వం, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు, ప్రైవేటు రంగం క‌లిసి కృషి చేయ‌డం వ‌ల్ల పెద్ద ఎత్తున ఉపాధి, వ్యాపార అవ‌కాశాలు అంద‌ర‌కీ ప్రత్యేకించి యువ‌త‌కు క‌లుగుతాయ‌ని అన్నారు. పిఎం గ‌తిశ‌క్తి నేష‌న‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ : పిఎం గ‌తిశ‌క్తి నేష‌న‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ ఏడు రంగాల‌తో కూడుకున్న‌ద‌ని, ఇది ఆర్ధిక ప‌రివ‌ర్త‌ను, నిరంత‌రాయ మ‌ల్టీమోడ‌ల్ అనుసంధాన‌త‌కు, లాజిస్టిక్‌ల స‌మ‌ర్థ‌త‌కు వీలు క‌ల్పిస్తుంద‌ని ఆర్ధిక‌మంత్రి నిర్మ‌లా సీతారామన్ అన్నారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు గ‌తిశ‌క్తి మాస్ట‌ర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలు కూడా ఇందులో క‌ల‌సి ఉంటాయ‌ని అన్నారు. వినూత్న విధానాల‌లో ప్లానింగ్‌, ఫైనాన్సింగ్ , సాంకేతిక ప‌రిజ్ఞానం ఉప‌యోగం, స‌త్వ‌ర అమ‌లు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ ఏడు రంగాల‌కు సంబంధించిన నేష‌న‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ పైప్‌లైన్‌ను పి.ఎం. గ‌తి శ‌క్తి ఫ్రేమ్ వ‌ర్క్ తో అనుసంధానం చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అత్యుధునాత‌న ప్ర‌పంచ‌శ్రేణి ఆధునిక మౌలిక‌స‌దుపాయాలు, వివిధ‌రంగాల‌కు సంబంధించిన ర‌వాణాను, ప్రాజెక్టు ప్రాంతాల‌ను అనుసంధానం చేయ‌డం ఇందులోని ప్ర‌ధాన అంశం. ఇది ఉత్పాద‌క‌త‌ను పెంపొందించ‌డానికి, ఆర్ధిక వృద్ధిని, అభివృద్ధిని వేగ‌వంతం చేయ‌డానికి ఉప‌క‌రిస్తుంది. రొడ్ ర‌వాణాః పిఎం గ‌తిశ‌క్తి మాస్ట‌ర్ ప్లాన్ ఫ‌ర్ ఎక్స్‌ప్రెస్ వేల‌కు పిఎం గ‌తి శ‌క్తి మాస్ట‌ర్ ప్లాన్‌ను 2022-23లో రూప‌క‌ల్ప‌న చేయ‌డంజ‌రుగుతుంద‌న్నారు. దీనివ‌ల్ల ప్ర‌జ‌లు, స‌ర‌కులు వేగ‌వంతంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర‌డానికి వీలు క‌లుగుతుంద‌న్నారు. జాతీయ హైవేల నెట్ వ‌ర్క్‌ను 2022-23 సంవ‌త్స‌రంలో 25,000 కిలోమీట‌ర్లు విస్త‌రించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌జా వ‌న‌రుల‌తో పాటు వినూత్న ఫైనాన్సింగ్ విధానాల‌తో 20,000 కోట్ల రూపాయ‌ల‌ను స‌మీక‌రించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. స‌ర‌కుర‌వాణా, ప్ర‌జల రాక‌పోక‌లు నిరంత‌రాయంగా సాగే మ‌ల్టీమోడ‌ల్ వ్య‌వ‌స్థ‌: .యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంట‌ర్ ఫేస్ ప్లాట్ ఫారం (యుఎల్ ఐ పి) కింద అన్నిర‌కాల ఆప‌రేట‌ర్ల కార్య‌క‌లాపాల‌ను ఒక చోట చేర్చి వాటికి సంబందించిన స‌మాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేలా చూడ‌నున్న‌ట్టు శ్రీమ‌తి సీతారామ‌న్ తెలిపారు. దీనిని అప్లికేష‌న్ ప్రోగ్రామింగ్ ఇంట‌ర్ ఫేస్ కోసం రూపొందించార‌న్నారు. ఇది స‌మ‌ర్ధంగా స‌ర‌కు ర‌వాణాను త‌క్కువ ఖ‌ర్చు, త‌గిన స‌మ‌యంలో జ‌రిగేట్టు చూస్తుంద‌ని, ఇన్వెంట‌రీ మేనేజ్ మెంట్ కు ఉప‌క‌రిస్తుంద‌ని అన్నారు. అన‌వ‌స‌ర డాక్యుమెంటేష‌న్ లేకుండా చూస్తుంద‌ని తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇది రియ‌ల్ టైమ్ స‌మాచారాన్ని స్టేక్ హోల్డ‌ర్లు అంద‌రికీ అంద‌జేస్తుంద‌ని, అంత‌ర్జాతీయ పోటీ సామ‌ర్థ్యాన్ని మెరుగుప‌రుస్తుంద‌న్నారు. ప్ర‌యాణికులు నిరంత‌రాయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్ర‌యాణించ‌డానికి కూడా ఇది వీలు క‌ల్పిస్తుంది. మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్ పార్కులు : మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్ పార్కులను పిపిపి ప‌ద్ధ‌తిలో నాలుగు ప్రాంతాల‌లో 2022-23 సంవ‌త్స‌రాల‌లో ఏర్పాటు చేస్తారు. రైల్వేలుః రైల్వేలు నూత‌న ప్రాడ‌క్టులు , స‌మ‌ర్ద లాజిస్టిక్ స‌ర్వీసుల‌ను చిన్న రైతులు, చిన్న మ‌ధ్య త‌ర‌హా ఎంట‌ర్ ప్రైజ్ ల‌కోసం అభివృద్ది చేస్తాయ‌న్నారు. అలాగే పోస్ట‌ల్‌, రైల్వేనెట్ వ‌ర్క్‌ల‌ను పార్సిల్ స‌ర్వీసులు స‌త్వ‌రం గ‌మ్య‌స్థానానికి చేరేలా నిరంత‌రాయ ఏర్పాటు చేస్తార‌న్నారు. ఒక స్టేష‌న్‌- ఒక ఉత్ప‌త్తి విధానాన్నప్రాచుర్యంలోకి తీసుకువ‌స్తార‌ని, ఇది స్థాని వ్యాపారాలు, స‌ర‌ఫ‌రా చెయిన్‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. .ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ లో భాగంగా 2,000 కిలొమీట‌ర్ల నెట్‌వ‌ర్క్‌ను క‌వ‌చ్ కిందికి తీసుకువస్తారు. దీనికి దేశీయంగా ప్రపంచ శ్రేణి భ‌ద్ర‌తా సాంకేతిక‌తను, సామ‌ర్ధ్యం పెంపును 2022-23లో తీసుకువ‌స్తారు. 400 కొత్త త‌రం వందే భార‌త్ రైళ్ల‌ను అభివృద్ది చేయ‌నున్న‌ట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. దీనివ‌ల్ల ప్ర‌యాణికుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణం, మెరుగైన ఇంధ‌న సామ‌ర్ద్యం క‌లిగి ఉంటాయ‌న్నారు. రాగ‌ల 3 సంవ‌త్స‌రాల‌లో వీటిని అభివృద్ధి చేస్తార‌న్నారు. 100 పి.ఎం. గ‌తి శ‌క్తి కార్గో టెర్మిన‌ళ్ల‌ను మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్ స‌దుపాయాల కోసం రాగ‌ల మూడు సంవ‌త్స‌రాల‌లో అభివృద్ది చేస్తారు. .మాస్ అర్బ‌న్ ట్రాన్స్‌పోర్టు రైల్వేల‌తో అనుసంధాన‌తః .ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌సంగం చేస్తూ, మెట్రో వ్య‌వ‌స్థ‌ల‌ను త‌గిన రీతిలో త‌గిన స్తాయిలో స‌త్వ‌రం అమ‌లుచేసేందుకు అవ‌స‌ర‌మైన ఆర్థిక‌వ‌న‌రుల‌ను వినూత్న ప‌ద్ధ‌తిలో చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు. మ‌ల్టీ మోడ‌ల్ అనుసంధాన‌త‌ను మాస్ అర్బ‌న్‌ట్రాన్స్‌పోర్టు, రైల్వే స్టేష‌న్‌లను ప్రాధాన్య‌త ప్రాతిప‌దిత‌క‌న చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది. మెట్రో వ్య‌వ‌స్థ‌ల డిజైన్‌, సివిల్ నిర్మాణాల‌ను భార‌తీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా , అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్టుగా తీర్చిదిద్ద‌డం జ‌రుగుతుంది. ప‌ర్వ‌త్ మాలా: నేష‌న‌ల్ రోప్ వేస్ డ‌వ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం: క్లిష్ట‌మైన కొండ‌ప్రాంతాల‌లో ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా హిత‌క‌ర‌మైన ప్ర‌త్యామ్నాయ రోడ్లు, నేష‌న‌ల్ రోప్‌వే డ‌వ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం ను పిపిపి ప‌ద్ధ‌తిలో చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది. అనుసంధాన‌త‌, ప్ర‌యాణికుల‌కు సౌల‌భ్యం, ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌డం ప‌ర్యాట‌క రంగాన్ని ప్ర‌మోట్ చేయడం ల‌క్ష్యంగా వీటిని చేప‌డ‌తారు. సంప్ర‌దాయ మాస్ ట్రాన్సిట్ వ్య‌వ‌స్థ సాద్యం కాని చోట, ఇరుకు ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో వాటిని ఏర్పాటు చేస్తారు. 8 రోప్‌వేల‌కు సంబంధించి 60 కిలో మీట‌ర్ల పొడ‌వుగ‌ల ప్రాజెక్టుల కాంట్రాక్టుల‌ను 2022-23 లో కేటాయిస్తారు. మౌలిక‌స‌దుపాయాల ప్రాజెక్టుల సామ‌ర్థ్య నిర్మాణం కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు . ఇన్‌ఫ్రా ఏజెన్సీల సాంకేతిక సహకారంతో వారి నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇది పిఎం గతిశక్తి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రణాళిక, రూపకల్పన, ఫైనాన్సింగ్ (వినూత్న మార్గాలతో సహా) అమలు నిర్వహణలో సామర్థ్యాన్ని పెంచుతుంది. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో, ల‌క్ష కోట్ల రూపాయ‌లను రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌కు స‌హాయం చేసేందుకు , దేశంలో మొత్తంగ పెట్టుబ‌డిని ఉత్ప్రేరితం చేసేందుకు , 50 సంవ‌త్స‌రాల పాటువ‌డ్డీ లేని రుణాన్ని , సాధార‌ణ రుణాల‌కు మించి అనుమ‌తించ‌డం జ‌రుగుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ కేటాయింపుల‌ను పి.ఎం. గ‌తిశ‌క్తి సంబందిత‌, ఇత‌ర ఉత్ప‌త్తి దాయక కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్‌కు ఉప‌యోగిస్తారు. ఇందులో ప్రధాన‌మంత్రి గ్రామ స‌డ‌క్ యోజ‌న‌కు స‌ప్లిమెంట‌ల్ నిధులు, రాష్ట్రాల వాటాకు మ‌ద్ద‌తు, ఆర్థిక వ్య‌వ‌స్థ డిజిటైజేష‌న్‌, డిజిట‌ల్ చెల్లింపులు, ఒఎఫ్ సి నెట్ వ‌ర్క్‌పూర్తి, బైలాస్ ఏర్పాటుకు సంస్క‌ర‌ణ‌లు, టౌన్ ప్లానింగ్ ప‌థ‌కాలు, ట్రాన్సిట్ ఆధారిత అభివృద్ధి, బ‌ద‌లీ అభివృద్ధి హ‌క్కులు వంటి వి ఉన్నాయి. *** (Release ID: 1794306) Visitor Counter : 236 Read this release in: English , Urdu , Marathi , Hindi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam ఆర్థిక మంత్రిత్వ శాఖ రోడ్లు, రైల్వేలు, విమానాశ్ర‌యాలు, పోర్టులు, మాస్ ట్రాన్స్‌పోర్టు, జ‌ల‌ర‌వాణా , ఆర్థిక పరివ‌ర్త‌న‌కు లాజిస్టిక్ మౌలిక‌స‌దుపాయాలు, నిరంత‌రాయ మ‌ల్టీమోడ‌ల్ అనుసంధాన‌త‌, లాజిస్టిక్‌ల‌ను ప‌ర‌స్ప‌రం ఉప‌యోగించుకునే రంగాల వంటి 7 రంగాల‌తో పి.ఎం . గ‌తిశ‌క్తి నేష‌న‌ల్ మాస్ట‌ర్ ప్లాన్‌. 2022-23 లో జాతీయ ర‌హ‌దారుల నెట్ వ‌ర్క్‌ను 2,50,000 కిలోమీట‌ర్ల‌కు విస్త‌ర‌ణ‌. స్టేక్ హోల్డ‌ర్లంద‌రికి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అందించేందుకు అప్లికేష‌న్ ప్రోగ్రామింగ్ ఇంట‌ర్‌ఫేస్ (ఎఇఐ)కోసం డిజైన్ చేసిన యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌పారం (యులిప్). 2022-23లో పిపిపి ప‌ద్ధ‌తిలో నాలుగు ప్రాంతాల‌లో మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు స్థానిక వ్యాపారాలు, స‌ర‌ఫ‌రా చెయిన్ ల‌కు స‌హాయ‌ప‌డేందుకు ఒక‌దేశం-ఒక ఉత్పత్తి ని ప్ర‌చారంలో పెడ‌తారు. 2,000 కిలోమీట‌ర్ల రైల్వే నెట్ వ‌ర్క్ ను క‌వ‌చ్ కిందికి తెస్తారు, 400 కొత్త‌త‌రం వందే భార‌త్ రైళ్ల‌ను అభివృద్ధి చేస్తారు. మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్ సుద‌పాయాల కోసం రాగ‌ల 3 సంవ‌త్స‌రాల‌లో 100 పిఎం గ‌తిశ‌క్తి కార్గో టెర్మిన‌ళ్లు అభివృద్ధి చేస్తారు. పిపిపి ప‌ద్ధ‌తిలో నేష‌న‌ల్ రోప్ వే డ‌వ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రామ్‌ను చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది. 2022-23 లో 60 కిలొమీట‌ర్ల మేర 8 రోప్ వే ప్రాజెక్టుల‌కు కాంట్రాక్టులు ఇస్తారు. Posted On: 01 FEB 2022 12:49PM by PIB Hyderabad పి.ఎం. గ‌తిశ‌క్తి ప‌రివ‌ర్త‌నాత్మ‌క ఆర్థిక ప్ర‌గ‌తి, సుస్థిరాభివృద్ధి విధానం. ఈ విధానం ప్ర‌ధానంగా ఏడు రంగాలైన రోడ్లు, రైల్వేలు, విమానాశ్రాయ‌లు, పోర్టుల‌, మాస్ ట్రాన్స్‌పోర్టు, జ‌ల‌ర‌వాణా, లాజిస్టిక్ మౌలిక‌స‌దుపాయాలు చోద‌క‌శ‌క్తిగా క‌లిగిన‌ది. 2022-23 ఆర్ధిక సంవ‌త్స‌రానికి బ‌డ్జెట్ ప్రవేశ‌పెడుతూ కేంద్ర ఆర్థిక , కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌, ఈ అన్ని ఏడు రంగాలు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఏకోన్ముఖంగా ముందుకు తీసుకుపోనున్నాయ‌న్నారు. వీటికి మ‌ద్ద‌తుగా ఇంధ‌న స‌రఫ‌రా, ఐటి క‌మ్యూనికేష‌న్లు, బ‌ల్క్ వాట‌ర్‌, సీవ‌రేజ్‌, సామాజిక మౌలిక‌స‌దుపాయాలు మ‌ద్ద‌తునిస్తాయ‌న్నారు. మొత్తానికి ఈ విధానం ప‌రిశుధ్ద‌మైన ఇంధ‌నం, స‌బ్ కా ప్ర‌యాస్ తో శ‌క్తిమంత‌మౌతుంద‌న్నారు.కేంద్ర‌ప్ర‌భుత్వం, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు, ప్రైవేటు రంగం క‌లిసి కృషి చేయ‌డం వ‌ల్ల పెద్ద ఎత్తున ఉపాధి, వ్యాపార అవ‌కాశాలు అంద‌ర‌కీ ప్రత్యేకించి యువ‌త‌కు క‌లుగుతాయ‌ని అన్నారు. పిఎం గ‌తిశ‌క్తి నేష‌న‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ : పిఎం గ‌తిశ‌క్తి నేష‌న‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ ఏడు రంగాల‌తో కూడుకున్న‌ద‌ని, ఇది ఆర్ధిక ప‌రివ‌ర్త‌ను, నిరంత‌రాయ మ‌ల్టీమోడ‌ల్ అనుసంధాన‌త‌కు, లాజిస్టిక్‌ల స‌మ‌ర్థ‌త‌కు వీలు క‌ల్పిస్తుంద‌ని ఆర్ధిక‌మంత్రి నిర్మ‌లా సీతారామన్ అన్నారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు గ‌తిశ‌క్తి మాస్ట‌ర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలు కూడా ఇందులో క‌ల‌సి ఉంటాయ‌ని అన్నారు. వినూత్న విధానాల‌లో ప్లానింగ్‌, ఫైనాన్సింగ్ , సాంకేతిక ప‌రిజ్ఞానం ఉప‌యోగం, స‌త్వ‌ర అమ‌లు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ ఏడు రంగాల‌కు సంబంధించిన నేష‌న‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ పైప్‌లైన్‌ను పి.ఎం. గ‌తి శ‌క్తి ఫ్రేమ్ వ‌ర్క్ తో అనుసంధానం చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అత్యుధునాత‌న ప్ర‌పంచ‌శ్రేణి ఆధునిక మౌలిక‌స‌దుపాయాలు, వివిధ‌రంగాల‌కు సంబంధించిన ర‌వాణాను, ప్రాజెక్టు ప్రాంతాల‌ను అనుసంధానం చేయ‌డం ఇందులోని ప్ర‌ధాన అంశం. ఇది ఉత్పాద‌క‌త‌ను పెంపొందించ‌డానికి, ఆర్ధిక వృద్ధిని, అభివృద్ధిని వేగ‌వంతం చేయ‌డానికి ఉప‌క‌రిస్తుంది. రొడ్ ర‌వాణాః పిఎం గ‌తిశ‌క్తి మాస్ట‌ర్ ప్లాన్ ఫ‌ర్ ఎక్స్‌ప్రెస్ వేల‌కు పిఎం గ‌తి శ‌క్తి మాస్ట‌ర్ ప్లాన్‌ను 2022-23లో రూప‌క‌ల్ప‌న చేయ‌డంజ‌రుగుతుంద‌న్నారు. దీనివ‌ల్ల ప్ర‌జ‌లు, స‌ర‌కులు వేగ‌వంతంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర‌డానికి వీలు క‌లుగుతుంద‌న్నారు. జాతీయ హైవేల నెట్ వ‌ర్క్‌ను 2022-23 సంవ‌త్స‌రంలో 25,000 కిలోమీట‌ర్లు విస్త‌రించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌జా వ‌న‌రుల‌తో పాటు వినూత్న ఫైనాన్సింగ్ విధానాల‌తో 20,000 కోట్ల రూపాయ‌ల‌ను స‌మీక‌రించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. స‌ర‌కుర‌వాణా, ప్ర‌జల రాక‌పోక‌లు నిరంత‌రాయంగా సాగే మ‌ల్టీమోడ‌ల్ వ్య‌వ‌స్థ‌: .యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంట‌ర్ ఫేస్ ప్లాట్ ఫారం (యుఎల్ ఐ పి) కింద అన్నిర‌కాల ఆప‌రేట‌ర్ల కార్య‌క‌లాపాల‌ను ఒక చోట చేర్చి వాటికి సంబందించిన స‌మాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేలా చూడ‌నున్న‌ట్టు శ్రీమ‌తి సీతారామ‌న్ తెలిపారు. దీనిని అప్లికేష‌న్ ప్రోగ్రామింగ్ ఇంట‌ర్ ఫేస్ కోసం రూపొందించార‌న్నారు. ఇది స‌మ‌ర్ధంగా స‌ర‌కు ర‌వాణాను త‌క్కువ ఖ‌ర్చు, త‌గిన స‌మ‌యంలో జ‌రిగేట్టు చూస్తుంద‌ని, ఇన్వెంట‌రీ మేనేజ్ మెంట్ కు ఉప‌క‌రిస్తుంద‌ని అన్నారు. అన‌వ‌స‌ర డాక్యుమెంటేష‌న్ లేకుండా చూస్తుంద‌ని తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇది రియ‌ల్ టైమ్ స‌మాచారాన్ని స్టేక్ హోల్డ‌ర్లు అంద‌రికీ అంద‌జేస్తుంద‌ని, అంత‌ర్జాతీయ పోటీ సామ‌ర్థ్యాన్ని మెరుగుప‌రుస్తుంద‌న్నారు. ప్ర‌యాణికులు నిరంత‌రాయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్ర‌యాణించ‌డానికి కూడా ఇది వీలు క‌ల్పిస్తుంది. మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్ పార్కులు : మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్ పార్కులను పిపిపి ప‌ద్ధ‌తిలో నాలుగు ప్రాంతాల‌లో 2022-23 సంవ‌త్స‌రాల‌లో ఏర్పాటు చేస్తారు. రైల్వేలుః రైల్వేలు నూత‌న ప్రాడ‌క్టులు , స‌మ‌ర్ద లాజిస్టిక్ స‌ర్వీసుల‌ను చిన్న రైతులు, చిన్న మ‌ధ్య త‌ర‌హా ఎంట‌ర్ ప్రైజ్ ల‌కోసం అభివృద్ది చేస్తాయ‌న్నారు. అలాగే పోస్ట‌ల్‌, రైల్వేనెట్ వ‌ర్క్‌ల‌ను పార్సిల్ స‌ర్వీసులు స‌త్వ‌రం గ‌మ్య‌స్థానానికి చేరేలా నిరంత‌రాయ ఏర్పాటు చేస్తార‌న్నారు. ఒక స్టేష‌న్‌- ఒక ఉత్ప‌త్తి విధానాన్నప్రాచుర్యంలోకి తీసుకువ‌స్తార‌ని, ఇది స్థాని వ్యాపారాలు, స‌ర‌ఫ‌రా చెయిన్‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. .ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ లో భాగంగా 2,000 కిలొమీట‌ర్ల నెట్‌వ‌ర్క్‌ను క‌వ‌చ్ కిందికి తీసుకువస్తారు. దీనికి దేశీయంగా ప్రపంచ శ్రేణి భ‌ద్ర‌తా సాంకేతిక‌తను, సామ‌ర్ధ్యం పెంపును 2022-23లో తీసుకువ‌స్తారు. 400 కొత్త త‌రం వందే భార‌త్ రైళ్ల‌ను అభివృద్ది చేయ‌నున్న‌ట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. దీనివ‌ల్ల ప్ర‌యాణికుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణం, మెరుగైన ఇంధ‌న సామ‌ర్ద్యం క‌లిగి ఉంటాయ‌న్నారు. రాగ‌ల 3 సంవ‌త్స‌రాల‌లో వీటిని అభివృద్ధి చేస్తార‌న్నారు. 100 పి.ఎం. గ‌తి శ‌క్తి కార్గో టెర్మిన‌ళ్ల‌ను మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్ స‌దుపాయాల కోసం రాగ‌ల మూడు సంవ‌త్స‌రాల‌లో అభివృద్ది చేస్తారు. .మాస్ అర్బ‌న్ ట్రాన్స్‌పోర్టు రైల్వేల‌తో అనుసంధాన‌తః .ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌సంగం చేస్తూ, మెట్రో వ్య‌వ‌స్థ‌ల‌ను త‌గిన రీతిలో త‌గిన స్తాయిలో స‌త్వ‌రం అమ‌లుచేసేందుకు అవ‌స‌ర‌మైన ఆర్థిక‌వ‌న‌రుల‌ను వినూత్న ప‌ద్ధ‌తిలో చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు. మ‌ల్టీ మోడ‌ల్ అనుసంధాన‌త‌ను మాస్ అర్బ‌న్‌ట్రాన్స్‌పోర్టు, రైల్వే స్టేష‌న్‌లను ప్రాధాన్య‌త ప్రాతిప‌దిత‌క‌న చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది. మెట్రో వ్య‌వ‌స్థ‌ల డిజైన్‌, సివిల్ నిర్మాణాల‌ను భార‌తీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా , అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్టుగా తీర్చిదిద్ద‌డం జ‌రుగుతుంది. ప‌ర్వ‌త్ మాలా: నేష‌న‌ల్ రోప్ వేస్ డ‌వ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం: క్లిష్ట‌మైన కొండ‌ప్రాంతాల‌లో ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా హిత‌క‌ర‌మైన ప్ర‌త్యామ్నాయ రోడ్లు, నేష‌న‌ల్ రోప్‌వే డ‌వ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం ను పిపిపి ప‌ద్ధ‌తిలో చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది. అనుసంధాన‌త‌, ప్ర‌యాణికుల‌కు సౌల‌భ్యం, ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌డం ప‌ర్యాట‌క రంగాన్ని ప్ర‌మోట్ చేయడం ల‌క్ష్యంగా వీటిని చేప‌డ‌తారు. సంప్ర‌దాయ మాస్ ట్రాన్సిట్ వ్య‌వ‌స్థ సాద్యం కాని చోట, ఇరుకు ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో వాటిని ఏర్పాటు చేస్తారు. 8 రోప్‌వేల‌కు సంబంధించి 60 కిలో మీట‌ర్ల పొడ‌వుగ‌ల ప్రాజెక్టుల కాంట్రాక్టుల‌ను 2022-23 లో కేటాయిస్తారు. మౌలిక‌స‌దుపాయాల ప్రాజెక్టుల సామ‌ర్థ్య నిర్మాణం కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు . ఇన్‌ఫ్రా ఏజెన్సీల సాంకేతిక సహకారంతో వారి నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇది పిఎం గతిశక్తి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రణాళిక, రూపకల్పన, ఫైనాన్సింగ్ (వినూత్న మార్గాలతో సహా) అమలు నిర్వహణలో సామర్థ్యాన్ని పెంచుతుంది. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో, ల‌క్ష కోట్ల రూపాయ‌లను రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌కు స‌హాయం చేసేందుకు , దేశంలో మొత్తంగ పెట్టుబ‌డిని ఉత్ప్రేరితం చేసేందుకు , 50 సంవ‌త్స‌రాల పాటువ‌డ్డీ లేని రుణాన్ని , సాధార‌ణ రుణాల‌కు మించి అనుమ‌తించ‌డం జ‌రుగుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ కేటాయింపుల‌ను పి.ఎం. గ‌తిశ‌క్తి సంబందిత‌, ఇత‌ర ఉత్ప‌త్తి దాయక కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్‌కు ఉప‌యోగిస్తారు. ఇందులో ప్రధాన‌మంత్రి గ్రామ స‌డ‌క్ యోజ‌న‌కు స‌ప్లిమెంట‌ల్ నిధులు, రాష్ట్రాల వాటాకు మ‌ద్ద‌తు, ఆర్థిక వ్య‌వ‌స్థ డిజిటైజేష‌న్‌, డిజిట‌ల్ చెల్లింపులు, ఒఎఫ్ సి నెట్ వ‌ర్క్‌పూర్తి, బైలాస్ ఏర్పాటుకు సంస్క‌ర‌ణ‌లు, టౌన్ ప్లానింగ్ ప‌థ‌కాలు, ట్రాన్సిట్ ఆధారిత అభివృద్ధి, బ‌ద‌లీ అభివృద్ధి హ‌క్కులు వంటి వి ఉన్నాయి.
సినిమా స్క్రిప్ట్ & రివ్యూ : 04/07/20 .Header h1 { font: normal normal 90px Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; color: #ffff00; } .Header h1 a { color: #ffff00; } .Header .description { font-size: 130%; } /* Tabs ----------------------------------------------- */ .tabs-inner { margin: 1em 0 0; padding: 0; } .tabs-inner .section { margin: 0; } .tabs-inner .widget ul { padding: 0; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; } .tabs-inner .widget li { border: none; } .tabs-inner .widget li a { display: inline-block; padding: 1em 1.5em; color: #ffffff; font: normal bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; } .tabs-inner .widget li.selected a, .tabs-inner .widget li a:hover { position: relative; z-index: 1; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } /* Headings ----------------------------------------------- */ h2 { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #00ffff; } .main-inner h2.date-header { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #0f0e0c; } .footer-inner .widget h2, .sidebar .widget h2 { padding-bottom: .5em; } /* Main ----------------------------------------------- */ .main-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner .section { margin: 0 20px; } .main-inner .column-right-inner { margin-left: 20px; } .main-inner .fauxcolumn-right-outer .fauxcolumn-inner { margin-left: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner { margin-right: 20px; } .main-inner .fauxcolumn-left-outer .fauxcolumn-inner { margin-right: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner, .main-inner .column-right-inner { padding: 15px 0; } /* Posts ----------------------------------------------- */ h3.post-title { margin-top: 20px; } h3.post-title a { font: italic bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #b02ef1; } h3.post-title a:hover { text-decoration: underline; } .main-inner .column-center-outer { background: #ffffff none repeat scroll top left; _background-image: none; } .post-body { line-height: 1.4; position: relative; } .post-header { margin: 0 0 1em; line-height: 1.6; } .post-footer { margin: .5em 0; line-height: 1.6; } #blog-pager { font-size: 140%; } #comments { background: #cccccc none repeat scroll top center; padding: 15px; } #comments .comment-author { padding-top: 1.5em; } #comments h4, #comments .comment-author a, #comments .comment-timestamp a { color: #b02ef1; } #comments .comment-author:first-child { padding-top: 0; border-top: none; } .avatar-image-container { margin: .2em 0 0; } /* Comments ----------------------------------------------- */ #comments a { color: #b02ef1; } .comments .comments-content .icon.blog-author { background-repeat: no-repeat; background-image: url(); } .comments .comments-content .loadmore a { border-top: 1px solid #b02ef1; border-bottom: 1px solid #b02ef1; } .comments .comment-thread.inline-thread { background: #ffffff; } .comments .continue { border-top: 2px solid #b02ef1; } /* Widgets ----------------------------------------------- */ .sidebar .widget { border-bottom: 2px solid #f1d08f; padding-bottom: 10px; margin: 10px 0; } .sidebar .widget:first-child { margin-top: 0; } .sidebar .widget:last-child { border-bottom: none; margin-bottom: 0; padding-bottom: 0; } .footer-inner .widget, .sidebar .widget { font: normal normal 14px Georgia, Utopia, 'Palatino Linotype', Palatino, serif; color: #ffe599; } .sidebar .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .sidebar .widget a:visited { color: #6ef12e; } .sidebar .widget a:hover { color: #c1c1c1; text-decoration: underline; } .footer-inner .widget a:link { color: #3630f4; text-decoration: none; } .footer-inner .widget a:visited { color: #000000; } .footer-inner .widget a:hover { color: #3630f4; text-decoration: underline; } .widget .zippy { color: #ffffff; } .footer-inner { background: transparent none repeat scroll top center; } /* Mobile ----------------------------------------------- */ body.mobile { background-size: 100% auto; } body.mobile .AdSense { margin: 0 -10px; } .mobile .body-fauxcolumn-outer { background: transparent none repeat scroll top left; } .mobile .footer-inner .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .mobile .footer-inner .widget a:visited { color: #6ef12e; } .mobile-post-outer a { color: #b02ef1; } .mobile-link-button { background-color: #3630f4; } .mobile-link-button a:link, .mobile-link-button a:visited { color: #ffffff; } .mobile-index-contents { color: #444444; } .mobile .tabs-inner .PageList .widget-content { background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } .mobile .tabs-inner .PageList .widget-content .pagelist-arrow { border-left: 1px solid #ffffff; } sikander777 --> సినిమా స్క్రిప్ట్ & రివ్యూ రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు... టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం! Tuesday, April 7, 2020 924 : సాంకేతికం - షాట్స్ సంగతులు (సారీ, కొన్ని పెండింగ్ (రాత) పనుల వల్ల ఈ ఆర్టికల్ ఎక్కువ సమయం తీసుకుంది) కొన్ని సినిమాల్లో వెంటాడే దృశ్యాలుంటాయి. వెంటాడ్డానికి జీవంతో తొణికిస లాడ్డం కారణం. దృశ్యాల్లో తీసే ప్రతీ షాటూ వాటికీ శాశ్వతత్వం కల్పించడం. రైటర్ పని పాత్రని సృష్టించి దాని మానాన వదిలెయ్యడం. పాత్రని పట్టకుని తను కథ నడపడం కాదు. పాత్ర దాని కథ అదే నడుపుకునే ఫస్ట్ హేండ్ డ్రైవ్ అవకాశం కల్పించడం. మేకర్ పని కూడా షాట్స్ ని బయట నుంచి పాత్రల మీద రుద్దడం కాదు, లోపలి నుంచి ఇన్నర్ ఇంజనీరింగ్ జరపడం. అందచందాలు ఫైపైన లేపనాల వల్ల రావు, లోపలికి తీసుకునే పానీయాల వల్ల వస్తాయి. షాట్స్ కూడా లేపనాలు కాకుండా పానీయాలు కావాలి. అప్పుడు జీవం వస్తుంది. ఒక సీనుకి ఆ సీన్లో పాత్ర వున్నపరిస్థితీ, ఆ పరిస్థితికి పాత్ర ఎలా ఫీలవుతోందో ఆ ఫీల్ - ఇవి మాత్రమే షాట్స్ ని నిర్ణయిస్తాయి. చాలా సినిమాల్లో ఈ వరస కన్పించదు. అందువల్ల ఆ సీన్లు థియేటర్ లోంచి బయటకి కొస్తే గుర్తుండవు. పాత్రల్లోపలి నుంచి దాని దృక్కోణాన్ని చూస్తూ షాట్స్ ఆలోచించకుండా, బయటి నుంచి మేకర్ తనదేదో దృక్కోణంతో పాత్రమీద షాట్స్ ని రుద్దితే ఏకత్వం చెడి దృశ్యం నిలబడదు. ఆర్ట్ సినిమాల్ని, లేదా మన ప్రాంతీయ సినిమాల్ని చూస్తూంటే ఇదే అర్ధమవుతుంది. ఇందుకే ఇవి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందుతూంటాయి. ఆర్ట్ సినిమా మేకింగ్ కమర్షియల్ సినిమాల కెందుకనుకోవచ్చు. ఆర్ట్ సినిమాలే కాలాన్ని బట్టి మారి కొంత కమర్షియాలిటీనీ కూడా కలుపుకుని, ఫ్యూజన్ తో క్రాసోవర్ సినిమాలుగా వస్తూంటే, కమర్షియల్ సినిమాలు ఆర్ట్ సినిమాల్లోంచి వీలైనవి తీసుకోవడం పరువు తక్కువేం కాదు. 1977 లో తన ఐదవ సినిమాగా శ్యాం బెనెగళ్ తీసిన ‘భూమిక’ ఇవాళ్టికీ ఇవాళ్టి సినిమాలాగే వుంటుంది కథతో, పాత్రలతో, మేకింగ్ తో. మరాఠీ ప్రేక్షకుల ‘సావిత్రి’ అనదగ్గ నాటి పాపులర్ హీరోయిన్ హంసా వాడ్కర్ సంక్షుభిత ప్రేమల విషాద కథ ఇది. సంక్లిష్టమైన హంసా పాత్రని స్మితా పాటిల్ నటించింది కేవలం 22 ఏళ్ల వయసులోనే. కథలో సినిమా హీరోగా అనంత్ నాగ్, దర్శకుడుగా నసీరుద్దీన్ షా, ధనికుడుగా అమ్రిష్ పురీ కన్పిస్తారు. ప్రసిద్ధ ఆర్ట్ సినిమాల దర్శకుడు గోవింద్ నిహలానీ ఛాయాగ్రహణం సమాకూర్చాడు. ఇందులో ప్రారంభంలో కుటుంబ దృశ్యం వుంటుంది. ప్రారంభంనుంచీ ఈ దృశ్యం షాట్స్ పరంగా కట్టి పడేస్తూ ముందుకు లాక్కెళ్తుంది. చాలా మతిపోగొట్టే షాట్ కంపోజింగ్, డ్రామా. ఈ దృశ్యం చూడమని ఇద్దరు ముగ్గురు దర్శకులకి క్లిప్పింగ్ పంపిస్తే, చూసి థ్రిల్లయి పోయారు. ఇక దీని గురించి రాయక తప్పని పరిస్థితి... ఈ సీను నేపథ్యమేమిటంటే ... సినిమా హీరోయిన్ స్మితా పాటిల్ కి భర్త అమోల్ పలేకర్, ఓ కూతురూ తల్లీ వుంటారు. పలేకర్ స్మిత మీద ఆధారపడి బతికేస్తూ వుంటాడు. పైగా అనుమానాలు పెట్టుకుని వేధిస్తూ వుంటాడు. ఇతణ్ణి భరించలేక గతంలో ఒకటి రెండు సార్లు వెళ్ళిపోయినా, మళ్ళీ తీసుకొస్తే వచ్చింది. దీంతో మరీ చులకనై పోయింది. అతను తనికిలా బతికే హక్కుందని భావిస్తూంటాడు. ఆమె చిన్నప్పట్నుంచీ ఆర్ధికంగా కుటుంబాన్నితను ఆదుకున్నాడనీ, సినిమాల్లో నటించే అవకాశాలిప్పించి, ఆమె కెరీర్ ని తను మేనేజ్ చేశాడనీ, పైగా దిక్కులేని చిన్న వయసులో ఆమెని పెళ్ళి చేసుకుని, ఇంటిదాని హోదా కల్పించాననీ గుర్తు చేస్తూ వుంటాడు. తన సంపాదన మీద అతను బతకడం ఆమె కభ్యంతరం కాదు. అభ్యంతరమల్లా అనుమానాలు పెట్టుకుని వేధిస్తేనే. ఈ నేపథ్యంలో ఇప్పుడు షూటింగ్ నుంచి ఆమె రాక కోసం ఇంటిదగ్గర అసహనంగా వెయిట్ చేస్తూంటాడు. ఇక్కడ్నించీ ఈ సీను ప్రారంభమవుతుంది...ఐతే ముందుగా ఇక్కడ పైన పోస్టు చేసిన ఈ సీను క్లిప్పింగ్ ఒకటికి రెండు సార్లు చూసి డైజెస్ట్ చేసుకోవాలి. సీను ఎలా వుందో చూద్దాం : 1. బాల్కనీలో స్మిత కోసం అసహనంగా ఎదురుచూస్తూంటాడు పలేకర్. జేబులోంచి అగ్గిపెట్టె తీసి, సిగరెట్ నోట్లో పెట్టుకోబోతూ, కారు శబ్దానికి ఆగి, కిందికి తొంగి చూస్తాడు. కారు ఇంటి ముందాగుతుంది. కార్లోంచి స్మిత, దర్శకుడూ దిగి ఏదో మాట్లాడుకుంటారు. అతను కారెక్కేసి వెళ్ళిపోతాడు. మండిపోతూ పలేకర్ లోపలికొచ్చి, సిగరెట్ పట్టుకుని ఆగిపోతాడు. దీని బుద్ధి మారడం లేదు ఏం చేద్దామా - అన్నట్టు చూసి, ఇటు మెట్ల వైపు తలుపు దగ్గరకొచ్చి నిలబడతాడు. 2. ఆమె మెట్లెక్కి పైకొస్తుంది. సిగరెట్ అలాగే పట్టుకుని కోపంతో చూస్తూంటాడు. అతణ్ణి చూసుకుంటూ లోపలి కెళ్లిపోతుంది. హాల్లో చదువుకుంటున్న కూతురి (కిరణ్ విరాలే) చెంప నిమిరి, ‘సుషూ, నువ్వివ్వాళ్ళ ఇంటిదగ్గరేనా...’ అని పలకరించి, స్వింగ్ డోర్స్ తోసుకుని అటెళ్ళి పోతుంది. 3. ఇంకా మండి పడుతూ గబగబా వచ్చేస్తాడు. కిచెన్లోంచి వస్తున్న స్మిత తల్లి (సులభా దేశ్ పాండే) టీ కప్పుతో ఎదురవుతుంది. ఆగిపోయి చేతిలో సిగరెట్ ని చూసుకుని, మొహం తిప్పుకుని, ఛీ అన్నట్టు చేయి విసిరి వెళ్ళిపోతాడు. టీ కప్పుతో ఆమె అలాగే నిలబడిపోయి, హాల్లో మనవరాలి కేసి చూస్తుంది. మనవరాలు ఆమెని చూసి మొహం తిప్పుకుంటుంది. 4. స్మిత గబగబా బెడ్ రూంలోకి రావడం లిప్తపాటు కాలం కిటికీ వూచల్లోంచి కన్పిస్తుంది. బెడ్రూంలోకొచ్చి, డ్రెస్సింగ్ మిర్రర్ ముందు చెప్పులు విడుస్తూంటే తలుపు దగ్గర నిలబడి, ‘ఎందుకాలస్యమైంది?’ అంటాడు. మాట్లాడదు. ‘నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చిన వాడెవడు?’ రెట్టిస్తాడు. ఇటు తిరక్కుండానే ఆమె, ‘పైన నిలబడి చూశావ్ గా?’ అని చీర విప్పుతూంటుంది. ఆమే, అద్దంలో ఆమె ప్రతిబింబమూ రెండూ చూస్తూంటాడు. ‘చూశా, అందుకే అడుగుతున్నా’ అంటాడు ఆమె ప్రశ్నకి జవాబుగా. ఆమె మాట్లాడదు. ‘ఆ ఫిలిం డైరెక్టర్ తో రిపీట్ చేయాలనుకుంటున్నావా?’ అంటాడు తిరిగి. 5. ఆమె విసురుగా ఇటు తిరిగి, ‘ఎన్నిసార్లు చెప్పాలి- ఆ విషయం -ఎత్తొద్దని - నీకు!!’ అని ఫైర్ అయిపోయి, చీర చుట్టి విసిరి కొడుతుంది. ‘డైలాగులు కొట్టాల్సిన అవసరం లేదు’ అంటాడతను. విసుగెత్తి పోయి, సొరుగు లాగి లోపలున్న చీరెల్ని చూస్తూంటే, మళ్ళీ వెళ్ళిపోయే ప్రోగ్రాం పెట్టుకుంటోందేమోనని, ‘అప్పుడేదో ఇంటికి తీసుకొచ్చా, మళ్ళీమళ్ళీ తీసుకు రాను!’ అంటాడు. 6. అసహ్యంగా చూసి, ‘ఐతే అక్కడే ఎందుకు చావనివ్వలేదు నన్ను? ఎందుకు వాపసు తెచ్చావ్?’ అని కసురుతుంది. ‘తప్పు చేశా’ అంటాడు. ‘నా సంపాదన నీకవసరం, అందుకేగా?’ అని మొహం తిప్పుకుంటుంది. ఆమె వైపు నింపాదిగా చూసి, ఇప్పుడు సిగరెట్ నోట్లో పెట్టుకుని, ముట్టించుకుని పీలుస్తాడు. ఇప్పుడు తలుపు దగ్గర్నుంచి కదిలి బెడ్రూం లోకొస్తాడు. ఆమెని తీక్షణంగా చూస్తూ, ‘నీ పేర సపరేట్ బ్యాంక్ ఎక్కౌంటు తెర్చావట, నిజమేనా?’ అంటాడు. ఆమె పక్క కెళ్ళి పోతుంది. ఆమెవైపు తిరిగి, ‘కొత్త కాంట్రాక్ట్ కూడా సైన్ చేశావట?’ అంటాడు. పనివాడు టీ కప్పుతో లోపలి కొస్తాడు. 7. స్మిత చీర కట్టుకుంటూ అతడి వైపు తిరిగి, ‘డబ్బంతా పేకాటలోతగిలేద్దామనా? సుషూ గురించి ఆలోచించొద్దా? అమ్మ గురించి ఆలోచించొద్దా నేనూ?’ అని కసురుతుంది. అతను పనివాడి వైపు తిరిగి, ‘ఎవరు చెప్పారు నీకు చాయ్ తెమ్మని? వెళ్లిక్కడ్నించీ!’ గట్టిగా తిడతాడు. వాడెళ్ళి పోతాడు. హాల్లో కూతురు లేచి, గ్రాంఫోన్ రికార్డు పెడుతుంది. ఆలాపన వస్తూంటుంది. పలేకర్ హర్ట్ అవుతూ స్మితని సమీపించి, ‘పేద్ద నువ్వేదో సంపాదిస్తున్నట్టు అనుకుంటున్నావ్ కదూ? నువ్వు హీరోయిన్ వి అవడానికి హెల్ప్ చేసింది నేను. నీ కెరీర్ ని మేనేజ్ చేసింది నేను. నీ అయ్య చచ్చాక నిన్నూ నీ అమ్మనీ నీ బామ్మనీ సాకింది నేను. కడుపులు మాడి చావాల్సిన వాళ్ళు మీరు. కూడు నేను పెట్టా, నేను!’ అని రెచ్చిపోతూంటాడు. ‘అట్టాగా, ఐతే ఇప్పుడూ నువ్వే పెడుతున్నావా కూడూ?... హుఁ -’ అని కసిగా అనేసి జరిగిపోతుంది. అతను తలుపు వైపు తిరిగి, ‘సుష్మా! సుష్మా! ఆ రికార్డు బంద్ చెయ్!’ అని కప్పెగిరిపోయేలా అరుస్తాడు. ‘ఎందుకు చెయ్యాలి రికార్డు బంద్! నువ్వెవరు చెప్పడానికి దానికి!’ సరి సమానంగా అరుస్తుంది. 8. కోపాన్ని అణుచుకుంటూ, ‘నువ్వు మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోయే వంకలు వెతుకున్నావా?’ అని సిగరెట్ కింద పడేసి నలిపేసి, ‘వెళ్ళు! ముక్కు నేలకి రాస్తూ వెనక్కొస్తావ్!’ అంటాడు. గబగబా బెడ్ మీద బట్టలు సర్దేస్తూంటుంది. కూతురు గుమ్మం దగ్గరికొచ్చి ఏదో అనబోతే నోర్ముయ్యమంటాడు. ‘ఎప్పుడూ వేసే వేషాలే ఇవి!’ అనేసి వెళ్ళిపోతూ, కూతుర్ని తన గదిలోకి వెళ్లిపొమ్మం టాడు. 9. కూతురు ముందుకొచ్చి సూట్ కేసు సర్దుతున్న తల్లినే చూస్తుంది. సూట్ కేసులో బట్టలన్నీ కుక్కి, మూత పెట్టి, బయల్దేర బోతూంటే, ‘అమ్మా, నిజంగానే వెళ్తున్నావా?’ అంటుంది కూతురు. ఆగిపోయి, ఏమనాలో అర్ధంగాక చూస్తుంది. కదిలి అటు చూస్తే, తల్లి చూస్తూంటుంది కిచెన్ దగ్గర్నుంచి. ఇటు చూస్తే, అతను చూస్తూంటాడు హాల్లోంచి. సూట్ కేసు కింద పెట్టి కూతుర్ని పిలుస్తుంది. వచ్చి తల్లిని పట్టుకుంటుంది కూతురు. ‘దేనికీ?’ అంటాడు అతను. ‘సుషు నాతో వస్తుంది’ అంటుంది. ‘సుష్మా నా కూతురు!’ అంటాడు. ‘నిజంగా?’ అంటుంది వ్యంగ్యంగా. 10. ‘తీసికెళ్ళు మరి! తయారు చెయ్ నీలాగే! చాలా చాలా బాగుంటుంది. జీవితాంతం ఇంకొకళ్ళ ఇళ్ళల్లో పడి బతికేస్తుంది...’ అని సవాలు విసురుతాడు. కూతురికి ఏడ్పొచ్చేస్తుంది. ‘ఇలాగా నా మీద గెలుస్తావ్...’ అంటుంది స్మిత నిస్సహాయంగా. వెనుక తల్లి వచ్చి నించుంటుంది. కళ్ళ నీళ్ళతో కూతుర్ని విడిపించుకుంటుంది స్మిత. కూతురు వెళ్లి అమ్మమ్మని చుట్టుకుంటుంది. స్మిత సూట్ కేసు పట్టుకుని బయటి కెళ్ళి టాక్సీనాపి ఎక్కేస్తుంది... ఇక్కడ భూమిక ఆమె పేరు కాదు డిక్షనరీ అర్ధంలో ‘పాత్ర’ వివిధ క్లిష్ట దశల్లో తన జీవితమనే నాటకంలో తను - ఉష అలియాస్ ఊర్వశి (స్మిత పాత్ర పేరు) - పోషించాల్సి వచ్చిన విభిన్న పాత్రలు. ఈ కథకి స్క్రీన్ ప్లే సత్యదేవ్ దుబే, గిరీష్ కర్నాడ్, శ్యాం బెనెగళ్ రాశారు (శ్యాం బెనెగళ్ తన పేరు వినమ్రంగా చివర వేసుకున్నారు). సంభాషణలు సత్యదేవ్ దుబే రాశారు. పాత్రల అంతరంగ ప్రగాఢ మథనం కథని, దృశ్యాల్ని కట్టిపడేసేట్టు తీర్చిదిద్దింది. ఇప్పుడు పై దృశ్యపు షాట్ డివిజన్ సంగతుల కెళ్ళే ముందు, ఈ దృశ్యంలో ఏది ఎందుకుందో, ఏ చర్య కర్ధమేంటో చూద్దాం. పై దృశ్యాన్ని 10 భాగాలుగా విభజించాం (దృశ్యాలు రాయడం ఈజీ, విశ్లేషించాలంటే చాట భారతం. ఒక దృశ్యాన్ని విశ్లేషించడానికి పట్టే కాలంలో పది దృశ్యాలు రాయొచ్చు. కాబట్టి విశ్లేషకుల్ని చిన్న చూపు చూడరాదు). పై దృశ్య విభాగాల్లో పాత్రల చర్యలు, చర్యల వల్ల పుట్టే మాటలు, ఎక్కడ ఎలా పడాలో అక్కడ అలా పడడాన్ని గమనించ వచ్చు, అంతే కాదు, ఏ స్క్రీన్ టైముతో ఏ సిట్యుయేషన్లో ఎలా కెమెరాలో రివీలవ్వాలో - అక్కడ అప్పుడు అలా పాత్రలు ప్రత్యక్షమవడాన్ని కూడా సూక్ష్మ దర్శిని పెట్టి చూడొచ్చు. కొన్ని వస్తువుల సమయానుకూల ప్రయోగం కూడా చూడొచ్చు. ఇలా మైక్రో లెవెల్లో ఈ సీన్ని చూసినప్పుడే సీను చెరగని ముద్ర వేస్తుంది. ఒకే షాట్ లో, లేదా కొన్ని షాట్స్ లో నటీనటులందర్నీ ఎలాపడితే అలా కూడేసి, నటింపజేయడం దృశ్య కథన మంటారా? పోనీ డ్రామా అంటారా? అనరు. దృశ్యానికీ దృశ్యం లోపల దాని స్ట్రక్చరుంటుంది. మొత్తం స్క్రీన్ ప్లేకి ఏ స్ట్రక్చరుంటుందో అదే దృశ్యంలోపలా వుంటుంది. అవే బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాలుంటాయి. ఆ విభాగాల్లో అవే వాటి బిజినెస్సులుంటాయి. ప్రారంభ ముగింపులుంటాయి. స్క్రీన్ ప్లే ఒక హీరో లేదా హీరోయిన్ తో వున్నట్టే, దృశ్యమూ ఆ దృశ్యాన్ని బట్టి హీరో లేదా హీరోయిన్ తో వుంటుంది. ఆ పాత్రకి దృశ్యంలో ఓ ప్రారంభం, ముగింపూ వుంటాయి. పై దృశ్యం స్మితా పాటిల్ ది, అమోల్ పలేకర్ ది కాదు. అందుకని ఆమె కేంద్రంగానే దృశ్య కథనముంది. ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో బయటి నుంచి ఇంట్లోకి వచ్చింది. పలేకర్ తో సంఘర్షించి కన్నీళ్ళతో ఇంట్లోంచి బయటికెళ్ళి పోయింది. ఇదీ సీనులోకి పాత్ర రాకపోకల - ప్రారంభ ముగింపుల డైనమిక్స్, లేదా ద్వంద్వాలు. ఆరు నిమిషాల్లో జీవితమే మారిపోయింది. వరసగా దృశ్య విభాగాలు పరిశీలిద్దాం 1. బాల్కనీలో స్మిత కోసం అసహనంగా ఎదురుచూస్తూంటాడు పలేకర్. జేబులోంచి అగ్గిపెట్టె తీసి, సిగరెట్ నోట్లో పెట్టుకోబోతూ, కారు శబ్దానికి ఆగి, కిందికి తొంగి చూస్తాడు. కారు ఇంటి ముందాగుతుంది. కార్లోంచి స్మిత, దర్శకుడూ దిగి ఏదో మాట్లాడుకుంటారు. అతను కారెక్కేసి వెళ్ళిపోతాడు. మండిపోతూ పలేకర్ లోపలికొచ్చి, సిగరెట్ పట్టుకుని ఆగిపోతాడు. దీని బుద్ధి మారడం లేదు ఏం చేద్దామా - అన్నట్టు చూసి, ఇటు మెట్ల వైపు తలుపు దగ్గరకొచ్చి నిలబడతాడు. వివరణ : పలేకర్ అలా అసహనంగా ఎదురు చూసే మాటేమోగానీ, చేతిలో ఆ సిగరెట్ పెద్ద సస్పన్స్ అయిపోయింది. అదెప్పుడు ముట్టిస్తాడో తెలీదు. లోపలికొచ్చి కూడా ముట్టించడు. దానికి తగ్గ మానసిక స్థితి రావాలి. అదెప్పుడోస్తుందో వస్తుంది. ముట్టించబోతూంటే ఆమె కార్లో డైరెక్టర్ తో రావడం కళ్ళబడ్డాక అదే పెద్ద డిస్టర్బెన్స్ అయిపోయింది. ముందామె సంగతి చూసిగానీ... ఇటు మెట్ల వైపు తలుపు దగ్గరకొచ్చి నిలబడ్డప్పుడు - గడప లోపలే నిలబడ్డాడు. ఆ గడప అతడి ఇన్ఫీరియారిటీకి గుర్తు. అది దాటి ఆమె మానసిక ప్రాంగణంలోకొచ్చి మాట్లాడే ధైర్యంలేదు. పైకి ఎంత ధూంధాం చేసినా, లోలోపల ఆమె సొమ్ము తింటున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వుంది. 2. ఆమె మెట్లెక్కి పైకొస్తుంది. సిగరెట్ అలాగే పట్టుకుని కోపంతో చూస్తూంటాడు. అతణ్ణి చూసుకుంటూ లోపలి కెళ్లిపోతుంది. హాల్లో చదువుకుంటున్న కూతురి చెంప నిమిరి, ‘సుషూ, నువ్వివ్వాళ్ళ ఇంటిదగ్గరేనా...’ అని పలకరించి, స్వింగ్ డోర్స్ తోసుకుని అటెళ్ళి పోతుంది. వివరణ : ఇక్కడ కూడా సిగరెట్ ముట్టించలేదు. స్మిత అతడికేసి చూస్తూ లోపలి కెళ్ళిపోయింది. ఇంతవరకూ ఇంట్లో పలేకర్ ని తప్ప ఇంకెవర్నీ చూపించలేదు. అతడికి కూతురున్న సంగతి మనకింకా తెలీదు. స్మిత వచ్చాకే ఆమెతో ఎటాచ్ చేసి కెమెరాలోకి తెచ్చారు. ఇప్పుడు హాల్లో చదువుకుంటున్న కూతురు రివీలయ్యింది. ప్రధాన పాత్ర ననుసరించి ఒకటొకటే రివీల్ చేస్తూ సీనుని వెల్లడించే విధానం. స్మిత కూతురి చెంప ప్రేమగా నిమిరి- నువ్వివాళ్ళ ఇంటిదగ్గరేనా -అనడం, స్మిత తెల్లారే ఎప్పుడో షూటింగు కెళ్ళిపోయిందన్న సమాచారం మనకిస్తూ కథని వెల్లడిస్తోంది. ఇక స్వింగ్ డోర్స్. స్వింగ్ డోర్స్ తోసుకుని వెళ్తుంది స్మిత. ఈ స్వింగ్ డోర్స్ ఏమిటి? ఆయారాం గయారాం. ఆమె జీవితం నిలకడగా లేదని అర్ధం. ఎప్పుడు ఈ ఇంట్లో కాపురముంటుందో, ఎప్పుడు ఎటెళ్ళిపోతుందో తెలీదనే పరిస్థితికి - లోపలికీ, బయటికీ తెర్చుకునే ఆ స్వింగ్ డోర్స్ సింబాలిజం. 3. ఇంకా మండి పడుతూ గబగబా వచ్చేస్తాడు. కిచెన్లోంచి వస్తున్న స్మిత తల్లి టీ కప్పుతో ఎదురవుతుంది. ఆగిపోయి చేతిలో సిగరెట్ ని చూసుకుని, మొహం తిప్పుకుని, ఛీ అన్నట్టు చేయి విసిరి వెళ్ళిపోతాడు. టీ కప్పుతో ఆమె అలాగే నిలబడిపోయి, హాల్లో మనవరాలి కేసి చూస్తుంది. మనవరాలు ఆమెని చూసి మొహం తిప్పుకుంటుంది. వివరణ : మొదట మనకి కూతురి పాత్ర తెలిసింతర్వాత, స్మిత అలా స్వింగ్ డోర్స్ లోంచి వెళ్ళగానే, రెండో పాత్రగా ఆమె తల్లి పాత్ర మనకి పరిచయమవుతూ కెమెరా లోకొచ్చింది. అంటే ఆమెకి తల్లి కూడా వున్నట్టు ఇప్పుడు మనకి తెలిసింది. స్మిత తన ఆలస్యానికి సంజాయిషీ ఇచ్చుకోకుండా, తనతో మాట్లాడకుండా వెళ్ళిపోయే సరికి, అతను ఇంకింత మండిపోయి వచ్చేస్తూంటే - అత్తగారు టీ కప్పుతో ఎదురయ్యింది. ఆగిపోయి, సిగరెట్ ని చూసుకున్నాడు. ఇప్పుడు కూడా ముట్టించుకోలేదు. టీ అందుకునే మూడ్ లేక, ఛీ అనుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరి ఈ ముఖాముఖీ వాళ్ళిద్దరి మధ్య కూడా సత్సంబంధాలు లేవని కథని తెలియజేస్తోంది. ఆమె మనవరాలి కేసి చూసే విధం, మనవరాలు మొహం తిప్పుకుని ఎటో చూసే విధం, వాళ్ళిద్దరూ ఇంట్లో జరిగే తతంగాలకి మౌన ప్రేక్షకులని కథని తెలియ జేస్తుంది. ఇలా రివీలవుతున్న పాత్రలకి పరస్పరం ఎటాచ్ మెంట్ ఇప్పిస్తూ, పూర్తి కుటుంబ వాతావరణాన్ని మన ముందుంచారు. 4. స్మిత గబగబా బెడ్ రూంలోకి రావడం లిప్తపాటు కాలం కిటికీ వూచల్లోంచి కన్పిస్తుంది. బెడ్రూంలోకొచ్చి, డ్రెస్సింగ్ మిర్రర్ ముందు చెప్పులు విడుస్తూంటే తలుపు దగ్గర నిలబడి, ‘ఎందుకాలస్యమైంది?’ అంటాడు. మాట్లాడదు. ‘నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చిన వాడెవడు?’ రెట్టిస్తాడు. ఇటు తిరక్కుండానే ఆమె, ‘పైన నిలబడి చూశావ్ గా?’ అని చీర విప్పుతూంటుంది. ఆమే, అద్దంలో ఆమె ప్రతిబింబమూ రెండూ చూస్తూంటాడు. ‘చూశా, అందుకే అడుగుతున్నా’ అంటాడు ఆమె ప్రశ్నకి జవాబుగా. ఆమె మాట్లాడదు. ‘ఆ ఫిలిం డైరెక్టర్ తో రిపీట్ చేయాలనుకుంటున్నావా?’ అంటాడు తిరిగి. వివరణ : ఇక స్వింగ్ డోర్స్ లోంచి వెళ్ళిపోయిన స్మిత ఇప్పుడు అటు గదిలోంచి వేగంగా వెళ్లి పోవడాన్ని వూచల కిటికీ లోంచి చూస్తాం. ఎందుకిలా? నేరుగా ఆమెని బెడ్రూంలో చూపించ వచ్చు కదా? అలా చూపిస్తే రసోత్పత్తి జరగదు, కథోత్పత్తి కూడా జరగదు. గానుగాడించిన పిప్పి మిగుల్తుంది. ఈ కిటికీ వూచల్లోంచి ఆమెని చూపించడం పంజరంలో వున్నట్టు చూపించడం. ఇప్పుడుంటున్న ఇల్లొక పంజరం, ఇక్కడే కాదు, ఈ సీను తర్వాత కథలో ఇంకా మున్ముందు ఇంకో ముగ్గురితో సంబంధాలు కూడా పంజరాలేనని మనకి తెలుస్తాయి. అయితే ఇక్కడ అలా క్షణకాలంలో వేగంగా వెళ్ళిపోతున్నట్టు చూపించడంలో అర్ధం? ఏ పంజరాన్నీ ఆమె సహించదు. పంజరమని తెలీక సంబంధంలోకి వెళ్తుంది, తెలిసిన వెంటనే తెంచుకుని అవతల పడుతుంది. ఇప్పుడున్న పంజరంలో వుండలేక పోతోంది కాబట్టే మెరుపు వేగంతో ఆ నడక. ఆయారాం గయారాం స్వింగ్ డోర్స్ తర్వాత, దాని కొనసాగింపుగా ఈ పంజరం సింబాలిజం. స్వింగ్ డోర్స్ లోంచి వెళ్ళిపోతే ఆమెకి పంజరాలే. ఇక డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నిలబడి ఆమె చెప్పులు విడవడం. అదామె దినచర్యలో భాగమే. రోజూలాగే ఇప్పుడూ ఇంటికొచ్చాక ఇంట్లోనే కదా వుంటుంది. అందుకని చెప్పులు విడుస్తోంది. ఇంకొన్ని క్షణాల్లో ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి ఎదురవుతుందని ఎలా వూహించగలదు. చెప్పులు విడవడమే కాదు, చీర కూడా మార్చుకుంటోంది. అతను డిటోగా మళ్ళీ గడప అవతలే నిలబడ్డాడు. ఇప్పటికీ ఆమె మనో ప్రాంగణంలో కెళ్ళే దమ్ముల్లేవు. ఇక అద్దం ముందు స్మిత, అద్దంలో ఆమె ప్రతిబింబం- అతడి అనుమానపు బుర్రకొద్దీ ఆమెలో అతను చూస్తున్న రెండు రూపాలు. అతడి మానసిక స్థితికి కనెక్ట్ చేసే సింబాలిజం. 5. ఆమె విసురుగా ఇటు తిరిగి, ‘ఎన్నిసార్లు చెప్పాలి- ఆ విషయం -ఎత్తొద్దని - నీకు!!’ అని ఫైర్ అయిపోయి, చీర చుట్టి విసిరి కొడుతుంది. ‘డైలాగులు కొట్టాల్సిన అవసరం లేదు’ అంటాడతను. విసుగెత్తి పోయి, సొరుగు లాగి లోపలున్న చీరెల్ని చూస్తూంటే, మళ్ళీ వెళ్ళిపోయే ప్రోగ్రాం పెట్టుకుంటోందేమోనని, ‘అప్పుడేదో ఇంటికి తీసుకొచ్చా, మళ్ళీమళ్ళీ తీసుకు రాను!’ అంటాడు. వివరణ : అతనేం ఆరోపిస్తున్నాడో, దానికామె రియాక్షన్ ఎలా వుందో చూస్తున్నాం. కానీ అంత రియాక్షన్లో కూడా ఆమె వెళ్లి పోవాలన్న ఆవేశంతో సొరుగు లాగలేదు. వొంటిమీద చీర లేదు, చీర కట్టుకుందామనే సొరుగు లాగి చూస్తోంది. అతనే ఫూలిష్ గా రెచ్చగొట్టాడు. మళ్ళీ వెళ్ళిపోయే ప్రోగ్రాం పెట్టుకుంటోందేమోనని, ‘అప్పుడేదో ఇంటికి తీసుకొచ్చా, మళ్ళీమళ్ళీ తీసుకు రాను!’ అంటూ. ఈ డైలాగుతో కథ కూడా మనకి తెలియజేయడం. అంటే ఆమె ఇదివరకే వెళ్లి పోయిందనీ, వెళ్తే తీసుకొచ్చాడనీ. అదే సమయంలో, ఎందుకు తీసుకొస్తున్నాడనే ప్రశ్నకూడా తలెత్తి, ఇది కూడా తెలుసుకోవాలన్న ఉత్కంఠ మనకి కలిగిస్తోంది ఈ డైలాగు. ఆమె సొరుగు లాగడమనే చర్యని ఇన్ని విషయాలు తెలియ జేయడం కోసం వాడారు రచయితలు. 6. అసహ్యంగా చూసి, ‘ఐతే అక్కడే ఎందుకు చావనివ్వలేదు నన్ను? ఎందుకు వాపసు తెచ్చావ్?’ అని కసురుతుంది. ‘తప్పు చేశా’ అంటాడు. ‘నా సంపాదన నీకవసరం, అందుకేగా?’ అని మొహం తిప్పుకుంటుంది. ఆమె వైపు నింపాదిగా చూసి, ఇప్పుడు సిగరెట్ నోట్లో పెట్టుకుని, ముట్టించుకుని పీలుస్తాడు. ఇప్పుడు తలుపు దగ్గర్నుంచి కదిలి బెడ్రూం లోకొస్తాడు. ఆమెని తీక్షణంగా చూస్తూ, ‘నీ పేర సపరేట్ బ్యాంక్ ఎక్కౌంటు తెర్చావట, నిజమేనా?’ అంటాడు. ఆమె పక్క కెళ్ళి పోతుంది. ఆమెవైపు తిరిగి, ‘కొత్త కాంట్రాక్ట్ కూడా సైన్ చేశావట?’ అంటాడు. పనివాడు టీ కప్పుతో లోపలి కొస్తాడు. వివరణ : ఇక్కడ వెంటనే సమాధానం దొరికింది. అదీ సంగతి. ఆమె సంపాదన మీద ఆధారపడ్డాడు కాబట్టే ఒకసారి వెళ్ళిపోతే తీసుకొచ్చుకున్నాడు. అయితే ఆమె వున్నదున్నట్టు విషయం మొహం మీద చెప్పేసే సరికి, ఇక లాభంలేదని గట్టి దెబ్బ కొట్టేసేందుకు సిద్ధమైపోయాడు. ఇలా పై చేయి ఆమెది కాకూడదు. తన దగ్గర ఆమె దొంగలా దొరికిపోయే పక్కా ఎవిడెన్స్ వుంది. అందుకని ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగి సిగరెట్ వెల్గించాడు! దమ్ము లాగాడు. ఈ పూట ఇంత సేపూ ఈ ఇంట్లో తనేమిటీ అన్న కన్ఫ్యూజన్ ఇప్పుడు తీరిపోయింది. క్లియరై పోయింది. ఈ సీనుకి సీనంతా తనొకే ఎక్స్ ప్రెషన్ తో వున్నాడు. ఎక్కడా ఇంకో ఎక్స్ ప్రెషనివ్వలేదు. ఇప్పుడు తను చేతికి చిక్కందని కూడా విషపు నవ్వు నవ్వలేదు. ఇక ధైర్యంగా ఇప్పుడు గడపదాటి బెడ్ రూమ్ లోకొచ్చేశాడు... డామ్ ష్యూర్ గా ఆమె మైండ్ స్పేస్ లోకి ఎంటరై పోయాడు! ఆమె సపరేట్ బ్యాక్ ఎక్కౌంటు, కొత్త సినిమా సైనింగు క్వశ్చన్ చేసేశాడు! గూడుపుఠాణీకి పక్కా ఎవిడెన్స్. మధ్యలో పనివాడు టీ కప్పుతో వచ్చేశాడు. ఇంతసేపూ వీడెక్కడున్నాడు. కిచెన్లో వున్నాడేమో. బాత్రూంలో బట్టలుతుకుతున్నాడేమో లాజిక్కి ఇబ్బందిలేదు. అవతల స్మిత తల్లి టీ కప్పుతో అలాగే వున్నట్టుంది. పనివాడి కిచ్చి పంపింది. ఈ టీ ద్వారా పలేకర్ బలహీనతని బయట పెట్టడం దర్శకుడి ఉద్దేశం. ఇదెలాగో చూద్దాం.... 7. స్మిత చీర కట్టుకుంటూ అతడి వైపు తిరిగి, ‘డబ్బంతా పేకాటలో తగిలేద్దామనా? సుషూ గురించి ఆలోచించొద్దా? అమ్మ గురించి ఆలోచించొద్దా నేనూ?’ అని కసురుతుంది. అతను పనివాడి వైపు తిరిగి, ‘ఎవరు చెప్పారు నీకు చాయ్ తెమ్మని? వెళ్లిక్కడ్నించీ!’ గట్టిగా తిడతాడు. వాడెళ్ళి పోతాడు. హాల్లో కూతురు లేచి, గ్రాంఫోన్ రికార్డు పెడుతుంది. ఆలాపన వస్తూంటుంది. పలేకర్ హర్ట్ అవుతూ స్మితని సమీపించి, ‘పేద్ద నువ్వేదో సంపాదిస్తున్నట్టు అనుకుంటున్నావ్ కదూ? నువ్వు హీరోయిన్ వి అవడానికి హెల్ప్ చేసింది నేను. నీ కెరీర్ ని మేనేజ్ చేసింది నేను. నీ అయ్య చచ్చాక నిన్నూ నీ అమ్మనీ నీ బామ్మనీ సాకింది నేను. కడుపులు మాడి చావాల్సిన వాళ్ళు మీరు. కూడు నేను పెట్టా, నేను!’ అని రెచ్చిపోతూంటాడు. ‘అట్టాగా, ఐతే ఇప్పుడూ నువ్వే పెడుతున్నావా కూడూ?... హుఁ -’ అని కసిగా అనేసి జరిగిపోతుంది. అతను తలుపు వైపు తిరిగి, ‘సుష్మా! సుష్మా! ఆ రికార్డు బంద్ చెయ్!’ అని కప్పెగిరిపోయేలా అరుస్తాడు. ‘ఎందుకు చెయ్యాలి రికార్డు బంద్! నువ్వెవరు చెప్పడానికి దానికి!’ సరి సమానంగా అరుస్తుంది. వివరణ : అతనలా క్వశ్చన్ చేసేసరికి ఒక్క మాటతో తను తిప్పి కొట్టేసింది. పేకాటకి డబ్బంతా తగలేస్తూంటే గూడుపుఠాణీ చెయ్యకేం చేస్తుంది? అతడి ఎత్తుగడ చిత్తయి పోయింది. దీంతో బుర్ర తిరిగి, పనివాణ్ణి టార్గెట్ చేసి, టీ ఎవరు తెమ్మన్నారని తిట్టి వెళ్ళ గొట్టేశాడు. ఇది అసలుకి స్మితని తానేమీ చేయలేని బలహీనతని బయటపడేసుకోవడమే. వాతావరణం బాగా వేడెక్కింది. అవతల కూతురు లేచి గ్రాంఫోన్లో ఆలాపన పెట్టింది. వాళ్ళు ఇలా అరుచుకుంటున్నప్పుడు, తను ఇలా నిరసన తెలపడం ఆమె కలవాటయి పోయిందేమో. కూతురి నిరసన కూడా వాళ్లనాపడం లేదు. ఇప్పుడు ఇద్దర్లో ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అనేది కాకుండా, కూతురి ముందు ఇద్దరూ దోషులుగా నిలబడ్డారు. పిల్లల్ని కన్నాక తమ హక్కులు రద్దయి, పోరాటాలు బంద్ అయి, పిల్లల హక్కులూ ఆరాటాలూ తమ ముందుంటాయని తెలుసుకో లేని దివాలాకోరు సంసారం వెలగబెడుతున్నారు. ఇక అతను దండకం ఎత్తుకున్నాడు ఫాల్స్ ఇగో బాగా ప్లాట్ అయిపోయి - పూర్వం ఆమె కుటుంబాన్ని తను ఆదుకోవడం గురించి ఎంత హీనంగా మాట్లాడాలో అంత హీనంగా మాట్లాడాడు. దానికీ ఆమె కొట్టినట్టు జవాబియ్యడంతో మళ్ళీ బుర్ర తిరిగి, ఆమెనేమీ చెయ్యలేక ఈసారి కూతుర్ని టార్గెట్ చేస్తూ బలహీనత బయటపెట్టుకున్నాడు - రికార్డు ఆపమని అరుస్తూ. ఇంతకంటే అతనేం పీకలేడని టీ ద్వారా, గ్రాంఫోన్ రికార్డు ద్వారా చెప్పడం. అదే సమయంలో, స్మిత పూర్వ జీవితం మీద ఆసక్తి కల్గించడం. నిజంగా అతడన్నంత దారుణంగా వుందా పూర్వం ఆమె కుటుంబ పరిస్థితి? రెండోది, గతంలో ఆమె ఎవరితో వెళ్ళిపోయి వుంటుంది? ఈ రెండిటి గురించీ ఫ్లాష్ బ్యాక్ లో చూస్తామేమోనని మనం ఎదురు చూసేలా చెయ్యడానికి ఈ డైలాగుల ప్లాంటింగ్. ఇక అతను కూతురి మీద అరిచేసరికి, ఆమె అతడి మీద అరిచింది. ఇక టాపిక్ కూతురి మీదికి మళ్ళిపోయింది. కూతురి మీద ఫోకస్ అవుతూ సీను మలుపు తిరిగింది... 8. కోపాన్ని అణుచుకుంటూ, ‘మళ్ళీ నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయే వంకలు వెతుకున్నావా?’ అని సిగరెట్ కింద పడేసి నలిపేసి, ‘వెళ్ళు! ముక్కు నేలకి రాస్తూ వెనక్కొస్తావ్!’ అంటాడు. గబగబా బెడ్ మీద బట్టలు సర్దేస్తూంటుంది. కూతురు గుమ్మం దగ్గరికొచ్చి ఏదో అనబోతే నోర్ముయ్యమంటాడు. ‘ఎప్పుడూ వేసే వేషాలే ఇవి!’ అనేసి వెళ్ళిపోతూ, కూతుర్ని తన గదిలోకి వెళ్లిపొమ్మంటాడు. వివరణ : ఆ సిగరెట్ నలిపెయ్యడం ఆమెని నలిపేస్తున్నట్టు ఫీలై పోవడమే. సిగరెట్ తో ఇదింకో బలహీన వ్యక్తిత్వ ప్రదర్శన. చివరికి సిగరెట్ కథ ఇలా ముగిసింది. సిగరెట్ ఈ సీనులో సందర్భానుసార డైనమిక్స్ లో మన దృష్టి నాకర్షిస్తూ లైవ్ గా పాలుపంచుకుంది. ఈ సీనులో టీ, గ్రాంఫోన్, సిగరెట్, ఏ వస్తువు వాడినా, అది కథనో, పాత్రల్నోబయట పెట్టడానికే వ్యూహాత్మకంగా ప్లే చేశారు తప్ప- కథనీ, పాత్రల్నీవదిలేసి అలంకార ప్రాయంగా ప్రయోగించలేదు. 9. కూతురు ముందుకొచ్చి సూట్ కేసు సర్దుతున్న తల్లినే చూస్తుంది. సూట్ కేసులో బట్టలన్నీ కుక్కి, మూత పెట్టి, బయల్దేర బోతూంటే, ‘అమ్మా, నిజంగానే వెళ్తున్నావా?’ అంటుంది కూతురు. ఆగిపోయి, ఏమనాలో అర్ధంగాక చూస్తుంది. కదిలి అటు చూస్తే, తల్లి చూస్తూంటుంది కిచెన్ దగ్గర్నుంచి. ఇటు చూస్తే, అతను చూస్తూంటాడు హాల్లోంచి. సూట్ కేసు కింద పెట్టి, కూతుర్ని పిలుస్తుంది. వచ్చి తల్లిని పట్టుకుంటుంది కూతురు. ‘దేనికీ?’ అంటాడు అతను. ‘సుషు నాతో వస్తుంది’ అంటుంది. ‘సుష్మా నా కూతురు!’ అంటాడు. ‘నిజంగా?’ అంటుంది వ్యంగ్యంగా. వివరణ : అతడంత మాటన్నాక ఆమె ఎందుకాగుతుంది. సాధారణంగా చిత్రణ లెలా వుంటాయంటే, ఆమె సూట్ కేసు సర్దుకుని కూతుర్ని బరబరా లాక్కుని వెళ్ళిపోతూ వుంటుంది ... ఇది బయటి నుంచి రచయిత తన డామినేషన్ తో పాత్ర మీద రుద్దే దుశ్చర్య. ఇందులో పాత్ర ఎమోషనల్ గ్రాఫ్ /ఆర్క్ ఎక్కడుంది. మానవ సహజ డ్రామా ఎక్కడుంది? ఇంత సేపూ స్మిత తన గురించి, తన జీవితం గురించీ దూకుడుగా ఆలోచిస్తోందని మనకి తెలుస్తూనే వుంది. ఆమెకి కూతురి ధ్యాసే లేదు. కూతురు, ‘అమ్మా, నిజంగా వెళ్తున్నావా?’ అనేసరికి ఈ లోకంలో కొచ్చింది. ఉక్రోషమంతా దిగిపోయి కూతుర్ని గుర్తించింది. ఇప్పుడు తనే కాదు, తనతో కూతురూ అని తెలుసుకుంది. ఆగిపోయి ఆమెని రమ్మంది. ఇప్పుడామె ఎమోషనల్ గ్రాఫ్ /ఆర్క్ కరక్టుగా వచ్చాయి. అతనామె నాపుతూ, సుష్మ తన కూతురన్నాడు. దీనికామె, ‘నిజంగా?’ అంది వ్యంగ్యంగా. ఈ డైలాగు అన్పించడంలో ఉద్దేశం, అతడి పాత్ర చిత్రణలో మిగిలున్న అంశం కూడా పూర్తి చెయ్యడం. అతను భార్యనీ, అత్తనీ మాత్రమే కాదు, కూతుర్ని కూడా కూతుర్లా చూడలేదని. భార్య డబ్బూ, తన సుఖం - ఇంతే అతడి జీవితమని. ఈ డైలాగు పాత్రలోంచి సహజంగా వచ్చింది కాబట్టి రచయిత రాశాడు. కూతురా మాట అనగానే నిలబడి పోయిన స్మిత కి -ఇటు చూస్తే కిచెన్ దగ్గర్నుంచి తననే చూస్తున్న తల్లి కన్పిస్తుంది, అటు చూస్తే తననే చూస్తున్న పలేకర్ కన్పిస్తాడు హాల్లోంచి. వాళ్ళు కూడా ఆమె సమాధానం కోసం చూస్తున్న అర్ధంలో ఫ్రేములోకి రావడం. ఎప్పుడెలా ఎవరు మాత్రమే ఫ్రేములోకి రావాలో, లయ బద్దంగా ఆ ప్రక్రియే కొనసాగుతోంది మొదట్నించీ సీనంతా. 10. ‘తీసికెళ్ళు మరి! తయారు చెయ్ నీలాగే! చాలా బాగుంటుంది. జీవితాంతం ఇంకొకళ్ళ ఇళ్ళల్లో పడి బతికేస్తుంది...’ అని సవాలు విసురుతాడు. కూతురికి ఏడ్పొచ్చేస్తుంది. ‘ఇలాగా నా మీద గెలుస్తావ్...’ అంటుంది స్మిత నిస్సహాయంగా. వెనుక తల్లి వచ్చి నించుంటుంది. కళ్ళ నీళ్ళతో కూతుర్ని విడిపించుకుంటుంది స్మిత. కూతురు వెళ్లి అమ్మమ్మని చుట్టుకుంటుంది. స్మిత సూట్ కేసు పట్టుకుని బయటి కెళ్ళిపోయి టాక్సీనాపి ఎక్కేస్తుంది... వివరణ : అతడలా సవాలు విసిరేసరికి సమాధానం లేదు ఓటమి తప్ప. ఈ సీనులో ఎక్కడా ఆమె కన్నీళ్లు పెట్టుకోలేదు, ఇక్కడ సీను కూతురి మీద ఫోకస్ అయినప్పుడు తప్ప. అప్పుడంతా రౌద్ర రసంతో వుంది, ఇప్పుడు కరుణ రసానికొచ్చింది. ఆమెకి కన్నీళ్లు రావడం రావడం ముందు ఇంకెప్పుడో గాకుండా, ఇప్పుడు కూతురితో కనెక్ట్ అయి వస్తేనే, హ్యూమన్ ఎలిమెంట్ జతపడి సీను క్లయిమాక్స్ సమగ్రమవుతుంది. సత్యదేవ్ దుబే, గిరీష్ కర్నాడ్ లిద్దరూ ప్రసిద్ధ నాటక రచయితలూ కూడా. నాటక రచన ఆర్గానిక్ గా వుంటుంది. పైగా సినిమాల్లో పది సీన్లు వేసి చెప్పే విషయాన్నీ ఒక్క సీన్లో స్థలకాలాల ఐక్యతతో చెప్పేస్తారు. ఇందుకే ఈ సీను ఇలా వచ్చింది - బోలెడు - బోలెడు సమాచారమందిస్తూ, గత వర్తమాన భవిష్యత్ కాలాలకి సంబంధించి. ఆరు నిమిషాలు - 41 షాట్లు ఇప్పుడు ఈ సీనుకి షాట్లు తీసిన విధానం చూద్దాం. షాట్స్ పొందిక వాక్యంలో పదాల పొందికంత అందంగా వుంటేనే అదొక వెండితెర పాఠ్యమవుతుంది. స్మూత్ గా సాగిపోయే విజువల్ లాంగ్వేజి అవుతుంది. ఒక సీనుకి ఆ సీన్లో పాత్ర వున్నపరిస్థితీ, ఆ పరిస్థితికి పాత్ర ఎలా ఫీలవుతోందో ఆ ఫీల్ - ఇవి మాత్రమే షాట్స్ ని నిర్ణయిస్తాయని ఈ వ్యాసం ప్రారంభం లో ఇన్నర్ ఇంజనీరింగ్ చెప్పుకున్నాం. ఈ ప్రకారం కొన్ని కీలక షాట్స్ కి అర్ధాలు చూద్దాం. 1. మిడ్ షాట్ లో బాల్కనీలో స్మిత కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పలేకర్, సిగరెట్ ముట్టుంచుకోవడానికి అగ్గిపెట్టె తీసి ఆగిపోతూ కిందికి చూశాడు. లో- యాంగిల్లో కారు దిగుతున్న స్మిత కన్పించింది. తనని తాను ఆమెకంటే ఉన్నతంగా భావించుకునే రకం కాబట్టి, పైనుంచి కిందికి ఆమెని చూస్తున్నట్టు ఒకే లో - యాంగిల్ షాట్. కింద సపరేట్ గా వాళ్ళిద్దరి షాట్స్ వేయలేదు. వేస్తే రసభంగం. 2. ఆమె మెట్లెక్కి ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా అదే లో- యాంగిల్ షాటే అతను తలుపు దగ్గర్నుంచి చూస్తూంటే. ఆమె సజెషన్ లో అతణ్ణి చూస్తున్నట్టు కింది నుంచి హై యాంగిల్ షాట్ వేయలేదు. తన కంటే ఉన్నతంగా ఆమె అతణ్ణి చూసే ప్రశ్నేలేదు కాబట్టి. 3. ఆమె తలుపు దగ్గర అతణ్ణి చూసుకుంటూ లోపలికి వెళ్తున్నప్పుడు, అతడితో సమంగా మీడియం క్లోజప్ లోకి వచ్చింది. ఇప్పుడింకా ఘర్షణ మొదలవని మామూలు స్థితి కాబట్టి, సమంగా మీడియం క్లోజప్ లోకొచ్చింది. తర్వాత ఘర్షణ మొదలయ్యాక ఆమె మామూలు మీడియం క్లోజప్ లో వుండదు. ఫైర్ బ్రాండ్ గా బిగ్ క్లోజప్స్ లో వుంటుంది. 4. ఆమె బెడ్ రూమ్ లోకి వస్తున్నప్పుడు పక్క గది కిటికీ వూచల్లోంచి ఆమెని చూపిస్తూ పానింగ్ షాట్. ఈ సినిమాలో ఆమె ప్రతీ రిలేషన్ షిప్ లోనూ పురుషుడితో పంజరంలో వున్నట్టే ఫీలవుతుంది. అందుకని కిటికీ వూచల్లోంచి ఈ షాట్. 5. అతను బెడ్ రూమ్ తలుపు దగ్గరికొచ్చి ఆగినప్పుడు, డ్రెస్సింగ్ మిర్రర్ ముందు వున్న ఆమెకి, అతడికీ మీడియం క్లోజప్సే ఇచ్చారు. వాగ్యుద్ధం ఇప్పుడిప్పుడే తారా స్థాయికి వెళ్ళలేదు కాబట్టి. 6. అతను దర్శకుడితో సంబంధాన్ని అంటగట్టి మాటాడినప్పుడు తారా స్థాయికి వెళ్ళింది. ఆమె కోపం పెట్రేగిన ఈ ఉద్రిక్త క్షణాల్లో మామూలు క్లోజప్ కాదు, బిగ్ క్లోజప్ లో కొచ్చేసింది. అతను అదే మీడియం క్లోజప్ లో వుండి పోయాడు. ఇప్పుడిక ఆమె రివోల్ట్ అవుతున్న పతాక దశ ఇదన్నమాట. ఇంతవరకూ ఎక్కడా బిగ్ క్లోజప్ ఆమె మీద వేయకుండా జాగ్రత్త పడ్డారు. 7. ఇప్పుడతను కదిలి ఆమెతో బిగ్ క్లోజప్ లోకి వచ్చేశాడు. ఇలా రావడానికి కారణం ఆమెతో సమంగా ఫైర్ అవుతూ, కొత్తగా తీవ్రారోపణ చేస్తున్నాడు. తనకి చెప్పకుండా ఆమె కొత్త బ్యాంక్ ఎక్కౌంట్ తెరిచినట్టూ, ఇంకో కొత్త సినిమా కాంట్రాక్ట్ సైన్ చేసినట్టూ. ఈ నిజంతో ఆమె ఆలోచించుకోవాలన్నట్టు బిగ్ క్లోజప్ లోంచి తప్పుకుంది. 8. దానికామె సమాధానం చెప్తున్నప్పుడు తిరిగి ఇద్దరూ మీడియం క్లోజప్ లో. అప్ అండ్ డౌన్స్ ని షాట్స్ ఫాలో అవుతున్నాయి. 9. ఇప్పుడామె గతంతో ఆమె మీద ప్రతాపం చూపిస్తూ అతను బిగ్ క్లోజప్ లోకొస్తే, కెమెరా అతణ్ణి ఫాలో అయి పక్కనున్న ఆమెనీ ఫ్రేములోకి తీసుకుంది. అతడి ప్రతాపం పూర్తయ్యాక, ఆమె ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చి తప్పుకోవడంతో, షాట్ కట్ అయింది. 10. దీంతో అతను సపరేట్ గా బిగ్ క్లోజప్ వేసుకుని, రికార్డు పెట్టిన కూతురి మీద అరుపులు అరవడం. 11. వెంటనే ఆమె కూడా బిగ్ క్లోజప్ లోకొచ్చేసి, రికార్డు ఎందుకాపాలని అంతకంటే అరుపులు అరవడం. 12. దీంతో తలుపు దగ్గరున్న అతను ఠక్కున మీడియం క్లోజప్ లోకొచ్చేశాడు. నువ్వు మళ్ళీ వెళ్ళిపోయే బహానాలు వెతుకుతున్నావా - అంటూ. 13. పుల్ బ్యాక్ చేస్తే ఆమే అదే ఫ్రేములో అతడి సమీపంలో వుంది. ఆమె ఇలా ముందు కొస్తున్నట్టు చూపించలేదు. ఆమెని తలుపు దగ్గరే అతడి ముందుంచి, పుల్ బ్యాక్ చేస్తే, ఆమె ముందుకు కదిలిన అర్ధమే వచ్చింది. అంటే వెళ్ళిపోవడానికి ఇక సిద్ధమని. 14. స్మిత సూట్ కేసు పట్టుకుని వెళ్లి పోతున్నప్పుడు, కూతురు అన్న మాటకి ఆగిపోయి, అటు చూసినప్పుడు, కన్పించిన తల్లి బ్లర్ అవుతుంది. ఆమెకి సమాధానం చెప్పాల్సిన అవసరాన్ని స్మిత ఫీలవక పోవడం వల్ల. 15. స్మిత ఇటు తిరిగి చూసినప్పుడు, పలేకర్ ని కూడా బ్లర్ గానే చూసింది. కేర్ చేయనట్టు. అతను ముందుకొచ్చి కూతురి గురించి సవాలు విసిరినప్పుడు. మీడియం క్లోజప్ లోనే వుంది...ఇక ఆమెకి బిగ్ క్లోజప్స్ లేవు. పరాజితురాలు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావించిన తల్లికే కూతుర్ని అప్పగించింది. ఈ విధమైన షాట్స్ కలబోతతో సీను తెరకెక్కింది. దర్శకుడు శ్యాం బెనెగళ్ విజన్తో సీను క్లాసిక్ హోదాకి చేరింది. ఈ సీను స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ వన్ సీనే. స్మిత షూటింగ్ ముగించుకుని డైరెక్టర్ తో ఇంటికొచ్చే రెండు సీన్ల తర్వాత, మూడే సీనే ఈ ప్లాట్ పాయింట్ వన్ సీను. ఈ ఒక్క సీనులోనే సాధారణంగా ప్లాట్ పాయింట్ వన్ వరకూ వుండే ఓ ఇరవై సీన్ల విషయమంతా వుంది. గ్రేట్ కదూ? నాటక టెక్నిక్ వల్ల ఇలా కుదిరింది. ఈ వొక్క సీన్లోనే బిగినింగ్ విభాగం ఇరవై సీన్లలో వుండే పాత్రల పరిచయం, కథా నేపథ్యపు ఏర్పాటు, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా, సమస్య ఏర్పాటూ అనే నాల్గు టూల్సూ ప్లే అయ్యాయి. ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోవడం ప్లాట్ పాయింట్ వన్ మలుపు. ఇప్పుడామె గోల్ ఏమిటో దేవుడెరుగు. ఈ సీను తర్వాత చిన్నప్పట్నుంచీ ఆమె ఫ్లాష్ బ్యాక్. ప్రాంతీయ సినిమాల్లో ఇలాటి టెక్నిక్స్ వుంటున్నాయి. కమర్షియల్ సినిమాల్లో అవే టెంప్లెట్స్ తప్ప రాయడానికేమీ వుండడం లేదు... ―సికిందర్ (రేపు : లాక్ డౌన్ కాలంలో పొదుపుగా అందిన రెండు ‘సందేహాలకి సమాధానాలు’) Posted by సికిందర్ at 8:08:00 PM Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Newer Posts Older Posts Home Subscribe to: Posts (Atom) ఈ కాన్సెప్ట్ కి బాధితురాలి కథ అవసరం! స్క్రీన్ ప్లే సంగతులు...? ఒక దర్శకుడు నుంచి స్క్రీన్ ప్లే టిప్... Search This Blog contact msikander35@gmail.com, whatsapp : 9247347511 Popular Posts 1255 : రివ్యూ! రచన- దర్శకత్వం : శైలేష్ కొలను తారాగణం : అడివి శేష్ , మీనా క్షీ చౌదరి , కోమలీ ప్రసాద్ , రావు రమేష్ , శ్రీకాంత్ అయ్యంగార్ , తనికెళ్ళ భర... 1250 : రివ్యూ! (దేశవిదేశ పాఠకులందరికీ నమస్కారం. సినిమాలు చూస్తూనే వున్నా రాయాలంటే రైటర్స్ బ్లాక్ లాంటిది అడ్డుపడి ఇప్పుడు రిలీజ్ చేసింది. ఇక నుంచి రెగ్యు... 1251 : స్క్రీన్ ప్లే సంగతులు -1 దె య్యాలు ఎలాగైతే మూఢ నమ్మకమో , చేతబడి అలాటి మూఢ నమ్మకమే. దెయ్యాలతో హార్రర్ సినిమాలు తీసి ఎంటర్ టైన్ చేయడం వరకూ ఓకే. చేతబడి వుందంటూ నమ... తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17 స్క్రీ న్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసల... 1256 : రివ్యూ! రచ న -దర్శక త్వం : ఆనంద్ జె తారాగణం: రావణ్ రెడ్డి , శ్రీ ని ఖి త , లహ రీ గుడివాడ , రవీంద్ర బొమ్మకంటి , అమృత వర్షిణి తదిత తరులు సంగీతం: ఫ... 1252 : స్క్రీన్ ప్లే సంగతులు-2 ఇ క కథా నడక నియమాలకి విరుద్ధంగా , ఫస్టాఫ్ లో ముగియాల్సిన బిగినింగ్ విభాగమింకా సెకండాఫ్ లో కంటిన్యూ అవుతూ , కూతుర్ని హాస్పిటల్ కి... 1253 : రివ్యూ! రచన - దర్శక త్వం : ఏఆర్ మోహన్ తారాగణం : అల్లరి నరేష్ , ఆనంది , వెన్నెల కిషోర్ , ప్రవీణ్ , సంపత్ రాజ్ , శ్రీ తేజ్ , రఘుబాబు తదితరులు ... 1257 : రివ్యూ! 2023 లో జరిగే 95 వ ఆస్కార్ అవార్డ్స్ కి మన దేశం తరపున అధికారిక ఎంట్రీ పొందిన గుజరాతీ చలన చిత్రం ‘ చెల్లో షో ’ (చివరి షో) అక్టోబర్... (no title) డా ర్క్ మూవీస్ జానర్ కి 1930 లలో బ్లాక్ అండ్ వైట్ ‘ ఫిలిం నోయర్ ’ సినిమాలు బీజం వేశాయని చెప్పుకున్నాం. వీటి డీఎన్ఏ హార్డ... 1249 : రివ్యూ! రచన - దర్శకత్వం : రాజ్ విరాట్ తారాగణం : నందు విజయ్ కృష్ణ , రష్మీ గౌతమ్ , కిరీటి దామరాజు , రఘు కుంచె తదితరులు సంగీతం : ప్రశాం...
వాణిజ్యేతర ప్రాజెక్ట్‌లలో ఉపయోగించడానికి రాయల్టీ రహిత కార్టూన్ స్టైల్ క్లిపార్ట్ చిత్రాలు. X మాస్ చిత్రాలు. మా క్లిపార్ట్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు ఏదైనా ప్రామాణిక ఆఫీస్ ప్రోగ్రామ్‌లో సవరించవచ్చు. X మాస్ చిత్రాలు. డౌన్‌లోడ్ చేయడానికి మరియు ప్రింట్ చేయడానికి ఉచిత క్లిప్ ఆర్ట్ ఇలస్ట్రేషన్‌లు. X మాస్ చిత్రాలు. పాఠశాల, కిండర్ గార్టెన్, అధ్యయనం లేదా ఇంట్లో వర్క్‌షీట్‌లను రూపొందించడానికి ఉచిత చిత్రాలు - హస్తకళల గంటలు. X మాస్ చిత్రాలు. మా ఉచిత చిత్రాలతో మీరు ఉదాహరణకు, ఆహ్వానాలు, గ్రీటింగ్ కార్డ్‌లు లేదా వర్క్‌షీట్‌లను మీరే డిజైన్ చేసుకోవచ్చు. X మాస్ చిత్రాలు. డిఫాల్ట్‌గా, ఈ క్లిపార్ట్ ఇమేజ్ PNG లేదా JPG ఫైల్‌గా డౌన్‌లోడ్ చేయబడుతుంది. మేము మరింత మెరుగైన ముద్రణ నాణ్యత కోసం ఉచితంగా స్కేలబుల్ వెక్టర్ ఫార్మాట్‌లలో మా అన్ని క్లిపార్ట్‌లను క్రమంగా సిద్ధం చేసి ప్రచురిస్తున్నాము. ప్రతి చిత్రం క్రింద ఉన్న "వెక్టార్‌గా డౌన్‌లోడ్ చేయి" చిహ్నం ద్వారా గ్రాఫిక్ వెక్టర్‌గా అందుబాటులో ఉందో లేదో మీరు చెప్పవచ్చు. వివరణ మీరు కూడా దానిపై ఆసక్తి కలిగి ఉండవచ్చు క్రిస్మస్ క్లిపార్ట్ సన్ క్లిపార్ట్ బెలూన్ క్లిపార్ట్ ఉచితం కారు క్లిపార్ట్ గుండె క్లిపార్ట్ కిడ్స్ క్లిపార్ట్ పువ్వుల క్లిపార్ట్ లైట్బల్బ్ క్లిపార్ట్ క్లిపార్ట్ పుట్టినరోజు కుక్క క్లిపార్ట్
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది. ప్రజా సమస్యలపై చర్చకు నేటి నుంచి రెండు రోజులపాటు సమాంతర అసెంబ్లీ సమావేశాలను తెలుగుదేశం పార్టీ నిర్వహించనుంది. అనంతరం తీర్మానాలు చేసి స్పీకర్‌కు టీడీఎల్పీ పంపనుంది. ఒక రోజు బడ్జెట్ సమావేశాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ.. వినూత్నంగా నిరసన తెలిపేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా టీడీపీ నేతలు సమాంతర సభ నిర్వహించనున్నారు. ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించిన తెలుగుదేశం శాసనసభా పక్షం.. ప్రజా సమస్యలపై చర్చకు రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. సమాంతర బీఏసీ సమావేశాన్ని నిర్వహించి.. రెండు రోజుల చర్చనీయాంశాలను ఖరారు చేసింది. సమాంతర అసెంబ్లీ సమావేశం గురువారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు, అలాగే శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. ఆన్ లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని నిర్వహిస్తారు. SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com Categories National International Business Sports Health Education Science Technology Foods Entertainment Lifestyle
ప్రపంచ దేశాలకు పెను సవాలుగా మారింది కరోనా ఇక భారత్ లో ఈ కరోనా ని ఎదుర్కోవడంలో ముందడుగులులో ఉంది. ప్రజలంతా మంచి అవగాహనతో ముందుకెళుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇక దేశంలో కరోనా ప్రజాలకు పెద్దసవాలని కరోనా వైరస్ పై జరుపుతున్న ఈ పోరులో మనవంతుగా ప్రతి ఒక్కరు యోధులేనని తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. కరోనాపై ఈ పోరాటంలో భారత సేవా శక్తి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని అనేక అంశాలపై మాట్లాడారు. ప్రపంచదేశాలతో పోల్చితే మన భారతదేశ జనాభా చాలా ఎక్కువని, అలాగే మన భారత్ దేశానికి పెద్ద సవాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయని అన్నారు. అయినప్పటికీ మిగతా వేరే దేశాలలాగా ఇండియాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందలేదని, ఇందుకు ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలే మేలు చేశాయన్నారు. మిగతా ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారత దేశంలో కరోనా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని మోడీ అన్నారు. కరోనా అధికంగా వ్యాపించకుండా విధించిన లాక్ డౌన్ వల్ల ముఖ్యంగా పేదలు, వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారని, వారి దుస్థితి మాటల్లో చెప్పలేనిదని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మహమ్మారి కరోనా వల్ల ఇబ్బంది పడని వర్గమంటూ లేదన్నారాయన. వలస కార్మికులు పడుతున్న సమస్యల పరిష్కారానికి ‘మైగ్రేషన్ కమిషన్’ పేరిట ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేసే యోచన ఉందని అయన ప్రకటించారు. వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని చెప్పారు. మన దేశంలో ఉన్న వలస జీవులను వారి సొంత ఊళ్లకు తరలించేందుకు రైల్వే సిబ్బంది, ప్రభుత్వ సంస్థలు, మరియు కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు, స్థానిక సంస్థలు సైతం వీరికి కృషి చేశాయని, వారికి ఆహారం , నీరు మరియు వసతి సౌకర్యాలు సమకూర్చాయని పేర్కొన్న ఆయన ’ఈ వర్గాలనన్నింటినీ కలిపి ‘కరోనా వారియర్స్’ గా ఆయన అభివర్ణించారు. వలస కార్మికులను రైళ్లు, బస్సులలో వారి ప్రాంతాలకు పంపేందుకు పడిన కష్టాలకు గాను ఆయా రాష్ట్రాలను ప్రత్యేకంగా అభినందించారు. సోతుళ్ళకు చేరిన వాళ్లను క్వారంటైన్ చేయడం, వాళ్లకు తగిన ట్రీట్ మెంట్ ఇప్పించడంవంటి చర్యలను ఆయన ప్రస్తావించారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు మరింతగా బాధ్యత వహిస్తూ మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని, ఆరు అడుగుల దూరం ఖచ్చితంగా పాటిస్తూ, మాస్కులు వేసుకోవడం తప్పనిసరి అవసరంగా ఇంకా ఉందని మోదీ పేర్కొన్నారు. సాధ్యమైనంతవరకూ ఇళ్లలోనే ఉండాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ప్రతి మనిషి సపోర్టుతో కరోనా మహమ్మారిని మనం అదుపు చేయగలుగుతామని దీనిపై విశ్వాసం తనకు ఉందని ఆయన అన్నారు. ఇక దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఉందని, అందువల్లే లాక్ డౌన్ 5.0 దశలో చాలా మినహాయింపులు ఇచ్చామని మోదీ తెలిపారు. మే 31, 2020 ప్రజావారధి జాతీయం mann ki baat in telugu, pm narendra modi mann ki baat, pm narendra modi mann ki baat live, pm narendra modi mann ki baat today live, నరేంద్ర మోడీ, భారత్
సెప్టెంబర్‌ 17, 1948.. ‌హైదరాబాద్‌ ‌సంస్థానం భారతదేశంలో కలిసిన రోజు. ఆగస్ట్ 15, 1947‌న బ్రిటిష్‌ ‌పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నారు. కానీ హైదరాబాద్‌ ‌సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్‌ ‌వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్‌ ‌నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌.. ‌తమది స్వతంత్ర రాజ్యమని, హైదరాబాద్‌ అటు భారత్‌లో, ఇటు పాకిస్తాన్‌లోనూ కలవదని ప్రకటించాడు. అప్పటికే నిజాం రాజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేర్గాంచాడు. ఆనాడే 236 బిలియన్ల సంపద కలిగి ఉన్నాడు. ఐదు టన్నుల బంగారమూ ఆయన వద్ద ఉంది. హైదరాబాద్‌ ‌సంస్థానం స్వతంత్రంగా ఉండటానికి నిర్ణయించుకున్నట్లు ఆయన 1947లో ఫర్మానా కూడా జారీ చేశాడు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారత దేశంలో కలవాలని కోరుకున్నారు. ఎందుకంటే దోపిడీ దొంగలు, కిరాయి హంతకులు, మానవ మృగాలకి ఏమాత్రం తీసిపోని విధంగా రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ తయారుచేసిన రజాకార్లు తీవ్ర భయానక వాతావరణం సృష్టించారు. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యా కాండను కొనసాగించారు. వారి చేతిలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నిజాం నిరంకుశ పాలన గురించి, రజాకర్ల అకృత్యాల గురించి, వాటిని ఎదుర్కోవడానికి జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాల గురించి నేటితరం కచ్చితంగా తెలుసుకోవాలి. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎందరో వీరుల ప్రాణత్యాగాల ఫలితమే. హైదరాబాద్‌తో పాటు మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాలు నిజాం నవాబు పాలనలో ఉండేవి. దేశం మధ్యలో ఉన్న సువిశాల ప్రాంతం భారత యూనియన్‌లో చేరకపోతే అది దేశ మనుగడకే ముప్పు అని భావించిన నాటి హోంమంత్రి సర్దార్‌ ‌వల్లభభాయ్‌పటేల్‌ ‌హైదరాబాద్‌ ‌సంస్థానంపై సైనిక చర్యకు దిగాలని నిర్ణయించారు. పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్‌ ‌సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు. నిజాం నవాబుతో చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకుందామని భారత తొలి ప్రధాని నెహ్రూ అనుకున్నారు. కానీ సైనికచర్య ద్వారా వెంటనే నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకొని భారత్‌లో విలీనం చేసి రజాకార్లని అరికట్టడం అత్యవసరం అని నాటి హోంమంత్రి సర్దార్‌ ‌వల్లభభాయ్‌పటేల్‌ ‌పట్టుపట్టి నెహ్రూని ఒప్పించారు. భారత ప్రభుత్వం తమపైకి యుద్ధానికి సిద్ధం అవుతోందని తెలిసిన నిజాం నవాబు ఉస్మాన్‌ అలీఖాన్‌ ఏ ‌మాత్రం వెనక్కి తగ్గకుండా అందుకు తాము కూడా సిద్ధమేనని ప్రకటించడంతో భారత్‌-‌నిజాం సేనల మధ్య యుద్ధం అనివార్యమైంది. ‘ఆపరేషన్‌ ‌పోలో’ విజయవంతం సెప్టెంబర్‌ 13, 1948‌న భారత సైన్యం ‘ఆపరేషన్‌ ‌పోలో’ పేరిట హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి ‘పోలీస్‌ ‌యాక్షన్‌’ అనే పేరు కూడా ఉంది. ఈ సైనిక చర్య కేవలం ఐదు రోజుల్లోనే ముగిసిపోయింది. భారతసేనల ధాటికి తట్టుకోలేక నిజాం నవాబు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. హైదరాబాద్‌ ‌నలువైపుల నుంచి భారత సైన్యం ముట్టడిని ప్రారంభించింది. ముందుగా మహారాష్ట్ర వైపు నుంచి అన్ని గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి నల్‌దుర్గ్ అనే సైన్యాధికారి నాయకత్వం వహించారు. సెప్టెంబర్‌ 14‌న ఔరంగా బాద్‌, ‌జాల్నా, నిర్మల్‌, ‌వరంగల్‌, ‌సూర్యాపేటను అధీనంలోకి తీసుకోని హైదరాబాద్‌ ‌వైపు వచ్చారు. తుల్జాపూర్‌, ‌తల్ముమడి నుంచి బయల్దేరిన సైన్యానికి జనరల్‌ ‌డీఎస్‌ ‌బ్రార్‌ ‌నాయకత్వం వహించారు. మద్రాస్‌ ‌వైపు నుంచి వచ్చిన సైన్యానికి ఎ.ఎ. రుద్ర, కర్ణాటక వైపు నుంచి వచ్చే సైన్యానికి బ్రిగేడియర్‌ ‌శివదత్త నాయకత్వం వహించారు. హైదరాబాద్‌కు నలుదిశల నుంచి భారత సైన్యం ఒక్కో గ్రామాన్ని అధీనంలోకి తీసుకుంటుంటే.. ఆయా గ్రామాల్లోని ప్రజలు సైన్యానికి స్వాగతాలు పలికారు. భారత సైన్యం ముందు రజాకార్లు, నిజాం సైన్యం ఎదురు నిలవలేకపోయింది. మూడు రోజుల్లోనే దక్కన్‌ ‌భాగాన్ని పూర్తిగా భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. 16వ తేదీ మధ్యాహ్నానానికి భారత సైన్యం హైదరాబాద్‌ ‌పరిసర ప్రాంతాలలో మోహరించింది. భారత సైనిక సంపత్తికి భయపడి నిజాం సైన్యం ప్రధానాధికారి ఇద్రూస్‌ ‌లొంగిపోయాడు. సెప్టెంబర్‌ 17‌న సాయంత్రం సుమారు 5 గంటల సమయాని కల్లా భారత ఆర్మీ హైదరాబాద్‌ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. కాసేపటికి ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు రేడియో ద్వారా ప్రకటించాడు. అలా ఆపరేషన్‌ ‌పోలో పూర్తైంది. దీంతో రెండు శతాబ్దాల అసఫ్‌జాహీల పాలన అంతమైంది. నాడు హైదరాబాద్‌ ‌స్టేట్‌కు ప్రధానిగా ఉన్న లాయక్‌ అలీ తప్పించుకుని పాకిస్తాన్‌ ‌పారిపోయాడు. రజాకార్ల నాయకుడైన కాసీం రజ్వీ జైలు పాలయ్యాడు. నిజాం సంస్థానంలో ఉన్న ఔరంగాబాద్‌, ‌నాందేడ్‌, ‌పర్బనీ, బీడ్‌ ‌మహారాష్ట్రలో; గుల్బర్గా, బీదర్‌, ఉస్మానాబాద్‌, ‌రాయచూర్‌ ‌కర్నాటకలో విలీనం అయ్యాయి. అందుకే సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విముక్త దినోత్సవంగా పాటిస్తున్నాం. అనంతర పరిణామాలు నిజాం లొంగుబాటు అనంతరం చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌ ‌స్టేట్‌లో పరిపాలన బాధ్యతలను నాటి మేజర్‌ ‌జనరల్‌ ‌జేఎన్‌ ‌చౌదురీకి అప్పగించారు. సైనిక పాలకుడిగా సెప్టెంబర్‌ 19, 1948‌న ఆయన బాధ్యతలు చేపట్టారు. కేంద్రంలో రాష్ట్ర వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా ఉన్న ఎంకే వెల్లోడిని భారత ప్రభుత్వం డిసెంబర్‌ 1, 1949‌న హైదరాబాద్‌ ‌తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించింది. సైనిక పాలన అంతమై తాత్కాలిక ప్రజా ప్రభుత్వం మొదటిసారి ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు, వీవీ రాజు, విద్యాలంకర్‌లు మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారు. జనవరి 26, 1950న హైదరాబాద్‌ ‌స్టేట్‌లో భారత ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ ఉత్సవం నిర్వహించారు. భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందని నిజాం చవివి వినిపించారు. అదేరోజున ఆయనను రాజ్‌‌ప్రముఖ్‌గా భారత ప్రభుత్వం నియమించింది. 1952లో హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌శాసనసభకు మొదటిసారి ఎన్నికలు జరిగాయి. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1956 వరకు కొనసాగారు. రాష్ట్రాల పునర్‌ ‌వ్యవస్థీకరణతో భాషా ప్రాతిపదికన నవంబర్‌ 1, 1956‌న ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్‌ ‌స్టేట్‌లోని మరాఠా ప్రాంతాలైన 5 జిల్లాలను మహారాష్ట్ర, కన్నడ మాట్లాడే మూడు జిల్లాలను కర్ణాటకలో కలిపారు. తెలంగాణలోని 8 జిల్లాలు, మద్రాస్‌ ‌నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లాలను కలిపి ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయంపై ఆరు దశాబ్దాలపాటు అలుపెరగని పోరాటంతో 2014 జూన్‌ 2‌న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. విలీనమా? విమోచనమా? ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ‌నేతలు సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ ‌చేశారు. కానీ అధికారంలోకి రాగానే ఆ ఊసే మరిచారు. దీనికి కారణం ఆ పార్టీకి, అసదుద్దీన్‌ ‌నేతృత్వంలోని ఎంఐఎంతో ఉన్న దోస్తీనే కారణమని అందరికి తెలిసిందే. మరికొన్ని రాజకీయ పార్టీలు ముస్లిం సంతుష్టీకరణ కోసం ఈ రోజును విమోచనం దినంగా కాకుండా విలీన దినంగా జరుపుకోవాలని చెబుతున్నాయి. నిజాం నిరంకుశ పాలనను అంతమొందించిన సెప్టెంబర్‌ 17‌ను భారతీయ జనతా పార్టీ ప్రతి ఏటా తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తోంది. —————— వివాదం ఎక్కడ మొదలైంది? భారత యూనియన్‌లో చేరేది లేదని నవాబు 1947లో ఫర్మానా విడుదల చేయటంతో హైదరా బాద్‌ ‌స్టేట్‌ ‌భవిష్యత్తుపై సందిగ్ధతకు బీజాలు పడ్డాయి. ఆ తర్వాత భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌దేంట్లోనూ చేరబోదని ఆగస్ట్ 8‌న నిజాం చేసిన ప్రకటనతో తేటతెల్లమైంది. గవర్నర్‌ ‌జనరల్‌గా ఉన్న మౌంట్‌బాటన్‌ ‌చాలా చెప్పి చూశారు. స్వతంత్రంగా ఉండటం అసాధ్యమని, చివరకు అన్ని అధికారాలు పోవటం ఖాయమని కూడా హెచ్చరించారు. బ్రిటిష్‌ అధికారుల నేతృ త్వంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిద్దామని కూడా బాటన్‌ ‌ప్రతిపాదించారు. నవాబు ససేమిరా అన్నారు. సంస్థానాల్లో ప్రజాభిప్రాయ సేకరణ అన్నది ఆనాటి కాంగ్రెస్‌ ‌విధానంలో ఒక భాగం. సంస్థానాల్లో భిన్న మతాలకు చెందిన ప్రజలున్న చోట దీన్ని ఇంకా బలంగా నొక్కిచెప్పారు. కశ్మీర్‌లో కూడా ప్రజాభి ప్రాయ సేకరణకు అందుకే అంగీకరించారు. హైదరా బాద్‌లో ప్రతిపాదన కూడా అందులో భాగమే. సర్దార్‌ ‌పటేల్‌ ‌వీటన్నిటికీ అంగీకరించారు. ఏ సంస్థానానికి ఇవ్వని కొన్ని కీలక మినహాయింపులు హైదరాబాద్‌కు ఇచ్చారు. నైజాం-భారత ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ఇందుకో ఉదాహరణ. విలీనానికి అంగీకరిస్తే బెరార్‌ ‌ప్రాంతాన్ని హైదరాబాద్‌ ‌సంస్థానంలో చేర్చే ప్రతిపాదనకు కూడా ఒక దశలో అంగీకరించారు. రజాకార్ల చేతుల్లో కీలుబొమ్మగా మారి నిజాం యథాతథ ఒప్పందానికి తూట్లు పొడవటంతో భారత సైన్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా భారత్‌ ‌కరెన్సీని సంస్థానంలో నిషేధించటం, ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించటం, రైళ్లపై దాడులు, గ్రామాల్లో రజాకార్ల దారుణాలతో పరిస్థితి విషమించింది. 1948 సెప్టెంబర్‌ 9‌న సైన్యాన్ని పంపాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు వారాల పాటు నిజాం సైన్యాల నుంచి ప్రతిఘటన ఉంటుందని భావించారు. కానీ మూడో రోజుకే నిజాం సైన్యం తోకముడిచింది. ఈ సైనిక చర్యలో మేనన్‌ అం‌చనా ప్రకారం 800 మందికి పైగా చనిపోయారు. 108 గంటల్లోనే భారత సైన్యం అదుపులోకి పరిస్థితి వచ్చింది. వీపీ మేనన్‌ ‌హైదరాబాద్‌ ‌వచ్చి స్వయంగా పరిస్థితిని అంచనా వేశారు. నిజాంకు ముస్లింలలో ఉన్న పలుకుబడిని, ఒక సంస్థానంగా హైదరాబాద్‌కున్న ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ అధిపతిగా నవాబుని కొనసాగిస్తే బాగుంటుదని పటేల్‌కు మేనన్‌ ‌సూచించారు. నెహ్రూను సంప్రదించిన తర్వాతే ఏ సంగతి చెబుతానని పటేల్‌ అన్నారు. ఆ మరుసటి రోజే నెహ్రూ అంగీకారం తెలిపినట్లు పటేల్‌ ‌మేనన్‌కి చెప్పారు. కక్ష సాధింపు దృష్టితో కానీ, మతపరమైన దృష్టితో కానీ నిజాం నవాబు పట్ల నెహ్రూ-పటేల్‌ ‌ద్వయం వ్యవహరించలేదు. ————————– జమ్ముకశ్మీర్‌, ‌నిజాం సంస్థానాల ప్రత్యేకత సెప్టెంబర్‌ 17, 1948‌న నిజాం నవాబుకు చెందిన సైన్యం భారత సైన్యానికి లొంగిపోయింది. దీనితో భారత్‌ ‌నడిబొడ్డున ఉన్న ఒక పెద్ద సంస్థానం చరిత్ర ముగిసింది. దేశంలో జమ్ముకశ్మీర్‌, ‌నిజాం సంస్థానాలది ప్రత్యేక చరిత్ర. ఆ రెండింటికి సరితూగే సంస్థానాలు ఆనాడు లేవు. 550 పైచిలుకు ఉన్న సంస్థానాల్లో ఆ రెండే భారత నాయకత్వ పటిమను పరీక్షించాయి. ఆగస్ట్ 15, 1947 ‌నాటికి భారత యూనియన్‌లో చేరకుండా విపరీత తాత్సారం చేసి తీవ్ర ఉత్కంఠను, ఉద్రిక్తతను సృష్టించినవి ఈ రెండే. పాకిస్తాన్‌ అనుకూల శక్తులు ఒక వైపు నుంచి జమ్ముకశ్మీర్‌ను ముట్టడిస్తూ రావటం వల్ల ఆ సంస్థానం మహారాజా హరిసింగ్‌ అక్టోబర్‌ 27, 1947‌న భారత యూనియన్‌లో విలీనం చేయడానికి అంగీకరించారు. కశ్మీర్‌ ‌మహారాజు లాగానే నిజాం కూడా చివరి వరకూ స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నించాడు. అనివార్య పరిస్థితుల్లోనే ఇద్దరూ విలీనానికి అంగీకరించారు.
ఎన్నికలంటేనే ముందస్తు ప్రణాళికలు..పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవడం.. ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ.. పై ఎత్తులు వేయడం ద్వారా ముందంజ వేయాల్సి ఉంటుంది. ఏ పార్టీ అయినా ఇవే విధానాలు అనుసరించక తప్పదు. కానీ నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ ముందస్తు ప్రణాళికల మాటెలా ఉన్నా.. పలు అంశాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల ప్రథమాంకంలోనే దెబ్బతింది. అభ్యర్థుల ఎంపిక నుంచి వామపక్షాలతో పొత్తు వరకు సకాలంలో నిర్ణయాలు తీసుకోలేక చతికిల పడింది. సొంత పార్టీ వారినే అడ్డుకోలేక, తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీపై అబాండాలు వేస్తోంది. 11 చోట్ల టీడీపీ అభ్యర్థులే లేరు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం.. అభ్యర్థుల ఎంపికలో ఇద్దరు నేతలే చక్రం తిప్పడం వల్ల నగరపాలక సంస్థ పరిధిలోని 54 డివిజన్లలో 11 చోట్ల టీడీపీకి అభ్యర్థులు లేకుండా పోయారు. అభ్యర్థుల ఎంపికలో నెల్లూరు సిటీ పరిధిలో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రూరల్ పరిధిలో అబ్దుల్ అజీజ్ చక్రం తిప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా పార్టీ జిల్లా నేతలు అభ్యర్థుల ఎంపికలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్రలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆ ఇద్దరు నేతలే ఇచ్చేశారు. మరో వైపు కొందరు అభ్యర్థులు వైఎస్సార్సీపీలో చేరనున్నారన్న అనుమానంతో 12 మంది టీడీపీ అభ్యర్థులతో క్యాంప్ నిర్వహించారు. పక్కా టీడీపీ వారన్న ఉద్దేశంతో మిగిలిన వారిని వదిలేశారు. Also Read : Petrol Prices, Sajjala – సజ్జల ప్రతిపాదన ఉభయతారకం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం చివరి క్షణాల్లోనే అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చారు. ఇంత చేసినా వలసలను ఆపలేకపోయారు. 20వ డివిజన్ అభ్యర్థి రాజు యాదవ్ బీ ఫారం తీసుకున్న తర్వాత వెళ్లి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆ వెంటనే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అలాగే 29వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పార్టీ సీనియర్ నేత అబ్దుల్ అజీజ్ సన్నిహితుడు చివరి నిమిషంలో దాన్ని విత్ డ్రా చేసుకున్నారు. మొత్తం మీద 11 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులే లేకుండా పోయారు. వాటిలో 7, 8, 12, 20, 24, 37, 38, 40 డివిజన్లు ఏకగ్రీవంగా వైఎస్సార్సీపీ ఖాతాలోకి వెళ్లాయి. మిగిలిన మూడు డివిజన్ల(4, 29, 45)లో ఇతర పార్టీల అభ్యర్థులు రంగంలో ఉండటంతో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. వామపక్షంతో పొత్తులోనూ చిత్తు సీపీఎంతో సీట్ల సర్దుబాటు ప్రతిపాదన రాగా కొంత చర్చలు జరిగాయి. అయితే వాటిని తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంభించడంతో చివరికి అది ఆచరణలోకి రాలేదు. దాంతో సీపీఎం 17 డివిజన్లలో తన అభ్యర్థులను రంగంలోకి దించింది. మరోవైపు ఈ సర్దుబాటు ప్రయత్నాల వల్ల టీడీపీ అభ్యర్ధుల ఎంపిక వ్యవహారం కూడా చివరి క్షణం వరకు తేలలేదు. కాగా అధికార వైఎస్సార్సీపీ ముందు నుంచే ఎన్నికలకు సిద్ధమై ప్రణాళిక ప్రకారం దూసుకుపోతోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపికలో తలెత్తిన కొద్దిపాటి అసంతృప్తులను కూడా చర్చల ద్వారా సర్దుబాటు చేసుకొని సమైక్యంగా ముందుకు కదులుతోంది.
కరోనావైరస్ వ్యాప్తి తరువాత ప్రజలు ఒకరినొకరు అసాధారణ పద్ధతిలో పలకరించుకుంటున్నారు. చేతులు కలుపుకోవడం లేదా కౌగిలించుకోవడం వంటి పద్దతులను మానేస్తున్నారు. చైనా నగరమైన వుహాన్‌లో ప్రజలు వినూత్న రీతిలో పలకరించుకుంటున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వుహాన్ లో ప్రసిద్ది చెందిన ప్రాంతంలో ప్రజలు వారి పాదాలను మరొకరి పాదాలతో తాకి ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. ఈ ఉల్లాసభరితమైన విధానాన్ని ఇరాన్‌లోని చాలా మంది పాటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరగడంతో, ప్రజలు ఇప్పుడు సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా చేతులు కలుపుకోవడం లేదా ఒకరినొకరు కౌగిలించుకోవడం మానేసి ఈ పద్ధతిని పాటిస్తున్నారు. చేతులు కలుపుకోవడం వలన ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందో అన్న భయంతో ఇలా చేస్తున్నారు. ఇదిలావుంటే ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఒక వీడియోలో, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తన అంతర్గత మంత్రి సమావేశంలో హ్యాండ్‌షేక్ తిరస్కరించినట్లు కనిపిస్తారు.. దీనిని “సరైన పని”కాదు అని చెప్పడం అందులో చూడవచ్చు. సాధారణంగా భారతదేశంలో అయితే ప్రజలు నమస్తే అని రెండు చేతుల ద్వారా దండం పెట్టి సాంప్రదాయ రీతిలో పలకరిస్తారు. ఇప్పటికి దేశంలో ఈ సంప్రదాయాన్ని 50 శాతానికి పైగా ప్రజలు పాటిస్తున్నారు. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే వారం హోలీ వేడుకలకు దూరంగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరకు పలువురు భారత ప్రముఖులు చెప్పారు. కాగా కరోనా వైరస్ భారతదేశంలో దాదాపు 30 మందికి సోకింది, అయితే ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా, 70 కి పైగా దేశాలలో వేలాది మంది సోకడంతో 3,000 మందికి పైగా మరణించారు. ఇదిలావుంటే కరోనావైరస్(కోవిడ్ -19) వ్యాప్తి గురించి భారతీయులు భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. భారత్ లో కరోనా వైరస్ పై డబ్ల్యూహెచ్‌ఓ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రోడ్రికో ఆఫ్రిన్ మాట్లాడుతూ.. భారతదేశంలో పాజిటివ్‌గా పరీక్షించిన కేసులు అన్ని కూడా విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారి వల్లే వచ్చాయని.. భారత్ లో వైరస్ ఉద్భవించలేదని అందువల్ల భారతీయులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీలో ఏమాత్రం ఆదరణ లేని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) కేవలం పదవీ వ్యామోహంతో పార్టీని చేజిక్కించుకునేందుకు కుట్ర అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 - పదవీ వ్యామోహం లేకుంటే పార్టీ ఆఫీసులోకి ఎందుకు చొరబడ్డారు? - ఓపీఎస్‏పై ఈపీఎస్‌ ధ్వజం చెన్నై, ఆగస్టు (ఆంధ్రజ్యోతి): పార్టీలో ఏమాత్రం ఆదరణ లేని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) కేవలం పదవీ వ్యామోహంతో పార్టీని చేజిక్కించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) ధ్వజమెత్తారు. పదవీ వ్యామోహం లేకుంటే అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలోకి జొరబడి ఎందుకు హింసాకాండకు పాల్పడారని నిలదీశారు. సోమవారం ఉదయం తిరుచ్చి విమానాశ్రయం(Trichy Airport)లో ఈపీఎస్‌ విలేఖరులతో మాట్లాడుతూ అందరూ కలసి రావాలని ఓపీఎస్‌ పిలుపునివ్వడం వింతగా ఉందన్నారు. పార్టీకి సంబంధించినంతవరకూ సర్వసభ్యమండలి సభ్యులే కాకుండా సాధారణ కార్యకర్తలంతా తన నాయకత్వానికే మద్దతిస్తున్నారనే విషయం జగమెరిగిన సత్యమని ఆయన స్పష్టం చేశారు. పార్టీ శాసనసభ్యులు, సర్వసభ్యమండలి సభ్యుల, కోటిన్నర మంది కార్యకర్తలు తన వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఓపీఎస్‌ తన వెంటే కోట్లాదిమంది కార్యకర్తలున్నారని చెప్పడం అసత్యమనే విషయం అందరికీ తెలుసన్నారు. ఓపీఎస్‌ మాయమాటలతో తన వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆరుకుట్టి వెళ్ళారని, ఇకపై తన వర్గంలోని ఎవరూ వెళ్లే అవకాశం లేదన్నారు. డీఎంకే ప్రభుత్వం గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలను పెండింగ్‌లో ఉంచడం గర్హనీయమన్నారు. అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వం రూ.14 వేల కోట్లతో ప్రారంభించిన కావేరి -గుండారు పథకాన్ని డీఎంకే ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa) మృతిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ నివేదికపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం తన జిల్లాల పర్యటనకు కార్యకర్తలు, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఈపీఎస్‌ హర్షం వెల్లడించారు.
ఎన్టీఆర్, శోభన్ బాబు, ఏఎన్నార్, కృష్ణంరాజు, కృష్ణ అలా అనంతలోకాల్లో ఈ పాటికే కలిసుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. వెండితెరపై వెలుగు వెలిగిన సినీ దిగ్గజం కృష్ణ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో అభిమానలోకం దిగ్భ్రాంతికి గురైంది. ఇక తమ అల్లూరి రారని, జేమ్స్‌బాండ్ తిరిగిరారని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో సినిమా లోకంలో తొలిశకం ముగిసింది. తెలుగు తెరకు హీరోయిజాన్ని పరిచయం చేసిన స్టార్స్ ఏఎన్నార్, ఎన్టీఆర్. వీరిద్దరి స్ఫూర్తితో నటులుగా మారిన వారెందరో.. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ తర్వాత స్టార్‌డమ్ తెచ్చుకున్న హీరో సూపర్ స్టార్‌ కృష్ణ. కృష్ణ అనంతరం శోభన్‌బాబు, కృష్ణంరాజు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో స్టార్స్ అయ్యారు. వెండితెరతో వెలుగు వెలిగిన ఎన్టీఆర్‌ సినిమాలతో తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రజానాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్.. 1996 జనవరి 18న గుండెపోటుతో మృతి చెందారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు రొమాంటిక్ హీరోగా తనదైన ముద్రవేశారు. 2014 జనవరి 22న ఈ లోకాన్ని విడిచారు. ఫ్యామిలీ చిత్రాలతో పాటు ఆయన అందంతో అమ్మాయిల మనస్సు దోచుకున్న హీరోగా శోభన్‌బాబు నిలిచారు. 2008 మార్చి 20న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. మాస్‌ అలాగే పవర్‌ఫుల్ రోల్స్‌కు పెట్టింది పేరు రెబల్‌ స్టార్ కృష్ణంరాజు. ఇటీవల 2022 సెప్టెంబర్ 11న కన్నుమూశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు హిందుస్తాన్ లను సృష్టిస్తోందని రాహుల్ గాంధీ మండి పడ్డారు. మాకు రెండు హిందూస్తాన్ లు కాదు ఒకటే హిందూస్తాన్ కావాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కానీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని అన్నారు. అది కూడా ఒకరిద్దరికి దోచి పెడుతున్నారని దుయ్యబట్టారు. గుజరాత్ ఎన్నికల సందర్బంగా రాజ్ కోట్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రసంగం ప్రారంభంలోనే మీడియా పై సెటైర్లు వేశారు. గుజరాత్ రైతులు, యువకులు , ప్రెస్ మిత్రులు అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. ప్రెస్ మిత్రులమాదిరిగానే ఉంటారు కానీ టీవీల్లో మమ్ముల్ని చూపించారు అని వ్యాఖ్యానించారు. దీంతో సభలో జనం ఈలలు వేశారు.చూడండి నవ్వుతున్నారు… వెనక నుంచి రిమోట్ కంట్రోల్ ఉంది. మీడియా వాళ్ళ తప్పు లేదు వీళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ వీరి యాజమాన్యం అని అన్నారు. ఆ తరువాత రాహుల్ గాంధీ ప్రసంగం ఇలా సాగింది. 70 రోజుల క్రితం కన్యాకుమారి నుంచి నేను భారత్ జోడో యాత్ర ప్రారంభించా. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మధ్య ప్రదేశ్ లోకి ప్రవేశిస్తున్నాం. యాత్ర శ్రీనగర్ వరకు వెళ్తుంది. శ్రీనగర్ లో మన తిరంగా జెండా ఆవిష్కరిస్తాం . సుమారు 3500 కిలోమీటర్లు, 120 నుంచి 150 రోజులు పడుతుంది. నడుచుకుంటూ వెళ్తున్న. చాలా నేర్చుకుంటున్నాను . యువతతో మాట్లాడుతున్న. రైతులతో , కార్మికులతో , చిన్న చిన్న వ్యాపారస్థులతో చిన్న తరహా , మధ్య తరహా పరిశ్రమలు నడిపే వారితో మాట్లాడుతున్న . ఎంతో ఆప్యాత లభిస్తోంది. అన్ని ప్రాంతాల్లో ప్రేమానురాగాలు లభిస్తున్నాయి. లక్షలాది మంది పాల్గొంటున్నారు. ఈ టివి వాళ్ళు పూర్తిగా చూపించండం లేదు కానీ నది పారినట్టు జనాలు వస్తున్నారు. రోజు 5. 30 గంటలకే జనాలు వస్తారు 6 గంటలకు యాత్ర ప్రారంభిస్తాం. రాత్రి 7.30 లేదా 8 గంటలకు యాత్ర ముగిస్తుంది. అలిసిపోయినట్టు అనిపించడం లేదు. ప్రజల శక్తి, మద్దత్తు మరింత బలాన్నిస్తోంది. యాత్ర గుజరాత్ నుంచి రాలేకపోయాం అదే బాధగా ఉంది. చాలా సంతోషంగా ఉంది కానీ బాధగా కూడా అనిపిస్తోంది. వేలాది మంది యువకులతో మాట్లాడాను. ప్రతి అయిదు పది నిమిషాలకు యువకులు వస్తారు. వాళ్ళు కన్న కళల గురించి చెప్పారు. కొందరు ఇంజనీయర్ కావాలని అనుకుంటున్నారు. చాలా రోజులు కస్టపడి చదివాం. కళలు కన్నం ఇంజనీయర్ కావాలని కంప్యూటర్ ఇంజనీయర్ అవుతామని కళలు కన్నం కానీ కూలి పని చేస్తున్నాం. అని చెప్తున్నారు. కొందరు డాక్టర్ కావాలని అనుకున్న. చదువు కోసం ప్రైవేట్ కాలేజీకి లక్షల రూపాయలు ఇచ్చాము కానీ ఈ రోజు ఉబర్ కార్ నడుపుకోవలసి వచ్చింది. పిజా డెలివరీ చేయాల్సి వస్తోంది. రైతులతో మాట్లాడినప్పుడు ఒక ప్రశ్న ఎదురవుతోంది. రాహుల్ గారు మాకు విషయం అర్థం కావడం లేదు హిందూస్తాన్ లో ముగ్గురు, నలుగురు ధనవంతులు (అరబ్ పతి)కోట్లల్లో ఋణం తీరుకుంటారు. దేశంలో అందరికంటే ధనవంతుల అప్పు మాఫీ అవుతోంది. మేమెం తప్పు చేసాం ? మేం యాభైవేల అప్పు తీసుకుంటాం లేదా లక్ష రూపాయలు తీసుకుంటాం. మేము తీసుకున్న అప్పులు ఎప్పడు మాఫీ చేయరెందుకు ? వాళ్ళు అప్పు తిరిగి కట్టరు వారిని మాత్రం ప్రభుత్వం నాన్ పెర్ఫార్మింగ్ అసిడ్ అని పిలుస్తుంది. వాళ్లకు వ్యతిరేకంగా ఎలాంటి విచారణ ఉండదు. కానీ రైతు యాభైవేల రూపాయలు అప్పు చేసి కట్టకపోతే డిఫాల్టర్ అని పిలుస్తున్నారు. ఈ ప్రశ్న రైతులు అడుగుతున్నారు. ప్రధానమంత్రి భీమా యోజన పథకంలో పైసలు వేస్తాం. తుఫాను లాంటి విపత్తులు వస్తాయి. పొలం నాశనమవుతుంది. అలాంటప్పుడు ఒక్క రూపాయి కూడా దొరకదు. ఫోన్లు చేస్తా ఉంటారు కానీ ఎవరు సమాధానం చెప్పరు . ఇంటర్ నెట్ నుంచి మెయిల్ పంపుతారు ..దానికి కూడా ఎలాంటి సమాధానం రాదు . ఇవన్నీ వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇక్కడ మొర్బిలో ట్రాజిడీ జరిగింది. అప్పుడు విలేకరులు అడిగారు దీనికోసం ఎం చెప్తారు అని? .అప్పుడు నేను చెప్పాను చూడండీ … 150 మంది చనిపోయారు. ఇది రాజకీయం చేసే సమయం కాదు. దీనిమీద నేను స్పందించను.కానీ ఈ రోజు ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎవరైతే ఈ పని చేశారో వాళ్లకు వ్యతిరేకంగా ఎలాంటి విచారణ జరగలేదు. కనీసం ఎఫ్ ఐ ఆర్ కూడా చెయ్యలేదు. బీజేపీ వాళ్లతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలా సంబంధాలు ఉంటె వారికీ ఏం జరగదా? సంబంధం లేని వారిని పట్టుకున్నారు. లోపలవేశారు. కానీ ఎవరైతే నిజంగా తప్పు చేశారో , ఎవరైతే బాధ్యులో వాళ్లకు వ్యతిరేకంగా ఏమి లేదు. ఈ గురజాత్ లో చిన్న మధ్య తరహా పరిశ్రమల కేంద్రం. ఏ యేపారిశ్రామాలు కేవలం గుజరాత్ లోనే కాదు దేశం మొత్తంలో నడిపిస్తున్నారు. ఇదే దేశానికి ఉపాధి . ఎవరైతే ఇద్దరు ముగ్గురు ధనవంతులు ఉన్నారో వాళ్ళు ఉపాధి కల్పించడం లేదు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో, మధ్య తరగతి వ్యాపారం ఉందొ, వాళ్ళు ఉపాధి కల్పించేవాళ్లు. ఏమైంది మరి … కేంద్రం నోట్లను రద్దు చేసింది. మీకు చెప్పాడు నల్లధనం నివారిద్దామని. నల్లడబ్బు నివారణ కాలేదు. కానీ అన్ని చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. దీనికి తోడు జీ ఎస్ టి ఒకటి. అయిదు రకాల వేర్వేరు టాక్స్. ప్రతినెలా ఇంత మిగిలించుకుంటే అది కూడా ఐపోయింది. ధనవంతుల కోసం దారి క్లియర్ చేశారు. కొరోనా సమయంలో కూడా ఇదే చేశారు . నాకు బాగా గుర్తు. దేశంలో కార్మికులు , ఎవరో విలేకరి నన్ను అడిగారు మీరు నిజంగానే రెండువేల కిలోమీటర్లు నడిచారా? దేశంలో ప్రతి కార్మికులు రెండు వేళా కిలోమీటర్లు నడిచాడు. ఆకలితో నడిచాడు. ఇది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ కార్మికులకు ప్రభుత్వ సహా యం అవసరమైనప్పుడు ఈ దేశ ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం వాళ్లకు మద్దత్తు ఇవ్వలేదు. కార్మికులు రోడ్డు మీద చనిపోతుంటే అదే సమయంలో బీజేపీ ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద ధనవంతులైన వారి లక్షల రూపాయలు మాఫీ చేసింది ఎవరైతే చిన్న తరహా, మధ్య తరహా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్నారు. మేము నాశనమైపోయాం నోట్ల రద్దు అయింది. తప్పుడు జీ ఎస్ టి అమలు చేస్తున్నారు. ఆ తరువాత కొరోనా వచ్చింది. ప్రభుత్వం మద్దత్తు చెయ్యలేదు. ఇవి పాలసీలు కాదు. నోట్ల రద్దు , జీఎస్టీ , కొరోనా సమయంలో వీళ్ళు అనుసరించిన తీరు పాలసీ కాదు. ఇది ప్రజలకు వ్యతరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, చిన్న చిన్న వ్యాపారులను చంపేసే ఆయుధం ఇది. ఈ దేశంలో ఉన్న ఇద్దరు ముగ్గురు ధనవంతులకు తెలుసు వాళ్ళ కోసం దారిని క్లియర్ చేసేఅయిదం ఇది. వాళ్ళు ఏ వ్యాపారం చెయ్యాలనుకున్న చేసేస్తారు. వాళ్ళు ఎం చెయ్యాలనుకుంటే అది చేసేస్తారు. టెలికం వ్యాపారం లోకి దూరుతారు, ఎయిర్ పోర్ట్ లో దూరుతారు, మౌలిక వసతులు, వ్యవసాయం ఇలా ఎం చెయ్యాలనుకుంటే అది చేసేస్తారు . గ్రాసరీ స్టోర్స్ ఇలా వాళ్ళు ఏ కళలు కన్నా వాళ్లకేం కాదు కానీ ఈ దేశంలో యువత కళలు కనాలంటే ముందుగా ప్రవితే కాలేజీలోకి వేళలండి లక్షలాది రూపాయలు కట్టానండి ధరలు చూడండీ.. ఆ తరువాత ఇంజనీయర్ చెయ్యొద్దు కూలీగా మారిపోండి. ఈ రోజు ఈ దేశంలో యువతకు ఉపాధి లభించడం లేదు . 75ఏళ్ళ దేశంలో అత్యంత ఎక్కువగా నిరుద్యోగం ఇప్పుడు ఉంది గుజరాత్ లో , దేశంలో కూడా. గతంలో పేదవాళ్ళు ఉండేది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాళ్లకు ఉపాధి లభించేది. ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం అవుతున్నాయి. రైల్ వే కూడా ప్రైవేట్ చేశారు. . బి హెచ్ ఈ ఎల్ , ఆయిల్ కంపెనీలు, , ఇవన్నీ ఎవరికీ ఇస్తున్నారు. అదే ఇద్దరు ముగ్గురు ధనలక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక పక్క నిరుద్యోగం , మరో పక్క అధిక ధరలు . యూపీఏ సమయంలో పెట్రోల్ 60 రూపాయలు ఉండే. ఈ రోజు వంద దాటిపోయింది. గ్యాస్ సిలెండర్ 400 ఉండే. ఈ రోజు ఎంత ? పదకొండు వందలు ఉంది. రెండు హిందూస్తాన్ దేశాలు సృష్టిస్తున్నారు. . ఒకడి ధనవంతులది. వాళ్ళు ఎం చెయ్యాలనుకుంటారో అది చేసేస్తారు . రెండోది పేద ప్రజల హిందూస్తాన్. రైతుల, కూలీల, చిన్న చిన్న వ్యాపారుల , మాకు రెండు హిందూస్తాన్ లు కాదు ఒకే హిందూస్తాన్ కావలి. న్యాయంతో ఉండే హిందూస్తా కావాలి భారత్ జోడో మేము ఏదైతే మొదలు పెట్టామో , దాని వెనకాల ఆలోచన మీదే, గుజరాత్ ఆలోచనే, గాంధీ ఆలోచనే ఇది. మేమేమి కొత్త పని చెయ్యడం లేదు . దారి మాకు గుజరాత్ చూపించింది. మహాత్మ గాంధీ , సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపించారు . మీ దగ్గరే నేర్చుకున్న, మేం ఈ తపస్సు చేస్తున్నాము. ప్రజల మాటలు వింటున్న. ఆరేడు గంటల పాటు నడుస్తున్నాం.ఏమీ మాట్లాడం. రైతుల మాటలు , కష్టాలు వింటున్న, యువత మాటలు వింటున్న వారిని కౌగిలించుకుంటున్న. కూలీలతో మాట్లాడుతున్న. ఆరేడు గంటలు నడిచిన తరువాత , అప్పుడపుడు పది పదకొండు గంటలు కూడా అవుతాయి. కేవలం పదిహేను నిముషాలు మాత్రమే మాట్లాడుకుంటాం సాయంత్రం వేలా మీరందరు దూరప్రాంతాల నుంచి వచ్చారు. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్న. ఎంతో శ్రద్దగా ప్రేమతో నా మాటలు విన్నారు. దీనికోసం మీ అందరికి ధన్యవాదాలు. నమస్కారం , జై హింద్ . అని రాహుల్ తన ప్రసంగాన్ని ముగించారు. Post Views: 1 Tagged bhaarath jodo yatra, bharath, gurajath elections, india, jodo yatra, rahul gandhi, rahul gandhi bharath jodo yatra, rahul in madhya pradesh, rahul india
Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రపంచకప్ తర్వాత టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ స్పందించాడు. గడిచిన దశాబ్దకాలంగా టీమిండియాకు ఆడుతూ ఇప్పటికీ పరుగుల దాహం తీరని ఆటగాడిలా ఆడుతున్న మాజీ సారథి విరాట్ కోహ్లీకి ఇదే చివరి టీ20 ప్రపంచకప్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోహ్లీ.. తనను అచ్చొచ్చిన టెస్టు, వన్డే ఫార్మాట్ లపై దృష్టి సారించేందుకు గాను పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడని క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తున్నది. ఇంగ్లాండ్ టెస్టు సారథి బెన్ స్టోక్స్ సుదీర్ఘ ఫార్మాట్ కు ప్రాధాన్యం ఇవ్వడానికి వన్డేలను వదిలేశాడు. ఆసీస్ టీ20 సారథి ఆరోన్ ఫించ్ వన్డేల నుంచి తప్పుకుంటే కోహ్లీ మాత్రం టీ20లను వదిలేస్తాడని బీసీసీఐ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ దీనిపై స్పందించాడు. కోహ్లీ అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. బయట వినిపించేవన్నీ వదంతులేనని కొట్టిపారేశాడు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన ఆయన కోహ్లీకి ఇది కచ్చితంగా చివరి టీ20 ప్రపంచకప్ కాదని అన్నాడు. రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘టీమిండియాకు సుదీర్ఘకాలంగా ఆడుతున్న ఘనత కోహ్లీది. అతడి ఫామ్, ఫిట్నెస్, పరుగుల దాహం కోసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కోహ్లీకి ఇది కచ్చితంగా చివరి టీ20 ప్రపంచకప్ అయితే కాదు. వచ్చే పొట్టి ప్రపంచకప్ (2024)లో కూడా కోహ్లీ ఆడే అవకాశముంది. కోహ్లీ ఇటీవలే తన పేలవ ఫామ్ దశను దాటాడు. తిరిగి మునపటి ఫామ్ ను అందుకున్నాడు. ఇప్పుడు కోహ్లీ చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. ఆసియా కప్ లో కొత్త కోహ్లీని చూశాం. ఇక ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో కోహ్లీ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడు..’ అని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఆడుతున్న రోహిత్ శర్మతో పాటు ఈ మెగా టోర్నీ తర్వాత కోహ్లీ కూడా టీ20లకు గుడ్ బై చెబుతారని గత కొంతకాలంగా భారత క్రికెట్ లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. వన్డే ప్రపంచకప్ (2023) తర్వాత రోహిత్ వన్డేల నుంచి తప్పుకున్నా కోహ్లీ మాత్రం వన్డే,టెస్టులలో కొనసాగే అవకాశముందని సోషల్ మీడియాలో ఈ ఇద్దరి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మరి వాళ్లిద్దరి మనుసులో ఏముందో..? అనేది మాత్రం సస్పెన్స్.
మీ కుటుంబం మరియు స్నేహితులతో గోల్డ్ పార్టీ ఆటల కోసం గో గో ఆడటం ద్వారా బంగారం కోసం పోటీ పడుతున్నప్పుడు యుఎస్ఎ జట్టును ఉత్సాహపర్చడానికి సిద్ధంగా ఉండండి! వారు ఒలింపిక్స్ ప్రారంభోత్సవం చూసేటప్పుడు లేదా దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రీడాకారులు పోటీ పడటం చూడటం మీ ప్రేమను జరుపుకునే సరదా మార్గం. పిల్లలు లేదా పెద్దలతో కూడా బంగారు పార్టీ కోసం వెళ్ళడానికి వారు చాలా బాగుంటారు, ప్రతి ఒక్కరూ చాలా ఆరోగ్యకరమైన పోటీలో పాల్గొనడానికి చాలా మధురమైన బహుమతితో ఆహ్లాదకరమైన మార్గం! ఈ పోస్ట్ మీ సౌలభ్యం కోసం ఉత్పత్తులకు అనుబంధ లింక్‌లను కలిగి ఉంది. మీరు నా లింకుల ద్వారా కొనుగోలు చేస్తే, మీకు అదనపు ఖర్చు లేకుండా నేను చిన్న కమీషన్ పొందవచ్చు. బంగారు పార్టీ కోసం వెళ్ళు! నేను శీతాకాలపు క్రీడలను ఇష్టపడుతున్నాను, కానీ నేను వేసవిని ప్రేమిస్తున్నాను, అలెక్స్ మాక్ ఆమె స్కెచర్లను ఎలా ఇష్టపడ్డాడో కానీ ఆమె ప్రాడా బ్యాక్‌ప్యాక్‌ను నేను ఇష్టపడ్డాను. మీకు తెలుసా, ఆ రకమైన ప్రేమ. మీరు వెతుకుతున్నట్లయితే వింటర్ ఒలింపిక్ నేపథ్య పార్టీ ఆటలు , మీరు ఇక్కడ (మరియు ఉచిత ముద్రించదగిన స్కోర్‌కార్డ్) కనుగొనవచ్చు. నేను కేవలం 11 ఏళ్ళ వయసులో 1996 లో మాగ్నిఫిసెంట్ 7 ప్రదర్శనను చూశాను మరియు నేను ఏదో ఒక రోజు జిమ్నాస్ట్ అవ్వాలని అనుకున్నాను. నేను జిమ్నాస్టిక్స్లో లేను లేదా నా కాలిని తాకలేకపోయాను (ఇప్పటికీ చేయలేను), కానీ నేను అద్భుతంగా ఉండాలని అనుకున్నాను. ఇప్పుడు, నాకు బాగా తెలుసు. నేను అంతర్జాతీయ పోటీ స్థాయికి ఎప్పటికీ చేరుకోలేనని మరియు నేను చూస్తున్న వ్యక్తులు నిజంగా వారు చేసే పనిలో అద్భుతంగా ఉన్నారని నాకు తెలుసు. నా పడకగది పైకప్పుపై గాబీ డగ్లస్ లేదా సిమోన్ పైల్స్ యొక్క పోస్టర్ నా వద్ద లేనప్పటికీ, వచ్చే నెల రియోలో యుఎస్ఎ జిమ్నాస్టిక్స్ జట్టు పోటీ పడటం కోసం నేను ఇంకా ఎదురు చూస్తున్నాను. నాన్న కూడా చాలా అభిమాని. వాస్తవానికి, అతను 2002 లో సాల్ట్ లేక్ సిటీలో జరిగిన అన్ని ఉత్సవాలను చూడటానికి కుటుంబ యాత్ర చేయడానికి రెండు వారాల పాటు మనందరినీ పాఠశాల నుండి బయటకు తీసుకువెళ్ళాడు. కెనడియన్ జత ఫిగర్ స్కేటింగ్ జట్టును చూడటం వివాదం కారణంగా రెండవ బంగారు పతకాన్ని అందుకుంది. రష్యన్లు తీర్పు చెప్పడం నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆ సమయంలో చాలా భావోద్వేగాలు, నేను కెనడియన్ కూడా కాదు. కాబట్టి నేను వారి గురించి ప్రతిదీ ప్రేమిస్తున్నాను అని చెప్పడం సురక్షితం. ఈ వారం నా తల్లిదండ్రుల పెద్ద వీడ్కోలులో భాగంగా, వచ్చే వారం ఉత్సవాలు ప్రారంభమయ్యే సమయానికి మా అమ్మ మరియు నాన్న వారి ఎల్డిఎస్ మిషన్‌లో ఉంటారు కాబట్టి మా స్వంత పోటీని నిర్వహించడం సరదాగా ఉంటుందని నేను అనుకున్నాను. మా అభిమాన సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఎనిమిది వేర్వేరు పోటీలను నేను కలిసి ఉంచాను. ప్రతి క్రీడాకారుడు వారి స్వంతంగా ఉన్నారు (జట్లు లేవు), మరియు బంగారు పార్టీ ఆటల కోసం మా ప్రయాణంలో స్కోర్‌లను ట్రాక్ చేయడానికి ప్రతిఒక్కరికీ నేను నడుస్తున్న స్కోర్‌కార్డ్‌ను ఉంచాను! చివరికి, మొదటి మూడు వారి స్వంత పతకాన్ని అందుకున్నాయి - చాక్లెట్ నిండిన కూజా. మూడవ స్థానం ఫినిషర్ కోసం కాంస్య రంగు రోలోస్, రెండవ స్థానంలో రజతం హెర్షే కిసెస్, మరియు బంగారు పతక విజేత కోసం బంగారు రీస్ పీనట్ బటర్ కప్ మినిస్. నేను మా కోసం అదే బహుమతులను ఉపయోగించాను వింటర్ ఒలింపిక్ నేపథ్య పార్టీ చాలా! ఒలింపిక్ పార్టీ క్రీడలు # 1 - బౌన్స్ బాస్కెట్ బాల్ అందరికీ పది ఇస్తారు పింగ్ పాంగ్ బంతులు , అన్నీ వేరే రంగు. ఉంచండి a బాత్రూమ్ పరిమాణ చెత్త బుట్ట బౌన్స్ చేయదగిన (కాబట్టి కార్పెట్ కాదు) అంతస్తులతో కూడిన గది మధ్యలో, ఆపై అన్ని ఆటగాళ్ళు చెత్త డబ్బాల చుట్టూ సర్కిల్ చుట్టుకొలతలో నిలబడతారు. సర్కిల్ మధ్యలో ఉన్న పింగ్ పాంగ్ బంతిని చెత్త డబ్బాలోకి బౌన్స్ చేయడానికి ఆటగాళ్లకు పది అవకాశాలు (వారి 10 పింగ్ పాంగ్ బంతులు) ఉన్నాయి. రౌండ్ చివరిలో బుట్టలో ప్రతి బంతికి ఆటగాళ్ళు ఒక పాయింట్ పొందుతారు. # 2 - బ్యాలెన్స్ బుక్ ఆటకు ముందు, నేలపై 10 అడుగుల రేఖను టేప్ చేసి, పుస్తకాల సమూహాన్ని సేకరించి, వీలైతే అదే పరిమాణంలో అతుక్కోవడానికి ప్రయత్నిస్తారు. ఆటగాళ్ళు టేప్ యొక్క ఒక చివర నుండి మరొక వైపుకు (పడకుండా) నడవాలి. పుస్తకం పడిపోతే లేదా వారు లైన్ నుండి తప్పుకుంటే, వారికి పాయింట్లు లభించవు. వారు దానిని ఒక పుస్తకంతో తయారు చేస్తే, వారు ఒక పాయింట్‌ను అందుకుంటారు మరియు మరిన్ని పుస్తకాలతో మళ్లీ ప్రయత్నించవచ్చు. మొత్తం మూడు పుస్తకాలు (5 పాయింట్లకు) పుస్తకాలు వారి తల నుండి పడిపోయే వరకు వారు ముందుకు వెనుకకు నడవడం కొనసాగించవచ్చు. పాయింట్లు పేరుకుపోవు, కాబట్టి చివరికి వారు మూడు పుస్తకాలు చేయగలిగితే, వారు మొత్తం ఐదు పాయింట్లను పొందుతారు, తొమ్మిది కాదు. స్కోరింగ్: ఒక పుస్తకం - 1 పాయింట్ రెండు పుస్తకాలు - 3 పాయింట్లు మూడు పుస్తకాలు - 5 పాయింట్లు # 3 - పూల్ లో కూల్ ఆటకు ముందు, ఒక సమూహాన్ని సేకరించండి చిన్న పూల్ బొమ్మలు (25 వంటిది). అవి పూల్ నూడుల్స్ నుండి సిరామరక జంపర్స్ వరకు స్ప్లాష్ బంతులు కావచ్చు. గది లేదా మైదానం యొక్క ఒక చివరన వాటిని పెద్ద బకెట్‌లో ఉంచండి మరియు మరొక చివర టేప్ లేదా స్ప్రే పెయింట్‌ను ఉంచండి. ఈ ఆట కోసం, ఆటగాళ్ళు గది యొక్క మరొక చివర ప్రారంభ రేఖ నుండి బకెట్ వరకు పందెం వేయాలి. వారు బకెట్ నుండి వస్తువులను పొందడానికి వారి చేతులను ఉపయోగించవచ్చు, కాని ప్రారంభ రేఖకు తిరిగి రావడానికి పూల్ బొమ్మలను పట్టుకోవడానికి వారి చేతులను ఉపయోగించలేరు. ఆటగాళ్ళు వీలైనంత ఎక్కువ పూల్ బొమ్మలను సేకరించి ముందుకు సాగడానికి ఒక నిమిషం సమయం ఉంది, వీలైనంతవరకు ప్రతి మలుపులో బకెట్ నుండి ఎక్కువ బొమ్మలను వెనక్కి తీసుకువెళతారు. నిమిషం ముగిసేలోపు ఆటగాళ్ళు తిరిగి వచ్చే ప్రతి వస్తువుకు ఒక పాయింట్ పొందుతారు. # 4 - టేబుల్ టెన్నిస్ టాప్లింగ్ సెటప్ ప్లాస్టిక్ కప్పులు పట్టిక చివర 2 అంగుళాల దూరంలో. టేబుల్ యొక్క మరొక వైపు, పింగ్ పాంగ్ బంతుల బుట్ట ఉంచండి. టేబుల్ యొక్క మరొక వైపు నుండి కప్పులను కొట్టడానికి ఆటగాళ్ళు టేబుల్ చివర బుట్ట నుండి పింగ్ పాంగ్ బంతులను రోల్ చేయాలి (బౌన్స్ లేదా విసిరేయకూడదు). ఆటగాళ్ళు ఎన్ని కప్పులు కొట్టవచ్చో చూడటానికి ఒక నిమిషం సమయం ఉంది మరియు ప్రతి కప్పుకు ఒక పాయింట్‌ను పూర్తిగా టేబుల్ నుండి పడగొట్టవచ్చు. # 5- గృహ ట్రయాథ్లాన్ ఆటగాళ్ళు తమ ఇంటి ట్రయాథ్లాన్‌ను పూర్తి చేయడానికి వీలైనంత త్వరగా పోటీ పడాల్సిన మూడు వేర్వేరు స్టేషన్లను సెటప్ చేయండి. ఆటగాళ్ళు ఒకేసారి వెళ్ళవచ్చు (మీకు తగినంత సామాగ్రి ఉంటే) లేదా ఒక సమయంలో వెళ్లి వాటికి సమయం ఇవ్వవచ్చు. వేగవంతమైన ఆటగాడికి ఐదు పాయింట్లు, తదుపరి వేగంగా మూడు పాయింట్లు, మరియు మూడవ వేగవంతమైనది మూడు పాయింట్లు. ఈవెంట్ # 1 - రగ్ రన్ ఆటగాళ్ళు స్నానపు మత్ (రగ్గు) పై కూర్చుని, ప్రారంభ రేఖ నుండి లైన్ పూర్తి చేసి, తిరిగి వెళ్లాలి. మీకు ఎక్కువ అందుబాటులో ఉంటే ఇది తువ్వాళ్లతో కూడా పనిచేస్తుంది. ఈవెంట్ # 2 - చేపలాగా ఈత కొట్టండి బకెట్ నీటి నుండి మూడు ప్లాస్టిక్ బొమ్మలను (ప్రాధాన్యంగా చేపలు) బయటకు తీయడానికి ఆటగాళ్ళు నోరు మాత్రమే ఉపయోగించాలి. ఈవెంట్ # 3 - ఎస్ పిన్ సైకిల్ ఐదుగురు సహచరులను కనుగొనడానికి ఆటగాళ్ళు సరిపోలని సాక్స్ బుట్ట ద్వారా వెతకాలి, ఆపై సాక్స్‌తో జతకట్టాలి మరియు వాటిని పూర్తి చేయడానికి నేలపై ఉంచాలి. # 6 - జెయింట్ గోల్ఫ్ గది యొక్క ఒక చివర రెండు పొడవైన సమాంతర సమాంతర రేఖలను టేప్ చేయండి, ఒకదానికొకటి దూరంలో ఒక అడుగు దూరంలో ఉంటుంది. గది యొక్క మరొక వైపున, మొదటి రెండు పంక్తుల నుండి ఇరవై అడుగుల దూరంలో మరొక పొడవైన క్షితిజ సమాంతర రేఖను టేప్ చేయండి. ఆటగాళ్లకు ఒక్కొక్కరికి ఐదు గోల్ఫ్ బంతులు మరియు చీపురు (లేదా తుడుపుకర్ర) ఇవ్వబడుతుంది. కేవలం ఉపయోగించి తుడుపుకర్ర / చీపురు పుటర్ వలె, ఆటగాళ్ళు గోల్ఫ్ బంతులను రెండు పంక్తుల మధ్య దిగడానికి ప్రయత్నించాలి. వారు పంక్తిని తాకలేరు, అవి రెండు పంక్తుల మధ్య ఉండాలి. రెండు పంక్తుల మధ్య దిగే ఏదైనా గోల్ఫ్ బంతికి ఆటగాళ్ళు ఒక పాయింట్ అందుకుంటారు. # 7 - గోడపై బంతి ఖాళీ గోడ దగ్గర రెండు పెద్ద బుట్టలు లేదా బకెట్లు ఉంచండి. గది నుండి ఒక నియమించబడిన ప్రదేశం నుండి గోడ నుండి మరియు బుట్టలోకి విరిగిపోయిన కాగితపు బంతిని విసిరేందుకు ఆటగాళ్ళు 10 ప్రయత్నాలు చేస్తారు. బకెట్‌లోకి దిగే ప్రతి బంతికి ఆటగాళ్ళు ఒక పాయింట్ అందుకుంటారు. మీరు ఒకేసారి బహుళ వ్యక్తులను చేయబోతున్నట్లయితే, వారికి వేర్వేరు రంగులను ఇవ్వండి. # 8 - ప్లేట్ టాస్ క్రిస్మస్ కుటుంబ వైరం ప్రశ్నలు మరియు సమాధానాలు 2015 ఆటకు ముందు, గది యొక్క ఒక వైపున మూడు కాగితపు పలకలను టేప్ చేయండి, ఒకటి 1 తో ఒకటి, 2 తో ఒకటి మరియు 3 తో ​​ఒకటి. అప్పుడు ఆటగాళ్లకు ఐదు పేపర్ ప్లేట్లు ఇవ్వండి మరియు గదికి మరొక వైపు నిలబడండి, ఆటగాళ్ళు ఉన్నారు కాగితపు పలకలను టేప్ చేసిన వాటి వైపు టాసు చేసి, వాటిని పాయింట్ ప్లేట్లను తాకి భూమిలోకి తీసుకురావడానికి. ఒకవేళ వారు ఒక ప్లేట్‌పై ఒక సంఖ్యతో తాకిన భూములను టాసు చేస్తే, వారు ఆ సంఖ్యలను అందుకుంటారు. మొత్తం పాయింట్ల సంఖ్య కోసం చివరిలో మొత్తం పాయింట్ల సంఖ్యను లెక్కించండి. నేను ఉచిత ముద్రించదగిన స్కోర్‌కార్డ్‌ను సృష్టించాను ( డౌన్ లోడ్ చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చేయండి ) మీరు పాయింట్లను ట్రాక్ చేయడానికి ఉపయోగించవచ్చు. పోటీ ముగింపులో, అత్యధిక పాయింట్లతో ఆటగాడికి బంగారు “పతకం”, రెండవ స్థానం రజతం, మరియు మూడవ స్థానం కాంస్యంతో ఇవ్వండి. నా బావ అతనిని కొట్టడం పట్ల నా సోదరుడు పెద్దగా ఉత్సాహపడలేదు.
తన సేవలను ఆపకుండా పేదల కోసం వైద్యం, విద్య వరకూ అన్ని సహాయం చేస్తూనే వస్తున్నాడు. ఎక్కడైనా కష్టం అనే మాట వినిపించినా, కనిపించినా అక్కడ వాలిపోతున్నాడు.. X లాక్ డౌన్ టైంలో వలస కూలీలకి అండగా నిలిచి వారి పాలిట దేవుడిలా నిలిచారు నటుడు సోనూసూద్.. అంతటితో తన సేవలను ఆపకుండా పేదల కోసం వైద్యం, విద్య వరకూ అన్ని సహాయం చేస్తూనే వస్తున్నాడు. ఎక్కడైనా కష్టం అనే మాట వినిపించినా, కనిపించినా అక్కడ వాలిపోతున్నాడు.. సినిమాల్లో విలన్ అయినప్పటికీ, రియల్ లైఫ్ లో సోనూ ఓ రియల్ హీరో.. తాజాగా మెగాస్టార్ ఆచార్య సెట్లోనూ కూడా తన దాన గుణం చూపించారు సోనూసూద్. ఆచార్య సినిమా కోసం పనిచేస్తున్న వంద మందికి ఇవ్వాలా స్మార్ట్ ఫోన్స్ గిప్ట్ గా ఇచ్చాడు సోనూసూద్.. చిత్ర యూనిట్ లో చాలా మందికి స్మార్ట్ ఫోన్ కూడా కొనుక్కునే పరిస్దితి ఉందని, వారి పిల్లలు కూడా ఆన్ లైన్ క్లాస్ లకు హాజరు కాలేకపోతున్నారని తెలుసుకొని సోనూసూద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సోనూసూద్ ఈ గిఫ్ట్ ఇచ్చేవరకు ఎవ్వరికి కూడా తెలియదు. దీనితో వారంతా ఆనందంలో మునిగితేలారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అటు ఆచార్య సినిమా విషయానికీ వచ్చేసరికి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమర్షియల్‌ హంగులతో పాటు సామాజిక సందేశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
thesakshi.com : చిరు హైదరాబాద్ లో తన స్వగృహంలో ఈ వేడుకలను జరుపుకోరని గుసగుసలు వినిపిస్తున్నాయి. మునుపటి కంటే భిన్నంగా ఈ ఏడాది వేడుకలను ప్లాన్ చేస్తున్నారు. ఏదైనా ఎగ్జోటిక్ డెస్టినేషన్ లో కుటుంబ సమేతంగా రిలాక్స్ అయ్యే విధంగా ప్రణాళిక సాగుతోంది. చిరు వరుస సినిమాల్లో నటిస్తూ బాగా అలసిపోయారు. అందువల్ల కొద్దిరోజుల పాటు డెస్టినేషన్ తరహాలో విరామ సమయాన్ని కోరుకుంటున్నారు. అది కూడా కుటుంబ సభ్యులతో బీచ్ పరిసరాల్లో ఈ వేడుకలు జరుపుకోవాలని ఆశిస్తున్నారని సోర్స్ చెబుతోంది. చిరు షష్ఠిపూర్తి (60వ బర్త్ డే) వేడుకలు హైదరాబాద్ పార్క్ హయత్ లో జరిగాయి. ఓ ఏడాది హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరు ఇంట్లోనే ఎయిటీస్ తారల నడుమ బర్త్ డే పార్టీ ఘనంగా జరిగింది. మరో సంవత్సరం నేపాల్ లోని పశుపతినాథ్ ఆలయానికి చిరు వెళ్ళారు. ఓ ఏడాది స్పెయిన్ లో.. కొన్నిసార్లు అమెరికాలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అరుదుగా అతని కుటుంబం మొత్తం వారి బెంగళూరు ఫామ్ హౌస్ లో సెలబ్రేట్ చేసారు. ఈసారి అందుకు భిన్నంగా గోవా బీచ్ లో సెలబ్రేషన్ సాగనుందని గుసగుస వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. గోవా వేడుకలకు చిరుతో పాటు ఎవరెవరు వెళతారు? అన్నది ఇప్పటికి సస్పెన్స్. ఇలా బీచ్ డెస్టినేషన్ ఆలోచన రావడాటానికి కారణమేమిటీ? అంటే.. ఈసారి టాలీవుడ్ లో నిరవధిక బంద్ కొనసాగుతుండడంతో తారలకు తీరిక సమయం చిక్కింది. హీరోలంతా ఇటీవల షూటింగుల్లేక వెకేషన్ మోడ్ లో ఉన్నారు. అందుకే చిరు కూడా ఇలా వైవిధ్యంగా ప్లాన్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగా హీరోలంతా గోవా బీచ్ పార్టీలో ఫుల్ గా సెలబ్రేషన్ మోడ్ లోకి వెళతారని ఇప్పటికి ఊహిస్తున్నారు. కానీ దీనికి అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పుట్టినరోజు కానుకగా తమకు అన్నయ్య నుంచి చాలా కానుకలు అందుతాయని కూడా ఆశిస్తున్నారు. చిరు నటిస్తున్న గాడ్ ఫాదర్ – భోళాశంకర్ సహా ఇతర సినిమాల నుంచి కొత్త పోస్టర్లు.. టీజర్లను ఆశిస్తున్నారు. చిరు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల 4K రీమాస్టర్డ్ వెర్షన్ లు కూడా విడుదలవుతాయని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఘరానా మొగుడు 4కే వెర్షన్ రెడీ అయ్యిందన్న వార్తల నడుమ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అయితే చిరు ఈసారి బర్త్ డే వేడుకలకు హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉంటారా? ఉండరా? అన్నది ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి. టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి అందుకు భిన్నంగా సింప్లిసిటీని కోరుకుంటారన్నది తెలిసిందే. చాలా అరుదుగా మాత్రమే విదేశాల్లో ఆయన బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. ఎన్నో పుట్టినరోజులను హైదరాబాద్ లోని తన స్వగృహంలో జరుపుకునేందుకు ఆసక్తిని కనబరిచారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన 67వ పుట్టినరోజు ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం ఆగస్టు 22న ఈ మెగా ఉత్సవాల కోసం అభిమానులు భారీ ఏర్పాట్లలో ఉన్నారు.
సీఎం జిల్లా పర్యటనలంటే అధికారులతో సమీక్షలనే ఇప్పటిదాకా జనానికి తెలిసింది! ఏదో బంగళాలో కూర్చొని.. ఆదేశాలు జారీచేస్తారనే పత్రికల్లో చదివింది! కనిపించని అద్దాల కారుల్లో కూర్చొని రయ్య్‌న దూసుకుపోయే కాన్వాయ్‌లే మొన్నటిదాకా కనిపించినది! అదపాదడపా ఎంపిక చేసిన కొద్దిమందితో నమస్కారాలు.. వినతిపత్రాల స్వీకరణలకే ఇన్నాళ్లూ పరిమితమైంది!! కానీ.. ఆ అభిప్రాయాలను.. పటాపంచలు చేశారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు! జననేత అంటే ఏమిటో నిరూపించిన సీఎం.. జనంవద్దకే వెళ్లారు! -పేదల మధ్యకు ప్రజానేత -కలిసి కూర్చొని.. బాధలు ఆలకించి..సమస్యల పరిష్కారానికి తక్షణ ఉత్తర్వులు -మేడారాన్ని తలపిస్తున్న సీఎం పర్యటన -రెండో రోజూ మురికివాడలకు కేసీఆర్ -మరో రెండురోజులూ వరంగల్‌లోనే -పునాదిరాయి వేసే తిరిగివెళ్తానని వెల్లడి -పది కోట్లతో అర్చక భవన్‌కు హామీ -భూపాలపల్లి నియోజకవర్గంపై వరాలజల్లు -రాజకీయ పునరేకీకరణకు పిలుపు జనంలోకి వెళ్లటమంటే.. జనంలో ఒకడిగా కూర్చొని.. ఇంటి పెద్దగా వారి సాదకబాధకాలు ఆలకించి.. పరిష్కారానికి అప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడమేనని కొత్త నిర్వచనం చెప్పారు! ఈ అపురూప సన్నివేశాలతో వరంగల్ జిల్లా రెండోరోజూ పులకించిపోయింది. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం.. శుక్రవారం కూడా మురికివాడల పర్యటనలతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మురికివాడల్లేని వరంగల్‌ను ఆవిష్కరిస్తానని ప్రతినబూనారు. నడవడానికీ దారుల్లేని ఆరు మురికివాడలను ఆదర్శ.. అధునాతన కాలనీలుగా మార్చుతానని భరోసా ఇచ్చారు. ఆ కాలనీలకు దగ్గరుండి శంకుస్థాపన చేయించి మరీ జిల్లా దాటుతానని ప్రకటించారు. శని, ఆదివారాలు కూడా నగరంలోనే ఉండి.. చెప్పిన కార్యక్రమాలు పూర్తిచేసుకుని మరీ వెళతానని స్పష్టం చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే సమస్యల అంతు చూద్దాం. మనకేం కావాలో.. అవి ఎట్లా మనదగ్గరికి రావాలో.. ఇన్నాళ్లు ఎందుకు రాలేదో చూద్దాం.. అవో మనమో తేల్చుకుందాం అంటూ పంతం పట్టారు. సీఎం పర్యటన.. నాలుగు రోజులపాటు సాగే మేడారం జాతరను గుర్తు చేస్తూ.. అభివృద్ధి జాతరగా కొనసాగుతున్నది! బిజీబిజీగా సీఎం: జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం సీఎం బిజీబిజీగా గడిపారు. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన తన జనమమేకం.. రాత్రి పొద్దుపోయే దాకా.. ఎక్కడా అలసట లేకుండా కొనసాగింది. క్షణక్షణం జనం పక్షం వహించిన సీఎంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త చరిత్రను ఓరుగల్లులో లిఖించారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక జిల్లాలో వరుసగా నాలుగు రోజులు ఉండి జనం సమస్యలు తీర్చేదాకా ఇక్కడినుంచి కదలనని, సమస్యల అంతు చూసిన తరువాతే రాజధానికి వెళతానని ప్రకటించిన దాఖలాలులేవు. పునాది రాయి వేసే వెళతా ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా రెండో రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని దీనదయాళ్ నగర్, ప్రగతినగర్, అంబేద్కర్ నగర్ మురికివాడల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలను కలియదిరిగారు. జనం సమస్యల్ని ఓపిగ్గావిన్నారు. వారి ఇండ్లలోకి వెళ్లారు. వారితో మమేకం అయ్యారు. ఇండ్లు లేనివారికి ఇండ్లు కట్టిస్తా. అడ్వకేట్స్ కాలనీల్లా అన్ని సదుపాయాలుండే బస్తీలుగా మారుస్తా. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు. ఇప్పుడు ఎలక్షన్లు లేవు. ఎలక్షన్లు వచ్చినపుడు చూసుకుందాం. ఇప్పుడైతే మన బతులు బాగు చేసుకునే ఉపాయం ఆలోచిద్దాం. సమస్యలపైనే ఇప్పుడు యుద్ధం. వరంగల్ టౌన్‌లో 150నుంచి 160 స్లమ్స్ ఉన్నాయి. స్లమ్‌లెస్ సిటీగా వరంగల్‌ను తీర్చిదిద్దుకుంటాం. వన్ ప్లస్ వన్‌గా మంచి ఇండ్లు కట్టుకుందాం. దానికి మీరందరూ సహకరించాలి. ఇవ్వాళ ఇల్లు కట్టాలంటే కనీసం నాలుగు లక్షలు కావాలి. నేను అధికారులతో మాట్లాడి అన్నీ ఏర్పాట్లు చేస్తా. ఎల్లుండి నేనే దగ్గరుండి కొత్తకాలనీకి పునాది రాయి వేసే ఇక్కడి నుంచి పోత. ఆ సంగతేందో తేల్చుకుందాం. మీరు రేపు, ఎల్లుండి ఎక్కడికీ పోవద్దు. మీ దగ్గరికే అధికారులు వస్తరు. మీ ఇంటి ముందట ఫొటోలు తీస్తరు. రిజిస్టర్‌లో రాస్తరు. కాలనీ కమిటీ ఒకటి వేస్తరు. మన బతుకులు బాగు పడాలంటే కొంచెం టైం పడ్తది. అప్పటిదాకా ఓపిక అవసరం అని ఆయన కాలనీ వాసులకు తన ఆలోచనలు వివరించి.. నిర్ణయాలను వెల్లడించారు. ప్రగతినగర్‌లో, అంబేద్కర్ నగర్‌లోనూ ఇదే రీతిగా మురికివాడల్లో కలియదిరిగారు. అర్హులైనవారికి పింఛన్లు ఇచ్చే పోతానని విస్పష్టంగా ప్రకటించారు. అక్కడి నుంచి అర్చక సమాఖ్య నిర్వహించిన సదస్సుకు హాజరైన సీఎం.. హైదరాబాద్‌లో పది కోట్ల రూపాయలతో అర్చక భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని ఆరు వేలకు పెంచుతామని ప్రకటించారు. భూపాలపల్లిపై వరాల జల్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి నియోకవర్గంపై సీఎం వరాలజల్లు కురిపించారు. ఇంత పెద్ద నియోజకవర్గానికి డివిజన్ కేంద్రం లేదా? డివిజన్ కేంద్రానికి పోవాలంటే 60కిలోమీటర్లు పోవాలా? ఇదెక్కడి పాలన? కలెక్టర్ రేపటిలోగా నాకు డివిజన్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపితే.. వెంటనే రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తా అని చెప్పారు. రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగాలి రాష్ట్ర పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణ సాధనలో పార్టీలకతీతంగా అందరు కలిసి రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ శక్తుల పునరేకీరణ జరగాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. కలెక్టరేట్‌లో మూడు గంటలపాటు సమీక్ష కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సీఎం సమాలోచన చేశారు. రోడ్లు, గృహ నిర్మాణాలు, పింఛన్లు, ఆహార భద్రతకార్డులు తదితర అంశాలపై మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిపారు. ముఖ్యంగా రెండు రోజులుగా మురికివాడలను తిరిగిన సీఎం.. అక్కడి ప్రజల స్థితిగతులు, మౌలిక సదుపాయలను స్వయంగా తెలుసుకున్నారు. ఆ సమయంలో ప్రజలు మొరపెట్టుకున్న కష్టాలు తీర్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
దీపావళి సంబరాలు ముగిసీ ముగియగానే, నాగులచవితి వస్తుందని సంబరం మాకు.దీపావళినాడు దివిటీలు కొడుతూ, పాడనే పాడేము "దిబ్బూ దిబ్బూ దీపావళి- వెంట వచ్చే నాగులచవితి"అని. నాగులచవితంటే ఎందుకంత ఇష్టమంటే, పుట్టలో పాలు పొయ్యాలని కాదు,మా పొట్టలకు పాలు ఇస్తున్న, మా లోబీడు పొలంలోని ఆవులను చూడవచ్చని,వాటి తువ్వాయిలతో ఆడుకోవచ్చని.జామచెట్లెక్కవచ్చని,నారింజలు తెంపవచ్చని,కాలు సాగినంతమేల పరుగులు తీయొచ్చని. అమ్మ నాగులచవితి ముందురోజే కుంచాలాదిగా, నువ్వుపప్పు చిమ్మిలి,బియ్యం చలిమిడి కుమ్మించేది పాలికాపులచేత. చవితినాడు ఉదయాన్నే అమ్మా,పిన్నీ పుట్టలోవేయడానికి వాళ్ళే చిమ్మిలీ ,చలిమిడీ మడిగా చేసుకొనేవారు. చవితినాడుదయాన్నే తలకి స్నానాలు చేసి ,మడిబట్టలు కట్టుకొని ,దేన్నీ ముట్టుకోకుండా కూర్చుటే, "పిల్లల్లారా! జాగ్రత్త సుమీ,నోట్లో ఏమన్నా వేసుకొన్నారుకనుక,పుట్టలో పాలుపోసేదాకా ఏమీ కక్కూర్తి పడకండని "అడుగడుగునా హెచ్చరిస్తూనే వుండేది అమ్మ. కాసేపటికో,కూసేపటికో మరిడయ్యో,అప్పన్నో,దొంగబ్బాయో,రాజులో ఎవరో ఒకరు మైసూరెద్దుల టైర్ బండి తోలుకొచ్చేవారు. అమ్మా పిన్నీ ,చలిమిడీ,చిమ్మిలీ, పాలు ,వత్తీ పత్తీ ,అక్షింతలు వైగారా పూజాసామాగ్రి, ,ప్రసాదాలు అన్నిజాగ్రత్తగా సర్దుకొని బండెక్కేవారు.వాళ్ళిద్దరి మడికీ ,మా పిల్లల మడిమీద నమ్మకముండేదికాదు.అందుకని వాళ్ళని తగలకుండా "దూరం దూరం "అనేవారు. బండి లోబీడులో చేరిందంటే మా సంబరం అంబరాన్నంటేది.బండి మకాంలో ఆగీ ఆగగానే, దూకేసి పరుగులే పరుగులు తీసేవారం పిల్లలందరం ఆవుదూడలదగ్గరకి.అవి మమ్మల్నిచూసి ,తోకలెత్తుకొని పరుగులు తీస్తుంటే, మేము వాటి వెనకాలపడేవాళ్ళం. అక్కడక్కడా కాలికి ఏపుల్లముక్కో,మట్టిగడ్డో అడొచ్చి బోర్లాపడ్డా, మోకాలికి దెబ్బతగిలినా,అటూ ఇటూ చూసి, గుండెలమీద మూడుసార్లు దబదబా చరుచుకొని,మట్టితీసి పడిన చోటమట్టితీసి బొట్టెట్టేసుకొని, అక్కడదింత మట్టి తీసిదెబ్బకి రాసేసుకొని, మళ్ళీ దౌడు తీసేవాళ్ళం. ఈలోపులో పాలికాపులు పుట్ట వెతికి,దానిచుట్టుపక్కలంతా చక్కగాపారతో చెక్కి శుభ్రంచేసి,పాలు పొయ్యడానికి వీలుగా చేసేవారు. అమ్మ పుట్ట చుట్టూ పసుపునీళ్ళుచల్లితే పిన్ని పిండితో ముగ్గు పెట్టేది. అమ్మ తనముందు తరాలవాళ్ళని తలచుకొని, రావయ్యమ్మ కొలిచిన నాగన్నా, బాపనమ్మ కొలిచిన నాగన్నా,బానమ్మ కొలుస్తున్న నాగన్నా, సుందరమ్మ కొలుస్తున్న నాగన్నా,"అంటూ, ఇద్దరూ మంత్రాలు చదువుతూ పూజచేసేసి,పాలు పుట్టలో పోసి, పిసరంత పిసరంత చలిమిడీ,చిమ్మిలీ పుట్టలో వేసేసి,ఆవుపాలుకూడా అమ్మా పిన్ని పుట్టలోపోసొసాకా,అప్పుడు మా పిల్లమూకని పేరు పేరునా పిలిచి పుట్టలో పాలు పోయించి, చిమ్మీలీ చలిమిడీ వేయించేవారు. నిజానికి మాకు ఆ పుట్టను చూస్తే, భయంతో కూడిన భక్తి వుండేది.ఎందుకంటే, పుట్టలోంచి పామెక్కడ" బుస్స్" మంటూ పైకెక్కడ వచ్చేస్తుందోనని బిక్కు బిక్చుమంటూ వుండేవాళ్ళం. అమ్మ మా అందరిచెేతా ఇలా చెప్పించేది,"నాగేంద్రుడా తండ్రి!పడగ తొక్కితే పసివాళ్ళనుకో .నడుంతొక్కితే ,నావాళ్ళనుకో.తోక తొక్కితే తొలగిపోతండ్రీ! నూకలిస్తాను నీకు -మూకనియ్యి మాకు తండ్రీ!అని మా అందరిచేతా అనిపించేది.అర్థరాత్రీ,,అపరాత్రీ గొడ్డూ గోదా తిరుగుతాయి తండ్రీ !చల్లగాచూడు తండ్రీ!"అని మళ్ళీ వేడుకొనేది.పుట్టమన్ను తీసి చెవితమ్మెలకి రాసుకొని,చెవిపోటు రానీకు తండ్రీ!అంటూ దణ్ణం పెట్టుకొమ్మనేది మమ్మల్ని.ఆతరువాత నాగులపంచె పుట్టమీదకప్పేది. అంతా బాగానే వుందికానీ,చిమ్మిలెప్పుడు చేతిలోపడేస్తుందా, అని ఎదురుచూసే ,మా పిల్లల ఎదురు చూపులకు అప్పుడు ఫలితందక్కేది. పాపం మా మణిచెల్లీ ,వల్లి చెల్లీ అమ్మ అనమన్నవి అంటున్నా,వాళ్ళచూపులు మాత్రం చిమ్మిలి బుట్టమీదే వుండేవి.మణికైతే మరీను, నోట్లో నీరూరిపోతుంటే దానికి కంట్రోల్ చేసుకొడానికి మరీ కష్టపడవలసి వచ్చేది."పిల్లల్లారా! ఇంకోపూజా ,ఇంకోపూజా కాదు కాస్తంత కక్కూర్తిపడడానికి.నాగేంద్రుడితో వ్యవహారమిది" అంటూ అమ్మ హెచ్చరించేది. మొత్తానికి దబ్బకాయంతంత చిమ్మిలి ,చలిమిడి ముద్దలు చేతిలో పడేవి మా అందరికీ, అక్కడ వున్న పాలికాపులతోసహా. పైరు గాలులను,పాడి ఆవులను, బుజ్జి తువ్వాయిలను వదలలేక వదలలేక బండెక్కేవాళ్ళం పిల్లలం .దారిపొడుగునా ,""కాత్తంత పెసాదమెట్టండి,కూసింత పెసాదమెట్టండి."అని అడిగినవాళ్ళకు ,అడగని వాళ్ళకు ముందురోజు పాలికాపులచేత కుమ్మించిన చలిమిడి,చిమ్మిలి దబ్బకాయలంతంత ముద్దలు వాళ్ళచేతిలో పడేసేది అమ్మ. అలా తీసుకొన్నవాళ్ళు పరుగు పరుగున వెళ్ళి,మరింతమందిని బండిదగ్గరకు పంపించేవారు.ప్రసాదం తగ్గిపోతే, ఐపోయిందనకుండా,నోటితో లేదనేది చేతితో లేదన్నట్లు అందులో అదులోనే అందరికీ సర్దేది అమ్మ. ఇంటికి వచ్చాకా అమ్మా,పిన్నీ ఉపవాసమని ప్రసాదాలు తింటుంటే,వాళ్ళ ఆకులో వున్న చిమ్మిలిని ,చలిమిడినీ చూసి,"హమ్మో!అంతంతే?"అంటూ గుండెలమీద చెయ్యేసుకొనే మాచెల్లాయి వల్లిని చూసి,"ఆకు మూతేసుకో ఓవిడా! పిల్లలకు కనపడకుండా" అని తోడికోడళ్ళిద్దరూ గలగలా నవ్వుకొంటూ,ప్రసాద పారాయణం కానిచ్చేవారు. కామెంట్‌లు addComments కామెంట్‌ను పోస్ట్ చేయండి Popular posts మా పల్లె;- సి.హెచ్.అలేఖ్యా రెడ్డి. 10.తరగతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇందిరా నగర్--సిధ్ధిపేట. డిసెంబర్ 02, 2022 • T. VEDANTA SURY చిత్రాలు ; ఏ. రోహిత్, 10వ తరగతి సెక్షన్ 'డి' జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్, సిద్దిపేట. సెల్ 8074816345
హైదరాబాద్‌ : రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేస్తామని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్న సర్కారు.. కార్యాచరణ మాత్రం చేపట్టడం లేదు. దీంతో కోచింగ్‌ సెంటర్లలో చేరిన నిరుద్యోగులు నెలల తరబడి కోచింగ్‌ తీసుకుంటూనే ఉన్నారు. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి విసిగిపోయిన కొందరు నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనలూ చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఖాళీలు భర్తీ అయితే తమకు పనిభారం తగ్గుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. ఖాళీల భర్తీ ఎప్పటినుంచి ప్రారంభిస్తారన్న అంశాన్ని తేల్చడంలేదు. అయితే ఉద్యోగాల భర్తీ బంతి ఇప్పుడు సీఎం కేసీఆర్‌ కోర్టులోనే ఉందని అధికారులు చెబుతున్నారు. ఆయన నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో ఈ అంశంపై వారికే స్పష్టత లేకుండాపోయింది. ప్రతి క్యాబినెట్‌ సమావేశంలోనూ ఉద్యోగ ఖాళీల భర్తీపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా.. అటువంటిదేమీ జరగడంలేదు. వాస్తవానికి ఉద్యోగాల భర్తీ అంశం ఈ ఏడాది జూలై నుంచి ఎక్కువగా చర్చకు వస్తోంది. జూలై 13న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై చర్చించారు. అనంతరం ఏడాదిపాటు నోటిఫికేషన్లు జారీ చేసేలా ‘వార్షిక జాబ్‌ క్యాలండర్‌’ రూపొందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అప్పటికే అధికారులు గుర్తించిన ఖాళీల వివరాలను క్యాబినెట్‌కు సమర్పించారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో కలిపి 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. కానీ, దీనిపై సీఎం సంతృప్తి చెందలేదు. శాఖలు, జిల్లాలవారీగా పూర్తి వివరాలు సేకరించి నివేదించాలని ఆదేశించారు. దాంతో అధికారులు మళ్లీ కుస్తీ పట్టి.. రాష్ట్రంలో మొత్తం 67,128 పోస్టులు ఖాళీగాఉన్నాయని ప్రాథమికంగా తేల్చారు. ఈ వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయంలో సమర్పించారు. సీఎం ఆదేశాల కోసం నిరీక్షణ.. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వస్తే తప్ప.. ఉద్యోగ ఖాళీల భర్తీ విషయంలో తాము ముందుకు వెళ్లలేమని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఖాళీల వివరాలు, జాబ్‌ క్యాలండర్‌ను సీఎంవోలో అందజేసినా.. ముఖ్యమంత్రి ఎటూ తేల్చకపోవడంపై నిరుద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. సెప్టెంబరు 16న జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయం తీసుకుంటారని ఆశించారు. సమావేశంలో ఈ అంశం చర్చకు కూడా వచ్చింది. 50 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటన కూడా చేశారు. కానీ, ఎలాంటి ముందడుగు పడలేదు. ఓసారి ఉద్యోగ సంఘాల నేతలు కలిసినప్పుడు… ఉద్యోగుల సర్దుబాటు జరుగుతోందని, జిల్లాలు, జోన్లవారీగా ఖాళీలను పూర్తి స్థాయిలో గుర్తించి ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం భరోసా ఇచ్చారు. మరోసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్రంలో 70-80 వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు వస్తాయని అన్నారు. కానీ, ఆ తరువాత దీని ప్రస్తావనే లేకుండాపోయింది. నవంబరు 29న జరిగిన క్యాబినెట్‌ భేటీలోనైతే ఉద్యోగాల భర్తీ అంశం చర్చకు కూడా రాలేదు. విద్యాశాఖలో 22 వేల టీచర్‌ పోస్టుల ఖాళీలు.. రాష్ట్రంలో అన్ని శాఖల కంటే విద్యాశాఖలోనే ఎక్కువ ఖాళీలున్నాయి. ఏకంగా 22 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ ఇటీవల ప్రకటించింది. ఇతర శాఖల్లో గుర్తించిన 67 వేల పోస్టులు కాకుండానే విద్యాశాఖలో 22 వేల ఖాళీలు తేలాయి. మొత్తం మంజూరైన టీచర్‌పోస్టులు 1.31 లక్షలు ఉండగా, ప్రస్తుతం 1.09 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. మిగిలిన 22 వేల పోస్టులను భర్తీ చేసే విషయంపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టడంలేదు. హేతుబద్ధీకరణ పేరుతో కొన్ని పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేసే ఆలోచనలో ఉంది. ఉపాధ్యాయులను కూడా హేతుబద్ధీకరించాలని సర్కారు యోచిస్తోంది. గురుకులాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నందున.. ప్రభుత్వ పాఠశాలల ఆవశ్యకత పెద్దగా లేదన్న ధోరణిలో ఉంది. అందుకే ఉపాధ్యాయ పోస్టులను ఇప్పట్లో భర్తీ చేయకపోవచ్చని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. 29 లక్షల మంది నిరుద్యోగులు.. తెలంగాణ ఆవిర్భావం నుంచి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కొత్త రాష్ట్రంలో కొలువులు వస్తాయని ఆశ పడ్డా.. ఊహించిన స్థాయిలో నోటిఫికేషన్లు వెలువడలేదు. ప్రభుత్వం మాత్రం 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామంటోంది. ఇందులో పోలీసు శాఖ పోస్టులు 30 వేలు, విద్యుత్తు శాఖలోని ఆర్టిజన్‌ పోస్టులు 24 వేలు, పంచాయతీరాజ్‌ శాఖలోని పంచాయతీ సెక్రటరీ పోస్టులు 9,355 వరకు ఉన్నాయి. అంటే… ప్రభుత్వం భర్తీ చేశామని చెబుతున్న 1.30 లక్షల పోస్టుల్లో 63 వేలకు పైగా ఈ పోస్టులే ఉన్నాయి. ఇతర శాఖల్లోని ముఖ్యమైన పోస్టులు భర్తీ కాలేదు. ముఖ్యంగా జిల్లాల్లో ఉండే జూనియర్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌, అటెండర్‌ వంటి కింది స్థాయి పోస్టులు భర్తీ కాలేదు. ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి విభాగాధిపతుల కార్యాలయాల్లో(హెచ్‌వోడీ) పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు వెలువడక దశాబ్దం పైగా గడిచిపోయింది. ఇలా ఎప్పటికీ పోస్టులు భర్తీ కాకపోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎ్‌సపీఎస్సీ)లో ‘వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌’ కింద నమోదైన నిరుద్యోగుల సంఖ్యే 24,82,888 వరకు ఉంది. ఇంకా రిజిస్ట్రేషన్‌ చేసుకోనివారి సంఖ్య చాలా ఉందని నిరుద్యోగ సంఘాలు వివరిస్తున్నాయి. దాదాపు 29 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని చెబుతున్నాయి.
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది 27, జనవరి 2019, ఆదివారం మీ ఏడుపు మీరేడవండి...!! మీ దృతరాష్ట్ర ప్రేమ మాకు వద్దు.... గత నాలుగునర్ర ఏళ్ళుగా తెలంగాణా వాదుల గురించి కాని, కే సి ఆర్ గురించి ఏమి మాట్లాడని నేను, మీ ప్రాంతీయతను గౌరవించడమే కారణం. ప్రాంతీయతాభిమానం అందరికి ఉండటంలో తప్పులేదు, ఉండాలి కూడా. చంద్రబాబు దగ్గినా తుమ్మినా అదో పెద్ద నేరంగా చూసే మీలాంటి వారికి దత్తత తీసుకున్న గ్రామాలు, పేర్లు ప్రభుత్వ సొమ్ముతో అభివృద్ధి అని అనుకోవడంలో మీ వక్రబుద్ది తెలుస్తోంది. మాకు అలా అయినా అభివృద్ధి జరుగుతోంది. యాగాల మూలంగా మీకొరిగింది ఏమిటి..? ఎదుటివారి కొంపలో ఏం జరుగుతోందని కాకుండా మీ కొంప తగలకుండా చూసుకునేడవండి... మీరు, మీ కే సి ఆర్ ఎలా పోయినా మాకనవసరం. మీ అందరి మాటలకే మేము స్పందించాల్సి వస్తోంది. ఏం నష్టపోయామెా, పోతున్నామెా మాకు తెలుసు. మీ ప్రాంతీయాభిమానమే మాకూ ఉంటుంది. మీకు మీ కే సి ఆర్ కి తేడా ఏం లేదు. మాటకు పది మాటలు సమాధానం చెప్పగలం. ఇన్నాళ్లు మీ గురించి మేమేం అనలేదు, కానీ మీరు రెచ్చగొడుతూనే ఉన్నారు. అందుకే సమాధానాలు చెప్పక తప్పదు. ఊరుకుంటామని అనుకోకండి...వ్యక్తి విలువలు దిగజార్చుకోకండి. తప్పును చూపడం తప్పులేదు. తప్పుడు మాటలు, చేష్టలు వద్దు. ముందు మీ లోపాలు మీరు చూసుకోండి మాతో చెప్పించుకోకుండా.... అన్ని అమర్చితే అనుభవించడము కాదు. కనీసం నిలబెట్టుకోండి చాలు. ఇంకేమైనా కావాలంటే అడగండి... మాకు లేకపోయినా పర్లేదు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది ఆంధ్ర ప్రదేశ్ అంటే ... మైండిట్
BRO Jobs 2022: టెన్త్/ఇంటర్‌ అర్హతతో బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లో 246 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. BRO Recruitment 2022: బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లో 246 కేంద్ర కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల.. అర్హతలేవంటే.. కెరీర్ & ఉద్యోగాలు BRO Recruitment 2022: పదో తరగతి అర్హతతో.. బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లో 1178 పోస్టులకు నోటిఫికేషన్‌.. కెరీర్ & ఉద్యోగాలు BRO MSW Recruitment 2022: బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లో 876 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు.. కెరీర్ & ఉద్యోగాలు Naveen Chandra : ఆకట్టుకుంటున్న “బ్రో” మూవీ.. నవీన్ చంద్ర ఖాతాలో హిట్ పడ్డట్టేనా.. ఎంటర్టైన్‌మెంట్ BRO Recruitment 2021: బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ (BRO)లో 459 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. దరఖాస్తు చేసుకోండిలా..
బాలీవుడ్ ప్రముఖ గాయని నేహా కక్కర్ తాజాగా ఓ సజ్నా అనే సూపర్ హిట్ సాంగ్ రీ క్రియట్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాటకు నెగిటివ్ టాక్ వచ్చింది. సూపర్ క్లాసిక్ సాంగ్ ను నాశనం చేశారు అంటూ నేహా కక్కర్ ను తీవ్రంగా విమర్శిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలోనే కాకుండా యూట్యూబ్ లో కూడా రచ్చ రచ్చగా వివాదం చెలరేగుతోంది. నేహా కక్కర్ తో పాటు ఈ పాటలో ప్రియాంక్ శర్మ మరియు ధనశ్రీలు కనిపిస్తున్నారు. పాట చిత్రీకరణ అంతా బాగానే ఉన్నా కూడా పాటను పాడిన తీరు మాత్రం అస్సలు బాగా లేదని చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ పాట గురించి విమర్శలు చేస్తున్న జనాలతో పాటు ప్రముఖ గాయని ఫాల్గుణి పాఠక్ కూడా కాస్త సీరియస్ గానే స్పందించింది. ఆ పాటకు సంబంధించిన లీగల్ హక్కులు నా వద్ద ఉండి ఉంటే తప్పకుండా పాటను ఇలా పాడు చేసినందుకు గాను చట్టపరమైన చర్యలు తీసుకునేదాన్ని అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింతగా రాజేసినట్లుగా అయ్యింది. ఇప్పుడు వివాదం ఇద్దరు సింగర్స్ మధ్యకు వెళ్లి పోయింది. సోషల్ మీడియా జనాల బ్యాడ్ కామెంట్స్ మరియు విమర్శలకు నేహా కక్కర్ కాస్త సీరియస్ గానే స్పందించింది. ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే ఇంత తక్కువ వయసులో ఇంత మంది అభిమానం ను దక్కించుకుంటారు. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు నన్ను అభిమానిస్తున్నారు... వారు నా యొక్క పాటలకు ఆనంద పడుతున్నారు. నా ప్రతిభ మరియు నా యొక్క కృషి గురించి ఎవరు అనుమానం వ్యక్తం చేయనక్కర్లేదు. నేను కెరీర్ లో సక్సెస్ అవ్వడంను తట్టుకోలేని వారు... నేను సంతోషంగా ఉండటం చూసి ఓర్వలేని వారు మాత్రమే నా పై బ్యాడ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారంటూ నేహా కక్కర్ ఆవేదన వ్యక్తం చేసింది. దేవుడి ఆశీర్వాదం నాకు ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇండియన్ ఐడల్ లో జడ్జ్ గా వ్యవహరించడం ద్వారా నేహా కక్కర్ కి దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ దక్కింది.
మన దైనందిక జీవనంలో వచ్చే సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారాలను చూపించటం అంత సులభమైన పని కాదు. అతి కొద్ది మందికి మాత్రమే- సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారాలను చూపించగలిగే ఓర్పు, నేర్పు... అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 మన దైనందిక జీవనంలో వచ్చే సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారాలను చూపించటం అంత సులభమైన పని కాదు. అతి కొద్ది మందికి మాత్రమే- సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారాలను చూపించగలిగే ఓర్పు, నేర్పు ఉంటాయు. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ ప్రవచనకర్త బి.కె. శివానీ. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆధ్యాత్మిక ప్రవచనకర్తల్లో ఒకరు. హిందీ, ఇంగ్లీష్‌ ఛానల్స్‌, సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న శివానీ ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.. విద్యార్థి దశ నుంచే పిల్లల జీవితంలో సత్ప్రవర్తన ఒక భాగం అవ్వాలి. అలాగని ఇది బాల్యదశ కు మాత్రమే పరిమితమైనది కాదు. ఆధ్యాత్మికత పురోగమనానికి వయసు ఏమాత్రం అడ్డంకి కాదు. ఏ వయసు వారికైనా ఆధ్యాత్మిక పురోగమనం అవసరమే. ఈ తరం యువత ప్రతిదీ తర్కబద్ధంగా ఆలోచించడంతో పాటు... తక్షణ ఫలితాలు కోరుకుంటోంది. వారిని ఆధ్యాత్మికత వైపు ఆకర్షించడం ఎలా? తమ అసలైన వ్యక్తిత్వాన్ని ఎరుకలోకి తెచ్చుకోవడమే ఆధ్యాత్మికత. ఒక్క క్షణమైనా తమ అసలైన వ్యక్తిత్వాన్ని ఉనికిలోకి తెచ్చుకోగలిగితే... వారు ఆధ్యాత్మిక పథంలో ఉన్నట్టే. అసూయలాంటి అసురీ గుణాలు ఒక్క క్షణం మనసులో కదలాడినా... ఆధ్యాత్మికంగా లేనట్టే. సరళంగా చెప్పాలంటే మంచి సంస్కారాలు, మానసిక పరిపక్వతలే ఆధ్యాత్మికత. నేటి జీవితంలో ప్రతి ఒక్కరికీ కావాల్సింది ఇదే. మీరు బాలలు అయినా, కీలక బాధ్యతలు నిర్వరిస్తున్న ఉద్యోగులు అయినా మంచి సంస్కారాలతో కర్తవ్య నిర్వహణ చేయడమే ఆధ్యాత్మికత. మంచి సంస్కారాలు అలవడినప్పుడే మనిషి మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆ స్థితిని అందుకున్నప్పుడు మాత్రమే మనం ఏ రంగంలో అయినా విజయం సాధించగలం. మనుషులందరూ ఆధ్యాత్మికులే. కానీ అది వారి అనుభవంలోకి రావడంలేదు. అందుకే ఏదో ఒక సంప్రదాయాన్ని అనుసరిస్తూ, దానికి తగ ్గ వేషధారణ చేసుకుంటూ... దాన్నే ఆధ్యాత్మికతగా భ్రమపడుతున్నారు. ప్రజల్లో మానసిక సమస్యలు బాగా పెరిగాయి. ఇప్పుడు దాని నివారణపైనే ప్రపంచం తక్షణం దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మానసిక రుగ్మతలను ఎలా తగ్గించాలో, నివారించాలో చెప్పడానికి మనకు వైద్యులు, విజ్ఞానశాస్త్రం ఉన్నాయి. కానీ బాల్యం నుంచి దృఢమైన వ్యక్తిత్వం అలవడితే మానసిక సమస్యలు బాధించవు. గ్రామీణ ప్రాంతాల్లో బాలలు శారీరకంగా, పట్టణ ప్రాంతాల బాలలు మానసికంగా రాటుదేలాల్సిన అవసరం ఉంది. తల్లితండ్రులు, విద్యావ్యవస్థ ఈ బాధ్యత తీసుకోవాలి. పిల్లలు స్కూల్లో సాధించిన విజయాలకు తగిన గుర్తింపు దక్కుతోంది కానీ వారి సత్ప్రవర్తన మాత్రం ఎక్కడా లెక్కలోకి రాదు. అందుకే ప్రతి విద్యార్థి దృష్టి ఏదోలా సక్సెస్‌ అవ్వడంపైనే ఉంది తప్ప మంచి గుణాలను పెంపొందించుకోవడం మీద లేదు. గుర్తింపు, ప్రశంసలకు సంస్కారం కూడా ఒక కొలమానం అయితే అప్పుడు ప్రతి విద్యార్థి దానిమీద దృష్టి సారిస్తాడు. ఆ గుణాలను పెంపొందించుకుంటాడు. ఈ దిశగా బాల్యంలోనే బీజాలు పడాలి. 1980-2000 మధ్య పెరిగిన తరం ఆధ్యాత్మికంగా అగమ్యమైన స్థితిలో పడింది కదా... 80ల్లో మనం చాలా సాధారణ జీవితం గడిపాం. ఉదయం పనికి వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్లం. ఇక అంతే... మళ్లీ పని వ్యవహారమే ఉండేది కాదు. పెందలాడే తిని, త్వరగా నిద్రపోయే వాళ్లం. ప్రతిదీ సహజంగా, ఆరోగ్యకరమైన శైలిలో ఉండేది. ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేకపోయింది. 90 దశకం చివరికల్లా కంప్యూటర్లు, టీవీలు, ఫోన్‌ ల రాకతో జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనుషులకు వాటితో గడపడానికే సమయం సరిపోవడం లేదు. ఇక తమకోసం ఎక్కడ సమయం కేటాయిస్తారు? ఆలస్యంగా ఇంటికి రావడం, ఫోన్‌, ల్యాప్‌టా్‌పలు ముందు వేసుకొని మళ్లీ పనిలో మునిగిపోవడం... అర్థరాత్రి మెలకువ వస్తే, ఫోన్‌ చెక్‌ చేసుకుంటున్నారు. ‘ఆదివారం’ అనే కాన్సెప్టే లేదు. మనిషి మెదడుకు విశ్రాంతి లేకుండా పోయింది. 365 రోజులూ మనిషి పనితో కుస్తీ పడుతున్నాడు. ఫోన్‌, ల్యాప్‌టా్‌పతో గడపడం నిద్ర నాణ్యతను దెబ్బతీస్తోంది. దీనివల్ల శరీరం, మనస్సు... రెండూ దెబ్బతింటున్నాయి. టెక్నాలజీ మన జీవితాలకు ఎలాంటి హాని చేయడం లేదు. కానీ దాన్ని మనం వాడుతున్న విధానం సరైనది కాదు. ఎలక్ర్టానిక్‌ వస్తువులు మన జీవితాలు మరింత సౌకర్యవంతం అవ్వడానికి తయారుచేశారు. వాటి వాడకం మన నియంత్రణలో ఉండాలి. ఇంటికి వచ్చాక గాడ్జెట్లను పక్కనపెట్టాలి. ఈ సమస్యను అధిగమించడం ఎలా? గత 20 ఏళ్లుగా మనం చేస్తోన్న పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే ఇదంతా జీవనశైలి మాత్రమే. మనం ఉదయం లేవగానే, నిద్రపోయే ముందు... మనం చేసే పనుల ప్రభావం మనపైన ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ‘ఏం చేస్తున్నాం’ అనేది చాలా ముఖ్యం. మనం సాధారణమైన జీవనశైలిని అనుసరించాలి. పొద్దున్నే లేచి యోగా, ఆధ్యాత్మిక గ్రంఽథాల పఠనం లాంటి అభ్యాసాలు చేస్తే వురింత శక్తి లభిస్తుంది. మీరు రాత్రి ఏడు గంటలకు ఇంటికి వచ్చారనుకుందాం. ఎనిమిదిన్నర కల్లా పనులు పూర్తి చేసుకోవాలి. నిద్రకు రెండు గంటల ముందు వార్తలు, సీరియల్స్‌ చూడకూడదు. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక్క నెగిటివ్‌ పదం కూడా మెదడులోకి పోకూడదు. ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది కూడా ముఖ్యం. గ్యాడ్జెట్లు చూస్తూ తినడం శరీరానికి, మనస్సుకు మంచిది కాదు. శ్రద్ధతో ఆహారం భుజించాలి. జీవితం మీద గొప్ప అవగాహన ఉన్న చివరితరం మనదే అనుకుంటాను. అందుకే మన పద్ధతులను మార్చుకోవాలి. ఎలా జీవించాలో పిల్లలు కూడా తెలుసుకునేలా మన ఆచరణలో చూపించాలి. ఆధ్యాత్మిక సాధనలో భిన్న పంథాలు, విభిన్న మార్గాలు, రకరకాల ప్రబోధాలతో కొత్త తరం కొంత గందరగోళానికి గురవుతోంది. దీన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం సంస్కారవంతుల లక్షణం. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు తప్పక పాటించాల్సిన నైతిక ధర్మం. ఇతరులతో మనకు పొసగకపోవచ్చు. ప్రతి ఒక్కరికి తమ సొంత అభిప్రాయాలు ఉంటాయి. ఇతరుల అభిప్రాయాలు మనకు నచ్చడం లేదంటే దానితో మనం వ్యక్తిగత ంగా విభేదిస్తున్నామని అర్థం. వారితో మనకు వైరుద్ధ్యాలు ఉన్నా, మనం ఏకీభవించలేకపోతున్నా అలాంటి సందర్భాల్లో మనం హుందాగా వ్యవహరించాలి. అసలు నా వ్యక్తిగత అభిప్రాయాన్ని అందరితో పంచుకోవాల్సిన అవసరం ఏముంది? అది ఒకరిపైన నాకున్న దృష్టికోణం మాత్రమే. అదొక అభిప్రాయం మాత్రమే. నిజమో, కాదో కూడా తెలియని దాని గురించి మనం బయటకు మాట్లాడాల్సిన అవసరం ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఒకవేళ మన అభిప్రాయాన్ని చెప్పాల్సి వచ్చినా సుతిమెత్తగా చె ప్పాలి తప్ప పరుషంగా మాట్లాడ కూడదు. మన మాటతీరు అవతలి వ్యక్తిని కించపరిచేలా ఉండకూడదు. ‘నేను నిజం అనుకుంటున్నది ఇదీ’ అని ఎదుటి వ్యక్తికి తెలియజెబుతున్నామా? లేదా వాళ్లను తక్కువ చేసేందుకు విమర్శలు గుప్పిస్తున్నామా? అనే స్పష్టత మనకు ఉండాలి. మన అభిప్రాయానికి, విమర్శకు మధ్య ఓ సన్నని విభజన రేఖ ఉంది. దాన్ని మీరకూడదు. ప్రజలకు ఉపయోగం ఉందనిపిస్తేనే మనం ఏదైనా చెప్పాలి. అప్పుడు కూడా ఎలాంటి వక్రీకరణలు చేయకుండా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే అలాంటప్పుడే మన అహం బయటకు వస్తుంది. దాన్ని అధిగమించడానికి ప్రయత్న పూర్వక సంస్కారాలు కావాలి. మన అంతిమ లక్ష్యం అహంకారం లేని స్థితిని పొందడం. దాని కోసం జరుగుతున్న ప్రయాణం కొనసాగుతోంది. మన కర్మ మరెన్నో కర్మలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనం మరింత బాధ్యతగా ఉండాలి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు బాగా గుర్తుండిపోయే సంఘటన ఏమిటి? ప్రతి రోజూ ఎంతోమందిని కలసి మాట్లాడుతుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతుందో మీడియా మనకు చూపిస్తోంది. కానీ ప్రతి ఇంట్లో ఏం జరుగుతోందో, ప్రజల మనస్సులో ఏముందో మీడియాకు కూడా తెలీదు. ఎదుటి వ్యక్తి నాతో మాట్లాడుతున్నప్పుడు వారి బాధను నాతో పంచుకొంటున్నప్పుడు... అలా వింటూ కూర్చోను. వాళ్ల బాధను అనుభూతి చెందుతాను. ఆ సమయంలో దివ్యమైన జ్ఞాపకాలతో... సరైన వైబ్రేషన్స్‌ను ఎదుటి వ్యక్తికి ప్రసారం చేయాలి. వాళ్లు మాట్లాడుతున్నప్పుడు మేము ధ్యాన స్థితిలో ఉండాలి. అప్పుడే వారు ‘ఎనర్జీ’ని స్వీకరించగలరు. మొదట్లో కొన్నాళ్లు వాళ్లు చెప్పేదంతా వింటుంటే నా ఎనర్జీ తగ్గిపోయేది. వారు చెప్పే విషయాలను చాలా ఎక్కువగా అనుభూతి చెందడమే కారణమని అర్థం చేసుకున్నాను. వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వారి వైబ్రేషన్స్‌ను స్వీకరిస్తున్నాను. ఆ తరువాత వినడం కన్నా నా ఎనర్జీని ప్రసారం చేయడ ంపైనే దృష్టి పెట్టాను. ఒక్కసారి ఆ వ్యక్తితో మాట్లాడడం ముగిశాక... అది అంతటితో పూర్తవుతోంది. తర్వాత అది నాపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు.
యెషయా 43:10 – మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు. యెషయా 43:11 – నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు. 2సమూయేలు 22:32 – యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? యెషయా 44:8 – మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేదియు లేదు, ఉన్నట్టు నేనెరుగను. యెషయా 45:5 – నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు. 1కొరిందీయులకు 8:4 – కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవుడు జీవించుచున్నాడు మరియు సత్యవంతుడు యిర్మియా 10:10 – యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. 1దెస్సలోనీకయులకు 1:9 – మీయొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో, అక్కడి జనులు మమ్మునుగూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, 1దెస్సలోనీకయులకు 1:10 – దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును, మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. దేవుడే జీవము కీర్తనలు 36:9 – నీయొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. ఆదికాండము 2:7 – దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. అపోస్తలులకార్యములు 17:25 – ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. యోహాను 5:26 – తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. దేవుడు అక్షయుడు 1తిమోతి 1:17 – సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్‌. 1తిమోతి 6:16 – సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌. దేవుడు అనంతుడు యోబు 26:14 – ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? యోబు 11:7 – దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా? సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? 1రాజులు 8:27 – నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును? రోమీయులకు 11:33 – ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. దేవుడు నిత్యుడు కీర్తనలు 90:2 – పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు 1తిమోతి 1:17 – సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్‌. 2పేతురు 3:8 – ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములవలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి. దేవుడు ఆత్మ యోహాను 4:24 – దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. 2కొరిందీయులకు 3:17 – ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. దేవుడు అదృశ్యుడు యోహాను 1:18 – ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. 1తిమోతి 1:17 – సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్‌. దేవుడు బౌతిక ఆకారము లేనివాడు ద్వితియోపదేశాకాండము 4:15 – హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్యనుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. దేవుడు తెలిసికొన శక్యము కానివాడు యెషయా 55:8 – నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు యెషయా 55:9 – ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి. కీర్తనలు 145:3 – యెహోవా మహాత్మ్యము గలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది రోమీయులకు 11:33 – ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. రోమీయులకు 11:34 – ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? దేవుడు తనకు తానే బయలుపరచుకొనును 2తిమోతి 3:16 – దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఆమోసు 3:7 – తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు. యోహాను 14:8 – అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యోహాను 14:9 – యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీయొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? ద్వితియోపదేశాకాండము 29:29 – రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతివారివియు నగునని చెప్పుదురు. దేవుడు మనుష్య వర్గానికి చెందినవాడు నిర్గమకాండము 3:14 – అందుకు దేవుడు నేను ఉన్నవాడను అను వాడనై యున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. 1యోహాను 4:10 – మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. లూకా 15:7 – అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొకమందు ఎక్కువ సంతోషము కలుగును నిర్గమకాండము 34:14 – ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా; ఆయన రోషము గల దేవుడు. ఆదికాండము 6:6 – తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను. కీర్తనలు 2:4 – ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు దేవుడు మార్పులేనివాడు మలాకీ 3:6 – యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు. హెబ్రీయులకు 13:8 – యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. యాకోబు 1:17 – శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు. దేవుడు స్నేహము చేయువాడు ప్రకటన 3:20 – ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసినయెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. యోహాను 14:23 – యేసు ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వానియొద్దకు వచ్చి వానియొద్ద నివాసము చేతుము. మత్తయి 1:23 – అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మత్తయి 18:20 – ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. 1యోహాను 1:3 – మాతో కూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది. దేవుడు సర్వాంతర్యామి యిర్మియా 23:23 – నేను సమీపముననుండు దేవుడను మాత్ర మేనా? దూరముననుండు దేవుడను కానా? యిర్మియా 23:24 – యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు. కీర్తనలు 139:7 – నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును? కీర్తనలు 139:8 – నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు కీర్తనలు 139:9 – నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను కీర్తనలు 139:10 – అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును దేవుడు సర్వశక్తిమంతుడు ఆదికాండము 17:1 – అబ్రాము తొంబదితొమ్మిది యేండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. మత్తయి 19:26 – యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ప్రకటన 19:6 – అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ప్రకటన 19:7 – ఆయనను స్తుతించుడి, గొఱ్ఱపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. దేవుడు ఆత్మనిగ్రహము గలవాడు ద్వితియోపదేశాకాండము 30:19 – నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా పిలుచుచున్నాను. ద్వితియోపదేశాకాండము 30:20 – నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమైయున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి. హోషేయ 11:9 – నా ఉగ్రతాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను; నేను మరల ఎఫ్రాయిమును లయపరచను, నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను. దేవుడు అన్నీ తెలిసినవాడు హెబ్రీయులకు 4:13 – మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసి యున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. కీర్తనలు 147:5 – మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు. 1యోహాను 3:19 – ఇందువలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము. 1యోహాను 3:20 – ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యము గలవారమగుదుము. కీర్తనలు 139:4 – యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది. యోహాను 2:24 – అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు యోహాను 2:25 – గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు. దేవుడు వివేకము గలవాడు రోమీయులకు 16:25 – సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారముగాను, రోమీయులకు 16:26 – యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును రోమీయులకు 16:27 – అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్‌. యూదా 1:14 – ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినిగూర్చియు, యూదా 1:15 – భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. దేవుడు పరిశుద్దుడు ప్రకటన 15:4 – ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడనివాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱపిల్ల కీర్తనయు పాడుచున్నారు. లేవీయకాండము 11:44 – నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులైయుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. కీర్తనలు 99:9 – మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. యెషయా 6:3 – వారు సైన్యములకధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవుడు సార్వభౌముడు కీర్తనలు 135:6 – ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు యెషయా 14:24 – సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణపూర్వ కముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును. ఎఫెసీయులకు 1:11 – మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని, ఎఫెసీయులకు 1:12 – దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు. 1తిమోతి 6:15 – శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు. ప్రకటన 4:10 – ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రకటన 4:11 – ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి ప్రకటన 17:14 – వీరు గొఱ్ఱపిల్లతో యుద్ధముచేతురు గాని, గొఱ్ఱపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతో కూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును. ప్రకటన 19:16 – రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడియున్నది. దేవుడు న్యాయస్తుడు 2దినవృత్తాంతములు 19:7 – యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు,ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు. 1పేతురు 1:17 – పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి. రోమీయులకు 2:11 – దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; కీర్తనలు 119:137 – (సాదె) యెహోవా, నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు ద్వితియోపదేశాకాండము 10:17 – ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై యున్నాడు. ఆయనే మహా దేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ద్వితియోపదేశాకాండము 10:18 – ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయయుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు. నెహెమ్యా 9:33 – మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే; నీవు సత్యముగానే ప్రవర్తించితివి కాని మేము దుర్మార్గులమైతివిు. దేవుడు ప్రేమ యోహాను 3:16 – దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. 1యోహాను 4:16 – మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియైయున్నాడు, ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు. రోమీయులకు 5:8 – అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. దేవుడు కనికరము కలిగినవాడు హెబ్రీయులకు 4:15 – మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హెబ్రీయులకు 4:16 – గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. మత్తయి 9:36 – ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి ఎఫెసీయులకు 2:4 – అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతో కూడా బ్రదికించెను ఎఫెసీయులకు 2:5 – కృపచేత మీరు రక్షింపబడియున్నారు. నిర్గమకాండము 3:7 – మరియు యెహోవా యిట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. నిర్గమకాండము 34:6 – అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. దేవుడు కృప కలిగినవాడు ఎఫెసీయులకు 2:4 – అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతో కూడా బ్రదికించెను ఎఫెసీయులకు 2:5 – కృపచేత మీరు రక్షింపబడియున్నారు. ఎఫెసీయులకు 2:6 – క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము, ఎఫెసీయులకు 2:7 – క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను. తీతుకు 2:11 – ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణ కరమైన దేవుని కృప ప్రత్యక్షమై నిర్గమకాండము 34:6 – అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఎఫెసీయులకు 1:7 – దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. దేవుడు మంచివాడు కీర్తనలు 145:9 – యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి. నిర్గమకాండము 33:19 – ఆయన నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను. దేవుడు యదార్ధవంతుడు కీర్తనలు 19:7 – యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యిర్మియా 9:24 – అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు సత్యము యోహాను 17:3 – అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. యిర్మియా 10:10 – యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. దేవుడు నిజాయితీపరుడు 1సమూయేలు 15:29 – మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైనవాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు. హెబ్రీయులకు 6:17 – ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, హెబ్రీయులకు 6:18 – మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. దేవుడు నమ్మకస్తుడు సంఖ్యాకాండము 23:19 – దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? 1కొరిందీయులకు 1:9 – మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. 1దెస్సలోనీకయులకు 5:24 – మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును. దేవుడు దీర్ఘశాంతము కలవాడు 2పేతురు 3:9 – కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమునుగూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీయెడల ధీర్ఘశాంతము గలవాడైయున్నాడు. నిర్గమకాండము 34:6 – అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. యెషయా 48:9 – నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమునుబట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనుచున్నాను. కీర్తనలు 86:15 – ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు ధీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు రోమీయులకు 2:4 – లేదా, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా?
November 8, 2022 November 8, 2022 Sudheer 70 Views anantapur party president, kapu ramachandra reddy, kapu ramachandra reddy resigned anantapur party president post kapu ramachandra reddy resigned anantapur party president post వైస్సార్సీపీ అధిష్టానానికి షాక్ ఇచ్చారు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి. అనంతపురం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్ష పదవికి రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. వైస్సార్సీపీ పార్టీ పదవులను వీడుతున్న నేతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రీసెంట్ గా గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రామచంద్రా రెడ్డి సైతం రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. జగన్ కు రాసిన లేఖలో తన రాజీనామాకు గల కారణాలను రామచంద్రారెడ్డి వివరించారు. రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కూతురు భర్త ఆత్మహత్యతో రామచంద్రారెడ్డి తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఈ క్రమంలో అటు నియోజకవర్గంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను చేపట్టడం తనకు కష్టంగా మారిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంపై దృష్టి సారించాల్సి ఉన్నందున పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను తాను పర్యవేక్షించలేనని, ఆ పదవిని మరో నేతకు అప్పగించాలని ఆయన జగన్ ను కోరారు. తనకు అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఈ వరకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, తనకు అన్ని విధాలా సహాయం చేసి అండగా నిలిచిన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పినట్లు తెలిపారు.
బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌పై ట్విట్ట‌ర్ ఓన‌ర్ ఎల‌న్ మ‌స్క్ కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం స‌బ్‌స్క్రిప్ష‌న్ విధానాన్ని నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. ట్విట్ట‌ర్‌లో ఫేక్ అకౌంట్ల అంశం తేలే వ‌ర‌కు బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఆపేస్తున్న‌ట్లు చెప్పారు. 8 డాల‌ర్ల‌కు ట్విట్ట‌ర్ బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఇస్తున్న విష‌యం తెలిసిందే. సెల‌బ్రిటీలు, భారీ బ్రాండ్ సంస్థ‌ల పేర్ల‌తో ఫేక్ అకౌంట్లు తీస్తున్న నేప‌థ్యంలో 8 డాల‌ర్ల బ్లూటిక్ విధానాన్ని ట్విట్ట‌ర్ నిలిపివేసిన విష‌యం తెలిసిందే. అయితే ట్విట్ట‌ర్‌ను సొంతం చేసుకున్న త‌ర్వాత మ‌స్క్ ఆ స‌బ్‌స్క్రిప్ష‌న్ ను మార్చాల‌ని భావించారు.కొత్త‌గా బ్లూటిక్ విధానాన్ని ఆవిష్క‌రించాల‌నుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌స్తుతం హోల్డ్‌లో పెట్టామ‌ని, సంస్థ కోసం మ‌రో క‌ల‌ర్‌తో ఆ విధానాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు మ‌స్క్ త‌న ట్విట్‌లో తెలిపారు. ఆ కొత్త స‌ర్వీసు విధానాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తార‌న్న‌ విష‌యాన్ని ఆయ‌న స్ప‌ష్టం చేయ‌లేదు. బ్లూటిక్ విధానం న‌వంబ‌ర్ 29వ తేదీ నుంచి ట్విట్ట‌ర్‌లో క‌నిస్తుంద‌ని తొలుత మ‌స్క్ తెలిపారు. కానీ తాజా ట్వీట్‌తో ఆ విధానం నిలిపివేసిన‌ట్లు అయ్యింది. Categories: INTERNATIONAL, SLIDER, TECHNOLOGY Tags: blue mark, Elon Musk, Elon Reeve Musk FRS, facebook, slider, social media, techonology, techonologynews, tweet, Twitter, watermelon
మేము మా ఫుడ్ ప్రాసెసర్‌లో (మన వద్ద ఉంటే) లేదా మొదట చెక్క చెంచాతో, తరువాత మా చేతులతో మెత్తగా పిండిని పిసికి కలుపుతాము. ఇప్పుడు మేము పుల్లని ముక్కలుగా కలుపుతాము. ప్రతిదీ బాగా కలిసిపోయేలా మేము మెత్తగా పిండిని కలుపుతాము. మేము ఉప్పు వేసి మెత్తగా పిండిని పిసికి కలుపుతాము. మేము కనీసం 10 నిమిషాలు మెత్తగా పిండిని పిసికి కలుపుకోవాలి. మెత్తగా పిండిన తర్వాత, పిండితో బంతిని తయారు చేసి ఒక గిన్నెలో వేస్తాము. మేము గిన్నెను ప్లాస్టిక్‌తో కప్పి, నాలుగు లేదా ఐదు గంటలు విశ్రాంతి తీసుకుంటాము. సమయం మన వద్ద ఉన్న పరిసర ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది మరియు మన పుల్లని ఎంత చురుకుగా ఉంటుందో కూడా ఆధారపడి ఉంటుంది. ఆ సమయం తరువాత మేము మా పిండికి అనేక మడతలు తయారు చేసి ప్లం కేక్ అచ్చులో ఉంచాము లేదా మనకు ఆసక్తి ఉన్న పరిమాణంలో రోల్స్ ఏర్పరుస్తాము. మేము రోల్స్ చేస్తే, మేము వాటిని గతంలో పిండి చేసిన బేకింగ్ ట్రేలో ఉంచుతున్నాము. ప్లాస్టిక్‌తో మళ్ళీ (ప్లం కేక్ అచ్చు లేదా మఫిన్లు) కవర్ చేసి విశ్రాంతి తీసుకోండి. కొన్ని గంటల తరువాత, రొట్టె లేదా రొట్టెల పరిమాణం పెరిగిందని చూసినప్పుడు, మేము ఓవెన్‌ను 180º కు వేడిచేస్తాము. కొట్టిన గుడ్డుతో రొట్టె లేదా రోల్స్ బ్రష్ చేయండి. ఉపరితలం బంగారు రంగులో ఉందని చూసేవరకు మేము మా రొట్టె లేదా మా రోల్స్ కాల్చాము (రొట్టె విషయంలో మనకు కనీసం 35 నిమిషాలు అవసరం, రోల్స్ ముందు సిద్ధంగా ఉంటాయి).
నాకు ముఖ్యవ్యాపకం రాములవారి గురించి సంకీర్తనం చేయటం. అది తెలుగుబ్లాగులోకంలో అందరికీ తెలిసిన సంగతే కాబట్టి దాని గురించి విస్తరించి చెప్పనవసరం లేదనుకుంటాను. ఒక్కొక్కసారి ఒకే రోజున ఏకంగా అరడజను దాకా రామకీర్తనలు వస్తూ ఉంటాయి. సాధారణంగా ఐతే ఒకటి రెండు వస్తే గొప్పవిషయం. ఒక్కొక్కసారి రోజుల తరబడి ఒక్క కీర్తన కూడా ఊడిపడదు. ఈవిషయంలో నాప్రమేయం ఆట్టే లేదు. అయన స్ఫురింపజేయకుండా నేను స్వకపోలకల్పనగా వ్రాసేదీ వ్రాయగలిగినదీ ఏమీ ఉండదు. ఈస్ఫురణ కలగటం అన్నదానికి వేళాపాళా ఏమీ ఉండదు. అది ఏదైనా ప్రయాణసమయంలో కావచ్చును, భోజనసమయంలో కావచ్చును. తరచుగా నేను నిద్రపోతుండగా కూడా ఇలా కీర్తన స్ఫురించి లేచి వ్రాయటం కద్దు. రామనామం మాత్రం నిరంతరాయంగా నడుస్తూనే ఉంటుంది. ఏకీర్తనా స్ఫురించక, వ్రాయలేకపోవటం విచారం కలిగిస్తుంది. కాని నేను చేయగలిగినది ఏమీ లేదు. ఆవిచారంలో ఒక్కొక్క సారి ఎన్నో రోజులూ వారాలూ కూడా గడచిపోతూ ఉంటాయి. ఈసారి జనవరి 15నుండీ‌ నేటి వరకూ విరామం వచ్చింది. మళ్ళీ ఈరోజున ఒక కీర్తన వెలువడింది. జనవరి నెలలో కేవలం అరడజను కీర్తనలే వెలువడ్డాయి. రాములవారి మీద కీర్తనలేనా, ఇంకా ఏమన్నా వ్రాయవచ్చును కదా అనవచ్చును. కాని నాకుఇతరవిషయాల మీద అభిరుచి అట్టే లేదు. అందుచేత ఇతరాలు వ్రాయటం మీద అసక్తి కలగటం లేదు. ఒకప్పుడు పద్యకవిత్వం వ్రాయటం మీద ఆసక్తి ఉండేది. కానీ ఆ ఆసక్తి కూడా తగ్గింది కాబట్టి అవీ వ్రాయటం లేదు కొన్నేళ్ళుగా. ఒకప్పుడు మాలికలో నాటపాలే కాక నా వ్యాఖ్యలు కూడా తరచుగానే వచ్చేవి. కాని ప్రస్తుతం ఇతరవిషయాలను చదవటం పైన కూడా అసక్తి తక్కువగా ఉండబట్టి నా వ్యాఖ్యలూ తగ్గాయి. ఈవిధంగా తెలుగుబ్లాగుల్లో నేను కనిపించటం బాగా తగ్గింది. వృధ్ధాప్యం అనేది ఒకటి ముదురుతున్నది కదా. అందుచేత మనస్సులో ఆశ ఉత్సాహం ఉన్నా సరే శరీరం అంత సుముఖంగా స్పందించక ఎక్కువగా ఏదీ వ్రాయలేకపోవటం కూడా జరుగుతున్నదేమో. నేనిలా నిర్లిప్తంగా ఉండటం గమనికకు వచ్చి ఇంచుమించు నెలరోజుల క్రిందట మిత్రులు కష్టేఫలీ బ్లాగు శర్మ గారు వాట్సాప్ ద్వారా పలకరించారు ఎలా ఉన్నానా అని. ఈరోజున చూసాను. నిన్ననే ఇదీ ప్రపంచం బ్లాగులో నాకుశలం అడుగుతూ ఒక టపాయే వచ్చింది. నా బ్లాగును చదువను అంటూనే నా కుశలం పట్ల వ్యగ్రతను వ్యక్తం చేసిన ఇదీ ప్రపంచం బ్లాగరు గారికి ధన్యవాదాలు. నేను కుశలం గానే ఉన్నాను, సకుటుంబంగా కుశలంగానే ఉన్నాను. మొన్న' రిపబ్లిక్ డే‌' నాడు మేమిద్దరమూ వెళ్ళి కోవిషీల్డ్ బూష్టర్ డోస్ వాక్సీన్ వేయించుకొని వచ్చాం. ఏమీ‌ సైడ్ ఎఫెక్ట్ రాలేదు మాయిద్దరికీ. వ్రాస్తూనే ఉండాలని ఉంది. పరాత్పరుడు వ్రాయిస్తే తప్పక వ్రాస్తాను. నా వ్రాతలు చదివే వారికీ చదువని వారికీ కూడా, తెలుగుబ్లాగర్లూ, తెలుగుబ్లాగు చదువరులూ అందరికీ నా శుభకామనలు. వీరిచే పోస్ట్ చేయబడింది శ్యామలీయం వద్ద 11:31 AM 1 కామెంట్‌: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి శ్రీమదయోధ్యాపురవిహారా సీతారామా శ్రీమదయోధ్యాపురవిహారా సీతారామా మాకు సేమమును సంపదలిచ్చే సీతారామా చిత్తుగ నీకరుణామృతమాని మత్తిలి నాము సీతారామా బొత్తిగ నితరములందు విరక్తి పుట్టినదయ్యా సీతారామా క్రొత్తగ కామిత మేమని యడుగుదు మిత్తరి నిన్ను సీతారామా మెత్తని నీపదకమలదళంబుల మిగుల భజింతుము సీతారామా నరులు పొగడుదురు సురలు పొగడుదురు నారాయణ నిను సీతారామా హరుడు పొగడు నిను అజుడు పొగడు నిను హరివే నీవని సీతారామా పరమపురుష భవపాశనాశ హరి పామరులమయా సీతారామా హరేరామ యని హరేకృష్ణయని యనగల మంతే సీతారామా శక్తి చాలునా మాంబోట్లకు నిను చక్కగ పొగడగ సీతారామా భక్తి కొలదిగ భజనచేయుదుము పావననామా సీతారామా రక్తి గొలుపు నీనామము విడువము రాత్రులు పవళులు సీతారామా ముక్తిప్రదమది మధురమధురమది మోహాంతకమది సీతారామా వీరిచే పోస్ట్ చేయబడింది శ్యామలీయం వద్ద 8:46 AM కామెంట్‌లు లేవు: దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Twitterకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి లేబుళ్లు: రామకీర్తనలు 18, జనవరి 2022, మంగళవారం చింతామణి నాటకాన్ని ఆంధ్రా ప్రభుత్వం నిషేధించటం సముచితమా? అలా ఐతే‌ వారు కన్యాశుల్కం నాటకాన్నీ‌ నిషేధీంచాలి. కొద్ది సేపటి క్రిందట టివీలో వార్తలను వీక్షిస్తున్నప్పుడు ఈనిషేధం గురించిన సంగతి తెలియవచ్చింది. దరిమిలా ఈ‌వార్తను ఆంధ్రజ్యోతిలో కూడా గమనించాను. నిజానికి చింతామణి చాలా మంచినాటకం. అసక్తి కలవారు ఈచింతామణి నాటకాన్ని ఆర్కీవ్ సైట్ నుండి దిగుమతి చేసుకొని చదువుకొనవచ్చును. ఈనాటకాన్ని వ్రాసింది మహానుభావులు మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు. ఈనాటకం ముఖ్యంగా వేశ్యావృత్తికి వ్యతిరేకంగా వ్రాయబడింది. వేశ్యాలంపటులై జనులు ఎలా సర్వనాశనం అవుతారో తెలియజేయటానికి కాళ్ళకూరి వారు లీలాశుకుడి వృత్తాంతాన్ని స్వీకరించి నాటకంగా మలిచారు. కాని ఒక ఉదాత్తమైన ఆశయంతో వ్రాయబడిన గొప్పనాటకాన్ని నిషేధించేముందుగా ఆంధ్రాప్రభుత్వం వారు చక్కగా పూర్వాపరాలు విచారించినట్లుగా నాకు అనిపించటం లేదు. నా చిన్నతనం, టీనేజీతో సహా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట గ్రామంలో గడిచింది. అప్పట్లో వినాయకచవితి వచ్చిందంటే ఊర్లో కనీసం అరడజను చోట్ల పెద్దపెద్ద పందిళ్ళూ వెలిసేవి, తొమ్మిదిరోజులూ‌ నాటకాలూ నడిచేవి. తప్పనిసరిగా ప్రదర్శనకు వచ్చే‌ నాటకాలంటే సత్యహరిశ్చంద్ర, కురుక్షేత్రం, చింతామణి అనే చెప్పాలి. తమాషాగా ఒకరేజున ఒకటికంటే ఎక్కువ పందిళ్ళల్లో ఒకేనాటకం ప్రదర్శించటమూ జరిగేది తరచుగా. అలా పందిరినాటకాలు చూడటం మొదలు పెట్టిని కొత్తలోనే అనుకుంటాను చింతామణి నాటకం చూడటం‌ జరిగింది. ఆనాటకంలో విరుచుకు పడిన దరిద్రపు సంభాషణలకు తట్టుకోలేక కొద్ది సేపటిలోనే లేచి వెళ్ళిపోయాను. మరలా ఎప్పుడూ ఆనాటకాన్ని చూసే సాహసం చేయలేదు. ఐతే ఈ అసభ్యమైన సంభాషణలు కాళ్ళకూరి వారి కలంనుండి వెలువడ్డవి కావు. కాంట్రాక్టు నాటకాల వాళ్ళు జనాకర్షణ కోసం జనం మీదకు పవిత్రమైన రంగస్థలం‌నుండి వదలినవి! ఈనాడు నాటక కళ అంతరస్తున్నది. ప్రదర్శనలు అపురూపం. ఒకవేళ చింతామణి నాటకాన్ని సవ్యంగా ప్రదర్శించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించటం సమంజసం‌. అంతేకాని చారిత్రక ప్రశస్తి కల నాటకాన్ని తప్పుపట్టి నిషేధించటం సముచితం కాదు. ఏమాత్రం కాదు. అసలు నేడు తెలుగు సినిమాల్లోనే, కథ డిమాండు చేస్తోందీ, సన్నివేశం డిమాండు చేస్తోందీ, పాత్రను బట్టి డైలాగులు అలాగే ఉండాలీ అంటూ ఇష్టారాజ్యంగా బూతుమాటలు వాడుతూ ఉంటే ఈ‌ప్రభుత్వాలు ఏమీ అనటం లేదు. అందుచేత ఇప్పుడు అసభ్యంగా ఉందని చింతామణి నాటక ప్రదర్శనని నిషేధించలేరు. ఈనాటకం వేశ్యాలోలత్వం గురించి విస్తృతంగా ప్రస్తావిస్తున్నది కాబట్టి, రంగస్థలంపై వేశ్యల పాత్రలూ, విటుల పాత్రలూ తప్పకుండా ఉంటాయి. అందులో‌ నాటకకర్త చేసిన తప్పిదం ఏమీ లేదు. మరెందుకు నిషేధించినట్లు? అంటే చింతామణి నాటకంలో హాస్యపాత్రను సుబ్బిశెట్టి అనటం ద్వారా వైశ్యకులం‌ మనోభావాలను దెబ్బతీసినందుకట! నాటకం అన్నాక, అది కేవలం ప్రబోధాత్మకమైన సన్నివేశాలతోనూ సుదీర్థసంభాషణలతోనూ అత్యంత గంభీరమైన నడకతో ఆద్యంతమూ నిర్మించలేరు కదా. అలా చేసిన పక్షంలో జనరంజకంగా ఉండదు. అందుచేత హాస్యం అన్నది కూడా తప్పనిసరిగా నాటకంలో పోషించవలసి ఉంటుంది. అలా ఒక హాస్యపాత్రకు సుబ్బిశెట్టి అన్నపేరు ఉంచారు నాటకకర్త. ఏ సుబ్బారావో అని పెట్టకుండా సుబ్బిశెట్టి అని పేరు పెట్టి వైశ్యకులాన్ని అవమానించారు అని సాక్షాత్తూ ఒక మంత్రివర్యుల ఆరోపణ. ఇది అంత సమంజసమైన ఆలోచన కాదని నా అభిప్రాయం. శెట్టి అని అన్నందుకే వైశ్య కులాన్ని అవమానించటం అన్న వాదన సమంజసం అని ఒప్పుకొనే‌ పక్షంలో గురుజాడ అప్పారావు పంతులు గారి జగత్ప్రసిధ్ధమైన కన్యాశుల్కం నాటకంలోని పాత్రల పేర్లు సిధ్ధాంతీ, అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధానులూ, రామప్పపంతులూ, సౌజన్యారావు పంతులూ, కరటకశాస్త్రి అంటూ ఇలా ఉన్నాయే, ఇది బ్రాహ్మణ్యాన్ని అవమానించటమే అని తీర్మానం చేసి కన్యాశుల్కం నాటకాన్ని కూడా వెంటనే నిషేధించాలి. నిషేధించి తీరాలి! ఒక్క బ్రాహ్మణ్యమే‌కాదు ఇంకా ఇతరకులాలకూ బాగానే అవమానపు చురకలు పడ్డాయి కన్యాశుల్కంలో. ఈ కన్యాశుల్కం నాటకం ప్రతి ఒకటి ఆర్కీవ్‌లో ఉంది. అందులో 167వ పేజీలో కలెక్టరు మాటలు "బ్రాహ్మల్లో ఉన్నంత ఖంగాళీ‌, మాలకూడూ మరెక్కడా లేదు"‌ అని. చూసారూ ఈ‌ఒక్క ముక్కలో అటు బ్రాహ్మణకులాన్నీ‌, మాలకులాన్నీ కూడా నిందించి వారి మనోభావాలు దెబ్బతీస్తున్నారు మహాబ్రాహ్మణులైన అప్పారావు పంతులు గారు. అన్నట్లు కన్యాశుల్కం నాటకంలో ఒక ముఖ్యమైన హాస్యపాత్రకు పేరు పోలిశెట్టి అని పేరు పెట్టి వైశ్యకులాన్ని హేళన చేసారుగా పంతులు గారు. మరి కన్యాశుల్కం నాటకాన్ని కూడా అంధ్రాప్రభుత్వం వారు తక్షణం నిషేదించటం బాగుంటుందేమో.
(సెప్టెంబర్ రెండో తేదీ వైయస్సార్ వర్ధంతి - ఈరోజు 'సాక్షి'దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) దేశవ్యాప్తంగా , మీడియాలో , ప... జంధ్యాలకో నూలుపోగు (PUBLISHED IN 'ANDHRA JYOTHY' TELUGU DAILY ON 14-01-2017, SATURDAY) (జనవరి 14 జంధ్యాల జయంతి) జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ... ఉగ్రవాదులకు మతం లేదు (PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 02-08-2015, SUNDAY) బుధవారం అర్ధరాత్రి యావత్ దేశం నిద్రావస్థలో వున్న వేళ, దేశ అత్యు... రామోజీరావు మొదటి ఓటమి రామోజీరావు మొదటి ఓటమి (వెటరన్ జర్నలిస్ట్ శ్రీ వి.హనుమంతరావు రాసిన ‘జర్నలిస్ట్ అంతర్వీక్షణం’ పుస్తకం నుంచి కొన్ని భాగాలు) “యు.ఎన... My experiences in America - 1 – Bhandaru Srinivasarao My experiences in America - 1 – Bhandaru Srinivasarao It was a bright and sunny morning when we left Seattle to spend some time on the ... రోజుకో రూపాయితో కిడ్నీ బాధలు దూరం రోజుకో రూపాయితో కిడ్నీ బాధలు దూరం మీరెప్పుడన్నా హైదరాబాదు హుస్సేన్ సాగర్ వద్ద వున్న జలశుద్ధి కేంద్రాన్ని చూసారా. నిజాం నవాబు కాలం... 1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు? 1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు? ఐతరేయ బ్రాహ్మణమా? - భండారు శ్రీనివాసరావు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటయినప్పుడు – నా పుట్... మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే! మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే! (నెట్ లో చక్కర్లు కొడుతున్న జోక్) ఇంకెవ్వరు? మన కనిమొళి మొగుడు జి.అరవిందన్ ఎందుక... రామాయణం పుక్కిటి పురాణమా ? రామాయణం పుక్కిటి పురాణమా ? (రామాయణాన్ని పుక్కిటి పురాణం కింద కొట్టిపారేసే విమర్శకుల వాదాలను పూర్వపక్షం చేసే ప్రయత్... బెజవాడ అంటే ఇదా! బెజవాడ అంటే ఇదా! ఈ మధ్య విడుదలయిన ‘బెజవాడ’ తెలుగు సినిమా గురించి ఓ బెజవాడ అభిమాని ఆర్.వీ.వీ. కృష్ణారావు గారు వ్యక్తం చేసిన అభిప్...
కోవిడ్‌-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ గజగజలాడిస్తోంది. దీని పేరు చెప్తేనే చాలు.. అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే వెయ్యిమందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. ఈ వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం అరవై వేల మంది వరకు ఈ వైరస్ బారిన పడ్డట్టు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే ఈ కరోనా బారిన పడి.. 254 మంది మరణించారు. ఒకేరోజులో […] TV9 Telugu Digital Desk | Edited By: Feb 14, 2020 | 5:17 AM కోవిడ్‌-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ గజగజలాడిస్తోంది. దీని పేరు చెప్తేనే చాలు.. అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే వెయ్యిమందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. ఈ వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం అరవై వేల మంది వరకు ఈ వైరస్ బారిన పడ్డట్టు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే ఈ కరోనా బారిన పడి.. 254 మంది మరణించారు. ఒకేరోజులో ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో మృతుల సంఖ్య పదమూడు వందలకు పైగా చేరింది. వైరస్ సోకిన వారి సంఖ్య 59,804గా చైనా మీడియ వెల్లడించింది. కరోనా వైరస్‌ను నిర్ధారించడానికి కొత్త పద్ధతితో చెక్ చేయించడం ద్వారా.. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని.. ఇకపై వైరస్‌కు సంబంధించి ప్రాథమిక లక్షణాలు కనిపించినవారిని కూడా వైరస్‌ సోకినవారిగా పరిగణించనున్నట్టు అధికారులు తెలిపారు. వైరస్‌ నిర్ధారణ అయిన వారితో సమానంగా వారికి కూడా చికిత్స అందించానున్నట్లు తెలిపారు. అందుకోసమే ఈ ఈ మార్పులు చేశామన్నారు.
అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు సుప్రీం తీర్పు తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు గుంటూరు కు బయలు దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌లాస‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యం ప్రారంభం టీడీపీని నడిపేది ఆ రెండు పత్రికలు, టీవీలే మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం నీ మాట‌లు తెలుగువారందరినీ అవమానించినట్టేనయ్యా.. లోకయ్యా! You are here హోం » టాప్ స్టోరీస్ » ప్ర‌జా సంక్షేమ‌మే వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ ధ్యేయం ప్ర‌జా సంక్షేమ‌మే వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ ధ్యేయం 27 Sep 2022 12:34 PM జయపురంలో 'గడప గడపకు మన ప్రభుత్వం'లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి ఉరవకొండ: రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా, పేద‌రిక నిర్మూల‌నే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల‌న సాగుతోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉర‌వకొండ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి అన్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కూడేరు మండలం జయపురం గ్రామంలో విశ్వేశ్వ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామస్తులు విశ్వేశ్వ‌ర్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి సీఎం వైయ‌స్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేరుస్తున్నార‌ని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామ‌న్నారు. ఈ కార్యక్రమంలో ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, వైయ‌స్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
గ్రేటర్‌లో గాడి తప్పిన పారిశుధ్య నిర్వహణ దిశగా జీహెచ్‌ఎంసీ అధికారులు కనీస ప్రయత్నాలు చేయడం లేదు. ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సహ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 స్టాండింగ్‌ సమావేశంలోఆ కమిటీ ఊసేది? ఎజెండాలోని అంశాలకు ఆమోదం పారిశుధ్య నిర్వహణపై జరగని చర్చ హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో గాడి తప్పిన పారిశుధ్య నిర్వహణ దిశగా జీహెచ్‌ఎంసీ అధికారులు కనీస ప్రయత్నాలు చేయడం లేదు. ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సహ అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ముక్తకంఠంతో నగరంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతోందని అసహనం వ్యక్తం చేశారు. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని సభ్యులు అభిప్రాయపడ్డారు. మెరుగైన నిర్వహణ చర్యల కోసం అఖిలపక్ష కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. రోడ్లపై చెత్త చూస్తే నాకూ సిగ్గేస్తుందని మేయర్‌ స్వయంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని విజయలక్ష్మి సమాధానమిచ్చారు. కానీ, బుధవారం జరిగిన సమావేశంలో పారిశుధ్య నిర్వహణకు సంబంధించి చర్చ జరగకపోవడం గమనార్హం. స్టాండింగ్‌ కమిటీలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో పారిశుధ్య నిర్వహణ అంశం ప్రస్తావనకు రాలేదని తెలిసింది. అప్పగించి.. చేతులెత్తేసి.. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిత్యం 6300-6500 మెట్రిక్‌ టన్నుల చెత్త వెలువడుతోంది. ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తోన్న ట్రాలీ కార్మికులు.. సెకండరీ కలెక్షన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ పాయింట్ల (ఎస్‌సీటీపీ) వద్ద వేస్తున్నారు. అక్కడి నుంచి ఓ ప్రైవేట్‌ ఏజెన్సీ కంపాక్ట్‌ వాహనాల ద్వారా జవహర్‌నగర్‌కు తరలిస్తున్నారు. రోడ్లపై వేసే చెత్తను గతంలో జీహెచ్‌ఎంసీ వాహనాల ద్వారా తొలగించే వారు. మూడు నెలల క్రితం సెకండరీ ట్రాన్స్‌పోర్టేషన్‌(రోడ్లు ఊడ్చిన, రోడ్లపై ప్రజలు వేసిన చెత్త) బాధ్యతలు అదే ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి రహదారులపై ఎక్కడికక్కడ చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. స్వీపింగ్‌ కార్మికులు, పలు ప్రాంతాల్లో పౌరులు వేసే చెత్త తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించి చేతులు దులుపుకున్న జీహెచ్‌ఎంసీ.. పర్యవేక్షణను విస్మరించడం వల్లే ఈ దుస్థితి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా పాలకమండలి, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టాండింగ్‌ కమిటీలో నిర్ణయాలివి.. మేయర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎజెండాలోని తొమ్మిది అంశాలకు కమిటీ ఆమోదం తెలిపింది. అందులో శేరిలింగంపల్లి జోన్‌లోని ఈపీటీఆర్‌ఐ చెరువు సుందరీకరణ, హెర్బల్‌ పార్క్‌ అభివృద్ధి, జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కార్యాలయం నుంచి నల్లగండ్ల రైల్వే స్టేషన్‌ మీదుగా బీహెచ్‌ఈఎల్‌ జంక్షన్‌ వరకు 150 మీటర్ల మేర రహదారి, గుల్మోహర్‌ పార్క్‌ వద్ద జంక్షన్‌ అభివృద్ధి, నల్లగండ్ల గ్రామ పరిధి సర్వే నెంబర్‌ 400/ఏఏ1/1లో శివరాజుకు చెందిన ఖాళీ స్థలంలో ఉన్న 2155.99 చదరపు మీటర్ల హుడా భూమిని వనజ హౌసింగ్‌ ఎల్‌ఎల్‌సీపీకి బదిలీకి ప్రతిపాదన, హుస్సేన్‌సాగర్‌ నాలాపై అరవింద్‌నగర్‌ వద్ద నిర్మించిన నాలాపై శ్లాబ్‌ను తొలగించి రూ.2.99 కోట్ల వ్యయంతో బ్రిడ్జి పునర్నిర్మాణానికి ఆమోదం వంటి అంశాలు ఉన్నాయి.
గులాబ్‌ తుఫాను తీవ్రతపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఈ […] Category: Trending News, ఆంధ్ర ప్రదేశ్ by NewsDeskLeave a Comment on బాధితులకు అండగా ఉండండి: సిఎం ఆదేశం September 17, 2021 September 17, 2021 అన్ని గిరిజన గ్రామాలకూ ఇంటర్నెట్: సిఎం గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. గతంలో ఎన్నడూలేని విధంగా గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చామని, వారికి రైతు భరోసా […] Category: Trending News, ఆంధ్ర ప్రదేశ్ by NewsDeskLeave a Comment on అన్ని గిరిజన గ్రామాలకూ ఇంటర్నెట్: సిఎం ఆంధ్ర ప్రదేశ్ 59 mins ago Delhi Liquor Scam: ఇది వారి కుట్రే: మాగుంట అనుమానం ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని.... అమిత్ ఆరోరాతో తాను గానీ, తన కుమారుడు...
అమెరికాలో వచ్చిన అత్యంత తీవ్రమైన తుపానుల్లో ఒకటైన ఇయాన్ ఫ్లోరిడాలో విధ్వంసం సృష్టిస్తోంది. ఫ్లారిడా నైరుతీ ప్రాంతంలో బుధవారం తీరాన్ని దాటిన హరికేన్ ఇయాన్ మొత్తం ఆ రాష్ట్రాన్ని వర్షాలతో ముంచెత్తింది. నడుము లోతు […] Category: Trending News, అంతర్జాతీయం by NewsDeskLeave a Comment on ఫ్లోరిడాలో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ ఆంధ్ర ప్రదేశ్ 2 hours ago Constitution: రాష్ట్రంలో రాజ్యంగ స్ఫూర్తి లేదు: బాబు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా పరిపాలన సాగుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అధికారంలో ఉన్నాం కాబట్టి తామే...
సీఎం కేసీఆర్ (CM KCR) కొత్త పార్టీ ఆవిర్భావం కోసం కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లోనే ఉత్కంఠకు తెరపడనుంది. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) కొత్త పార్టీ ఆవిర్భావం కోసం కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లోనే ఉత్కంఠకు తెరపడనుంది. టీఎర్ఎస్ (TRS) పార్టీ కార్యవర్గం ఆమోదంతో జాతీయ పార్టీని ఆయన ప్రకటించనున్నారు. కేసీఆర్ ప్రకటించబోయే కొత్త పార్టీ ఇప్పుడు తెలంగాణ (Telangana) రాజకీయాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ స్థానంలో కొత్త జాతీయ పార్టీకి తీర్మానం కోసం బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి 283 మంది నేతలకు ఆహ్వానం పంపారు. ఉదయం 11గంటల 30 నిమిషాలకు తెలంగాణ భవన్‌కు కేసిఆర్ చేరుకుంటారు. మొదటగా కొత్త పార్టీ ప్రతిపాదన చేసి మాట్లాడతారు. అందులో బీసీ, ఎస్సీ, నేతలు ఉంటారు. దానికి ఆమోదం తెలుపుతూ టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం తీర్మానం చేస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1:19 నిమిషాలకు కేసిఆర్ కొత్త పార్టీ ప్రకటన చేస్తారు. అనంతరం కేసీఆర్ నిర్ణయాన్ని ఆమోదిస్తూ ఎమ్మేల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు సంతకాలు చేస్తారు. కేసీఆర్ పెట్టబోయే కొత్త పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ (Tejashwi Yadav), తమిళనాడు ఎంపీ మావలవన్‌తో పాటు మరో ముగ్గురు నాయకులు హాజరుకానున్నారు. అక్కడే నేతలందరితో కలిసి లంచ్ చేస్తారు. పార్టీ ప్రకటించిన వెంటనే రిజిస్ట్రేషన్ (Registration) ప్రక్రియ మొదలుపెడతారు. దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణ కోసం కేసీఆర్ కొత్త విమానాన్ని కొనుగోలు చేశారు. కొత్త విమానాన్ని దసరా రోజే వినియోగించబోతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం కొత్త విమానంలో ఢిల్లీకి పార్టీ ప్రతినిధులను పంపనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ బాధ్యతలు వినోద్ కుమార్, అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావుకు అప్పగించారు. కొత్త పార్టీ ప్రకటన తర్వాత ప్రజా ప్రతినిధులను ప్రగతిభవన్‌కు లంచ్‌కు కేసీఆర్ ఆహ్వానించారు. మధ్యాహ్న విందు ఏర్పాట్ల భాద్యతలు ఆర్మూర్ ఎమ్మేల్యే జీవన్‌రెడ్డి (Jeevan Reddy)కి కేసీఆర్ అప్పగించారు. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ కార్యకలాపాల కోసం ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. పార్టీ విస్తరణ, ఢిల్లీ బహిరంగ సభ తదితర అంశాలపై హస్తిన పార్టీ కార్యాలయంలో ఈ నెల 9వ తేదీన సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ కీలక నేతలను ఢిల్లీకి తీసుకువెళ్లనున్నారు. కొత్త పార్టీ ప్రకటించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కేడర్ మొత్తం సంబరాలు చేయడానికి సన్నద్దమయ్యాయి. తెలంగాణ భవన్ ఎదుట బాణసంచా కాల్చి ప్రకటనను స్వాగతించే ఏర్పాట్లు జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్‌కు అప్పగించారు. ఇక కేసీఆర్ పార్టీకి మద్దతు తెలుపుతూ, కేసీఆర్ వెంటే మేము అంటూ నగరం మొత్తం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. మొత్తానికి జాతీయ పార్టీ ఏర్పాటు స్పీడ్ పెంచిన గులాబీ దళపతి పక్క ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నారు. మునుగోడులో గెలిచి జాతీయ పార్టీగా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనే కేసీఆర్‌ యోచిస్తున్నట్లు సమాచారం. నామినేషన్ వేసే నాటికి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని పార్టీ ముఖ్యులకు కేసీఆర్ తెలిపినట్లు చెబుతున్నారు. కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటనతో ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్ ఇక చరిత్రగా మిగిలిపోనుంది. మరి చరిత్ర సృష్టించిన టీఆర్ఎస్ స్థానంలో వచ్చే కొత్త పార్టీ ఏ మేరకు సక్సస్ అవుతుందో చూడాలి.
మా పాఠకులు మాకు మద్దతు ఇస్తారు. ఈ పోస్ట్ అనుబంధ లింక్‌లను కలిగి ఉండవచ్చు. మేము అర్హత కొనుగోళ్ల నుండి సంపాదిస్తాము. ఇంకా నేర్చుకో నరుటో అనిమే సిరీస్‌లో కాకాషి హటాకే అత్యంత ప్రజాదరణ పొందిన పాత్ర. కాపీ నింజా కకాషి అతని పాత్ర చుట్టూ చాలా రహస్యాలను కలిగి ఉంది, వాటిలో ఒకటి అతని ఎడమ కన్నులో ఉన్న షేరింగ్. నరుటో షిప్పుడెన్ యొక్క 120వ ఎపిసోడ్‌లో కాకాషి హటాకే తన స్నేహితుడు ఒబిటో ఉచిహా నుండి అతని షేరింగ్‌ని పొందాడు. కాకాషి చాలా కాలం క్రితం తన ఎడమ కన్ను కోల్పోయాడు మరియు ఒబిటో అతనికి ప్రత్యామ్నాయంగా తన కంటిని అందించాడు. ఒక మిషన్ సమయంలో, ఒబిటో ప్రాణాంతకమైన గాయాలను చవిచూశాడు మరియు మరణిస్తున్నప్పుడు అతను తన చక్రాన్ని మరియు షేరింగ్‌ను కాకాషికి అందించాడు. కాకాషి తన షేరింగ్‌ని కోల్పోయాడా, అది అతనికి ఎలాంటి అధికారాలను ఇస్తుందో మరియు ఇతర సాధారణ అభిమానుల FAQలను తెలుసుకోవడానికి చదువుతూ ఉండండి. కాకాశికి రెండు కళ్లలో షేరింగ్ ఎలా వచ్చింది? నరుటో: షిప్పుడెన్ అనే యానిమే సిరీస్ యొక్క 'ది షేరింగన్ రివైవ్డ్' అనే శీర్షికతో ఎపిసోడ్ #473లో నాల్గవ నింజా యుద్ధంలో కాకాషికి షేరింగన్ రెండు కళ్లలో కనిపించాడు. నరుటో మరియు సాసుకేలను రక్షించడానికి ఒబిటో తనను తాను త్యాగం చేసిన తర్వాత, అతను తన చక్రాన్ని కాకాషిలోకి మార్చడానికి కముయిని ఉపయోగించాడు. ఒబిటో యొక్క చక్రం కాకాషికి రెండు కళ్ళలో షేరింగన్‌ను కలిగి ఉండేలా చేసింది. చనిపోయే ముందు, జోనిన్‌గా పదోన్నతి పొందినందుకు కాకాషికి ఒబిటో తాత్కాలికంగా 2 మాంగేక్యో షేరింగ్‌ని బహుమతిగా ఇచ్చాడు. ఒబిటో కాకాషిని హోకేజ్‌గా ఎలా చూడాలనుకుంటున్నాడో పంచుకున్నాడు. ఇది కూడా చదవండి: కాకాషి హోకేజ్‌గా మారినప్పుడు తెలుసుకోండి! కాకాషి తన భాగస్వామ్యాన్ని ఎలా కోల్పోయాడు? నాల్గవ నింజా యుద్ధంలో మదారా ఉచిహా కాకాషి యొక్క షేరింగ్‌ను దొంగిలించాడు. ఆ సమయంలో, కాకాషి వద్ద ఒక షేరింగన్ మాత్రమే ఉంది, అతను ఎపిసోడ్ #120లో బండరాయితో నలిగినప్పుడు ఒబిటో నుండి తిరిగి పొందాడు. కముయిని ఉపయోగించడానికి మరియు ఒబిటో ఉన్న కముయి డైమెన్షన్‌లోకి ప్రవేశించడానికి మదారా షేరింగన్‌ను దొంగిలించింది. అతను ఒబిటో నుండి రిన్నెగన్‌ను తిరిగి పొందాలని మరియు తన శక్తిని పెంచుకోవాలని కోరుకున్నాడు. తరువాత, నరుటో కాకాషిని నయం చేయడానికి మరియు అతని కోసం మరొక కన్ను సృష్టించడానికి సిక్స్ పాత్స్ యొక్క సేజ్ యొక్క శక్తిని ఉపయోగించాడు. కాకాషి తన భాగస్వామ్యాన్ని ఎందుకు ఆఫ్ చేయలేకపోయాడు? కాకాషి తన షేరింగ్‌ను ఆఫ్ చేయలేడు ఎందుకంటే అది ఒబిటోకు చెందినది మరియు అతనికి కాదు. షేరింగ్‌ను యాక్టివేట్ చేయడం మరియు డియాక్టివేట్ చేయడం అనేది ఉచిహా మాత్రమే చేయగలదని చాలామంది నమ్ముతారు. కాకాషి ఉచిహా కాదు, అందుకే అతను దానిని ఆఫ్ చేయలేడు. కకాషి షేరింగ్‌ని తన కంటి కుహరానికి ఎలా జతచేయడం వల్ల దానిని నిష్క్రియం చేయలేకపోయాడని కొందరు నమ్ముతారు. ఒబిటో, చనిపోయే ముందు, క్రూరంగా తన కంటి సాకెట్ నుండి కంటిని తీసివేసి, నరాలను తీవ్రంగా దెబ్బతీశాడు. ఇది రీఅటాచ్‌మెంట్ ప్రక్రియను ప్రభావితం చేసింది, కకాషికి కంటిపై పూర్తి నియంత్రణ ఉండటం కష్టమైంది. షేరింగన్ కాకాషిని బలహీనపరిచిందా? కాదు, షేరింగన్ కాకాషిని బలహీనపరచలేదు, కానీ వాస్తవానికి అతనికి విభిన్న సామర్థ్యాలను అందించాడు. ఇంకా, కాకాషిని మొదట కాపీ నింజా అని పిలవడానికి మరియు అతనిని అంత శక్తివంతంగా మార్చడానికి షరింగన్ కారణం. కంటి అతనిని జుట్సస్ యొక్క విస్తారమైన శ్రేణిని నేర్చుకోవడానికి అనుమతించింది, అతను షేరింగన్ లేకుండా చేయలేడు. షేరింగన్ కాకాషిని కొద్దిగా బలహీనపరిచిందని కొందరు నమ్ముతారు. కాకాషి షేరింగన్‌ను నిష్క్రియం చేయలేడు, అది అతని చక్రాన్ని హరించివేస్తుంది మరియు సుదీర్ఘ పోరాటాలలో సమస్యాత్మకంగా ఉంటుంది. అయినప్పటికీ, కాకాషి షేరింగ్‌తో లేదా లేకుండా చాలా ప్రతిభావంతుడైన మరియు శక్తివంతమైన నింజా, మరియు అతను దానిని అనేక సందర్భాల్లో నిరూపించాడు. కాకాషిని కాపీ నింజా అని ఎందుకు పిలుస్తారు? నరుటో విశ్వంలో 1000 జుట్సులను కాపీ చేసి ప్రావీణ్యం సంపాదించిన కాకాషి హటాకేని 'కాపీ నింజా' అని పిలుస్తారు. జోనిన్-స్థాయి షినోబి లీఫ్ విలేజ్‌లోని బలమైన నింజాలలో ఒకరు మరియు టీమ్ 7కి కూడా నాయకుడు. కాకాషికి కాపీ నింజా అనే మారుపేరు ఉంది, ఎందుకంటే అతను షేరింగ్‌ని ఉపయోగించి తన ముందు ఉపయోగించే ఏదైనా నింజుట్సుని కాపీ చేయగలడు. సామర్ధ్యం అతనిని విస్తారమైన నైపుణ్యాన్ని కలిగి ఉండటానికి అనుమతించింది, అతని శక్తులను మరింత పెంచుతుంది. అయినప్పటికీ, షేరింగన్ లేకపోయినా, కాకాషి చాలా ప్రతిభావంతుడు మరియు ఏదైనా జుట్సును సులభంగా నేర్చుకోవచ్చు. కాకాషి అన్ ఉచిహా? లేదు, కకాషి హతకే ఉచిహా కాదు. వాస్తవానికి, అతను ఉచిహా వంశంతో నేరుగా సంబంధం కలిగి లేడు. కాకాషి తన స్నేహితుడు మరియు సహచరుడు ఒబిటో ఉచిహా నుండి ఉచిహా-నిర్దిష్ట సామర్ధ్యం అయిన షేరింగన్‌ని పొందాడు. కాకాషి తన ఎడమ కన్ను ఎందుకు కప్పాడు? అతను కలిగి ఉన్న షేరింగన్ కారణంగా కాకాషి తన ఎడమ కన్ను కప్పుకున్నాడు. Sharingan పెద్ద మొత్తంలో చక్రాన్ని ఉపయోగిస్తుంది మరియు ఎక్కువ కాలం పాటు ఉంచినట్లయితే వినియోగదారుని పూర్తిగా ఖాళీ చేయవచ్చు. కాకాషి దానిని నిష్క్రియం చేయలేనందున, అతను వీలైనంత వరకు వినియోగాన్ని తగ్గించడానికి తన కంటిని కప్పుకున్నాడు. కంటిని కప్పి ఉంచడం వల్ల షేరింగన్ వినియోగాన్ని పరిమితం చేయవచ్చు, పర్యావరణంలోని ప్రతి వస్తువును ట్రాక్ చేయకుండా నిరోధించవచ్చు. కాకాషి చక్రం యొక్క అదనపు పారుదలని నిరోధించడానికి కూడా ఈ పద్ధతిని ఉపయోగిస్తాడు. అయినప్పటికీ, కాకాషి యొక్క షేరింగన్ అతని చక్రంలో కొంత మొత్తాన్ని ఉపయోగించి ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంటాడు. కాకాషి ముఖాన్ని ఎవరు చూశారు? లీఫ్ విలేజ్‌లోని దాదాపు అందరూ కాకాషి ముఖాన్ని చూశారు, కానీ అది అతనేనని వారు గ్రహించలేదు. కాపీ నింజా మారువేషంలో ఉన్నాడు, అది అతనేనని ప్రజలు గుర్తించడం కష్టం. నరుటో: షిప్పుడెన్ అనే యానిమే ఎపిసోడ్ #469లో కాకాషి ముఖం వెల్లడి చేయబడింది. అదనంగా, టీమ్ ఏడుగురు సభ్యులు అతనిని వెంబడించినప్పుడు కాకాషి ఫేస్ రివీల్ ఎపిసోడ్ ఒక పూరక ఎపిసోడ్. నరుటో, సాసుకే మరియు సాకురా అతని ముఖాన్ని చూసేందుకు అతనిపై రకరకాల చిలిపి చేష్టలు చేస్తారు. ఇంకా ఏమిటంటే, నరుటో యొక్క మొత్తం సిరీస్‌లో, అతిపెద్ద రహస్యం కాకాషి ముఖం. అతని ఫేస్ రివీల్ మొత్తం నరుటో ఫ్యాండమ్‌ను తుఫానులోకి తీసుకువెళ్లింది, అభిమానులపై భారీ ప్రభావం చూపింది. ఇంకా, ఇది చాలా ఉత్కంఠను సృష్టించింది, అందరూ ఇప్పటికీ అతని ముఖం బహిర్గతం గురించి మాట్లాడుతున్నారు. బలమైన భాగస్వామ్యం ఎవరికి ఉంది? సాసుకే ఉచిహా బలమైన షేరింగ్‌ని కలిగి ఉన్నాడు మరియు ఎటర్నల్ మాంగేక్యో షేరింగ్‌ని కలిగి ఉన్నాడు. ఎటర్నల్ మాంగేక్యో షేరింగ్‌ అనేది సామర్ధ్యం యొక్క బలమైన రూపం, మరియు అది ఎప్పటికీ గుడ్డిది కాదు. షేరింగన్ అతన్ని అమతెరాసు అనే నల్లటి జ్వాలని ఉపయోగించేందుకు అనుమతిస్తుంది, ఇది ఏడు రోజుల పాటు నేరుగా మండుతుంది. నల్లని జ్వాల భయంకరంగా శక్తివంతమైనది మరియు సూర్యుని వలె వేడిగా ఉంటుంది, దాని లక్ష్యాన్ని బూడిదగా చేస్తుంది. అదనంగా, చాలా శక్తివంతమైన సామర్థ్యం ఉన్నప్పటికీ, ఎటర్నల్ మాంగేక్యో షేరింగన్ దాని వినియోగదారుకు హాని కలిగించదు.
అహింస విధానంలో స్వాతంత్య్రం తెచ్చి పెట్టిన మహాత్మాగాంధీ మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ కోరారు. జీబీసీరోడ్డులో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తున్న కలెక్టర్‌, జేసీ తదితరులు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ప్రపంచ దేశాలను కదిలించిన మహనీయుడు జయంతి కార్యక్రమంలో కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ బాపట్ల, అక్టోబరు 2: అహింస విధానంలో స్వాతంత్య్రం తెచ్చి పెట్టిన మహాత్మాగాంధీ మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ కోరారు. గాంధీ జయంతి సందర్భంగా జీబీసీరోడ్డులోని విగ్రహానికి జేసీ డాక్టర్‌ కె.శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌ తదితరులతో కలిసి కలెక్టర్‌ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశస్వాతంత్య్ర కోసం శాంతియుత మార్గంలో గాంధీజీ నడిచి ప్రపంచ దేశాలను కదిలించిన గొప్పమహనీయుడని చెప్పారు. హింస లేకుండా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నడిపిన ఉద్యమకారులని కొనియాడారు. బాపట్ల ప్రాంతానికి గాంధీజీ మూడు పర్యాయాలు వచ్చారని గుర్తు చేశారు. ఆయన భావజాలం ప్రతిఒక్కరిలో రావాలన్నారు. ఆయన నేర్పిన అహింసామార్గంలో నడుస్తామంటూ ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ డీఈ కె.శ్రీనివాసులు, శానిటరి ఇన్‌స్పెక్టర్‌ కొండయ్య తదితరులు పాల్గొన్నారు. పెన్సిల్‌పై మహాత్మాగాంధీ జీవిత చరిత్ర జిల్లాలోని కారంచేడు మండలం స్వర్ణగ్రామానికి చెందిన అన్నం మహిత మహాత్మాగాంధీ జీవిత చరిత్రను పెన్సిల్‌ మీద రాసి ఆ కళారూపాన్ని ఆదివారం కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌కు అందజేశారు. గాంధీజీ చరిత్రను చూసిన కలెక్టర్‌ ఆ మహిళను అభినందించారు. ఇప్పటికే పెన్సిల్‌ మీద పలువురు పేర్లు, చిత్రపటాలు, వారి జీవిత చరిత్రలు చెక్కుతూ సూక్ష్మకళాకారునిగా ప్రాచుర్యం పొందారన్నారు.
సంగారెడ్డి, వెలుగు: పొద్దున ఇరిగేషన్ ప్రాజెక్టుల కమీషన్లు, రాత్రి ధరణి పోర్టల్ చూసి ఏయే భూములు ఎక్కడున్నయో తెలుసుకునుడే సీఎం కేసీఆర్ దినచర్యగా మారిందని.. రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ అన్నారు. విద్య, వైద్యంపై తీవ్రమైన నిర్లక్ష్యంగా కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో విద్యను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వ విద్యాలయాల్లో ఫుడ్ పాయిజన్లు అయితున్నా కేసీఆర్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఒకే విధంగా పాలిస్తున్నారని విమర్శించారు. భారత్​ జోడో పాదయాత్ర గురువారం సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, అందోల్ నియోజకవర్గాల పరిధిలో కొనసాగింది. సాయంత్రం చౌటకూర్​ మండలం శివంపేట కార్నర్ మీటింగ్​లో రాహుల్ మాట్లాడారు. నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయంతో లక్షల మంది ఉద్యోగాలు పోయాయన్నారు. జీఎస్టీ వల్ల చిన్నతరహా సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లి దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. మోడీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు కేసీఆర్ మద్దతు పలికారని వాళ్లిద్దరు తోడు దొంగలని విమర్శించారు. స్విచ్ వేస్తే లైట్ వెలిగినట్లు మోడీ ఆదేశించగానే కేసీఆర్ ఆచరించి చూపిస్తారని చెప్పారు. దేశంలో మోడీ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా పాలన కొనసాగిస్తున్నారన్నారు. తాను మాత్రం భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నట్టు తెలిపారు. కర్నల్ ​సంతోష్ కుటుంబానికి అవమానం భారత భూభాగంలోని 2వేల కిలోమీటర్లు చైనా ఆక్రమిస్తే మోడీ చూస్తూ కూర్చున్నారని రాహుల్​ విమర్శించారు. ‘‘కర్నల్ సంతోష్ బాబు ప్రాణత్యాగం వృథా అయ్యింది. సంతోష్ వీరమరణం పొందాక చైనా ఇండియా భూభాగంలోకి రాలేదని ప్రధాని అంటున్నడు. దీన్ని బట్టి చూస్తే మోడీ సంతోష్ బాబు కుటుంబాన్ని అవమాన పరిచినట్టే’’ అని రాహుల్ మండిపడ్డారు. సంతోష్ బాబు వీర మరణాన్ని మరిచిపోలేక పోతున్నానని.. దేశంలో కోసం ఆయన ప్రాణత్యాగం చేశానని తెలిపారు. జగ్గారెడ్డితో స్టెప్పులు భారత్ జోడో యాత్ర సంగారెడ్డిలో వివిధ కులసంఘాల సంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా సాగింది. బుడగజంగాలు, పెద్దమ్మలొల్లతో కలిసి రాహుల్ చర్నకోల విన్యాసాలు చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పెద్దమ్మలొల్లతో కలిసి డ్యాన్స్​ చేస్తుండగా రాహుల్ కూడా ఆయనతో జత కలిసి చర్నకోల పట్టుకొని తనను తాను కొట్టుకుంటూ స్టెప్పులు వేయడంతో అక్కడంతా సందడిగా మారింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జై కాంగ్రెస్​ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు పోతిరెడ్డిపల్లిలో బ్రేక్​ఫాస్ట్ చేశాక రాహుల్ గిరిజనులతో కలిసి ధింసా నృత్యం చేశారు. కాంగ్రెస్​ సీనియర్ల డ్యాన్స్​లు జోడో యాత్ర సభ వేదికపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్టెప్పులు వేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. రాహుల్ ప్రసంగం ముగిశాక వీహెచ్ హన్మంతరావు, దామోదర్ రాజనర్సింహ్మ, ఆవుల రాజిరెడ్డి, మదన్​మోహన్​రావు తదితర సీనియర్లంతా జోడో జోడో అనే పాటకు డ్యాన్స్ చేశారు. స్టేజీపైన వారి డ్యాన్స్ కింద ఉన్న నాయకులు, కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపింది. జోడో యాత్రలో పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, ఉత్తమ్​కుమార్​రెడ్డి, సీతక్క, షబ్బీర్​అలీ, సంపత్​కుమార్, కుసుమకుమార్​ పాల్గొన్నారు.
జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం అధికారులంతా అప్రమత్తంగా ఉండండి మ‌రోసారి గొప్ప‌ మ‌న‌సు చాటుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు You are here హోం » టాప్ స్టోరీస్ » ప్ర‌తిప‌క్షం ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా..? ప్ర‌తిప‌క్షం ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా..? 17 Mar 2022 5:20 PM సభ సజావుగా జరగనివ్వకుండా అడుగడుగునా అడ్డంపడతారా..? అడ్డగోలుగా మాట్లాడేవారిని సస్పెండ్‌ చేయక మరేంచేస్తారు..? గందరగోళం సృష్టించేబదులు చంద్రబాబులా ఇంటిదగ్గరే ఉంటే సరిపోయేది కదా..? టీడీపీ సభ్యుల తీరుపై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజం అసెంబ్లీ: ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి.. అదే నిజమని ప్రజలను నమ్మించాలనే దుర్బుద్ధితో ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తోందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శాసనసభా సంప్రదాయాలను గౌరవించకుండా టీడీపీ సభ్యులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగం మొదలు.. నేటి వరకు సభలో టీడీపీ సభ్యుల తీరు ఏ విధంగా ఉందో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ఏదో వంకపెట్టుకొని ఇంటిదగ్గర కూర్చున్నాడని, ప్రతిపక్ష సభ్యులు కూడా సభకు వచ్చి గందరగోళం సృష్టించేబదులు ఇంటి దగ్గరే ఉంటే సరిపోయేది కదా.. అని చుర‌కంటించారు. సభ సజావుగా జరగనివ్వకుండా సస్పెండ్‌ అయ్యి బయటకొచ్చి స్పీకర్‌ సహకరించడం లేదని, అన్యాయంగా సస్పెండ్‌ చేశారని టీడీపీ స‌భ్యులు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అంబ‌టి ధ్వ‌జ‌మెత్తారు. ప్రతిపక్ష నేతలు వేసిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పనివ్వకుండా అడ్డంపడి గొడవలు చేస్తున్నారన్నారు. పోడియం, వెల్‌లోకి, స్పీకర్‌ చైర్‌ దగ్గరకు వెళ్లి వేళ్లు చూపిస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతారన్నారు. ఇదేనా ప్రతిపక్షాలు ప్రవర్తించాల్సిన తీరు అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు చర్చించకుండా అడ్డగోలుగా మాట్లాడేవారిని సస్పెండ్‌ చేయక మరి ఏం చేస్తారన్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి చనిపోయారని ప్రతిపక్షం నానా యాగీ చేస్తోందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. జంగారెడ్డిగూడెంలోని మరణాలన్నీ సహజ మరణాలని ఆరోగ్యశాఖ మంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి సభలో చెప్పినా ప్రతిపక్షం వినిపించుకోకుండా ప్రభుత్వంపై నెపం మోపాలనే దురుద్దేశంతో ప్రవర్తిస్తుందన్నారు. సారాయి, మద్యంపై ప్రభుత్వం ఏ విధమైన విధానాన్ని అనుసరిస్తుందో ప్రజలకు తెలుసన్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పెట్టి అక్రమ మద్యం తయారు, సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని గుర్తుచేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో అక్రమ మద్యంపై చేసిన దాడులు ఎన్ని, కేసులు ఎన్ని, ఎంతమందిని పట్టుకున్నారు.. ఎంతవరకు అరికట్టేందుకు ప్రయత్నం చేశారు..? అని ప్రశ్నించారు. 2016లో 47 వేల కేసులు, 2017లో 13 వేల కేసులు, 2018లో 11 వేల కేసులు పెట్టారని ఎమ్మెల్యే అంబటి చెప్పారు. అక్రమ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో సీఎం వైయస్‌ జగన్‌ ఒక వ్యవస్థను క్రియేట్‌ చేశారని, 2020–22 కాలంలో ఏకంగా 92 వేల కేసులు పెట్టి అక్రమ మద్యాన్ని ధ్వంసం చేయించారని గుర్తుచేశారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
Karthika Deepam Serial Today Episode 773 today stream on hotstar and star maa as per schedule. Looking to know what happen in today episode check written update in telugu. In yesterdays episode deepa and karthik trying to speak together. మీరు ఎదురు చూస్తున్న కార్తీక దీపం తెలుగు సీరియల్ నేడు 772 ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. నేటి ఎపిసోడ్ లో శౌర్య మరియు డాక్టర్ బాబు తో హిమ మంచిది స్కూల్ లో ఎవరు అయిన ఎమయినా అంటే మౌనంగా ఉంటుంది, నేను స్కూల్ లో ఎవరు ఏమి అనకుండా చూస్కుంటాను, వేరే స్కూల్ లో నేను ఉండను కదా దయ చేసి స్కూల్ మార్పించకండి అంటు నమస్కరిస్తుంది. అదే టైం లో అక్కడే పక్కకు ఉన్న వంటలక్క శౌర్య మాటలు వింటు చాలా బాధపడుతు తన మనసులో హిమ నా కూతురు అని చెప్పాలి అనుకున్నాను అమ్మని నేనే ఇంతలా ఆలోచించలేదే ఒక వేళా హిమ నా కూతురు అని చెప్పి ఉంటే ఏమయి ఉంటుంది అన్కుంటుంది. అదే సమయంలో శౌర్య డాక్టర్ బాబు తో నేను స్కూల్ నుంచి వెళ్ళిపోతాను, హిమ ని ఇదే స్కూల్ లో ఉంచండి అంటుంది. అది విన్న వంటలక్క శౌర్య ని ప్రేమ తో హత్తుకొని కన్నీరు కారుస్తు శౌర్య (అత్తమా) ఎంత మంచిదానివి, మీ మనసు నాకు అర్థం కాలేదు అని నేను సిగ్గు పడుతున్నాను అంటు డాక్టర్ బాబు తో న కూతురు ఏంటి అని నా కంటే ముందు మీకే అర్థం అయింది, మీ గురుంచి ఎవ్వరకి చెప్పాలని నా కూతురి కి లేదు, మీరు పిలవమనే దాక మిమల్ని డాక్టర్ బాబు అని పిలవదు అని చెప్తుండగా కార్తీక్ దీప తో 2 నిముషాలు మాట్లాడాలి ఆంటాడు Karthika Deepam Serial Today Episode 773 అప్పుడు శౌర్య తన తో తాను గా ఎంత చెప్పిన డాక్టర్ బాబు హిమ ఇక్కడే ఉంటుంది అని ఎందుకు చెప్పడం లేదు, హిమ ని తీసుకోని వెళ్తాడా అనుకుంటుంది, అదే సమయంలో డాక్టర్ బాబు దీప తో ఇప్పుడు దీప తో నా మీద గురి పెట్టావా, ముందు మురళి కృష్ణ వెంట పడ్డాడు, తర్వాత బాగ్యం, తర్వాత సౌందర్యమ్మ అప్పుడు పప్పులు నా దగ్గర ఉడకవని తెలిసిపోయింది. తరువాత మా నాన్న, అమ్మ , తమ్ముడు వంతు అయిపోయాక ఇప్పుడు హిమ కనిపించింది, దానికి దగ్గర అయి నా ఇంట్లో కి అడుగు పెట్టాలని అనుకుంటున్నావా ఆంటాడు. అప్పుడు దీప ఇంత మందికి నా పవిత్రాత గురుంచి తెలిసిందే, అందరు డాక్టర్ బాబు వంటలక్క కలిసిపోతో బాగుంటుందే అంటుంటే మీరు ఒక్కరే కాదనుకున్తున్నారే, ఎందుకు గుర్తించడం లేదే అంటుంది.
Nov 11, 2022 #Pawan Kalyan# interesting comments after meeting Prime Minister Modi, #Vishakhapatnam, janasena party, Latest365Telugu.com News, pm narendramodi, Vizag Spread the News 365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,విశాఖపట్నం, నవంబర్11, 2022: ప్రధాని మోదీని కలిసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. “భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు ఈ రోజు జరిగిన మీటింగ్ మంచి రోజు తీసుకువస్తుందని నమ్ముతున్నా” అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. “సుమారు 8 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి మోడీతో సమావేశ మయ్యాను.. రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విశాఖ వస్తుంది సందర్భంగా భేటీ పై సమాచారం ఇచ్చారు”. http://dhunt.in/FbJJd ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన మీటింగ్ ఇది: పవన్ కళ్యాణ్ https://m.dailyhunt.in/buzz/video/telugu/misc/pradhaani+modini+kalishaaka+pavan+kalyaan+kaaments-dh4fcab02e50334d6f8a069dbf5eaa5131_77a9db7061ec11ed96bf73b9fd74346c “ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశ్యం, ప్రధానమంత్రి ఆకాంక్ష ఆకాంక్ష , ఆంధ్రప్రదేశ్ బాగుండాలి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి చెందాలి అని. తెలుగు ప్రజల సఖ్యత బాగుండాలి” అని పవన్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. నాకు అవగాహన ఉన్నంతమేరకు అన్ని విషయాలను తెలియజేశాను..మిగిలిన విషయాలు తరువాత తెలియజేస్తా” అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. https://m.dailyhunt.in/buzz/video/telugu/misc/pradhaani+modini+kalishaaka+aasaktikara+kaamentschesina+pavan+kalyaan-dh77a25b9ac767481baad1a07a94430cad_615889a061e911ed9a3e335327c1bddd
రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయి ధరమ్ తేజ్ గత మూడురోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. X అపోలో వైద్యులు సాయిధరమ్‌తేజ్‌కు కాలర్‌బోన్‌ సర్జరీ పూర్తి చేశారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. క్రమంగా మెరుగుపడుతోందని తెలుపుతూ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సర్జరీ తర్వాత 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతున్నామన్నారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సర్జరీ జరిగిందని.. త్వరలోనే తేజ్ పూర్తిగా కోలుకుంటాడని వివరించారు. నిన్నటి నుంచి తేజ్‌ కాస్త స్ఫృహలోకి వచ్చి నెమ్మదిగా కోలుకుంటుండడంతో కాసేపు వెంటిలేటర్ తీసారు. ఆ సమయంలో కొంచెం నొప్పిగా ఉందని తేజ్‌ చెప్పినట్టు సమాచారం. సర్జరీకి రెండ్రోజులు ఆగాలా.. ఇవాళే చేయాలా అనే దానిపై ముందుగా కుటుంబ సభ్యులతో చర్చించారు. మరోసారి టెస్ట్‌లు, ఎక్సరేలు తీసిన తర్వాత ఇవాళే అది పూర్తి చేశారు. చిరంజీవి సహా మెగా కుటుంబ సభ్యులంతా అపోలో ఆస్పత్రిలోనే ఉన్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల 5 నిమిషాలకు దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి దాటిన తర్వాత నోవార్టిస్ సమీపంలో బైక్‌ యాక్సిడెంట్‌లో సాయిధరమ్‌ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్పోర్ట్స్‌ బైక్ స్కిడ్ అయ్యి పడిపోవడంతో దాదాపు 30 మీటర్లు జారుకుంటూ దొర్లిపడిపోయాడు. ఆ యాక్సిడెంట్‌కి సంబంధించి తాజాగా మరికొన్ని దృశ్యాలు బయటకు వచ్చాయి. ప్రమాదాన్ని గమనించిన వెంటనే అటుగా వెళ్తున్న వాహనదారులు తేజ్‌ను జాగ్రత్తగా ఫుట్‌పాత్‌పై కూర్చోపెట్టి సపర్యలు చేశారు. ముందుగా తేజ్‌కి సాయం చేసిన అబ్దుల్ అనే వ్యక్తే 108కి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. 100కి కూడా ఫోన్ చేసి పోలీసులకు ప్రమాద విషయం చెప్పారు. అంబులెన్స్ వచ్చే వరకూ అక్కడే ఉండి సాయం చేశాడు. ఈ ప్రమాదం తర్వాత సాయిధరమ్‌ తేజ్‌.. ఫుట్‌పాత్‌పై మాట్లాడలేని స్థితిలో కూర్చున్న దృశ్యాలు యాక్సిడెంట్ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. తలకు హెల్మెట్ ఉండడం, జర్కిన్ వేసుకుని ఉండడం వల్ల పెను ప్రమాదం నుంచి తేజ్ బయటపడ్డాడు. ఈ యాక్సిడెంట్‌లో సాయిధరమ్‌ తేజ్‌ కంటికి కూడా గాయమైంది. మొదట అక్కడున్న వాళ్లెవరూ అతన్ని గుర్తుపట్టలేదు. ఎవరో మామూలువ్యక్తే అనుకున్నారు. అంబులెన్స్ వచ్చాక మొహంపై రక్తం తుడుస్తుండగా ప్రమాదానికి గురైంది తేజ్ అని గమనించారు. 10 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేసరికే దెబ్బల తీవ్రతకు తేజ్ స్ఫృహతప్పాడు. ఆపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అపోలో ట్రీట్‌మెంట్‌కి నెమ్మదిగా కోలుకుంటున్నాడు.
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 - స్వగ్రామం పొన్నవరంలో సందడి - స్నేహితులు, గ్రామస్థులతో మాటామంతీ కంచికచర్ల, ఆగస్టు 20 : భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణకు శనివారం స్వగ్రామం వీరులపాడు మండలం పొన్నవరంలో ఘనస్వాగతం లభించింది. విజయవాడ, గుంటూరు కార్యక్రమాల అనంతరం సాయంత్రం సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామం మీదుగా పొన్నవరం చేరుకున్నారు. గ్రామస్థులతో పాటుగా అర్చకులు, వేదపండితులు ఎదురేగి పూర్ణకుంభంతో స్వాగతం పలికి శివాలయంలోకి తీసుకువెళ్లగా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులతో కొద్దిసేపు ఆయన గడిపారు. బంధువులు, గ్రామస్థులు, స్నేహితులను పేరు పేరున అడిగి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం కారులో హైదరాబాదుకు తిరిగి వెళ్లారు. పేరకలపాడులో మొక్క నాటిన సీజేఐ.. తొలుత పేరకలపాడు గ్రామంలో జస్టీస్‌ రమణకు సర్పంచ్‌ మన్నె సాత్విక ఆధ్వర్యంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. దేవాలయం ప్రాంగణంలో జస్టిస్‌ రమణ మామిడి మొక్కను నాటారు. ఎంటెక్‌ చదివి సర్పంచ్‌గా గ్రామాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న సాత్వికను ఆయన అభినందించారు. కార్యక్రమంలో చవళం శ్రీనివాసరావు, గద్దె మల్లికార్జునరావు, చుండూరు లక్ష్మినరసింహారావు, గద్దె నరసింహారావులు పాల్గొన్నారు. సీజేఐ జస్టిస్‌ రమణను అమరావతి రైతు నాయకులు అత్తోటి సుబ్బారావు, నల్లూరి రాంబాబు, వెలగా వెంకటేశ్వరరావు, ఒంగోలుకు చెందిన రైతు నాయకుడు చుండూరు రంగారావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ నేతలు తదితరులు దుశ్శాలువాలు, పూలగుచ్ఛాలతో సత్కరించారు. సీజేఐ హోదాలో రెండోసారి స్వగ్రామం పొన్నవరం వచ్చిన సందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ సీపీ కాంతిరాణా పర్యవేక్షణలో డీసీపీ మేరీ ప్రశాంతి, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు బందోబస్తులో పాల్గొన్నారు. కార్యక్రమంలో జేసీ శ్రీవాస్‌ నుపూర్‌ అజయ్‌, నందిగామ ఆర్డీవో రవీంద్రరావు, కంచికచర్ల, వీరులపాడు మండలాలకు చెందిన స్థానిక అధికారులు పాల్గొన్నారు.
Telugu Online News > Entertainment > Lasya : లేబర్ పని చేస్తున్నా అంటూ యాంకర్ లాస్య భర్త వీడియో వైరల్…. EntertainmentFeaturedNewsప్రత్యేకంఫొటోస్వైరల్ Lasya : లేబర్ పని చేస్తున్నా అంటూ యాంకర్ లాస్య భర్త వీడియో వైరల్…. Last updated: 2022/11/15 at 8:10 PM Shekar's Writings Published November 15, 2022 Lasya : ఒకప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే మ్యూజిక్ లైవ్ షోస్ కి మంచి క్రేజ్ ఉండేదని చెప్పవచ్చు. అలాగే ఈ మ్యూజిక్ లైవ్ షోస్ కి కాల్ చేసి చాలామంది తమకు నచ్చిన పాటలను ప్లే చెయ్యమని అడగటం, ఇంకొందరైతే ఏకంగా తమకి నచ్చిన వ్యక్తుల కోసం పాటలు ప్లే చెయ్యమని అడగటం వంటివి చేసేవాళ్ళు.. అయితే మా మ్యూజిక్ ఛానెల్ లో ప్రసారమయ్యే సంథింగ్ సంథింగ్ మ్యూజిక్ లైవ్ షో ప్రేక్షకులను ఎంతగానో అలరించిది యాంకర్ లాస్య. కాగా యాంకర్ లాస్య తన క్యూట్ క్యూట్ మాటలతో బుల్లి తెర ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో యాంకర్ లాస్య మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే క్రేజ్ బాగానే పెరిగింది. ఆ తర్వాత అనుకోకుండా యాంకర్ లాస్య తన వ్యక్తిగత జీవితం లో జరిగిన కొన్ని సంఘటనలు కారణంగా కొంతకాలంగా ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నప్పటికీ పెళ్లయిన తర్వాత మళ్లీ బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ బాగానే ఆకట్టుకుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో యాంకర్ లాస్య సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడదప్పుడూ తనకి సంబందించిన ఫోటోలు వీడియోలు, వంటివి షేర్ చేస్తూ బాగానే అలరిస్తోంది. అయితే ఈ క్రమంలోయాంకర్ లాస్య తన భర్త మంజునాథ్ తో సరాడగా చేసిన రీల్స్ ని కుడా తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులను సరదాగా నవ్విస్తూ ఉంటుంది. అయితే తాజాగా యనక్ర్ లాస్య తన భర్త మంజునాథ్ తో చేసిన ఓ రీల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా ఇందులో మంజునాథ్ అంట్లు కడుగుతూ సోషల్ మీడియా రీల్స్ లో బాగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ డైలాగ్ అయిన రాసి పెట్టి లేదేమో ఎంజాయ్ చెయ్యడం, లేబర్ పని చెయ్యడం రాసిపెట్టి ఉందేమో అనే డైలాగ్ ని చెప్పాడు. దీంతో ఈ కామెడీ రీల్ తెగ వారాల్ అవుతోంది. అలాగే యాంకర్ లాస్య మంజునాథ్ దంపతులు చాలా అన్యోన్యంగా ఉంటారని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం ఇలా ఉండగా యాంకర్ లాస్య ప్రస్తుతం గర్భం దాల్చింది. దీంతో షూటింగులకు దూరంగా ఉంటూ ఇంటిపట్టునే ఉంటోంది. కాగా యనక్ర్ లాస్య ఆ మధ్య పలు చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది. కానీ ఈ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో లాస్య కి పెద్దగా గుర్తింపు లభించలేదు. కాగా ప్రస్తుతం యాంకర్ లాస్య ప్రస్తుతం తన ఫ్యామిలీ తో కలసి హైదరాబాద్ లో ఉంటున్నట్లు సమాచారం.
ఓ పక్క ఎండలు, మధ్యాహ్నం టైమ్ అందరూ ఓ కునుకు వేసేటప్పుడు నేను ఏ కిళ్లీ కొట్టు దగ్గరో సిగిరెట్ తాగొచ్చి మెల్లగా మా ఇంటి వెనుక గుమ్మం గుండా లోపలికి ప్రవేశిస్తుంటే సీన్ ఇది. నోరు తెరిస్తే ఆ స్మెల్‌ని బట్టి నేను సిగిరెట్ తాగొచ్చానో లేదో అర్థం చేసుకుని.. “ఏంటి బాబూ, ఇలాగైతే ఎలా చెప్పు” అంటూ మొహం అసహ్యంగా పెట్టుకుని లోపలికి వెళ్లేది. నేను అపరాధ భావాన్ని మోస్తూ లోపలికి వెళ్లి నిశ్శబ్ధంగా మంచం మీద పడుకునే వాడిని. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు మా పెద్దక్క ఉమక్క పెళ్లయింది, అలాగే ఇంటర్లో ఉన్నప్పుడు చిన్నక్క పద్మక్క పెళ్లయింది. భరత్ బావా, సుబ్బారాయుడు బావా సినిమాలకీ అటూ ఇటూ నన్ను కూడా తీసుకెళ్లే వారు, నేను వాళ్ల ఊళ్లు వెళ్లినప్పుడు! మా పెద్దక్క పెళ్లయిన కొన్నేళ్లకే భరత్ బావ చనిపోయారు. దాంతో తను మళ్లీ మా ఊరు వచ్చేయడం, తనూ, నేనూ మా మేనళ్లుల్లు రాజేష్, సుధీష్ కలిసి ఉండడం మొదలుపెట్టాం. మధ్యలో చాలా పరిణామాలు, స్థలాభావం వల్ల అన్నీ రాయలేను. ఉమక్క గానీ, పద్మక్క గానీ నన్ను “బాబూ” అనే పిలుస్తారు. ఇద్దరూ చాలా ప్రేమగా చూసుకుంటారు. వాళ్లిద్దరిలో నేను మా అమ్మని చూసుకుంటాను. చాలా ఏళ్ల పాటు ఒకే ఊళ్లో కలిసి ఉండడం వల్ల అలవాటు కొద్దీ నేను ఉమక్క దగ్గర ఎక్కువ గడిపినా పద్మక్క ఏ రోజూ నాకు చూపించే ప్రేమలో లోటు రానీయలేదు. నేను హైదరాబాద్‌లో సెటిల్ అయినా నాకు ఊళ్లో తల్లిదండ్రులు లేకపోయినా ఇప్పటికీ ఊరు వెళుతున్నాను అంటే వాళ్లిద్దరి కోసమే. ఎప్పుడు వెళ్లినా అందరం ఒక దగ్గర కలిసి గడుపుతుంటాం. ఇకపోతే నేను విజయవాడలో ICWA చదవడానికి వెళ్లినప్పుడు నన్ను దిగబెట్టడం మొదలుకుని, నేను తెనాలిలో ICWA కొనసాగిస్తూ స్లీపింగ్ పిల్స్ మింగి స్పృహ లేకుండా ఉన్న స్థితి వరకూ పలుమార్లు సుబ్బారాయుడు బావ నన్ను ఇంటికి తీసుకు రావడం, కనిపెట్టుకోవడం చేసేవాడు. ఇక్కడ మా ఆమ్మ (పెద్దమ్మ, మా అమ్మ వాళ్ల పెద్దక్క) గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఆమె పేరు “నిదానం”. తనకి పిల్లలు లేకపోవడంతో చిన్నప్పుడే మా పద్మక్కని దత్తత తీసుకుని పర్చూరు దగ్గర నాగులపాలెంలో పెంచి, పెళ్లి చేసింది. ఆమె కళ్లు పెద్దవి చేసుకుని గదిమితే ఒణికి పోవాల్సిందే. పిల్లలంటే అంతే ప్రేమా ఆమెకి ఉండేది. టెన్త్ అయ్యాక మా తాతయ్యతో మాట్లాడి నన్ను నాగులపాలెం తీసుకెళ్లి, పర్చూరు భవనం అంజిరెడ్డి కాలేజీలో నన్ను ఇంటర్‌కి చేర్చింది. మా ఊరు కాక మొట్టమొదటి సారి అప్పుడే ప్రపంచాన్ని చూశాను. రోజూ నాగులపాలెం నుండి పర్చూరు సైకిల్ మీద బాక్స్ కట్టుకుని కాలేజీకి వెళ్లే వాడిని. ఆ కాలేజీలో చదివేటప్పుడు రాఘవరావు అని ఓ మంచి మిత్రుడు ఉండే వాడు. చదువంటే అప్పుడప్పుడే ఆసక్తి పుట్టడంతో పర్చూరులో శివాలయంలో చెట్టు క్రింద ఇద్దరం పుస్తకాలేసుకుని చదువుకుంటూ కూర్చునే వాళ్లం. ఏదైనా బిల్డింగ్ ఉంటే దాని కిటికీకి వర్షం పడకుండా ఉండే అమరికలో జంప్ చేసి మరీ ఎక్కి కూర్చుని చదువుకునే వాళ్లం. “తెనాలి దగ్గర కొల్లిపరలో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు ఉన్నాయి, పేర్లు ఇవ్వండి” అని కాలేజీలో నోటీస్ వస్తే, ధైర్యం చేసి మొట్టమొదటి సారి పేరు ఇచ్చాను. వారం రోజుల పాటు రాత్రింబవళ్లు ప్రిపేర్ అయి క్విజ్ పోటీలో మా కాలేజీకి సెకండ్ ప్రైజ్ సంపాదించుకుని వచ్చాను. అప్పుడు మొట్టమొదటి సారి విజయం రుచి చూశాను. “నేను తక్కువ వాడినేమీ కాద”నే నమ్మకం అప్పుడు కలిగింది. మా నిదానం ఆమ్మ (పెద్దమ్మ) ఐదారేళ్ల క్రితం చనిపోయే వరకూ ఎప్పుడైనా ఊరెళితే “బాబూ శ్రీధరూ, ఇటు రామ్మా” అని మంచంలో కూర్చోబెట్టుకుని తలా, భుజాలూ నిమురుతూ కూర్చునేది. ఆ చిన్న వయస్సులో ఆమె చూపించిన ఆదరణకి ఎప్పటికీ కృతజ్ఞుతనై ఉంటాను. అలాగే నా జీవితంలో కీలక పాత్ర పోషించిన మరికొందరి గురించి ఖచ్చితంగా రాయాలి. మా రెండో పెద్దమ్మ వీరమ్మ వాళ్ల అబ్బాయి కాపు అంకమ్మ చౌదరి అన్నయ్య. ఆయనకి చిన్నతనంలో తండ్రి చనిపోయారు. ఒక్కడే చాలా కష్టపడి కుటుంబాన్ని చూసుకుని, పిల్లల్ని బాగా చదివించి చాలా గొప్పవాళ్లని చేశారు. తన పిల్లలు ఉదయ భాస్కర్ గానీ, బుల్లెమ్మాయి (నిక్ నేమ్) గానీ చాలా ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులుగా ఎదిగారు. నాకంటే వయస్సులో పదిహేనేళ్లకి పైగా పెద్దవాడైన అంకమ్మ అన్నయ్య దగ్గర డిసి‌ప్లెయిన్ నేర్చుకున్నాను. ఆయనంటే చాలా భయం ఉండేది. అలాగే వీరమ్మ ఆమ్మ రెండో సంతానం మా “నాగేంద్రం” అక్క. ఎవరికీ ఏ లోటూ లేకుండా పిండి వంటలు మొదలుకుని అన్నీ సమకూర్చడంలో ఆమెకి చాలా సంతృప్తి. ఇప్పటికీ ఎప్పుడైనా ఊరెళితే “అన్నం వండుతాను, తిని వెళ్లమ్మా శ్రీధర్” అంటూ చాలా ప్రేమగా చూసుకుంటుంది. నాగేంద్ర అక్క వాళ్ల అబ్బాయి వేణు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. దాదాపు ఒకటి రెండేళ్లు నాకంటే చిన్నవాడు. ఎవరికీ హాని చెయ్యకుండా, ప్రేమగా చూసుకోవడం తన నుండి నేర్చుకోవాలి. ఇద్దరం కలిసి అప్పట్లో కొత్తగా ఇంట్లో కొన్ని టివిలో క్రికెట్ మ్యాచ్‌లు చూసే వాళ్లం. ఇప్పటికీ తనంటే నాకు ఎక్కడ లేని ఇష్టం. తను నోరు తెరిచి మాట్లాడడం తక్కువ, కానీ తనలో ప్రేమ అనంతంగా ఉంటుంది. వేణూ నీపట్ల ఇష్టాన్ని, ప్రేమని ఇప్పటి వరకూ నేరుగా నేను ఎప్పుడూ చెప్పకపోయినా ఇప్పుడు చెబుతున్నా “నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ప్రేమ”. నా మేనల్లుళ్లు రాజేష్, సుధీష్, బుచ్చిబాబు, మేనకోడలు అనూష అంటే నాకు చాలా ఇష్టం. చాలాసార్లు ఉమక్క, పద్మక్క వాళ్లతో పాటు వీళ్లతో సరదాగా గడపడానికే ఊరెళుతుంటాను. “అంకుల్‌ని చూసి నేర్చుకోండి” అని ఉమక్క, పద్మక్క వాళ్లని ఒకటికి పదిసార్లు చెప్పడం, వాళ్లు నవ్వి ఊరుకోవడం ఎప్పుడూ జరిగే తంతే. మా జీవితాన్ని నేరుగా వాళ్లు చూడకపోయినా మా పట్ల వాళ్లు చూపించే ప్రేమ ఎక్కడా దొరకనిది. మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నన్ను మా నాన్నకి ఎలా అప్పజెప్పి కర్నూలు పంపారో, అప్పటి వరకూ మా తాతయ్య సంపాదించిన నగదును మా నాన్న వాళ్ల తమ్ముడు మా బాబాయికి సంరక్షించమని అప్పజెప్పారు. ఆ డబ్బుతో ఆయన నాకు పెళ్లి చేశారు. సరే డబ్బు, ఇతర విషయాలు పక్కనపెడితే నా పెళ్లికి నా తండ్రి రాకపోయినా, బాధ్యతగా దగ్గరుండి పెళ్లి చేసిన మా లక్ష్మి పిన్ని, బాబాయికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. లక్ష్మి పిన్ని ఇప్పటికీ చాలా ప్రేమగా చూసుకుంటుంది. అలాగే లక్ష్మి పిన్ని వాళ్ల తమ్ముడు నాగేశ్వరరావు మామయ్య, వాళ్ల భార్య అనిత చాలా ప్రేమగా చూసుకుంటారు. ఓ దశలో మా బాబాయి ఆర్థికంగా దెబ్బతిన్నాడు. వ్యాపారం కోసం తను తెచ్చిన చాలా అప్పులు తీర్చాల్సి వచ్చింది. ఉన్న దాంట్లో అందరికీ తలో కొంత సెటిల్ చేసే రోజు అది. మా తాతయ్య సంపాదన అప్పజెప్పిన దాంట్లో నా పెళ్లి ఖర్చులు పోనూ నాకు ఇంకా రావాల్సి ఉంది. దానికి సంబంధించిన మీటింగ్ జరుగుతోంది. అక్కడ మా నాన్నా, మా బాబాయి, వాళ్ల స్నేహితుడు మరొకరు ఉన్నారు. నాకు రావాల్సిన దాని గురించి ప్రస్తావన వచ్చింది. “నీకు రావాల్సింది ఇంకేమీ లేద”ని మా బాబాయి అంటే నేను పెద్దగా పట్టించుకునే వాడిని కాదేమో గానీ మా నాన్న ఆ మాట అన్నాడు. “నీకు ఇంకా రావాల్సిందేమీ లేదు” అని! ఆరోజు బాధేసింది నాన్నా, నిన్ను చూసి బాధ కన్నా జాలి పడ్డాను. ఓ కొడుకుకి నువ్వు ఇచ్చిన గౌరవం, విలువా ఇదా అని! సరే అయినా సరే నీ పట్ల నాకు ఇప్పటికీ ద్వేషం లేదు. ఎందుకంటే నేను మనుషుల్లో ప్రేమని చూస్తాను గనుక, అన్ కండిషనల్‌గా ప్రేమిస్తాను గనుక! ఇక నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలి. తన గురించి చివర్లో రాస్తున్నా, నేను ఈరోజు మీ ముందు ఇలా ఉన్నానంటే తనే ప్రధాన కారణం. తన సహకారం మరువలేనిది. చాలా మంది భార్యలు “నాకది కొనివ్వు, ఇది కొనివ్వు” అని సతాయిస్తుంటారు. భార్యాభర్తలకి మధ్య సయోధ్య ఉండదు. మరి దేవుడు నాకు ఓ వరంలా తనని ఇచ్చాడో ఏమో గానీ భారతీదేవి నాకు నిజంగా ఓ బలం. నేను ఎలా ఉన్నా, సంపాదించకపోయినా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఇప్పటి వరకూ తను ఎదురు చెప్పింది లేదు. అలాగని లోపల కుంగిపోయిందీ లేదు. నేను స్పిరిట్యువల్ జర్నీలో ఎలా ఉన్నానో తనూ జీవితాన్ని అలా ప్రేక్షకురాలిలాగే చూస్తుంది. నేను పనుల వత్తిడిలో పడి తనతో సరిగా టైమ్ స్పెండ్ చెయ్యకపోవడం ఒక్కటే తన ప్రధానమైన కంప్లయింట్. అలాంటి భార్య దొరకడం నిజంగా అదృష్టం. ఇక చివరిగా అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మా అమ్మమ్మ గురించి చెప్పాలి. తన గురించి అసలు మొదట్లోనే రాయాలి. మా అమ్మమ్మ కర్మయోగి లాంటిది. పొలం వెళ్లి ఒళ్లు హూనం చేసుకుని పనిచేసి ఒళ్లు నొప్పులు భరించలేక ఏది ఏ టాబ్లెట్‌నో కూడా చూసుకోకుండా, పొట్లంలో ఉన్న ఏదో టాబ్లెట్ రంగుని బట్టి వేసుకునేది. బక్కపలుచుగా ఉండేది. అసలు ఆమె చేసే కష్టం ఊహించలేనిది. ఆమె కడుపు నిండా తిండి తిన్న రోజులు తక్కువ. ఆమె చివరి దశలో కాలు స్లిప్ అయిన తుంటి పట్టేసి, కదలలేని స్థితికి వెళ్లింది. అప్పటి నుండి చనిపోయే క్షణం వరకూ మంచం మీదే. ఏళ్ల తరబడి పడుకోవడం వల్ల ఏర్పడే పుళ్లు తట్టుకోలేకపోయేది. “అమ్మా, అయ్యా” అని మూలిగేది. ఆమె మంచంలో అటూ ఇటూ తిరగలేకపోతే నేనో, ఉమక్కనో, ఎవరో ఒకళ్లం అటూ ఇటూ భుజం పట్టుకుని తిప్పాలి. కొన్నిసార్లు ఏదో చిరాకులో అలాంటి చిన్న సాయం కూడా ఆమెకి నేను చెయ్యలేదు.. నన్ను మనస్ఫూర్తిగా క్షమించు అమ్మమ్మా. మా అమ్మమ్మ పేరు వజ్రమ్మ. ఆమె పేరులాగే ఆమె నిజమైన వజ్రం. మా కుటుంబంలో అందరూ బొద్దుగా ఉంటారు. నేను ఒక్కడినే సన్నగా ఉంటాను, మా అమ్మమ్మలాగే. “నీకు వజ్రమ్మ సాలు వచ్చింది, నీలా ఉంటే ఎంత బాగుంటుందో” అని మా అక్క వాళ్లు తరచూ అంటుంటారు. ఇక నా పిల్లల సంగతి.. చాలామంది తరచూ అడుగుతుంటారు, మీకు ఎంతమంది పిల్లలు, ఏం చదువుతున్నారు అని! నాకు పిల్లలు లేరు. మా మిసెస్‌కి గైనిక్ ఇష్యూ వల్ల 2011 ప్రాంతంలో ఐవిఎఫ్‌కి వెళ్లాం. ప్రెగ్నెన్సీలో ఏడవ నెల తనకి ఫ్లూయిడ్ లెవల్ తగ్గిపోయి, విపరీతమైన బిపి వచ్చి లోపల ఆడపిల్ల (తర్వాత తెలిసింది) బ్రెయిన్ నుండి దాదాపు అన్ని ఆర్గాన్లు దెబ్బతిన్నాయి. డాక్టర్లు అబార్ట్ చెయ్యడం మంచిది అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అబార్ట్ చేయించాం. ఆరోజు ఉమక్కా నేనూ హాస్పిటల్ నుండి ఇంటికొచ్చి ఏడ్చిన సంఘటన ఇప్పటికీ నా కళ్ల ముందు ఉంది.. తండ్రి ఉన్నా లేనట్లే, తండ్రివి అయి ఆ ప్రేమని పంచుతావునుకుంటే అదీ అవలేదు” అంటూ ఉమక్క అంటుంటే కళ్లమ్మట నీళ్లు వచ్చాయి. భారతికి అడాప్ట్ చేసుకోవడం, సరోగసీ లాంటివి ఇక ఆసక్తి లేకపోవడంతో ఇద్దరమే ఒకరికొకరం ప్రేమగా ఉంటున్నాం. ఇవన్నీ తలుచుకున్నప్పుడే నాకు స్పిరిట్యువాలిటీ భావనలు వస్తాయి. నాకు బలమైన ఏ బంధాలనూ దేవుడు సృష్టించలేదు. ఈ భూమ్మీదకు వచ్చాక నా పని నేను, నా బాధ్యత నేను చేసుకుని వెళ్లేలాగే నా జీవితం, భారతి జీవితం కొనసాగింది తప్పించి, భూమ్మీద అతుక్కుపోవాలని, మనుషుల్ని వదిలిపెట్టకూడదు అనే మమకారం ఈ జీవితం మీద ఏర్పడలేదు. అలాగే నేను చిన్నప్పటి నుండి పడిన కష్టాలు జీవితం, మనుషులు, సమాజం అంటే ఏమిటో అర్థమయ్యేలా చేశాయి. ఇలాంటి జీవితం చూశాక స్పిరిట్యువల్‌గా మారకుండా ఎలా ఉంటాను? నా గమ్యం అదైనప్పుడు! అత్యంత ముఖ్యమైన మరో వ్యక్తి గురించి రాయాలి. ఆ వ్యక్తి వల్లనే నాకు జీవితం తెలిసింది.. సందర్భానికి తగ్గట్లు ఆ వ్యక్తి గురించి రాస్తాను. Sridhar Nallamothu Filed Under: అనుభవాలు ఇటీవలి పోస్టులు అంతా మంచే ఉండచ్చు కదా.. చెడు ఎందుకు ఉంటుంది? సిక్త్ డైమెన్షన్ – లైఫ్ పట్ల పూర్తి అవగాహన రావడానికి ఈ ఆర్టికల్ మిస్ అవకండి – Sridhar Nallamothu గుడికెళితే వినిపించే శబ్ధాల వెనుక సీక్రెట్ ఇది! – Sridhar Nallamothu 5వ డైమెన్షన్‌కి చేరుకునే వారు చాలా తక్కువ – సాధనతోనే సాధ్యం – ఇంట్రెస్టింగ్ విషయాలు Don’t Miss it – Sridhar Nallamothu నాలెడ్జ్ విషయంలో మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే.. Don’t miss it – Sridhar Nallamothu మీకు గానీ, మీకు తెలిసిన వారికి గానీ డస్ట్, చల్లదనానికి ఎలర్జీ ఉందా? అలర్జీ వెనుక సీక్రెట్, దాన్ని అధిగమించడానికి చాలా సింపుల్ టెక్నిక్ – Sridhar Nallamothu
చూసిపోవడానికి వచ్చినవారిని " చుట్టాలు " అని , బందంతో వచ్చినవారిని " బంధువులని" , తిధి చూడకుండా అకస్మాత్తుగా వచ్చినవారిని " అతిధులు " అని అంటారు. మొత్తానికి మనఇంటికి ఎవరు వచ్చినా వారిని గౌరవించడం భారతీయ సంస్కృతి. పూర్వకాలంలో ఇంటి బయట కావలసినంత ఖాళీ ప్రదేశంఉండేది కాబట్టి వాస్తు ప్రకారం బావి కానీ లేదా నీళ్ల కుండీ కానీ ఉండేది. ఎవరు వచ్చినా అల్లంత దూరంనుండే చూసి , ఎదురెళ్లి మనస్ఫూర్తిగా పలకరిస్తూ చెయ్యి పట్టుకుని ఆత్మీయంగా తీసుకొచ్చి , కాళ్ళు కడుగుకోడానికి స్వయంగా నీళ్లు అందించి ఇంట్లోకి తీసుకెళ్లేవారు. వారు అడగకముందే దాహం ఇచ్చి , కుసలప్రశ్నలు అయ్యాక , వారి అభిరుచిని బట్టి టీయో , కాఫియో ఇచ్చేవారు. స్నానానికి నీళ్లు పెట్టి అది అయ్యేసరికి వేడివేడిగా అల్పాహారం అందించేవారు. తిన్నాక ప్రయాణ బడలిక తీర్చుకొనేందుకు, గాలి వెలుతురు బాగా వచ్చే ప్రచ్చేకమైన చోట పక్క ఏర్పాటు చేసి , కాలక్షేపంకోసం వారితో మాట్లాడుతూనే వారికి ఇష్టమైన వంటకాలు తయారుచేసి , భోజనానికి కాళ్ళు కడుక్కోమని చెప్పి , వారు వచ్చేలోగా ప్రశస్తమైన అరిటాకులో రుచికరమైన వంటకాలు వడ్డించి , కొసరి కొసరి తినిపించేవారు. ఇలా... వారు ఉన్నన్నిరోజులు ఎంతో అభిమానంగా వారిని చూసుకుంటూ ,, వెళ్తామని చెప్పగానే మరికొన్నాళ్లు ఉండమని బ్రతిమాలి , ఉంటే సంతోషించి , ఉండలేకపోతే కాస్తంత బాధ పడుతూనే బస్టాండ్ వరకూ వెళ్లి మరీ వీడ్కోలు చెప్పేవారు. దీనికంతటికీ ముఖ్యకారణం ... ఆ పరిస్థితులు అలా అనుకూలించేవి. దేనికీ లోటు ఉండేదికాదు. ఇల్లు విశాలంగా ఉండేది. నీళ్లు పుష్కలంగా లభించేవి. ఆహార ధాన్యాలు , పప్పుదినుసులు , పెరట్లో పండించే కాయకూరలు , పాడితో బాటు మనుషుల్లో అభిమానాలు , ఆప్యాయతలు కూడా మెండుగా ఉండేవి. రాను రాను కరువు కాటకాలు పెచ్చురిల్లుపోయాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. భూమి ధరలు అమాంతం పెరిగిపోవడం మూలంగా ఇల్లు కుదించుకుపోయాయి. ప్రతిదీ ఆచి తూచి చెయ్యాల్సిన కాలం వచ్చింది. ఎవరింట్లో వారే గడపడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకరింటికి మరొకరు రావడమే అరుదైపోయింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులులో వచ్చినా ,,, వారు ఉండడానికీ మొగ్గు చూపడం లేదు , వీళ్లు ఉండమనడానికీ మొగ్గు చూపడం లేదు. ఏదో ముళ్ళమీద ఉన్నట్లుగా కాసేపు కూర్చుని వెళ్లిపోవడమే ... కనీసం మంచినీళ్లు కూడా వారు ఆడిగితేనే గానీ ఇవ్వరు. వాటిని కూడా బోల్డంత డబ్బు పోసి కొంటున్నారు మరి... మంచినీళ్లకే తావు లేనప్పుడు ఇక ఆ తరువాతవాటికి ఆస్కారం ఎక్కడిది ?? టీలు - టిఫిన్లు మాట దేవుడెరుగు ... TV సీరియల్స్ టైమ్ లో కనుక మనం ఎవరింటికైనా వెళ్ళామో అంతేసంగతులు ... కనీసం మనం వచ్చిన విషయం కూడా గమనించరు. కొంతసేపు అలా తచ్చాడగా తచ్చాడగా .. బ్రేక్ లో కాస్త ఖాళీ దొరుకుతుంది కాబట్టి తలతిప్పి చూస్తే , మనం కనబడితే ఓ నవ్వు నవ్వి , ముక్తిసరిగా మాట్లాడి మళ్ళీ సీరియల్ మొదలవగానే ఇక మీరు వెళ్ళచ్చు అన్నట్లుగా ఓ చూపు పడేసి ,,, సీరియల్ చూడ్డంలో నిమగ్నమైపోతారు.. ఆ సన్నివేశం ఎంత కష్టంగా ఉంటుందో అనుభవించేవారికే తప్ప అన్యులకు అర్థంకాదు. కాలానుగుణంగా వచ్చే మార్పుల్లో భాగంగా ,,TV సీరియల్స్ కి కాలం చెల్లిపోయింది .. అప్పటికన్నా ఇప్పటి బాధ మరీ వర్ణనాతీతం ... ఎందుకంటే ... ఓ రెండు గంటలు ఎలాగోలా ఓర్చుకుని ఏదో ఓ మూల కూర్చుంటే ,,, సీరియల్స్ ఆ రోజుకి అయిపోతాయి కాబట్టి కనీసం అప్పుడైనా మనపై వారి దృష్టి పడుతుందన్న ఆశ ఉండేది. ఈనాటి రోజుల్లో అంతకు మించిన ప్రమాదకరమైన పరిస్థితి లు వచ్చాయి. సాధారణంగా ఇంట్లో ఒకటే TV ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో వ్యక్తుల్లో ఒకరు కాకపోతే ఒకరైనా చుట్టుపక్కల చూసేవారు. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని అరచేతిలో చూపించే స్మార్ట్ ఫోన్లు అందరి చేతుల్లో హస్తభూషణంగా ఉన్నాయి. వాటిల్లో ఒకసారి తల దూర్చారో ఇక అంతే ... పరిసరాలలో ఏం జరుగుతోందో కూడా తెలియనంతగా మైమరచిపోతారు. టిక్ టాక్ లు , డబ్ మాష్ లు , ఫేస్ బుక్ లు , వాట్సాప్ లు , గూగుల్ లు , యూట్యూబ్ లు , ఇనష్టాగ్రామ్ లు , టెలిగ్రామ్ లు , గేమ్స్ , పబ్ జీలు , సినిమాలు ఇలా ఒకదాని తరువాత మరోటి చూస్తూ తిండి , నిద్రా మానేసి మరీ ఎన్ని యుగాలైనా గడిపేయగలరు. ఛార్జింగ్ అయిపోతుందని భయం లేదు. ఎందుకంటే .. ఎల్లప్పుడూ ఛార్జింగ్ లోనే ఉంటుంది. పవర్ పోతే ,,, పవర్ బ్యాంక్ ద్వారా ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది.. ఇంటర్ నెట్ కనెక్షన్ కట్ అవుతుందా అంటే అదీలేదు .. హై స్పీడ్ ఇంటర్ నెట్ వైఫై ... అనివార్య కారణాలతో అది కట్ అయితే రెండు సిమ్ లలో అన్ లిమిటెడ్ మొబైల్ డేటా ఉండనే ఉంటుంది ... ఇంకా దేనికి కొదవ ??? ఇంటికొచ్చినవారితో కాదు కదా నిత్యం ఓకే ఇంట్లో ఉంటున్న దంపతులమధ్య , పిల్లలమధ్య , అన్నదమ్ములు - అక్కచెల్లెళ్ల మధ్య కూడా మాటా మంతి లేవు. ఇంట్లో వాళ్ళతోనే సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నప్పుడు ఇరుగెవరో ?? పోరుగెవరో ??? తెలిసే ఛాన్స్ లేదు. ఈ తంతుపై ఇప్పటికే అనేక కార్టూన్స్ రూపంలో హెచ్చరికలు వస్తున్నాయి. అయినా సరే ,,,, పిల్లా పెద్దా తేడా లేకుండా ఈ మహమ్మారికి లొంగిపోయారు. ఒకసారి అడిక్ట్ అయ్యాక వెంటనే మానేయలేరు గానీ , క్రమేణా ఎవరికి వారే ఆలోచించుకుని ఈ భయంకరమైన అలవాటునుండి బయటపడడానికి ప్రయత్నించాలి.. ఆత్మీయులతో ఆనందంగా గడపాలి. జీవితంలో విలువైన అనుబంధాలను కోల్పోకూడదు. స్మార్ట్ ఫోన్ ఈ రోజుల్లో అందరికీ అత్యవసరమే ..అందులో ఏ మాత్రమూ సంశయం లేదు.. ఫోన్ చేతిలో ఉంటే ఇల్లు కదలెక్కర్లేకుండా చిటికెలో మనకు కావలసిన సమస్త పనులను చేసుకోవచ్చు. ఇది నిజంగా మనకు శాస్త్రవేత్తలు అందించిన గొప్పవరం...
తెలంగాణ రాకముందు 200 పైగా ఉంటే ఇపుడు 978 గురుకులాలు వచ్చాయని, దీనివల్ల నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చిందని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. గురుకులాలు గతంలో స్కూల్స్ వరకే ఉంటే ఇంటర్, […] Category: Trending News, తెలంగాణ by NewsDeskLeave a Comment on విద్యే వికాసానికి మార్గం – మంత్రి సత్యవతి రాథోడ్ ఆంధ్ర ప్రదేశ్ 2 hours ago Vidyaa Deevena: వారికి జ్ఞానం కలగాలి: సిఎం జగన్ విపక్షాలకు కొరవడిన ఆలోచనా శక్తిని, వివేకాన్ని ఇవ్వాలని.... పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి వీల్లేదని వాదించే మనుషుల సంస్కారాలు...
మా పాఠకులు మాకు మద్దతు ఇస్తారు. ఈ పోస్ట్ అనుబంధ లింక్‌లను కలిగి ఉండవచ్చు. మేము అర్హత కొనుగోళ్ల నుండి సంపాదిస్తాము. ఇంకా నేర్చుకో ది ఎల్డర్ స్క్రోల్స్ V: స్కైరిమ్ డ్రాగన్‌బోర్న్ తన సాహసాల సమయంలో లెక్కలేనన్ని శత్రువులను ఎదుర్కొంటుంది, మరణించిన డ్రాగర్ నుండి భయంకరమైన డ్రాగన్‌ల వరకు మరియు మధ్యలో ఉన్న ప్రతిదీ. కొత్త శత్రువులు మరియు శక్తివంతమైన గేర్‌లను అన్‌లాక్ చేస్తూ, వారి నైపుణ్యాలను ఉపయోగించినప్పుడు ఆటగాళ్ళు అనుభవాన్ని పొందుతారు మరియు స్థాయిని పొందుతారు. అయితే స్కైరిమ్‌లో మీరు సాధించగల గరిష్ట స్థాయి ఏమిటి? లెజెండరీ నైపుణ్యాలను జోడించినప్పటి నుండి, ఆటగాళ్ళు ఇప్పుడు స్కైరిమ్‌లో నిరవధికంగా సమం చేయవచ్చు. అయితే, మీరు మీ క్యారెక్టర్ కోసం అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క పెర్క్‌ను అన్‌లాక్ చేయాలని ప్లాన్ చేస్తే, మీరు 252 స్థాయికి చేరుకోవడం ద్వారా సాధించగలిగే ఏదైనా స్కిల్ ట్రీని 164 సార్లు రీస్టార్ట్ చేయాలి. స్కైరిమ్‌లో లెవలింగ్ అప్ ఎలా పని చేస్తుంది? స్కైరిమ్‌లో, ఒకదానితో ఒకటి సహకరించుకునే రెండు లెవలింగ్ సిస్టమ్‌లు ఉన్నాయి. ఆటగాళ్ళు శిక్షణ, నైపుణ్య పుస్తకాలు చదవడం లేదా నైపుణ్యానికి సంబంధించిన చర్యలను చేయడం ద్వారా వారి నైపుణ్యాలను సమం చేయడం ద్వారా పాత్ర అనుభవాన్ని పొందుతారు. నైపుణ్యం పెరిగిన తర్వాత, డ్రాగన్‌బోర్న్ నిర్ణీత మొత్తంలో పాత్ర అనుభవాన్ని పొందుతుంది. స్కైరిమ్‌లో స్థాయిని పెంచడానికి ఇదే ఏకైక మార్గం. లెవలింగ్ చేసినప్పుడు, రెండు విషయాలు జరుగుతాయి: మీ ఆరోగ్యం, మ్యాజిక్ లేదా స్టామినాను 10 పాయింట్లు పెంచుకోండి. ప్రతి స్థాయికి ఒక పెర్క్ పాయింట్‌ని అన్‌లాక్ చేయండి. పెర్క్ స్కిల్ స్క్రీన్‌ని యాక్సెస్ చేయడానికి ముందు మీరు అనేక స్థాయిలను కలిగి ఉన్నట్లయితే, మీరు తప్పనిసరిగా లక్షణాలను తప్పనిసరిగా ఎంచుకోవాలి. అయితే, మీరు మీ పెర్క్ పాయింట్‌లను ఖర్చు చేయనవసరం లేదు, అంటే మీరు వాటిని పోగుచేసి మరో సారి వెచ్చించవచ్చు. ఈ విస్తరణ నుండి ప్రధాన క్వెస్ట్‌లైన్‌ను పూర్తి చేసిన తర్వాత ప్లేయర్ డ్రాగన్‌బార్న్ DLCతో పెర్క్‌లను రీసెట్ చేయవచ్చు. ఒకే డ్రాగన్ సోల్‌కి బదులుగా మీరు ఒక నైపుణ్యం చెట్టు నుండి అన్ని పెర్క్‌లను క్లియర్ చేయవచ్చు. మీకు డ్రాగన్ ఆత్మలు అందుబాటులో ఉన్నంత వరకు ఈ ప్రక్రియ పునరావృతమవుతుంది. స్కైరిమ్‌లో గరిష్ట స్థాయి ఏమిటి? స్కైరిమ్ 1.9 ప్యాచ్‌కు ముందు స్థాయి 81కి చేరుకోవడానికి మాత్రమే ఆటగాడిని అనుమతించింది, ఎందుకంటే తదుపరి లెవలింగ్‌ని అనుమతించే నైపుణ్యం రీసెట్ లేదు. ఈ రోజుల్లో, లెజెండరీ నైపుణ్యాలతో, ఆటగాళ్ళు సిద్ధాంతపరంగా నిరవధికంగా స్థాయిని కొనసాగించవచ్చు. నేను Skyrimలో అందుబాటులో ఉన్న అన్ని పెర్క్‌లను అన్‌లాక్ చేయవచ్చా? 18 నైపుణ్యాలుగా పంపిణీ చేయబడిన 251 పెర్క్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ పాత్ర స్థాయిని పెంచుకునేటప్పుడు Skyrimలో లెవలింగ్ చేయడానికి మరింత XP అవసరమవుతుంది కాబట్టి, అందుబాటులో ఉన్న అన్ని పెర్క్‌లను అన్‌లాక్ చేయడానికి తగినంత మాస్టరింగ్ సైకిల్‌లను పొందడానికి మీరు స్థాయి 252కి చేరుకోవాలి. స్థాయి 15 నుండి 100 వరకు నైపుణ్యాన్ని పెంచడం 4,930 XPని మంజూరు చేస్తుంది. దీనర్థం మీరు 164 నైపుణ్య మాస్టరింగ్ సైకిల్స్ ద్వారా వెళ్లవలసి ఉంటుంది. మీరు స్థాయిని పెంచే కొద్దీ స్కైరిమ్ మరింత కష్టమవుతుందా? స్కైరిమ్‌లో స్కేలింగ్ మెకానిక్ ఉంది, ఇది ఆటగాడు స్థాయిలు పెరిగే కొద్దీ గేమ్‌ను మరింత కష్టతరం చేస్తుంది. డ్రాగన్‌బోర్న్ స్థాయి ఒక ప్రాంతంలో కనిపించే శత్రు వైవిధ్యాన్ని ప్రభావితం చేస్తుంది, ప్రతి ఒక్కటి వాటితో అనుబంధించబడిన స్థిర స్థాయిలను కలిగి ఉంటుంది. కంటైనర్‌లలోని అంశాలు మరియు క్వెస్ట్ రివార్డ్‌లు ప్లేయర్ స్థాయిలు పెరిగే కొద్దీ వాటి నాణ్యత మరియు ప్రభావాన్ని స్కేల్ చేస్తాయి. నేలమాళిగలు కూడా స్థాయి పరిధిని కలిగి ఉంటాయి. మీరు స్థాయి అవసరాలను తీర్చకుండా ప్రాంతంలోకి ప్రవేశించినట్లయితే, మీరు ఎల్లప్పుడూ ఆ చెరసాల కోసం సెట్ చేయబడిన అత్యల్ప స్థాయి శ్రేణిని ఎదుర్కొంటారు. మీరు స్కైరిమ్‌లో స్థాయి 81కి చేరుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? 1.8 ప్యాచ్‌కు ముందు, లెజెండరీ పెర్క్స్ సిస్టమ్ అందుబాటులో లేనందున ప్లేయర్‌లు 81వ స్థాయిని మాత్రమే చేరుకోగలరు. ఈ రోజుల్లో, డ్రాగన్‌బార్న్ తమ నైపుణ్య వృక్షాలను 15వ స్థాయికి రీసెట్ చేయగలదు, అంటే వారు ఏ నైపుణ్యంలోనైనా 100 స్థాయికి చేరుకున్నంత వరకు అనుభవాన్ని పొందడం కొనసాగించవచ్చు. డ్రాగన్‌బార్న్ DLCలో, స్థాయి 80కి చేరుకున్నప్పుడు మీరు ఎబోనీ వారియర్ ఎన్‌కౌంటర్‌ను అన్‌లాక్ చేస్తారు. ఈ పాత్ర స్కైరిమ్‌లోని ఏదైనా ప్రధాన నగరాల్లోని డ్రాగన్‌బోర్న్‌కి చేరుకుంటుంది. ఆటగాడితో సంభాషించేటప్పుడు, మునుపటి శత్రువులు మరియు శత్రువులందరినీ ఓడించిన తర్వాత డ్రాగన్‌బోర్న్‌ను ఎదుర్కోవడం తన చివరి సవాలు అని అతను వివరిస్తాడు ఎందుకంటే అతని మరణంతో సోవ్‌గార్డ్‌లోకి ప్రవేశించాలనేది అతని కోరిక. అతను వెలోతి పర్వతాలలో ఉన్న క్యాంప్‌సైట్‌లో మరణంతో పోరాడటానికి ఆటగాడిని కలవమని ప్రాంప్ట్ చేస్తాడు. స్కైరిమ్‌లో నాకు ఎవరు శిక్షణ ఇవ్వగలరు? స్కైరిమ్ చుట్టూ ఉన్న NPCలు ఉన్నాయి, అవి డ్రాగన్‌బోర్న్‌కు బంగారం చెల్లించడం ద్వారా వెంటనే నిర్దిష్ట నైపుణ్యంలో శిక్షణ ఇవ్వగలవు. మీరు ఉపయోగించే శిక్షకుడితో సంబంధం లేకుండా మీరు ప్రతి నైపుణ్యానికి ఒక్కో స్థాయికి ఐదు సార్లు శిక్షణ ఇవ్వవచ్చు. మీరు నిర్దిష్ట వర్గాల సభ్యులైన తర్వాత లేదా అన్వేషణలను పూర్తి చేసిన తర్వాత కొంతమంది శిక్షకులు అన్‌లాక్ చేయబడతారు. మీరు ఆ నైపుణ్యంలో 50వ స్థాయికి చేరుకునే వరకు సాధారణ శిక్షకులు పాఠాలను అందిస్తారు, అయితే నిపుణులైన శిక్షకులు నైపుణ్యం స్థాయి 75కి చేరుకోగలరు మరియు మాస్టర్ ట్రైనర్లు స్థాయి 90 వరకు మీకు సహాయం చేస్తారు. నైపుణ్యం గల పుస్తకాలను చదవడం, క్వెస్ట్ రివార్డ్‌లు పొందడం లేదా నైపుణ్యాన్ని ఉపయోగించడం ద్వారా 100కి చేరుకోవడానికి ఆటగాడు మిగిలిన 10 పాయింట్‌లను తప్పనిసరిగా సంపాదించాలి.
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‎లో టీమిండియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు‎లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది తొలి టెస్టు. తొలి టెస్టులోనే రోహిత్ టాస్ గెలవడం విశేషం. ఇక ఈ మ్యాచ్ మాజీ సారథి విరాట్ కోహ్లీకి చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది విరాట్‌కు వందో టెస్టు. 2011లో విండీస్‎తో విరాట్‌ తొలి టెస్టు ఆడాడు. అలాగే ఏడేళ్లపాటు జట్టు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ ఇప్పుడు కేవలం ఓ బ్యాటర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఇంతకుముందు శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీ‌స్‎ను భారత జట్టు క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. జట్లు భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్, రిషభ్ పంత్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌, జయంత్‌ యాదవ్, మహ్మద్ షమి, జస్పిత్ బుమ్రా. శ్రీలంక: కరుణరత్నె (కెప్టెన్‌), లాహిరు తిరిమన్నె, నిస్సాంక, ఏంజెలో మాథ్యూస్‌, ధనంజయ డిసిల్వ, అసలంక, డిక్‌వెల్లా, సురంగ లక్మల్‌, లసిత్‌ ఎంబుల్డెనియా, ఫెర్నాండో, లాహిరు కుమార.
కోలీవుడ్, బాలీవుడ్‌ నటులు సూర్య, అజయ్ దేవగణ్‌లు ఉత్తమ నటులుగా జాతీయ స్థాయి అవార్డులు అందుకొన్నారు. శుక్రవారం ఢిల్లీలో విఘ్నయన్ భవన్‌లో జరిగిన 68వ జాతీయ సినీ అవార్డుల కార్యక్రమం (2020)కి గాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వారిద్దరూ అవార్డులు అందుకొన్నారు. సామాన్యులకు సైతం విమానయానం అందుబాటులోకి తీసుకువచ్చిన ఎయిర్ డెక్కన్ విమానయాన సంస్థ అధినేత గోపీనాథ్ జీవిత కధ ఆధారంగా తమిళంలో తెరకెక్కిన ‘సూరారై పోట్రు’ (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) సినిమాకు గాను సూర్యకు జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు లభించింది. ఉత్తమ చిత్రం, స్క్రీన్ ప్లే విభాగంలో కూడా ‘సూరారై పోట్రు’ ఎంపికైంది. ఈ అవార్డులను జ్యోతిక, సుధా కొంగర అందుకొన్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవగణ్‌కి హిందీ చిత్రం తానాజీకి ఉత్తమ నటుడు అవార్డు అందుకొన్నారు. అల్లు అర్జున్‌ నటించిన అల వైకుంఠపురములో సినిమాకు మ్యూజిక్‌ కేటగిరీలో అవార్డు లభించింది. దీనికి సంగీతం అందించిన తమన్ ఈ అవార్డును అందుకొన్నారు. తెలుగులో ‘కలర్ ఫోటో’ సినిమాకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు లభించింది. ఈ చిత్ర దర్శకనిర్మాతలు సందీప్ రాజ్‌, సాయి రాజేష్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు అందుకొన్నారు. నాట్యం చిత్రానికి ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాలలో రెండు అవార్డులు లభించగా వాటిని ఆ చిత్ర నిర్మాత, నటి సంద్యారాజు, మేకప్ ఆర్టిస్ట్ టివి రాంబాబు అందుకొన్నారు. అలనాటి ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆశా పరేఖ్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన దాదా ఫాల్కే అవార్డు అందుకొన్నారు.
''అబ్బబ్బా! ఇంకా పనవలేదు. ఐదు గంటలకే లేచాను. ఎనిమిది అవుతోంది. తొమ్మిదిన్నరకల్లా ఆఫీసుకి బయలు దేరాలి. బండి స్టార్ట్‌ చేసానంటే కరెక్ట్‌గా పది గంటలకు ఆఫీస్‌ లో ఉంటాను. ఇవ్వాళ ఫైల్స్‌ అన్నీ క్లియర్‌ చేసేసి కలెక్టర్‌ గారి సంతకాలు తీసుకోవాలి. ఇక మధ్యాహ్నం లంచ్‌ అవర్‌లో కాస్త టైమ్‌ చూసుకొని శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పుస్తకం చదవాలి''. అని తనలో తాను మాట్లాడుకుంటుంది సాహితి. ''ఏమిటి నీ గోల సాహితీ?'' ఒక్కటే గొణుగుతున్నావు. నీకీ పుస్తకాల పిచ్చేమిటో? శ్రీశ్రీ అంటావు. ఓల్గా అంటావు. ఎవరెవరి పుస్తకాలో! రోజుకో పుస్తకం నీ చేతిలో ఉండాల్సిందే. పైగా ఈ మధ్య రచనలు కూడా మొదలు పెట్టావు. సాహితి అని మీ అమ్మానాన్నలు పెట్టిన పేరుకు న్యాయం చేయాలనుకుంటున్నావా ఏమిటి? ముందు పని కానిచ్చి ఆఫీసుకు తయారవ్వు. నాక్కూడా కంపెనీకి వెళ్లే టైమవుతోంది త్వరగా బాక్సు పెట్టు'' అని భర్త రమేష్‌ అరుపులు. ''ఇదిగో అయిపోతుం దండి. వంట పూర్తయింది. మీకు, నాకు, పిల్లలకు బాక్సులు సర్దితే పని అయిపోతుంది. టిఫిన్‌ వేడి వేడిగా ఉంది మీరు తినండి. కార్తీక్‌! రమ్యా! రండి మీరు కూడా తినండి. స్కూల్‌ బస్సు వచ్చే టైమయింది''. ''అబ్బ ఆగమ్మా! చెల్లి నా పెన్నులు తీసుకొని ఇవ్వడం లేదమ్మా!'' ''రమ్యా! రోజురోజుకీ నీ అల్లరి ఎక్కువైపోతుంది. అన్నయ్య పెన్నులు నువ్వెందుకు తీసుకున్నావు? ఇటివ్వు. కార్తీక్‌ తీసుకో. టిఫిన్‌ తిందురు గాని రండి ఇద్దరూ''. ''నాక్కూడా అన్నయ్య లాంటి పెన్నులే కావాలమ్మా. డాడీ అన్నయ్యకు కొత్త పెన్నులు తెచ్చి ఇచ్చాడు. మరి నాకు''. ''నేను సాయంత్రం ఆఫీస్‌ నుండి వచ్చేటప్పుడు తెస్తాను రమ్యా! అల్లరి చేయకు పద''. ''సరేనమ్మా''. ''తినండి ఇక. ఏమిటండీ మీరు? అబ్బాయి కోసం అడక్కుం డానే అన్నీ తెస్తారు. దీనికి తేవా లంటే పది సార్లు ఆలోచిస్తారు. వీళ్ళ గొడవలు తీర్చలేక నేను చస్తున్నాను'' అని చిన్నగా పిల్లలకు వినపడకుండా భర్త రమేష్‌తో అంటూనే సాహితి ఓ పక్క ఆఫీస్‌కు రెడీ అవుతోంది. సాహితి ఏది మాట్లాడినా రమేష్‌ ఈ చెవిన విని ఆ చెవితో వదిలేస్తాడు. భార్య అన్నా, ఆడవాళ్ళన్నా కాస్త చిన్నచూపు అతనికి. సాహితి భర్తలో మార్పు కోసం ప్రయత్నిస్తూ, పిల్లల మనసుల్లో ఆడ, మగ హెచ్చుతగ్గుల భావనలు ఊపిరి పోసుకోకుండా జాగ్రత్తపడుతుంటుంది. పిల్లలను స్కూలుకు, రమేష్‌ను కంపెనీకి సాగనంపి ఇంటి పని ముగించుకొని ఆఫీసుకు బయలుదేరింది సాహితి. కలెక్టర్‌ గారి కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం తనది. పది మంది పురుషుల మధ్య ఏకైక మహిళా ఉద్యోగిని. ''హమ్మయ్య. ఆఫీస్‌ వచ్చేసింది. సమయానికి ఆఫీసుకు రావడానికి సర్కస్‌ ఫీట్స్‌ చేయాల్సి వస్తోంది'' అని తనలో తాను అనుకుంటూనే చకచకా ఆఫీసు రూము వైపు అడుగులు వేస్తూ కనిపించిన వారందరికీ నమస్తేలు చెబుతూ చిరునవ్వుతో పలకరిస్తూ తన సీట్లో కూర్చుంది. ఎదురు సీట్లో ఉన్న ఈశ్వరరావు సాహితిని ఎగాదిగా చూశాడు. ''నమస్కారం సార్‌'' అన్నది సాహితీ. ''ఆ ఆ నమస్కారం'' అని వెటకారంగా సాహితికి ప్రతి నమస్కారం చేశాడు ఈశ్వరరావు. అసూయకు ఆక తి కల్పిస్తే అది ఈశ్వర్‌రావే. ఎదుటివారి గొప్పదనాన్ని ఏమాత్రం సహించని వ్యక్తిత్వం తనది. సహజంగానే మహిళలంటే మరింత చులకన. ఈశ్వర్‌రావు ప్రతినమస్కారంలో ఇవన్నీ ప్రస్ఫుటించాయి. సాహితీ ఆఫీస్‌ పనిలో లీనమయింది. చూస్తూండగానే లంచ్‌ టైం అయింది. సాహితి అన్నం తినేసింది. ''కాస్త తీరిక దొరికింది బాబోరు. శ్రీశ్రీ మహా ప్రస్థానం సంగతి చూస్తాను'' అనుకుంటూ పుస్తకంలో తల పెట్టేసింది. దూరంగా ఉండి ఇదంతా పసిగట్టిన ఈశ్వరరావు మనసులో ''ఈవిడ పుస్తకాలు తెగ చదివేస్తుంది. అడపాదడపా పత్రికల్లో కూడా ఈవిడ రాసిన కవితలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు ఈ ఆఫీసులో నేను మాత్రమే కవితలు, కథలు రాసేవాన్ని. ఇప్పుడు ఈవిడ కూడా తయారయిందా? ఈమె మొహానికి ఉద్యోగం చాలదన్నట్టు సాహిత్యం వైపు పరుగులు పెడుతుందా?'' అని కుళ్ళుకుంటూ మిగతా కొలీగ్స్‌ అయిన క ష్ణ, భాస్కర్‌, వేణులను ''పదండి పదండి మేడం గారు ఏదో చదువుతుంది కాస్త చూద్దాం పదండి'' అని వాళ్ళను కూడా వెంటబెట్టుకొని సాహితికి వినబడేటంత దగ్గర్లోకి వచ్చి నిలబడ్డారు. ''క ష్ణ సార్‌! నీకు శ్రీశ్రీ గురించి ఏం తెలుసు?'' అన్నాడు ఈశ్వరరావు. ''క ష్ణ సార్‌నే అడిగారూ! మీ నోట సాహిత్యాంశాలు వినడమే గాని ఒక్క ముక్క కూడా అతనికి తెలియదు'' అని భాస్కర్‌ అంటుండగానే ''అయితే గియితే ఈ మధ్య రాతలు మొదలు పెట్టిన మహిళామణులను అడగాలి గాని క ష్ణసార్‌ని అడుగుతారేమిటి ఈశ్వర్‌ సార'' అన్నాడు వేణు. ''ఇదిగో మీరిలా మాట్లాడొద్దు భాస్కర్‌. వేణు నువ్వు కూడా. నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో చంపేస్తాను జాగ్రత్త'' అని సాహితి వైపు చూసాడు క ష్ణ. ఒక్కసారిగా నలుగురూ పగలబడి నవ్వారు. ''ఏం చెప్పావు క ష్ణ. ఓ రెండు కవితలు అచ్చవగానే కవులయిపోతరా ఏమిటి? ఇప్పటికే నేను వంద కవితలు రెండు వందల కథలు రాశాను. ఒకటీ రెండు రాసి బిల్డప్పుల మీద బిల్డప్పులు ఇచ్చేస్తుంటారు కొందరు. అంట్లు తోముకొని ఇంట్లో ఉండక ఉద్యోగాల పేరుతో ఊరేగుతూ చాలదన్నట్టు రచిస్తారట. అయినా నిన్ను కవి కాదని ఎవరన్నారు క ష్ణా! రచించు రచించు'' వ్యంగ్యం, హేళన ధ్వనిస్తున్నట్లు అన్నాడు ఈశ్వర్‌ రావు. ''ఎవరెన్ని రచించినా అవన్నీ మీ ముందు కుప్పిగంతులే ఈశ్వర్‌ రావు సార్‌!'' అని క ష్ణ అంటుండగానే లంచ్‌ టైం పూర్తయిపోయిందని తెలిపే హారన్‌ మోగింది. వీళ్లంతా సాహితిని ఒక్కసారి చూసి ముసి ముసి వంకర నవ్వులు నవ్వుకుంటూ తమ సీట్లలోకి వెళ్ళిపోయారు. పుస్తకం చదువుతున్న సాహితికి ఈశ్వర్‌ రావు, క ష్ణ, వేణు, భాస్కర్‌ల మాటలన్నీ వినపడుతూనే ఉన్నాయి. అయినా సాహితి ఏ మాత్రం ఆవేశపడలేదు. బాధ పడలేదు. సగం పుస్తకాన్ని చదివేసింది కూడా. హారన్‌ చప్పుడుతో మళ్ళీ ఆఫీసు పనిలో నిమగమైంది. ఫైల్స్‌ అన్నీ క్లియర్‌ చేసేసి కలెక్టర్‌ గారి సంతకాల కోసం అటెండర్‌ చేతికిచ్చి పంపించింది. సమయం ఐదు అయిపోవడంతో సాహితి ఇంటి బాట పట్టింది. ''అమ్మో! రమ్యకు పెన్నులు కొనుక్కెళ్లాలి'' అని మధ్యలో షాపు దగ్గర ఆగి పెన్నులు కొనుక్కొని సరాసరి ఇంటికి వెళ్ళింది. భర్త రమేష్‌, పిల్లలు కూడా ఇంటికి చేరుకున్నారు. ''సాహితీ కాఫీ!'' అని అరవడం మొదలెట్టాడు రమేష్‌. సాహితి గబగబా కాళ్ళు చేతులు కడుక్కొని భర్తకు కాఫీ పిల్లలకు పాలు అందించింది. ఇంకా రాత్రికి వంట, పిల్లల చేత హౌం వర్కులు పూర్తి చేయించడం తదితర పనుల జాబితా సాహితికి కొత్తేమీ కాదు. అన్ని పనులు పూర్తయ్యాయి. సమయం తొమ్మిది అయింది. ఈ ప్రపంచంలోని విశ్రాంతి అంతా తనదేనన్నట్లు బెడ్‌పై ఒరిగింది. ''ఇంకా మహాప్రస్థానం పుస్తకం సగభాగం మిగిలే ఉంది. ఒక గంట సేపు చదివి తర్వాత పడుకుంటాను. నిద్రలో మంచి తలపులు ఏమైనా వస్తే తెల్లవారుజామున కవిత కూడా రాయాలి'' అనుకుంటూ పుస్తకం మొత్తం చదివేసి నిద్రకు ఉపక్రమించింది సాహితి. తెల్లవారుజామునే లేచి ఓ కవిత కూడా రాసింది. పత్రికకు మెయిల్‌ పెట్టేసి యథావిధిగా తన పనుల్లో మునిగిపోయింది. ఇంటి పనులు ముగించుకుని ఆఫీసుకి వెళ్ళింది. ఈశ్వర్‌ రావు, క ష్ణలు పిచ్చాపాటీ మాట్లాడు తున్నారు. సాహితి వచ్చేది కూడా వారు గమనించలేదు. ''ఆమె గారి సాహిత్యం తొక్కా.. తోలు. రోజుకో పుస్తక మంట క ష్ణా!'' ''అవునవును ఈశ్వర్రావు సార్‌. నిజంగా అచ్చయిన రెండు మూడు రచనలు కూడా ఆమెనే రాసిందంటారా? ఏమో నాకైతే డౌటే సార్‌''. ''అంతే అంతే అని ఇద్దరూ నవ్వుకుంటూ పక్కకు చూసే సరికి సాహితి అక్కడే నిలబడి ఉంది. వెంటనే ఈశ్వరరావు, క ష్ణ వాళ్ళ సీట్ల దగ్గరికి వెళ్ళిపోయారు. సాహితి నిశ్శబ్దంగా తన సీట్‌ దగ్గరికి వెళ్లిపోయింది. ఇటువంటి పనికిమాలిన కామెంట్స్‌ ఏవీ పెద్దగా లెక్కచేయని సాహితి మనసు ఒక్కసారిగా బాధకు గురైంది. పేరుకు ఆఫీస్‌ పని చేస్తుంది. కానీ తన మెదడు సహకరించడం లేదు. ''నేను ఎప్పుడూ ఎవరినీ ఒక్క మాట కూడా అనను. ఒక చిన్న పలకరింపు వీలైతే రెండు మాటలు అంతే. అయినా అసలు ఈ మగవాళ్ళకు ఆడవాళ్లంటే ఎప్పుడూ ఎందుకు ఇంత చిన్నచూపు? ఇంట్లో ఆడవాళ్లను గౌరవించరు సరికదా బయటి వాళ్లంటే మరీ చులకన చేస్తారు. అనాదిగా పేరుకుపోయిన జాడ్యం ఇది. కాలాలు మారినా చదువులు పెరిగినా నాగరికత కొత్త పుంతలు తొక్కుతున్నా సమాజంలో మాత్రం మార్పు రావట్లేదు. మనిషి మనిషిగా మసలుకోవడం లేదు. అందుకేనా! నా కలం ఏదో రాయమని ఏదో మార్పుకై ప్రయత్నించమని ప్రేరేపిస్తోంది. ఈ ఊకదంపుడు వ్యంగ్యపు మాటలకు అదిరి పోకూడదు. మరింత ఉత్సాహన్ని కూడదీసుకొని కలాన్ని ఝుళిపించాలి. నేను కుంగి పోకూడదు. నాలాంటి వాళ్లెందరికో నేను ధైర్యం కావాలి'' అని తనను తాను ప్రేరేపించుకుంది. ఇక ఆ రోజు ఆఫీస్‌ పనులు కష్టంగా పూర్తి చేసి ఇంటికి వెళ్ళింది. కొన్ని రోజులు గడిచాయి. సాహితి పేరు సాహిత్య ప్రపంచంలో విరివిగా వినిపించటం మొదలైంది. అనతికాలంలోనే అనేకానేక కవితలు, కథలు వివిధ దిన, వార, మాస పత్రికల్లో చోటు చేసుకున్నాయి.రాష్ట్ర స్థాయి సాహితీవేత్తల ప్రశంసలూ అందుకున్నాయి. అయినా కూడా ఇవేవి సాహితి పెద్దగా ప్రచారం చేసుకునేది కాదు. ప్రశంసలకు పొంగిపోవడం గాని అవహేళనలకు కుంగి పోవడం కానీ తనకు తెలియదు. అనుకోకుండా ఒకరోజు పొద్దున్నే పేపర్‌ చదువుతున్న రమేష్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తన భార్య సాహితి పేరు ఫ్రంట్‌ పేజ్‌లో తాటికాయంత అక్షరాలతో వేసారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ఉత్తమ సాహితీ పురస్కార గ్రహీత సాహితి అని ఉంది. రమేష్‌ విషయం చదవడం మొదలు పెట్టాడు. ''సమాజ హితాన్ని కోరి మంచి రచనలు చేస్తున్న కవయిత్రి సాహితి. ఆమె సాహిత్య సేవను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పురస్కారంతో పాటు సాహిత్య అంబాసిడర్‌గా జీవో జారీ చేసింది''. రమేష్‌ చదవడం పూర్తయింది. తనలో తనకు తెలియకుండానే ఏదో పశ్చాత్తాపం. సాహితిని తక్కువగా చూసాననే భావన. ''సాహితీ! నీకు అవార్డు వచ్చింది. చూసావా? తొందరగా రా..'' అని ఆశ్చర్యం, ఆనందం కలగలసిన స్వరంతో పిలిచాడు. ''వస్తున్నానండి...'' ''సాహితీ! ఇదిగో చూడు. నీ పేరు పేపర్‌లో చూడడం నాకెంతో సంతోషంగా ఉంది''. ''నిజమా ఏదీ ఇటివ్వండి. నేను అస్సలు అనుకోలేదు. నాకే ఈ అవార్డు వస్తుందని''. ''సరే సరే సాహితీ! పద స్వీట్స్‌ కొనిపిచ్చి నిన్ను ఇవ్వాళ ఒక్కరోజైనా నేనే ఆఫీస్‌ దగ్గర దిగబెడతాను. ఇన్ని రోజులు నిన్ను, నీ సాహిత్యాన్ని తక్కువ చేసినందుకు నన్ను క్షమించు''. ''అలా మాట్లాడకండి. మీరు పెరిగిన పరిస్థితులు అలాంటివి. ఇప్పటికైనా ఆడవాళ్లు తక్కువ కాదని తెలుసు కున్నారు.నాకది చాలండి. పదండి. ఇవ్వాళ మీరే డ్రాప్‌ చేద్దురు'' రమేష్‌, సాహితీ బయల్దేరారు. పొద్దు పొద్దున్నే పేపర్‌ చదివే అలవాటున్న ఈశ్వర్‌ రావు, క ష్ణ, భాస్కర్‌, వేణులు వార్త చదివి అవాక్కయ్యారు. మరీ తొందరగా ఆఫీసుకు చేరుకున్నారు. ఒకళ్ళ మొహాలు ఇంకొకరు చూసుకున్నారు. ఇంతలోనే సాహితి ఆఫీస్‌ రూమ్‌లోకి వచ్చేసింది. తనను చూసిన వాళ్ళకెవ్వరికీ నోట మాట రాలేదు. సిగ్గుతో తలదించుకున్నారు. సాహితి వాళ్ళకు దగ్గరగా వచ్చింది. ''ఈశ్వర్‌ రావు సార్‌, క ష్ణ సార్‌, భాస్కర్‌ సార్‌, వేణు సార్‌ స్వీట్స్‌ తీసుకోండి''. ''అమ్మా సాహితీ! నన్ను క్షమించు. నువ్వు రచనలు చేయడం నేను జీర్ణించుకోలేకపోయాను. ఆ అక్కసంతా ఇదిగో వీళ్ళతో కల్సి అనరాని మాటలతో తీర్చుకున్నాను. నువ్వు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఈ రోజు ఈ స్థాయికి వచ్చావు'' అని ఈశ్వర్‌రావు అనడం ఒక్కసారిగా క ష్ణ, భాస్కర్‌, వేణులు కూడా క్షమాపణలు వేడుకోవడం జరిగిపోయాయి. ''మీరంతా నా అన్నదమ్ములలాంటి వారు. మీ మాటలే నా ప్రగతికి పెట్టుబడిలా మారాయి. నిజానికి ఈ విజయంలో మీరు కూడా భాగస్థులు. ఇక నుంచైనా మహిళల్ని గౌరవించనక్కర కూడా లేదు. కనీసం మనుషుల్లా చూడండి చాలు అన్నయ్యలూ'' అంటుండగానే కలెక్టర్‌ గారు అక్కడికి వచ్చి సాహితిని అభినందించి అభినందన సభ ఏర్పాటు చేశామని, అంబాసిడర్‌ తదితర అంశాలు చర్చించాల్సి ఉంది. ఛాంబర్‌కు రమ్మని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు. సాహితిలో ఆత్మ విశ్వాసం అంతకంతకు రెట్టింపు అయింది. తన బాధ్యత మరింత పెరిగిందని గుర్తు చేసుకుంటూ, ఆకాశమే హద్దుగా అడుగులు వేస్తూ కలెక్టర్‌ ఛాంబర్‌ వైపుగా కదిలింది.
అటల్‌ బిహారీ వాజ్‌పేయి బిజెపికి మాస్క్‌ లాంటి వారు అని కొందరు విమర్శించేవారు. మరి మోదీని, ఆయన అభివృద్ధి తపనను చూస్తే ఏమనిపిస్తున్నది. పాలనలోకి వచ్చి ఆరునెలలయ్యింది. మోదీ బిజెపిని మించి ఎదిగిపోయారని వింటున్నాం.కానీ పూర్తిస్థాయిలో మోదీ ముఖం ఇప్పటికి బయటపడిందా! తాను బయటకు కనిపించే ప్రతిక్షణం తాను కోరుకున్న విధంగానే కనిపించడంపై ఒక మనిషి అంత శ్రద్ధ పెడితే, భావోద్వేగాలను కొలత వేసి ప్రదర్శిస్తుంటే ఆ మనిషిని ఎలా అర్థం చేసుకోవాలి? స్మార్ట్‌ సిటీల నిర్మాణం గురించి మాట్లాడిన శృతిలోనే పురాణకాలంలో విమానాలు-ప్లాస్టిక్‌ సర్జరీలు ఉన్నాయని మాట్లాడగలిగిన వ్యక్తి ముఖంలో ఏ పార్శ్వం నిజం, ఏది మాస్క్‌! పైన కనిపించే చిహ్నాలు చూస్తే అవినీతికి ఏమాత్రం తావులేని పాలన అందివ్వడానికి పట్టుగా ఉన్న నేతగా కనిపిస్తారు నరేంద్రమోదీ. అర్జునుడికి పక్షికన్ను మాదిరి అభివృద్ధి తప్ప మరేదీ కనిపించని నేతగా కనిపిస్తారు. హిందూత్వమా, అదేంటి అన్నట్టు కనిపిస్తారు. వ్యవస్థలోని మురికిని చీపురు పట్టి ఊడ్చేసే నేతగా కనిపిస్తారు. పథకాలు అమలులో నిధులు మింగేస్తున్న పందికొక్కులను ఏరివేయడానికి అవతరించిన నాయకుడిగా కనిపిస్తారు. ఇందుకోసం ప్రజల ఆలోచనలు పంచుకుంటూ పనిచేసే సృజనాత్మకమైన నేతగా కనిపిస్తారు. వివాదాల జోలికే పోకూడదని ప్రతినబూనిన వ్యక్తిగా కనిపిస్తారు. స్వాతంత్ర్యంకోసం ప్రాణత్యాగం చేసే అవకాశం లేకపోయినందుకు బాధపడే నేతగా కనిపిస్తారు. అదే సమయంలో విజయం కోసం ఎలాంటి ఎత్తుగడలైనా వేయగలిగిన నేతగా అనిపిస్తారు. మహారాష్ర్టలో కేవలం మిత్రపక్షం అనే పదానికే పరిమితం చేయలేని భావజాల బంధువు శివసేనను డంప్‌ చేసిన తీరు చూస్తే లక్ష్యసాధనలో సెంటిమెంట్లకు తావివ్వని వ్యక్తిగా అనిపిస్తారు. ఉగ్రవాది అని హిందూత్వ సంస్తలు దుమ్మెత్తిపోసే కశ్మీరీ హురియత్‌ నేత సజ్జాద్‌లోన్‌తో సమావేశమైన తీరు చూస్తే లక్ష్యసాధనకోసం ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి సిద్ధపడిన నేతగా అనిపిస్తారు. ఇమేజరీ చాలనే ఉంది.తన మంత్రివర్గ సహచరులకు కర్తవ్యబోధ చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశపు దృశ్యాలను చూస్తే అతని దగ్గర అనుచరులకు తప్ప సహచరులకు స్థానం లేదని అర్థమవుతుంది. హెడ్‌ మాస్టర్‌ టీచర్లతో సమావేశమైనట్టు లేదు. విద్యార్థులతో సమావేశమైనట్టు ఉంది. వారితో మాట్లాడేటప్పుడు కూడా ఆయన హావభావాలు కొలతేసి ప్రదర్శిస్తున్నారు. అంటే మోదీ ఏ విషయంపై ఏమనుకుంటున్నారో ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ఆయన ఏం తెలియజేయదల్చుకున్నారో మాత్రమే తెలుస్తుంది. సింబాలిజం, ఇమేజ్‌ ప్రధాన పాత్ర పోషించే ఆధునిక ప్రపంచంలో ఆ రెంటి రహస్యాలు ఎరిగినవాడు నరేంద్రమోదీ. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వాటికి సంబంధించిన లాభనష్టాలను భరించే బాధ్యత తీసుకోవడం నాయకత్వలక్షణాల్లో ప్రధానమైనవి. అవి మోదీలో పుష్కలంగా ఉన్నాయని ఇవాళ కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. అధికారంలో తీసుకునే నిర్ణయాలను సామాన్యుడి కళ్లతో ముందే చూసి స్పందనను అంచనావేయగలిగిన నైపుణ్యం ఆయనకు పుష్కలంగా ఉంది. ఆ జీవితమూ ఉన్నది. అవగాహనా ఉన్నది. స్ర్టీట్‌ స్మార్ట్‌ అంటారే అలాంటి లక్షణాలు ఆయనలో పుష్కలంగా కనిపిస్తాయి.గొప్ప వక్త కాకపోయినా ఆయన్ను సమకాలీన నాయకులందరిలోనూ పైమెట్టుమీద నిలపగలుగుతున్నది ఆ లక్షణమే. ఎలా కనెక్ట్‌ కావాలో బాగా తెలిసిన నేత. ఆధునిక సమాజం ప్రాధమిక అవసరంగా మార్చిన ఎనర్జీకి సంబంధించి ఆయన మూడు నిర్ణయాలు తీసుకున్నారు. అన్నీ మార్కెట్‌కు సంబంధించినవే. కాంగ్రెస్‌ నాన్చుతూ వస్తున్నవే. బొగ్గు, గ్యాస్‌, డీజిల్‌ మూడు అంశాలను ఆయన తేల్చిపడేశారు-పెద్ద వివాదాలేవీ లేకుండానే! డీజిల్‌ను మార్కెట్‌కు అనుసంధానం చేస్తూ ఇంకెవరైనా నిర్ణయం తీసుకుంటే ఎంత వ్యతిరేకత వచ్చేదో! కానీ మోదీకి అంతర్జాతీయ మార్కెట్‌ పరిణామాలు కలిసొచ్చాయి. మార్కెట్లకు ఆయనమీదున్న ప్రేమ అలాంటిదేమో! గ్యాస్‌ ధరను రెట్టింపు చేయాలని రంగరాజన్‌కమిటీ సూచిస్తే అంతకంటే బాగా తక్కువ నిర్ణయించి దేశఖజానాకు ఆదాయాన్ని కాపాడిన నేతగా ఇమేజ్‌ సంపాదించారు మోదీ. దాన్ని మించింది కేజీ బేసిన్‌లో రిలయెన్స్‌ గ్యాస్‌ తవ్వకాలకు సంబంధించిన నిర్ణయం. రిలయెన్స్‌ తవ్వాల్సినంత గ్యాస్‌ తవ్వి చూపించేదాకా పాత ధరే వర్తిస్తుందని తేల్చేశారు మోదీ. ఆయన అంబానీల బంటు అని వాదించేవారి నోరు మూయించేందుకు ఆయన ఇచ్చిన మాస్టర్‌స్ర్టోక్‌ ఇది. ఇలాంటి సింబాలిజం ఇమేజ్‌ మేకింగ్‌లో ఎలాంటి పాత్ర పోషించగలదో మాస్టరీ చేసిన వ్యక్తి మోదీ. రిజర్వ్‌ బ్యాంక్‌ మీద. ఆర్థిక శాఖ మీద, చెణుకులు విసురుతూ ప్రధాని కార్యాలయం ముందు అవెంత దిగదుడుపో బాహాటంగా చెపుతూ కూడా స్కోత్కర్ష అనే విమర్శ మీడియాలో రాకుండా చూసుకోగలిగిన వ్యక్తి మోదీ.నల్లధనం తెస్తే ఒక్కొక్కరికి ఎంత పంచొచ్చు అని చెప్పారు కదా సార్‌, దాని సంగతేమిటి అని సౌమ్యంగా ప్రశ్నించి ఆ తర్వాత పాపం, పీత కష్టాలు పీతకు అన్నట్టు ప్రభుత్వానికి కూడా కష్టాలుంటాయి అని తానే సమాధానపడిపోతున్నది పాపులర్‌ మీడియా. ఇప్పటివరకూ కాంగ్రెస్‌కు ఉన్నది బిజెపికి లేనిది స్వాతంత్రోద్యమ వారసత్వం. గాంధీని చంపిన వారసత్వం ఉంది కానీ గాంధీ వారసత్వం లేదు. ఇపుడా వారసత్వంలో ఎలాగోలా వాటాను తీసుకొచ్చి బిజెపికి కట్టబెట్టే బాధ్యత చేపట్టారు మోదీ. వల్లభాయ్‌ పటేల్‌ కాంగ్రెస్‌ నాయకుడు కాదేమో, బిజెపి నాయకుడేమో అనిపించేంత రీతిలో ప్రచారం సాగుతున్నది. నెహ్రూ కంటే పటేల్‌ను పెద్దగీత చేసి సొంతం చేసుకునే ప్రక్రియ సాగుతున్నది. ఇక్కడా అప్రాప్రియేషన్‌ టాక్టిక్సే. ఇంకోవైపు సిలబస్‌లో మార్పులు సైలెంట్‌గా సాగిపోతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలపై వీధుల్లో వీరంగం చేసే బాధ్యతను తన కజిన్స్‌కు వదిలేసి లోతైన బాధ్యతలో తలమునకలుగా ఉన్నది బిజెపి. ఎప్పుడు అధికారం రుచి చూసినా మానవవనరులశాఖను తీసుకుని ఆ ప్రయత్నం కొద్దో గొప్పో చేయడం మామూలే. ఈ సారి నింపాదిగా చేస్తున్నది.. ఇతరత్రా వ్యవహారాల్లో లభిస్తున్న ఆమోదపు కరతాళధ్వనుల ముందు దీనిపై నిరసన ధ్వనులు వినిపించే పరిస్థితి లేదు. వర్తమానంపై తిరుగులేని విశ్వాసమున్నవాడు కావడం వల్ల, పదేళ్ల వరకూ తిరుగులేదని విశ్వాసమున్నవాడు కావడం వల్ల గతాన్ని తిరగరాయడంపైనా భవిష్యత్తు మీదా కేంద్రీకరించగలిగిన స్థితిలో మోదీ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనంత విశ్వాసంతో బిజెపి శ్రేణులు కనిపిస్తున్నాయి. నాయకుడు ఇచ్చే భరోసా బలమది. మోదీ అహ్మదాబాద్‌నుంచి ఢిల్లీవైపు దృష్టి మళ్లించే నాటికే దేశంలో ఆయన ఆలోచనలకు ఎర్రతివాచీ పరిచే మార్పులు జరిగిఉన్నాయి. ఎర్ర శ్రేణులు నీరసపడి ఉన్నాయి. తమ రాష్ర్టానికి పెట్టుబడులు ఆకర్షించడం అనేది సిఎంల ప్రొఫైల్‌లో అతిముఖ్యమైన విషయంగా మారిపోయింది. ఫలానా రాష్ర్టానికి పోవాల్సిన పెట్టుబడిని ఫలానా ఫలానా రాయితీలిచ్చి మా రాష్ర్టానికి తెచ్చుకోగలిగాం అని ముఖ్యమంత్రులు బాహాటంగా చాటుకుంటూ స్కోర్‌కార్డ్‌ పెంచుకోవడం స్థిరపడి పోయి ఉన్నది. టీవీ చూసే పత్రికలు చదివే వోకల్‌ సెక్షన్స్‌లో దానికి ఆమోదం మాత్రమే కాదు, అంతకు మించిన విలువ స్థిరపడిపోయి ఉన్నది. ఆ సెక్షన్‌ పెరుగుతూ ఉన్నది. మార్కెట్‌ సంస్కరణల వల్ల ప్రయోజనాలు పొందినవారు ఇపుడు మోదీ ప్రతి కదలికకు చీర్‌ లీడర్స్ అవుతున్నారు.ఆ పునాది మీదే ఆ విశ్వాసం మీదే ఇపుడు మోదీ అత్యంత ప్రమాదకరమైన కార్మిక సంస్కరణలకు సిద్ధమవుతున్నారు. 2001లో యశ్వంత్‌ సిన్హా కార్మిక సంస్కరణలకు తెరతీసినపుడు ఆయన్ను క్రిమినల్‌ అని తిట్టిపోశారు దత్తాపంత్‌ థెంగ్డే. వాజ్‌పేయి మంత్రుల్లో సగంమంది అమెరికా, ఐరోపా దేశాల పేరోల్స్‌లో ఉన్నారని, అందుకే వారు మల్టీ నేషనల్‌ కంపెనీలకు తైనాతీలుగా వ్యవహరిస్తున్నారని ఆయన నిప్పులు కక్కారు. థెంగ్డే బయటివాడు కాదు, వామపక్ష వాది అస్సలే కాదు. ఆరెస్సెస్‌ సీనియర్‌ నాయకుడు. భారతీయ మజ్దూర్‌సంఘ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు. సొంత శిబిరం నుంచి వచ్చిన ఈ విమర్శలపై అప్పట్లో బిజెపిలో బోలెడంత చర్చ నడిచింది. ఇవాళ ఆ శిబిరంనుంచి విమర్శలు చేసేవాళ్లూ లేరు. అథవా ఎవరైనా లోలోపల మనకు తెలీకుండా గొణిగినా సీరియస్‌గా తీసుకుని చర్చించేవారు అసలే లేరు. స్వదేశీ జాగరణ మంచ్‌ ఏమైందో తెలీదు. గ్లోబలైజేషన్‌ మీద అధ్యయనం చేసిన గోవిందాచార్య లాంటివారు ఏమయ్యారో తెలీదు. అంతమాత్రాన మోదీ ఆరెస్సెస్‌ కంటే పెద్దవాడేపోయాడని భావించడానికి లేదు. దాన్ని ధిక్కరించి వ్యవహరిస్తున్నట్టు అస్సలు భావించడానికి లేదు. దేవాలయాల కన్నా టాయిలెట్లు అవసరం లాంటి స్టేట్‌ మెంట్లు చూసి అదిగో చూశారా అనడం అమాయకత్వమవుతుంది.ఆరెస్సెస్‌ మీద నిషేధం విధించినపుడు అండర్‌ గ్రౌండ్లో పనిచేసిన నిబద్ధ కార్యకర్త మోదీ. స్వతంత్రభారత చరిత్రలో తొలిసారి సర్‌సంఘ్‌ చాలక్‌కు జాతిని ఉద్దేశించి ప్రభుత్వ మీడియాలో ఉపన్యసించే అవకాశం కల్పించినవాడు మోదీ.రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అవసరాల కోసం పనిచేస్తున్న వివిధ విభాగాల మధ్య అనుసంధానానికి, అవసరమైన సందర్భాల్లో సైద్ధాంతిక మార్గదర్వకత్వానికి, నాయకులను తయారుచేసి అందివ్వడానికి ఆరెస్సెస్‌ పరిమితమైనట్టు అనిపిస్తోంది.తమ తమ రంగాల్లో విజయం సాధించడానికి వారు ఎంచుకునే వ్యూహాలు-ఎత్తుగడల్లో తమ కోర్‌ ఏరియాకు ఇబ్బందికరమైనది ఉంటే తప్ప స్పందించకూడదని కూడా భావిస్తున్నట్టు అర్థమవుతున్నది. వాళ్లకోర్‌ ఏరియా కార్మికులు అయ్యే అవకాశం లేదు. కోర్‌ ఏరియాల్లో ఆరెస్సెస్‌కు భిన్నంగా మోదీ నడిచే అవకాశం లేదు.మోదీ ఇమేజ్‌ మేక్‌ ఓవర్‌ పూర్తయితే కానీ ఆ కోర్‌ ఏరియాల పని పట్టకపోవచ్చు. బిసి నాయకుడిని ముందు పెట్టడం మోదీ రూపంలో వ్యక్తమై ఉండవచ్చును. కానీ కులంతోనూ కుల నాయకులతోనూ వారి సయ్యాట ఇవాళ మొదలైందేమీకాదు. ముఖ్యంగా గత ఐదారేళ్లుగా వాళ్లు దేశంలోని వివిధ కులసంఘాలతోనూ వాటి నాయకులతోనూ చర్చలు జరుపుతూ ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులతోనే కాదు, సైద్ధాంతిక శత్రువులతో కూడా కలిసి మాట్లాడడానికివెనుకాడడం లేదు. దేశంలో వేగంగా సాగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఆ మార్పులను తనకు అనువుగా మలుచుకోవడానికి వారు సమర్థంగా కృషి చేస్తున్నారు. తాము ఉగ్రవాదిఅని పిలిచే సజ్జాద్‌ లోన్‌తో అవసరం కోసం మోదీ చేతులు కలిపితే కూడా మౌనంగా ఉండిపోయేంత స్థితప్రజ్ఞత ప్రదర్శిస్తున్నది ఆరెస్సెస్‌. మోదీ ఎంత ఎదిగినా, ఏం చేసినా ఏనాడూ అభద్రత అనిపించకపోవడంలో వారి సైద్ధాంతిక అనుబంధం, పరస్పర విశ్వాసం ఇమిడి ఉన్నాయి. మోదీ మీద వారికున్న ఆ అపార నమ్మకంలోనే అసలు విషయం దాగుంది. మార్కెట్‌ ఎర్రతివాచీ పరిచి ఉన్నా ఇంకేమి చేసి ఉన్నా పార్లెమెంటరీ రెబల్‌ జార్జిఫెర్నాండెజ్‌ ఆ నాడు ఆ అడుగు వేయకపోయి ఉంటే మోదీ ఇవాళ ఈ స్థాయిలో ఉండేవారు కాదు. లెజ్టిమసీ అనేది కీలకమైన విషయం. మోదీ ఉథ్తానం-కమ్యూనిస్టుల పతనం విలోమనిష్ఫత్తి కలిగినవి.వామపక్షాల స్పేస్‌ను ఆమ్‌ ఆద్మీ లాంటి పార్టీలు భర్తీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వాళ్లూ వ్యక్తిగతంగా నిజాయితీ పరులే. పేదలకు మేలు చేయాలనే వారే. రాజకీయాలు అప్రధానమైపోయాక మేలు అనే అమూర్తమైన మాటను ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. నక్సలైట్ల త్యాగం, సుందరయ్యగారి సైకిల్‌, రాఘవులు చేతి సంచీ గురించి జరిగిన ప్రచారంలో పదో భాగమైనా వారి రాజకీయాల గురించి జరిగి ఉంటే కథ వేరే ఉండేది. పెట్టుబడి అనేది ఇవాళ ఆకర్షణీయమైన పదం.పాత అవశేషాలనుపూడ్చిపెట్టి ఎవరు పెట్టుబడిదారీ విధానాన్ని వేగవంతం చేస్తే వారివైపు నిలబడే వారు పెరుగుతున్నారు. కాకపోతే వారికి 'నిజాయితీ' ఉండాలి!మనుషులు ప్రయోజనాలకోసం పోగవుతారు తప్పితే సమానత్వం కోసంకాదనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.సమానత్వంలోనే ప్రయోజనాలున్నాయి అని అర్థం చేయించగలిగిన స్థితిలో లేరు. కొంతమందికి ప్రయోజనాలను ఎక్కువమందికి అందుబాటులో ఉన్నది అనే ఆశను కల్పించే మార్కెట్‌ వ్యవస్థలో అది సంక్లిష్టమైన వ్యవహారం.బ్లాక్ అండ్‌ వైట్‌ సన్నివేశాలకు తప్ప సంక్లిష్టమైన సన్నివేశాలకు వామపక్షాలు సిద్ధపడి ఉన్నాయా అనేది సందేహం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బూటకమనో మరోటనో అనేసి సంతృప్తిపడేవారు అది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ జైత్రయాత్ర సాగించడంలో దాగి ఉన్న కోణాలను అర్థం చేసుగోగలిగారా అనేదీ సందేహమే! ఎన్జీవోల మాదిరి మార్జినలైజ్డ్‌ భాష మాట్లాడుతూ కొమ్మలపైన మాత్రమే కేంద్రీకరించి చెట్టుని మర్చిపోయామా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందేమో! కార్మిక సంస్కరణల సందర్భం ఆ ఆలోచనకు ఉత్ర్పేరకంగా పనిచేస్తుందని ఆశించొచ్చా!
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మీ వ్యాపారాన్ని తాజాగా ఉంచడం వలన కార్యకలాపాలు సజావుగా మరియు సమర్ధవంతంగా నడుస్తాయి. మీరు క్రొత్త కంప్యూటర్‌లకు అప్‌గ్రేడ్ చేస్తుంటే లేదా మీ నెట్‌వర్క్‌కు పెద్ద వైరల్ దాడిని ఎదుర్కొంటుంటే, అసలు ఫ్యాక్టరీ సెట్టింగ్‌ల నుండి కంప్యూటర్‌ను ఫార్మాట్ చేయడానికి మీరు ప్రతిదీ తుడిచివేయవలసి ఉంటుంది. మీరు హార్డ్ డ్రైవ్‌ను తుడిచిపెట్టినప్పుడు, మీరు సిస్టమ్ పునరుద్ధరణ చేస్తున్నారు. విండోస్ 7, 8 మరియు 10, లైనక్స్ ఉబుంటు మరియు మాక్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కంప్యూటర్‌ను దాని అసలు ఆపరేటింగ్ సిస్టమ్‌కి పునరుద్ధరించేటప్పుడు డేటాను క్లియర్ చేయడాన్ని సులభతరం చేస్తాయి. సిస్టమ్ విండోస్ 7 మరియు అంతకంటే ఎక్కువ పునరుద్ధరించండి మీ కంప్యూటర్‌లో ఏదైనా పెద్ద చర్య మాదిరిగా, మీరు మొదట మీ వ్యాపార అవసరాలకు అవసరమైన మొత్తం డేటాను బ్యాకప్ చేస్తున్నారని నిర్ధారించుకోండి. ఈ డేటాను బాహ్య హార్డ్ డ్రైవ్‌లో లేదా క్లౌడ్‌లో నిల్వ చేయండి. మీకు సరైన బ్యాకప్ లేకపోతే మీరు ఈ లేదా క్రొత్త కంప్యూటర్‌కు డేటాను పునరుద్ధరించలేరని గుర్తుంచుకోండి. విండోస్ 10 రిఫ్రెష్ చేయడానికి ఒక ఎంపికను కలిగి ఉంది, ఇది కంప్యూటర్‌ను తిరిగి ఫార్మాట్ చేయదు లేదా డేటాను తుడిచిపెట్టదు. ఇది డేటాను తాకకుండా ఫ్యాక్టరీ డిఫాల్ట్‌కు సెట్టింగ్‌లను పునరుద్ధరిస్తుంది. నెమ్మదిగా పనిచేసే వ్యవస్థలకు ఇది సిఫార్సు చేయబడింది కాని డేటాను శుభ్రంగా తుడిచిపెట్టడానికి కాదు. పునరుద్ధరించడానికి ముందు, అన్ని సాఫ్ట్‌వేర్ క్రమ సంఖ్యల గమనిక చేయండి. మీరు చెల్లించిన డౌన్‌లోడ్ చేసిన సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించడానికి మీరు దీనికి అవసరం. ప్రారంభ బటన్ క్లిక్ చేసి, సెట్టింగులను గుర్తించండి. సెట్టింగులలో నవీకరణ & భద్రత ఎంచుకోండి, ఆపై రికవరీ ఎంచుకోండి. మీకు ఇక్కడ రెండు ఎంపికలు ఇవ్వబడ్డాయి. మొదటిది ఫైళ్ళను ఉంచే రిఫ్రెష్. రెండవది ప్రతిదీ తొలగించడం. మీ డేటా ఫైల్‌లు తొలగించబడటమే కాకుండా, మీరు ఇన్‌స్టాల్ చేసిన ప్లగిన్లు, ప్రోగ్రామ్‌లు మరియు యూజర్ సెట్టింగులను తీసివేస్తారు. ఇది పూర్తి కావడానికి కొన్ని నిమిషాలు పట్టవచ్చు. ఇది పూర్తయినప్పుడు, కంప్యూటర్‌ను మూసివేసి రీబూట్ చేయండి. మీరు అసలు విండోస్ ప్రారంభ పేజీని చూడాలి. సమాచారం మిగిలి లేదని నిర్ధారించడానికి పత్రాల విభాగం మరియు ప్రారంభ మెనులోని ప్రోగ్రామ్‌ల ద్వారా స్క్రోల్ చేయండి. Mac iOS కంప్యూటర్‌ను పునరుద్ధరించండి విండోస్ మాదిరిగా, మాక్ వ్యక్తిగత ఫైళ్ళతో లేదా తాకకుండా ఫ్యాక్టరీ సెట్టింగులను పునరుద్ధరించడానికి ఒక ఎంపికను కలిగి ఉంది. డేటాను బ్యాకప్ చేయడానికి Mac సిస్టమ్‌లు టైమ్ మెషీన్‌ను ఉపయోగిస్తాయి, అయితే మీరు మీ ఇన్‌స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ల కోసం ఏదైనా క్రమ సంఖ్యలను ఉంచారని నిర్ధారించుకోవాలి. ప్రోగ్రామ్‌లను తిరిగి ఇన్‌స్టాల్ చేయడానికి టైమ్ మెషిన్ రూపొందించబడినప్పటికీ, క్రమ సంఖ్యలు లేకుండా అతుకులు లేని ప్రక్రియపై ఆధారపడటం ప్రమాదకరం. క్లౌడ్ లేదా బాహ్య హార్డ్ డ్రైవ్‌లోకి డేటాను మాన్యువల్‌గా బ్యాకప్ చేయడం కంటే టైమ్ మెషిన్ చాలా వేగంగా ఉంటుంది. Macs పరికరాలను బాగా అనుసంధానించినందున, ఇతర పరికరాల నుండి డేటాను రక్షించడానికి మీరు ఫ్యాక్టరీ సెట్టింగ్‌లకు రీసెట్ చేయడానికి ముందు మీరు కొన్ని పనులు చేయాలి. మొదట, ఐట్యూన్స్‌ను డీథరైజ్ చేయండి కాబట్టి క్రొత్త వినియోగదారు మీ ఖాతాలోకి లాగిన్ అవ్వలేరు. ఐట్యూన్స్ తెరిచి, ఖాతా క్లిక్ చేసి, అధికారాలను ఎంచుకోండి కోసం చూడండి, ఆపై ఈ కంప్యూటర్‌ను డీఆథరైజ్ చేయి ఎంచుకోండి. రీసెట్ చేసిన తర్వాత క్రొత్త వినియోగదారు గుప్తీకరించిన ఫైల్‌లను యాక్సెస్ చేయకుండా నిరోధించడానికి ఫైల్‌వాల్ట్‌ను ఆపివేయండి. ఆపిల్ మెనూలో సిస్టమ్ ప్రాధాన్యతలను ఎంచుకోండి. భద్రత & గోప్యతలో, ఫైల్వాల్ట్ ఎంచుకోండి. మీ సిస్టమ్ కోసం వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, ఆపై ఫైల్‌వాల్ట్‌ను ఆపివేయండి. ప్రాధాన్యతల ద్వారా iCloud మరియు iMessage ని నిలిపివేయండి. ఇప్పుడు మీరు హార్డ్ డ్రైవ్‌ను తుడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. యుటిలిటీస్ విండోకు వెళ్లి డిస్క్ యుటిలిటీని ఎంచుకోండి. ప్రారంభ డిస్క్‌ను ఎంచుకోండి. తొలగించు క్లిక్ చేయండి. ఇచ్చిన ఎంపికలలో, Mac OS విస్తరించినదాన్ని ఎంచుకుని, ఆపై తొలగించు క్లిక్ చేయండి. ఇది పూర్తయినప్పుడు, మీరు డేటాను చెరిపివేసినట్లు నిర్ధారించడానికి Mac ని పున art ప్రారంభించండి. Linux ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్‌ను పునరుద్ధరించండి ఫ్యాక్టరీ సెట్టింగులకు ఏదైనా రీబూట్ చేసినట్లుగా, అన్ని సంబంధిత డేటాను బ్యాకప్ చేసి, మీరు ఉపయోగించే అన్ని క్రమ సంఖ్యల ప్రోగ్రామ్‌లను రికార్డ్ చేయండి. ఉబుంటు వ్యవస్థను అసలు ఫ్యాక్టరీ సెట్టింగులకు పునరుద్ధరించడానికి, CTRL + ALT + DEL అనే కీ ఆదేశంతో కంప్యూటర్‌ను పున art ప్రారంభించండి. ప్రారంభ సమయంలో Esc ని నొక్కడం ద్వారా GRUB రికవరీ మోడ్‌ను తెరవండి. కీస్ ఎఫ్ 11 మరియు ఎఫ్ 12 కూడా మిమ్మల్ని రికవరీ మోడ్‌కు చేరుస్తాయి. జాబితా చేయబడిన ఎంపికల నుండి, ఉబుంటును ఫ్యాక్టరీ స్థితికి పునరుద్ధరించు ఎంచుకోండి. ప్రక్రియ పూర్తయినప్పుడు, కంప్యూటర్ సరిగ్గా జరిగిందని నిర్ధారించుకోవడానికి పున art ప్రారంభించండి. హెచ్చరిక మీరు వైరస్ లేదా క్రాష్‌ను ఎదుర్కొన్నట్లయితే మీరు శుభ్రమైన డేటాను పునరుద్ధరించగలరని నిర్ధారించడానికి సమాచారాన్ని క్రమం తప్పకుండా బ్యాకప్ చేయండి. మీరు విక్రయించడానికి కంప్యూటర్‌ను శుభ్రం చేస్తుంటే, కొనుగోలుదారు సున్నితమైన లేదా ప్రైవేట్ సమాచారాన్ని పొందకుండా నిరోధించడానికి అన్ని డేటాను సరిగ్గా తుడిచి, హార్డ్ డ్రైవ్‌ను తిరిగి ఫార్మాట్ చేయండి.
మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. కె.ఎస్.రవీంద్ర(బాబి) దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను ఒక్కొక్కటిగా వదులుతున్నారు. Video Advertisement ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన తొలి సింగిల్ సాంగ్ ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. ఈ బాస్ పార్టీ ప్రోమోలో దేవి శ్రీ ప్రసాద్ మార్క్ కనిపించేలా మాస్ బీట్స్, దేవి డైలాగ్స్ తో స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ప్రోమోను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. బాస్ పార్టీ సాంగ్ ప్రోమోను ఇందులో ట్యూన్, లిరిక్స్ ను చూసి జనాలు దేవీ శ్రీ ప్రసాద్‌ను తిడుతున్నారు.ఎందయ్యా దేవి ఇదేం ట్యూన్,ఇదెక్కడి పాట అని ఏకిపారేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌కు సోషల్ మీడియాలో ఎదురుదెబ్బ తగిలేట్టు కనిపిస్తోంది. అసలే ఈమధ్య దేవీ శ్రీ ప్రసాద్‌ టైం బాగా లేనట్టు ఉంది. ఓ పరి సాంగ్ వివాదంతో దేవీ శ్రీ ప్రసాద్ ఇంకా బయటపడకముందే, ఇప్పుడు బాస్ పార్టీ సాంగ్‌ ప్రోమో ట్రోలింగ్‌కు అవుతోంది. కొందరైతే పాటలు కొట్టడం ఆపి రెస్ట్ తీసుకో అంటూ ట్రోల్స్ వేస్తున్నారు. ఇదేం పాటరా అంటూ దారుణంగా తిడుతున్నారు. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టు కొంత మంది మాత్రం దేవీ శ్రీ ప్రసాద్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ పాటలు మొదట్లో అలానే అనిపించినా,ఆ తరువాత అవే ఎక్కేస్తాయ్ అంటున్నారు.మొత్తానికి అయితే బాస్ పార్టీ ప్రోమో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న వాల్తేరు వీరయ్య చిత్రంలో ర‌వితేజ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో శృతిహాస‌న్ నటిస్తుంది.. వాల్తేరు వీరయ్య 2023 జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
విషయం ఏదైనా కానీ కాస్తంత ప్రజాదరణ ఉన్న అంశాల్లో.. అంచనాలు మాత్రమే తప్పించి ఫలితం తెలీని విషయాల మీద బెట్టింగ్ జరగటం సర్వసాధరణంగా మారింది. ఇందుకు మునుగోడు ఉప పోరు కూడా మినహాయింపు కాదు. మునుగోడు ఉప ఎన్నిక లో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసిన తర్వాత నుంచి గెలుపు మీద బెట్టింగుల జోరు తగ్గినట్లుగా చెబుతున్నారు. దీనికి కారణం.. ఫలితం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లేనని.. అనూహ్య పరిస్థితుల్లో తప్పించి గెలుపు గులాబీ వాకిట్లోనే ఉందని.. అధికారంగా ప్రకటించటమే ఆలస్యమన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. టీఆర్ఎస్ గెలుపు మీద బెట్టింగ్ పెట్టటానికి బోలెడంత మంది ఆసక్తి చూపుతున్నా.. ఆ బెట్టింగ్ ను తీసుకునే పరిస్థితుల్లో బెట్టింగ్ నిర్వాహకులు లేరు. దీంతో.. బెట్టింగ్ తీరు మారింది. మునుగోడు ఉప ఎన్నిక కోసం మంత్రులు మొదలు కొని ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలను ఆయా గ్రామాల ఇన్ ఛార్జులకు నియమించటం తెలిసిందే. చివరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించే మంత్రి కేటీఆర్.. హరీశ్ రావులు సైతం మునుగోడు ఉప ఎన్నికల్లో గ్రామాలకు ఇన్ ఛార్జులుగా వ్యవహరించాల్సి వచ్చింది. దీంతో.. కేటీఆర్ ఇన్ ఛార్జిగా వ్యవహరించిన గ్రామంలో ఎక్కువ లీడ్ వచ్చిందా? హరీశ్ రావు ఇంఛార్జిగా ఉన్న గ్రామంలో లీడ్ అధికంగా వస్తుందా? ఈటెల రాజేందర్ అత్తగారి ఊళ్లో ఏ పార్టీకి అత్యధిక ఓట్లు వస్తాయి? ఇలాంటి అంశాల మీద బెట్టింగ్ జోరు సాగినట్లు చెబుతున్నారు. ఇదంతా వింటే.. ఈ బెట్టింగులకు మూలమైన మునుగోడు ఉపపోరు ఫలితం మీద కంటే కూడా.. కొసరు అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం.. ఇప్పుడు బెట్టింగులు మొత్తం ఇలాంటి విషయాల చుట్టూనే సాగుతుండటం గమనార్హం.
thesakshi.com : ఆర్థిక వృద్ధి పరంగా ప్రతి ఒక్కరూ మందగిస్తున్నప్పుడు, భారతదేశం ఎటువంటి ప్రభావం చూపలేదు, కానీ ఇతర దేశాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది మరియు సాపేక్షంగా ప్రకాశవంతమైన ప్రదేశంలో ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఉన్నతాధికారి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం గ్లోబల్ కాన్జూచర్‌ను చూడండి, ఇది చాలా సమస్యగా ఉంది, IMF ఆసియా మరియు పసిఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ మాట్లాడుతూ, “ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వృద్ధి మందగిస్తోంది” అని అన్నారు. “ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 1/3 వంతు ఉన్న దేశాలు ఈ సంవత్సరం లేదా వచ్చే ఏడాది మాంద్యంలోకి వెళ్తాయని మేము ఆశిస్తున్నాము. మరియు ద్రవ్యోల్బణం ప్రబలంగా ఉంది. కాబట్టి ఇది విస్తృతమైన కథ” అని శ్రీనివాసన్ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. “దాదాపు ప్రతి దేశం మందగిస్తోంది. ఆ సందర్భంలో, భారతదేశం మెరుగ్గా ఉంది మరియు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో పోలిస్తే సాపేక్షంగా ప్రకాశవంతమైన ప్రదేశంలో ఉంది” అని శ్రీనివాసన్ చెప్పారు. IMF మంగళవారం తన వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో 2022లో 6.8 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది, ఇది 2021లో 8.7 శాతంగా ఉంది. 2023కి సంబంధించిన అంచనా మరింత తగ్గి 6.1 శాతానికి పడిపోయింది. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతుకు పైగా కుచించుకుపోగా, మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు — (usa)యునైటెడ్ స్టేట్స్, (Europe )యూరోపియన్ యూనియన్ మరియు (china)చైనా — నిలిచిపోతాయని పేర్కొంది. “సంక్షిప్తంగా, చెత్త ఇంకా రావలసి ఉంది, మరియు చాలా మందికి, 2023 మాంద్యం లాగా ఉంటుంది” అని IMF యొక్క ఎకనామిక్ కౌన్సెలర్ మరియు రీసెర్చ్ డైరెక్టర్ అయిన పియరీ-ఒలివర్ గౌరించాస్ తన ఫార్వార్డ్‌లో WEOకి తెలిపారు. IMF మరియు ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం. ఇప్పుడు అంతకు మించి, మూడు అంతర్లీన ఎదురుగాలులు ఉన్నాయి. కేంద్ర బ్యాంకులు మరియు ఆసియా ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణాన్ని పరిష్కరించేందుకు కఠినతరం చేస్తున్నందున ఆర్థిక పరిస్థితులు కఠినతరం కావడం ఒకటి. రెండవది ఉక్రెయిన్, ఇది ఆహారం మరియు వస్తువుల ధరల పెరుగుదలకు దారితీసిన యుద్ధం, కరెంట్ ఖాతా లోటులను విస్తరించింది. మరియు మూడవది ఈ ప్రాంతంలోనే ఉంది, చైనా మందగిస్తోంది, అతను గమనించాడు. ఈ అంశాల సమ్మేళనం భారతదేశంతో సహా ఆసియాలోని అనేక ప్రాంతాలలో అవకాశాలను తగ్గిస్తుంది. బయటి డిమాండ్‌ తగ్గడంతో భారత్‌ ప్రభావం చూపుతోంది. అలాగే దేశీయంగా కూడా ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. “ఆర్‌బీఐ ఏం చేసిందంటే అది ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసింది. సరిగ్గా అలాగే. వారు చురుకైన కఠిన ద్రవ్య విధానంలో ఉన్నారు” అని ఆయన అన్నారు. “ఇప్పుడు, దేశీయ డిమాండ్‌పై ప్రభావం చూపడం అంటే ఏమిటి. మీకు ద్రవ్యోల్బణం ఉంది, ఇది వినియోగదారుల డిమాండ్‌ను ప్రభావితం చేస్తుంది మరియు మీరు ద్రవ్యోల్బణాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పుడు, ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం ద్వారా, అది పెట్టుబడిపై భరిస్తుంది. కాబట్టి, రెండింటికీ రెండు కారణాల వల్ల, మీరు భారతదేశంలో కొంత మందగమనాన్ని చూస్తున్నారు, అందుకే మేము దానిని ఈ సంవత్సరం 6.8 శాతానికి మరియు వచ్చే ఏడాది 6.1 శాతానికి సవరించాము, ”అని శ్రీనివాసన్ జోడించారు. CAPEX కోసం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను కలిగి ఉందని గమనించిన శ్రీనివాసన్, దేశీయ డిమాండ్‌కు ఊతం ఇస్తుందని దేశం దానిని కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత ప్రభుత్వం పేదలు మరియు బలహీనవర్గాలపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పరిష్కరిస్తోంది, ఇది చాలా మంచిదని ఆయన అన్నారు. “వారు ఎక్సైజ్ పన్నులను తగ్గించారు, ఇది బోర్డు అంతటా ఉంది. అది మంచిది మరియు చెడు. ఇది ధరల వైపు ఉపశమనం అందించే కోణంలో మంచిది, కానీ ఇది బాగా లక్ష్యంగా లేదు. పరిమిత ఆర్థిక స్థలం నేపథ్యంలో, మీరు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించే ఈ చర్యలు మరింత లక్ష్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. మేము పేద మరియు బలహీన వర్గాలకు మరింత లక్ష్య మద్దతును కోరుకుంటున్నాము. ఉచిత రేషన్లు ఒకటే, “అని ఆయన అన్నారు. ఎక్కువ విదేశీ పెట్టుబడుల కోసం రంగాలను తెరవడం మంచిది. “మేము చూసినది సంక్షోభం యొక్క ప్రారంభ దశలో ఉంది, మీకు భారతదేశం నుండి మూలధనం ఉంది, ఇప్పుడు అది తిరిగి వస్తోంది, ఎఫ్‌డిఐలో ​​ఈక్విటీ మూలధనాన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది, అది చాలా మంచిది. అది విషయాలను పెంచుతుంది.” అని చెప్పాడు. డిజిటలైజేషన్‌లో భారతదేశం అద్భుతంగా పని చేసిందని శ్రీనివాసన్ అన్నారు. “మీరు భారతదేశంలోని డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పరిశీలిస్తే, ఇది చాలా అద్భుతంగా ఉంది. సమీప కాలంలో మరియు దీర్ఘకాలికంగా వృద్ధిని పెంచడానికి మీరు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలికంగా ఉండాల్సిన అనేక విషయాలను పరిష్కరించడానికి డిజిటలైజేషన్‌ను ఉపయోగించుకోవచ్చు. ” అతను చెప్పాడు. COVID-19 సంక్షోభం యొక్క డెల్టా వేవ్ సమయంలో భారతదేశం గడ్డం దెబ్బతింది, అతను చెప్పాడు. కానీ అప్పటి నుండి, వారు జనాభాలో పెద్ద సంఖ్యలో టీకాలు వేయడంలో చాలా బలంగా తిరిగి వచ్చారు. “జనాభాలో దాదాపు 70 శాతం మందికి పూర్తిగా టీకాలు వేయబడ్డాయి. 1.4 బిలియన్ల జనాభా ఉన్న దేశానికి టీకాలు వేయడం అంత తేలికైన పని కాదు. మరియు వారు అక్కడ చాలా మంచి పని చేసారు. ఉపాధికి మద్దతుగా వనరులను ఉపయోగించడంలో వారు చాలా తెలివిగా వ్యవహరించారు, ఆరోగ్య సంరక్షణ, మరియు పేదలు మరియు బలహీనులు. మహమ్మారిని ధీటుగా ఎదుర్కోవడం ద్వారా, వారు ఒక ముఖ్యమైన ఎదురుగాలిని తగ్గించారు, “అని అతను చెప్పాడు. జీరో కోవిడ్ వ్యూహం చైనా ఆర్థిక వ్యవస్థపై ఒక డ్రాగ్‌గా ఉన్నప్పటికీ, భారతదేశం విషయంలో మహమ్మారికి ఎదురుగాలి తక్కువగా ఉంది, ఎందుకంటే వారు టీకా ద్వారా దీనిని పరిష్కరించారు. “వారు తమ వనరులను చాకచక్యంగా ఉపయోగించారు. వృద్ధి మందగించడం మరియు ద్రవ్యోల్బణం పెరుగుతున్న గ్లోబల్ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆ సందర్భంలో, వృద్ధిని రక్షించడానికి భారతదేశం బాగా పనిచేసింది. ఇప్పుడు, ముందుకు వెళ్లడం అంత సులభం కాదు, ఎందుకంటే, వృద్ధి అవకాశాలను కొనసాగించడానికి, భారతదేశం ఈ ప్రతిష్టాత్మకమైన CAPEX ప్రణాళికను కొనసాగించాలి” అని శ్రీనివాసన్ అన్నారు. ఇది ఉపాధిని సృష్టించగల ప్రైవేట్ రంగం గుణించే ప్రభావాన్ని సృష్టిస్తుందని ఆయన అన్నారు. మహమ్మారి సమయంలో, ప్రజలు ప్రధానంగా మహిళలు మరియు యువత ఉద్యోగాలను కోల్పోయారు. “మీరు ఆ ఉద్యోగాలు ఎక్కువగా ఉండే వాతావరణాన్ని సృష్టించాలి. కాబట్టి CAPEX ప్రణాళికలకు తిరిగి వెళ్లడం, ప్రైవేట్ రంగాన్ని తీసుకురావడం ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆ కోణంలో, ఇది మంచి విషయమని నేను భావిస్తున్నాను,” అని అతను చెప్పాడు. అన్నారు. చమురు ధరలు పెరిగినందున భారతదేశం బాహ్య ఖాతాపై పెద్ద ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కరెంట్ ఖాతా లోటు విస్తరిస్తోంది. వ్యవసాయ సంస్కరణలు, భూసంస్కరణలు, కార్మిక సంస్కరణలు అనేవి దీర్ఘకాలిక దృక్పథంతో చేయాల్సిన కొన్ని సంస్కరణలు ఉన్నాయని శ్రీనివాసన్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. “వారు (agricultural )వ్యవసాయ సంస్కరణలతో ముందుకు సాగారు. ఇది ఒక రకమైన పాన్ అవుట్ కాదు, భూసంస్కరణతో అదే విషయం. అయితే ఇవి కొనసాగించాల్సిన అవసరం ఉంది. మీ వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచే వేగాన్ని మీరు కొనసాగించాలి,” అని అతను చెప్పాడు. Tags: #RBIeconomic growtheconomic growth in IndiaGlobal Growthindian economy 2022International Monetary Fund (IMF)
మీ వ్యాపారంలో 100 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నట్లయితే, అది ప్రెసిడెంట్ బిడెన్ ఇటీవల జారీ చేసిన కొత్త వ్యాక్సినేషన్ ఆర్డర్‌కు లోబడి ఉండవచ్చు. సెప్టెంబరు 9, 2021న, 100 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న యజమానులు తప్పనిసరిగా తమ ఉద్యోగులకు COVID-19 టీకాలు వేయాలని లేదా వారానికొకసారి పరీక్షించబడాలని నియమాన్ని రూపొందించాలని అతను ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ (OSHA)ని ఆదేశించాడు. OSHA ప్రమాణాలను సెట్ చేయడం మరియు అమలు చేయడం ద్వారా సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన పని పరిస్థితులకు భరోసా ఇవ్వడం మరియు శిక్షణ, ఔట్రీచ్, విద్య మరియు సహాయం అందించడం ద్వారా, దేశవ్యాప్తంగా సురక్షితమైన కార్యాలయాలను ప్రోత్సహించడంలో సహాయపడటానికి టీకాల గురించి ఒక నియమాన్ని రూపొందించడానికి తగిన ఏజెన్సీ. తుది మార్గదర్శకాలు ఇంకా జారీ చేయనప్పటికీ, మీరు ఇప్పుడు ఈ పనులను చేయవచ్చు మీ సంస్థను సిద్ధం చేయడంలో సహాయపడండి రాబోయే వాటి కోసం. దాని గురించి ఆలోచించు. పెద్ద యజమానులకు కొన్ని పరిమిత మినహాయింపులు ఉంటాయని ఊహించినప్పటికీ, అన్ని వ్యాపారాలు తప్పనిసరిగా ఆదేశాన్ని అమలు చేయవలసిన అవసరం లేదు. మీ సంస్థ ఉద్యోగులకు టీకాలు తప్పనిసరి చేయాల్సిన అవసరం లేకపోయినా దానిని ఎంచుకుంటుందా అనే దాని గురించి ఆలోచించడానికి కొంత సమయం కేటాయించండి. తుది రూల్‌ను వెంటనే విడుదల చేయాలి. ఈలోగా, మీకు ఏ వనరులు అవసరమో లేదా మీ పాలసీలోని కొన్ని భాగాలు ఏవి కావాలో మీరు ప్లాన్ చేయడం ప్రారంభించవచ్చు. మాట్లాడటం కొనసాగించండి - మరియు వినండి. సమర్థవంతమైన కమ్యూనికేషన్ తేడాను కలిగిస్తుంది. మీ వ్యాపారం ఏమి చేయాలనే దానితో సంబంధం లేకుండా, లేదా మీ ఉద్యోగులతో రెండు-మార్గం కమ్యూనికేషన్‌లో పాల్గొనండి. వారి ఆందోళనలను వినడంతో పాటు, మీ ఉద్యోగులు మరియు వారి ప్రియమైన వారిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటానికి వైరస్ గురించి, అది ఎలా వ్యాప్తి చెందుతుంది మరియు దానిని ఎలా నిరోధించవచ్చు అనే దాని గురించి వైద్య మరియు ఆరోగ్య అధికారుల నుండి విద్యను అందించండి. మాస్క్‌లు, వ్యాక్సిన్‌లు మరియు ఆదేశాల గురించి ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి ఉద్యోగులతో విశ్వసనీయ సంబంధాలను అభివృద్ధి చేయడం మరియు నిర్వహించడం ఉద్యోగి ధైర్యాన్ని, నిశ్చితార్థం మరియు నిలుపుదల కోసం ముఖ్యమైనది. పన్ను క్రెడిట్ పొందండి. OSHA మీ సంస్థ ఉద్యోగులు COVID-19 వ్యాక్సిన్‌ను పొందాలని కోరుకున్నా, లేదా అలా చేయడం కంపెనీ పాలసీగా మారినా, మీ వ్యాపారం అక్టోబర్ 31, 2021న చెల్లించాల్సిన 941 త్రైమాసిక పన్ను రిటర్న్‌పై పన్ను క్రెడిట్‌ను పొందవచ్చు. మీ ఉద్యోగులు ఉంటే మీరు క్రెడిట్‌ని అందుకోవచ్చు ఏప్రిల్ 1 మరియు సెప్టెంబరు 30, 2021 మధ్య షాట్ వచ్చింది మరియు అలా చేయడానికి వారికి వేతనంతో సమయం ఇవ్వబడింది లేదా షాట్ తీసుకున్న వెంటనే వారు అస్వస్థతకు గురయ్యారు. మీ ఉద్యోగులతో పని చేయండి మరియు మంచి రికార్డులను ఉంచండి. యజమానిగా, మీరు షాట్‌ను పొందిన ప్రతి ఉద్యోగి యొక్క రికార్డులను నిర్వహించాలి మరియు ఎప్పుడు, పన్ను క్రెడిట్‌కు అర్హత పొందాలి. తదుపరి ప్రాణాంతక వైరస్ ఎప్పుడు వస్తుందో, లేదా అది ఎలా ఉంటుందో తెలియదు - కానీ దాని రాక, కనీసం, ఖచ్చితంగా ఉంది. వ్యాపారాలు మళ్లీ సర్దుకుపోవాల్సి వస్తుంది. ప్రస్తుత మహమ్మారి నుండి నేర్చుకోవడం ద్వారా, యజమానులు మరియు వారి సంస్థలను నడుపుతున్న ఉద్యోగులు తదుపరి దానిని నిర్వహించడానికి బాగా సిద్ధంగా ఉంటారు. అలాగే, మహమ్మారికి సంబంధం లేని కొన్ని అర్ధవంతమైన పాఠాలు కూడా ఉండవచ్చు.
అయితేనేం, సినిమాల్లో చూపిన తెగువ ఇంతటీ కీర్తి, స్టార్డమ్ తెచ్చిపెట్టాయి. ఆయన మనతో సజీవంగా లేకున్నా, ఆయన సినిమా సంస్థ ద్వారా నేటికి ఎంతోమంది శిక్షణ పొందుతున్నారు..ఎన్నో సినిమాల్ని అందిస్తున్నారు. ఈ నెల(జూన్) 6న డాక్టర్ డి. రామానాయుడుగారి జయంతి సందర్భంగా, ఆయన సినీ, జీవిత విశేషాలు ప్రత్యేకంగా మీకోసం... బాల్యం:- 1936 జూన్ 6న ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామంలో దగ్గుపాటి వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవమ్మ దంపతులకు రామానాయుడు జన్మించారు. వీరు ఉన్నత కుటుంబానికి చెందినవారు. ప్రాథమిక విద్యను అదే ఊర్లో చదివి, హై స్కూల్ ఒంగోలులో పూర్తి చేశారు. కానీ చదువుకన్నా సామాజిక సేవపైనే దృష్టి వహించేవారు. తెలుగుమీద విపరీతమైన అభిమానం. అందుకే తెలుగులోనే ఎక్కువ మార్కులు వచ్చేవి. మిగతావాటిల్లో అంతతమాత్రమే! అప్పట్లో మద్రాస్ లయెలా కాలేజి కోసం 2 లక్షలు విరాళం పోగు చేసి ఇచ్చారు. ఆయనకున్న నాయకత్వ లక్షణాలను మెచ్చి ఆ కాలేజివారు ఉచితంగా సీటు ఇచ్చారు. అలా మద్రాస్ లయెలా కాలేజీలో చేరారు. కానీ అక్కడ సర్రిగా చదవడం లేదని చీరాలలో వీఆర్ఎస్ కాలేజీకి మార్పించారు. ఇంకేముంది ఇంటర్ ఫెయిల్. దీంతో కుటుంబసభ్యులు కూడా ఎం చేయాలనేది ఆయన మీదకే వదిలేశారు. రామానాయుడుగారు తమకు వంశపారంపర్యంగా వస్తున్న వ్యవసాయాన్ని చేయాలనుకున్నారు. దుక్కి దున్నడం, నాట్లు వేయడం నేర్చుకొని, వ్యవసాయం చెయ్యడం మొదలు పెట్టారు. రామానాయుడుగారికి ఆయన మేనమామ కూతురు రాజేశ్వరితో వివాహమైంది. ఇద్దరు కొడుకులు సురేష్ బాబు, వెంకటేష్, కూతురు లక్ష్మీ.రైస్ మిల్ వ్యాపారం, ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ చేశారు. సినిమాల్లోకి ఎంట్రీ:- ఏన్నార్ గారు హీరోగా ఓ సినిమా షూటింగ్ నాయుడుగారుంటున్న ఊళ్ళోనే జరిగింది. ఇది విన్న రామా నాయుడుగారు చిత్ర నిర్మాణపనులు గురుంచి తెలుసుకోవడం మొదలు పెట్టారు. షూటింగ్ కు వచ్చినవాళ్ళు ఉండటానికి చోటు, భోజనాలవి ఏర్పాటు చేయడంతో, ఈ సినిమాలో కొంత పెట్టుబడి పెట్టే వీలు కలిగింది. అలా నాయుడు గారికి, ఏఎన్నార్ గారికి పరిచయం పెరిగింది. అప్పట్లో తెలుగులో వచ్చిన సినిమాలన్ని తమిళంలో డబ్బింగ్ చేసేవారు. దీంతో ఆయనకు ఇటు తెలుగు, అటు తమిళ్ యాక్టర్లు పరిచయమయ్యారు. అప్పటికే రామానాయుడు కుటుంబానికి 12 ఇంపోర్టెడ్ కార్లు ఉండేవి. ప్రైవేటుగా నడుపుతున్న బస్సులను ప్రభుత్వం జాతీయం చెయ్యడంతో ఆ వ్యాపారాన్ని అంతటితో ఆపేశారు. నిర్మాతగా:- రామానాయుడుగారు తెలుగు సినిమా డైరెక్షన్ చాలా డగ్గర్నుండి చూడటంతో, డబ్బింగ్ సినిమాలను నిర్మించాలనుకున్నారట. అలా 'అనురాగం' సినిమాకు స్లీపింగ్ పార్టనర్ గా పని చేశారు. ఇక సినిమాల్లోకి పూర్తిగా వెళ్లాలని నిశ్చయించుకొని మద్రాసుకు మకాం మార్చారు. సినిమా ఇండస్ట్రీలోని 24 విభాగాల గురుంచి తెలుసుకున్నారు. 1963లో విడుదలైన 'అనురాగం' సినిమా ప్లాఫ్ అయింది. డివి నర్సరాజుగారు ద్విపాత్రాభినయంతో కూడిన ఓ కథను నాయుడుగారికి వినిపించారు. ఆ కథ ఇదివరకు చాలామంది నిర్మాతలు రిజెక్ట్ చేశారు. అదే 'రాముడు భీముడు' కథ. ఈ కథను విని నచ్చి, ఎన్టీఆర్ గారికి చెప్పి ఒప్పించారు. సొంత నిర్మాణసంస్థ కోసం 1963లో "సురేష్ ప్రొడక్షన్స్" అనే పేరుతో బ్యానర్ పెట్టారు. ఈ బ్యానర్ మీద వచ్చిన మొదటి సినిమా 'రాముడు భీముడు'. ఈ సినిమా షూటింగ్ ను 8నెలల్లో పూర్తి చేసి, 1964 మే నెలలో ఆయన సొంత బ్యానర్ లో సినిమాను విడుదల చేసి మంచి హిట్ కొట్టారు. వంద రోజులు ఆడింది. తర్వాత వచ్చిన 'ప్రతిజ్ఞా పాలన' కూడా హిట్ అయింది. స్త్రీజన్మ, పాపకోసం, సిపాయి చిన్నయ్య, ద్రోహిలాంటి వరుస ప్లాఫ్ లతో 12 లక్షలు నష్టపోయారు. ఆ నష్టాలు భరించలేక, తిరిగి ఊరికి వెళ్లిపోవాలనుకున్నారు. అప్పుడే.. కె.ఎస్. ప్రకాష్ రావుగారు ఓ కథ చెప్పడానికని వచ్చారు. ఇక ఇదే చివరి ప్రయత్నంగా 15 లక్షలు ఖర్చు పెట్టి ఏన్నార్, వాణిశ్రీ జంటగా 'ప్రేమ్ నగర్' సినిమా తీశారు. అది హిట్! దాంతో శోభన్ బాబుతో కలిసి వరుసగా 3 సినిమాలు తీశారు. మళ్ళీ విజయాల్ని చవిచూశారు. కొడుకునే హీరోగా... కృష్ణ గారితో సినిమా చేయాలనుకున్నపుడు, ఆయనకు డేట్స్ కుదరలేదు. అప్పుడు కృష్ణగారు మీ చినబ్బాయి వెంకటేష్ ను సినిమాల్లో హీరోగా పెట్టి తీయండని సలహా ఇచ్చారు. ఇది నచ్చి, అమెరికాలో చదువుకుంటున్న వెంకటేష్ ను ఇండియాకు పిలిపించి 1987లో 'కలియుగ పాండవులు' అనే పేరుతో సినిమా తీశారు. ఇప్పుడు 'విక్టరీ వెంకటేష్' గా సినిమాలు చేస్తున్నారు. ◆పెద్దబ్బాయి సురేష్ బాబుకు 'సురేష్ ప్రొడక్షన్స్'లో మెళకువలు నేర్పించి, మంచి నిర్మాతగా తీర్చిదిద్దారు. ఏన్నార్ తో ఉన్న స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని తన కూతురు లక్ష్మీని అక్కినేని వారి కొడుకు నాగార్జునకు ఇచ్చి, పెళ్లి చేశారు. కానీ కొన్నాళ్ళకు వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అత్యధిక సినీ నిర్మాతగా రికార్డు:- తెలుగులో 84, తమిళంలో 10, హిందీలో 17, కన్నడం 2, బెంగాలిలో 2, మలయాళం, ఒరియా, పంజాబీ, అస్సామీ, ఇంగ్లీష్ లో ఒక్కొక్క సినిమాను, ఇతరాలు కలిపి 13 భారతీయ భాషల్లో 130కి పైగా అత్యధిక సినిమాలు నిర్మించిన నిర్మాతగా "గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్" రికార్డును సాధించారు. ◆2006లో రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు,2010లో 'దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు'లు లభించాయి. ◆2013లో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ, ఉత్తమ జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 2 ఫిల్మ్ ఫేర్ లు వరించాయి. ఆయన సినిమాకు చేసిన విశేష కృషికిగానూ గౌరవ డాక్టరేట్ లభించింది. మరణం:- 2002లో ప్రోస్ట్రేట్ గ్రంథి క్యాన్సర్ ఉందని తెలియడంతో అమెరికాకు తీసుకెళ్లి వైద్యం చేయించారు, ఆయన అప్పుడు కోలుకున్నా... 2015లో మళ్ళీ ఆ సమస్య తిరిగి దాడి చెయ్యడంతో బెంగళూర్, హైదరాబాద్ లలో చూపించారు. వ్యాధి ముదిరి, అనారోగ్యంతో అదే సంవత్సరం ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. ఇతరాంశాలు:- ◆ఎస్ పి బ్యానర్ లోగో కోసం సురేష్ బాబుని, వెంకటేష్ ను పక్కపక్కన నిలబెట్టి లోగోను తయారు చేయించారట. ◆కె. బాపయ్య, కె. మురళీమోహన్, బి. గోపాల్ లాంటి సినీ దర్శకుల్ని ఆయన బ్యానర్ ద్వారా పరిచయం చేశారు. ◆కుష్బు, టబు, దివ్య భారతి, ప్రేమ లాంటి ఎందర్నో డెబ్యూ హీరోయిన్లుగా తీసుకొచ్చారు. ◆పాటల రచయిత చంద్రబోస్ ను సైతం ఆయనే పరిచయం చేశారు. ◆1999లో తెలుగుదేశం పార్టీలో చేరి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో బాపట్లలో ఎంపీగా గెలిచి 2003లో 'ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు'ను తీసుకున్నారు. శతాధిక సినీ నిర్మాతగా, మన భారతీయ కరెన్సీ మీద ఎన్ని భాషలున్నాయో, అన్ని భాషలలో సినిమాలు తీసిన ఘనత ఒక్క రామానాయుడుగారికే చెల్లుతుంది!
బాబూ.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేస్తావా..? ఆక్వా రైతులను ఆదుకోండి పార్టీ నేతల సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కీలక ప్రకటన నిషేధిత ప్లాస్టిక్ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత శ్రీ‌నాథ్‌రెడ్డి పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్ సమావేశం ప్రారంభం కాసేపట్లో పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం బడుగు, బలహీనవర్గాలకు వెన్నుపోటే బాబు డీఎన్ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం You are here హోం » ప్రజా సంకల్పయాత్ర » మూల స్టేషన్‌ నుంచి 279వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం మూల స్టేషన్‌ నుంచి 279వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం 06 Oct 2018 9:27 AM విజ‌య‌న‌గ‌రం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ వైయ‌స్ ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. శనివారం ఉదయం జననేత 279వ రోజు పాదయాత్రను మూల స్టేషన్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి చీపురుపల్లి నియోజకవర్గం ఎస్‌ఎస్‌ఆర్‌ పేట, సోలుపు క్రాస్‌, మన్యపురి పేట, బెల్లాన పేట, వల్లాపురం క్రాస్‌ వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. జననేత వైయ‌స్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ఇక ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను విన్న వైఎస్‌ జగన్, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
ప్రధాన సంగీతం బీట్ గాడ్ ఫాదర్ గ్లిట్టర్ మెయిన్‌మ్యాన్‌ని కలుసుకున్నాడు: విలియం బరోస్ డేవిడ్ బౌవీని ఇంటర్వ్యూ చేశాడు. బీట్ గాడ్ ఫాదర్ గ్లిట్టర్ మెయిన్‌మ్యాన్‌ని కలుసుకున్నాడు: విలియం బరోస్ డేవిడ్ బౌవీని ఇంటర్వ్యూ చేశాడు. సంగీతం డేవిడ్ బౌవీ విలియం S. బరోస్‌తో చాట్ చేస్తున్నప్పుడు జార్జ్ ఆర్వెల్ యొక్క '1984' యొక్క TV అనుసరణను ప్లాన్ చేస్తున్నాడు. టెర్రీ ఓ'నీల్/జెట్టి ఇమేజెస్ విలియం సెవార్డ్ బరోస్ మాట్లాడే మనిషి కాదు. ఒకసారి విందులో అతను తన ప్రతి మంచ్‌ని తీయడానికి శిక్షణ పొందిన ఒక జత స్టీరియో మైక్రోఫోన్‌లను చూస్తూ ఇలా అన్నాడు, “నాకు మాట్లాడటం ఇష్టం లేదు మరియు నేను మాట్లాడేవారిని ఇష్టపడను. మా బార్కర్ లాగా. మీకు మా బార్కర్ గుర్తుందా? సరే, ఆమె ఎప్పుడూ చెప్పేది, 'మా బార్కర్‌కు మాట్లాడటం ఇష్టం ఉండదు మరియు ఆమె మాట్లాడేవారిని ఇష్టపడదు.' ఆమె తన తుపాకీతో అక్కడే కూర్చుంది. నిగూఢమైన వ్యక్తిత్వం వలె ఇది నా మనస్సులో ఉంది డేవిడ్ బౌవీ నవంబరు 17న ఒక ఐరిష్ క్యాబీ బరోస్ మరియు నన్ను బౌవీ యొక్క లండన్ ఇంటికి తీసుకువెళ్లినప్పుడు ('స్ట్రేంజ్ బ్లాక్స్ డౌన్ దిస్ పార్ట్ o' లండన్, సహచరుడు'). నేను ఈ రెండు-మార్గాన్ని ఏర్పాటు చేయడానికి గత కొన్ని వారాలు గడిపాను ఇంటర్వ్యూ . నేను బౌవీకి బర్రోస్ నవలలన్నింటినీ తీసుకువచ్చాను: నేకెడ్ లంచ్, నోవా ఎక్స్‌ప్రెస్. పేలిన టికెట్ మరియు మిగిలినవి. అతనికి చదవడానికి మాత్రమే సమయం ఉంది నోవా ఎక్స్‌ప్రెస్. బరోస్ తన వంతుగా రెండు బౌవీ పాటలు, 'ఫైవ్ ఇయర్స్' మరియు 'స్టార్ మ్యాన్' మాత్రమే విన్నారు, అయినప్పటికీ అతను బౌవీ యొక్క అన్ని సాహిత్యాలను చదివాడు. అయినప్పటికీ ఒకరినొకరు కలుసుకునేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు. బౌవీ ఇల్లు సైన్స్-ఫిక్షన్ మోడ్‌లో అలంకరించబడింది: సాల్వడార్ డాలీ మరియు నార్మన్ రాక్‌వెల్ మధ్య మధ్యలో పడిపోయిన ఒక కళాకారుడి యొక్క ఒక భారీ పెయింటింగ్, ప్లాస్టిక్ సోఫాపై వేలాడదీయబడింది. బర్రోస్ యొక్క వినయపూర్వకమైన రెండు-గదుల పిక్కడిల్లీ ఫ్లాట్‌కి చాలా భిన్నమైనది, బ్రయాన్ జిసిన్ ఫోటోలతో అలంకరించబడింది - అటువంటి విజయవంతమైన రచయిత కోసం నిరాడంబరమైన క్వార్టర్స్, మిగతా వాటి కంటే పారిస్‌లోని బీట్ హోటల్ లాంటిది. వెంటనే బౌవీ మూడు-టోన్ NASA జోధ్‌పూర్‌లను ధరించి ప్రవేశించాడు. అతను పెయింటింగ్ మరియు దాని అధివాస్తవిక లక్షణాల యొక్క వివరణాత్మక వర్ణనలోకి ప్రవేశించాడు. బురఫ్స్ నవ్వాడు మరియు ఇంటర్వ్యూ/సంభాషణ ప్రారంభమైంది. మేము ముగ్గురం గదిలో రెండు గంటలపాటు కూర్చుని, మాట్లాడుకుంటూ, భోజనం చేస్తున్నాము: ఒక జమైకన్ ఫిష్ డిష్, బౌవీ పరివారంలోని ఒక జమైకన్ తయారు చేసాము, రొయ్యలతో నింపిన అవకాడోలు మరియు బ్యూజోలాయిస్ నోయువేతో, ఇద్దరు ఇంటర్స్టెల్లార్ బోవీట్‌లు వడ్డించాము. ఇద్దరి మధ్య వెంటనే ఇష్టం, గౌరవం ఏర్పడ్డాయి. నిజానికి, కొన్ని రోజుల సంభాషణ తర్వాత బౌవీ బురఫ్స్‌ను సహాయం కోసం అడిగాడు: ఒక ఉత్పత్తి పనిమనిషి బౌవీ యొక్క పాత మైమ్ టీచర్ లిండ్సే కెంప్ చేత ప్రదర్శించబడింది, నాటక రచయిత జీన్ జెనెట్ యొక్క లండన్ ప్రచురణకర్త లండన్‌లో మూసివేయబడ్డారు. బౌవీ ఈ విషయాన్ని వ్యక్తిగతంగా జెనెట్ దృష్టికి తీసుకురావాలనుకున్నాడు. బరోస్ ఉత్పత్తి గురించి బౌవీ యొక్క వివరణతో ఆకట్టుకున్నాడు మరియు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. కొన్ని వారాల తర్వాత, బౌవీ బురఫ్స్ నుండి లీడ్‌లను అనుసరించి జెనెట్‌ను వెతుకుతూ పారిస్‌కు వెళ్లాడు. ఎవరికీ తెలుసు? బహుశా ఒక సహకారం ప్రారంభమైంది; బహుశా, బౌవీ చెప్పినట్లుగా, వారు డెబ్బైల రోజర్స్ మరియు హామర్‌స్టెయిన్ కావచ్చు. బర్రోస్: మీ డిజైన్లన్నీ మీరే చేస్తారా? బౌవీ: అవును, నేనే పూర్తి నియంత్రణ తీసుకోవాలి. నేను ఎవరినీ ఏమీ చేయనివ్వలేను, ఎందుకంటే నేను నా కోసం మంచి పనులు చేయగలనని కనుగొన్నాను. నేను ప్రయత్నిస్తున్నానని ఇతర వ్యక్తులు భావించే దానితో ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. ప్రజలు నా గురించి రాసే విషయాలను చదవడం నాకు ఇష్టం ఉండదు. పిల్లలు నా గురించి ఏమి చెప్పాలో నేను చదవాలనుకుంటున్నాను, ఎందుకంటే అలా చేయడం వారి వృత్తి కాదు. డెబ్బైల స్ఫూర్తి ఏమిటో చూడటానికి ప్రజలు నా వైపు చూస్తారు, వారిలో కనీసం 50% మంది చేస్తారు. నాకు అర్థం కాని విమర్శకులు. వారు చాలా మేధావిగా ఉంటారు. వారు వీధి చర్చలో బాగా ప్రావీణ్యం కలిగి లేరు; అది చెప్పడానికి వారికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి డిక్షనరీలలో చేయవలసి ఉంటుంది మరియు వారు చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. నేను మధ్యతరగతి పాఠశాలలో చదివాను, కానీ నా నేపథ్యం వర్కింగ్ క్లాస్. నేను రెండు ప్రపంచాలలో ఉత్తమమైన వాటిని పొందాను, నేను రెండు తరగతులను చూశాను, కాబట్టి ప్రజలు ఎలా జీవిస్తారు మరియు ఎందుకు చేస్తారు అనే దాని గురించి నాకు చాలా సరసమైన ఆలోచన ఉంది. నేను దానిని బాగా చెప్పలేను, కానీ దాని గురించి నాకు ఒక భావన ఉంది. కానీ ఉన్నత తరగతి కాదు. నేను రాణిని కలవాలనుకుంటున్నాను మరియు అప్పుడు నాకు తెలుస్తుంది. ప్రజలు మీ గురించి చిత్రించిన చిత్రాన్ని మీరు ఎలా తీస్తారు? బర్రోస్: వారు మిమ్మల్ని వర్గీకరించడానికి ప్రయత్నిస్తారు. వారు మీ చిత్రాన్ని చూడాలనుకుంటున్నారు మరియు వారు మీ చిత్రాన్ని చూడకపోతే వారు చాలా కలత చెందుతారు. అది జరిగేలా చేయడానికి మీరు ఎంత దగ్గరగా రాగలరో చూడటం అనేది అన్ని కళల వస్తువు. మనిషికి నిజంగా ఏమి కావాలి అని వారు అనుకుంటున్నారు, అతను నమ్మని మిషన్‌లో విస్కీ పూజారి? ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే కళాకారులు ఈ గ్రహాన్ని స్వాధీనం చేసుకోవాలి ఎందుకంటే వారు మాత్రమే ఏదైనా జరగగలరు. ఈ ఫకింగ్ వార్తాపత్రిక రాజకీయ నాయకులను మన నుండి స్వాధీనం చేసుకోవడానికి మనం ఎందుకు అనుమతించాలి? బౌవీ: నేను నా మనసు చాలా మార్చుకుంటున్నాను. నేను సాధారణంగా చెప్పేదానితో ఏకీభవించను. నేను భయంకరమైన అబద్ధాలకోరుని. బర్రోస్: నేను కూడా. బౌవీ: నేను నా మనసు మార్చుకున్నానా లేదా నేను చాలా అబద్ధాలు చెబుతున్నానో నాకు ఖచ్చితంగా తెలియదు. ఇది రెండింటి మధ్య ఎక్కడో ఉంది. నేను ఖచ్చితంగా అబద్ధం చెప్పను, నేను ఎప్పటికప్పుడు నా మనసు మార్చుకుంటాను. ప్రజలు ఎప్పుడూ నేను చెప్పిన విషయాలను నాపైకి విసురుతున్నారు మరియు నేను ఏమీ అర్థం చేసుకోలేదని చెబుతాను. మీరు మీ జీవితాంతం ఒక పాయింట్‌పై స్థిరంగా నిలబడలేరు. బర్రోస్: రాజకీయ నాయకులు మాత్రమే వారు ఏమనుకుంటున్నారో అది పెడతారు మరియు అంతే. హిట్లర్ లాంటి వ్యక్తిని తీసుకోండి, అతను తన మనసు మార్చుకోలేదు. బౌవీ: నోవా ఎక్స్‌ప్రెస్ నిజంగా నాకు గుర్తు చేసింది జిగ్గీ స్టార్‌డస్ట్, నేను థియేట్రికల్ ప్రదర్శనలో ఉంచబోతున్నాను. ఇందులో నలభై సన్నివేశాలు ఉన్నాయి మరియు పాత్రలు మరియు నటీనటులు సన్నివేశాలను నేర్చుకుని, మేము అందరం ప్రదర్శన జరిగిన మధ్యాహ్నం వాటిని టోపీలో చుట్టి, సన్నివేశాలు బయటకు వచ్చినప్పుడు ప్రదర్శించినట్లయితే బాగుంటుంది. నేను మీ నుండి ఇవన్నీ పొందాను, బిల్… కాబట్టి ఇది ప్రతి రాత్రి మారుతుంది. బర్రోస్: ఇది చాలా మంచి ఆలోచన, విభిన్న క్రమంలో దృశ్య కట్-అప్. బౌవీ: నేను చాలా త్వరగా విసుగు చెందుతాను మరియు అది కొంత కొత్త శక్తిని ఇస్తుంది. నేను ఒక రకమైన పాత పాఠశాలను, ఒక కళాకారుడు తన పనిని చేసినప్పుడు అది అతనిది కాదు అని ఆలోచిస్తున్నాను… ప్రజలు దాని నుండి ఏమి చేస్తారో నేను చూస్తున్నాను. అందుకే టీవీ ప్రొడక్షన్ జిగ్గీ వారు అనుకున్నదానిపై ప్రజల అంచనాలను అధిగమించవలసి ఉంటుంది జిగ్గీ ఉంది. బర్రోస్: మీరు ఈ జిగ్గీ స్టార్‌డస్ట్ చిత్రాన్ని వివరించగలరా? ఐదేళ్లలో ప్రపంచం వినాశనానికి ముందంజలో ఉండటంతో దీనికి సంబంధం ఉందని నేను చూస్తున్నాను. బౌవీ: భూమి అంతం కావడానికి ఇంకా ఐదేళ్ల సమయం ఉంది. సహజ వనరుల కొరత వల్ల ప్రపంచం అంతం అవుతుందని ప్రకటించారు. [ఆల్బమ్ మూడు సంవత్సరాల క్రితం విడుదలైంది.] జిగ్గీ పిల్లలందరికీ వారు కోరుకున్న వాటిని యాక్సెస్ చేసే స్థితిలో ఉన్నారు. వృద్ధులు వాస్తవికతతో సంబంధాన్ని కోల్పోయారు మరియు పిల్లలు ఏదైనా దోచుకోవడానికి వారి స్వంతంగా మిగిలిపోతారు. జిగ్గీ రాక్ & రోల్ బ్యాండ్‌లో ఉన్నారు మరియు పిల్లలు ఇకపై రాక్ & రోల్ కోరుకోరు. దీన్ని ప్లే చేయడానికి కరెంటు లేదు. జిగ్గీ సలహాదారు అతనికి వార్తలను సేకరించి పాడమని చెప్పాడు, ఎందుకంటే వార్తలు లేవు. కాబట్టి జిగ్గీ ఇలా చేస్తాడు మరియు భయంకరమైన వార్తలు ఉన్నాయి. 'ఆల్ ది యంగ్ డ్యూడ్స్' ఈ వార్త గురించి ఒక పాట. ప్రజలు అనుకున్నట్లు ఇది యువతకు శ్లోకం కాదు. ఇది పూర్తిగా వ్యతిరేకం. బర్రోస్: ఈ జిగ్గీ ఆలోచన మరియు ఈ ఐదు సంవత్సరాల ఆలోచన ఎక్కడ నుండి వచ్చింది? వాస్తవానికి, సహజ వనరుల అలసట ప్రపంచ ముగింపును అభివృద్ధి చేయదు. ఇది నాగరికత పతనానికి దారి తీస్తుంది. మరియు ఇది జనాభాను మూడు వంతుల వరకు తగ్గిస్తుంది. బౌవీ: సరిగ్గా. ఇది జిగ్గీకి ప్రపంచం అంతం కాదు. అనంతాలు వచ్చినప్పుడు ముగింపు వస్తుంది. అవి నిజంగా బ్లాక్ హోల్, కానీ నేను వారిని వ్యక్తులను చేసాను ఎందుకంటే బ్లాక్ హోల్‌ను వేదికపై వివరించడం చాలా కష్టం. బర్రోస్: అవును, వేదికపై బ్లాక్ హోల్ నమ్మశక్యం కాని ఖర్చు అవుతుంది. మరియు ఇది ఒక నిరంతర ప్రదర్శనగా ఉంటుంది, ముందుగా షాఫ్టెస్‌బరీ అవెన్యూని తినడం. బౌవీ: జిగ్గీకి ఒక స్టార్‌మ్యాన్ రాకడని రాయమని అనంతులు కలలో సలహా ఇస్తారు, కాబట్టి అతను 'స్టార్‌మాన్' అని వ్రాస్తాడు, ఇది ప్రజలు విన్న మొదటి ఆశ వార్త. కాబట్టి వారు వెంటనే దానిలో బంధిస్తారు. అతను మాట్లాడుతున్న స్టార్‌మెన్‌లను అనంతులు అని పిలుస్తారు మరియు వారు బ్లాక్ హోల్ జంపర్లు. జిగ్గీ భూమిని రక్షించడానికి దిగి వస్తున్న ఈ అద్భుతమైన అంతరిక్ష మనిషి గురించి మాట్లాడుతున్నారు. వారు ఎక్కడో గ్రీన్‌విచ్ విలేజ్‌కి చేరుకుంటారు. వారికి ప్రపంచంలో శ్రద్ధ లేదు మరియు మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. వారు బ్లాక్ హోల్ జంపింగ్ ద్వారా మన విశ్వంలోకి పొరపాట్లు చేయడం జరిగింది. వారి జీవితమంతా విశ్వం నుండి విశ్వానికి ప్రయాణిస్తుంది. స్టేజ్ షోలో, వారిలో ఒకరు బ్రాండోను పోలి ఉంటారు, మరొకరు నల్లజాతి న్యూయార్కర్. నా దగ్గర క్వీనీ ది ఇన్ఫినిట్ ఫాక్స్ అని కూడా ఒకటి ఉంది. ఇప్పుడు జిగ్గీ వీటన్నింటిని స్వయంగా విశ్వసించడం ప్రారంభించాడు మరియు తనను తాను భవిష్యత్ స్టార్‌మ్యాన్ యొక్క ప్రవక్తగా భావిస్తాడు. అతను తనను తాను నమ్మశక్యం కాని ఆధ్యాత్మిక ఎత్తులకు తీసుకువెళతాడు మరియు అతని శిష్యులచే సజీవంగా ఉంచబడ్డాడు. అనంతాలు వచ్చినప్పుడు, వారు తమను తాము నిజం చేసుకోవడానికి జిగ్గీని తీసుకుంటారు ఎందుకంటే వాటి అసలు స్థితిలో అవి పదార్థానికి వ్యతిరేకమైనవి మరియు మన ప్రపంచంపై ఉండవు. మరియు వారు 'రాక్ అండ్ రోల్ సూసైడ్' పాట సమయంలో వేదికపై అతనిని ముక్కలు చేశారు. జిగ్గీ వేదికపై మరణించిన వెంటనే అనంతులు అతని మూలకాలను తీసుకొని తమను తాము కనిపించేలా చేస్తారు. ఇది నేటి సైన్స్-ఫిక్షన్ ఫాంటసీ మరియు ఇది నేను చదివినప్పుడు అక్షరాలా నా తల పేల్చింది నోవా ఎక్స్‌ప్రెస్, ఇది 1961లో వ్రాయబడింది. బహుశా మనం డెబ్బైల రోజర్స్ మరియు హామర్‌స్టెయిన్ కావచ్చు, బిల్! బర్రోస్: అవును, నేను నమ్మగలను. సమాంతరాలు ఖచ్చితంగా ఉన్నాయి మరియు ఇది బాగుంది. బౌవీ: స్టేజ్ షో యొక్క మొత్తం ఇమేజ్ నా దగ్గర ఉండాలి. ఇది నాతో పూర్తిగా ఉండాలి. నేను పాటలు రాయడం కంటెంట్ కాదు, దాన్ని త్రీడీగా మార్చాలనుకుంటున్నాను. పాటల రచన ఒక కళగా ఇప్పుడు కాస్త ప్రాచీనమైనది. కేవలం పాట రాస్తే సరిపోదు. బర్రోస్: ఇది మొత్తం పనితీరు. ఇది ఎవరో పియానో ​​వద్ద కూర్చుని పావు వాయిస్తున్నట్లు కాదు. బౌవీ: ఒక పాట వ్యక్తిత్వాన్ని, ఆకృతిని, శరీరాన్ని పొంది, వారి స్వంత పరికరాల కోసం దానిని ఉపయోగించే మేరకు ప్రజలను ప్రభావితం చేయాలి. ఇది కేవలం పాటగా కాకుండా, జీవన విధానంగా వారిని ప్రభావితం చేయాలి. రాక్ స్టార్స్ అన్ని రకాల తత్వాలను, శైలులను, చరిత్రలను, రచనలను సమీకరించారు మరియు వారు దాని నుండి సేకరించిన వాటిని విసిరివేస్తారు. బర్రోస్: ఉనికి నుండి ఇతరులను విస్మరించడం నుండి విప్లవం వస్తుంది. బౌవీ: నిజంగా. ఇప్పుడు మనం గతంలో కంటే వేగంగా ఒక స్థాయిలో జరిగేలా చేసే వ్యక్తులు ఉన్నారు. ఆలిస్ కూపర్, న్యూయార్క్ డాల్స్ మరియు ఇగ్గీ పాప్ వంటి సమూహాలలో ఉన్న వ్యక్తులు, స్టోన్స్ మరియు బీటిల్స్‌లో ఉన్న వ్యక్తుల ఉనికిని పూర్తిగా మరియు తిరిగి పొందలేని విధంగా తిరస్కరిస్తున్నారు. గ్యాప్ 20 ఏళ్ల నుంచి పదేళ్లకు తగ్గింది. బర్రోస్: మార్పు యొక్క పెరుగుదల రేటు. చాలా వరకు మీడియాదే బాధ్యత. ఇది లెక్కించలేని ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుంది. బౌవీ: ఒకప్పుడు, నేను 13 లేదా 14 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు కూడా, నాకు 14 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండేది. ప్రాథమికంగా. కానీ ఇప్పుడు అది 18 ఏళ్లు మరియు 26 ఏళ్ల వయస్సులో ఉంది - నమ్మశక్యం కాని వ్యత్యాసాలు ఉండవచ్చు, ఇది నిజంగా చాలా భయంకరమైనది. మేము ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నించడం లేదు, కానీ మనం ఇంకా ఎంత సమయం తీసుకున్నామో అని ఆలోచించడం. మనసులు ట్యూన్‌లో ఉంటే పాజిటివ్‌గా బోరింగ్‌గా ఉంటుంది. గ్రహం మనుగడ సాగిస్తుందా అనే దానిపై నాకు ఎక్కువ ఆసక్తి ఉంది. బర్రోస్: వాస్తవానికి, విరుద్ధంగా జరుగుతోంది; ప్రజలు మరింత దూరం అవుతున్నారు. బౌవీ: మనసులను కలిపే ఆలోచన నాకు ఫ్లవర్ పవర్ పీరియడ్‌ని స్మాక్స్ చేసింది. వ్యక్తుల కలయిక నాకు ఒక సూత్రంగా అశ్లీలంగా అనిపిస్తుంది. ఇది మానవుడు కాదు. కొంతమంది మనల్ని నమ్మినట్లు ఇది సహజమైన విషయం కాదు. కోపెటాస్: ప్రేమ గురించి ఏమిటి? బర్రోస్: అయ్యో. బౌవీ: 'ప్రేమ' అనే పదంతో నేను తేలికగా లేను. బర్రోస్: నేను కూడా కాదు. బౌవీ: ప్రేమలో పడడం కూల్‌గా ఉందని, ఆ కాలం నాకు అలాంటిదేమీ కాదని చెప్పుకొచ్చారు. నేను మరొక వ్యక్తికి నా సమయాన్ని మరియు శక్తిని చాలా ఎక్కువ ఇచ్చాను మరియు వారు నాకు అదే చేసారు మరియు మేము ఒకరిపై ఒకరు మండిపడటం ప్రారంభించాము. మరియు దానిని ప్రేమ అని పిలుస్తారు… మన విలువలన్నింటినీ మరొక వ్యక్తిపై ఉంచాలని మేము నిర్ణయించుకుంటాము. ఇది రెండు పీఠాల వంటిది, ప్రతి ఒక్కటి మరొక పీఠంగా ఉండాలని కోరుకుంటుంది. బర్రోస్: 'ప్రేమ' అనేది ఉపయోగకరమైన పదం అని నేను అనుకోను. ఇది సెక్స్ అనే విషయం మరియు ప్రేమ అనే విషయం యొక్క విభజన మరియు అవి వేరుగా ఉన్నాయని అంచనా వేయబడింది. స్త్రీ పీఠంపై ఉన్నప్పుడు పాత దక్షిణాదిలోని ఆదిమ వ్యక్తీకరణల వలె, మరియు వ్యక్తి తన భార్యను పూజించి, ఆపై బయటకు వెళ్లి వేశ్యను ఇబ్బంది పెట్టాడు. ఇది ప్రధానంగా పాశ్చాత్య భావన మరియు అది ప్రతి ఒక్కరినీ ప్రేమించే మొత్తం ఫ్లవర్ పవర్ విషయానికి విస్తరించింది. సరే, ఆసక్తులు ఒకేలా లేనందున మీరు అలా చేయలేరు. బౌవీ: పదం తప్పు, నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీరు ప్రేమను అర్థం చేసుకునే విధానం ఇది. 'మేము ప్రేమలో ఉన్నాము' అని చెప్పుకునే వ్యక్తుల మధ్య మీరు చూసే ప్రేమ, చూడటానికి చాలా బాగుంది… కానీ ఒంటరిగా ఉండకూడదనుకోవడం, కొన్ని సంవత్సరాలుగా సంబంధం ఉన్న వ్యక్తిని అక్కడ ఉండాలని కోరుకోవడం తరచుగా జరగదు ప్రేమ ఆ వ్యక్తుల జీవితమంతా కొనసాగుతుంది. ఇంకో మాట కూడా ఉంది. ఇది పదమా కాదా అనేది నాకు ఖచ్చితంగా తెలియదు. ప్రేమ అనేది మీరు భావించే ప్రతి రకమైన సంబంధం... నేను ఖచ్చితంగా దాని అర్థం సంబంధం, మీరు ఆలోచించగలిగే ప్రతి రకమైన సంబంధం. కోపెటాస్: లైంగికత గురించి ఏమిటి, అది ఎక్కడికి వెళుతోంది? బౌవీ: లైంగికత మరియు అది ఎక్కడికి వెళుతోంది అనేది ఒక అసాధారణమైన ప్రశ్న, ఎందుకంటే అది ఎక్కడికీ వెళ్లడం నాకు కనిపించడం లేదు. ఇది నాతో ఉంది, అంతే. ఇది వచ్చే ఏడాది కొత్త ప్రకటనల ప్రచారంగా రావడం లేదు. అది అక్కడే ఉంది. లైంగికత గురించి మీరు ఆలోచించగల ప్రతిదీ ఉంది. బహుశా వివిధ రకాల లైంగికత ఉండవచ్చు, బహుశా అవి మరింతగా అమలులోకి వస్తాయి. ఒకప్పుడు ప్రజలకు సంబంధించినంతవరకు స్వలింగసంపర్కం చేయడం అసాధ్యం. ఇప్పుడు అది అంగీకరించబడింది. లైంగికత ఎప్పటికీ మారదు, ఎందుకంటే ప్రజలు సమయం ప్రారంభమైనప్పటి నుండి వారి స్వంత ప్రత్యేక మార్గాలను ఉపయోగిస్తున్నారు మరియు దానిని కొనసాగిస్తారు. ఆ మార్గాలు మరిన్ని వెలుగులోకి రానున్నాయి. ఇది ప్యూరిటన్ స్థితికి కూడా చేరుకోవచ్చు. బర్రోస్: ఇది భవిష్యత్తులో ఆ విధంగా ఉండవచ్చని కొన్ని సూచనలు ఉన్నాయి, నిజమైన ఎదురుదెబ్బ. బౌవీ: అవును, రాక్ వ్యాపారం చూడండి. పేద పాత క్లైవ్ డేవిస్. డబ్బుతో పరారీలో ఉన్నాడని, దానితో మత్తుపదార్థాలు కూడా ముడిపడి ఉన్నట్లు గుర్తించారు. మరియు అది రికార్డ్ కంపెనీల మధ్య మొత్తం శుభ్రపరిచే ప్రచారాన్ని ప్రారంభించింది; వారు తమ కళాకారులలో కొంతమందిని తొలగించడం ప్రారంభించారు. నన్ను చాలా మంది అలైంగికంగా పరిగణిస్తారు. మరియు నన్ను బాగా అర్థం చేసుకున్న వ్యక్తులు నా గురించి నేను అర్థం చేసుకున్న దానికి దగ్గరగా ఉంటారు. ఇది చాలా ఎక్కువ కాదు, నేను ఇంకా వెతుకుతున్నాను. నాకు తెలియదు, నేను ఎక్కడ ఉన్నాను అని నేను అనుకునే ప్రదేశానికి దగ్గరగా ఎక్కడికైనా వచ్చే వ్యక్తులు నన్ను ఎరోజెనస్ రకంగా ఎక్కువగా పరిగణిస్తారు. కానీ నా గురించి అంతగా తెలియని వ్యక్తులు నన్ను లైంగికంగా ఎక్కువగా చూస్తారు. కానీ అక్కడ మళ్ళీ, ఇది ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత సెక్స్ పట్ల ఆసక్తి లేనిది కావచ్చు, ఎందుకంటే నాకు దగ్గరగా ఉండే వ్యక్తులు సాధారణంగా పెద్దవారు. మరియు నన్ను లైంగికంగా ఎక్కువగా భావించే వారు సాధారణంగా చిన్నవారు. యువకులు వేరే విధంగా సాహిత్యంలోకి ప్రవేశిస్తారు; స్పర్శ అవగాహన చాలా ఎక్కువ ఉంది, ఇది నేను ఇష్టపడే మార్గం. 'ఎందుకంటే నేను రాయడం ప్రారంభించే మార్గం, ముఖ్యంగా విలియం. నేను వాటన్నింటినీ విశ్లేషిస్తున్నానని చెప్పలేను మరియు మీరు చెప్పేది సరిగ్గా అదే, కానీ ఒక అనుభూతి నుండి మీరు అర్థం చేసుకున్నది నాకు అర్థమైంది. ఇది అక్కడ ఉంది, వింత ఆకారాలు మరియు రంగులు, అభిరుచులు, భావాలతో కూడిన మొత్తం వండర్‌హౌస్. ఇప్పటి వరకు నేను విలియం రచనలను ఆసక్తిగా చదివేవాడిని కాదని నేను ఒప్పుకోవాలి. నిజాయితీగా ఉండటానికి నేను నిజంగా కెరోవాక్‌ను దాటలేదు. కానీ నేను మీ పనిని చూడటం ప్రారంభించినప్పుడు నేను నిజంగా నమ్మలేకపోయాను. ముఖ్యంగా చదివిన తర్వాత నోవా ఎక్స్‌ప్రెస్. నేను నిజంగా దానితో సంబంధం కలిగి ఉన్నాను. నా అహం స్పష్టంగా నన్ను “పే కలర్” అధ్యాయానికి చేర్చింది, ఆపై నేను మిగిలిన పుస్తకం నుండి పంక్తులను లాగడం ప్రారంభించాను. బర్రోస్: మీ సాహిత్యం చాలా గ్రహణశీలంగా ఉంది. బౌవీ: వారు కొంచెం మధ్యతరగతి, కానీ అది సరే, ఎందుకంటే నేను మధ్యతరగతివాడిని. బర్రోస్: మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా సంక్లిష్టమైన సాహిత్యం ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. 'పవర్ టు ది పీపుల్' వంటి చాలా పాప్ సాహిత్యం యొక్క కంటెంట్ ఆచరణాత్మకంగా సున్నా. బౌవీ: నా విషయాల కోసం నేను పొందిన ప్రేక్షకులు సాహిత్యాన్ని వినరని నాకు ఖచ్చితంగా తెలుసు. బర్రోస్: నేను దాని గురించి వినడానికి ఆసక్తిగా ఉన్నాను… వారు వాటిని అర్థం చేసుకుంటారా? బౌవీ: సరే, ఇది మీడియా విషయంగా ఎక్కువ వస్తుంది మరియు వారు కూర్చుని ఇబ్బంది పడిన తర్వాత మాత్రమే. వారు వాటిని ఏ స్థాయిలో చదువుతున్నారు, వారు వాటిని అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వారు నేను మాట్లాడుతున్న దాని గురించి వారి స్వంత రకమైన వ్రాత-అప్‌లను నాకు తిరిగి పంపుతారు, ఇది నాకు చాలా బాగుంది ఎందుకంటే కొన్నిసార్లు నాకు తెలియదు. నేను ఏదైనా వ్రాసిన సందర్భాలు ఉన్నాయి మరియు అది బయటకు వెళ్లిపోతుంది మరియు దాని గురించి వారు ఏమనుకుంటున్నారో అని కొంతమంది పిల్లవాడి నుండి ఒక లేఖలో తిరిగి వచ్చింది మరియు నేను వారి విశ్లేషణను చాలా హృదయపూర్వకంగా తీసుకున్నాను మరియు నేను అతని విషయాన్ని తీసుకున్నాను. నా ప్రేక్షకులు నాకు ఏమి చెప్పాలో అది రాయడం. ఆధునిక రాక్‌లో లౌ రీడ్ అత్యంత ముఖ్యమైన ఖచ్చితమైన రచయిత. అతను చేసే పనుల వల్ల కాదు, అతను దానిని తీసుకునే దిశలో. లౌ లేకపోతే సగం కొత్త బ్యాండ్‌లు చుట్టుముట్టవు. లౌ యొక్క అంశాలు సృష్టించిన ఉద్యమం అద్భుతమైనది. న్యూయార్క్ నగరం లౌ రీడ్. లౌ స్ట్రీట్-గట్ లెవెల్‌లో వ్రాస్తాడు మరియు ఆంగ్లేయులు మరింత మేధోసంపత్తిని కలిగి ఉంటారు. బర్రోస్: మీ రచనకు ప్రేరణ ఏమిటి, ఇది సాహిత్యమా? బౌవీ: నేను అలా అనుకోను. బర్రోస్: సరే, ఈ ఎనిమిది లైన్ల మీ కవిత చదివిన టి.ఎస్. ఎలియట్. బౌవీ: అతన్ని ఎప్పుడూ చదవలేదు. బర్రోస్: [నవ్వుతూ] ఇది 'వేస్ట్ ల్యాండ్'ని చాలా గుర్తు చేస్తుంది. మీరు కలల నుండి మీ ఆలోచనలలో దేనినైనా పొందుతున్నారా? బౌవీ: తరచుగా. బర్రోస్: నాలో 70% కలల నుండి పొందుతాను. బౌవీ: మీరు నిద్రకు ఉపక్రమించినట్లే, మీరు మీ మోచేతులను ఎత్తుగా ఉంచినట్లయితే, మీరు కలల దశకు దిగువకు వెళ్లలేరు. మరియు నేను దానిని చాలా ఎక్కువగా ఉపయోగించాను మరియు నేను రిలాక్స్‌గా ఉన్నదాని కంటే ఎక్కువ కాలం కలలు కనేలా చేస్తుంది. బర్రోస్: నేను చాలా కలలు కంటున్నాను, ఆపై నేను తేలికగా నిద్రపోతున్నాను కాబట్టి, నేను మేల్కొని కొన్ని పదాలను వ్రాస్తాను మరియు వారు ఎల్లప్పుడూ మొత్తం ఆలోచనను నాకు తిరిగి తెస్తారు. బౌవీ: నేను మంచం దగ్గర టేప్ రికార్డర్ ఉంచుతాను మరియు ఏదైనా వస్తే టేప్ రికార్డర్‌లో చెప్పాను. నా ప్రేరణ విషయానికొస్తే, నేను 12 సంవత్సరాల వయస్సు నుండి నా అభిప్రాయాలను పెద్దగా మార్చుకోలేదు, నిజంగా, నేను 12 ఏళ్ల మనస్తత్వాన్ని పొందాను. నేను పాఠశాలలో ఉన్నప్పుడు నాకు కెరోవాక్‌లో ఉన్న ఒక సోదరుడు ఉన్నాడు మరియు అతను నాకు ఇచ్చాడు రోడ్డు మీద నేను 12 సంవత్సరాల వయస్సులో చదివాను. అది ఇప్పటికీ పెద్ద ప్రభావాన్ని చూపింది. కోపెటాస్: మీరిద్దరూ చేసే చిత్రాలు చాలా గ్రాఫిక్‌గా ఉంటాయి, దాదాపు కామిక్-బుకీగా ఉంటాయి. బౌవీ: బాగా, అవును, నేను ఈ చిన్న విగ్నేట్‌లలో వ్రాయడం సులభం అని భావిస్తున్నాను; నేను మరింత భారంగా ఉండటానికి ప్రయత్నిస్తే, నేను నా లీగ్ నుండి తప్పుకుంటాను. నేను చెప్పేదానిలో నేను ఉండలేకపోయాను. మీరు నిజంగా బరువుగా ఉంటే, అంత ఎక్కువ చదవడానికి లేదా వినడానికి ఎక్కువ సమయం ఉండదు. బరువు పెరగడంలో పెద్దగా ప్రయోజనం లేదు… చదవడానికి మరియు చూడటానికి చాలా విషయాలు ఉన్నాయి. మీరు చేసిన పనిని వ్యక్తులు మూడు గంటలు చదివితే, వారు దానిని ఏడు గంటల పాటు విశ్లేషించి, ఏడు గంటల వారి స్వంత ఆలోచనతో బయటకు వస్తారు... అక్కడ మీరు వారికి 30 సెకన్లు మీ స్వంత అంశాలను ఇస్తే, వారు సాధారణంగా ఏడుతో బయటకు వస్తారు. వారి స్వంత ఆలోచన యొక్క గంటలు. వారు మీరు చేసే పనులకు సంబంధించిన చిత్రాలను తీస్తారు. మరియు వారు hooks న pontificate. చిత్రం యొక్క తక్షణ భావన. ప్రస్తుతానికి పనులు కొట్టేయాలి. నేను వీడియోలోకి రావడానికి ఇది ఒక కారణం; చిత్రం వెంటనే హిట్ కావాలి. నేను వీడియోను మరియు దాని మొత్తం కత్తిరించడాన్ని ఆరాధిస్తాను. ప్రస్తుతం మీ ప్రాజెక్ట్‌లు ఏమిటి? బర్రోస్: ప్రస్తుతానికి నేను స్కాట్లాండ్‌లో ఎక్కడో ఒక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సాంప్రదాయిక విభాగాలు ఆచరణీయమైన పరిష్కారాలను రూపొందించడంలో విఫలమైన సమయంలో ఎక్కువ పరిధి, వశ్యత మరియు ప్రభావం దిశలో అవగాహనను విస్తరించడం మరియు స్పృహను మార్చడం దీని లక్ష్యం. మీరు చూస్తారు, అంతరిక్ష యుగం యొక్క ఆగమనం మరియు గెలాక్సీలను అన్వేషించే అవకాశం మరియు గ్రహాంతర జీవులను సంప్రదించడం అనేది సమూలంగా కొత్త పరిష్కారాల కోసం తక్షణ అవసరం. మేము ఇప్పుడు తూర్పు మరియు పడమరలలో ఉపయోగిస్తున్న పద్ధతుల కలయిక, సంశ్లేషణ, పరస్పర చర్య మరియు భ్రమణం వంటి వాటికి ప్రాధాన్యతనిస్తూ రసాయనేతర పద్ధతులను మాత్రమే పరిశీలిస్తాము, అవగాహనను విస్తరించడానికి లేదా మానవ సామర్థ్యాలను పెంచడానికి ప్రస్తుతం ఉపయోగించని పద్ధతులతో పాటు. మేము ఏమి చేయాలనుకుంటున్నాము మరియు దానిని ఎలా కొనసాగించాలో మాకు ఖచ్చితంగా తెలుసు. నేను చెప్పినట్లుగా, ఎటువంటి ఔషధ ప్రయోగాలు ప్రణాళిక చేయబడవు మరియు మద్యపానం, పొగాకు మరియు ప్రిస్క్రిప్షన్పై పొందిన వ్యక్తిగత మందులు తప్ప మరే ఇతర మందులు కూడా కేంద్రంలో అనుమతించబడవు. ప్రాథమికంగా, మేము ప్రతిపాదిస్తున్న ప్రయోగాలు చవకైనవి మరియు నిర్వహించడం సులభం. యోగా-శైలి ధ్యానం మరియు వ్యాయామాలు, కమ్యూనికేషన్, సౌండ్, లైట్ మరియు ఫిల్మ్ ప్రయోగాలు, సెన్సరీ డిప్రివేషన్ ఛాంబర్‌లతో ప్రయోగాలు, పిరమిడ్‌లు, సైకోట్రానిక్ జనరేటర్లు మరియు రీచ్ యొక్క ఆర్గాన్ అక్యుమ్యులేటర్‌లు, ఇన్‌ఫ్రా-సౌండ్‌తో ప్రయోగాలు, కల మరియు నిద్రతో ప్రయోగాలు వంటివి. బౌవీ: అది మనోహరంగా ఉంది. మీరు ప్రాథమికంగా శక్తి శక్తులపై ఆసక్తి కలిగి ఉన్నారా? బర్రోస్: అవగాహన యొక్క విస్తరణ, చివరికి ఉత్పరివర్తనాలకు దారి తీస్తుంది. నువ్వు చదివావా శరీరం నుండి జర్నీ? ఆస్ట్రల్ ప్రొజెక్షన్‌పై సాధారణ పుస్తకం కాదు. ఈ అమెరికన్ వ్యాపారవేత్త శరీరం నుండి బయటికి రావడానికి ఈ అనుభవాలను కలిగి ఉన్నాడని కనుగొన్నాడు - ఏ హాలూసినోజెనిక్ ఔషధాలను ఎప్పుడూ ఉపయోగించలేదు. అతను ఇప్పుడు ఈ ఆస్ట్రల్ ఎయిర్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాడు. ఈ మానసిక సంబంధమైన విషయం ఇప్పుడు స్టేట్స్‌లో సంచలనం రేపుతోంది. మీరు అక్కడ ఉన్నప్పుడు చాలా అనుభవించారా? బౌవీ: లేదు, నేను నిజంగా దాని నుండి ఉద్దేశపూర్వకంగా దాచాను. నేను చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు టిబెటన్ బౌద్ధమతం చదువుతున్నాను, మళ్లీ కెరోవాక్ చేత ప్రభావితమయ్యాను. టిబెటన్ బుద్ధిస్ట్ ఇన్‌స్టిట్యూట్ అందుబాటులో ఉంది కాబట్టి నేను చూసేందుకు అక్కడికి వెళ్లాను. స్కాట్లాండ్‌లో శరణార్థుల కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాన వ్యక్తి నేలమాళిగలో ఒక వ్యక్తి ఉన్నాడు మరియు నేను పూర్తిగా సామాజిక స్థాయిలో పాల్గొన్నాను - ఎందుకంటే శరణార్థులను భారతదేశం నుండి బయటకు తీసుకురావడానికి నేను సహాయం చేయాలనుకున్నాను, ఎందుకంటే వారు హిమాలయాల నుండి వాతావరణం మారడం వల్ల ఈగలు లాగా పడిపోతున్నాయి. స్కాట్లాండ్ వాటిని ఉంచడానికి చాలా మంచి ప్రదేశం, ఆపై నేను వారి ఆలోచనా విధానం లేదా ఆలోచనా విధానానికి ఆకర్షితుడయ్యాను మరియు కొంతకాలం దానిలో చాలా ఎక్కువగా పాల్గొన్నాను. నేను అనుభవం లేని సన్యాసిని కావాలనుకునే స్థాయికి చేరుకున్నాను మరియు నేను నిజంగా ఆ చర్యలు తీసుకోవడానికి రెండు వారాల ముందు, నేను విడిపోయి వీధుల్లోకి వెళ్లి తాగి వెనుదిరిగి చూడలేదు. బర్రోస్: కేరోవాక్ లాగానే. బౌవీ: రాష్ట్రాలకు ఎక్కువగా వెళ్లాలా? బర్రోస్: '71 నుండి కాదు. బౌవీ: అప్పటి నుండి ఇది మారిపోయింది, నేను మీకు చెప్పగలను. బర్రోస్: మీరు చివరిగా ఎప్పుడు తిరిగి వచ్చారు? బౌవీ: ఒక సంవత్సరం క్రితం. బర్రోస్: మీరు న్యూయార్క్‌లో ఏవైనా పోర్న్ ఫిల్మ్‌లు చూశారా? బౌవీ: అవును, చాలా కొన్ని. బర్రోస్: నేను చివరిగా తిరిగి వచ్చినప్పుడు, నేను వాటిలో 30 గురించి చూశాను. ఎరోటిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నేను న్యాయనిర్ణేతగా ఉండబోతున్నాను. బౌవీ: అత్యుత్తమమైనవి జర్మన్లు; అవి నిజంగా అపురూపమైనవి. బర్రోస్: అమెరికా వాళ్ళే ఇంకా బెస్ట్ అని అనుకున్నాను. నాకు సినిమా అంటే చాలా ఇష్టం…. యొక్క ఫిల్మ్ వెర్షన్‌లో మీరు వాలెంటైన్ మైఖేల్ స్మిత్‌గా నటించవచ్చని నేను అర్థం చేసుకున్నాను ఒక వింత భూమిలో అపరిచితుడు. బౌవీ: లేదు, నాకు పుస్తకం అంతగా నచ్చదు. నిజానికి, ఇది భయంకరమైనదని నేను భావిస్తున్నాను. నేను దానిని సినిమాగా తీయమని నాకు సూచించబడింది, ఆపై నేను దానిని చదవడం ప్రారంభించాను. ఇది చాలా ఫ్లవర్-పవర్‌గా అనిపించింది మరియు అది నన్ను కొంచెం జాగ్రత్తగా చేసింది. బర్రోస్: నేను కూడా పుస్తకంతో సంతోషంగా లేను. మీకు తెలుసా, సైన్స్ ఫిక్షన్ పెద్దగా విజయవంతం కాలేదు. ఇది సరికొత్త ట్రెండ్‌ను ప్రారంభించాలని భావించబడింది మరియు ఏమీ జరగలేదు. కొన్ని సినిమాల్లోని స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం, ఇష్టం 2001 , అది గొప్పది. అయితే అంతా అక్కడితో ముగిసింది. బౌవీ: నాకూ అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆర్వెల్స్ చేస్తున్నాను 1984 దూరదర్శిని లో; అది రాజకీయ థీసిస్ మరియు మరొక దేశంలో మార్గం యొక్క ముద్ర. అలాంటి స్వభావం టెలివిజన్‌పై మరింత ప్రభావం చూపుతుంది. నాకు సరైన సినిమా మీద నమ్మకం లేదు; దానికి టెలివిజన్ బలం లేదు. ప్రజలు సినిమాకి వెళ్లడం నిజంగా పురాతనమైనది. నేను ఇంట్లో కూర్చోవడం చాలా ఇష్టం. బర్రోస్: మీ ఉద్దేశ్యం మొత్తం ప్రేక్షకుల భావనేనా? బౌవీ: అవును, ఇది పురాతనమైనది. తక్షణ భావం లేదు. బర్రోస్: సరిగ్గా, ఇవన్నీ ఇమేజ్‌కి మరియు దానిని ఉపయోగించే విధానానికి సంబంధించినవి. బౌవీ: కుడి. నేను టీవీ స్టేషన్‌ని ప్రారంభించాలనుకుంటున్నాను. బర్రోస్: ఇకపై ఏదైనా విలువైన ప్రోగ్రామ్‌లు లేవు. బ్రిటిష్ టీవీ అమెరికన్ కంటే కొంచెం మెరుగ్గా ఉంది. బ్రిటిష్ వారు చేసే గొప్పదనం సహజ చరిత్ర. నమ్మశక్యం కాని పెంగ్విన్‌లను తినే సముద్ర సింహాలతో గత వారం ఒకటి జరిగింది. మొండి కార్యక్రమాలకు కారణం లేదు, గృహ ప్రాజెక్టులు మరియు బొగ్గు సమ్మెలతో ప్రజలు చాలా విసుగు చెందుతారు. బౌవీ: వారందరికీ దాదాపు మూడు సెకన్ల ఆసక్తి స్థాయి ఉంటుంది. వ్యాఖ్యాత యొక్క తదుపరి వాక్యంలోకి ప్రవేశించడానికి తగినంత సమయం ఉంది. మరియు అది పని చేసే ఆవరణ. నేను స్టేట్స్ మరియు ఇంగ్లండ్‌లో చాలా విలువైనవిగా భావించే అన్ని బ్యాండ్‌లను ఒకచోట చేర్చి, వాటి గురించి గంటసేపు ప్రోగ్రామ్ చేస్తాను. బహుశా చాలా మంది ప్రజలు ఈ బ్యాండ్‌ల గురించి ఎప్పుడూ వినలేదు. ఇతర బ్యాండ్‌లు చేయని విధంగా వారు పనులు చేస్తున్నారు మరియు చెబుతున్నారు. న్యూయార్క్‌లోని చీతా క్లబ్‌లో ప్యూర్టో రికన్ సంగీతం వంటి విషయాలు. జో క్యూబా వంటి సంగీతకారులను ప్రజలు వినాలని నేను కోరుకుంటున్నాను. అతను ప్యూర్టో రికన్ ప్రజల మొత్తం ప్రజలకు పనులు చేశాడు. సంగీతం అద్భుతమైనది మరియు ముఖ్యమైనది. నేను కూడా టీవీలో ఆండీ వార్హోల్ చిత్రాలను పొందడం ప్రారంభించాలనుకుంటున్నాను. బర్రోస్: మీరు ఎప్పుడైనా వార్హోల్‌ని కలుసుకున్నారా? బౌవీ: అవును, సుమారు రెండు సంవత్సరాల క్రితం నేను ఫ్యాక్టరీకి ఆహ్వానించబడ్డాను. మేము లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాము మరియు అది తెరిచినప్పుడు మాకు ఎదురుగా ఒక ఇటుక గోడ ఉంది. మేము గోడపై ర్యాప్ చేసాము మరియు మేము ఎవరో వారు నమ్మలేదు. కాబట్టి మేము తిరిగి క్రిందికి మరియు తిరిగి పైకి వెళ్ళాము, చివరికి వారు గోడను తెరిచారు మరియు అందరూ ఒకరినొకరు చూస్తున్నారు. తుపాకీ ఘటన జరిగిన కొద్దిసేపటికే అది. సజీవంగా ఉన్న ఈ వ్యక్తిని నేను కలిశాను. పసుపు రంగు, దాని మీద విగ్ తప్పు రంగు, చిన్న గాజులు. నేను నా చేయి చాచాను మరియు ఆ వ్యక్తి పదవీ విరమణ చేసాను, కాబట్టి నేను అనుకున్నాను, 'ఆ వ్యక్తికి మాంసం ఇష్టం లేదు, స్పష్టంగా అతను సరీసృపాలు.' అతను కెమెరాను తయారు చేసి, నా చిత్రాన్ని తీశాడు. మరియు నేను అతనితో చిన్నగా మాట్లాడటానికి ప్రయత్నించాను మరియు అది ఎక్కడికీ రాలేదు. కానీ అతను నా బూట్లు చూశాడు. నేను ఒక జత బంగారు మరియు పసుపు బూట్లు ధరించాను, మరియు అతను ఇలా అన్నాడు, 'నేను ఆ బూట్లను ఆరాధిస్తాను, మీకు ఆ బూట్లు ఎక్కడ లభించాయో చెప్పు.' అతను షూ డిజైన్ గురించి మొత్తం ర్యాప్‌ను ప్రారంభించాడు మరియు అది మంచును బద్దలు కొట్టింది. నా పసుపు బూట్లు ఆండీ వార్హోల్‌తో మంచును బద్దలు కొట్టాయి. అతను ఏమి చేస్తున్నాడో నేను ఆరాధిస్తాను. అతని ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను, ఇప్పుడు అతన్ని ఇష్టపడటం పెద్ద విషయంగా మారింది. కానీ వార్హోల్ క్లిచ్‌గా ఉండాలని కోరుకున్నాడు, అతను వూల్‌వర్త్‌లో అందుబాటులో ఉండాలని మరియు ఆ గ్లిబ్ రకం పద్ధతిలో మాట్లాడాలని కోరుకున్నాడు. అతను ఇప్పుడు నిజమైన సినిమాలు తీయాలనుకుంటున్నాడని నేను విన్నాను, ఇది చాలా విచారంగా ఉంది ఎందుకంటే అతను చేస్తున్న సినిమాలు జరగాల్సినవి. నేను లోపలికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిగా అతని గురించి కొంచెం తెలుసుకుని వెళ్లిపోయాను. బర్రోస్: అక్కడ ఎవరైనా ఉన్నారని నేను అనుకోను. ఇది చాలా పరాయి విషయం, పూర్తిగా మరియు పూర్తిగా భావోద్వేగం లేనిది. అతను నిజంగా సైన్స్ ఫిక్షన్ పాత్ర. అతనికి వింత ఆకుపచ్చ రంగు వచ్చింది. బౌవీ: అదే నాకు తట్టింది. అతనిది తప్పు రంగు, ఈ మనిషి మనిషిగా ఉండటానికి తప్పు రంగు. ముఖ్యంగా ఫ్యాక్టరీలో ఉన్న నియాన్ లైటింగ్ కింద. పగటిపూట అతన్ని చూడటం నిజమైన అనుభవం. బర్రోస్: నేను అతనిని అన్ని వెలుగులో చూశాను మరియు ఏమి జరుగుతుందో ఇప్పటికీ తెలియదు, అది చాలా ఉద్దేశపూర్వకమైనది తప్ప. ఇది శక్తివంతమైనది కాదు, కానీ చాలా కృత్రిమమైనది, పూర్తిగా అలైంగికమైనది. ఆయన సినిమాలు భవిష్యత్తులో అర్థరాత్రి సినిమాలుగా నిలుస్తాయి. బౌవీ: సరిగ్గా. గుర్తుంచుకోండి పంది మాంసం? నేను దానిని టీవీలో చూడాలనుకుంటున్నాను. టీవీ మిగతావన్నీ తినేసింది మరియు వార్హోల్ ఫిల్మ్‌లు మిగిలి ఉన్నాయి, ఇది అద్భుతమైనది. పంది మాంసం తదుపరి కావచ్చు నేను లూసీని ప్రేమిస్తున్నాను, గొప్ప అమెరికన్ దేశీయ కామెడీ. ఇది ప్రజలు నిజంగా ఎలా జీవిస్తున్నారనే దాని గురించి, ఎప్పుడూ డిష్ వాటర్‌ను తాకని లూసీ లాగా కాదు. ఇది జీవించడానికి మరియు జీవించడానికి hustling ప్రజలు గురించి. అందు కోసమే పంది మాంసం అన్ని గురించి. అద్దం పగులగొట్టడం. నేను నా స్వంత సంస్కరణను చేయాలనుకుంటున్నాను సింద్బాద్ ది సెయిలర్. ఇది ఆల్-టైమ్ క్లాసిక్ అని నేను అనుకుంటున్నాను. కానీ అది అసాధారణ స్థాయిలో జరగాలి. ఇది నమ్మశక్యం కాని ఆనందం మరియు ఖరీదైనది. ఇది లేజర్‌లను మరియు నిజమైన ఫాంటసీలో జరగబోయే అన్ని విషయాలను ఉపయోగించుకోవాలి. హోలోగ్రామ్‌ల ఉపయోగం కూడా. హోలోగ్రామ్‌లు ముఖ్యమైనవి. వీడియో టేప్ తదుపరిది, అది హోలోగ్రామ్‌లుగా ఉంటుంది. హోలోగ్రామ్‌లు దాదాపు ఏడేళ్లలో ఉపయోగంలోకి వస్తాయి. మధ్యంతర కాలంలో వీడియో క్యాసెట్ల లైబ్రరీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. మీరు మీ స్వంత టీవీ నుండి తగినంత మంచి విషయాలను వీడియో చేయలేరు. నేను నా స్వంత ఎంపిక ప్రోగ్రామ్‌లను కలిగి ఉండాలనుకుంటున్నాను. అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉండాలి. బర్రోస్: నేను చేయగలిగినదంతా ఆడియో రికార్డ్ చేస్తాను. బౌవీ: మీడియా మన మోక్షం లేదా మన మరణం. ఇది మా మోక్షం అని నేను అనుకుంటున్నాను. నా ప్రత్యేక విషయం ఏమిటంటే మీడియాతో ఏమి చేయవచ్చు మరియు దానిని ఎలా ఉపయోగించవచ్చో కనుగొనడం. మీరు ఒక పెద్ద పెద్ద కుటుంబంలా ప్రజలను ఒకచోట చేర్చుకోలేరు, ప్రజలు దానిని కోరుకోరు. వారు ఒంటరితనం లేదా గిరిజన విషయం కావాలి. 18 మంది పిల్లలతో కూడిన సమూహం కలిసి ఉండటమే కాకుండా తదుపరి 18 మంది పిల్లలను ద్వేషిస్తుంది. మీరు రెండు లేదా మూడు బ్లాక్‌లు చేరడం మరియు ఒకరినొకరు ప్రేమించుకోవడం జరగదు. చాలా మంది మాత్రమే ఉన్నారు. బర్రోస్: చాలా మంది వ్యక్తులు. మేము అధిక జనాభా ఉన్న పరిస్థితిలో ఉన్నాము, కానీ మీ వద్ద ఉన్న తక్కువ మంది వ్యక్తులు ఇప్పటికీ వైవిధ్యంగా ఉన్నారనే వాస్తవాన్ని కలిగి ఉండరు. అవి ఒకేలా ఉండవు. ప్రపంచ కుటుంబం గురించి ఈ చర్చలన్నీ చాలా బంక్. ఇది చైనీయులతో కలిసి పనిచేసింది ఎందుకంటే వారు చాలా పోలి ఉంటారు. బౌవీ: ఇప్పుడు చైనాలో నలుగురిలో ఒక వ్యక్తికి సైకిల్ ఉంది మరియు ఇంతకు ముందు వారు లేని వాటిని పరిశీలిస్తే అది చాలా బరువుగా ఉంది. మరియు వారికి సంబంధించినంతవరకు అది అద్భుతం. మనందరికీ ఇక్కడ జెట్ విమానం ఉన్నట్లే. బర్రోస్: వారు ఒక పాత్ర యొక్క వ్యక్తిత్వం కాబట్టి వారు ఎటువంటి ఘర్షణ లేకుండా కలిసి జీవించగలరు. మేము స్పష్టంగా లేము. బౌవీ: అందుకే వారికి రాక్ & రోల్ అవసరం లేదు. బ్రిటీష్ రాక్ & రోల్ స్టార్లు చైనాలో ఆడారు, డర్టీ గ్రేట్ ఫీల్డ్‌ను ఆడారు మరియు వారు సైడ్‌షో లాగా వ్యవహరించబడ్డారు. వృద్ధ స్త్రీలు, చిన్న పిల్లలు, కొంతమంది యువకులు, మీరు పేరు పెట్టండి, అందరూ వచ్చారు, వారి వెంట నడిచి, స్టాండ్‌లో ఉన్న వారిని చూశారు. ఇది ఒక విషయం అర్థం కాలేదు. కొన్ని దేశాలకు రాక్ & రోల్ అవసరం లేదు ఎందుకంటే అవి కుటుంబ యూనిట్‌గా కలిసి ఉంటాయి. చైనా తన తల్లి-తండ్రి వ్యక్తిని కలిగి ఉంది - నేను నా మనస్సును ఎన్నడూ తయారు చేయలేదు - ఇది రెండింటి మధ్య హెచ్చుతగ్గులకు గురవుతుంది. పాశ్చాత్య దేశాలకు, జాగర్ ఖచ్చితంగా మాతృమూర్తి మరియు అతను మొత్తం విషయానికి తల్లి కోడి. అతను కాకాడూడ్లేడూ కాదు; అతను బ్రోతల్ కీపర్ లేదా మేడమ్ లాంటివాడు. బర్రోస్: ఓహ్, చాలా చాలా. బౌవీ: అతను చాలా శృంగారభరితుడు మరియు చాలా వైరాగ్యం. నేను అతను నమ్మశక్యం కాని మాతృత్వం మరియు మాతృత్వం అతని జాతి బ్లూస్‌లో అతుక్కుపోయినట్లు కూడా గుర్తించాను. అతను డాగెన్‌హామ్‌కు చెందిన తెల్లజాతి బాలుడు, జాతికి చెందిన వ్యక్తిగా ఉండేందుకు తన హేయమైన ప్రయత్నం చేస్తున్నాడు. మీరు చూడండి, రాక్ వ్యాపారాన్ని కొంచెం పెంచడానికి ప్రయత్నిస్తే పిల్లలు ఎలా ఉంటారో దానికి దగ్గరవుతున్నారు, ఎందుకంటే నేను కనుగొన్నది, మీరు రాక్ పరంగా మాట్లాడాలనుకుంటే, చాలా సంచలనాత్మకతపై ఆధారపడి ఉంటుంది మరియు పిల్లలు చాలా ఎక్కువ. తారల కంటే ఎక్కువ సంచలనం. రాక్ వ్యాపారం అనేది పిల్లల జీవితాలు సాధారణంగా ఎలా ఉంటుందో దాని యొక్క లేత నీడ. మరో వైపు నుంచి అభిమానం వస్తుంది. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో ఇది అన్నింటికీ తిరోగమనం. క్రిస్టోఫర్ వీధిలో నడవండి మరియు సరిగ్గా ఏమి జరిగిందో మీరు ఆశ్చర్యపోతారు. ప్రజలు జేమ్స్ టేలర్ వంటివారు కాదు; అవి బయట మలచబడి ఉండవచ్చు, కానీ వారి తలల లోపల అది పూర్తిగా భిన్నమైనది. బర్రోస్: ధ్వని రాజకీయాలు. బౌవీ: అవును. మేము ఇప్పుడు ఆ రకంగా పొందాము. ఇది చాలా వదులుగా ధ్వని రాజకీయంగా రూపుదిద్దుకుంది. మీరు ఇప్పుడు రాక్‌ను వివిధ వర్గాలుగా విభజించవచ్చు అనే వాస్తవం పదేళ్ల క్రితం మీరు చేయలేనిది. కానీ ఇప్పుడు నేను ఒక రకమైన సంగీతాన్ని కాకుండా ఒక రకమైన వ్యక్తిని సూచించే కనీసం పది శబ్దాలను వినగలను. విమర్శకులు అలా చెప్పడానికి ఇష్టపడరు, ఎందుకంటే విమర్శకులు విమర్శకులుగా ఉండడాన్ని ఇష్టపడతారు మరియు వారిలో ఎక్కువ మంది వారు రాక్ & రోల్ స్టార్‌లు కావాలని కోరుకుంటారు. కానీ వారు వర్గీకరించినప్పుడు వారు ప్రజల గురించి మాట్లాడుతున్నారు కాదు సంగీతం. ఇది మొత్తం రాజకీయ అంశం. బర్రోస్: ఇన్‌ఫ్రాసౌండ్ లాగా, వినికిడి స్థాయి కంటే తక్కువ ధ్వని. 16 మెర్ట్జ్ క్రింద. పూర్తి పేలుడుతో అది 30 మైళ్ల వరకు గోడలను పడగొట్టగలదు. మీరు ఫ్రెంచ్ పేటెంట్ కార్యాలయంలోకి వెళ్లి 40pకి పేటెంట్‌ను కొనుగోలు చేయవచ్చు. జంక్ యార్డ్‌లో మీరు కనుగొనగలిగే వస్తువుల నుండి యంత్రాన్ని చాలా చౌకగా తయారు చేయవచ్చు. బౌవీ: నలుపు శబ్దం లాగా. విషయాలను తిరిగి ఒకచోట చేర్చగల శబ్దం ఉందా అని నేను ఆశ్చర్యపోతున్నాను. అలాంటి వాటితో ఒక బ్యాండ్ ప్రయోగాలు చేస్తోంది; వారు మొత్తం ప్రేక్షకులను షేక్ చేయగలరని వారు భావిస్తున్నారు. బర్రోస్: వారు ఇప్పుడు ఈ సౌండ్‌వేవ్‌ల ఆధారంగా అల్లర్ల-నియంత్రణ శబ్దాన్ని కలిగి ఉన్నారు. కానీ మీరు ఇన్‌ఫ్రాసౌండ్‌తో సంగీతాన్ని కలిగి ఉండవచ్చు, మీరు ప్రేక్షకులను చంపాల్సిన అవసరం లేదు. బౌవీ: కేవలం వారిని అంగవైకల్యం చేయండి. బర్రోస్: వైల్డ్ బాయ్స్ యొక్క ఆయుధం బౌవీ కత్తి, 18-అంగుళాల బోవీ కత్తి, మీకు తెలుసా? బౌవీ: 18-అంగుళాల బౌవీ కత్తి … మీరు పనులను సగానికి విభజించరు. లేదు, అది వారి ఆయుధమని నాకు తెలియదు. నేను చిన్నతనంలో బౌవీ అనే పేరు నన్ను ఆకర్షించింది. నేను 16 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు నేను ఒక రకమైన భారీ తత్వశాస్త్రంలో ఉన్నాను మరియు అబద్ధాలు మరియు వాటన్నింటిని తగ్గించడం గురించి నేను ఒక సత్యాన్ని కోరుకున్నాను. బర్రోస్: బాగా, ఇది రెండు మార్గాలను తగ్గిస్తుంది, మీకు తెలుసా, చివరలో డబుల్ ఎడ్జ్. బౌవీ: నేను ఇప్పటివరకు రెండు మార్గాలను కత్తిరించడం చూడలేదు. ఈ కథ ఫిబ్రవరి 28, 1974 రోలింగ్ స్టోన్ సంచికలోనిది. మునుపటి వ్యాసం ది మేన్ ఈవెంట్: 'బోజాక్ హార్స్‌మ్యాన్'లు వారి ఇష్టమైన సిట్‌కామ్‌లలో నటించారు సిఫార్సు సంగీతం మరింత తారా రీడ్ సంగీతం బాబ్ డైలాన్ అమ్ముడుపోయాడు సంగీతం రక్తం, చెమట & కన్నీళ్లు కమ్యూనిజంపై వెనక్కి తగ్గాయి ఆసక్తికరమైన నిజాలు రోలింగ్ స్టోన్ యొక్క 50వ వార్షికోత్సవ ప్రదర్శనలో తప్పనిసరిగా చూడవలసిన 10 అంశాలు విజువల్స్: పాలో సోలెరి రాక్ & రోల్ స్టేజ్ భయం: ఇది నిజంగా వేయించడానికి భయం లెట్ ఇట్ బ్లీడ్ మెయిల్-ఆర్డర్ స్టీరియో ఫోటోలు: బ్రిడ్జ్ స్కూల్ బెనిఫిట్‌లో బఫెలో స్ప్రింగ్‌ఫీల్డ్, పెర్ల్ జామ్, నీల్ యంగ్ మరియు మరిన్ని జోక్యం పీటర్ ట్రావర్స్ యొక్క డజను తప్పనిసరిగా చూడవలసిన వేసవి సినిమాలు ఇంకా నేర్చుకో హోటల్ కాలిఫోర్నియా 'ఈట్ ఎ పీచ్': ఆల్మాన్ బ్రదర్స్ బ్యాండ్ ఆల్బమ్ రివ్యూ ది రోలింగ్ స్టోన్స్ 1975 పర్యటన: శాన్ ఆంటోన్‌లో క్యాస్ట్రేట్ చేయబడిన బ్యాటన్ రూజ్‌లో బాప్టిజం పొందారు YouTubeలో 2015లో అత్యధికంగా వీక్షించబడిన 10 సంగీత వీడియోలు బుడోకాన్ వద్ద 'ది బ్యూటిఫుల్ కలెక్షన్': ప్రివ్యూ ఎగ్జిబిట్ ప్రిన్స్ ఐకానిక్ ఫుట్‌వేర్‌కు అంకితం చేయబడింది దట్స్ ది వే ఆఫ్ ది వరల్డ్ రీడర్స్ పోల్: 10 ఉత్తమ సోలో పాల్ సైమన్ పాటలు ప్రస్తుతం మనకు ఇష్టమైన పాటలు: డేవిడ్ బౌవీ, డ్రేక్, ఎమినెం మరియు మరిన్ని పిల్లులు & కుక్కల గురించి నిజం సినిమా నుండి స్టిల్స్ © Copyrights 2022. అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది, సర్వస్వామ్య రక్షితం | musicforgeeksandnerds.com
Bloating : మారిన జీవన శైలి మనిషికి అనేక రోగాల బారిన పడడానికి కారణమవుతోంది. ఎక్కువగా గ్యాస్‌తో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. X Bloating: మారిన జీవన శైలి మనిషికి అనేక రోగాల బారిన పడడానికి కారణమవుతోంది. ఎక్కువగా గ్యాస్‌తో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. త్రేన్సులు, ఏం తిన్నా తినకపోయినా పొట్ట ఉబ్బరంగా అనిపించడం సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిలో ఏవైనా కొన్ని అనుసరించి మీ ఇబ్బందిని కొంత తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. మొదట ఉబ్బరానికి గల కారణాన్ని గుర్తించాలి. ఒత్తిడి , ఆందోళన, అధిక కొవ్వు భోజనం, బరువు పెరగడం మరియు ఋతు చక్రంలో మార్పులు కూడా కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. ఉబ్బరం ప్రేరేపించే ఆహారాలను పరిమితం చేయండి కూరగాయలు: బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ మొలకలు మరియు క్యాబేజీ పండు: ప్రూనే, ఆపిల్, బేరి మరియు పీచెస్ తృణధాన్యాలు: గోధుమ, వోట్స్, గోధుమ బీజ మరియు గోధుమ ఊక చిక్కుళ్ళు: బీన్స్, కాయధాన్యాలు, బఠానీలు మరియు కాల్చిన బీన్స్ చక్కెర ఆల్కహాల్‌లు మరియు కృత్రిమ స్వీటెనర్‌లు: జిలిటోల్, సార్బిటాల్ మరియు మన్నిటోల్ కృత్రిమ స్వీటెనర్‌లు మరియు చక్కెర లేని చూయింగ్ గమ్‌లో కనిపిస్తాయి పానీయాలు: సోడా మరియు ఇతర కార్బోనేటేడ్ పానీయాలు ఈ ఆహారాలు గ్యాస్‌ పెరిగేందుకు దోహదపడతాయి. కాబట్టి వాటిని తిన్న తర్వాత ప్రతి ఒక్కరికి కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. లాక్టోస్ అనేది పాలలో కనిపించే చక్కెర. కొంత మందికి పాలు పడవు. అయితే పాలలో కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఫాస్ఫరస్, ప్రోటీన్ వంటి కీలక పోషకాలు ఉంటాయి. కాబట్టి లాక్టోస్ పడనివారు పాలకు బదులు పెరుగు, వెన్న, నెయ్యి వంటి వాటిని తీసుకోవచ్చు. మలబద్ధకం.. ఇది కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది, ఎందుకంటే ఆహారంలోని జీర్ణం కాని భాగాలు మీ పెద్దప్రేగులో ఎక్కువ కాలం ఉంటాయి. దీంతో గ్యాస్ సమస్య తలెత్తుంది. ఫైబర్ తీసుకోవడం పెంచాలి. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు వంటివాటిని రోజుకు 18-30 గ్రాములు తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలి. రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ప్రతిరోజూ సుమారు 30 నిమిషాల పాటు నడక, జాగింగ్, స్విమ్మింగ్ లేదా సైకిల్ తొక్కడం వల్ల మీ ప్రేగులు కదులుతాయి. అధిక బరువు కూడా కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. ఉబ్బరంతో బాధపడుతుంటే, బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి.
స్వాతంత్య్రానంతర కాలంలో జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటనలలో భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం, 1971లో పాకిస్తాన్‌పై భారతదేశం నిర్ణయాత్మక విజయం సాధించి, బంగ్లాదేశ్ అనే ఒక స్వతంత్ర దేశాన్ని సృష్టించడం. 93,000 మంది పాకిస్తాన్ సేనలను యుద్ధ ఖైదీలుగా తీసుకోవడం. భారత దేశ రక్షణ దృష్ట్యా, దక్షిణాసియాలో భౌగోలిక పరిస్థితుల దృష్ట్యా ఈ యుద్ధం ఒక కీలక మైలురాయి అని చెప్పవచ్చు. ఎవ్వరు ఊహించని విధంగా, కేవలం 13 రోజులలో పాక్ సేనలు లొంగిపోయే విధంగా చేయడంలో సామ్ బహదూర్ అని విస్తృతంగా పిలువబడే మన సేనాధిపతి ఫీల్డ్ మార్షల్ సామ్ హోర్ముస్జీ ఫ్రామ్‌జీ జంషెడ్జీ మానెక్ షా కీలక పాత్ర వహించారు. ఆయన ప్రదర్శించిన ముందుచూపు, వ్యూహాత్మక ఎత్తుగడలు కీలక భూమిక వహించాయని చెప్పవచ్చు. వాస్తవానికి ఆరు నెలల ముందుగానే, ఏప్రిల్ లోనే యుద్ధం ప్రారంభించాలని నాటి ప్రధాని ఇందిరా గాంధీ అభిలషించారు. ఆ విధంగా చేస్తే భారత్ కు ప్రతికూల పరిస్థితులు ఎదురు కాగలవని నిర్వార్ధంగా చెప్పి మానెక్ షా ఆమెను వారించారు. “నా పని పోరాడడం, గెలవడమే నా పని” అంటూ ఆమెతో వాస్తవ పరిస్థితులను అరమరికలు లేకుండా వివరించే సాహసం చేయగలిగారు. ప్రపంచ చరిత్రలోనే ఒక యుద్ధం కారణంగా ఒక కొత్త దేశం ఏర్పడిన చివరి ఘటన ఈ యుద్ధమే కావడం విశేషం. అంతటి మహత్తర యుద్ధం జరిపి, 93,000 మంది శత్రు సైనికులు లొంగిపోయినా ఎటువంటి మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలు రాకపోవడం కూడా ఆయన నాయకత్వ విశిష్టత అని చెప్పవచ్చు. పైగా, లొంగి పోయిన పాక్ సేనలను మూడు రోజుల పాటు బాంగ్లాదేశ్ లో తిరుగుబాటు దారుల నుండి కాపాడారు. వారిని సురక్ష స్థావరాలకు తరలించి, వారి వసతి, ఆహరం ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు. యుద్ధంలో గెలుపు కోసం సైనిక విలువలను త్యాగం చేయని ధీశాలి. దారిలో గాని, యుద్ధం సమయంలో గాని సాధారణ ప్రజలను వేధించినట్లు, మహళలపై అత్యాచారాలకు పాలపడిన్నట్లు ఎటువంటి ఆరోపణలు భారత సైన్యంపై రాకపోవడం గమనార్హం. వైరుధ్యాలతో ఏర్పడిన పాక్ అసలు ఈ యుద్ధం ఏ విధంగా ప్రారంభమై, భారత్ నిర్ణయాత్మక విజయానికి దారితీసిందో నేటి యువతకు అవగహన లేదని చెప్పవచ్చు. దేశ జనాభాలో వారే 65 శాతంగా ఉన్నారు. 1947లో పాకిస్ధాన్ ఏర్పడిన సమయంలోనే మధ్యలో భారత్ భూభాగం ఉండేవిధంగా, పశ్చిమ, తూర్పు భాగాలుగా ఆ దేశం ఏర్పడడంలోనే భౌగోలిక పరంగానే కాకుండా, సాంస్కృతికంగా కూడా వైరుధ్యాలు చోటుచేసుకున్నాయి. పాక్ పాలకులు ఈ వైరుధ్యాలను చక్కదిద్దుకొనే ప్రయత్నం చేయకుండా, తూర్పు పాకిస్థాన్ ప్రజలపై ఆధిపత్య ధోరణులు ప్రదర్శనచడం ఈ యుద్దానికి ప్రాతిపదిక ఏర్పర్చిన్నట్లు చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికలలో తూర్పు పాకిస్థాన్ ప్రజలు షేక్ ముజిబుర్ రెహ్మాన్ నేతృత్వంలోని అవామీ లీగ్‌కు అఖండ విజయం చేకూర్చారు. మొత్తం 300 సీట్లలో అవామీ లీగ్ 160 సీట్లు గెలుచుకోగా, 84 సీట్లు జుల్ఫికర్ అలీ భుట్టోకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ గెలుచుకుంది. తూర్పు పాకిస్తాన్ లో ఎక్కువ జనాభా ఉన్నందున పాకిస్తాన్ శాసనసభ, నేషనల్ అసెంబ్లీలో ఎక్కువ సీట్లు ఉన్నాయి. పాకిస్తాన్‌లో పౌర ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అది బెంగాలీలు సమర్థంగా పాలించగలరని పంజాబీ ఆధిపత్య పాకిస్తాన్ సైన్యం, , జుల్ఫికర్ భుట్టో ఆందోళన చెందారు. అందుకనే అన్ని సీట్లు గెలుపొందిన ముజిబుర్ రెహ్మాన్ కు అధికారం అప్పచెప్పడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 7, 1970 నుండి ఎన్నికలు జరిగినప్పటి నుండి మార్చి 23, 1971 వరకు అనేక సంఘటనలు జరిగాయి. అన్నింటినీ భారతదేశ వ్యూహాత్మక నిపుణులు ఆసక్తిగా గమనిస్తూ వచ్చారు. ఎన్నికలకు ఒక నెల ముందు భారీ తుఫాను సంభవించింది. ఈ సందర్భంగా తూర్పు పాకిస్తాన్‌లో 50 లక్షల మంది వరకు మృత్యుకు లోనుకావలసి వచ్చింది. తమ ఇబ్బందుల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదని తూర్పు పాకిస్థాన్ ప్రాంత ప్రజలలో తీవ్ర అసంతృత్తి ఏర్పడింది. అది కూడా పశ్చిమ పాకిస్తాన్‌పై వారి ఆగ్రహానికి దారితీసింది. పాకిస్తాన్ సైన్యం భుట్టోతో కుమ్మక్కై ఏదో ఒక సాకుతో, షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ను పాకిస్తాన్ తదుపరి ప్రభుత్వానికి (ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఏకైక ప్రభుత్వం, అది ఏర్పడినట్లయితే) అధిపతి కావడానికి అనుమతించలేదు. 1947 నుండి ఉర్దూను జాతీయ భాషగా విధించే ప్రయత్నంతో సహా అనేక వివాదాస్పద సమస్యలపై బెంగాలీ జనాభా ఇప్పటికే పాక్ ప్రభుత్వంలో ఉన్న నేతల పట్ల అసహనంగా ఉంటూ వస్తున్నారు. అటువంటి సమయంలో ఆపరేషన్ సెర్చ్‌లైట్ అనే కోడ్‌నేమ్‌తో భారీ సైనిక అణిచివేతకు దిగడంతో అగ్గిమీద ఆజ్యం పోసిన్నట్లయింది. ఈ అణచివేత బెంగాలీ మేధావులలో పెద్ద భాగాన్ని నిర్మూలించడానికి, బెంగాలీ మహిళలపై సామూహిక అత్యాచారాలకు, అనేక మంది నాయకులను అరెస్టు చేయడానికి దారితీసింది. షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ను డక్కాలో అరెస్టు చేసి పశ్చిమ పాకిస్తాన్‌కు తరలించారు. ఏప్రిల్ లోనే యుద్ధం చేయాలన్న ఇందిరా తూర్పు పాకిస్తాన్‌లో అత్యంత అస్థిరమైన పరిస్థితుల నేపథ్యంలో, షేక్ ముజీబ్ లేకపోవడంతో మిగిలిన నాయకత్వం సహాయం కోసం భారతదేశాన్ని అభ్యర్థించింది. ఆ సమయంలో భారత్ జోక్యం చేసుకొంటే పాకిస్థాన్ తో పూర్తి స్థాయి యుద్దానికి దారితీస్తుందని, పాక్ సైన్యం సర్వశక్తులు ఒడ్డి ప్రఘటించే ప్రయత్నం చేస్తుందని తెలిసినా నాటి రాజకీయ నాయకత్వం (ఇందిరా గాంధీ) వెంటనే జోక్యం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా భద్రతా వ్యవహారాలపై జరిగిన ఒక అత్యున్నత సమావేశంకు జనరల్ (తరువాత ఫీల్డ్ మార్షల్) సామ్ మానెక్ షాను ఆహ్వానించారు. తూర్పు పాకిస్తాన్‌లో భారత సైన్యంతో వీలైనంత త్వరగా జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయనను కోరారు. జోక్యం చేసుకోవడం అంటే యుద్దానికి దిగడమే అవుతుందని, ఆ యుద్ధం కేవలం తూర్పు వైపుకు పరిమితమై ఉండబోదని, పశ్చిమ దిశలో కూడా జరుగుతోందని స్పష్టం చేస్తూ, అటువంటి యుద్దానికి తాను సుముఖంగా లేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం అటువంటి యుద్దాన్ని కోరుకొంటుందా అని నేరుగా ఇందిరాగాంధీని అడిగారు. ఆ విధంగా ఒక బలమైన దేశాధినేతకు సైన్యాధిపతి సమాధానం ఇవ్వడం ఆ రోజులలో అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఏదేమైనప్పటికీ, ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ప్రభుత్వాధినేతకు ఏ ఆర్మీ చీఫ్ అయినా ఇవ్వగలిగే తెలివిగల వ్యూహాత్మక సలహాతో మానెక్ షా ఒక ప్రత్యేక స్థానం పొందారు. ఈ సందర్భంగా యుద్ధ ట్యాంక్ లకు అవసరమైన విడిభాగాలు, యుద్దానికి అవసరమైన మందుగుండు సామాగ్రి నిల్వలకు అవసరమైన నిధులు తనకు అందుబాటులో లేవని స్పష్టం చేశారు. వీటిని సమకూర్చు కోవడానికి కొంచెం సమయం పడుతుందని చెప్పారు. పైగా, ఆమె సూచిస్తున్నట్లు ఏప్రిల్-మే 1971 నెలలో యుద్ధంకు దిగితే భారత సాయుధ దళాలు పంజాబ్, రాజస్థాన్ వ్యవసాయ భూముల్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకోవాల్సి వస్తుందని, దాని వల్లన పంటలు నాశనమై మన దేశపు ఆహార నిల్వలు క్షీణించే ప్రమాదం ఉన్నదని కూడా ఆమె దృష్టికి తీసుకు వచ్చారు. యుద్ధం ఎప్పుడైనా రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత చేసిన్నట్లయితే తూర్పు పాకిస్థాన్ నదులు సముద్రం వలే పొంగుతూ ఉంటె రోడ్ మార్గం తప్ప పాక్ సేనల కదలికకు వీలుండదని, పైగా, పశ్చిమ- తూర్పు ప్రాంతాలకు సేనలను అవసరమున్న చోటకు మార్చడం ఆ దేశానికి సాధ్యం కాదని కూడా స్పష్టం చేశారు. వెంటనే యుద్దానికి వెడితే మంచు లేని హిమాలయ ప్రాంతాలలో పాకిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామి చైనా కూడా కాలు దువ్వే అవకాశం ఉంటుందని, భారత్ కు అల్టిమేటం ఇచ్చే అవకాశం ఉంటుందని వారించారు. అందుకోసం భారత్ కొన్ని బలగాలను అటువైపు ఉంచవలసి వస్తుందని పేర్కొన్నారు. రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత యుద్ధం చేస్తే హిమాలయ ప్రాంతంలో మన సేనల కదలికలను కనుక్కోవడం చైనాకు సాధ్యం కాదని, అప్పుడు వారు బెదిరించే అవకాశం ఉండదని తెలిపారు. యుద్దానికి తొందర పడకుండా, కొద్దీ రోజులు ఆగితే తూర్పు పాకిస్థాన్ లో అంతర్గత ప్రతిఘటన తీవ్రమైన పాకిస్తాన్ పట్టు ఆ భూభాగంపై కొంత బలహీన పడుతుందని మానెక్ షా పరిస్థితులను ఇందిరా గాంధీకి వివరించారు. ఆ విధంగా నిర్ణయాత్మకంగా భారత్ విజయం సాధించగలదని భరోసా ఉన్నప్పుడు మాత్రమే యుద్ధం ప్రారంభించాలని ఆయన ఇందిరకు సలహా ఇచ్చారు. ఏప్రిల్ – సెప్టెంబర్, 1971 మధ్యన కాకుకండా, ఆ తర్వాత ఎప్పుడైనా యుద్దానికి సైన్యం సిద్ధంగా ఉండగలదని భరోసా ఇచ్చారు. మానెక్ షాను వెంటనే యుద్ధంకు దిగడానికి ఒప్పించడం కోసం ఆ సమావేశంలో ఉన్న ప్రముఖులు అందరు తీవ్ర ప్రయత్నం చేసినా, ఆయన ఏమాత్రం చలించలేదు. ఫలించిన మానెక్ షా వ్యూహం ఆ తర్వాత ప్రధానితో ఒంటరిగా సమావేశమైనప్పుడు, మీరు అనుకున్న విధంగా యుద్ధం చేయడానికి సైన్యాన్ని సిద్ధం చేయండి అని ఆమె ఆదేశాలు ఇచ్చారు. అందుకనే భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో అమెరికా వంటి దేశాలకు సహితం విస్మయం కలిగించే రీతిలో నిర్ణయాత్మక విజయంను భారత సైన్యం నమోదు చేసుకోగలిగింది. ఆ వ్యవధిలో మన సేనలను యుద్దానికి సిద్ధం చేయడమే కాకుండా, యుద్ధంకు సిద్ధంగా ఉన్న ప్రతి సైనికుడి మనస్సులో `మనం విజయం సాధించాలి’ అనే ప్రగాఢమైన ఆకాంక్షను కూడా కలిగించారు. ఆ మానసిక భరోసా భారత్ అనూహ్య విజయం సాధించడానికి తోడ్పడింది. “ఒకరి మనస్సులో విజయ స్పృహ ముందుగా నింపబడితే, అతను యుద్ధరంగంలో ఎప్పుడూ విఫలం కాలేదు. ఆ మంత్రం ఫలితంగానే 1971లో ఘన విజయం సాధించాం’’ అని ఆయన కుమార్తె మజా దారువాలా యుద్ధం సమయంలో 26 ఏళ్ళ వయస్సులో ఉన్న ఆమె పేర్కొన్నారు. ఆ మానసిక శక్తితోనే భారత సైన్యం సగర్వంగా పోరాడింది. ఆ భరోసానే నేటికీ అద్భుతంగా ప్రకాశిస్తోందని చెప్పవచ్చు. మానెక్ షా అంచనా వేసిన్నట్లుగానే ఏప్రిల్-నవంబర్ 1971 వరకు, తూర్పు పాకిస్తాన్‌లో బెంగాలీలు సృష్టించబడిన స్థానిక దళమైన ముక్తి బహిని పాకిస్తాన్ సైన్యం పట్టు, ధైర్యంలను క్రమపద్ధతిలో బలహీనం చేయగలిగాయి. పాకిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయంగా కొంతవరకు మద్దతు కూడదీసుకున్నా, ఒక విధంగా భారత్ ను అమెరికా అండతో ఒంటరిగా చేయగలిగిన, వారి జనరల్స్ చేసిన పొరపాట్లు, భారత్ సైన్యం వ్యూహాత్మక ఎత్తుగడలు వారిని మట్టి కురిపించాయి. పాకిస్థాన్ కు అమెరికా బాసటగా నిలబడటమే కాకుండా, భారత్ ను సైనికంగా కూడా బెదిరించే ప్రయత్నం చేయడంతో ఈ యుద్ధం తర్వాత ఇండో – సోవియట్ పరస్పర స్నేహ ఒప్పందంపై రెండు దేశాల అధినేతలు సంతకం చేయడానికి దారితీసింది. అమెరికా నుండి ఎదురు కాగల సైనిక ముప్పును సమతుల్యం చేయడం కోసం భారత్ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఎవరీ మానెక్ షా? ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా 1914 ఏప్రిల్ 3న అమృత్‌సర్‌లో జన్మించారు. ఆయన తండ్రి, హార్ముస్జి మానేక్షా, వైద్యుడు. తన తండ్రికి అభీష్టానికి ధిక్కరిస్తూ జూలై 1932లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేశారు. రెండు సంవత్సరాల తరువాత, అతను 4/12 ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో నీయమితులయ్యారు. ఆయన రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడారు 1960లలో కొన్ని సంవత్సరాల పాటు కోర్ట్ విచారణతో సహా కొంత గందరగోళం తర్వాత, మానెక్ షా 1969లో ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. 1971 విజయం తర్వాత, జనరల్ మానేక్షా 59 సంవత్సరాల వయస్సులో ఫీల్డ్ మార్షల్ ఫైవ్-స్టార్ ర్యాంక్‌ను పొందారు. ఈ ఉత్సవ ర్యాంక్‌ను పొందిన మొదటి భారతీయ జనరల్ ఆయనే. పైగా ఆయనే భారత సైన్యంకు మొదటి భారతీయ కమాండర్-ఇన్-చీఫ్. కె ఎం కరియప్పకు 1986లో ఈ ర్యాంక్ లభించగా, అర్జన్ సింగ్‌కు 2002లో సమానమైన మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ర్యాంక్ వాయుసేనలో లభించింది. 1972లో, సామ్ బహదూర్‌కు భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. ఒక సంవత్సరం తరువాత, ఆర్మీ స్టాఫ్ చీఫ్ పదవి నుండి రిటైర్ అయ్యారు. పదవీ విరమణ తర్వాత, తమిళనాడులో ఒక ఇంటిని కనుగోలు చేసి, వెల్లింగ్టన్‌లో తన చివరి రోజులు గడిపారు. 2008లో ఆయన తుది శ్వాస విడిచారు. వచ్చే ఏడాది, నటుడు విక్కీ కౌశల్ ఆర్మీ వెటరన్‌పై సామ్ బహదూర్ అనే బయోపిక్‌లో నటించబోతున్నాడు. దీనికి ఫిల్మ్ మేకర్ మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించనున్నారు.
కొంత మందిని చూస్తే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటారు. నిజానికి అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తే మన జీవితం కూడా ఎంతో బాగుంటుంది. హేమలతా లవణం కూడా ఎంతో మందికి ఆదర్శం. అయితే ఇంతకీ హేమలతా లవణం ఎవరు..? ఆమె చేసింది ఏమిటి..? ఆమె గొప్పతనం ఏమిటి ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. హేమలత గుర్రం జాషువా కుమార్తె. సామాజిక సేవకురాలిగా ఈమె ప్రసిద్ధి చెందారు. హేమలత గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. కలం చెప్పిన కథ, మా నాన్నగారు, జీవన సాగరం, అనుభవ తరంగాలు, నేరస్తుల సంస్కరణ, తాయెత్తు – గమ్మత్తు, మృత్యోర్మా అమృతంగమయ వంటి రచనలు కూడా చేశారు. ఈమె చేసిన సేవ ఎంతో. దానికి ఫలితంగా కృషికి, రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ని ఇచ్చారు. అలానే తానా ఎచ్చీవ్‌మెంట్‌, వరల్డ్‌ ఎచ్చీవ్‌మెంట్‌ అవార్డులను కూడా ఈమె పొందారు. 1960 లో ఈమెకు లవణం గారితో వివాహం అయ్యింది. ఆ తరవాత వీరిద్దరిని చంబల్ లోయకి రమ్మని ఆచార్య వినోబాభావే ఆహ్వానించడం జరిగింది. అప్పుడు అక్కడ బందిపోట్ల లొంగుబాటు జరుగుతోంది. ఆ సమయంలో ఈ దంపతులను సాక్ష్యులుగా ఉండమన్నారట వినోబాభావే. అప్పుడు పెద్ద సంఖ్యలో బందిపోట్లు లొంగిపోయారు. పైగా మాన్ సింగ్ అనే ఓ దొంగ హేమలతా గారి చేతికి రాఖీ కట్టారట. ఇలా చంబల్ లోయలో పర్యటించి మానసిక పరివర్తన బందిపోటు దొంగల్లో తెచ్చారు. దొంగలు ఇలా మారుతున్నారని స్టూవర్టుపురం లో కూడా అలా చెయ్యాలని అనుకోవడానికి ఇదే చారిత్రక నేపథ్యం. చంబల్ లోయ లో జరిగిన ఈ మార్పు హేమలత గారి పైన తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఘటనే స్టూవర్టుపురం లో కూడా నేరసంస్కరణలను అమలు చేయడానికి ప్రేరణ ఇచ్చింది. స్టూవర్టుపురం లో నేరస్తులు లేకుండా చేసారు. అంతే కాక ముప్పై మందికి పైగా జోగినులకి వివాహాలు చేశారట హేమలత. అండాశయపు క్యాన్సర్‌ వ్యాధి తో హేమలత మార్చి 20, 2008 న మరణించారు. Recent Posts “ఆ హీరోలు చేసిన పొరపాటు రామ్ చరణ్ కూడా చేస్తున్నారా..?” అంటూ… మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్” పై కామెంట్స్..!
కొద్ది రోజుల క్రితం ఓ ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి వారితో విందు. నేడు పారిశుద్ధ కార్మికుడి కుటుంబానికి తన ఇంట విందు. విజన్ వున్న నేతల్లో ఒకరుగా గుర్తింపు పొందిన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి వార్తలతో ప్రజా నేతగా మరింత ఎత్తుకు ఎదుగుతున్నారు. Written By: Prime9News New Delhi: కొద్ది రోజుల క్రితం ఓ ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి వారితో విందు. నేడు పారిశుద్ధ కార్మికుడి కుటుంబానికి తన ఇంట విందు. విజన్ వున్న నేతల్లో ఒకరుగా గుర్తింపు పొందిన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి వార్తలతో ప్రజా నేతగా మరింత ఎత్తుకు ఎదుగుతున్నారు. MoreFrom Jr NTR: నెట్టింట వైరల్ అవుతున్న ఎన్టీఆర్ న్యూ లుక్.. ఎందుకో తెలుసా..? HIT2 Trailer: ఆసక్తిరేపుతున్న హిట్ 2 ట్రైలర్ Shooting at US Walmart: అమెరికా వర్జీనియాలోని వాల్ మార్టులో కాల్పులు .. పలువురి మృతి వివరాల్లోకి వెళ్లితే, గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆదివారం అహ్మదాబాద్ లో జరిగిన టౌన్ హాల్లో సోలంకి అనే పారిశుద్ధ్య కార్మికుడు తన ఇంటికి కూడా భోజనానికి వస్తారా? అని కేజ్రీవాల్ ను ప్రశించాడు. ఆ సమయంలో కేజ్రీవాల్ స్పందిస్తూ మరో పర్యాయం వచ్చిన్నప్పుడు మీ ఇంటికి వస్తానని సోలంకికి హామీ ఇచ్చాడు. దానికన్నా ముందుగా సోలంకిని ఢిల్లీలోని తన ఇంటిలో విందు చేయాలని ఆప్ అధినేత ఆహ్వానించి అందరి దృష్టిలో మరో మారు పడ్డారు. అంతేగాకుండా వెంటనే పారిశుద్ధ్య కార్మికుడి వివరాలు తెలుసుకొన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పంజాబ్ భవనల్లో కార్మికుడి కుటుంబానికి ఆతిధ్యం ఇస్తానని పేర్కొన్నారు. వెంటనే సోలంకి తో పాటు అతడి కుటుంబసభ్యులకు విమాన టిక్కెట్లను మరీ ఏర్పాటు చేసి కేజ్రీవాల్ వారిని విందుకు ఆహ్వానించాడు. దీంతో పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబం ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అనుకున్నట్టే సోమవారం తన ఇంటికి భోజనానికి వచ్చిన సోలంకి కుటుంబానికి కేజ్రీవాల్ సాదర స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. మిమ్మల్ని చూస్తుంటే మా కోసం ఒకరు ఉన్నారన్న ఆశ కలుగుతోంది సర్ అంటూ తన ఆనందాన్ని సోలంకి కేజ్రీవాల్ తో వ్యక్తం చేశాడు. అందుకు ఆయన స్పందిస్తూ చాలామంది నేతలు దళితుల ఇంటికి భోజనానికి వెళ్లి షో చేయడాన్ని తాను చూశానని, ఇప్పటి వరకు ఒక్క నాయకుడు కూడా దళితుడిని తన ఇంటికి భోజనానికి పిలవలేదని గుర్తు చేసారు గుజరాత్ లో పలు సభల్లో మాట్లాడిన ఆప్ అధినేత తమ పార్టీనే అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తుందని పదే పదే చెప్పారు. అందుకు ఉదాహరణగా ఆప్ కార్యాలయాల్లో ఎక్కడా కేజ్రీవాల్ ఫోటోలు ఉండవని పేర్కొన్నారు. అంతేగాకుండా కేజ్రీవాల్ అనేక సందర్భాలలో అంబేడ్కర్ ను గుర్తు చేస్తూ 75ఏళ్లగా ఆయన కల నెరవేరలేదంటూనే ఉంటారు. భాజాపా, కాంగ్రెస్ పార్టీల్లో నేతలు ఫోటోలు ఉంటాయని, దీన్ని గమనించాలని కోరారు. పంజాబ్ లో విజయం సాధించిన తర్వాత ఆప్ అధినేత ఇప్పుడు గుజరాత్ ఎన్నికలతో ఆ రాష్ట్రంలో పాగా వేసేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్ లో దేశ ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం అందించే పార్టీ ఏకైక పార్టీ ఆప్ దే అన్న కోణంలో తన గుర్తు చీపురుతో ప్రతిపక్షాలను ఆయన ఉతికి ఆరేస్తూ చిమ్మేస్తున్నారు.
కొత్తగా బాప్టిజం పొందిన సభ్యులకు క్రీస్తు నిర్మించిన చర్చి యొక్క నమ్మకాలు, బాధ్యతలు మరియు మంత్రిత్వ శాఖల గురించి చర్చి సభ్యుల మాన్యువల్ ఎల్లప్పుడూ ముఖ్యమైన పరిచయం. ఇది చర్చి విధానాలు మరియు విధానాలకు సంబంధించిన సమాచార మూలంగా సాధారణంగా సభ్యులచే ఉపయోగించబడింది. ముందుమాట ఈ మాన్యువల్‌ను మొదటిసారిగా ఎల్డర్ చార్లెస్ ఎ. డేవిస్ (ఇప్పుడు మరణించారు) 1947లో రీఆర్‌గనైజ్డ్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ ద్వారా ఉపయోగించేందుకు సిద్ధం చేశారు. ఎల్డర్ డేవిస్ వివిధ ప్రచురణలలో కనిపించిన చర్చి నాయకుల ప్రకటనల యొక్క గొప్ప మూలాన్ని పొందారు, తద్వారా ప్రతి కొత్త సభ్యునికి ప్రాముఖ్యత కలిగిన ఒక వాల్యూమ్ సమాచారాన్ని సేకరించారు. యొక్క ఈ ప్రస్తుత వెర్షన్ చర్చి సభ్యుల మాన్యువల్ లేటర్ డే సెయింట్స్ యొక్క జీసస్ క్రైస్ట్ యొక్క శేషాచల చర్చి ఉపయోగం కోసం అసలు పునరుద్ధరణ మరియు పునర్వ్యవస్థీకరణ నమ్మకాలు మరియు అభ్యాసాలకు అనుగుణంగా దానిని తాజాగా తీసుకురావడానికి సమీక్షించబడింది మరియు సవరించబడింది. ఇప్పుడు మరోసారి అందుబాటులోకి వచ్చింది, ఇది మాన్యువల్ చర్చిలోని కొత్త మరియు ప్రస్తుత సభ్యులకు తమ జీవితాలను ప్రభువైన యేసుక్రీస్తు వైపు మళ్లించడంలో సహాయపడేందుకు విలువైన సమాచారాన్ని అందించడంలో గొప్ప సహాయంగా ఉంటుంది. ఈ చర్చి సభ్యుల మాన్యువల్‌లోని ఆలోచనలు మరియు విషయాల ద్వారా అందరూ ఆశీర్వదించబడాలి మరియు ప్రేరణ పొందండి మొదటి ప్రెసిడెన్సీ టెర్రీ సహనం డేవిడ్ వాన్ ఫ్లీట్ మైక్ హొగన్ 2021 1 వ అధ్యాయము చర్చిలో సభ్యుడిగా మారడం లేటర్ డే సెయింట్స్ యొక్క జీసస్ క్రైస్ట్ యొక్క శేష చర్చిలో సభ్యత్వం ఒక గొప్ప ప్రత్యేకత. చర్చికి ఇవ్వబడిన ముఖ్యమైన కమీషన్ కారణంగా, అది కూడా ఒక గొప్ప బాధ్యత. ఈ ప్రత్యేక హక్కు యొక్క స్వభావం మరియు ఈ బాధ్యత, ప్రశాంతంగా మరియు తీవ్రంగా పరిగణించకుండా ఒక సభ్యుడు కాకూడదు. చర్చిలో సభ్యత్వం గురించి ఆలోచించే వ్యక్తి చర్చి యొక్క ప్రయోజనాలను మరియు సంస్థను అధ్యయనం చేయడానికి మరియు దానిలో సభ్యత్వం ఏమిటో సహేతుకమైన స్పష్టమైన ఆలోచనను పొందడానికి గణనీయమైన సమయాన్ని వెచ్చించడం అవసరం. పురాతన కాలం నుండి, చర్చిలోకి ప్రవేశం ఇమ్మర్షన్ ద్వారా బాప్టిజం యొక్క ఆర్డినెన్స్‌కు లోబడి ఉంటుంది మరియు కొన్ని షరతులకు ఎల్లప్పుడూ జోడించబడింది. బాప్టిజం అనేది ఒడంబడిక సంబంధం కాబట్టి, ఒడంబడిక నిబంధనలపై పూర్తి అవగాహన అవసరం; కాబట్టి దేవుడు తన వాక్యంలో నిర్దేశించిన ఈ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని మేము నొక్కిచెబుతున్నాము. మోడెమ్ వెల్లడి దీనిని చాలా ఖచ్చితమైనదిగా చేసింది. చర్చికి ప్రభువు మాటలో, మనకు ఈ క్రింది చాలా సంక్షిప్త పేరా ఉంది. మానవజాతి చరిత్రలో ఎన్నడూ ఊహించని గొప్ప పనిని-భూమిపై దేవుని రాజ్య నిర్మాణాన్ని నెరవేర్చడంలో మనలను ఆయనతో భాగస్వాములను చేసే ఈ చర్యను తీసుకోవడాన్ని పరిశీలిస్తున్నప్పుడు మనం దానిని చాలా జాగ్రత్తగా మరియు ప్రార్థనతో విశ్లేషించాలి. ఎవరు బాప్తిస్మం తీసుకోవచ్చు? "దేవుని ముందు తమను తాము తగ్గించుకొని, బాప్టిజం పొందాలని కోరుకునే వారందరూ, విరిగిన హృదయాలతో మరియు పశ్చాత్తాపపడిన ఆత్మలతో ముందుకు వచ్చి, వారు తమ పాపాలన్నిటికి నిజంగా పశ్చాత్తాపపడ్డారని మరియు వారిపై యేసు నామాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని చర్చి ముందు సాక్ష్యమిస్తారు. క్రీస్తు, చివరి వరకు తనకు సేవ చేయాలనే దృఢ నిశ్చయంతో, మరియు వారి పాపాల విమోచన కొరకు క్రీస్తు యొక్క ఆత్మను పొందినట్లు వారి పనుల ద్వారా నిజంగా వ్యక్తపరచబడి, బాప్టిజం ద్వారా అతని చర్చిలోకి స్వీకరించబడతాడు." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 17:7) బాప్టిజం అంటే ఏమిటి? బాప్టిజం అనేది మాస్టర్ ఆదేశించిన చర్య, "...ఒక వ్యక్తి నీటి వలన మరియు ఆత్మ వలన తప్ప, అతడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు." (యోహాను 3:5) ఇక్కడ ఖచ్చితంగా ఆయన రాజ్యంలోకి ప్రవేశించే షరతుగా పేర్కొనబడింది. భగవంతుడు అంగీకరించే మరో మార్గం లేదు. ఒక భౌతిక చిహ్నం బాప్టిజం అనేది భౌతిక ప్రక్రియ అయితే, ఆ ప్రక్రియలోని ప్రతి అడుగు ఆధ్యాత్మిక వాస్తవికత లేదా సత్యాన్ని సూచిస్తుంది లేదా సూచిస్తుంది. మొత్తంగా, బాప్టిజం మోక్షానికి సంబంధించిన వ్యక్తి. "బాప్టిజం కూడా అటువంటి వ్యక్తి ఇప్పుడు మనలను రక్షించును, (శరీరము యొక్క మురికిని తీసివేయుట కాదు, కానీ దేవుని పట్ల మంచి మనస్సాక్షి యొక్క సమాధానం) యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా." (I పేతురు 3:21) "యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనలో చాలా మంది అతని మరణానికి బాప్తిస్మం తీసుకున్నారని మీకు తెలియదా? కాబట్టి మేము అతనితో పాటు మరణానికి బాప్టిజం ద్వారా పాతిపెట్టబడ్డాము; క్రీస్తు తండ్రి మహిమచే మృతులలో నుండి లేపబడినట్లుగా, అలాగే మనం కూడా కొత్త జీవితంతో నడవాలి, ఎందుకంటే మనం అతని మరణం యొక్క పోలికలో కలిసి నాటబడినట్లయితే, మనం కూడా అతని పునరుత్థానం యొక్క పోలికలో ఉంటాము; మన వృద్ధుడు అతనితో పాటు సిలువ వేయబడ్డాడని తెలిసి, పాప శరీరం నాశనం కావచ్చు, ఇకమీదట మనం పాపానికి సేవ చేయకూడదు." (రోమన్లు 6:3-6) దేవునికి మన విధేయతకు చిహ్నం యేసు దేవుని నుండి ప్రత్యేక మిషన్ మరియు సందేశంతో వచ్చాడు. అతను తన పరిచర్యకు అన్ని దేశాలకు బోధించమని మరియు బాప్తిస్మం ఇవ్వమని ఆజ్ఞాపించడమే కాకుండా, అతను వారికి ఆజ్ఞాపించినవన్నీ పాటించమని వారికి బోధించమని కూడా ఆదేశించాడు. "కాబట్టి మీరు వెళ్లి, అన్ని దేశాలకు బోధించండి, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వండి; నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ పాటించమని వారికి బోధించండి; మరియు, ఇదిగో, నేను మీతో ఉన్నాను. ఎల్లప్పుడూ, ప్రపంచం అంతం వరకు. ఆమెన్." (మత్తయి 28:18, 19) విశ్వాసం మరియు పశ్చాత్తాపం యొక్క చిహ్నం విశ్వసించని వ్యక్తికి బాప్తిస్మం తీసుకోవడానికి నిజమైన ఉద్దేశ్యం లేదని మరియు పశ్చాత్తాపం చెందని వ్యక్తి తన బాప్టిజం ద్వారా పాపాల ఉపశమనం గురించి వాగ్దానం చేయలేదని గ్రహించడం చాలా ముఖ్యం. "మరియు ఫిలిప్, "నీ హృదయపూర్వకంగా విశ్వసిస్తే, మీరు నమ్మవచ్చు." మరియు అతను సమాధానం చెప్పాడు, "యేసు క్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను." (చట్టాలు 8:37) "అప్పుడు పేతురు వారితో పశ్చాత్తాపపడి, పాప విమోచన కొరకు మీలో ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు." (చట్టాలు 2:38) ఆత్మ యొక్క ప్రక్షాళనకు చిహ్నం "మరియు ఇప్పుడు నీవు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? లేచి, బాప్తిస్మం పొంది, ప్రభువు నామాన్ని ప్రార్థిస్తూ నీ పాపాలను కడుక్కో." (చట్టాలు 22:16) "మరియు అలాంటి [అంటే, అన్యాయస్థులు] మీలో కొందరు ఉన్నారు; కానీ మీరు పరిశుద్ధపరచబడ్డారు." (1 కొరింథీయులు 6:11) కొత్త సంబంధానికి చిహ్నం "కాబట్టి ఎవడైనను క్రీస్తునందు జీవించినట్లయితే, అతడు క్రొత్త జీవి; పాతవి గతించినవి; ఇదిగో, సమస్తము క్రొత్తగా మారెను,..." (II కొరింథీయులు 5:17) ఈ కొత్త సంబంధంలోనే బాప్టిజం దేవుని రాజ్యంలోకి ప్రవేశ ద్వారాన్ని సూచిస్తుంది. ఇది విశ్వాసం యొక్క రాజ కుటుంబంలోకి మరియు క్రీస్తు మరియు సెయింట్స్‌తో సోదరభావం యొక్క సోదరభావంలోకి కొత్త పుట్టుకను సూచిస్తుంది. నిష్కపటంగా బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి తాను విశ్వసించే ఈ బాహ్య చర్య ద్వారా వ్యక్తమవుతున్నాడు మరియు తన పాపాల గురించి పశ్చాత్తాపపడ్డాడు, దేవునికి విధేయత చూపాలని నిర్ణయించుకున్నాడు మరియు అతని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని ఆయనతో నిబంధనలు చేసుకున్నాడు. అతనికి బాప్టిజం ఇచ్చే మంత్రి, దేవుని కోసం పనిచేస్తూ, ఈ ప్రతిజ్ఞను అంగీకరిస్తాడు మరియు "కొత్త పుట్టుక" యొక్క ఆధ్యాత్మిక చిహ్నంగా ఈ చర్యను చేస్తాడు. అతను అభ్యర్థిని భూమిపై ఉన్న దేవుని చర్చి మరియు ఇంటిలోకి కూడా పరిచయం చేస్తాడు. "మీలో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినంత మంది క్రీస్తును ధరించారు." (గలతీయులు 3:27) స్టీవార్డ్‌షిప్ బాధ్యతల అంగీకారానికి చిహ్నం చర్చిలో సభ్యుడైన తర్వాత, జీవితంలోని అన్ని దశల్లో దేవునికి తన జవాబుదారీతనాన్ని అంగీకరించాడు. అంటే, అతను జీవితం మరియు ప్రవర్తన యొక్క అన్ని విషయాలలో-అవి ఆధ్యాత్మికం, భౌతిక శరీరం, సామాజిక సంబంధాలు, ఆర్థిక ఆశీర్వాదాలు లేదా భగవంతుని వ్యాయామంలో-తన సంరక్షణకు అప్పగించబడిన ప్రతిభకు సంబంధించిన అన్ని విషయాలలో అతను స్టీవార్డ్ అని అతను అంగీకరిస్తాడు. బాప్టిజం కోసం ముందస్తు అవసరాలు ఏమిటి? సువార్తకు సంబంధించిన సూచనలను స్వీకరించడం బాప్టిజం పొందాలనుకునే వ్యక్తి మొదట క్రీస్తు మరియు చర్చి యొక్క స్వభావానికి సంబంధించిన సూచనలను పొంది ఉండాలి. తాను ఆజ్ఞాపించిన వాటన్నింటిని మనుష్యులకు బోధించుటకు ఎంపిక చేయబడిన శిష్యులను పంపడం ద్వారా జాగ్రత్తగా ఏర్పాటు చేసాడు కాబట్టి యేసు ఇందులో ఖచ్చితంగా ఉన్నాడు. ఈ ఆజ్ఞలు లేఖనాల్లో నమోదు చేయబడ్డాయి మరియు బాప్టిజం వాటిలో ఒకటి. సరైన ఉపదేశాన్ని పొందడం చాలా ముఖ్యమైనది, అపొల్లో యొక్క అనధికార బోధనలు మరియు బాప్టిజంలను పౌలు తిరస్కరించాడు, అతను సరిగ్గా ఉపదేశించబడిన మరియు పరిచర్య చేసిన వారికి మళ్లీ బాప్తిస్మం ఇచ్చాడు. "వారు ఇది విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి." (అపొస్తలుల కార్యములు 19:5) చట్టాలు 18: 24-26 కూడా చూడండి; 19: 1.6. సరైన మరియు జాగ్రత్తగా ఉపదేశించడం చాలా అవసరం, ఎందుకంటే సరిగ్గా బోధించబడని వారు ఆధ్యాత్మిక నష్టానికి గురవుతారు మరియు హెబ్రీ సెయింట్స్ లాగా మారతారు, "...దేవుని ప్రవచనాల యొక్క మొదటి సూత్రాలేమిటో మీకు మరల బోధించవలసిన అవసరం ఉంది..." (హెబ్రీయులు 5:12) విశ్వాసం, లేదా నమ్మే హృదయం విశ్వాసం అనేది దేవుణ్ణి మరియు ఆయన మార్గాలను వెతకడానికి ఒకరిని ప్రేరేపించే ప్రేరణ, ఎందుకంటే అది లేకుండా ఎవరూ ఆయనను అంగీకరించలేరు. అవిశ్వాసి నిజమైన బాప్టిజం పొందలేడు, అది దేవుని చిత్తాన్ని చేయాలనే చిత్తశుద్ధిపై ఆధారపడి ఉండాలి: "నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును..." (మార్కు 16:15) యేసుక్రీస్తులో విశ్వాసం మరియు విశ్వాసం బాప్టిజం కొరకు అర్హతలు. ఇథియోపియన్ చెప్పాడు, "...చూడండి, ఇక్కడ నీరు ఉంది; బాప్తిస్మం తీసుకోవడానికి నాకు ఏది అడ్డు? మరియు ఫిలిప్, "నీ హృదయపూర్వకంగా విశ్వసిస్తే, నీవు చేయగలవు." (అపొస్తలుల కార్యములు 8:36, 37) ఫిలిప్ బాప్తిస్మం తీసుకునే ముందు ఈ నమ్మకాన్ని బోధించడానికి నమ్మకంగా ఉన్నాడని స్పష్టమవుతోంది. పశ్చాత్తాపం పశ్చాత్తాపం అంటే దేవుని ధర్మశాస్త్రానికి అనుగుణంగా లేని మార్గాల నుండి మారడం మరియు ఒకరి జీవితాన్ని ఆయన మార్గం వైపు మళ్లించడం. తప్పు చేసినందుకు విచారం వ్యక్తం చేయడం కంటే ఎక్కువ ఉంటుంది. తప్పును విడిచిపెట్టడానికి ఆచరణాత్మక దశలు రుజువు చేయబడాలి మరియు ఎవరైనా నిజంగా పశ్చాత్తాపపడ్డారని చెప్పడానికి ముందు, సాధ్యమైనంతవరకు చేసిన తప్పులకు తిరిగి చెల్లించాలి. దేవుడు పాపంతో రాజీపడడు, మరియు పాపం నుండి నిజంగా వైదొలగని మరియు సరిగ్గా జీవించాలనే ఉద్దేశ్యం యొక్క నిజాయితీకి ఎటువంటి రుజువు ఇవ్వని వారిని బాప్టిజంలో జాన్ అంగీకరించడు. "...ఓ, వైపర్ల తరం! రాబోయే కోపం నుండి పారిపోవాలని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?...పశ్చాత్తాపం కోసం కలిసే ఫలాలను తీసుకురండి." (మత్తయి 3:33, 35) "జాన్ అరణ్యంలో బాప్తిస్మం తీసుకున్నాడు మరియు పశ్చాత్తాపం యొక్క బాప్టిజం గురించి బోధించాడు ..." (మార్కు 1:3) "... పశ్చాత్తాపపడండి మరియు మీలో ప్రతి ఒక్కరూ బాప్టిజం పొందండి ..." (అపొస్తలుల కార్యములు 2:38) పశ్చాత్తాపం అనేది తక్కువ విలువైన వస్తువులను నిరంతరం విడిచిపెట్టి, ఆ తర్వాత క్రీస్తును అనుసరించడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించడం అని నిర్వచించబడింది. "...నీ విమోచకుడైన ప్రభువు శరీరములో మరణము పొందెను;...మనుష్యులందరు పశ్చాత్తాపపడి తనయొద్దకు వచ్చునట్లు." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 16:3c) "మరియు ఖచ్చితంగా ప్రతి మనిషి పశ్చాత్తాపపడాలి లేదా బాధపడాలి ..." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 18:1d). "... పురుషులందరూ పశ్చాత్తాపపడి బాప్టిజం పొందాలి, మరియు పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు; మరియు పిల్లలు బాధ్యత వహించే సంవత్సరాలకు చేరుకున్నారు." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 16:6d) గత పాపాలు మరియు ప్రస్తుత బలహీనతలను గ్రహించడం, పశ్చాత్తాపం మరియు సువార్త యొక్క శాసనాలకు అనుగుణంగా దేవుని రక్షణ నిబంధనలను అంగీకరించకుండా నిరోధించకూడదు. "...మీ పాపాలు ఎర్రగా ఉన్నా, అవి మంచులా తెల్లగా ఉంటాయి...." (యెషయా 1:18) సువార్త యొక్క శాసనాలను పాటించడం మరియు నిరంతర పశ్చాత్తాపం తన పాపపు అలవాట్లను అధిగమించడానికి సహాయం చేస్తుంది. పశ్చాత్తాపం అనేది ప్రతి జీవితకాలం మొత్తం వ్యాయామం చేయవలసిన విషయం. ఇది నిరంతర సూత్రం. బాప్టిజం ముందు పాప ఒప్పుకోలు అవసరమా? ఒకరికి మరొకరు అన్యాయం చేయడం జీవితంలో అరుదైన సంఘటన కాదు. ఆ వ్యక్తి పశ్చాత్తాపపడి క్షమాపణ కోరితే, అతనిని క్షమించమని మేము ఆదేశించాము. యేసు మనకు ఈ విధంగా ఉపదేశించాడు: "మీ సోదరుడు మీకు వ్యతిరేకంగా అపరాధం చేస్తే, అతనిని మందలించండి; మరియు అతను పశ్చాత్తాపపడితే, అతన్ని క్షమించు. మరియు అతను రోజుకు ఏడుసార్లు మీపై అపరాధం చేసి, ఏడుసార్లు మీ వైపు తిరిగితే, నేను పశ్చాత్తాపపడుతున్నాను, మీరు క్షమించాలి. మరియు అపొస్తలులు ప్రభువా, మా విశ్వాసమును పెంచుము అని అతనితో అన్నారు. (లూకా 17:3-5) ఇది పశ్చాత్తాపపడి మరియు ఒప్పుకునే వారి పట్ల దేవుని వైఖరిని సూచిస్తుంది. ఒప్పుకోలు సంస్కరించాలనే ఉద్దేశ్యానికి నిదర్శనం. పాపాల ఒప్పుకోలు కొత్త నిబంధనలో విశ్వాసానికి మారినవారి పశ్చాత్తాపం మరియు బాప్టిజంను గుర్తించింది. "మరియు నమ్మిన చాలా మంది వచ్చి, ఒప్పుకున్నారు మరియు వారి పనులను చూపించారు." ( అపొస్తలుల కార్యములు 19:18 ) ఈ ఒప్పుకోలు సూత్రం పాత కాలాల్లోలాగే నేటికీ దేవుని చర్చికి వర్తిస్తుంది. ఎవరికి ఒప్పుకోవాలి? "మరియు ఎవరైనా బహిరంగంగా కించపరచినట్లయితే, అతను లేదా ఆమె బహిరంగంగా మందలించబడతారు. . . ఎవరైనా రహస్యంగా నేరం చేస్తే, అతను లేదా ఆమె రహస్యంగా మందలించబడతారు, తద్వారా అతను లేదా ఆమె ఎవరితోనైనా రహస్యంగా ఒప్పుకునే అవకాశం ఉంటుంది. లేదా ఆమె మనస్తాపం చెందింది, మరియు దేవునికి..." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 42:23e, g) పైన పేర్కొన్నది దేవునికి మరియు మనస్తాపం చెందిన వారికి ఒప్పుకోలు చేయబడాలని సూచిస్తుంది మరియు ఒక నేరం గుంపుకు వ్యతిరేకంగా ఉంటే తప్ప, బహిరంగ ఒప్పుకోలు ద్వారా సమూహం నేరం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. క్రీస్తు చర్చిలో పూజారి ఒప్పుకోలు లేదు. ఈ విషయంలో సభ్యులకు మార్గనిర్దేశం చేసేందుకు పైన పేర్కొన్న షరతులను పాటించడం స్పష్టంగా సరిపోతుంది. వ్యక్తులు పాప భారాన్ని పంచుకోవాలని కోరుకోవచ్చు; మరియు అవసరమైన సందర్భంలో, సభ్యుడు లేదా నేరం చేసే సభ్యుడు, సలహా ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ యొక్క స్నేహాన్ని అందుబాటులో ఉంచుతారు. అలా అప్పగించబడినప్పుడు, అతని పిలుపుకు యోగ్యమైన ఏ మంత్రి విశ్వాసాన్ని తేలికగా చూడడు లేదా అవసరమైన వ్యక్తికి ద్రోహం చేయడు. బాప్టిజం ఎలా జరుగుతుంది? బాప్టిజం ఇమ్మర్షన్ ద్వారా నిర్వహించబడుతుంది, ఇది గ్రంధబద్ధంగా అధీకృత మోడ్ మాత్రమే. ఈ విషయంలో మన నమూనా కోసం మేము యేసు మరియు తొలి శిష్యుల ఉదాహరణను అనుసరిస్తాము. మన ఆధునిక వెర్షన్, ఇన్‌స్పైర్డ్ వెర్షన్‌ని తీసుకున్న అనువాదం, ఆచారాన్ని సూచించడానికి "బాప్టిజ్"ని ఉపయోగిస్తుంది, అంటే "మునిగిపోవడం". "మరియు యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, వెంటనే నీటిలో నుండి పైకి వెళ్ళాడు ..." (మత్తయి 3:45) "...యేసు గలిలయలోని నజరేత్ నుండి వచ్చి, జోర్డాన్‌లో యోహానుచేత బాప్తిస్మం తీసుకున్నాడు. మరియు వెంటనే నీళ్లలో నుండి పైకి వస్తున్నప్పుడు, ఆకాశం తెరుచుకోవడం మరియు ఆత్మ పావురంలా అతనిపైకి దిగడం చూశాడు." (మార్క్: 1:7, 8) బాప్టిజం పొందాలంటే, నీటిలోకి దిగి, నీటిలో మునిగి, ఆపై నీటి నుండి పైకి వెళ్లడం అవసరమని ఈ గ్రంథాలు చూపిస్తున్నాయి. కొత్త నిబంధన గ్రంథాలలో గుర్తించబడిన బాప్టిజం ప్రక్రియ బుక్ ఆఫ్ మార్మన్‌లో యేసు గురించి నమోదు చేయబడిన సూచనలను పోలి ఉంటుంది: "ఇదిగో, మీరు దిగి నీళ్లలో నిలబడి, నా పేరున వారికి బాప్తిస్మం ఇస్తారు." (III నీఫై 5:24) అధికార మంత్రి మాట్లాడవలసిన బాప్టిజం ప్రకటన "యేసుక్రీస్తుచే నియమించబడినందున, నేను మీకు తండ్రి మరియు కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమిస్తున్నాను, ఆమేన్." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 17:21) సిద్ధాంతం మరియు ఒడంబడికలలోని సూచన కొనసాగుతుంది: "అప్పుడు అతను అతనిని లేదా ఆమెను నీటిలో ముంచి, మళ్ళీ నీటి నుండి బయటకు వస్తాడు." (III నీఫై 5: 25, 26 చూడండి.) అందువలన, ఇమ్మర్షన్ ద్వారా, మా పాత జీవితం యొక్క మరణం మరియు ఖననం మరియు ఒక కొత్త మార్గం పునరుత్థానం యొక్క చిహ్నం పూర్తయింది, మా పశ్చాత్తాప విధేయత మరియు పాపం నుండి ప్రక్షాళన చిహ్నంగా; నిజానికి, పూర్తి పునరుత్పత్తి "క్రీస్తులో ఒక కొత్త మనిషి." ఎవరు బాప్టిజం ఇవ్వవచ్చు? బైబిల్ చరిత్రలో నమోదు చేయబడిన ప్రారంభ కాలాల నుండి, వెల్లడి చేయబడిన మతం యొక్క విధులు దేవుడు స్వయంగా ఎన్నుకున్న పురుషులకు కేటాయించిన ఆచారాలు మరియు వేడుకలను కలిగి ఉన్నాయి. దీనికి ఒక కారణం ఏమిటంటే, యోగ్యమైన వారిని దైవిక కుటుంబం మరియు గృహంలోకి చేర్చుకోవడం ద్వారా మనుష్యులను తనతో సన్నిహిత సంబంధంలోకి తీసుకురావాలని దేవుడు ఉద్దేశించాడు, దీని ద్వారా వారు దత్తత తీసుకోవడం ద్వారా క్రీస్తు అనే పేరును పొందుతారు. బాప్టిజం ద్వారా చర్చిలోకి ప్రవేశించిన వారికి అపొస్తలుడైన పాల్ వివరించిన నిజమైన శిష్యులు మరియు పరిశుద్ధుల స్థితి ఇది: "ఇప్పుడు మీరు ఇకపై అపరిచితులు మరియు విదేశీయులు కాదు, కానీ పరిశుద్ధులతో మరియు దేవుని ఇంటిలోని తోటి పౌరులు. . . ఈ కారణంగా నేను మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి నా మోకాళ్లను నమస్కరిస్తున్నాను, అతని కుటుంబం మొత్తం పరలోకంలో ఉంది. మరియు భూమి పేరు పెట్టబడింది,..." (ఎఫెసీయులు 2:19; 3:14, 15) దేవుడు ఎన్నుకున్న సేవకులకు ఇచ్చే అధికారాన్ని యాజకత్వం అంటారు. ఈ మంత్రులకు నిర్దిష్ట సూచనలు ఇవ్వబడ్డాయి మరియు వాటిని విస్మరించడానికి లేదా వారి ఉద్దేశాన్ని అధిగమించడానికి అధికారం లేదు. యేసు దేవుడు ప్రధాన యాజకునిగా ఎన్నుకోబడ్డాడని మరియు అర్చక పదవిని అలా ఎంపిక చేసుకున్న మనుష్యులు మాత్రమే భర్తీ చేయగలరని మనకు తెలియజేయబడింది. "మరియు అహరోను వలె దేవునిచే పిలువబడినవాడు తప్ప ఈ ఘనతను ఎవ్వరూ తనకు తానుగా తీసుకోడు." (హెబ్రీయులు 5:4) బాప్టిజం యొక్క ఆచారం అనేది దేవుని నుండి అర్చక పదవిని కలిగి ఉన్న వారిచే నిర్వహించబడకపోతే, దైవిక చట్టం యొక్క అనుమతితో నిర్వహించబడని ఒక శాసనం అని మేము వాదించాము. అధికారం యొక్క గొప్ప ప్రాముఖ్యత చర్చికి మోడెమ్ వెల్లడిలో సూచించబడింది, ఇది బాప్టిజం అనేది ఒక పెద్ద మరియు పూజారి యొక్క విధులలో ఒకటి అని మాకు తెలియజేస్తుంది. (సిద్ధాంతం మరియు ఒప్పందాలు 17:10 చూడండి). "...అయితే ఉపాధ్యాయులకు లేదా డీకన్‌లకు బాప్టిజం ఇవ్వడానికి అధికారం లేదు,..." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 17:11e) పరిశుద్ధాత్మ బాప్టిజం అంటే ఏమిటి? యేసు నీటి బాప్టిజం మరియు పరిశుద్ధాత్మ రెండింటినీ దాని లోతైన మరియు పూర్తి అర్థంలో, ఒక బాప్టిజం అని గుర్తించడానికి కారణం ఉంది. ఇది పునర్జన్మ సాధనంగా మనిషి యొక్క శరీరం మరియు ఆత్మ రెండింటికీ వర్తిస్తుంది. యేసు యొక్క గంభీరమైన ప్రకటన, "...నిజముగా, నిశ్చయముగా, నేను నీతో చెప్పుచున్నాను, ఒక వ్యక్తి నీటి వలన మరియు ఆత్మ వలన తప్ప, అతడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు." (జాన్ 3:5) పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజం నిజమైన విశ్వాసి జీవితంలో అత్యంత ముఖ్యమైన మరియు అవసరమైన అంశం అని లేఖనాల నుండి స్పష్టంగా తెలుస్తుంది. నీటి బాప్టిజం యొక్క బాహ్య నియమం దేవునికి సేవ చేయడానికి విశ్వాసి యొక్క ఒడంబడికకు చిహ్నంగా ఉంది, ఆత్మ యొక్క బాప్టిజం అనేది ఒడంబడికపై దేవుడు తన ముద్రను ఉంచడం మరియు బాప్టిజం ద్వారా చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో అతని వాటా: "... పశ్చాత్తాపపడి, మీలో ప్రతి ఒక్కరు బాప్తిస్మము పొందండి . . . మరియు మీరు పరిశుద్ధాత్మ బహుమతిని అందుకుంటారు." (చట్టాలు 2:38) వాస్తవానికి, ఆధ్యాత్మిక బాప్టిజం అనేది విశ్వాసిపై దేవుని శక్తి యొక్క దానం, దీని ద్వారా అతనితో ఒడంబడిక సంబంధం అమలులో ఉన్నట్లు ధృవీకరించబడింది మరియు కొన్నిసార్లు దీనిని పిలుస్తారు. "అభిషేకం." (II కొరింథీయులు 1:21, 22 చూడండి.) "ఏమైనప్పటికీ, అతను, సత్యం యొక్క ఆత్మ, వచ్చినప్పుడు, అతను మిమ్మల్ని అన్ని సత్యంలోకి నడిపిస్తాడు ..." (యోహాను 16:13) "అయితే ఆదరణకర్త, అనగా తండ్రి నా పేరున పంపబోయే పరిశుద్ధాత్మ, అతను మీకు అన్ని విషయాలు బోధిస్తాడు మరియు నేను మీతో చెప్పినవన్నీ మీకు జ్ఞాపకం చేసుకుంటాడు." (యోహాను 14:26) పరిశుద్ధాత్మ ఎలా పొందబడుతుంది? చేతులు వేయడం యొక్క శాసనం అనేది పరిశుద్ధాత్మ యొక్క నిర్ధారణకు అవసరమైన విధి. ఇది ప్రతీకాత్మకమైన ఆచారం; అధికారం యొక్క ప్రసాదం యొక్క సాధారణ వ్యక్తీకరణలో చేతులు ఉపయోగించబడతాయి. మానవ మనస్సుకు లోతైన సత్యాలను తెలియజేసే సాధనంగా దేవుడు నీటి వినియోగం మరియు సహవాసంలో భోజనం చేయడం వంటి జీవితంలోని సాధారణ అనుభవాలను తీసుకున్నాడు. చేతులు వేయడం అనేది దేవుడు తన శక్తిని ప్రసాదించడంలో మనం ఏమి అర్థం చేసుకుంటాడో నాటకీయంగా చూపుతుంది. ఈ ప్రశ్నకు చట్టాలు 8:14-17లో స్పష్టంగా సమాధానం ఇవ్వబడింది: "ఇప్పుడు యెరూషలేములో ఉన్న అపొస్తలులు షోమ్రోను దేవుని వాక్యాన్ని పొందారని విని, పేతురు మరియు యోహానులను వారి వద్దకు పంపారు; వారు దిగి వచ్చినప్పుడు, వారు పరిశుద్ధాత్మను పొందాలని వారి కొరకు ప్రార్థించారు. అయినప్పటికీ అతను వారిలో ఎవరిమీదా పడలేదు; వారు మాత్రమే ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.) తరువాత వారు వారిపై చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి." పరిశుద్ధాత్మ యొక్క ప్రసాదం కోసం ఎవరు చేతులు వేయవచ్చు? ఆధునిక వెల్లడి ఈ విషయంలో ప్రారంభ అభ్యాసానికి అనుగుణంగా ఉంది మరియు స్పష్టమైన సూచనలను ఇస్తుంది: "... లేఖనాల ప్రకారం అగ్ని మరియు పరిశుద్ధాత్మ బాప్టిజం కోసం చేతులు వేయడం ద్వారా బాప్టిజం ఇవ్వమని [పెద్దల] పిలుపు. . . మరియు చర్చిలో బాప్టిజం పొందిన వారిని ధృవీకరించడం." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 17:8b, c) మెల్కీసెడెక్ యాజకత్వాన్ని కలిగి ఉన్నవారు మాత్రమే మరొక వ్యక్తిపై పరిశుద్ధాత్మ బహుమతిని ధృవీకరించడానికి శాసనం కోసం చేతులు వేయవచ్చు. నిర్ధారణ ఎప్పుడు జరుగుతుంది? బాప్టిజం యొక్క ప్రాముఖ్యత మరియు చర్చిలో అతని సభ్యత్వం యొక్క అర్థం గురించి తెలియకుండా ఎవరూ చర్చిలోకి అంగీకరించకూడదు. అతను, అతని వయస్సు మరియు అభివృద్ధి ప్రకారం, స్టీవార్డ్‌షిప్ జీవితంలో ఆరోగ్యకరమైన ప్రారంభానికి అవసరమైన విధంగా చర్చి మరియు దాని ప్రయోజనాల గురించి పూర్తి అవగాహన ఇవ్వాలి. తొందరపాటు దీక్ష జరిగే చోట, కొత్త సభ్యునికి అందవలసిన అందం మరియు ఆశీర్వాదం చాలా వరకు పోతాయి. పరిశుద్ధాత్మ యొక్క పాత్ర మరియు పని గురించి ప్రత్యేక సూచన ఇవ్వబడాలి, తద్వారా అతను నిరీక్షణతో మరియు తెలివిగా పూర్తి ఒడంబడిక సంబంధంలోకి ప్రవేశించగలడు మరియు పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం చేయబడిన శక్తికి లొంగిపోగలడు. సిద్ధాంతం మరియు ఒడంబడికలు 17: 18b, cలో సభ్యులు చేతులు వేయడం మరియు ప్రభువు భోజనంలో పాల్గొనడం ద్వారా ధృవీకరించబడటానికి ముందు చర్చి యొక్క పనిలో పూర్తిగా బోధించబడాలని ఖచ్చితమైన ఆదేశం ఇవ్వబడింది: "పెద్దలు లేదా పూజారులు క్రీస్తు చర్చికి సంబంధించిన అన్ని విషయాలను వారి అవగాహనకు, మతకర్మలో పాల్గొనడానికి ముందు మరియు పెద్దల చేతులు వేయడం ద్వారా ధృవీకరించబడటానికి తగినంత సమయం ఉండాలి; తద్వారా అన్ని విషయాలు క్రమపద్ధతిలో చేయవచ్చు, మరియు సభ్యులు చర్చి ముందు మరియు పెద్దల ముందు కూడా, దైవిక నడక మరియు సంభాషణ ద్వారా, పవిత్ర గ్రంథాలకు సమ్మతమైన పనులు మరియు విశ్వాసం, పవిత్రతతో నడుచుకునేలా వారు దానికి అర్హులని తెలియజేస్తారు. ప్రభువు ముందు." "పెద్దలకు .. తగినంత సమయం ఉండాలి" అనేది హెచ్చరిక సందేశం. ఇవి ప్రభువు తన కోరికను తెలియజేయడానికి ఎంచుకున్న పదాలు. ఇది నిస్సందేహంగా సాధ్యమైనంత వరకు బాప్టిజం ముందు చేయాలి, ప్రతి శాసనం యొక్క ప్రాముఖ్యతను పూర్తిగా ప్రశంసించడానికి అనుమతించడానికి బాప్టిజం మరియు నిర్ధారణ మధ్య తగినంత విరామం ఇవ్వబడుతుంది. ఈ రెండు ఆర్డినెన్స్‌లను వేర్వేరు సేవలలో నిర్వహించడం మంచిది మరియు ప్రతి ఒక్కటి నిర్దిష్టమైన మరియు విచిత్రమైన ప్రాధాన్యతను మరింత పూర్తిగా ప్రదర్శించడానికి ఇది అనుమతిస్తుంది అని అనుభవం చూపింది. ప్రభువు పదాలను ఉపయోగిస్తాడు "తగినంత సమయం" బాప్టిజం మరియు నిర్ధారణ యొక్క శాసనాలను ప్లాన్ చేస్తున్నప్పుడు చర్చిలో సభ్యత్వం కోసం ప్రతి అభ్యర్థి స్వభావం, వయస్సు మరియు పరిస్థితులకు సంబంధించి మంత్రి తన వివేచన మరియు వివేకాన్ని ఉపయోగించాలని సూచిస్తుంది. "క్రీస్తు చర్చికి సంబంధించిన అన్ని విషయాలు" చర్చి సభ్యుని యొక్క అన్ని బాధ్యతలను కలిగి ఉంటుంది, ఫైనాన్షియల్ లా మరియు జియోనిక్ స్టీవార్డ్‌షిప్‌ల ఆదర్శంతో కూడిన ప్రాథమిక నమ్మకాలు మరియు అభ్యాసాలను అర్థం చేసుకోవడం మరియు చర్చిలో సభ్యత్వం కోరుకునే వ్యక్తి వయస్సు మరియు సామర్థ్యానికి తగిన గౌరవం ఇవ్వడం. అధ్యాయం 2 జియాన్, అంతిమ లక్ష్యం దీని ప్రారంభ న్యాయవాదులు ఇజ్రాయెల్ యొక్క ప్రవక్తలు మరియు ఆధ్యాత్మిక నాయకులు వారి ప్రజల ముందు ప్రభుత్వ ఆదర్శాన్ని కలిగి ఉన్నారు, ఇది దేవుడు తన ప్రజల మధ్యలో నివసిస్తున్నట్లు మరియు అతని రాజ్యం యొక్క వ్యవహారాలను న్యాయం మరియు సమానత్వంతో నిర్వహించినట్లు చిత్రీకరించింది. అతను వాస్తవానికి పరిపాలించవలసి ఉంది, ఎందుకంటే అతను మొదటగా జీవితంలోని అంతర్గత న్యాయస్థానాలలో పరిపాలిస్తాడు మరియు రోజువారీ జీవన సాధారణ వ్యవహారాలలో నీతి, న్యాయం మరియు సోదరభావం యొక్క మార్గాల్లో మనుష్యులను గెలుస్తాడు. ప్రభుత్వం యొక్క ఈ ఉన్నతమైన ఆలోచన పాత నిబంధనలో చాలాసార్లు వ్యక్తీకరించబడింది. చాలా మంది భక్తుడైన యూదులు భూమి యొక్క మారుమూలల వరకు కూడా నీతి జీవితం యొక్క పాలనగా ఉండే వరకు దేవుని ఆధిపత్యం విస్తరించబడే రోజు కోసం ఎదురుచూశారు. వారి ఆత్రుతలో, వారికి చాలా స్పష్టమైన ఆలోచన లేదు "స్వర్గరాజ్యం." ఇది ఒక కొత్త సామాజిక క్రమం అని వారు అంగీకరించారు, అయితే మరింత ఉత్సాహవంతులు ఈ ప్రవచనాలను అర్థం చేసుకుంటే, అవసరమైతే, జెరూసలేంలో దాని రాజధానితో బలవంతంగా స్థాపించబడిన భూసంబంధమైన రాజ్యాన్ని స్థాపించారు. ఈ వర్గంలోని ప్రజలు యేసును తమ రాజుగా చేసుకోవాలనుకున్నారు. యేసు అర్థాన్ని జోడిస్తుంది యేసు ప్రవక్తల మాటలను తీసుకొని, అర్థ సంపదను జోడించడానికి వాటిని పునర్నిర్మించాడు. యేసు రాజ్యానికి నిర్దిష్టమైన నిర్వచనాన్ని ఎన్నడూ ఇవ్వనప్పటికీ, అతను అనేక ఉపమానాలు మరియు పద చిత్రాల ద్వారా దాని లక్షణాలను వివరించాడు, వాటిని జాగ్రత్తగా మరియు ఒకదానికొకటి సంబంధించి అధ్యయనం చేసినప్పుడు మాత్రమే దాని అర్థం స్పష్టమవుతుంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనుషులు వెంట్రుకలు చీల్చుకుంటూ ఉండే వారి గురించి అధికారిక నిర్వచనాలలో అతను తన సందేశాన్ని తెలియజేయడానికి ప్రయత్నించలేదు. బదులుగా అతను అనేక ఆలోచనలను సూచించాడు, దానితో పాటు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు దేవుని రాజ్యానికి పోలికను కనుగొనవచ్చు. రాజ్యము భోజనంలో దాగివున్న పులిపిండి లాంటిదని ఆయన వారికి చెప్పాడు; దాచిన నిధి వంటి; ఒక వ్యాపారి మంచి ముత్యం కోసం వెతుకుతున్నట్లుగా, దానిని పొందేందుకు అతను తన ఇతర ఆస్తులన్నింటినీ అమ్ముతాడు; పెరుగుతున్న విత్తనం వంటిది; పది మంది కన్యల వలె, వారిలో ఐదుగురు తెలివైనవారు మరియు ఐదుగురు మూర్ఖులు. ఈ ఉపమానాలు ఏవీ రాజ్యం యొక్క అర్థాన్ని ముగించలేదు. అవన్నీ సత్యంలో కొంత భాగాన్ని కలిగి ఉంటాయి, మన ఆధ్యాత్మిక అనుభవాలను విస్తరింపజేయడంలో దీని గురించిన అవగాహన మరింత పూర్తిగా సాధించవచ్చు. ఆధునిక ప్రకటనలో రాజ్యం "... రాజ్యం యొక్క ఈ సువార్త ప్రపంచమంతటా, అన్ని దేశాలకు సాక్ష్యంగా ప్రకటించబడుతుంది, ఆపై అంతం వస్తుంది,..." (మత్తయి 24:32) మన చరిత్ర ప్రారంభం నుండి, లాటర్ డే సెయింట్స్ ఈ వాగ్దానం ఇప్పుడు నెరవేరబోతోందని మరియు యేసు క్రీస్తు యొక్క శేషాచల చర్చి యొక్క ప్రధాన కార్యాలలో ఒకటి భూమిపై దేవుని రాజ్యాన్ని నిర్మించడం అని విశ్వసిస్తున్నారు - లేదా జియాన్, మనం తరచుగా పిలుస్తాము. చర్చి యొక్క సంస్థ తర్వాత మొదటి నెలల్లో, "జియాన్" అనే పదం దాదాపుగా "చర్చ్"కి పర్యాయపదంగా పరిగణించబడింది, అయినప్పటికీ, అది నిస్సందేహంగా గొప్ప చర్చి గురించి ప్రవచనాత్మకమైనది. జూన్ 1830లో, జోసెఫ్ స్మిత్, జూనియర్, పవిత్ర గ్రంథాలను ప్రేరేపిత దిద్దుబాటు చేస్తున్నప్పుడు, హనోక్ ప్రవచనం నుండి ఒక సారాన్ని అందుకున్నాడు, ఇది జియాన్ వైపు ఉద్యమానికి గొప్ప ప్రేరణనిచ్చింది. ఈ కథనం హనోక్, "ఆదాము నుండి ఏడవది" (యూదా 14) తన అనుచరులను ఒక దేశానికి నడిపించాడు, అక్కడ వారి నీతి కారణంగా వారు ప్రత్యేకంగా ప్రభువుచే ఆశీర్వదించబడ్డారు. ఇక్కడ ప్రభువు వచ్చి తన ప్రజలతో నివసించాడు "సియోను అని పిలిచారు, ఎందుకంటే వారు ఒకే హృదయం మరియు ఒకే మనస్సు కలిగి ఉన్నారు, మరియు నీతిలో నివసించారు; మరియు వారిలో పేదవారు లేరు,..." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 36:2). కాలక్రమేణా, హనోకు మరియు అతని ప్రజలు సీయోను అని పిలువబడే ఒక నగరాన్ని నిర్మించారు, అది పవిత్ర నగరం, ఇది నగరం "కాలక్రమంలో స్వర్గంలోకి తీసుకోబడింది." (ఆదికాండము 7:27) అంత్యదినాల్లో ప్రభువు మళ్లీ భూమిపైకి వస్తాడని ఈ ప్రకటన మరింతగా సూచించింది. ప్రపంచ విముక్తి యొక్క కొత్త భావన ఈ మరియు ఇతర ప్రవచనాల వెలుగులో, సెయింట్స్ పాత లేఖనాల వైపు మళ్లారు మరియు కొత్త అవగాహనతో వాటిని చదివారు. క్రమంగా, వారు వ్యక్తిగత మోక్షానికి సంబంధించిన ఆలోచనను ప్రపంచ విమోచన ఆలోచనలో విలీనం చేయాలని మరియు ఇతరుల జీవితాల్లోకి దేవుని పాలనను పొడిగించడం కాకుండా తన స్వంత రక్షణ గురించి ఆలోచించకూడదని వారు గుర్తించారు. అయినప్పటికీ, పశ్చిమ న్యూయార్క్ నుండి ఒహియోకు మరియు తరువాత సెయింట్స్‌ను తరలించాలని పిలుపునిచ్చే ప్రకటనలు లేకుంటే, జియాన్ యొక్క ఆదర్శం, దీనిని పిలవబడినట్లుగా, చర్చి జీవితంలో ప్రబలంగా ఉండకపోవచ్చు. మిస్సౌరీలో "న్యూ జెరూసలేం" కోసం సెంటర్ ప్లేస్ ఉంది. ఒక నిర్దిష్ట ప్రదేశంలో కేంద్రీకృతమై, సాహిత్యపరమైన సామాజిక క్రమాన్ని స్థాపించడానికి చర్చి కట్టుబడి ఉండటంతో, రాజ్యం యొక్క సువార్త నిజమైన సవాలును అందించింది. ఇది ఒక ప్రధాన మిషనరీ అంశం మరియు చాలా మంది మతమార్పిడులను ఆకర్షించింది. రివిలేషన్ మరియు అనుభవం యొక్క సంతులనం "గేదరింగ్" యొక్క సూత్రాలు మరియు ప్రక్రియపై వివిధ వెల్లడిలు గణనీయమైన వెలుగునిచ్చాయి. నేర్చుకోవలసినది చాలా ఉంది, అయితే ఇది బహిర్గతం యొక్క పరిశీలన నుండి మాత్రమే పొందలేము మరియు దీనికి కొంత అనుభవం అవసరం. హనోకు యొక్క సీయోను అనేక సంవత్సరాలుగా క్రమంగా పరిపక్వం చెందినట్లే, ఈ రోజుల్లో ఉన్న సీయోను బాగా చేయడంలో సహనంతో కొనసాగడం ద్వారా సాధించబడుతుంది. జియోనిక్ ఎంటర్‌ప్రైజ్‌లో నిమగ్నమైన పురుషులు మానవులు మరియు అతిగా నొక్కిచెప్పే ప్రమాదాలకు గురవుతారు. కొందరు మతమార్పిడులను గెలవడానికి ఆసక్తిగా ఉన్నారు మరియు ఇంకా నిజమైన జియోన్ బిల్డింగ్ మెటీరియల్ లేని వారికి బాప్టిజం ఇవ్వవచ్చు. మరికొందరు రాజ్యాన్ని నిర్మించడానికి ఎంతగానో ఆత్రుతగా ఉన్నారు, అది ఒక పెద్ద మిషనరీ ప్రాజెక్ట్ అని మర్చిపోతారు మరియు దాని ప్రకారం, తమ మిషనరీ స్ఫూర్తిని మరియు పనిని కొనసాగించడంలో విఫలమవుతారు. రాజ్య నిర్మాణం అనేది చాలా ఆచరణాత్మకమైన వ్యవహారం అనే ఆలోచనలో కొందరు మునిగిపోయారు మరియు వారు సహవాసం, సానుభూతి, పరస్పర అవగాహన మరియు ఆసక్తిగల సహకారం యొక్క స్ఫూర్తిని పెంపొందించడం కంటే ఆర్థిక మరియు రాజకీయ సర్దుబాట్ల గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. కానీ సీయోను యొక్క నిరీక్షణ కొనసాగుతుంది మరియు ఉత్సాహవంతులు మరియు ఆధారపడదగిన వారి కలయిక ఫలిస్తుంది. రాజ్యం యొక్క ఆధ్యాత్మిక స్వభావం దేవుని రాజ్యం కేవలం విధానాలు లేదా కార్యక్రమాలు లేదా చట్టాలను కలిగి ఉండదు, కానీ వ్యక్తులను కలిగి ఉంటుంది. కాబట్టి రాజ్య నిర్మాణం వైపు మొదటి ఉద్యమం పురుషుల మనస్సులను మరియు హృదయాలను మరియు పాత్రలను మార్చడం. ఇలా చేయడం వలన, కార్యక్రమాలు మరియు విధానాలు అవసరం మరియు ముఖ్యమైనవిగా మారతాయి, అయితే ఇది పూర్తయ్యే వరకు, వాటి ప్రాముఖ్యత పూర్తిగా ద్వితీయంగా ఉంటుంది. సమాజం కోసం ఒక కార్యక్రమాన్ని నిర్మించడంలో సేకరణ వైపు మొదటి అడుగు లేదు. మొదటి మెట్టు యేసుక్రీస్తు పట్ల వ్యక్తిగత నిబద్ధతకు పురుషులను గెలుచుకోవడం. ఈ దశను మనం "మార్పిడి" అని పిలుస్తాము. పరివర్తన అనేది తీర్పు దినం లాంటి అనుభవం, ఎందుకంటే మనిషి తన దేవుడిని గర్వం లేకుండా మరియు నెపం లేకుండా ఎదుర్కోవాలి. కానీ అతని మార్పిడి యొక్క వాస్తవిక పరీక్ష అతని తోటి వ్యక్తులతో అతని సంబంధాలపై దాని ప్రభావం. అతని స్వంత మోక్షానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలలో ఒకటి, అతను ఇప్పుడు చర్చి యొక్క పనితీరులో భాగంగా మారడం ద్వారా సమాజానికి తన బాధ్యతను గుర్తించాడు. ఇప్పుడు అతను విధానాలు మరియు కార్యక్రమాలు మరియు చట్టాలకు సంబంధించినది, కానీ ఇవి అంతం చేయడానికి మార్గాలు; మరియు ముగింపు అనేది దేవుని ప్రేమ యొక్క వ్యక్తీకరణ, అతను తన స్వంత ఆత్మలో అనుభూతి చెందుతాడు మరియు అతని జీవిత ప్రణాళికలో ఇతర వ్యక్తులను చేర్చమని అతనిని ప్రేరేపించాడు. దేవుని రాజ్యాన్ని నిర్మించడం ద్వారా సమాజాన్ని విమోచించే క్రీస్తులాంటి పద్ధతి. ఈ రాజ్యం-నిర్మాణం వ్యక్తిగత వ్యక్తుల మార్పిడితో ప్రారంభమవుతుంది. ఇది హృదయ మార్పు మరియు మనస్సు యొక్క ఉద్ధరణ మరియు సంకల్పం యొక్క దారి మళ్లింపులో దాని మూలాన్ని కలిగి ఉంది, దీనిని మనం "కొత్త జన్మ" అని పిలుస్తాము. కానీ అది వ్యక్తి హృదయంలో ప్రారంభమైనప్పుడు, అది వెంటనే పురుషులందరినీ చేర్చడానికి చేరుకుంటుంది. పురుషులు తమ సోదరులతో సరైన సంబంధాలలో జీవించే కొత్త జీవన క్రమంలో ఇది వ్యక్తీకరణను కనుగొంటుంది, ఎందుకంటే వారు తమ ఉమ్మడి పితృత్వం యొక్క డిమాండ్లకు ప్రతిస్పందిస్తారు. జియాన్, కొత్త సృష్టి దేవుని రాజ్యాన్ని నిర్మించడం అనేది జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ కార్పొరేట్ లైఫ్ యొక్క శేష చర్చి యొక్క నియంత్రణ లక్ష్యం. ఈ రాజ్యము ఇంతకు మునుపు పోయిన దానికంటే భిన్నమైనది. ఇది పరిశ్రమ, పొదుపు మరియు హస్తకళలో ఆనందం వంటి ప్రస్తుత ప్రపంచ క్రమంలో అత్యుత్తమ విలువలను స్వాధీనం చేసుకుంటుంది, అయితే రాజ్యం కొత్త స్ఫూర్తితో కొత్త సృష్టి మరియు కొత్త అవగాహన ద్వారా జ్ఞానోదయం అవుతుంది. ఈ రాజ్యాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న చర్చి సభ్యునిగా, దాని అభివృద్ధికి తోడ్పడే కార్యకలాపాలలో పాల్గొనమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ పుస్తకంలోని ఇతర అధ్యాయాలు మీరు తెలుసుకోవలసిన మరియు ఆచరించవలసిన ముఖ్యమైన సూత్రాలను నొక్కి చెబుతాయి. అధ్యాయం 3 ది స్టాండర్డ్స్ ఆఫ్ సెయింట్‌హుడ్ చర్చి యొక్క ఉద్దేశ్యం వ్యక్తిగత మరియు సామాజిక నీతి ప్రమాణాలపై నిర్మించబడిన వ్యక్తుల సంఘాన్ని ఏర్పాటు చేయడం. ఇది ఒక ఆదర్శం, అయితే ఈ లక్ష్యం ప్రపంచానికి స్పష్టంగా కనిపించాలంటే శిష్యుని ప్రయాణం ప్రారంభంలోనే కొన్ని ప్రాథమిక ప్రమాణాలను గుర్తించాలి. ఈ సాక్షిని రద్దు చేయకుండా ఉండాలంటే సభ్యత్వం కోసం కొన్ని ప్రమాణాలు తప్పక సాధించాలి. మెంబర్‌షిప్‌ను కలిగి ఉన్నప్పుడు మనం సబ్‌స్క్రయిబ్ చేసుకోవాల్సిన కొన్ని ఆమోదించబడిన ప్రమాణాలు క్రిందివి. "నిజాయితీగా, సత్యంగా, పవిత్రంగా, దయతో, సత్ప్రవర్తనతో, మనుష్యులందరికీ మేలు చేయాలని మేము విశ్వసిస్తాము; నిజానికి, మేము పౌలు యొక్క ఉపదేశాన్ని అనుసరిస్తామని చెప్పవచ్చు - మేము అన్నిటినీ విశ్వసిస్తాము, మేము అన్నిటినీ ఆశిస్తున్నాము, మేము చాలా భరించాము. విషయాలు, మరియు అన్నిటినీ సహించగలమని ఆశిస్తున్నాము. సద్గుణమైన, మనోహరమైన, లేదా మంచి నివేదిక లేదా ప్రశంసనీయమైన ఏదైనా ఉంటే, మేము వీటిని వెతుకుతాము." – 'వెంట్‌వర్త్ లెటర్' నుండి సారాంశం, టైమ్స్ అండ్ సీజన్స్, వాల్యూం. 3, p. 710. ప్రమాణాలు ఏమిటి? ఒక సెయింట్ ద్వారా సువార్త దయలను పెంపొందించాడు "...అన్ని శ్రద్ధను ఇస్తూ, మీ విశ్వాసానికి పుణ్యాన్ని; మరియు ధర్మానికి, జ్ఞానానికి; మరియు జ్ఞానానికి, నిగ్రహానికి; మరియు నిగ్రహానికి, సహనానికి; మరియు సహనానికి, దైవభక్తికి; మరియు దైవభక్తికి, సోదర దయకు; మరియు సోదర దయకు, దాతృత్వానికి జోడించండి. ఇవి మీలో ఉండి, విస్తారంగా ఉంటే, మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానంలో మీరు వంధ్యులుగానీ ఫలించనివారుగానీ ఉండకుండా ఉంటారు.” (II పీటర్ 1:5-8) ఒక సెయింట్ ఆలోచన, మాటలు మరియు పనిలో శుభ్రంగా ఉంటాడు ఈ విషయాల్లో మచ్చ లేకుండా ఉండాలనే లక్ష్యం చాలా అవసరం. సామాజిక ప్రపంచం యొక్క శరీరానుసారంగా రూపొందించబడిన నైతిక రాజీలను మినహాయించటానికి హృదయం మరియు మనస్సు దైవిక దృష్టితో నిండి ఉండటం దీనికి అవసరం. మరో మాటలో చెప్పాలంటే, సభ్యుని యొక్క నైతిక ప్రమాణం నిందకు మించి ఉండాలి. ఒక సెయింట్ ఈజ్ సిన్సియర్ అండ్ హానెస్ట్ మతపరమైన జీవితం చిత్తశుద్ధి, సమగ్రత మరియు నిజాయితీతో పాతుకుపోవాలి. మంచి పనులు హృదయపూర్వక హృదయం నుండి జరగాలి, ప్రశంసలు లేదా గౌరవం కోసం కాదు. సాధువు యొక్క మాట అతని బంధం వలె మంచిదై ఉండాలి. అతను వ్యాపార వ్యవహారాలలో, స్నేహపూర్వక సంబంధాలలో మరియు అన్ని ఇతర సామాజిక సంబంధాలలో నిజాయితీగా ఉండాలి. అతను దేవునితో నిజాయితీగా ఉండాలి. "ప్రభువు దృష్టిలో మాత్రమే కాదు, మనుష్యుల దృష్టిలో కూడా నిజాయితీగల వాటిని అందించడం." (2 కొరింథీయులు 8:21) ఒక సెయింట్ ఉదారంగా ఉన్నాడు సహనం మరియు విశాల హృదయం పవిత్రత యొక్క ముఖ్యమైన లక్షణాలు కాబట్టి ఒక సాధువు ఇతరుల పట్ల ఉదార వైఖరిని పెంపొందించుకోవాలి. ద్వేషం, ద్వేషం, అసూయ లేదా పగకు హృదయంలో స్థానం ఇవ్వకూడదు. అవసరంలో ఉన్నవారి పట్ల ఔదార్యం, యోగ్యులుగా కనిపించే వారికే పరిమితం కాకూడదు. సంక్షిప్తంగా, "రెండవ మైలు" సూత్రం దాతృత్వంతో పాలించాలి. ఒక సెయింట్ ఈజ్ బ్రదర్లీ రంగు, మతం, దేశం లేదా సామాజిక తరగతి మధ్య వివక్ష చూపని ఇతరుల పట్ల వైఖరి నిరూపించబడాలి. సమస్త మానవాళి పట్ల ప్రేమ సాధు జీవితానికి ప్రమాణంగా ఉండాలి. ఒక సెయింట్ మంచి పౌరుడు సాధువు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఉండాలి. చర్చిలో మంచి స్థితిలో ఉండటం కూడా విలువైన పౌరుని హామీ. రాష్ట్ర లేదా జాతీయ పౌరసత్వం ద్వారా మనపై ఉంచబడిన బాధ్యతలను మనస్సాక్షితో అంగీకరించడం సెయింట్స్‌పై తప్పనిసరి. ఒక సెయింట్ ఉపయోగకరమైన జీవితాన్ని గడుపుతాడు సెయింట్ ఉపయోగకరమైన వృత్తులలో నిమగ్నమై ఉండాలని భావిస్తున్నారు, ఇది సెయింట్‌హుడ్ యొక్క అన్ని ఇతర ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి, ఇది భూమిపై జియోన్ నిర్మాణాన్ని మెరుగుపరిచే స్టీవార్డ్‌షిప్ నైపుణ్యాలు మరియు బాధ్యతల పూర్తి వినియోగానికి దారి తీస్తుంది. ఒక సెయింట్ పొదుపుగా ఉంటాడు ఒక మంచి సెయింట్ తన బాధ్యతను శ్రద్ధతో మరియు పవిత్రతతో స్టీవార్డ్‌గా నిర్వర్తిస్తాడు. ఈ విజయానికి ఆర్థిక చట్టంలోని అధ్యాయంలో ఉన్న విషయాల పట్ల జాగ్రత్తగా మరియు అధ్యయనం చేయడం కంటే మెరుగైన మార్గదర్శకం లేదు. ఒక సాధువు తన విశ్రాంతి సమయాన్ని సృజనాత్మకంగా గడుపుతాడు సెయింట్‌హుడ్ ప్రమాణాల ప్రకారం, ఉపయోగకరమైన మరియు నిర్మాణాత్మక స్వభావం ఉన్న వృత్తిని ఎంచుకోవడంతోపాటు, సభ్యులు విశ్రాంతి సమయాన్ని ఉపయోగించడాన్ని కూడా అధ్యయనం చేయాలి, తద్వారా సమయం యొక్క సారథ్యం గుర్తించబడుతుంది. వినోదం నిజంగా పునర్-సృజనాత్మకంగా ఉండాలి కాబట్టి, ఈ విషయం క్రీస్తు ప్రమాణాలను చేరుకునే వారందరూ సాధారణ అధ్యయనం కంటే ఎక్కువగా పొందాలి. ఒక సెయింట్ ఉన్నత స్థాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు వర్డ్ ఆఫ్ విస్డమ్ (సిద్ధాంతము మరియు ఒడంబడికలలోని సెక్షన్ 86) భౌతిక మరియు మానసిక శ్రేయస్సు విషయంలో దేవుని అవసరాలకు సూచన. ప్రతి సభ్యుడు ఈ సలహా మరియు సలహాను అధ్యయనం చేయడానికి మరియు దాని సూత్రాలను అన్వయించడానికి ప్రయత్నించమని ఆహ్వానించబడ్డారు. ఇందులో ఏకపక్ష సూచన లేదు, కానీ ఒకరి శరీరం ఆత్మ యొక్క ఉపయోగకరమైన సేవకుడిగా ఉండాలంటే దాని సలహా యొక్క ఆత్మను అర్థం చేసుకోవాలి. ఒక సెయింట్ అలవాటు-ఫార్మింగ్ డ్రగ్స్ వాడకాన్ని నివారిస్తుంది సెయింట్‌హుడ్ యొక్క ప్రమాణాలు మద్యం, పొగాకు లేదా ఇతర మాదకద్రవ్యాల వినియోగాన్ని నిరోధించాయి, ఆ విధంగా మునిగిపోయే వారు దైవిక ఉద్దేశ్యంతో ఉద్దేశించిన దానికంటే తక్కువ మానసిక మరియు శారీరక ప్రమాణాలతో జీవిస్తున్నారు. ఇతర వ్యక్తిగత మరియు సామాజిక అలవాట్లను కూడా అదే ప్రాతిపదికన అంచనా వేయాలి మరియు జీవితంలోని గొప్ప ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని విషయాలలో నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. ఒక సెయింట్ వివాహం యొక్క పవిత్రతను గౌరవిస్తాడు వివాహ బంధంలో చర్చి యొక్క ప్రమాణం అత్యున్నతమైన క్రీస్తులాంటి సూత్రం. లేటర్ డే సెయింట్ బోధన మరియు అభ్యాసం యొక్క ప్రాథమిక భావన, ఏకస్వామ్య వివాహం, స్త్రీ మరియు పురుషుల మధ్య మాత్రమే మంజూరు చేయబడుతుంది, దానిని నిశితంగా పాటించాలి. సభ్యులు సెయింట్‌లీ హోమ్ యొక్క పవిత్రతను మాట మరియు చేతల ద్వారా సమర్థించడం మరియు దానిని నిర్వహించడానికి అన్ని శ్రద్ధలతో ప్రయత్నించడం చాలా ముఖ్యమైనది. చర్చి యొక్క ఆరాధన మరియు ఇతర కార్యకలాపాలలో ఒక సెయింట్ క్రమం తప్పకుండా భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. అధ్యాయం 4 చూడండి. ఒక సెయింట్ లార్డ్స్ సప్పర్‌ను పాటించడంలో విఫలం కాకుండా ఉంటాడని భావిస్తున్నారు. అధ్యాయం 5 చూడండి. ఒక సెయింట్ తన బహుమతులు మరియు అవకాశాల ప్రకారం చర్చి యొక్క పనిలో పాల్గొనాలని భావిస్తున్నారు. అధ్యాయం 6 చూడండి. ఒక సెయింట్ దేవుడు తనను వర్ధిల్లుతున్నందున చర్చి నిధులకు తన వాటాను అందించాలని భావిస్తున్నారు. 11వ అధ్యాయం చూడండి. ఒక సెయింట్ మంచి పఠన ప్రమాణాన్ని కొనసాగించాలి. "ది హస్టెనింగ్ టైమ్స్" మరియు ఇతర చర్చి పత్రికలు ప్రతి చర్చి సభ్యుల సాధారణ పఠనంలో చోటును పొందాలి. ఒక సెయింట్ వ్యక్తిగత మరియు కుటుంబ ఆరాధనల కోసం ప్లాన్ చేయాలి మరియు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి. 3వ అధ్యాయం చివరిలో ఉన్న కుటుంబ ఆరాధన విభాగం చూడండి. ఈ ప్రమాణాలను నిర్ధారించడానికి ఏ అధికారిక చర్యలు తీసుకోబడ్డాయి? చర్చిలో సభ్యుడిగా మారడానికి జీవిత యోగ్యతకు రుజువు ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్లయితే, సభ్యునిగా ఒకరి అధికారాలను నిలుపుకోవడానికి ఆ ప్రమాణాన్ని కొనసాగించడం మరియు పెంచడం అవసరం. (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 17: 7 చూడండి.) సెయింట్‌హుడ్ యొక్క ప్రమాణాలను మెచ్చుకోవడంలో విఫలమైతే, చెడ్డపేరు తెచ్చుకున్న వారి వల్ల జరిగే నష్టం నుండి దాని సభ్యులను రక్షించడానికి చర్చి చర్య తీసుకోవలసి వస్తుంది. అటువంటి పరిస్థితులలో తీసుకోబడిన వాస్తవ చర్యలు: మొదటిది, గుంపు లేదా ప్రాంతం యొక్క అడ్మినిస్ట్రేటివ్ అధికారి పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణను తీసుకురావడానికి నేరస్థుడితో దయతో పనిచేయడానికి ఉపాధ్యాయుడిని లేదా ఇతర అధికారిని నియమించడం; రెండవది, ఇది విఫలమైతే, కేసు విచారణ కోసం కోర్టును నియమించడం మరియు తీర్పు ఇవ్వడం. ఆమోదించబడిన ప్రమాణానికి వ్యతిరేకంగా నేరానికి పాల్పడినట్లు నిర్ధారించబడితే, నిర్దిష్ట పరిహారం అవసరం కావచ్చు మరియు అత్యంత తీవ్రమైన పరిస్థితులలో, చర్చి నుండి బహిష్కరణకు ఆదేశించబడవచ్చు. చర్చి చర్యకు ఏ పాపాలు కారణమవుతాయి? చర్చి సభ్యులు ఇంతవరకు సెయింట్‌గా జీవించాలనే వారి పిలుపును మరచిపోయి, అనైతిక ప్రవర్తనకు (ఉదా. వ్యభిచారం, మద్యపానం, దొంగతనం మరియు బంధువుల పాపాలు) దోషులుగా మారినట్లయితే, చర్చి ద్వారా ఖచ్చితమైన చర్య తీసుకోవాలి. ఈ విధంగా దోషులుగా తేలిన వారందరికీ పశ్చాత్తాపం మరియు సర్దుబాటు తప్పనిసరి. మొదటి నేరానికి, పశ్చాత్తాపాన్ని కోర్టు తగినంతగా పరిగణించవచ్చు. అయితే, పునరావృతం లేదా ప్రవర్తనలో లోపాలు ఫెలోషిప్ నుండి బహిష్కరణకు దారితీయవచ్చు. ది రుణ ఒప్పందం సహేతుకమైన సామర్థ్యం లేకుండా ఒకరి బాధ్యతను నెరవేర్చడం అనైతికం మరియు చర్చి అలా వ్యవహరించే వ్యక్తి యొక్క సభ్యత్వాన్ని సమర్థించదు. ఒకరి చట్టబద్ధమైన బాధ్యతలను నెరవేర్చడానికి నిరాకరించడం, అలా చేయగల సామర్థ్యం ఉన్న చోట, చర్చి చర్య యొక్క అంశంగా మారవచ్చు, తద్వారా సభ్యుల అధికారాలను ప్రమాదంలో పడేస్తుంది. తాగుడు సెయింట్ జీవిత ప్రమాణాలకు అనుగుణంగా లేదు మరియు ఈ విషయంలో చర్చి చాలా కఠినంగా ఉంటుంది. మత్తు మరియు స్ట్రాంగ్ డ్రింక్ వినియోగంలో మునిగితేలుతున్న సభ్యులెవరూ మంచి స్థితిలో ఉండరు. ఈ ప్రవర్తన రుజువు అయిన చోట, చర్చి పేరు మరియు దాని సభ్యుల పాత్ర గురించి చెడుగా మాట్లాడకుండా పరిపాలనా అధికారులు చర్య తీసుకోవాలి. కు చెడు రూపాన్ని నివారించండి క్రీస్తు మరియు అతని చర్చి పేరుకు సంబంధించి ప్రతి సభ్యుని యొక్క బాధ్యత. చర్చి మరియు సమాజం అపఖ్యాతి పాలయ్యే పరిస్థితులు ఉన్న చోట, పాపపు సంబంధాలకు సంబంధించి ఎటువంటి నిశ్చయాత్మకమైన సాక్ష్యం లేనప్పటికీ, కారణాన్ని తొలగించడం ద్వారా అమాయకత్వం లేదా పశ్చాత్తాపాన్ని రుజువు చేయడానికి చర్చి సభ్యుడు అవసరం. అలా చేయని చోట, అలా విఫలమైన వారితో చర్చి దానిలోని ఆర్టికల్స్ మరియు ఒడంబడికలకు అవసరమైన విధంగా వ్యవహరించవచ్చు. చర్చి ద్వారా తీసుకోబడే అటువంటి క్రమశిక్షణా చర్య ఏదైనా శిక్షాత్మకంగా రూపొందించబడలేదని అతిగా నొక్కి చెప్పలేము, అయితే అన్ని సందర్భాల్లో పడిపోయిన వారిని తిరిగి పొందేందుకు మరియు క్రీస్తులాంటి ప్రమాణాల సాక్షిని రక్షించడానికి మరియు సమర్థించడానికి ఉద్దేశించబడింది. సంఘంలో తన మంచి ప్రభావాన్ని కాపాడుకోవడానికి చర్చికి వేరే మార్గం లేదు. ఉదాహరణకు, అబద్ధం లేదా వెక్కిరించడం, అలాగే పైన పేర్కొన్న విషయాలు చాలా విఘాతం కలిగిస్తాయి మరియు చర్చి చర్యకు దారితీయవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, సభ్యత్వం, అన్ని సమయాలలో మరియు అన్ని ప్రదేశాలలో, చర్చి యొక్క ప్రమాణాలు యేసు క్రీస్తు యొక్క ప్రమాణాలు అని గుర్తుంచుకోవాలి. చర్చి చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని దాని పేరుపై అసూయపడుతుంది మరియు దాని ఫెలోషిప్‌లోకి ప్రవేశించే వారందరికీ ఉన్నతంగా ఉండేలా నైతికంగా మరియు ఆధ్యాత్మికంగా కట్టుబడి ఉంది. నేను వ్యక్తిగత ఇబ్బందులను ఎలా సర్దుబాటు చేయాలి? మన ప్రస్తుత బలహీనత మరియు మానవత్వంలో చర్చి సభ్యుల మధ్య వ్యక్తిగత స్వభావం యొక్క ఇబ్బందులు తలెత్తడం అనివార్యం. ఈ చర్చిలో ఎటువంటి మినహాయింపు లేదు, ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పనిచేస్తున్నారు మరియు ఒకరికొకరు నివసిస్తున్నారు, ఘర్షణ లేదా అపార్థం ఏర్పడే అవకాశం ఉంది. శాంతితో కలిసి జీవించే కళ అనేది ఈ రోజుల్లో, వ్యక్తుల యొక్క చిన్న సమూహాలలో మరియు అంతర్జాతీయ సంబంధాల ప్రపంచ రంగంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇటీవలి సంవత్సరాలలో సంభవించే ప్రధాన జాతీయ విపత్తులను భవిష్యత్తులో నివారించాలంటే, ఫెలోషిప్ కళ పరిపూర్ణంగా ఉండాలి. ఈ సూత్రాలను ప్రకటించడం మరియు ప్రదర్శించడం చర్చి మరియు దాని సభ్యుల విధి. కాబట్టి, సువార్త, చర్చి ద్వారా, సామాజిక సర్దుబాటు కోసం ఆదర్శాలు మరియు సూత్రాలను ఏర్పాటు చేసింది. "భూమిపై శాంతి" అనే సందేశం యొక్క సాక్షి నిజం కావాలంటే, చర్చి సభ్యులు ఉన్నత స్థాయి సహవాసాన్ని కొనసాగించడం చాలా అవసరం. స్క్రిప్చర్ యొక్క ఈ పదాలు చూపినట్లుగా, చర్చి సభ్యుల మధ్య శాంతి చాలా ముఖ్యమైనదని యేసు నొక్కిచెప్పాడు: "...నీ సోదరుడు నీకు వ్యతిరేకంగా అపరాధం చేస్తే, వెళ్లి అతని తప్పును అతనికి చెప్పండి; అతను మీ మాట వింటే, మీరు మీ సోదరుడిని సంపాదించారు. కానీ అతను మీ మాట వినకపోతే, మీతో మరొకరిని లేదా ఇద్దరిని తీసుకెళ్లండి. , ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల నోటిలో ప్రతి మాట స్థిరపడవచ్చు." (మత్తయి 18:15, 16) "అందుకని . . . నువ్వు బలిపీఠం దగ్గరకు నీ కానుకను తీసుకుని వచ్చినప్పుడు, అక్కడ నీ సహోదరుడు నీకు వ్యతిరేకంగా ఏదైనా ఉందని గుర్తు చేసుకుంటే, నీ కానుకను బలిపీఠం ముందు వదిలి, నీ సోదరుని వద్దకు వెళ్లి, మొదట నీ సోదరునితో రాజీపడి, ఆపై వచ్చి నీకు సమర్పించు బహుమతి." (మత్తయి 5:25, 26) దురదృష్టకర తప్పిదానికి ప్రతి పక్షం యొక్క విధి, సయోధ్య కోసం మరొకరిని సంప్రదించడం. ఈ చట్టం అమలు చేయబడిన చోట, చాలా సందర్భాలలో ఉల్లంఘన యొక్క మొదటి దశల్లో సయోధ్య ఏర్పడుతుందని అనుభవం చూపిస్తుంది. గాయాలు మరియు బాధలను ముందుగా ఈ విషయంలో సంబంధం లేని మరొకరికి నివేదించడం సమూహం యొక్క సహవాసానికి మరియు క్రీస్తు సూత్రాలకు వ్యతిరేకంగా నేరం. టేల్ బేరింగ్ అనేది అత్యంత హానికరమైన అభ్యాసం మరియు సెయింట్‌హుడ్ ప్రమాణాలకు అనుగుణంగా లేదు, మరియు ఒక సంఘంగా చర్చి చర్య తీసుకోగల నేరం మరియు తద్వారా ఒకరి సభ్యత్వం ప్రభావితమవుతుంది. కష్టతరమైన సందర్భాల్లో సభ్యుల బాధ్యతలు ఏమిటి? మనస్తాపం చెందిన వ్యక్తి, లేదా ఒక సోదరుడు లేదా సోదరి మనస్తాపం చెందారని తెలిసిన మరొక సెయింట్, ఈ సమాచారాన్ని మరేదైనా తెలియజేయడానికి ముందు, బాధపడ్డ వ్యక్తి సమక్షంలో సంబంధిత వ్యక్తిని సంప్రదించి, సయోధ్య కుదుర్చుకోవాలి. ఇలా చేయడానికి కష్టం పెద్దది కాకపోతే, ఎవరినీ ఇబ్బంది పెట్టేంత పెద్దది కాదు. అది మరచిపోవడమే మంచిది. (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 42:23 a.) ఈ విధానం విజయవంతం కాకపోతే, మనస్తాపం చెందిన పక్షం ఆ వ్యక్తి ఉపాధ్యాయుడు లేదా మరొక అధికారి లేదా చర్చి సభ్యుడు అనే బలమైన పరిశీలనతో మరొక సాక్షిని తీసుకోవాలి, తద్వారా సమస్య మరియు దాని స్వభావానికి రుజువు ఉంటుంది. ఈ రెండవ ప్రయత్నం విఫలమైతే, ఆ విషయాన్ని రెండు పార్టీలు సభ్యులుగా ఉన్న శాఖ అధ్యక్షుడికి అందించాలి. వివిధ శాఖలు లేదా సమూహాల సభ్యుల మధ్య ఇబ్బంది ఉంటే, రెండు పార్టీలపై అధికార పరిధిని కలిగి ఉన్న అడ్మినిస్ట్రేటివ్ అధికారిని సంప్రదించాలి. (సిద్ధాంతం మరియు ఒప్పందాలు 42: 23 బి చూడండి.) ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ యొక్క విధి, సయోధ్యను అమలు చేయడానికి సాధ్యమయ్యే అన్ని ప్రయత్నాలు జరిగేలా చూడటం, కానీ ఈ పద్ధతుల ద్వారా సయోధ్యలో విఫలమైతే, కేసును విచారించడానికి తగిన న్యాయస్థానాన్ని నియమించడం అతని బాధ్యత. ఈ అవాంఛనీయమైన మరియు విపరీతమైన చర్యను నివారించడానికి, సభ్యులందరూ తమ జీవితాలలో క్రీస్తు మరియు ఆయన చర్చి యొక్క ప్రమాణాలను అన్వయించుకోవడానికి అన్ని సమయాలలో ప్రయత్నించాలి. దీనికి సంబంధించి, ఈ క్రింది ఉల్లేఖనాలు నిరంతరం జ్ఞాపకం చేసుకోవడానికి అర్హమైనవి: "మరియు మీరు ప్రార్థిస్తూ నిలబడి ఉన్నప్పుడు, మీలో ఎవరికైనా వ్యతిరేకంగా ఏమైనా ఉంటే క్షమించండి; పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అపరాధాలను క్షమించగలడు. కానీ మీరు క్షమించకపోతే, పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అపరాధాలను క్షమించడు." (మార్కు 11:27, 28) "మరియు మాకు వ్యతిరేకంగా అపరాధం చేసేవారిని మేము క్షమించినట్లు మా అపరాధాలను క్షమించుము." (మత్తయి 6:13) "...అందుచేత మీరు ఒకరినొకరు క్షమించవలెనని మీతో చెప్పుచున్నాను, తన సహోదరుని అపరాధములను క్షమించనివాడు ప్రభువు ఎదుట ఖండించబడతాడు, ఎందుకంటే అతనిలో పెద్ద పాపం ఉంది. ప్రభువునైన నేను ఎవరిని క్షమిస్తాను. క్షమిస్తాను, కానీ మీ అందరినీ క్షమించడం అవసరం; మరియు మీరు మీ హృదయాలలో ఇలా చెప్పుకోవాలి, దేవుడు నాకు మరియు నీకు మధ్య న్యాయనిర్ణేతగా ఉండనివ్వండి మరియు మీ పనుల ప్రకారం మీకు ప్రతిఫలమివ్వండి." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 64:2d, e) సభ్యులు ట్రిఫ్లెస్ లేదా ఇతరుల యాదృచ్ఛిక చర్యలపై నేరం చేయకుండా ఉండాలి. ఈ చర్యలు తరచుగా అనుకోకుండా ఉంటాయి. ఇతరుల ఉద్దేశాలను పునాది లేకుండా ప్రశ్నించకూడదు. ప్రతి సభ్యునిలో పశ్చాత్తాపం మరియు క్షమాపణ యొక్క స్ఫూర్తిని నిరంతరం పెంపొందించినట్లయితే, అప్పుడు సెయింట్స్ యొక్క సహవాసం సంరక్షించబడుతుంది మరియు చర్చి యొక్క ప్రయోజనాలకు ఆటంకం ఉండదు. పశ్చాత్తాపం లేదా క్షమాపణ యొక్క వ్యక్తీకరణ అన్ని పరిస్థితులలో సరైనది లేదా సరైనది చేయకుండా మరియు జరిగిన ఏదైనా నష్టాన్ని సరిదిద్దడానికి ఒకరిని విడిచిపెడుతుందని ఎవరూ తప్పుదారి పట్టించకూడదు. ఆచరణ సాధ్యమైన చోట, గాయపడిన పార్టీకి పూర్తి పునరావాసం కల్పించాలి. ప్రపంచానికి ఇవ్వబడిన అత్యున్నత ద్యోతకం మానవ సంబంధాలలో సార్వత్రిక సమస్యగా భావించే విషయంలో సెయింట్స్‌కు మార్గనిర్దేశం చేయాలి. ఈ ద్యోతకం యేసు జీవితం మరియు పరిచర్యలో ఉంది మరియు సిలువ నుండి ఆయన మాటల్లో చిక్కుకుంది: "అప్పుడు యేసు, తండ్రీ, వారిని క్షమించు; వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు." (లూకా 23:35) వివాహం మరియు ఇల్లు సువార్త బోధలు చాలా క్లిష్టంగా ఉన్న నేటి జీవితంలోని అన్ని రంగాలలో, భార్యాభర్తల సంబంధాలు మరియు పవిత్ర గృహాల స్థాపన చాలా ముఖ్యమైనవి. నేటి యువకులు, ముఖ్యంగా చర్చి గృహాలు గొప్ప సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రతి వైపు అనైతిక ప్రభావం యొక్క విజయవంతమైన సమావేశం యేసు క్రీస్తు సువార్త యొక్క పిలుపు. సమాజం యొక్క ప్రాథమిక యూనిట్‌గా ఇంటి పవిత్రత పట్ల లేటర్ డే సెయింట్ వైఖరి ప్రతి తరువాతి తరానికి ఈ శిక్షణ మరియు అభివృద్ధికి ప్రాథమిక లక్ష్యంగా ఉండాలి. ఈ దృక్పథం పిల్లల మార్గదర్శకత్వం మరియు మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యానికి సంబంధించిన తెలివైన విద్యార్థులచే అందించబడిన సాక్ష్యాలతో సామరస్యంగా మరియు మద్దతునిస్తుంది. వివాహానికి సన్నాహాలు గురించి ఏమిటి? వివాహం జరగడానికి ముందు తగిన తయారీ అవసరాన్ని చర్చి గొప్పగా నొక్కి చెబుతుంది. వివాహం గురించి ఆలోచించే ప్రతి సభ్యుడు ఆ మతకర్మకు సంబంధించి చర్చి యొక్క స్థితిని అధ్యయనం చేయాలి. సువార్త యొక్క ప్రాథమిక బోధనలు వివాహం ద్వారా సంతానోత్పత్తి యొక్క దేవుడు-ఇచ్చిన విధులను సరిగ్గా ఉపయోగించుకోవడానికి మంచి పునాదిని అందిస్తాయి. సంతోషకరమైన వివాహాన్ని ఏ సూత్రాలు నియంత్రిస్తాయి? వివాహం యొక్క సన్నాహాల్లో మరియు దాని పనితీరులో వ్యక్తిగత సమగ్రత మరియు మంచి పాత్ర యొక్క సూత్రాల అభివృద్ధి చాలా అవసరం. కాబట్టి, వివాహం గురించి ఆలోచించే వ్యక్తులందరూ ఈ లక్షణాలను ఒకరిలో ఒకరు చూసుకోవాలి. మరేదైనా ప్రాతిపదికన వివాహ సంబంధాన్ని స్థాపించాలని ఆశించడం వ్యర్థం. పని సర్దుబాటులో ఎక్కువ భాగం తప్పనిసరిగా, వివాహ జీవితంలోని వాస్తవ ప్రారంభ సంవత్సరాలకు వదిలివేయబడాలి, ఆ సర్దుబాట్లను చేయడానికి ప్రతి భాగస్వామి యొక్క సామర్థ్యంపై నిర్ణయాలు పెళ్లి రోజుకి ముందే తీసుకోవాలి. ఈ విషయాలను శ్రద్ధగా మరియు ప్రార్థనాపూర్వకంగా పరిగణనలోకి తీసుకోవడం వివాహం గురించి ఆలోచించే ప్రతి జంట యొక్క విధి, ఎందుకంటే అలా చేయడంలో వైఫల్యం వైవాహిక వైపరీత్యాల యొక్క విస్తారమైన రైలును తెస్తుంది. అనుకూలత లేకుండా, సాధువు జీవితాన్ని గడపడం మరియు పవిత్ర గృహాన్ని స్థాపించడం అసాధ్యం. ఇతర విశ్వాసాల వారిని వివాహం చేసుకోవాలా? అలాంటి విశ్వాసం ఉన్న వారితో వివాహం అత్యంత అభిలషణీయం, కానీ హృదయ విషయాలపై నియంత్రణ సులభం కాదు. అందువల్ల, భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు భావోద్వేగాలు అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి అనుమతించే ముందు చాలా ప్రార్థనాపూర్వకంగా పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. ఆదర్శాలను కలిగి ఉన్న భాగస్వామి ఎంపిక మరింత విజయవంతమైన వివాహానికి దారి తీస్తుంది. పాల్, రెండవ కొరింథియన్ లేఖలో, అవిశ్వాసులతో అసమానంగా యోక్ చేయబడకుండా ఉండమని సెయింట్స్‌ను హెచ్చరించాడు. ఇంటి శాంతి మరియు సామరస్యానికి మరియు కుటుంబ సంరక్షణకు మతపరమైన దృక్పథంతో పాటు వ్యక్తిగత స్వభావాల అనుకూలత అవసరం. అనేక ఇతర చర్చిలు, మరియు వివాహ సలహాదారులు కూడా ఒక సాధారణ విశ్వాసం మరియు సంపూర్ణ సంతోషకరమైన వివాహానికి ఆధారమైన ఆదర్శాలను పంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. మరొకరి మతపరమైన ఆదర్శాల పట్ల సానుభూతి లేని చాలా మందికి, వ్యక్తిగత మరియు కుటుంబ దృక్కోణం నుండి రాజ్య పని కోసం ఆ వ్యక్తి యొక్క అధికారాలను రద్దు చేయడం. వివాహంలో విజయవంతమైన భాగస్వామ్యానికి ఏ లక్షణాలు అవసరం? పునర్జన్మ పొందిన వ్యక్తులు తెలివితేటలు, ధర్మం, గౌరవం, చిత్తశుద్ధి, నీతి, మరియు వారి వ్యక్తిత్వంలో క్రీస్తు సారూప్యత కోసం ప్రయత్నించే జీవితాలను గడపడానికి ప్రయత్నిస్తున్నారు, విజయవంతమైన గృహనిర్మాణం కోసం వారిలో పదార్థం ఉంటుంది. చర్చి అథారిటీ కాకుండా ఎవరైనా వివాహం చేసుకోవాలా? "…మేము నమ్ముతాము. . . ప్రధాన పూజారి, ప్రధాన పూజారి, బిషప్, పెద్దలు లేదా పూజారి ద్వారా గంభీరోత్సవాన్ని నిర్వహించాలి, వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తులను ఇతర అధికారం ద్వారా వివాహం చేసుకోవడాన్ని కూడా నిషేధించకూడదు. ఈ చర్చి సభ్యులను చర్చి నుండి వివాహం చేసుకోకుండా నిషేధించడం సరైనది కాదని మేము నమ్ముతున్నాము, అది వారి నిర్ణయం అయితే, అలాంటి వ్యక్తులు మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు విశ్వాసంలో బలహీనంగా పరిగణించబడతారు." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 111:1c, d) వివాహం ఎక్కడ ఘనంగా జరగాలి? "... ఈ చర్చి ఆఫ్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్‌లోని అన్ని వివాహాలు బహిరంగ సమావేశంలో లేదా విందులో ఆ ప్రయోజనం కోసం సిద్ధం చేయాలని మేము నమ్ముతున్నాము." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 111:1b). ఆరాధనా గృహంలో కంటే వివాహ మతకర్మ వేడుకకు తగిన స్థలం మరొకటి లేదు. ఒక స్త్రీ, పురుషుడు, ఒకరితో ఒకరు చేసిన ఒడంబడిక యొక్క శ్రద్ధతో, క్రీస్తువంటి గృహాన్ని స్థాపించాలనే ఉన్నతమైన మరియు పవిత్రమైన ఉద్దేశ్యానికి తమ జీవితాలను ఏకం చేయడానికి ప్రయత్నించడం చాలా అందమైన విషయం. ఆరాధనా స్థలంలో తగిన ప్రాధాన్యత మరియు అనుకూలమైన వాతావరణాన్ని అందించడం ద్వారా ఇది జీవితకాల జ్ఞాపకం మరియు ఆనందం యొక్క సందర్భం. సెయింట్‌లీ లివింగ్ సూత్రాల గురించి బహిరంగంగా మరియు బహిరంగంగా సాక్ష్యం చెప్పడానికి మరియు సంతోషకరమైన వేడుకలో వారిని బాగా ఇష్టపడే వారితో పంచుకోవడానికి ఇక్కడ ఒక అవకాశం ఉంది. పార్టీలలో ఒకరి ఇల్లు కూడా తరచుగా ఎంపిక చేయబడుతుంది మరియు కొన్ని లక్షణాలు తప్పనిసరిగా పరిమితం అయినప్పటికీ చాలా అందమైన సందర్భం కావచ్చు. శాంతి న్యాయమూర్తి, న్యాయమూర్తి లేదా రిజిస్ట్రీ కార్యాలయంలో జరిగే వివాహాన్ని చర్చి చట్టబద్ధమైనదిగా అంగీకరించవచ్చు, అయితే యూనియన్ యొక్క ఆధ్యాత్మిక స్వభావాన్ని నొక్కి చెప్పడంలో విఫలమైనందున ఇది నిలిపివేయబడుతుంది. అనుచితమైన పరిసరాలలో ఈ పవిత్ర శాసనం యొక్క పనితీరును ఆమోదించడానికి ఈ చర్చి యొక్క ఏ మంత్రికి స్వేచ్ఛ లేదు, వీటిలో కొన్ని కేవలం అపఖ్యాతి పాలయ్యే అవకాశాలు తప్ప మరేమీ కాదు. ప్రత్యేకంగా అవసరమైన వేడుక ఉందా? అసలు ఒడంబడికలో నిర్దిష్ట పదాలను ఖచ్చితంగా ఉపయోగించడం మినహా వివాహ సేవ యొక్క ఆచార భాగానికి కఠినమైన నిబంధనలు లేవు. ఈ అవసరమైన పదాలను ఉపయోగించినంత కాలం, సేవను సముచితంగా మరియు సందర్భానికి అనుగుణంగా అందంగా చేయడానికి మంత్రి దంపతులతో ప్లాన్ చేయవచ్చు. వేడుకలో మంత్రికి అవసరమైన పదాలు సిద్ధాంతం మరియు ఒడంబడికలు 111:2b, c, d. “ఈ షరతుకు సంబంధించిన చట్టపరమైన హక్కులను పాటిస్తూ మీరిద్దరూ ఒకరికొకరు సహచరులుగా, భార్యాభర్తలుగా ఉండేందుకు పరస్పరం అంగీకరిస్తున్నారు; అంటే, మీ జీవితాల్లో ఒకరికొకరు మరియు అందరి నుండి మిమ్మల్ని మీరు పూర్తిగా కాపాడుకోవాలా?" "మరియు వారు "అవును" అని సమాధానమిచ్చినప్పుడు, అతను ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వారిని "భర్తలు మరియు భార్య" అని ఉచ్చరిస్తాడు మరియు దేశ చట్టాలు మరియు అతనిపై ఉన్న అధికారం ద్వారా: "దేవుడు అతనిని చేర్చగలడు. ఆశీర్వాదాలు మరియు మీ ఒడంబడికలను ఇక నుండి ఎప్పటికీ నెరవేర్చేలా మీరు ఉంచుకోండి. ఆమెన్." విడాకుల పట్ల చర్చి వైఖరి ఏమిటి? నివారణ కోసం ప్రయత్నించడం కంటే నివారణ విధానం ఎల్లప్పుడూ ఉత్తమమైనది. వివాహానికి నిర్మాణాత్మక విధానం మరియు ముందుగా నొక్కిచెప్పబడిన సూత్రాలను చేర్చడం అనేది భాగస్వాములను ఐక్యం చేయడానికి మరియు జీవితాంతం శాశ్వత సహచరులను చేయడానికి లెక్కించబడిన పునాదిగా మారడానికి ఉద్దేశించబడింది. ఉద్దేశ్యం మరియు తీర్పు యొక్క లోపాలు సంభవించినప్పటికీ, చర్చి వివాహిత వ్యక్తుల విడాకులు లేదా వేరుచేయడం దుర్భరమైనదిగా మరియు కుటుంబ జీవితంలో ఒక ఖచ్చితమైన వైఫల్యంగా పరిగణించబడుతుంది. విడాకులను చట్టబద్ధమైనదిగా గుర్తించే కారణాలు చాలా పరిమితం చేయబడ్డాయి. విడాకుల కోసం గుర్తించబడిన కారణాలు ఏమిటి? వివాహితుల మధ్య విడిపోవడాన్ని సమర్థించే ఏకైక కారణాలు: (ఎ) వ్యభిచారం మరియు (బి) కారణం లేకుండా విడిచిపెట్టడం. (మత్తయి 5:35, 36; 19:9; లూకా 16:23) మరింత వివరణ కోసం GCR 1034 చూడండి. అతిక్రమణకు పాల్పడని తన సహచరుడిని దూరంగా ఉంచే వ్యక్తి అతిక్రమంలో ఉన్నాడు మరియు అలా దూరంగా ఉంచబడిన లేదా విడిచిపెట్టబడిన వ్యక్తికి వ్యతిరేకంగా పాపం చేస్తారు. ఒక సహచరుడి నుండి వేరు చేయబడిన ఎవ్వరూ చర్చి నుండి బహిష్కరించబడరు, అలాంటి విభజనలో ఖండించదగిన అతిక్రమణ ఉండదు. అనేక రాష్ట్రాల్లో, భూమి యొక్క చట్టాలు చర్చి యొక్క ప్రమాణం కంటే తక్కువ ఖచ్చితమైనవి, మరియు చర్చిచే అటువంటి విడాకులు లేదా పునర్వివాహాల గుర్తింపు అనేది క్రీస్తు చట్టం ఆధారంగా నిర్ణయించబడిన కారణం కోసం ఎవరైనా భాగస్వామి దోషి అనే ప్రశ్నపై ఆధారపడి ఉంటుంది. గుడ్ లేటర్ డే సెయింట్ హోమ్ యొక్క ప్రమాణాలు ఏమిటి? వివాహ జీవితానికి ముందు మరియు సమయంలో క్రింది ప్రమాణాల యొక్క నిర్దిష్ట అధ్యయనం సెయింట్స్‌కు అమూల్యమైనది, మరియు ఈ లక్షణాలను ఆదర్శ ప్రమాణంగా నిరంతరం కృషి చేయాలని సూచించబడింది. లేటర్ డే సెయింట్స్ యొక్క గృహ జీవితంలో వారిని ప్రోత్సహించాలి మరియు అభివృద్ధి చేయాలి. పునరుద్ధరించబడిన చర్చి యొక్క ప్రారంభ రోజులలో, పరిచర్యలోని అనేకమంది సభ్యులు తమ గృహాల యొక్క దైవిక ప్రమాణాలు సాధించబడేలా చూడటం ఒక ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నట్లు వెల్లడి చేయడం ద్వారా ఉద్బోధించబడ్డారు. ఒక లేటర్ డే సెయింట్ హోమ్ దేవుని భావం కలిగి ఉంటుంది ఒక పిల్లవాడు తన దైవభక్తి యొక్క భావనను మొదట ఇంటిలోని తన తల్లిదండ్రుల ద్వారా పొందుతాడు. అతను తన తల్లిదండ్రుల ఉదాహరణ ద్వారా దేవుని పట్ల గౌరవాన్ని మరియు అతని చట్టాల పట్ల గౌరవాన్ని పొందుతాడు. అన్ని నిజమైన పవిత్ర ప్రవర్తనలో దైవిక సూత్రాలు మార్గదర్శక కారకం అని ఇక్కడ అతను తెలుసుకుంటాడు. ఆ విధంగా, గృహంలోని సభ్యులు నిజమైన ఆధ్యాత్మిక అవగాహనను కలిగి ఉండాలంటే, సాధువుల సూత్రాలపై స్థిరపడాలి. దేవుని వాక్యం ఇంటిలోని ప్రతి సభ్యునికి సులభంగా అందుబాటులో ఉండాలి మరియు చర్చి యొక్క మూడు పుస్తకాలలో అందుబాటులో ఉండాలి: బైబిల్ (ప్రేరేపిత వెర్షన్), బుక్ ఆఫ్ మార్మన్ మరియు సిద్ధాంతం మరియు ఒప్పందాలు. ఈ గ్రంధాలను చదవడం వల్ల మరేమీ చేయలేని సెయింట్‌ల జీవితం గురించి అవగాహన వస్తుంది. ఇంట్లో అత్యంత నైతిక వాతావరణం అవసరం నైతిక సూత్రాల పట్ల పెరుగుతున్న తరం యొక్క వైఖరి సాధారణంగా వారి తల్లిదండ్రుల జీవితాల్లో రుజువు అవుతుంది. తల్లిదండ్రుల చర్యలు మరియు సంభాషణలు కాపీ చేయబడే ప్రమాణాలుగా ఉంటాయి. కాబట్టి, ఉదాహరణ మరియు సూచనల ద్వారా, ఆరోగ్యకరమైన నైతిక సూత్రాలు ఇంటి నుండి వెలువడాలి. నిజాయితీ, సత్యం, మర్యాద మరియు ధర్మం అన్ని ప్రవర్తనలకు పునాది అవుతుంది. జ్ఞానానికి బహిరంగ వైఖరి తప్పనిసరి లేటర్ డే సెయింట్ తెలివైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి మరియు పిల్లలు మరియు యువకుల విశ్వాసాన్ని నాశనం చేసే ఆధునికవాదం యొక్క దాడులకు వ్యతిరేకంగా ఉత్తమ బఫర్ అనేది అన్ని విచారణలకు బహిరంగ వైఖరి. విస్తరిస్తున్న ఈ జ్ఞాన ప్రపంచానికి తగిన విధంగా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఇల్లు ప్రయత్నించాలి. ఇల్లు తప్పనిసరిగా యువత యొక్క సందేహాలు మరియు సందేహాలను సానుభూతి మరియు సహనాన్ని పొందగల ప్రదేశంగా ఉండాలి, అదే సమయంలో గత పునాదులపై సురక్షితమైన ఎంకరేజ్‌ను అందిస్తుంది. గత యుగం యొక్క నిర్బంధ అధికారం మరియు సత్యం యొక్క అన్ని పాత భావనలను విస్మరించే ప్రస్తుత విపరీత ధోరణి మధ్య గ్రహించవలసిన మాధ్యమం ఉంది. అటువంటి ఇంటి యొక్క అధికారం గౌరవప్రదమైనదిగా ఉంటుంది, అనుభవాన్ని విస్తరించేందుకు అవగాహన మరియు పరిగణన యొక్క హామీ ఉన్నప్పుడు స్వయంచాలకంగా ఇవ్వబడుతుంది. కుటుంబంలో ఒక మిషనరీ ఉద్వేగం ఎంజారు చేయబడింది పిల్లలు ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు, వారు చర్చి యొక్క పెద్ద సంస్థలో సభ్యత్వాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండే విధంగా ప్రతి ఇంటిని ఏర్పాటు చేయాలి మరియు నిర్వహించాలి. చర్చి యొక్క బోధనలు ఇంటిలో ప్రదర్శించబడితే, చర్చి యొక్క గొప్ప మిషనరీ విజయాలలో ఒకటి, సహజ పెరుగుదల యొక్క పరిరక్షణ, గ్రహించబడుతుంది. సెయింట్‌లీ హోమ్ తన స్వంత కుటుంబానికి చెందని వారికి కూడా సువార్త యొక్క శక్తి గురించి స్పృహ కలిగిస్తుంది, తద్వారా ఇంటి జీవితంలో ఎవరు భాగస్వామ్యం చేస్తారో వారు దాని మిషనరీ స్ఫూర్తితో ప్రభావితమవుతారు. (చూడండి సిద్ధాంతం మరియు ఒడంబడికలు 68:4.) సెయింట్లీ హోమ్ అందంగా ఉండాలి చర్చి గృహాలు మన విశ్వాసం యొక్క ఉన్నత ఆదర్శాలను ప్రతిబింబించాలి. ఇది వారి నిర్మాణ మరియు భౌతిక నియామకాలలో చూపాలి. నిజంగా ఇంటి పరిశుభ్రత మరియు ఏర్పాటు అక్కడ నివసించే వారి ఆదర్శాల గురించి మాట్లాడుతుంది. అలంకరణ మరియు రూపంలో అందం జియోనిక్ గృహాలుగా మారుతున్నాయి. ఇల్లు ప్రతి సభ్యుడు తన అభిరుచులను మరియు ప్రాధాన్యతలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా అతని వ్యక్తీకరణకు అవకాశం కల్పించాలి, తద్వారా అది నివాసం కంటే ఎక్కువ అవుతుంది, కానీ వాస్తవానికి, ఆదర్శాల వ్యక్తీకరణ మరియు జీవితంలోని చక్కటి విషయాలను ప్రశంసించడం. పరస్పర బాధ్యత సెయింట్‌లీ హోమ్‌లను వర్ణిస్తుంది ఇల్లు ఆదర్శానికి నిలయం. ఇతర సభ్యుల సంక్షేమానికి సంబంధించి ఇంటిలోని ప్రతి సభ్యునిచే ఇది వ్యక్తీకరించబడినప్పుడు మరియు ఇతరులపై దాని ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏ చర్యలో నిమగ్నమై ఉండకపోతే, వ్యవహారాల్లోకి వెళ్లే ప్రాథమిక వైఖరి అభివృద్ధి చెందుతుంది. ప్రపంచం మరియు వ్యాపారం. జియోను సూత్రాలు మొదట ఇంటి గోడల లోపల ఆచరించబడతాయి. ఆరోగ్యకరమైన శరీరాల అభివృద్ధికి మరియు సంరక్షణకు ఇల్లు తగినదిగా ఉండాలి ఆరోగ్యానికి సంబంధించిన సాధారణ నియమాలు మరియు మన శారీరక అవసరాల సంరక్షణ ఇంట్లో మొదట నేర్చుకోవాలి. ప్రతి సభ్యునికి ఆరోగ్యవంతమైన వయోజనుడిగా ఎదగడానికి ఒక పవిత్ర గృహం అవకాశం కల్పించాలి. ఈ ఆరోగ్య నియమాలపై అధ్యయనాలు తక్షణమే పొందగలవు మరియు ఈ అధ్యయనం ప్రతి ఇంటి నిర్వాహకునిపై విధిగా ఉంటుంది. ఈ విషయంపై ఈ చివరి రోజుల్లో చర్చికి సలహాలు మరియు సలహాల వెల్లడి ఇవ్వబడింది. మన భౌతిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుకు సంబంధించిన సూత్రాలను బాగా అర్థం చేసుకోవడం కోసం సిద్ధాంతం మరియు ఒడంబడికల విభాగం 86 మరియు మా ప్రస్తుత అవశేషాల వెల్లడి నుండి ఎంపికలు చాలా ముఖ్యమైనవి. సెయింట్లీ హోమ్‌కు ఆర్థికంగా మంచి ప్రోగ్రామ్ మరియు పాలసీ అవసరం పవిత్ర గృహం యొక్క ప్రాథమిక ఆధ్యాత్మిక విలువలు గ్రహించబడాలంటే, తాత్కాలిక విషయాల నిర్వహణ గురించి నిజమైన అవగాహన కూడా అవసరం. మా ఆర్థిక వనరులను జాగ్రత్తగా నిర్వహించడం అనేది స్టీవార్డ్‌షిప్ యొక్క ముఖ్యమైన దశ, మరియు అలా గుర్తించబడినప్పుడు, పెరుగుతున్న సభ్యుల జీవితాలలో ప్రయోజనం అమూల్యమైనది. పని మరియు బాధ్యత యొక్క సిద్ధాంతాలు ఇంటిలో నివసించాలి మరియు దేవునిపై మన ఆధారపడటం దశాంశ మరియు సమర్పణల సూత్రాల ద్వారా బోధించబడాలి. ఈ విధంగా, సెయింట్‌లీ హోమ్ అనేది పంచుకోవడం యొక్క సువార్త బోధనకు కేంద్రంగా ఉంది. విజయవంతమైన ఇంటి నిర్వహణకు తెలివైన బడ్జెట్ అవసరం. బిషప్‌లు మరియు వారి ఏజెంట్లు వారి సహాయం కోరితే బడ్జెట్‌లను ప్లాన్ చేయడంలో విలువైన సహాయాన్ని అందిస్తారు. సెయింట్లీ హోమ్ ప్రేమచే నియంత్రించబడుతుంది ఏ ఇంటిని పూర్తిగా ఏకపక్ష స్వభావం యొక్క నియమాలపై విజయవంతంగా నిర్వహించలేరు. ప్రతి పవిత్ర గృహం నిజమైన సోదరులందరిపై ఉన్న ప్రేమకు నిదర్శనం. ఇల్లు దేవునిపై కేంద్రీకృతమై మరియు కుటుంబ సభ్యులలో వ్యక్తీకరించబడిన ప్రేమతో వర్ణించబడిన చోట, ఇక్కడ పరిగణించబడిన ప్రమాణాలు పాత్రల యొక్క సాంకేతికపరమైన అనువర్తనం లేకుండానే సాధించబడతాయి. యేసు చెప్పాడు, "మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను." (జాన్ 13:34) ఇది పవిత్ర జీవితానికి ప్రాథమికమైనది. ఇల్లు సాధారణ కుటుంబ భక్తికి కేంద్రంగా ఉండాలి కుటుంబ ఆరాధన అనేది కాలానుగుణంగా మరియు నిరూపితమైన సంస్థ, ఇది చాలా తరచుగా ఉపయోగించబడదు. అయితే, ఈ దుర్వినియోగం ఎక్కడ జరిగిందో, అది కుటుంబానికి ఆధ్యాత్మికంగా హాని కలిగించింది. తమ పిల్లలతో నిజమైన ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకోవాలనుకునే తల్లిదండ్రులు ఈ దయను విస్మరించరు. కుటుంబ ఆరాధన ఎల్లప్పుడూ అధికారికంగా ఉండాలా? కుటుంబ ఆరాధన అనే శీర్షిక క్రింద గృహ జీవితంలో అనేక దశలు ఉన్నాయి. వాస్తవానికి, దేవుడు మరియు మన పట్ల ఆయన ఉద్దేశ్యంపై కేంద్రీకృతమై ఉన్న ఏ కార్యకలాపమైనా అలా పరిగణించబడుతుంది. అనేక సాధారణ గృహ కార్యకలాపాలు ఆరాధన-కేంద్రీకృతమై ఉండవచ్చు మరియు ఈ విధంగా, మూస పద్ధతిలో ఉండే కుటుంబ ప్రార్థనల మార్పును నివారించవచ్చు. తెలివైన నాయకత్వం అనేక సాధారణ గృహ కార్యకలాపాలను భక్తి పరాకాష్టకు తీసుకురాగలదు. ఉదాహరణకి: చలికాలంలో ఫైర్‌సైడ్‌లో చిన్న పిల్లలకు చెప్పిన కథ లేదా వేసవి సాయంత్రంలో బయటి కార్యకలాపం భక్తితో కూడిన క్లైమాక్స్‌కు ఆధారం అవుతుంది. పియానో చుట్టూ సహవాసం చేసే కాలం కుటుంబాన్ని భగవంతుని పట్ల మరియు ఒకరికొకరు భక్తితో మెచ్చుకునేలా చేస్తుంది. తల్లి లేదా తండ్రి నిద్రవేళలో అనధికారిక చాట్ కోసం పిల్లలను సందర్శించి, రాత్రిపూట ప్రార్థనతో ముగించినప్పుడు, అది వ్యక్తిగత మరియు సన్నిహిత కోణంలో ఇంట్లో ఆరాధన. మోసెస్ తల్లి ఈ విధంగా విజయవంతమైంది మరియు ఈజిప్షియన్లు అతనికి ప్రసాదించిన అన్ని విద్యలు ఉన్నప్పటికీ, తన కొడుకుపై తన ప్రజల ప్రాథమిక విశ్వాసాన్ని ముద్రించింది. సత్యదేవుని గురించిన అనధికారిక బోధనకు ఆమెకు బహుశా చాలా తక్కువ అవకాశం ఉండేది. వాటిని ఆరాధన-కేంద్రీకృతం చేయాలనే ఉద్దేశ్యంతో మనం అధ్యయనం చేసే కొన్ని ఇతర అవకాశాలు భోజనం తర్వాత టేబుల్ చుట్టూ సంభాషణలు. ఏదైనా సంభాషణ భక్తి ప్రయోజనాల కోసం మార్గనిర్దేశం చేయబడవచ్చు: మూడు ప్రామాణిక పుస్తకాలు, వాయిద్య మరియు గాత్ర సంగీతం, మనోహరమైన చిత్రాలు, కళా ప్రశంసలు, టేబుల్ టాక్, కలిసి పని చేసే కుటుంబం యొక్క ప్రాజెక్ట్‌లు, కలిసి ఆడే సమయం, తక్షణ కుటుంబంతో పాటు ఇతరులతో అనుభవాలను పంచుకోవడం, ఆతిథ్యం మరియు స్నేహం, సందర్శన, కుటుంబ ఆరాధన సెట్టింగ్‌లు, సరైన సమయంలో పంచుకున్న మన పఠనంలోని రత్నాలు మరియు ప్రభువు దినానికి జ్ఞానయుక్తంగా మరియు జాగ్రత్తగా ప్రణాళికాబద్ధమైన విధానం అన్నీ కుటుంబ ఆరాధన అనుభవాలుగా మారవచ్చు. ఫార్మాలిటీని ఎల్లప్పుడూ నొక్కిచెప్పినట్లయితే, కుటుంబ ఆరాధనను నిర్వహించడం కష్టమని అనుభవం చూపిస్తుంది, అయితే తల్లిదండ్రులు ఈ అవసరానికి సంబంధించి వారి విధానంలో తెలివిగా ఉంటే, ప్రతి కార్యకలాపానికి అవసరమైన ప్రాథమిక ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని, వివిధ రకాలైన ఆరాధన పెరుగుతున్న పిల్లల జీవితంలో చాలా అవసరమైనది సాధించబడుతుంది, అయితే దేవుడు ప్రతి జీవితానికి మరియు కుటుంబానికి కేంద్రంగా ఉంటాడు. కుటుంబ జీవితంలోని అన్ని దశలను భక్తి కేంద్రానికి తీసుకురావాల్సిన అవసరాన్ని ఈ విభాగంలో నొక్కిచెప్పినప్పటికీ, ప్రతి సాధువు జీవితంలో ప్రార్థన యొక్క ఖచ్చితమైన విధికి ప్రత్యామ్నాయం లేదు. ఇక్కడ ప్రస్తావించబడిన కుటుంబ సర్కిల్‌లో భక్తికి సంబంధించిన అన్ని అవకాశాలు వ్యక్తిగత మరియు సామూహిక ప్రార్థనలో పాల్గొనే సామర్థ్యంలో ప్రతి పెరుగుతున్న వ్యక్తికి శిక్షణ ఇవ్వడంతో ఖచ్చితంగా ముడిపడి ఉంటాయి. కొనసాగుతున్న మరియు అంకితమైన ప్రార్థన జీవితానికి ఖచ్చితంగా ప్రత్యామ్నాయం లేదు. జీవించడం పట్ల ఒకరి మొత్తం వైఖరిని చేర్చడానికి ప్రార్థన అప్పుడు విస్తరించబడుతుంది. అధ్యాయం 4 ఆధ్యాత్మికంగా స్వచ్ఛంగా ఉంచడం ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో జన్మించినప్పుడు, అతను తన శారీరక మరియు మానసిక అభివృద్ధిని ప్రారంభిస్తాడు. పసికందును నిర్లక్ష్యం చేసినా, లేదా ఎదుగుతున్న యువకుడు ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించే అనేక మార్గాల్లో శరీరానికి మరియు మనస్సుకు వ్యాయామం చేయడంలో విఫలమైతే, వ్యక్తి జీవితంపై హానికరమైన ప్రభావం ఉంటుంది. ఈ ముఖ్యమైన పెరుగుదల రుజువు కావడానికి శరీరానికి మరియు మనస్సుకు ఆహారం మరియు పోషణ అవసరం. స్క్రిప్చర్స్ అంతటా, సహజ శరీరం యొక్క పుట్టుక మరియు పెరుగుదల ఆధ్యాత్మిక స్వభావం యొక్క పుట్టుక మరియు పెరుగుదలకు ఉదాహరణలుగా ఉపయోగించబడ్డాయి మరియు చర్చిలోని ప్రతి సభ్యుడు ఈ సమాంతరాన్ని గుర్తుంచుకోవడం చాలా అవసరం. అందువల్ల ప్రతి సభ్యుడు తమ పరిధిలో ఉన్న విధులు మరియు అధికారాల సాధన కోసం ప్రతి అవకాశాన్ని వెతకడం చాలా ముఖ్యం. ఈ మాన్యువల్‌లోని ఇతర అధ్యాయాలలో, ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమైన వివిధ శాసనాలు మరియు మంత్రిత్వ శాఖలకు విభాగాలు కేటాయించబడ్డాయి, అయితే ఈ అధ్యాయంలో నాలుగు ముఖ్యమైన అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది: అధ్యయనం, ఉపవాసం, ప్రార్థన మరియు ఆరాధన యొక్క సహవాసం. చదువు శారీరకంగా దృఢంగా ఉండాలంటే మనం ఆహారం తీసుకోవాలి. అంతర్గత మనిషి విషయంలో కూడా అదే నిజం. "... మనిషి రొట్టెతో మాత్రమే జీవించడు, కానీ దేవుని ప్రతి మాట ద్వారా జీవించగలడని వ్రాయబడింది." (లూకా 4:4) దేవుని వాక్యం మానవుని ఆత్మకు ఆహారంగా నిలుస్తుందని లేఖనాలు అనేక ఆధారాలతో నిండి ఉన్నాయి. మొదటి కీర్తన ఒక మంచి ఉదాహరణ: "భక్తిహీనుల ఆలోచనను అనుసరించనివాడు, పాపుల మార్గంలో నిలబడని, అపహాస్యం చేసేవారి పీఠంలో కూర్చోనివాడు ధన్యుడు, కానీ అతని ఆనందం ప్రభువు ధర్మశాస్త్రంలో ఉంది మరియు అతని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తాడు. పగలు మరియు రాత్రి. మరియు అతను నీటి నదుల దగ్గర నాటబడిన చెట్టులా ఉంటాడు, అది తన కాలంలో తన ఫలాలను ఇస్తుంది, అతని ఆకు కూడా వాడిపోదు, మరియు అతను ఏమి చేసినా వర్ధిల్లుతుంది." (కీర్తన 1:1, 3) పవిత్ర గ్రంధాల కోసం కాకపోతే, నెఫైట్‌లు లామనీయుల వలె అవిశ్వాసంలో తగ్గిపోతారని మోషియా తన కుమారులను హెచ్చరించాడు. ఆమోస్ 8:11-13 కరువు గురించి ప్రవచిస్తుంది, రొట్టె కాదు, కానీ ప్రభువు వాక్యాన్ని వినడం. అన్ని మాంసాలు గడ్డి మరియు పొలపు పువ్వులు వాడిపోయి పోతాయి అని పేతురు చెప్పాడు, అయితే ప్రభువు వాక్యం శాశ్వతంగా ఉంటుంది (I పేతురు 1: 24, 25). మనం దేవుని వాక్యపు రొట్టెలను ఎంతవరకు తింటున్నామో, అంతవరకు మనం ఓర్పుగలవారమవుతాము. అన్ని వృత్తులకు పాఠ్యపుస్తకాలు ఉన్నాయి. సర్జన్లు, సంగీతకారులు, ఇంజనీర్లు, ఖగోళ శాస్త్రవేత్తలు, న్యాయవాదులు మరియు అన్ని రకాల ప్రొఫెసర్లు డిగ్రీలు, డిప్లొమాలు లేదా సమాజంలో పనిచేయడానికి అధికారం పొందే ముందు వారి వృత్తుల టెక్స్ట్‌పై పట్టు సాధించాలి. జీసస్ క్రైస్ట్ కోసం మంత్రులు మరియు "ప్రొఫెషనల్ కింగ్డమ్ బిల్డర్స్" ఈ నియమానికి మినహాయింపు కాదు. దేవుడు మనకు మూడు పాఠ్యపుస్తకాలను అందించాడు. దేవుడు మనకు అందించిన పాఠ్యపుస్తకాలపై కనీసం కొంత వరకు ప్రావీణ్యం పొందేంత వరకు (మన పిలుపుకు శక్తి మరియు ఆత్మ మరియు బహుమతులు) మరియు మనకు పరిశుద్ధాత్మను ప్రసాదిస్తాడని మనం ఆశించలేము. లేఖనాలను అధ్యయనం చేయడంతో పాటుగా, మాకు సూచించబడింది "...అధ్యయనం చేయండి మరియు నేర్చుకోండి మరియు అన్ని మంచి పుస్తకాల గురించి మరియు భాషలు, భాషలు మరియు వ్యక్తులతో పరిచయం చేసుకోండి." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 87:5b) "... ఉత్తమ పుస్తకాల నుండి జ్ఞాన పదాలను వెతకండి; అధ్యయనం ద్వారా మరియు విశ్వాసం ద్వారా కూడా నేర్చుకోవడాన్ని వెతకండి" (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 85:36a). “ఆధ్యాత్మికంగా సజీవంగా ఉండేందుకు” అధ్యయనం నిజంగా ఒక ముఖ్యమైన అంశం. ఉపవాసం ఉపవాసం దేవుడు మన నుండి కోరుతున్నారా? చర్చి యొక్క మూడు ప్రామాణిక పుస్తకాలు మనకు ఉపవాసం అవసరం మాత్రమే కాదు, ఇది దేవుని స్పష్టమైన ఆజ్ఞ కూడా అని పేర్కొంది: "అయినప్పటికీ, దేవుణ్ణి తెలియని వారి ఆత్మల క్షేమం కోసం, దేవుని పిల్లలు తరచుగా తమను తాము ఒకచోట చేర్చుకోవాలని మరియు ఉపవాసం మరియు బలమైన ప్రార్థనలో చేరాలని ఆజ్ఞాపించబడ్డారు." (ఆల్మా 4:6) "అలాగే, ఈ సమయం నుండి మీరు ప్రార్థన మరియు ఉపవాసం కొనసాగించాలని నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నాను." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 85:21a) "ఈ సమయం నుండి ప్రార్థన మరియు ఉపవాసం కొనసాగించండి" రెండూ నిరంతర స్వభావం కలిగి ఉన్నాయని సూచిస్తుంది. ఉపవాసం మరియు ప్రార్థన రెండూ దేవుని పట్ల వైఖరి. మోకరిల్లి దేవునితో మాట్లాడడం ప్రార్థన వైఖరికి వ్యక్తీకరణను ఇస్తుంది. ఆహారం (మరియు ఇతర విషయాలు) నుండి దూరంగా ఉండటం అనేది ఉపవాసం యొక్క వైఖరికి వ్యక్తీకరణను అందించే చర్య. వ్యక్తీకరణ యొక్క చర్య లేదా వ్యవధి పూర్తయిన తర్వాత, వైఖరి అలాగే ఉండాలి, లేదా మన ఉపవాసం మరియు ప్రార్థన ఒక ప్రహసనం మరియు ఖాళీ అపహాస్యం. "...నీ ఉపవాసం పరిపూర్ణంగా ఉండేలా నీ ఆహారాన్ని హృదయపూర్వకంగా సిద్ధం చేసుకోనివ్వు..." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 59:3a) మన హృదయాలు దేవుని రాజ్యానికి ఏకాకిగా ఉంటే, ఉపవాసం యొక్క వైఖరి నిరంతరం ఉంటుంది. బతకడానికి తింటాం, తినడానికి బతుకుతాం. ఉపవాసం, ఇతర విషయాలతోపాటు, స్వీయ-తిరస్కరణ, మానుకోవడం మరియు స్వీయ-నియంత్రణ యొక్క వైఖరి, ఇది మన జీవితంలో నిరంతరంగా ఉంటుంది మరియు ఆహారం మరియు పానీయాలు కాకుండా ఇతర విషయాలకు వర్తిస్తుంది. ఉపవాసం యొక్క చర్య ప్రయోజనకరమైన అనేక సార్లు ఉన్నాయి. జనరల్ కాన్ఫరెన్స్‌కు ముందు, చర్చి ప్రెసిడెంట్ సాధారణంగా సభ్యత్వాన్ని ఉపవాస కాలంలో పాల్గొనమని అడుగుతాడు, ఈ సందర్భంగా ఆధ్యాత్మికంగా సిద్ధపడేందుకు ఒక సాధనం. చాలా మంది సభ్యులు స్వచ్ఛందంగా లేదా వారి ప్రిసైడింగ్ అధికారి అభ్యర్థన మేరకు, మతకర్మ సేవకు ముందు లేదా చర్చికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఇతర సేవకు ముందు ఉపవాసం ఉంటారు. అనారోగ్యంతో ఉన్నవారికి నిర్వహించే శాసనం కోసం తరచుగా ఉపవాసం నిర్వహిస్తారు. ఉపవాసం ఒక స్వచ్ఛంద చర్య మరియు దానిని పాటించడంలో వివేకాన్ని ఉపయోగించమని సలహా ఇస్తారు. ఉపవాసం మనం చేయాలనుకున్నది చేయమని దేవుడిని ఒత్తిడి చేయడానికి నిరాహారదీక్ష కాదు, లేదా చేయకూడదు. ఇది దేవునికి మనల్ని మనం వినయం మరియు సర్దుబాటు చేసే చర్య, తద్వారా ఆయన చిత్తం నెరవేరుతుంది మరియు అతని శక్తి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రార్థన మాస్టారు చూపిన ఉదాహరణ గురించి ఆలోచించడం మంచిది. అతను ప్రార్థన మనిషి. ఇది క్రొత్త నిబంధన పుస్తకాల అంతటా మళ్లీ మళ్లీ రుజువు చేయబడింది. రక్షకుని జీవితంలో అతను తన స్వర్గపు తండ్రితో ప్రార్థన మరియు కమ్యూనియన్‌లో నిమగ్నమవ్వని ప్రాముఖ్యత ఏ సందర్భమూ లేదు. ఇందులో, ఇతర విషయాలలో వలె, మనం ఆయనను మన నమూనాగా చూడాలి మరియు తండ్రితో రోజువారీ సంభాషణను కొనసాగించాలి. ప్రార్థన యొక్క ఉద్దేశ్యం అపోస్టల్ చార్లెస్ R. హిల్డ్ (సెయింట్స్ హెరాల్డ్, 1942, పేజీ 1033) ప్రార్థనకు సంబంధించి దేవుని ఉద్దేశాలను ఎత్తి చూపారు: “మనం ప్రార్థించే ముందు దేవుని గొప్ప శాశ్వతమైన ఉద్దేశాలను ధ్యానించడం మంచిది. సిద్ధాంతం మరియు ఒడంబడికలు 22:23bలోని ఆధునిక వెల్లడిలో, దేవుడు ఇలా చెప్పాడు: "....ఇది నా పని మరియు నా కీర్తి, మనిషి యొక్క అమరత్వాన్ని మరియు శాశ్వత జీవితాన్ని తీసుకురావడం." "దేవుడు . . . జీవితంలో ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంది. [అతని] లక్ష్యం ఇక్కడ భూమిపై ఒక సమాజాన్ని నిర్మించడం, దీనిలో పురుషులు తమ స్వంత స్వేచ్ఛతో, విశ్వం యొక్క శాశ్వతమైన, శాశ్వతమైన మరియు ప్రయోజనకరమైన చట్టాలకు కట్టుబడి ఉంటారు. ఈ భూమిపై విజయవంతంగా జీవించడంలో మనకు సహాయం చేయడానికి అతని జ్ఞానాన్ని మనం సురక్షితంగా ఉంచడానికి, ఆయన చట్టాలను మనం బాగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో మన ప్రార్థన దేవునికి పంపబడాలి. మేము బైబిల్ ప్రార్థనలను విశ్లేషించినప్పుడు, వారు ఈ నూతన సమాజాన్ని నిర్మించడంపై శ్రద్ధ వహిస్తున్నట్లు మేము కనుగొన్నాము - ఈ సమాజం నిత్యత్వపు నీతియుక్తమైన చట్టాలను పాటించడానికి అంకితం చేయబడింది. వ్యక్తిగత ప్రార్థన మన ప్రయత్నాలన్నిటినీ, ఆధ్యాత్మికంగానూ, తాత్కాలికంగానూ ప్రార్థనకు సంబంధించిన విషయాలుగా చేయమని సలహా ఇస్తున్నాము. ఇందులో మన ఆత్మ మరియు లక్షణ వికాసం, విశ్వాసం యొక్క ఇంటిలో మరియు వెలుపల ఇతరులతో మన సంబంధాలు, మన రోజువారీ రొట్టె మరియు శారీరక అవసరాలు మరియు ప్రత్యేకించి, జీవితంలోని అన్ని ప్రధాన మరియు చిన్న నిర్ణయాలు ఉన్నాయి. ప్రార్థన అనేది దేవుని చిత్తాన్ని నిర్ణయించే సాధనం. అవగాహన కోసం మొదట దేవుని ఆత్మను వెదకకుండా జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జీవితంలో అనేక కూడలిలో తప్పులు చేసే ప్రమాదం ఉంది. చర్చిలో పురుషులు మరియు మహిళలు చేసే చాలా తప్పులు యేసు యొక్క ఆజ్ఞను గుర్తుంచుకోవడంలో వైఫల్యం కారణంగా జరుగుతాయి "...పురుషులు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, మూర్ఛపోకూడదు." (లూకా 18:1) సెయింట్స్ యొక్క రోజువారీ జీవితంలో మరియు అలవాట్లలో చేర్చబడినప్పుడు ప్రార్థన చాలా అర్థవంతంగా మారుతుంది. దేవుని రోజువారీ సలహా కోసం అతనితో అపాయింట్‌మెంట్ తీసుకోవడం మరియు ఆ నియామకాన్ని మతపరంగా ఉంచుకోవడం తెలివైన పని. చాలా మంది వ్యక్తులు వ్యక్తిగత మరియు వ్యక్తిగత ధ్యానం మరియు ప్రార్థనల కోసం తమ ఇంటిలోని ఏదో ఒక మూలకు ప్రతిరోజూ కొద్దిసేపు పదవీ విరమణ చేయడం అలవాటు చేసుకున్నారు. వారికి, ఈ ప్రదేశం, బహుశా అదే ఇంటిలోని ఇతరులకు ప్రాముఖ్యత లేనిది, ప్రార్థన యొక్క బలిపీఠం అవుతుంది. ఇది ఒకరి పడకగదిలో ఒకరు ఒంటరిగా ఉండవచ్చు లేదా మూడు గ్రంథాల పుస్తకాలను ఉంచే గదిలో ఒక మూలలో ఉండవచ్చు లేదా ప్రకృతి యొక్క తాజా పువ్వులతో అలంకరించబడిన ప్రదేశం కావచ్చు. తండ్రి. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది ఒకరి ఆత్మను దేవునికి అతని ఆత్మతో ఖచ్చితమైన కమ్యూనికేషన్‌లో ఆకర్షించడానికి దృష్టిని అందిస్తుంది. ఒక వ్యక్తి ఉదయం లేదా సాయంత్రం తన మంచం పక్కన, సలహా మరియు జ్ఞానంతో తండ్రిని వెతకడానికి ఎంచుకోవచ్చు, కానీ అది ఎక్కడ మరియు ఎప్పుడు అయినా, ప్రతి వ్యక్తి రోజువారీ ప్రార్థన సమయంలో నిమగ్నమై ఉన్న పవిత్ర అభివృద్ధిలో ఇది చాలా ముఖ్యమైనది. . మానవ సంబంధాల విషయంలో ప్రార్థన ప్రత్యేక సహాయం చేస్తుంది. మరొక చోట, సోదరుల మధ్య తలెత్తే ఇబ్బందులను సర్దుబాటు చేసే పద్ధతులు ఇవ్వబడ్డాయి, కానీ నిజమైన ప్రార్థన యొక్క అలవాటును పెంపొందించినట్లయితే, ఈ ఇబ్బందులు ఎప్పటికీ పెరగవలసిన అవసరం లేదు. చర్చి యొక్క సోదరులు మరియు సోదరీమణుల కోసం ప్రార్థన వారి మధ్య మరియు వారిలో సామరస్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒకరి కోసం ప్రార్థిస్తున్నప్పుడు, వారి పట్ల చేదు ఆలోచనలు పెరగవని నిజంగా చెప్పబడింది. అప్పుడు అన్ని సమయాలలో ప్రార్థన చేయాలి; దుఃఖంలో ఉన్నప్పుడు, సందేహంలో ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు మరియు ఒకరు ఆశీర్వదించబడినప్పుడు, ఒకరు ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మరియు సోదరులతో ఉన్నప్పుడు. వ్యక్తిగత మార్గంలో ప్రార్థన మరియు ఆరాధనకు సహాయంగా చర్చి యొక్క శ్లోకాలు అమూల్యమైనవి. శ్లోకాలలో ఎక్కువ భాగం అవసరమైన ఆత్మ యొక్క ఉద్గారాలు మరియు ప్రార్థన మరియు ధ్యానంలో ఒకరి అవసరాలను నిర్దేశించడానికి తగిన విధంగా ఉపయోగించబడతాయి. సభ్యులు పవిత్ర గ్రంథాలను కూడా ఈ విధంగా ఉపయోగించాలి. ప్రజా ప్రార్థన ప్రార్థన అనేది వ్యక్తిగత మరియు వ్యక్తిగత భక్తికి సంబంధించిన విషయం కానవసరం లేదు. వాస్తవానికి, మేము ప్రైవేట్ మరియు బహిరంగ ప్రార్థనలను ఆచరించాలని ఆజ్ఞాపించాము. ప్రార్థనలో పాల్గొనడానికి చర్చి సేవలలో అనేక అవకాశాలు అందించబడతాయి. చర్చి యొక్క అన్ని శాఖలు మరియు సమ్మేళనాలలో ప్రార్థన సమావేశాలు నిర్వహించబడాలి మరియు ఒక మంచి చర్చి సభ్యుడు ఈ గుంపు అపాయింట్‌మెంట్‌ను ఉంచడానికి శ్రద్ధ వహిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనా సమావేశాలలో పాల్గొనడానికి ప్రయత్నించాలి మరియు అలా చేయడానికి అవసరమైన సామర్థ్యం మరియు ధైర్యం వ్యక్తికి మరియు సమూహానికి పర్యవసానంగా ప్రయోజనం చేకూరుస్తాయని కనుగొనబడుతుంది. ఇతర చర్చిల నుండి వస్తున్న అనేక మంది వ్యక్తులు ఆచారాలు మరింత లాంఛనప్రాయంగా ఉంటాయి మరియు వ్యక్తిగత స్వర ప్రార్థనలు ప్రోత్సహించబడవు, బహిరంగంగా పంచుకోవడం కష్టంగా అనిపించవచ్చు, అయితే ఇది ఆధ్యాత్మిక వృద్ధిలో అత్యంత ఏకీకృత మరియు ఉత్తేజపరిచే వ్యాయామాలలో ఒకటిగా అనుభవం ద్వారా నిరూపించబడింది. ఈ చర్చిలో అధికారికంగా ముద్రించిన ప్రార్థనలు ఉపయోగించే సందర్భాలు చాలా తక్కువ. మా సూత్రం, ముద్రిత ప్రార్థనలు ప్రభువు ప్రార్థన మరియు మతకర్మ సేవలో చిహ్నాల ఆశీర్వాదం కోసం ప్రార్థనలు. వ్యక్తిగత ఆరాధకుడు కాకుండా వేరొకరు గతంలో తయారుచేసిన అధికారిక ప్రార్థనలు ఆకస్మికత మరియు నిర్దిష్ట దిశలో లేకపోవడం యొక్క ప్రతికూలతను కలిగి ఉంటాయి, అయినప్పటికీ ఆరాధకుడు ఆ ప్రార్థన యొక్క పూర్తి ఆత్మలోకి ప్రవేశించగలిగితే, మంచి లభిస్తుంది. ఇతరుల మనోహరమైన ప్రార్థనలలో కొన్ని భగవంతుని అందం మరియు సరళమైన వాక్చాతుర్యంతో మన స్వంత సామర్థ్యాన్ని మలుచుకోవడానికి సహాయపడతాయి. ఏది ఏమైనప్పటికీ, నిండు హృదయం నుండి వెలువడే ప్రార్థన కంటే దేవునికి ఆమోదయోగ్యమైన ప్రార్థన మరొకటి లేదు, అయితే అది పాతికేళ్లలో ఒకరు ప్రార్థించినట్లుగా కొన్ని మాటలు మాత్రమే. "...దేవా, పాపిని అయిన నన్ను కరుణించు." (లూకా 18:13) నమూనా ప్రార్థన ప్రార్థన యొక్క సరైన అభ్యాసానికి ప్రభువు ప్రార్థన అని సాధారణంగా పిలువబడే ఉదాహరణ కంటే మెరుగైన మార్గదర్శి మరొకటి ఉండదు. ఈ ప్రార్థనను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, ప్రతి నిర్దిష్ట అవసరానికి సంక్షిప్త పంక్తి లేదా రెండింటిలో ఉన్నప్పటికీ, అవసరమైన అన్ని విషయాలు చేర్చబడ్డాయి. ఈ ప్రార్థన దేవునితో మనకున్న సంబంధాన్ని గుర్తిస్తుంది, ఆపై (ఎ) మనుష్యులచే అతని పేరును పవిత్రం చేయమని విజ్ఞప్తి చేస్తుంది; (బి) రాజ్యం యొక్క రాకడ కోసం; (సి) భూమిపై ఆయన చిత్తం చేయడం కోసం; (డి) జీవితంలోని రోజువారీ భౌతిక అవసరాల కోసం; (ఇ) ఇతరులను క్షమించేందుకు మన స్వంత సుముఖత ప్రకారం మన అపరాధాల క్షమాపణ కోసం; (ఎఫ్) టెంప్టేషన్‌ను తట్టుకునే శక్తి కోసం; (g) చెడు నుండి విముక్తి కోసం; (h) సమస్త శక్తి మరియు మహిమలు తండ్రిలో నివశిస్తున్నాయని మరియు మానవాళికి బహుమానంగా అన్ని సమయాలలో ఆయన వద్ద ఉన్నాయని గుర్తించడం కోసం. ఈ అవసరాలన్నింటికీ, ఒక వ్యక్తి తనదైన రీతిలో ప్రార్థించాలి మరియు భగవంతునికి నిరంతరం ప్రార్థన చేయాలి. చర్చిలోని ప్రతి సభ్యుడు ప్రార్థన కళను పెంపొందించడానికి మరియు ఆచరించడానికి ప్రయత్నించాలి, దేవుని ఉద్దేశాలు వాటిలో నెరవేరుతాయి మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని మనుష్యులందరికీ పూర్తిగా తెలియజేయాలి. చర్చి హాజరు చర్చి హాజరు నిజమైన సెయింట్స్ జీవితంలో ఒక ముఖ్యమైన లక్షణం. దాని సభ్యుల ప్రధాన బాధ్యతగా చర్చికి రెగ్యులర్ హాజరును అంగీకరించడం చర్చి ప్రయోజనాలకు మరియు వ్యక్తిగత ఆత్మ యొక్క అవసరాలకు అవసరం. ఈ బాధ్యత మరియు అధికారాన్ని అభినందించడానికి, చర్చి యొక్క స్వభావం మరియు మూలం పూర్తిగా గ్రహించబడాలి. ఒక సభ్యుడు చర్చికి ఎందుకు హాజరు కావాలి? ఎందుకంటే చర్చి దైవికంగా స్థాపించబడింది చరిత్రలో దేవుని చర్యకు చర్చి దాని ఉనికికి రుణపడి ఉంది. భగవంతుని నుండి దాని పేరును పొందిన మరియు అతని నుండి మాత్రమే దాని శక్తిని పొందే ఏకైక సంస్థ ఇది. అతని కోసం అధికారపూర్వకంగా వ్యవహరించే మరియు దాని మొదటి ఉద్దేశ్యంగా, అతని ఉద్దేశ్యాన్ని నెరవేర్చే ఏకైక సంస్థ ఇది. ఎందుకంటే చర్చి ఫెలోషిప్‌ను నొక్కి చెబుతుంది చర్చి అనేది ఉమ్మడి ఆదర్శాలు, విశ్వాసం మరియు ప్రయోజనాలతో "బంధించే టై" ద్వారా కలిసి ఉంటుంది. దాని సభ్యులు ఫెలోషిప్‌ను నొక్కి చెబుతారు, సాధారణ తండ్రి పిల్లలుగా కలిసి ఉండాలనే భావన. ఇది పరస్పర ప్రేమ, బాధ్యత మరియు సేవ యొక్క సంబంధాలలో కలిసి జీవించే వ్యక్తుల సహవాసం. ఇది మొదట చిన్న సమూహాలలో, ఆపై జియోనిక్ సెంటర్‌లో సోదరభావాన్ని ఆదర్శంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న ఫెలోషిప్. యోహాను పదిహేడవ అధ్యాయంలో యేసు తన అనుచరుల కోసం చేసిన ప్రార్థన పై ప్రకటనలకు లేఖనాధారాన్ని ఇస్తుంది. చర్చి సభ్యులు దానిని జాగ్రత్తగా అధ్యయనం చేయమని ప్రోత్సహించబడతారు. ఎందుకంటే చర్చిలో మేము సాధారణ ఆరాధనలో పాల్గొంటాము ఇది ఆరాధన మరియు చర్యల యొక్క ఐక్యత జీవితాన్ని పవిత్రమైన ఉద్దేశ్యమైనదిగా మార్చే ప్రదేశం. ఇక్కడ మేము అనుభవాలను పంచుకుంటాము మరియు కొత్త అంతర్దృష్టి మరియు ప్రేరణ పొందుతాము; మనం కలిసి దైవిక ఉనికిని గ్రహిస్తాము మరియు కలిసి ఆయన ఉద్దేశాలకు మనల్ని మనం అంకితం చేసుకుంటాము. అలాంటి ఆరాధన వ్యక్తిగత మరియు సామాజిక సామరస్యానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చర్చి ప్రేమ యొక్క సంఘం చర్చి జీవితం దేవుని ప్రేమలో పాతుకుపోయింది. అది "మనుష్యులు ప్రేమించే ప్రదేశం మరియు సంబంధం ఎందుకంటే వారు దేవుని ప్రేమకు వస్తువులు" మరియు ఇక్కడ పితృత్వం, పుత్రత్వం మరియు సోదరభావం నొక్కి చెప్పబడతాయి. ఇది మోక్షానికి నిలయం. చర్చి ద్వారా, దేవుని ప్రేమ సాక్ష్యమివ్వడమే కాకుండా అది తాకిన వారిని రక్షించడానికి స్వేచ్ఛగా ఉంచబడుతుంది. ఎందుకంటే, చర్చిలో, మేము ఆలోచన యొక్క ఐక్యతను సాధిస్తాము సహవాసంలో మనం జీవితం యొక్క అర్థాల గురించి స్పష్టమైన, లోతైన మరియు గొప్ప అవగాహన కోసం ప్రయత్నిస్తాము. చర్చి అనేది దేవుని పరంగా ఆలోచించడానికి, జీవితపు నిజమైన ముగింపులకు సంబంధించి ఆలోచనా విధానంలో స్పష్టత పెరగడానికి ఒక ప్రదేశం. ఇది "ఆలోచన యొక్క ప్రతిస్పందన" అలాగే ప్రేమ యొక్క ప్రతిస్పందనను కలిసే ప్రదేశం. ఇక్కడ మనం మన మంచి కోసం, ఇతరుల మేలు కోసం మరియు విశ్వాసుల సామూహిక శరీరం యొక్క పురోగతి కోసం మా ఉత్తమ ఆలోచనలను పూల్ చేస్తాము. ఎందుకంటే చర్చి ఒక అభ్యాస సంఘం చర్చి అనేది క్రీస్తు యొక్క వెల్లడి యొక్క లోతైన సత్యాల బోధన కోసం నియమించబడిన మరియు అంకితం చేయబడిన ఒక సంస్థ. ఇక్కడ, నిరంతర బోధన ద్వారా, మనం క్రమంగా క్రీస్తు మనస్సులోకి మారతాము. చర్చిలో మనం దేవుని కోసం మనుషులను నిర్మించే గొప్ప సృజనాత్మక ప్రయత్నంలో చేరాం. ఇక్కడ మేము జాగ్రత్తగా, తెలివిగా మరియు క్రమపద్ధతిలో "పదం" నిజంగా మాంసంగా మారేలా నిర్మించడానికి ప్లాన్ చేస్తాము. ఎందుకంటే చర్చి శక్తివంతమైన, సామూహిక సాక్షి చర్చి కమ్యూనిటీ అనేది దాని స్వంత జ్ఞానం, నమ్మకాలు మరియు విశ్వాసాల ద్వారా ఇతరులతో పంచుకోవడానికి కట్టుబడి ఉన్న సమూహం. వీటిని పురుషులందరికీ తెలియజేసేందుకు కట్టుబడి ఉంది. చర్చి సేవల యొక్క బాగా హాజరైన, స్థిరమైన ప్రోగ్రామ్‌తో ఒక శాఖలో సాక్షి యొక్క శక్తి చాలా గొప్పది మరియు సంఘంపై ప్రభావం సాక్షిలో శక్తివంతమైనది. ఎందుకంటే మేము ఈ విధంగా ఉద్యమానికి కట్టుబడి ఉన్నాము మన విధేయతను మరియు దేవుని ప్రజలతో పంచుకోవడాన్ని బహిరంగంగా ప్రకటించడం అంటే మన బాప్టిజం మనకు కట్టుబడి ఉన్న ప్రమాణాలను కొనసాగించడంలో అమూల్యమైన సహాయాన్ని పొందడం. క్రమం తప్పకుండా హాజరుకాకుండా ఒక మంచి సభ్యుడు కాగలరా? క్రమం తప్పకుండా హాజరుకాని వారు తమ ఆధ్యాత్మిక జీవితాలను క్రమపద్ధతిలో పెంపొందించుకోవడానికి అన్ని ఇతర మార్గాలను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. సువార్త చర్యలో చాలా లక్షణమైన మరియు అవసరమైన ఆ సహవాసం నుండి వారు క్రమంగా తమను తాము వేరు చేసుకుంటారు. వారు క్రీస్తు కొరకు సాక్ష్యమివ్వడానికి ఎటువంటి ప్రత్యేక ప్రయత్నం చేయడంలో విఫలమవుతారు మరియు చర్చికి ఇతర మార్గాల్లో, సమయం, సాధనాలు మరియు ప్రతిభకు మద్దతు ఇవ్వడంలో విఫలమవుతారు. వారు ఆధ్యాత్మిక కాంతి మరియు శక్తి యొక్క ప్రాథమిక మూలమైన మానవాళికి సేవ చేయడంలో విఫలమవుతారు మరియు వారు వారి గురించి జీవిత లక్షణాలను తీసుకుంటారు మరియు దాని ప్రయోజనం కోసం తమను తాము అంకితం చేసుకుంటారు, ఉన్నత స్థాయికి వెళ్లకుండా, వారి లక్ష్యాన్ని తగ్గించుకుంటారు. , చివరకు పూర్తిగా రాజ్యం యొక్క సహవాసం నుండి క్రిందికి కూరుకుపోతుంది. సెయింట్‌హుడ్ యొక్క గొప్ప మతకర్మ అనుభవాలు సాధువులతో నిరంతరం సమావేశమవ్వకుండా సాధ్యం కాదు. చర్చి యొక్క అన్ని శాసనాలు హాజరుకాని వారిచే తప్పిపోతాయి. కమ్యూనియన్, వివాహం, బాప్టిజం, నిర్ధారణ మరియు ఆశీర్వాదం యొక్క మతకర్మలు ఐక్యత మరియు ఉద్దేశ్యాన్ని గ్రహించడానికి కలిసి చేరే విశ్వాసుల సంస్థగా ఉంటే తప్ప సాధ్యం కాదు. సెయింట్‌లీ అనుభవం యొక్క ఈ ప్రయోజనాల కోసం ఏ సమావేశాలు అందించబడతాయి? చర్చి యొక్క చాలా సమావేశాలు స్థానిక శాఖలో తమ దృష్టిని కేంద్రీకరిస్తాయి. స్థానిక సమావేశాలకు మద్దతివ్వడం అంటే అత్యంత ప్రభావవంతమైన వృద్ధి సమయంలో చర్చితో క్రమమైన మరియు నిరంతర సంబంధాన్ని కలిగి ఉండటం. జనరల్ కాన్ఫరెన్స్‌లు, రీయూనియన్‌లు మరియు ఇతర సమావేశాలలో సెయింట్స్‌తో సమావేశం మొత్తం చర్చితో ఐక్యతను కలిగిస్తుంది, అయితే ఈ పెద్ద సమావేశాల విలువ సన్నిహిత శాఖ జీవితంలో వ్యక్తిగత భాగస్వామ్యం మరియు పరిచయంపై ఆధారపడి ఉంటుంది. ఒక సభ్యుడు మతకర్మ మరియు ప్రార్థన సేవలకు స్థిరత్వంతో హాజరు కావాలి. ఈ సమావేశాల విలువ ఇతర విభాగాలలో వ్యక్తీకరించబడింది, అయితే సెయింట్ జీవితంలో వాటి ప్రాథమిక ప్రాముఖ్యతను ఎక్కువగా నొక్కి చెప్పలేము. ఏది ఏమైనప్పటికీ, ఒక సభ్యుడు అందించిన అన్ని సేవలకు వీలైనంత వరకు హాజరు కావాలి, ఎందుకంటే సాధారణ బోధన, చర్చి పాఠశాల మరియు ఇతర డిపార్ట్‌మెంటల్ సేవలలో, అతను చర్చి యొక్క రాజ్య నిర్మాణ కార్యక్రమం యొక్క వ్యక్తీకరణకు సూచించబడతాడు మరియు ప్రేరేపించబడ్డాడు. వివిధ సభ్యుల వ్యక్తిగత పేరు మరియు వయస్సుకు అనుగుణంగా ప్రత్యేక సమూహ సంస్థల ద్వారా చర్చి యొక్క పని దాని వ్యక్తీకరణను కనుగొంటుంది. ప్రతి సభ్యుడు తన అవసరాలను తీర్చడానికి అత్యంత సముచితమైన డిపార్ట్‌మెంట్‌లో క్రియాశీల సభ్యత్వంలో నిమగ్నమవ్వాలి మరియు అతను తన ఉత్తమ సహకారాన్ని అందించే అవకాశాన్ని పొందగలడు. విస్తృత రంగంలో, చర్చి యొక్క వివిధ సమావేశాలు మరియు పునఃకలయిక కార్యకలాపాలలో సెయింట్స్‌తో కలవడానికి సభ్యుడు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వీటిని పంచుకోవడం వల్ల మనల్ని ఉమ్మడి శరీరంగా కలుస్తుంది. పునరుద్ధరణ ఉద్యమం యొక్క ప్రాథమిక లక్ష్యం అయిన జియోనిక్ సొసైటీ అభివృద్ధిలో మీరు నివసించే ప్రాంతం కోసం ప్లాన్ చేసిన రీయూనియన్‌లకు హాజరు కావడం అత్యంత విలువైన సహాయం. రీయూనియన్లు అన్ని వయసుల వారికి ఉంటాయి. ప్రతి యువకుడు కూడా యువజన శిబిరాలలో తన వయస్సు గల వారితో పంచుకోవడానికి ప్రయత్నించాలి, అలాగే చిన్న పిల్లలకు వెకేషన్ చర్చ్ స్కూల్ కార్యకలాపాల మంత్రిత్వ శాఖ అవసరం. ఈ కార్యకలాపాల ప్రయోజనాన్ని పొందడం వ్యక్తి రాజ్య నిర్మాణ కార్యకలాపాల్లో ఎదగడానికి సహాయం చేస్తుంది. "శాఖ" అనే పదం ఒక పెద్ద జీవి ఉనికిని సూచిస్తుంది. చెట్టుకు కొమ్మ ఉన్నట్లే, స్థానిక సమాజం చర్చికి పెద్దది. చెట్టులో వలె, జీవితానికి రెండు-మార్గం చర్య అవసరం-వేర్ల నుండి కొమ్మల వరకు మరియు కొమ్మల నుండి తిరిగి చెట్టు యొక్క శరీరం వరకు-అలాగే చర్చిలో కూడా రెండు-మార్గం కమ్యూనికేషన్ ఉండాలి. అందువల్ల ప్రతి సభ్యుడు క్రీస్తు శరీరంలో తన భాగాన్ని గ్రహించాలి మరియు అతను స్థానిక శాఖలో మాత్రమే కాదు, చర్చి యొక్క ప్రపంచవ్యాప్త ఫెలోషిప్‌లో ఒక భాగమని గుర్తించాలి. చర్చి పాఠశాలకు నా సంబంధం ఏమిటి? చర్చి స్కూల్‌ను "చర్చ్ ఎట్ స్కూల్"గా వర్ణించారు. ఈ నిర్వచనం ప్రకారం, చర్చిలోని ప్రతి సభ్యుడు ఈ విభాగం మాధ్యమం ద్వారా సూచనలను మరియు సహాయాన్ని పొందాలి. చర్చి స్కూల్ ఆదివారం పాఠశాల యొక్క పాత భావన నుండి భిన్నంగా ఉంటుంది, ఇది వారం రోజులలో మరియు ఆదివారాలలో ఇతర కార్యకలాపాలను అందిస్తుంది మరియు కలిగి ఉంటుంది. చర్చ్ స్కూల్ ద్వారా, అన్ని వయసుల వారికి క్రీస్తు బోధనలను నేర్చుకోవడానికి, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఆదివారం, ఆరాధన మరియు మతపరమైన అధ్యయనం కోసం పాఠశాల మొత్తం కలుస్తుంది మరియు చర్చిలోని ప్రతి సభ్యుడు ఈ వ్యాయామాలలో పాల్గొనాలి. సగటు పరిమాణంలో ఉన్న చాలా పాఠశాలల్లో, ఈ సేవ యొక్క ఒక కాలవ్యవధి మొత్తం కుటుంబం కలిసి ఆరాధించే సమ్మిళితమైనది, ఆపై అధ్యయనం మరియు ఇతర కార్యకలాపాల కోసం వయస్సు ప్రకారం గ్రేడెడ్ సమూహాలుగా విభజించబడింది. మతపరమైన విద్య యొక్క సాధారణ విభాగం ద్వారా అధ్యయనాలు తయారు చేయబడతాయి; అందువల్ల జియాన్-నిర్మాణానికి అవసరమైన విషయాలను అధ్యయనం చేయడంలో సభ్యత్వం చర్చి అంతటా ఏకీకృతమైంది. ప్రతి సభ్యుడు చర్చి పాఠశాలకు హాజరు కావాలి. సాధారణ పర్యవేక్షణ అధ్యయనంలో మాత్రమే ఫలితాలు సాధించబడతాయి. సభ్యుల కోసం ఏ ఇతర విభాగాలు నిర్వహించబడతాయి? పెద్దలు, యువకులు మరియు పిల్లలు వారి ప్రత్యేక విభాగాలలో చర్చి స్కూల్ ద్వారా పరిచర్య చేయబడినప్పటికీ, మహిళలు మరియు యువకుల కోసం ప్రత్యేక డిపార్ట్‌మెంటల్ సంస్థ అమలు చేయబడింది. మహిళా విభాగం చర్చిలోని ప్రతి స్త్రీకి తన ప్రత్యేక సామర్థ్యాలు మరియు ఆసక్తులకు తగినట్లుగా అధ్యయనం చేయడానికి మరియు ఆ కార్యకలాపాలలో పాల్గొనడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఈ డిపార్ట్‌మెంట్‌లో నిమగ్నమై ఉన్న అనేక కార్యకలాపాలలో స్నేహపూర్వక సందర్శన, క్రెడిల్ రోల్ వర్క్, సోషల్ వర్క్ మరియు యాక్టివిటీస్ మరియు ఫ్యామిలీ స్టడీస్ మరియు హెల్ప్‌లు ఉన్నాయి. విభాగం ప్రత్యేక ఆసక్తి సర్కిల్‌లను అందిస్తుంది. ప్రతి సభ్యుడు సేవ మరియు అభివృద్ధి కోసం ఇక్కడ ఒక ఛానెల్‌ని కనుగొనవచ్చు. యూత్ డిపార్ట్‌మెంట్ చర్చి యొక్క యువత మొత్తం పెరుగుదల మరియు అభివృద్ధి కోసం నిర్వహించబడింది. సాధారణ మెరుగుదల అధ్యయనాలు, వ్యక్తీకరణ మరియు అభివృద్ధి స్వభావం యొక్క ప్రత్యేక కార్యకలాపాలు, ఆరాధన, బహిరంగ ప్రసంగం, నాటకం మరియు సేవ కోసం అవకాశాలు ఈ కార్యక్రమాలలో పొందుపరచబడ్డాయి. నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధికి ఇది చక్కటి అవకాశాలలో ఒకటి మరియు ఈ ముఖ్యమైన కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడాన్ని ఏ యువకుడూ నిర్లక్ష్యం చేయలేరు. ఈ విభాగాలతో పాటు, జూనియర్ మరియు సీనియర్ యువకులకు సదుపాయం కల్పించబడింది. మా యంగ్ లేడీస్ కోసం హ్యాండ్‌మైడెన్స్ మరియు మా యువకుల కోసం శేషాచల యోధులు వంటి కార్యక్రమాలు చర్చి అంతటా సాధ్యమయ్యే ప్రోగ్రామ్‌లు మరియు ఆపరేట్ చేయడానికి ఖరీదైనవి కానవసరం లేదు. సమూహం మరియు వ్యక్తిగత అభివృద్ధిని నొక్కిచెప్పే కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించబడినప్పటికీ, ఈ యువకుల ప్రయోజనాలకు తగిన అన్వేషణ కార్యకలాపాలు సులభంగా స్వీకరించదగినవి. ఇంకా, స్థానిక శాఖలు ప్రతి సంఘం యొక్క ఆసక్తులు మరియు అవసరాలకు సంబంధించి తమ సొంత యువతకు చేరువయ్యే కార్యక్రమాలను ప్రోత్సహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి బాగా ప్రోత్సహించబడ్డాయి. అధ్యాయం 5 లార్డ్ సప్పర్ యొక్క మతకర్మ లార్డ్స్ సప్పర్ యొక్క మతకర్మ అనేది మన ప్రారంభ బాప్టిజం ఒడంబడికను అనుసరించే అత్యంత ముఖ్యమైన శాసనం మరియు తరువాతి రోజు సెయింట్స్ యొక్క జీసస్ క్రైస్ట్ యొక్క అవశేష చర్చ్‌లో మనం సభ్యులుగా మారిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క నిర్ధారణ. లార్డ్స్ సప్పర్ యొక్క మతకర్మ ఒక స్మారక చిహ్నం ఈ సేవ యేసుక్రీస్తు స్థాపించిన స్మారక చిహ్నం, దీని ద్వారా మనం మానవాళి కోసం మరణంలో ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకుంటాము. ఆ త్యాగం యొక్క పాత్ర మరియు దాని ప్రాముఖ్యత మరియు సుదూర ప్రభావాలు, దానిని జ్ఞాపకశక్తిలో తాజాగా ఉంచాల్సిన అవసరం ఉంది, లేకుంటే మనం దాని ప్రాముఖ్యతను కోల్పోతాము. యేసు స్వయంగా ఈ మతకర్మను స్మారక చిహ్నంగా నిర్వచించాడు. ఆయన శిలువ వేయబడక ముందు తన శిష్యులతో కలిసి ఉన్నప్పుడు, ఈ క్రింది మాటలతో రొట్టె మరియు ద్రాక్షారసాన్ని తన అనుచరులకు అందజేసినప్పుడు అతను ఈ స్మారక చిహ్నాన్ని స్థాపించాడు: "... తీసుకోండి, తినండి; ఇది నా శరీరం యొక్క జ్ఞాపకం..." (మత్తయి 26:22 "...ఇది నా రక్తానికి గుర్తుగా..." (మత్తయి 26:24) మోర్మన్ గ్రంథంలో నెఫైట్లకు, ఆయన ఇలా అన్నాడు, "మరియు మీరు నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయాలి, ..." మరియు "...నా రక్తాన్ని స్మరించుకుంటూ మీరు దీన్ని చేయాలి..." (3 నీఫై 8:34, 40) ఇది ఒక ఒడంబడిక ఈ మతకర్మ అనేది బాప్టిజం సమయంలో చేసిన ఒడంబడిక యొక్క పునరుద్ధరణ. మినహాయింపు లేకుండా, చిహ్నాలను నిర్వహించే సమయంలో ఉపయోగించే ఆశీర్వాద ప్రార్థనల పదాలలో ఇది ఉత్తమంగా వివరించబడింది.. "ఓ దేవా, శాశ్వతమైన తండ్రీ, ఈ రొట్టెలో పాలుపంచుకునే వారందరి ఆత్మలను ఆశీర్వదించమని మరియు మీ కుమారుని శరీరాన్ని జ్ఞాపకార్థం తినడానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మేము నిన్ను అడుగుతున్నాము. మరియు నీకు సాక్ష్యమివ్వండి, 0 శాశ్వతమైన తండ్రి, వారు నీ కుమారుని పేరును వారిపైకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మరియు ఎల్లప్పుడూ అతనిని గుర్తుంచుకోవాలి మరియు ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞలను పాటించండి, తద్వారా వారు ఎల్లప్పుడూ అతని ఆత్మను కలిగి ఉంటారు. వాటిని. ఆమెన్." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 17:22d) అదే విభాగంలోని తదుపరి పేరాలో ద్రాక్షారసం కొరకు ఆశీర్వాద ప్రార్థన. ప్రభువు భోజనం మన జీవితాల్లో ఎలాంటి ఫలితాలను తీసుకురావాలి? ప్రభువు రాత్రి భోజనం యొక్క చిహ్నాలను తెలివిగా మరియు భక్తితో పాలుపంచుకున్న తర్వాత, ఒక వ్యక్తికి పరిశుభ్రత, దేవుని ముందు సమర్థించబడడం, జీవితంలో కొత్త ప్రారంభాన్ని పొందే అవకాశం మరియు బాప్టిజంలో ఈ మొదటి ఒడంబడికను మరింత పూర్తిగా కొనసాగించాలనే సంకల్పం ఉండాలి. . మన అసలు బాప్టిజం ఒడంబడికను ఎంత విస్మరించాలో క్రీస్తుకు తెలుసు, మరియు మన బాప్టిజం రోజున ఆ శుభ్రతను తిరిగి పొందే అవకాశాన్ని మనకు ఇస్తాడు. మనం తరచుగా కలిసి ప్రార్థనలో కలుస్తామని, ఆయన విరిగిన శరీరం యొక్క చిహ్నాలను స్వీకరించడానికి మనం క్రమం తప్పకుండా కలుస్తామని మరియు ఆయన త్యాగాన్ని గుర్తుచేసుకోవడం ద్వారా ఆయనను సేవించాలనే మరియు ఆయన ఆజ్ఞలను పాటించాలనే మన ఉద్దేశాన్ని పునరుద్ఘాటించే అవకాశాన్ని కలిగి ఉన్నాము. ఈ విధంగా, కమ్యూనియన్ యొక్క గొప్ప విలువ పాలుపంచుకునే వ్యక్తిలో హృదయం యొక్క చిత్తశుద్ధిలో ఉంటుంది. మతకర్మలో పాల్గొనడానికి ఒకరి కర్తవ్యం ఏమిటి? ప్రతి సాధువు రొట్టె మరియు వైన్ యొక్క చిహ్నాలను తీసుకోవడం అతని యోగ్యతను పరిశీలించడం. ఈ యోగ్యతలో ఇతరుల పట్ల, చర్చి పట్ల మరియు ముఖ్యంగా రక్షకుని పట్ల సరైన వైఖరి ఉంటుంది. మతకర్మ యొక్క గొప్ప విలువ ఒక పాలుపంచుకోవడంలో సంభవించే ఆధ్యాత్మిక మార్పులో ఉంటుంది; కాబట్టి, చిహ్నాలను మరియు సేవను తేలికగా పరిగణించడం పాపం. అతను యోగ్యతతో పాలుపంచుకునేలా చూడడానికి ప్రతి సభ్యునిపై బాధ్యత ఎక్కువగా ఉంచబడుతుంది. యోగ్యతను నిర్ణయించే ఏకైక బాధ్యత పాల్గొనే వ్యక్తికి ఉందా? ప్రిసైడింగ్ అధికారిపై చాలా ఖచ్చితమైన బాధ్యత ఉంది మరియు అతిక్రమించినట్లు తెలిసిన వ్యక్తి తనపై నిందను తెచ్చుకోకుండా మరియు అనర్హతతో పాల్గొనడం ద్వారా ప్రభువు మరియు చర్చిపై అవమానాన్ని కలిగించకుండా చూసేందుకు మతకర్మను నిర్వహించాలని మంత్రులు పిలుపునిచ్చారు. "మరియు ఇప్పుడు ఇదిగో, నేను మీకు ఇస్తున్న ఆజ్ఞ ఇదే, మీరు ఎవరికీ తెలియకుండా నా మాంసాన్ని మరియు రక్తాన్ని తినకూడదని, మీరు పరిచర్య చేసినప్పుడు, ఎవరు నా మాంసాన్ని మరియు రక్తాన్ని అనర్హతగా తిని త్రాగుతారు. అతని ఆత్మకు తిండి త్రాగుతుంది." (III నీఫై 8:60) “కాబట్టి ఒక వ్యక్తి నా మాంసం మరియు రక్తాన్ని తినడానికి మరియు త్రాగడానికి అనర్హుడని మీకు తెలిస్తే, మీరు అతన్ని నిషేధించాలి; అయినను మీరు అతనిని మీ మధ్యనుండి వెళ్లగొట్టకూడదు, అయితే మీరు అతనికి పరిచర్య చేయవలెను మరియు అతని కొరకు నా నామమున తండ్రికి ప్రార్థించవలెను. (III నీఫై 8:61) "మరియు అది అలా అయితే అతను పశ్చాత్తాపపడతాడు, మరియు బాప్టిజం పొందాడు నా పేరు మీద, అప్పుడు మీరు అతనిని అందుకుంటారు, మరియు కమిటీ నా మాంసాన్ని మరియు రక్తాన్ని అతనికి పరిచర్య చేయండి;” (III నీఫై 8:62) లార్డ్స్ సప్పర్ యొక్క మతకర్మలో నేను ఎంత తరచుగా పాల్గొనాలి? లార్డ్స్ సప్పర్ యొక్క మతకర్మలో పాల్గొనడం యొక్క ఖచ్చితమైన ఫ్రీక్వెన్సీ ఇవ్వబడలేదు. అయినప్పటికీ, మేము ఆదేశిస్తాము "ప్రభువైన యేసు జ్ఞాపకార్థం రొట్టె మరియు ద్రాక్షారసంలో పాలుపంచుకోవడానికి చర్చి తరచుగా కలుసుకోవడం మంచిది." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 17:22) తరువాతి కాలంలో, చర్చిలో అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు మరియు ప్రజలు సామరస్యాన్ని సాధించడానికి సహాయం చేయడానికి మార్గదర్శకత్వం అవసరమైనప్పుడు, ఈ క్రిందివి ఇవ్వబడ్డాయి: "... మతకర్మను మరియు దానిని నిర్వహించే సమయాన్ని గౌరవించడం మానేయండి; అది ప్రతి నెల మొదటి ప్రభువు రోజున అయినా, లేదా ప్రతి వారం ప్రభువు రోజున అయినా, చర్చి అధికారులు చిత్తశుద్ధితో నిర్వహించినట్లయితే. హృదయం మరియు ఉద్దేశ్యం యొక్క స్వచ్ఛతతో, మరియు యేసుక్రీస్తును స్మరించుకోవడంలో పాలుపంచుకోండి మరియు పాలుపంచుకునే వారి ద్వారా అతని పేరును వారిపైకి తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి, అది దేవునికి ఆమోదయోగ్యమైనది." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 119:5a, b) ప్రతి నెల మొదటి ఆదివారం నాడు భగవంతుని భోజనం యొక్క సంస్కారాన్ని పాటించడం ఇప్పుడు ఆచారం. అప్పుడప్పుడు మాత్రమే కలిసే గుంపులు, కలిసినప్పుడు అందులో పాల్గొనవచ్చు. పైన పేర్కొన్న విధంగా అధీకృత అర్చకత్వం యొక్క ప్రాథమిక అవసరాలు ఉన్నంత వరకు ఇది ఆమోదయోగ్యమైనది. మతకర్మలో ఎవరు పాల్గొనవచ్చు? చర్చి సన్నిహిత కమ్యూనియన్ యొక్క అభ్యాసాన్ని అనుసరిస్తుంది, అంటే, అతని చర్చి యొక్క అధీకృత మంత్రులచే నిర్వహించబడే బాప్టిజం ఒడంబడిక ద్వారా చర్చిలోకి ప్రవేశించిన వారికి మాత్రమే మతకర్మ సేవలో చిహ్నాలను అందిస్తారు. ఇది నిజం అయితే, ఎవరైనా మతకర్మ సేవకు హాజరు కావచ్చు మరియు ఈ సేవలకు హాజరు నుండి ఎవరినీ మినహాయించమని మేము ఆదేశించాము. అధ్యక్షుడు FM స్మిత్ "రెండవ గొప్ప మతకర్మ"గా వర్ణించిన ఈ మతకర్మ, ఒక ఒడంబడిక యొక్క పునరుద్ధరణ, లేని వ్యక్తి చేసింది బాప్టిజం నీటిలో అతని ఒడంబడిక, వాస్తవానికి, దానిని పునరుద్ధరించదు. అటువంటి సమావేశాలకు స్నేహితులను ఆహ్వానించే ఒక సాధువు ఈ నమ్మకాన్ని వారికి తెలియజేయడం మంచిది. సేవకు ముందు ఇలా చేస్తే ఇబ్బంది తప్పుతుంది. ప్రభువు భోజనం యొక్క ఈ మతకర్మను ఎవరు నిర్వహించగలరు? మెల్కీసెడెక్ యాజకత్వానికి చెందిన ఏ అధికారి అయినా ప్రభువు భోజనం యొక్క మతకర్మను నిర్వహించవచ్చు. అహరోనిక్ ప్రీస్ట్ కార్యాలయానికి నియమించబడిన వారు కూడా చట్టంలో అందించిన విధంగా సహాయం చేయవచ్చు. (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 17:1Oa) చర్చి యొక్క ఉపాధ్యాయులు మరియు డీకన్‌లు ఈ శాసనం యొక్క చిహ్నాలను నిర్వహించరు. మతకర్మ సేవలో ఉపయోగం కోసం నిర్దిష్ట ప్రార్థనలు ఎందుకు ఆదేశించబడ్డాయి? మతకర్మ యొక్క నిజమైన అర్ధం మరియు ప్రాముఖ్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. సిద్ధాంతం మరియు ఒడంబడికలు 17లో ఇవ్వబడిన పూర్తి పాఠం యొక్క అధ్యయనం క్రింది ముఖ్యమైన అంశాలను చూపుతుంది: ఇది మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు జ్ఞాపకార్థం జరుగుతుంది. చిహ్నాలను తీసుకోవడం అనేది క్రీస్తును అనుసరించడానికి నమ్మకంగా కొనసాగాలనే కోరిక మరియు ఉద్దేశ్యానికి సాక్షి. ఇది క్రీస్తు శరీరంతో ఒకరి నిరంతర సహవాసానికి నిదర్శనం. ఇది సాధువు జీవిత ప్రమాణాలను కాపాడుకోవడానికి ఒక స్పష్టమైన వాగ్దానం. అధ్యాయం 6 సేవ యొక్క మార్గాలు చర్చి సభ్యులకు ఎలాంటి సేవా అవకాశాలు ఉన్నాయి? చర్చి యొక్క గొప్ప మిషన్లు మనుష్యులను విమోచించడం మరియు దేవుని రాజ్యాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. ఈ మిషన్ల సాఫల్యం సభ్యత్వం నుండి అనేక రకాల సమర్పిత సామర్థ్యాలను కోరుతుంది. పురుషులు మరియు స్త్రీలకు అందజేయబడిన ప్రతి మంచి బహుమతి మానవాళికి మరియు చర్చి యొక్క పనికి ఉపయోగపడుతుంది. ప్రతి సభ్యుడు తన స్వంత ప్రతిభను కనుగొనడం మరియు చర్చి మరియు దేవుని రాజ్యం యొక్క గొప్ప పనికి సహకరించడం ద్వారా దేవుని మరియు అతని తోటి సృష్టి సేవలో ఆనందాన్ని పొందడం ప్రతి సభ్యుని బాధ్యత. అర్చకత్వం యొక్క ప్రత్యేక బాధ్యత అయిన సేవా పంక్తుల వెలుపల, చర్చికి మరియు ప్రజలకు అవసరమైన అనేక విషయాలు ఉన్నాయి, అవి పవిత్రమైన సభ్యత్వం ద్వారా చేయవచ్చు. నిజానికి, చర్చి యొక్క పని ప్రతిభావంతులైన మరియు విశ్వసనీయ సభ్యుల అంకితమైన ప్రయత్నాలు లేకుండా విజయవంతం కాదు. ప్రతి సభ్యుడు చేయగలిగిన లేదా ఇవ్వగల ఉత్తమమైనది దేవునికి మరియు మానవజాతికి సేవ చేయడంలో అవసరం. దేవుడు మన ప్రతిభను బట్టి పిలుస్తాడు, గుప్తమైన మరియు అభివృద్ధి చెందిన చర్చి యొక్క అర్చకత్వాలలో ఒకదానిలో పరిచర్య యొక్క విధులను నెరవేర్చడానికి పురుషులకు అవకాశం మరియు హక్కు ఉంది. దేవుడు ప్రత్యక్షత ద్వారా మనుష్యులను పిలుస్తాడనే మన విశ్వాసంలో మనం ఖచ్చితంగా ఉన్నాము, అయితే ప్రతి మనిషి యొక్క తయారీ మరియు సేవ చేయడానికి సంసిద్ధత మరియు జ్ఞానం మరియు ద్యోతకం యొక్క ఆత్మ ప్రకారం దేవుడు పిలుస్తాడనే వాస్తవాన్ని గుర్తించడంలో మనం ఖచ్చితంగా ఉంటాము. . ఆ విధంగా, జీవితాలతో ఉన్న పురుషులు ప్రవచనాత్మక ఆత్మకు (అంటే, మాట కంటే ఎక్కువ జీవితంలో క్రీస్తు శక్తి యొక్క సత్యాన్ని వ్యక్తీకరించడం) స్వీకరించే స్థితికి అభివృద్ధి చెందారు. కాబట్టి దేవుడు పిలిచే సమయానికి అర్హత సాధించాలని కోరుకోవడం అహంకారం కాదు. సిద్ధాంతం మరియు ఒడంబడికలు 11:2లో ఉన్న సవాలును చదవండి. ఎవాంజెలిజం లేదా మిషనరీ పని ద్వారా సేవ మిషనరీ పని చర్చి మరియు ప్రపంచంలో విస్తృతమైన సేవా మార్గాన్ని అందిస్తుంది మరియు వారి పిలుపు మరియు అర్హత యొక్క విభాగాలలో అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ సేవా మార్గంలో ప్రభావవంతంగా పనిచేయడానికి, చర్చి గురించిన జ్ఞానం మరియు అది బోధించడానికి నియమించబడిన సత్యాల ద్వారా అర్హత సాధించాలి. అర్చకత్వం మరియు సభ్యత్వం రెండూ సభ్యులందరూ ప్రపంచాన్ని మార్చే ఈ గొప్ప పనిలో భాగస్వామ్యం కావాలని కోరారు. చర్చి అధ్యయన తరగతులకు హాజరు కావడం మరియు బోధించే సేవలను ఈ దిశగా అర్హత సాధించడంలో సహాయం చేస్తుంది. "హెచ్చరించబడినవాడు తన పొరుగువారిని హెచ్చరించనివ్వండి" (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 85:22a) అనేది పరిశుద్ధులందరికీ ఆజ్ఞ. మనమందరం పల్పిట్ నుండి బోధించడానికి లేదా చర్చి యొక్క శాసనాలను నిర్వహించడానికి నియమించబడ్డాము, కానీ అందరూ పురుషులకు "శుభవార్త" చెప్పడానికి పిలుస్తారు. చర్చి స్కూల్ టీచింగ్ సర్వీస్ ద్వారా చర్చి యొక్క బోధనా సేవ తగిన తయారీలో ఉన్న పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ తెరిచి ఉంటుంది. చర్చి స్కూల్ మరియు దాని డిపార్ట్‌మెంట్ల పనిని చూసుకోవడానికి పవిత్ర పురుషులు మరియు స్త్రీల పెద్ద సిబ్బంది నిరంతరం అవసరం. బోధన మరియు సమూహ నాయకత్వం కోసం శిక్షణ పొందే అవకాశం చర్చి పాఠశాలల ద్వారా మరియు మతపరమైన విద్యా శాఖ ద్వారా క్రమం తప్పకుండా అందించబడుతుంది. అర్హత సాధించాలనుకునే వారందరికీ ఈ కోర్సులు తెరవబడతాయి. శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ఆవశ్యకత చాలా గొప్పది మరియు చాలా లాభదాయకం. నాయకత్వ సామర్థ్యం అభివృద్ధి ద్వారా చర్చిలోని పెద్దలు, యువకులు మరియు పిల్లల విభాగాల్లోని సమూహాలు ఈ విభాగాల అవసరాలకు పరిచర్య చేయడంలో నైపుణ్యం సాధించడానికి ఇష్టపడే అభివృద్ధి చెందుతున్న నాయకుల స్థిరమైన సరఫరా అవసరం. మహిళలు, పురుషులు మరియు యువకుల నాయకత్వం చర్చి యొక్క పవిత్ర కార్మికులకు చక్కటి సేవా క్షేత్రాన్ని అందిస్తోంది. నాయకత్వం అనేది అభివృద్ధి చేయగల ఒక కళ, మరియు శిక్షణ అందుబాటులో ఉంటుంది. అధ్యయనం మరియు శిక్షణ ద్వారా అర్హత సాధించడానికి తమ బాధ్యతలను గ్రహించే వారి స్థాయి నుండి వివిధ రంగాలలో నాయకులు వస్తారు. "నీ కుదురు మరియు నీ డిస్టాఫ్ సిద్ధంగా పెట్టుకో, ప్రభువు నీకు అవిసెను ఇస్తాడు." టాలెంట్ ఆఫ్ రైటింగ్ ద్వారా సువార్త కథనాన్ని వ్యాప్తి చేయడానికి మరియు ఇప్పటికే చర్చిలో ఉన్నవారికి సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలలో కనీసం రాయడం లేదు. చర్చికి నిరంతరం మంచి రచయితల అవసరం ఉంది, వారు సువార్త సత్యం యొక్క మంచి జ్ఞానంతో, దానిని ఆధునిక లిఖిత పదంలో ఉంచగలరు. చర్చి ప్రధాన కార్యాలయంలోని ప్రచురణ విభాగంతో సంప్రదించవచ్చు. అవెన్యూ ఆఫ్ మ్యూజికల్ ఎబిలిటీ ద్వారా బోధించే మరియు బోధించే మంత్రిత్వ శాఖ ఒక సహచర పరిచర్య యొక్క అవసరాన్ని కనుగొన్న ఒక మార్గం, అది సంగీత పరిచర్య. ఈ రోజు చర్చి యొక్క కొన్ని సమావేశాలు ఉన్నాయి, అవి సంగీత సేవ యొక్క అవసరాన్ని కనుగొనలేదు. ఈ పరిచర్య ద్వారా దేవుని ఆత్మ తరచుగా ప్రజల సాక్షాత్కారానికి తీసుకురాబడుతుంది. సంగీతం అప్పుడు సేవ యొక్క మార్గం, ఇది మాట్లాడే పదం యొక్క మంత్రిత్వ శాఖకు మాత్రమే రెండవదిగా పరిగణించబడుతుంది. ఎవరైనా ఈ సంగీత బహుమతిని కలిగి ఉంటే, దానిని పెంపొందించుకోవడం మరియు చర్చి సేవలకు పెరుగుదల ఇవ్వడం ఒక విధి. ఈ బాధ్యత గురించి లేఖనంలో ఉపదేశం ఇవ్వబడింది. సిద్ధాంతం మరియు ఒడంబడికలు 119:6 చదవండి. సంగీతానికి సంబంధించిన బహుమతులు ఉన్న ప్రతి సభ్యుడు ఆ బహుమతులను తొలి వయస్సు నుండే అభివృద్ధి చేయాలని కోరారు. పారిశ్రామిక మరియు ఆర్థిక రంగాల ద్వారా జియోనిక్ స్టీవార్డ్‌షిప్ సూత్రం యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్‌లోకి చర్చి మరింత పూర్తిగా ప్రవేశించినందున, సాంకేతిక మరియు పారిశ్రామిక రంగాలలో అలాగే ఆర్థిక శాస్త్రంలో సేవా మార్గాలు మరింత ముఖ్యమైనవిగా మారతాయి. పారిశ్రామిక జియాన్ యొక్క గొప్ప ప్రాజెక్ట్‌లో శిక్షణ పొందిన మరియు ఉపయోగకరమైన భాగస్వామ్యం రాబోయే సంవత్సరాల్లో అవసరం, మరియు ఈ గొప్ప సవాలును స్వీకరించడానికి సన్నాహాలు అపరిమిత అవకాశాన్ని తెరుస్తాయి. మనం జియోన్ గురించి మాట్లాడేటప్పుడు, అటువంటి పవిత్రమైన సమాజాన్ని తీసుకురావడానికి సారథ్యాన్ని నెరవేర్చడానికి ఆచరణాత్మకంగా సిద్ధం కావాల్సిన అవసరం గురించి మనం తెలుసుకోవాలి. ఇది పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాలలో ఉన్నట్లే, అన్ని ఇతర వృత్తిపరమైన సన్నాహాల రంగంలో, అన్ని ట్రేడ్‌లలో అన్ని వృత్తిపరమైన మరియు వృత్తిపరమైన మార్గాలలో కూడా ఉంది. విద్యాపరంగా అలాగే ఆన్-హ్యాండ్ అనుభవంతో కూడా తీవ్రమైన మరియు ఫోకస్డ్ ప్రిపరేషన్ ఉండాలి. వైద్యులు, మెకానిక్‌లు, ఉపాధ్యాయులు, నర్సులు, గుమస్తాలు మరియు ప్రతి రకమైన కార్మికులు, వాస్తవానికి నైపుణ్యాలను ప్రదర్శించిన వారందరూ జియోన్ స్థాపన కోసం తమ శ్రమను ఉపయోగించాలని సవాలు చేస్తారు. సీయోనుకు హస్తకళాకారులు కావాలి. తగినంతగా అంకితం చేయని వారిని ప్రభువు ఉపయోగించుకోలేడు, వారు తగినంతగా కట్టుబడి లేదా శిక్షణ పొందలేదు. చర్చి పని కోసం మా మెటీరియల్ దీవెనల ప్రకారం సహకారం అందించడం ద్వారా చర్చి ఆర్గనైజేషన్ యొక్క అభివృద్ధి చెందుతున్న సభ్యత్వం కోసం తెరిచిన అనేక పనులలో అర్హతతో పరిమితులు ఉన్నట్లు భావించవచ్చు, కానీ చర్చి నిధులకు వ్యక్తిగతంగా ఇచ్చే రంగం చాలా కొద్దిమంది మాత్రమే విరాళం ఇచ్చే అవకాశం లేదు. చర్చి యొక్క ఆర్థిక అవసరాలకు ఒకరి బాధ్యతలను అధ్యయనం చేయడం మరియు తెలుసుకోవడం అంటే విస్తారమైన అవకాశాల గురించి తెలుసుకోవడం. చట్టాన్ని పాటించడం అంటే మనం కలలు కనే చాలా పురోగతిని తక్కువ ఆచరణాత్మక క్షణాలలో సాధ్యం చేయడం. చర్చి యొక్క మంచి సభ్యుని యొక్క వినయపూర్వకమైన పాత్రలో ఈ అధ్యాయంలో వ్యవహరించిన ప్రత్యేక సేవా మార్గాలతో పాటు, అన్నింటికంటే చాలా ప్రాథమికమైన అవసరం ఉంది, మరియు చర్చి యొక్క పనిని మొత్తం మినిస్టీరియల్ మరియు డిపార్ట్‌మెంటల్ రంగంలో ముందుకు తీసుకెళ్లడానికి పిలవబడిన మరియు ఎంపిక చేయబడిన వారికి మద్దతు ఇవ్వడం. శ్రమ. ఇది నిష్క్రియాత్మక సేవ కాకూడదు, కానీ దేవుని రాజ్యంతో అనుసంధానించబడిన ప్రతి కార్యకలాపానికి నిర్మాణాత్మక మద్దతుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తన బహుమతిని కనుగొని, తన తోటి మనిషి మరియు దేవుని సేవ కోసం దానిని గొప్పగా చెప్పుకోవాలి. అధ్యాయం 7 ప్రతి సభ్యుని యొక్క మిషనరీ బాధ్యత మొదటి నుండి, సువార్త ఒక మిషనరీ ఉద్యమం. ప్రారంభ చర్చి రోజుల్లో ఎలా ఉందో, ఈ రోజు కూడా పని పునరుద్ధరించబడింది. క్రీస్తు కాలంలో శిష్యులకు సందేశంతో ప్రపంచమంతా వెళ్లాలని ఆజ్ఞ ఇవ్వబడినట్లుగా, ఈ తరంలో హెచ్చరించినవాడు తన పొరుగువారిని హెచ్చరించాలని ఆజ్ఞ ఇవ్వబడింది. వ్యక్తిగత బాధ్యత సెయింట్‌హుడ్ యొక్క నిబద్ధత ఒక వ్యక్తి లేటర్ డే సెయింట్స్ యొక్క జీసస్ క్రైస్ట్ యొక్క శేష చర్చిలో సభ్యత్వాన్ని అంగీకరించినప్పుడు, అతను క్రీస్తు యొక్క వ్యక్తిగత ప్రమాణాల ప్రకారం జీవించే బాధ్యతను అంగీకరిస్తాడు. అతను ఈ విధితో పాటు, అతను అందుకున్న "శుభవార్త"ని ఇంకా "శుభవార్త" వినని తన ప్రభావం యొక్క సర్కిల్‌లోని ప్రతి ఇతర వ్యక్తితో పంచుకునే బాధ్యతను కూడా అంగీకరిస్తాడు. క్రీస్తు విశ్వాసం ప్రపంచ విశ్వాసం మరియు దాని స్థాపనకు సరిహద్దులు లేవు. ఆ విధంగా, ప్రతి సభ్యునికి తన జీవితంలో క్రీస్తు కొరకు సాక్ష్యమివ్వడం మరియు చర్చిలో సభ్యులుగా ఉండమని పురుషులను ఆహ్వానించడం మరియు దేవుని రాజ్యాన్ని నిర్మించడంలో తమ వంతు కృషి చేయడం అనే ద్వంద్వ బాధ్యత ఉంటుంది. ఒక సెయింట్ చొరవ తీసుకోవాలి ఒక సెయింట్ అనేది పురుషులకు సందేశాన్ని అందించడానికి ఆరోపించబడిన వ్యక్తి. సందేశం యొక్క ముఖ్యమైన స్వభావం గురించి ఒకరికి నమ్మకం ఉంటే, ఇతరులు తన వద్దకు విచారించడానికి వచ్చే వరకు వేచి ఉండని అత్యవసర భావం ఉంటుంది. అతను హెచ్చరిక సందేశం యొక్క ప్రాముఖ్యతను గ్రహించినందున, వారి జీవితాల్లో సువార్త అవసరమైన వారందరి వద్దకు వెళ్తాడు. నియమిత మంత్రులకు చార్జీ మాత్రమే కాదు పరిచర్య పదవికి నియమించబడిన కొంతమంది పురుషులు సువార్త ప్రచారంలో ప్రత్యేక బాధ్యతలను కలిగి ఉన్నప్పటికీ, సువార్తను అంగీకరించిన మరియు క్రీస్తు చర్చిలో సభ్యుడిగా మారిన ప్రతి వ్యక్తి విశ్వాసాన్ని తెలియజేసే బాధ్యతను కలిగి ఉంటాడు. "...హెచ్చరించబడిన ప్రతి వ్యక్తి తన పొరుగువారిని హెచ్చరించడం అవుతుంది" . . . "సాత్వికత మరియు సౌమ్యతతో." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 85:22a; 38:9d) వ్యక్తిగత ఎవాంజెలిజం యొక్క రంగాలు వ్యక్తిగత మిషనరీ ప్రయత్నం యొక్క గొప్ప ప్రయోజనాల్లో ఒకటి సువార్త చెప్పాలనే ఉద్వేగభరితమైన కోరిక ఉన్నవారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విస్తృత మరియు తక్షణ క్షేత్రం. మిషనరీ ప్రయత్నాల యొక్క ఇతర రూపాలు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ప్రదేశాలకు మిషనరీ నిపుణులను పంపడం గురించి ఆలోచిస్తాయి, అక్కడ వారు త్యాగం మరియు భక్తి ద్వారా ప్రజలను క్రీస్తులోకి మార్చవచ్చు. చర్చి యొక్క సాధారణ సభ్యుడు, అయితే, అతను కథ చెప్పడానికి ఒక నిర్దిష్ట అవకాశం ఉంది. ఇంట్లో చాలా లేటర్ డే సెయింట్ హోమ్‌లు మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగి ఉంటాయి, కానీ చాలా మందిలో సభ్యులు క్రీస్తు మరియు చర్చి కోసం తమ నిర్ణయాలను తగిన సమయంలో తీసుకుంటారని చాలా తక్కువగా పరిగణించబడుతుంది. ఇది సభ్యుని యొక్క మొదటి ఖచ్చితమైన బాధ్యతగా పరిగణించబడాలి; అంటే, కుటుంబ వృత్తాన్ని ప్రాధాన్యతగా మార్చడం ద్వారా పూర్తి చేయడం. లేటర్ డే సెయింట్ హోమ్‌లలో సభ్యులను గెలవడం అనేది మిషనరీ ప్రయత్న రంగంలో సహజ మార్గం. పిల్లలు, యువకులు, చర్చి సభ్యుని భర్త లేదా భార్యను మార్చబడిన వ్యక్తి యొక్క మొదటి బాధ్యతగా పరిగణించాలి. విస్మరించకూడని ఈ ఫీల్డ్ యొక్క ఆవశ్యకతను గ్రహించడంలో సభ్యులు వైఫల్యం కారణంగా క్రీస్తు కోసం అనేక వేల మంది సంభావ్య కార్మికులు తప్పిపోయారు. బడిలో విద్యార్థి జీవితంలో నాయకులు తమ సహచరులపై గొప్ప ప్రభావాన్ని చూపుతారు. ఒక యువ విద్యార్థి సువార్త యొక్క వ్యక్తిగత ప్రమాణాలను కొనసాగించడం ద్వారా క్రీస్తు కోసం సాక్ష్యమివ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అతను మిషనరీ ఆదేశాలను నెరవేర్చడానికి సహాయం చేస్తున్నాడు. యౌవనస్థులు తమ తోటివారి మధ్య క్రీస్తు మరియు ఆయన సందేశాన్ని గురించి సాక్ష్యమివ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. సువార్త సందేశం యొక్క చాలా బోధన కేంద్రీకృతమై ఉన్న ఒక విద్యార్థి యొక్క భక్తి జీవితం యొక్క అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేడు విద్యారంగంలో అభివృద్ధి చెందిన రంగాలలో చాలా మంది విద్యార్థులు తమ స్నేహితులతో సువార్త గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు, మార్కెట్ ప్రదేశాలు మరియు ప్రతి వ్యాపార ప్రదేశంలో యేసుక్రీస్తు సందేశం తక్షణ అవసరం. వ్యాపార రంగంలో చర్చిలోని చాలా మంది వయోజన సభ్యులు తమ మేల్కొనే గంటలలో ఎక్కువ భాగాన్ని తమ వ్యాపార సహచరులతో గడుపుతారు. లేటర్ డే సెయింట్ ఎవాంజెల్ ప్రతి సంబంధంలోకి చొచ్చుకుపోవాలి. పూర్తిగా మార్చబడిన సెయింట్ యొక్క వ్యాపార మరియు పారిశ్రామిక పరిచయాలు, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు అప్రమత్తంగా ఉన్న వ్యక్తికి ఆధ్యాత్మిక అవకాశాలతో నిండి ఉన్నాయి. ప్రారంభ చర్చిలో చాలా మంది మొదటి శిష్యులు నేరుగా మాస్టర్ యొక్క వ్యాపార మరియు సమాజ పరిచయాల నుండి వచ్చారు. ఈ విధంగా పీటర్, ఆండ్రూ మరియు జాన్‌లను సంప్రదించారు. చర్చి యొక్క ప్రారంభ రోజులలో, ఒక సభ్యుడు తన గుర్తింపును చర్చితో దాచడం అసాధ్యం. సెయింట్‌గా ఉండడమంటే యేసుక్రీస్తుతో పొదుపు సంబంధానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అనుభవం. ఈ రోజు క్రీస్తుతో ఉన్న అదే సాన్నిహిత్యం మనుష్యులను అదే విధమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రేరేపిస్తుంది మరియు ఇది ఆఫీసు, దుకాణం మరియు కర్మాగారానికి సంబంధించిన రోజువారీ పరిచయాలలో చర్యలో మరియు మాట ద్వారా నిరూపించబడాలి. సామాజిక ప్రపంచంలో అపరిమిత అవకాశం మరియు సవాలు వారి సామాజిక జీవితంలోని సర్కిల్‌లలో పురుషులు మరియు మహిళలకు అందించబడుతుంది. సువార్త యొక్క పెద్ద దృష్టికి ఇతరులను గెలవడానికి సభ్యులందరూ ఈ సమూహాలలో వారి సభ్యత్వాన్ని ఉపయోగించుకోవాలి. ఒక పరిశుద్ధుడు ఏ సామాజిక పరిస్థితులలో ఉంచబడినా లేదా కనుగొనబడినా క్రీస్తు కొరకు సాక్ష్యమివ్వడం పట్ల విముఖత చూపకూడదు. యేసు ఉన్నత మరియు తక్కువ సమాజంలోని అన్ని సర్కిల్‌లలోకి వెళ్ళాడు. మిషనరీ సభ్యుని అర్హతలు చర్చి యొక్క ఈ గొప్ప పనిలో ఒక సభ్యుని పాత్రకు సంబంధించిన ముందస్తు అవసరాలు సిద్ధాంతం మరియు ఒడంబడికలు 4:1c-eలో అందంగా పేర్కొనబడ్డాయి: "... మీకు దేవుణ్ణి సేవించాలనే కోరిక ఉంటే, మీరు పనికి పిలవబడతారు, ఎందుకంటే, ఇదిగో, పొలం ఇప్పటికే కోతకు తెల్లగా ఉంది, మరియు ఇదిగో, తన కొడవలిని తన శక్తితో కొట్టేవాడు, అతను దానిని నిల్వ చేస్తాడు. నశించదు, కానీ అతని ఆత్మకు మోక్షాన్ని తెస్తుంది; మరియు విశ్వాసం, ఆశ, దాతృత్వం మరియు ప్రేమ, దేవుని మహిమను దృష్టిలో ఉంచుకుని, అతనిని పనికి అర్హుడిని చేస్తుంది. సౌండ్ పర్సనల్ కన్విక్షన్ క్రీస్తు కోసం ఆత్మలను గెలుచుకునే ఈ పనిని చేసే వారు, ఆయన చర్చికి సభ్యులుగా, మంచి వ్యక్తిగత దృఢ నిశ్చయం కలిగి ఉండటం చాలా ముఖ్యం. మిషనరీగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యేసుక్రీస్తు యొక్క మెస్సీయషిప్ మరియు అతని చర్చి యొక్క దైవిక స్వభావంపై లోతైన మరియు స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అతను మానవుల పట్ల దేవుని ప్రేమ మరియు మోక్ష ప్రణాళిక గురించి సందేహానికి అతీతంగా నమ్మకం కలిగి ఉండాలి. కేవలం అభిప్రాయాన్ని కలిగి ఉండటం సరిపోదు. స్త్రీపురుషుల జీవితాలలో మోక్షం అవసరం అనే ఉద్వేగభరితమైన నమ్మకం ఉండాలి. ఈ దృఢవిశ్వాసం ఉన్నట్లయితే, ఈ దివ్య జ్ఞానాన్ని అందరితో పంచుకోవాలనే నిర్బంధం కూడా ఉంటుంది. పురుషుల పట్ల ప్రేమ మానవజాతి పట్ల దేవుని ప్రేమ యొక్క నిశ్చయతతో, దేవుని పిల్లలందరితో ఏకత్వ భావన ఉండాలి. ఇతరుల శ్రేయస్సు కోసం ఒక వ్యక్తికి ఈ హృదయపూర్వక కోరిక ఉంటే, అది సహజంగా తోటి మనిషికి సేవ చేయడంలో వ్యక్తమవుతుంది. ఈ దృష్టితో మిషనరీ సభ్యుడు మనుష్యులను చూస్తాడు, వారు అంతగా కాకుండా, ప్రభువైన యేసు యొక్క రక్షణ కృప ద్వారా వారు ఎలా అవుతారో. అలా అందరినీ ఆ ప్రభావంలోకి తీసుకురావాలని గొప్ప శక్తితో ప్రయత్నిస్తాడు. ఇది తరచుగా త్యాగాలను కోరుతుంది, కానీ అలాంటి త్యాగాలు స్వయంచాలకంగా వారి స్వంత శాశ్వతమైన ప్రతిఫలాన్ని దాతకి అందిస్తాయి. ప్రార్థనా జీవితం మిషనరీ కార్యకలాపానికి ప్రాముఖ్యమైనది, ప్రార్థన చేయాలనే స్వభావం, సుముఖత. రక్షకుని స్థానంలో పని చేసే వ్యక్తి శక్తి మరియు ప్రేమ యొక్క మూలానికి దగ్గరగా ఉండాలి. ఈ ప్రార్థన క్రమశిక్షణ గొప్ప కారణానికి జీవితాన్ని అంకితం చేయడంలో ఫలవంతంగా ఉంటుంది మరియు పురుషులందరి ముందు మాస్టర్ పాత్ర యొక్క వ్యక్తీకరణను సాధ్యం చేస్తుంది. చర్చి మరియు దాని సిద్ధాంతం యొక్క జ్ఞానం ఒక వ్యక్తికి సువార్త మరియు చర్చి ద్వారా ఎలా పని చేయాలో సరైన అవగాహన లేకుంటే, ఇతరులకు సందేశాన్ని చెప్పలేరు. కాబట్టి, సెయింట్స్ దేవుని ముందు తమను తాము ఆమోదించినట్లు చూపించడానికి అధ్యయనం చేయమని ఆదేశించబడ్డారు. మన ఉదాసీనత లేదా వైఫల్యం కారణంగా క్రీస్తు పని అపహాస్యం కాకుండా ఉండేందుకు సువార్త యొక్క ప్రాథమిక సత్యాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. చర్చి యొక్క మూడు ప్రామాణిక పుస్తకాలతో పరిచయం ఈ విషయంలో ముఖ్యమైనది. ఈ విషయంలో సభ్యుల సహాయం కోసం అనేక ఇతర రచనలు కూడా అందుబాటులో ఉన్నాయి. పద్ధతులు వ్యక్తిగత పరిచయం కీలకం సభ్యులందరికీ వారి స్వంత వ్యక్తిగత సాక్షి విలువ గురించి అవగాహన ఉండాలి. దీనిలో, ఇతర విషయాలలో, ప్రతి ఒక్క సభ్యుడు లెక్కించబడతాడు. మీరు ఏమి చేయగలరు, మరొకరు చేయకపోవచ్చు మరియు దీనికి విరుద్ధంగా. చర్చిలోని చాలా మంది సభ్యులు ఒక విధంగా లేదా మరొక విధంగా వ్యక్తిగత పరిచయం ద్వారా సువార్తకు గెలుపొందారు. మరియు ఎక్కువ శాతం మందికి, ఈ వ్యక్తిగత బహిర్గతం స్నేహంలో చాలా ముందుగానే ప్రదర్శించబడింది. ఈ వ్యక్తిగత పరిచయం మరియు సాక్షి ద్వారా, ఇతరులు చర్చి యొక్క సేవలు మరియు సమావేశాలకు, ముఖ్యంగా బోధన మరియు చర్చి పాఠశాల కార్యకలాపాలకు గురవుతారు. క్రీస్తు రోజుల్లో, మరియు ప్రారంభ పునరుద్ధరణలో, నేటితో పోలిస్తే పరిమితమైన కమ్యూనికేషన్ మార్గాలు ఉన్నాయి, అయినప్పటికీ వార్తలు చాలా త్వరగా విదేశాలలో ప్రకటించబడ్డాయి. వ్యక్తిగత పరిచయం ద్వారా ఇది అద్భుతమైన వేగంతో జరిగింది. నేటికీ మంచి పద్ధతి లేదు. ఇతర పద్ధతులు అన్ని మిషనరీ పద్ధతుల యొక్క సాంకేతిక వివరాలు ఈ పేరాగ్రాఫ్‌ల పరిధికి వెలుపల ఉన్నప్పటికీ, సువార్తకు ఇంకా గెలుపొందని వ్యక్తులకు విధానాలను రూపొందించే ఉత్తమ పద్ధతులతో పరిచయం పొందడం ప్రతి సభ్యుని లక్ష్యం. ఏ కరపత్రాలు మరియు గ్రంథాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడం ద్వారా చర్చి యొక్క సాహిత్యంతో సుపరిచితులు కావాలి. విజయవంతమైన మిషనరీ వ్యక్తి మానవ సంబంధాలలో నైపుణ్యాలను కనుగొని, అభివృద్ధి చేస్తాడు మరియు అనుకూలమైన సమూహాలు మరియు సమావేశాలకు అవకాశాలను ఎప్పుడు ఆహ్వానించాలో తెలుసుకోగలడు. అతను తన ఇంటిని కాటేజ్ సమావేశాలకు అందుబాటులో ఉంచడానికి మరియు మంత్రిత్వ శాఖలోని ప్రతినిధులతో మాట్లాడటానికి ఆత్రుతగా ఉంటాడు. క్రీస్తు మరియు చర్చి యొక్క విలువను తెలుసుకోవడంలో ప్రతి సభ్యుడు మిషనరీ-మైండెడ్‌గా మారడం మరియు ఆత్మల సంక్షేమం పట్ల మక్కువ పెంచుకోవడం కంటే విజయవంతమైన మార్గం మరొకటి లేదు. అందువలన సభ్యులు గ్రౌన్దేడ్ అవుతారు, చర్చి నిర్మించబడింది మరియు జియోన్ స్థాపనకు ఆర్థిక మార్గాలు చాలా వరకు అందుబాటులోకి వస్తాయి. సంక్షిప్తంగా, క్రీస్తు యొక్క మొత్తం మిషన్ ఫలించటానికి మరియు దేవుని రాజ్యం సాక్షాత్కారానికి దగ్గరగా ఉంటుంది. అధ్యాయం 8 సభ్యుని శాసన బాధ్యతలు చర్చి ప్రభుత్వాన్ని దైవపరిపాలనా ప్రజాస్వామ్యంగా అభివర్ణించారు. ఇది ప్రభుత్వం యొక్క మూడు అంశాలను కలిగి ఉంటుంది: దేవుడు, అర్చకత్వం మరియు సభ్యత్వం. చర్చి ప్రజల సమ్మతితో అర్చకత్వం ద్వారా దేవునిచే పాలించబడుతుందని చెప్పవచ్చు. చర్చి ప్రభుత్వంలో ప్రీస్ట్‌హుడ్ యొక్క విధులు ఏమిటి? పరిచర్యకు పిలుపు దేవుని నుండి ఉద్భవించింది మరియు ఈ పిలుపు గతంలో నియమించబడిన మంత్రుల ద్వారా వ్యక్తీకరించబడింది. చర్చి యొక్క అధీకృత అధికారులు మాత్రమే వారి వివిధ పరిపాలనా విధుల్లో మంత్రిత్వ శాఖకు ఈ కాల్‌ని ప్రారంభించవచ్చు. స్థానిక శాఖలో, శాఖ అధ్యక్షుడు మాత్రమే ఈ అధికారం కలిగిన పరిపాలనా అధికారి. మరికొందరు అర్చకత్వ కార్యాలయాలకు ఉన్నతమైన పరిపాలనా అధికారులను మినహాయించి, ఎవరినైనా పిలవడాన్ని ధృవీకరించే సాక్ష్యమివ్వవచ్చు, కానీ ప్రారంభించకపోవచ్చు. అయినప్పటికీ, పిలవబడే ఒకరి మంత్రిత్వ శాఖను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి, అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి సభ్యులకు పూర్తి హక్కు ఉంటుంది. ఉన్నత అడ్మినిస్ట్రేటివ్ అధికారుల ఆమోదం పొందిన తర్వాత, అటువంటి కాల్‌లన్నింటిని ఆర్డినేషన్ ఎవరి ప్రాంతంలో అమలులోకి వస్తుందో మరియు "కామన్ సమ్మతి" సూత్రం ఎక్కడ అమలు చేయబడుతుందో వారికి అందించబడుతుంది. ఈ ఆమోదం ఒక శాఖ, జిల్లా లేదా ఇతర సముచిత అధికార పరిధి ద్వారా అందించబడినప్పుడు, చర్చి యొక్క సిద్ధాంతాలలో వివరించబడిన హక్కులు మరియు విధులు పిలవబడే వ్యక్తికి ఆర్డినేషన్ ద్వారా అందించబడతాయి. మంత్రి తన పిలుపు మేరకు చర్చిలో ఎక్కడైనా నిర్వహించే హక్కును కలిగి ఉంటాడు. నాయకత్వ విషయాలలో మార్గదర్శకత్వం మరియు దిశానిర్దేశం కోసం చర్చి సభ్యులు అర్చకత్వం వైపు చూడాలి మరియు సిద్ధాంతం మరియు ఒడంబడికలు ప్రత్యేకంగా ఈ విధికి గౌరవం ఇస్తాయి. (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 125:14 చూడండి.) చర్చిలోని అధికారులందరూ రివిలేషన్ ద్వారా పిలవబడ్డారా లేదా సభ్యత్వానికి కొందరిని నియమించే హక్కు ఉందా? మంత్రిత్వ శాఖకు ఆర్డినేషన్ అవసరమయ్యే అధికారులందరూ మునుపటి పేరాల్లో పేర్కొన్న విధంగా నిర్వహించబడతారు, అయితే మంత్రివర్గ పనికి కాకుండా అనేక మంది అధికారులు ఎంపికయ్యారు. ఇవి సభ్యత్వం యొక్క "సాధారణ సమ్మతి" ద్వారా నామినేట్ చేయబడతాయి మరియు ఓటు వేయబడతాయి. అటువంటి అధికారులు తప్పనిసరిగా మంత్రులుగా నియమించబడరు, అయినప్పటికీ వారు తరచుగా ఉండవచ్చు. స్థానిక శాఖ యొక్క అధ్యక్షుడిని ఆ శాఖ యొక్క సభ్యత్వం యొక్క "సాధారణ సమ్మతి" ద్వారా ఎంపిక చేస్తారు. అతను ఒక నియమం ప్రకారం, అధిక అధికార పరిధిని కలిగి ఉన్న సభ్యుడు లేదా కొంతమంది మంత్రి ద్వారా నామినేట్ చేయబడవచ్చు. అయితే, ఈ రెండో నామినేషన్ మంచి స్థితిలో ఉన్న ఏ సభ్యునిచే ఏకకాల నామినేషన్‌ను నిరోధించదు. నామినేషన్ల మూలం ఏదైనప్పటికీ, శాఖ అధ్యక్షుడు మెజారిటీ ఓటుతో కొనసాగుతారు. ప్రిసైడింగ్ అధికారి ఎంపికపై ఉంచబడిన ఏకైక పరిమితి ఏమిటంటే, అసాధారణమైన పరిస్థితులలో తప్ప, మెల్కీసెడెక్ అర్చకత్వంలోని నియమిత మంత్రుల ర్యాంకు నుండి అతన్ని ఎన్నుకోవాలి. సభ్యత్వంతో దీక్ష యొక్క పూర్తి ప్రత్యేక హక్కు ఉన్న ప్రభుత్వ విషయాలు ఉన్నాయా? అర్చకత్వ బాధ్యత కాకుండా, చర్చి సభ్యులచే ప్రారంభించబడే చట్టాల యొక్క పెద్ద క్షేత్రం ఉంది. "కామన్ సమ్మతి" సూత్రం చర్చి అంతటా శాఖలు, జిల్లాలు మరియు వాటాల యొక్క వివిధ సమావేశాలలో మరియు జనరల్ కాన్ఫరెన్స్ స్థాయిలో పనిచేస్తుంది. ప్రతి ఫీల్డ్ బాధ్యత యొక్క నిర్దిష్ట పరిమితులను కలిగి ఉంటుంది, అన్ని అవసరాలు సాధారణ సమావేశానికి లోబడి ఉంటాయి. అటువంటి అన్ని సమావేశాలు మరియు సమావేశాలలో, "చర్చి యొక్క భవిష్యత్తు ప్రవర్తనను నియంత్రించే అన్ని ప్రతిపాదిత చట్టాలను చర్చించడానికి, సవరించడానికి, సమ్మతించడానికి లేదా విభేదించడానికి హక్కు ఉంది." ప్రతి సభ్యుడు చర్చి చట్టాన్ని తెలుసుకోవడం ముఖ్యం. ఇందులో స్క్రిప్చర్ల అధ్యయనం, ముఖ్యంగా సిద్ధాంతం మరియు ఒడంబడికలు, ఆమోదించబడిన సాధారణ సమావేశ తీర్మానాలు మరియు పరిపాలనా విధానాలు మరియు విధానాలకు సంబంధించిన సాధారణ మార్గదర్శకాలు ఉంటాయి. ఉమ్మడి సమ్మతి అంటే ఏమిటి? దేవుని రాజ్యం యొక్క అభివృద్ధి వైపు కదలిక అనేది తెలివైన, ఆలోచించే మరియు మద్దతు ఇచ్చే సభ్యత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పాల్గొనేవారు స్వేచ్ఛగా మరియు సరైన స్ఫూర్తితో పాల్గొనే వరకు ఒక ప్రోగ్రామ్‌కు విలువ ఉండదు. అతను ఎవరికి మంత్రిగా ఉంటాడో మరియు వారికి పూర్తి మరియు ఉచిత మద్దతు ఉంటే తప్ప అధికారికి అసలు అధికారం ఉండదు. కాబట్టి, నాయకత్వానికి ద్యోతకం లేదా వివేకం సరిగ్గా గుర్తించబడినప్పటికీ, ప్రజలచే బహిరంగ అంగీకారం మరియు స్వచ్ఛంద, ఇష్టపూర్వక ఆమోదం ఉంటే తప్ప, దేవుని కార్యక్రమం అమలు చేయబడదు. మా ఎంపికల ఫలితాలను కూడా నివారించలేము! ఉమ్మడి సమ్మతి ఎలా వ్యక్తీకరించబడుతుంది? మెజారిటీ ఓటు ద్వారా ప్రజాస్వామ్య హక్కులు నిర్ణయించబడతాయి. మెజారిటీ ఎల్లప్పుడూ సరైనదని దీని అర్థం కాదు, కానీ సమర్థవంతమైన ఆపరేషన్ కోసం ఇది మాత్రమే ఆధారం. సభ్యులు తమ అభిప్రాయాన్ని అంగీకరించాలనే ఉద్దేశ్యంతో వ్యాపార సమావేశాలకు హాజరుకాకూడదు, కానీ దేవుని చిత్తాన్ని వెతకాలనే కోరికతో ఉండాలి. అప్పుడు మనం సాధారణంగా కలిసి సమ్మతిస్తాము మరియు దైవిక సంకల్పానికి అనుగుణంగా నడుస్తాము. "మరియు అన్ని విషయాలు చర్చిలో సాధారణ సమ్మతితో, చాలా ప్రార్థన మరియు విశ్వాసం ద్వారా జరుగుతాయి ..." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 25:lb) ప్రతి వ్యక్తి తన ఓటు హక్కును ఒక సారథిగా ఉపయోగించుకోవాలి మరియు అజ్ఞానంతో లేదా న్యాయం మరియు ఉద్దేశ్యానికి సంబంధించిన నిజాయితీ సూత్రాలకు తగిన గౌరవం లేకుండా దాని వినియోగాన్ని నివారించాలి. వ్యాపార నిర్వహణ కోసం సమావేశాలు ఎంత తరచుగా జరుగుతాయి సమావేశమా? వ్యాపార సమావేశాలు ఏదైనా సరిగ్గా తెలియజేయబడిన సమయంలో నిర్వహించబడినప్పటికీ, సాధారణ వ్యాపార సమావేశాలు నియమం. ఎన్నికలు సాధారణంగా ఏటా జరుగుతాయి, ఇతర వ్యాపారాలు మరింత తరచుగా విరామాలలో పరిగణించబడతాయి. ఈ సమావేశాలు చాలా ముఖ్యమైనవి మరియు ప్రత్యేకంగా చర్చి యొక్క ఇతర సమావేశాలు మరియు ఆరాధన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వారు తప్పనిసరిగా హాజరు కావాలి. సభ్యుల సాధారణ కార్యాచరణ నుండి "వ్యాపారం" పెరుగుతుంది. చర్చి వ్యవహారాలలో పూర్తిగా క్రియాశీలకంగా లేని వారు సమూహం యొక్క శాసన శక్తిగా ఉండటం సమంజసం కాదు; కాబట్టి సాధారణ హాజరు ద్వారా జియోనిక్ ఉద్యమంలో క్రమం తప్పకుండా సాధువుల భాగస్వామ్యంతో ఒకరి వాయిస్ మరియు ఓటు మద్దతు ఇవ్వాలి. తగిన ప్రిసైడింగ్ అధికారులచే నిర్ణయించబడిన సంబంధిత ప్రాంతం యొక్క అవసరాలకు అనుగుణంగా ఏరియా సమావేశాలు కలుస్తాయి. ఏటా జనరల్ కాన్ఫరెన్స్‌ని పిలిచే పద్ధతిని జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ యొక్క అవశేష చర్చ్‌లో పునఃస్థాపించబడినప్పుడు, ఇది మారవచ్చు మరియు చర్చి చట్టంలో నిర్వచించిన విధంగా మొదటి ప్రెసిడెన్సీ లేదా అత్యవసర పరిస్థితుల్లో ఇది మారవచ్చు. అధ్యాయం 9 మంత్రిత్వ శాఖ మరియు సభ్యత్వం మధ్య సంబంధం చర్చి యొక్క ప్రతి మంత్రి తన తోటి మనుష్యులకు జీవిత మార్గంలో సహాయం చేయడంలో క్రీస్తుతో భాగస్వామి. యేసు భూమిపై ఉన్నప్పుడు, అతను స్థాపించిన పనిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలను పిలిచాడు మరియు నియమించాడు. అతను వారిని నియమించాడు మరియు వివిధ బాధ్యతలలో పరిచర్యకు పంపాడు. అతను "మడత" ఆశ్రయం "మంద" లో సేకరించడానికి ప్రపంచంలోకి వెళ్ళడానికి కొన్ని ఎంచుకున్నాడు; మరియు అతను సేకరించిన "గొర్రెలను" పోషించడానికి ప్రత్యేక అర్హతలు కలిగిన ఇతరులను ఎన్నుకున్నాడు. "...మీరు ప్రపంచమంతటికీ వెళ్లి, ప్రతి ప్రాణికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షింపబడతాడు.." (మార్కు 16:14, 15) పీటర్‌తో, అతను కూడా చెప్పాడు, "నా గొర్రెలను మేపు." పాల్ ఎఫెసస్‌లోని సెయింట్స్‌కు వ్రాసినప్పుడు చర్చి యొక్క వివిధ మంత్రిత్వ శాఖల ఉద్దేశ్యం గురించి స్పష్టమైన వివరణ ఇచ్చాడు: "మరియు అతను కొంతమంది అపొస్తలులను, కొందరిని, ప్రవక్తలను, మరికొందరు, సువార్తికులుగా, మరికొందరు, పాస్టర్లను మరియు బోధకులను ఇచ్చాడు; పరిశుద్ధుల పరిపూర్ణత కొరకు, పరిచర్య యొక్క పని కొరకు, క్రీస్తు దేహాన్ని శుద్ధి చేయడం కొరకు; మనము వరకు, విశ్వాసం యొక్క ఐక్యతలో, అందరూ దేవుని కుమారుని గురించిన జ్ఞానానికి, పరిపూర్ణ మనిషికి, క్రీస్తు యొక్క సంపూర్ణత యొక్క స్థాయికి చేరుకుంటారు." (ఎఫెసీయులు 4:11-13) శేషాచలం చర్చి ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్‌లో ఆర్డినేషన్ ద్వారా వేరు చేయబడే అధికారుల పూర్తి జాబితా క్రిందిది. అవి క్రొత్త నిబంధనలో మరియు సిద్ధాంతం మరియు ఒడంబడికలలో ప్రస్తావించబడ్డాయి: అపొస్తలులు, ప్రవక్తలు, ప్రధాన పూజారులు, డెబ్బైలు, పితృస్వాములు, బిషప్‌లు, పెద్దలు, పూజారులు, ఉపాధ్యాయులు, డీకన్‌లు. వీటికి మెల్కీసెడెక్ మరియు అరోనిక్ మంత్రిత్వ శాఖలలో కోరమ్‌లు మరియు ఆర్డర్‌ల యొక్క వివిధ ప్రెసిడెన్సీలు జోడించబడ్డాయి. ఈ మంత్రుల విధులు ఏ విధంగా మారతాయి? చర్చిలో ప్రతి ఒక్కరు విభిన్నమైన మరియు ప్రత్యేకమైన విధిని కలిగి ఉంటారు. పాల్ చర్చిని మానవ శరీరంతో పోల్చాడు, ఇది చాలా మంది సభ్యులను కలిగి ఉంది, అందరూ కొన్ని ప్రత్యేక విధులను నిర్వహిస్తారు, కానీ అందరికీ ప్రయోజనం యొక్క ఐక్యత ఉంది. 1లోని పన్నెండవ అధ్యాయాన్ని చదవండిసెయింట్ మోక్షానికి సంబంధించిన సువార్తను మొత్తం మానవాళికి తీసుకువెళ్లే పనిని నిర్వహించడానికి అతని చర్చిని నిర్వహించడంలో దేవుని గొప్ప ప్రణాళికను అర్థం చేసుకోవడానికి కొరింథీయులు. ఏ సభ్యుడు లేదా అధికారికి అన్ని అర్చక విధులను తగినంతగా నిర్వహించడానికి అవసరమైన అన్ని లక్షణాలు లేదా బహుమతులు లేవు, కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరినీ తనకు తగినట్లుగా, వారి సామర్థ్యాలకు బాగా సరిపోయే మార్గాల్లో ఉపయోగించమని పిలిచాడు. ప్రతి ఒక్కరూ తన స్థానంలో మరియు పిలుపులో సమానంగా గౌరవప్రదంగా ఉంటారు; ప్రతి ఒక్కరు, అలా పని చేస్తున్నప్పుడు, గొప్ప విశేషాలు మరియు ఆశీర్వాదం. ప్రారంభ క్రైస్తవ చర్చి దైవిక నమూనా నుండి నిష్క్రమించినప్పుడు అనేక నిర్దిష్ట పిలుపులు వదిలివేయబడ్డాయి. 1830లో అతని ప్రవక్త, జోసెఫ్ స్మిత్, జూనియర్ ద్వారా ఈ చివరి రోజుల్లో సువార్త మళ్లీ భూమిపైకి తీసుకురాబడినప్పుడు వారు తమ సంపూర్ణతతో పునరుద్ధరించబడ్డారు. ఆ విధంగా 1830 నాటి కమీషన్‌కు అధికార పరంపరగా యేసుక్రీస్తు యొక్క అవశేష చర్చి, తమ మందల కోసం పరిచర్య యొక్క అన్ని విధులను నిర్వహించడానికి పరిమిత సంఖ్యలో అర్చకత్వ కార్యాలయాలను కలిగి ఉన్న అనేక ఇతర సంస్థల నుండి భిన్నంగా ఉంటుంది. ఆనాటి చాలా చర్చిలలో అనేక అర్చకత్వ కార్యాలయాలు కనిపించవు. అర్చకత్వం యొక్క రెండు ప్రధాన ఆదేశాలు ఏమిటి? క్రీస్తు పరిచర్య పాత రోజులలో వలె రెండు ప్రధాన యాజకత్వాల మార్గదర్శకత్వంలో నిర్వహించబడుతుంది. యాజకత్వం యొక్క ఆ రెండు ప్రధాన ఆదేశాలు మెల్కీసెడెక్ మరియు అరోనిక్ (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 104:1, 2). మొదటిది ప్రధాన పూజారులు మరియు పెద్దలను కలిగి ఉంటుంది, రెండవది పూజారులు, ఉపాధ్యాయులు మరియు డీకన్‌లను కలిగి ఉంటుంది. క్రింద వివరించబడిన రెండు ప్రధాన ఆదేశాలు మరియు ప్రతి ఆర్డర్ క్రింద అధికారులు వారి విధులు మరియు విధుల గురించి క్లుప్త వివరణతో చేర్చబడ్డారు. సిద్ధాంతం మరియు ఒడంబడికలు మరియు ఇతర గ్రంధాల నుండి వివరణాత్మక అధ్యయనం ఒక విస్తృతమైన పని, అయితే ప్రతి సభ్యుడు తన స్థానంలో తెలివైన సహకారంతో ప్రతి ఒక్కరి నుండి పరిచర్యను స్వీకరించే స్థితిలో ఉండటానికి బాధ్యత యొక్క ప్రధాన వర్గాల గురించి తెలుసుకోవాలి. మెల్చిసెడెక్, లేదా ఉన్నత ప్రీస్ట్‌హుడ్ ప్రధాన పూజారులు మరియు పెద్దలతో కూడినది ప్రధాన పూజారి పదవికి నియమించబడిన వారు అనేక సందర్భాల్లో కొన్ని సామర్థ్యాలలో పరిచర్య చేయడానికి ప్రత్యక్షత ద్వారా నియమించబడ్డారు. జోసెఫ్ స్మిత్, జూనియర్ ప్రధాన అర్చకత్వాన్ని ప్రీస్ట్‌హుడ్ ఆఫ్ ప్రెసిడెన్సీగా సూచిస్తారు. ప్రధాన యాజకులు మరియు పెద్దలు ఇద్దరూ ఈ మార్గాల్లో సేవ చేయడానికి పిలుస్తారు. చర్చి యొక్క ప్రధాన అర్చకత్వం యొక్క విధులు ఆధ్యాత్మిక విధులు మరియు వ్యవహారాలకు సంబంధించినవి మరియు ఈ మంత్రులు అవసరమైన వివిధ రంగాలలో అధ్యక్షత వహించే ప్రాథమిక బాధ్యతను కలిగి ఉంటారు. ప్రధాన అర్చకత్వం యొక్క ఉపవిభాగాలు మరియు వారి విధులు క్రింది విధంగా ఉన్నాయి: చర్చి యొక్క మొదటి ప్రెసిడెన్సీ మిషనరీ మరియు మతసంబంధమైన మొత్తం ప్రపంచంలోని మొత్తం చర్చి యొక్క పని మరియు పరిచర్యకు అధ్యక్షత వహించడానికి చర్చి యొక్క వెల్లడి ప్రకారం ముగ్గురు ప్రధాన పూజారులు ఎంపిక చేయబడతారు. ముగ్గురిలో ఒకరు చర్చి యొక్క ప్రధాన అర్చకత్వానికి అధ్యక్షుడు మరియు దాని కారణంగా ప్రవక్త, దర్శి మరియు బహిర్గతం చేసేవారు. మిగిలిన ఇద్దరు కౌన్సెలర్లు మరియు ప్రెసిడెంట్లు, తద్వారా మొదటి ప్రెసిడెన్సీ యొక్క కోరం ఏర్పడుతుంది. పన్నెండు మంది కోరం - ట్రావెలింగ్ హై కౌన్సిల్ సాంప్రదాయకంగా "పన్నెండు" అపొస్తలులు చర్చి అధ్యక్షుని ద్వారా ప్రేరణతో ఎంపిక చేయబడతారు. మొదటి ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో చర్చి యొక్క పనిని నిర్వహించడానికి మరియు ప్రపంచంలోని మిషనరీ పనిని, ముఖ్యంగా డెబ్భై మంది పరిచర్యను ప్రత్యక్షంగా మరియు పర్యవేక్షించడానికి వారిని కోరమ్‌గా పిలుస్తారు. మొదటి ప్రెసిడెన్సీ యొక్క పని తప్పనిసరిగా ప్రధాన కార్యాలయంలో నిర్వహించబడుతున్నప్పటికీ, అపొస్తలులు వివిధ మిషన్ ఫీల్డ్‌లలోకి వెళతారు, వారి పర్యవేక్షణ మరియు శ్రద్ధ అవసరమయ్యే అన్ని విషయాలలో మొదటి ప్రెసిడెన్సీకి కేటాయించబడింది మరియు పని చేస్తుంది. అపొస్తలులు చర్చి కార్యకలాపాల మొత్తం రంగంలో మొదటి అధ్యక్ష పదవి కోసం పనిచేస్తున్నందున, వారు తమ అసైన్‌మెంట్‌లను స్వీకరించి, మొదటి ప్రెసిడెన్సీకి నివేదించారు. ఈ కోరం సభ్యులు ప్రధాన పూజారులు. స్టాండింగ్ హై కౌన్సిల్ ఈ పన్నెండు మంది ప్రధాన పూజారుల బృందం అధ్యక్షత వహిస్తుంది మరియు చట్టాన్ని వివరించడంలో మొదటి ప్రెసిడెన్సీకి సహాయం చేయడానికి మరియు అన్ని న్యాయపరమైన విషయాలలో చర్చి యొక్క "సుప్రీం కోర్ట్"గా ఉంటుంది. ఈ కౌన్సిల్, కోరినప్పుడు, చర్చి యొక్క తాత్కాలిక వ్యవహారాలకు సంబంధించి అధ్యక్షత వహించే బిషప్‌రిక్‌కు సలహా హోదాలో కూడా వ్యవహరించవచ్చు. ఆర్డర్ ఆఫ్ బిషప్స్ - ది ప్రిసైడింగ్ బిషప్రిక్ మొదటి ప్రెసిడెన్సీ ద్వారా పిలవబడినప్పుడు మరియు నియమించబడినప్పుడు, ప్రధాన పూజారులు బిషప్ కార్యాలయంలో పరిచర్య చేయడానికి నియమించబడవచ్చు. ఈ సంఖ్యలో ఒకరు చర్చి యొక్క ప్రిసైడింగ్ బిషప్‌గా నియమించబడ్డారు. చర్చి యొక్క తాత్కాలిక కార్యక్రమాల క్రియాశీల పర్యవేక్షణ మరియు నిర్వహణ బాధ్యత అతనిపై మరియు ఇద్దరు సలహాదారులపై ఉంటుంది. అందువల్ల బిషప్‌రిక్‌కు బోధనలో ప్రాథమిక ఆసక్తి ఉంది మరియు సంప్రదింపులు మరియు మొదటి ప్రెసిడెన్సీ యొక్క భవిష్య మార్గదర్శకత్వంలో, చర్చి యొక్క స్టీవార్డ్‌షిప్ ప్రోగ్రామ్‌ను అమలు చేయడం మరియు నిర్వహించడం. అధ్యక్షత వహించే బిషప్ చర్చికి "ట్రస్టీ ఇన్ ట్రస్టీ" మరియు బిషప్రిక్ జనరల్ కాన్ఫరెన్స్ మరియు చట్టంలోని ఇతర నిబంధనలకు లోబడి దాని యొక్క అన్ని తాత్కాలిక వనరులకు సంరక్షకుడు. ఇతర బిషప్‌లు జియోన్ వాటాలలో, జిల్లాలు, పెద్ద శాఖలు మరియు ఇతర ఆర్థిక పరిపాలన యొక్క ఇతర ప్రత్యేక రంగాలలో అవసరాన్ని బట్టి పని చేయడానికి మొదటి ప్రెసిడెన్సీ ద్వారా పిలవబడవచ్చు మరియు ప్రభువు నిర్దేశిస్తారు. అధ్యక్షత వహించే బిషప్ ఆరోనిక్ ప్రీస్ట్‌హుడ్ యొక్క అధ్యక్షుడు మరియు ఇతర అధికార పరిపాలకుల సహకారంతో, ఆ క్రమంలో సమర్థులైన మంత్రుల శిక్షణ మరియు అభివృద్ధికి నాయకత్వం వహిస్తారు. పాట్రియార్క్స్ ఆర్డర్ పితృస్వామ్యులు ప్రధాన యాజకులు, పన్నెండు మంది సభ్యుల కోరమ్‌కు ప్రేరణ యొక్క కాంతితో నియమింపబడినప్పుడు మరియు మొదటి ప్రెసిడెన్సీచే నిర్దేశించబడినప్పుడు, వారి ప్రత్యేక అర్హతలు తండ్రికి సంబంధించిన పరిచర్య, సలహా మరియు పితృస్వామ్య ఆశీర్వాదాలు ఇవ్వడానికి. చర్చి ప్రభుత్వం యొక్క పరిపాలనా వివరాల బాధ్యత నుండి ఈ పురుషులు విముక్తి పొందాలి. పితృస్వామ్యుడు వ్యక్తిగత సలహాదారు మాత్రమే కాదు, పెద్ద శాఖలు లేదా కేంద్రీకృత సభ్యత్వం ఉన్న ప్రాంతాలలో సభ్యత్వానికి పునరుజ్జీవనం చేసేవాడు కూడా. వారు చర్చికి ఆధ్యాత్మిక తండ్రులు మరియు పునరుజ్జీవకులు. ఈ క్రమానికి అధ్యక్షత వహించడానికి ప్రిసైడింగ్ పాట్రియార్క్ కోసం నిబంధన ఉంది. అతను క్రమాన్ని నడిపిస్తాడు మరియు కొన్ని సమయాల్లో, ప్రత్యేక మార్గదర్శకత్వం అవసరమైనప్పుడు చర్చికి దైవిక కాంతి మరియు సలహాల ఛానెల్‌గా వ్యవహరించడానికి పిలవబడవచ్చు. ఈ విధి చాలా అరుదుగా ఉంటుంది మరియు చర్చి యొక్క ప్రవక్త యొక్క ఇష్టానికి అనుగుణంగా లేదా ప్రవక్త అసమర్థుడైనప్పుడు లేదా మరణానికి గురైనప్పుడు మాత్రమే నిర్వహించబడుతుంది. ప్రధాన పూజారులు పైన పేర్కొన్న నిర్దిష్ట విధులకు పిలవబడని ప్రధాన పూజారుల విధులు తప్పనిసరిగా మతసంబంధమైనవి మరియు చర్చి యొక్క వివిధ కౌన్సిల్‌లు మరియు ఆర్డర్‌లకు పిలవబడనప్పుడు తప్పనిసరిగా ఉంటాయి. ఈ మంత్రులపై వాటాలు, జిల్లాలు, పెద్ద శాఖలు లేదా ఇతర వ్యవస్థీకృత కార్యకలాపాలకు అధ్యక్షత వహించే బాధ్యతలు ఉంటాయి. వారు చర్చి ఉన్న చోట అర్చకత్వ సభ్యుల అభివృద్ధిలో అధ్యక్షత, బోధన మరియు పర్యవేక్షించే మంత్రిత్వ శాఖలో కూడా సేవ చేస్తారు. నిర్దిష్ట పరిపాలనా బాధ్యతలలో కార్మికులకు నియమించబడినప్పుడు, వారు "ఉమ్మడి సమ్మతి" సూత్రం ప్రకారం, స్వీకరించబడిన బాధ్యతకు తగిన సమావేశం లేదా వ్యాపార సమావేశం ద్వారా ఎంపిక చేయబడతారు లేదా కొనసాగించబడతారు. ప్రధాన యాజకులు మెల్కీసెడెక్ లేదా ప్రధాన యాజకత్వంలో పునాది కార్యాలయాన్ని కలిగి ఉంటారు. డెబ్బైల ఒక డెబ్బై అనేది పెద్దల శ్రేణుల నుండి ఎన్నుకోబడిన మరియు నియమించబడిన ఒక మంత్రి మరియు చర్చి యొక్క మిషనరీ కార్యకలాపాలపై తన మొదటి దృష్టిని ఇవ్వడానికి ప్రత్యేకంగా కేటాయించబడింది. మిషనరీ పని కోసం వారి అర్హతలు మరియు పిలుపు వారికి సరిపోయే పెద్దలు ఈ ఆర్డినేషన్‌ను పొందవచ్చు మరియు అలా నియమించబడినప్పుడు, వారు పన్నెండు మంది కోరమ్ ఆధ్వర్యంలో పని చేస్తారు. తరువాతి హోదాలో వారు ఆ కోరం ద్వారా పంపబడినప్పుడు లేదా చర్చి యొక్క నిర్దేశం ద్వారా ప్రత్యేకంగా పంపబడినప్పుడు వారితో అపోస్టోలిక్ అధికారాన్ని తీసుకువెళతారు. ఎమర్జెన్సీలు ఉన్న శాఖలు మరియు జిల్లాలకు అధ్యక్షత వహించడానికి లేదా అభివృద్ధి చెందుతున్న ప్రాంతానికి అధ్యక్షత వహించడానికి డెబ్బైల వారు సందర్భానుసారంగా ఎంపిక చేయబడవచ్చు. ఆ ప్రాంతం సహేతుకంగా పరిణతి చెందినప్పుడల్లా, అది నిలబడి ఉన్న పరిచర్య యొక్క దిశకు వదిలివేయబడాలి, అయితే డెబ్బై తన పనిని మరింత మిషనరీ అవసరమైన ప్రాంతాలకు విస్తరించింది. పెద్దలు ఈ కార్యాలయం డెబ్బైకి భిన్నంగా ఉంటుంది, ఇది ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ప్రయాణించని వారి కోసం రూపొందించబడింది. పెద్ద యొక్క కార్యాలయం ప్రధాన అర్చకత్వానికి అనుబంధం మరియు అందువల్ల ఆ అర్చకత్వం యొక్క అనేక విధుల్లో సహాయం చేస్తుంది. బాప్టిజం ఇవ్వడం, ధృవీకరించడం, నియమించడం, మతకర్మను నిర్వహించడం, బోధించడం, బోధించడం, వివరించడం, ప్రబోధించడం, చర్చిని పర్యవేక్షించడం, చేతులు వేయడం ద్వారా ధృవీకరించడం మరియు అన్ని సమావేశాలకు నాయకత్వం వహించడం వంటి పెద్దలు మరియు ఉన్నత అధికారులందరూ పిలుపునిస్తారు. . సంఘ సభ్యుల దైనందిన జీవితాలతో ఎల్డర్‌షిప్ ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండటం ప్రయోజనకరమని దీని నుండి మనం చూస్తాము. ఆ విధంగా మనం ఒక పెద్దను ఒక శాఖకు అధ్యక్షత వహించే పెద్దగా భావించవచ్చు, అక్కడ సేవ చేసే స్థానంలో ప్రధాన యాజకుడు లేడు. పెద్దలు మిషనరీ పెద్దలుగా శ్రమించవచ్చు, కానీ పిలిచి నియమించబడితే తప్ప, డెబ్బైలు కాదు. మెల్కీసెడెక్ యాజకత్వంలోని అన్ని కార్యాలయాలను గుర్తించడానికి పెద్ద అనే పదం సముచితంగా ఉపయోగించబడుతుంది. సిద్ధాంతం మరియు ఒడంబడికలు 125:8 ఆరోనిక్, లేదా లెస్సర్ ప్రీస్ట్‌హుడ్ పూజారులు, ఉపాధ్యాయులు మరియు డీకన్‌లతో కూడినది కింది అధికారులు అహరోనిక్ యాజకత్వానికి చెందిన సభ్యులు. పూజారులు పైన వివరించిన పెద్దలు మరియు ప్రధాన పూజారుల వలె పూజారులు చర్చికి నిలబడి పరిచారకులుగా ఉన్నారు. అంటే వారే ముందుగా స్థానిక మంత్రులు. పైన పేర్కొన్న అధికారులు మెల్కీసెడెక్ పరిచర్యగా నియమించబడ్డారు, యాజకులు, ఉపాధ్యాయులు మరియు డీకన్లు అహరోనిక్ పరిచర్యలో సభ్యులు. పూజారి యొక్క విధి ఏమిటంటే, బోధించడం, బోధించడం, వివరించడం, ప్రబోధించడం, బాప్టిజం ఇవ్వడం, మతకర్మను నిర్వహించడం మరియు శాఖలోని ప్రతి సభ్యుని ఇంటిని సందర్శించడం. అతను సభ్యులకు వారి విధులను బోధించే ఎక్స్‌ప్రెస్ డ్యూటీతో ఇళ్లను సందర్శిస్తాడు మరియు ఈ మంత్రిత్వ శాఖలో స్వాగతించబడాలి మరియు స్వీకరించబడాలి. సభ్యులను వారి ఇళ్లలో సందర్శించడంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది, ఇది అతని పని యొక్క ప్రత్యేక లక్షణంగా మారింది. అతను ముఖ్యంగా సెయింట్స్ ఇళ్లలో ప్రార్థనపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ పరిచర్య చేస్తాడు. అలా చేయడం ద్వారా అతను కుటుంబాలు మరియు వారి సభ్యులందరికీ స్నేహితుడు మరియు విశ్వసనీయుడు. తన పిలుపు పరిధిలో, అతను అవసరమైన చోట పెద్దలకు సహాయం చేయవచ్చు. ఒక పూజారి ప్రయాణానికి, ఇష్టమైతే, మరియు మిషనరీకి సాక్ష్యమివ్వడానికి పిలవబడవచ్చు, కానీ అతని అరోనిక్ యాజకత్వం యొక్క పరిమితుల కారణంగా, ధృవీకరణ కోసం చేతులు వేయడానికి అతనికి అర్హత లేదు, మిషనరీగా అతని పనితీరు పరిమితం చేయబడింది. అతని మిషనరీ పని పెద్దలతో కలిసి ఉంది. ఉపాధ్యాయులు ఈ శీర్షిక ఆధ్యాత్మిక స్వభావం యొక్క నిర్దిష్ట పిలుపును గుర్తిస్తుంది. చర్చిని పర్యవేక్షించడం లేదా మరో మాటలో చెప్పాలంటే, చర్చిని బలోపేతం చేయడం ఉపాధ్యాయ కార్యాలయానికి నియమించబడిన వారి విధి. ముఖ్యంగా టీచర్ సభ్యత్వాల మధ్య పాపం ఆక్రమణను నివారించే విధంగా పరిచర్య చేయాలి. అతను కూడా పవిత్రత యొక్క సరైన సంబంధాలు నిర్వహించబడేలా చూడాలి. సభ్యులలో అబద్ధాలు చెప్పడం, వెక్కిరించడం మరియు గాసిప్ చేయడం వంటి నిర్దిష్ట పాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అతను మరింత ఆజ్ఞాపించబడ్డాడు. ఆరాధనా గృహానికి సభ్యులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడటం అతని నిర్మాణాత్మక కర్తవ్యం, ఆ మేరకు అతను రికార్డును ఉంచుకోవాలి. మానవ సంబంధాల రంగంలో నిపుణుడిగా ఉండటం అతని కర్తవ్యం మరియు అతని మంత్రిత్వ శాఖ, ఈ విషయంలో, సభ్యత్వం కోసం వెతకాలి మరియు అంగీకరించాలి. ఉపాధ్యాయుడు బాప్టిజం చేయడు, చేతులు వేయడు లేదా మతకర్మను నిర్వహించడు. అతని విధులు అతన్ని బోధకునిగా, క్లాస్ టీచర్‌గా, సెయింట్స్ ఇళ్లకు విజిటింగ్ ఆఫీసర్‌గా మరియు సభ్యులకు సలహాదారుగా చేస్తాయి. డీకన్లు చర్చి జీవితంలో డీకన్ యొక్క పని చాలా ముఖ్యమైనది. అతను అవసరమైనప్పుడు, వ్యక్తిగత ఇబ్బందుల సర్దుబాటు విషయాలలో ఉపాధ్యాయునికి సహాయకుడిగా పని చేస్తాడు, అయితే అతని మొదటి మరియు ప్రత్యేక విధులు భౌతిక సౌకర్యాలు మరియు చర్చి భవనాల నియామకాలకు సంబంధించినవి. అతను మన ప్రార్థనా గృహాల తాళపు కీలను కలిగి ఉంటాడు మరియు బ్రాంచ్ ప్రిసైడింగ్ అధికారితో కలిసి, అటువంటి భవనాల సంరక్షణ మరియు శుభ్రతను పర్యవేక్షించడం అతని విధి. డీకన్ స్థానిక చర్చి నిధుల సంరక్షకుడు కావచ్చు. అతను సభ్యత్వం యొక్క అన్ని సమావేశాలలో ఉషరింగ్ మరియు క్రమబద్ధమైన ప్రవర్తనను అందించే బాధ్యతను కలిగి ఉన్నాడు. అతను, ఉపాధ్యాయునితో, అతని కార్యకలాపంలో మరింత స్థానికంగా ఉంటాడు మరియు అతని పరిచర్య సాధారణంగా అతను క్రమం తప్పకుండా హాజరయ్యే బ్రాంచికి మాత్రమే పరిమితమై ఉంటుంది; అంటే, అతను సాధారణంగా తన పరిచర్యలో ప్రయాణించడు. ఉపాధ్యాయునికి సహాయకుడిగా, సందర్భం అవసరమైనప్పుడు, డీకన్ కూడా మతకర్మను నిర్వహించడు. సభకు ప్రధాన మంత్రి ఎవరు? బ్రాంచ్ లేదా మిషన్ ప్రెసిడెంట్ దాని చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్. పరిపాలనాపరంగా, అతను చర్చి యొక్క పెద్ద అధికారులకు మరియు శాఖలోని అన్ని పనులకు శాఖ సభ్యత్వానికి బాధ్యత వహిస్తాడు. బ్రాంచ్ లేదా మిషన్ ప్రెసిడెంట్, సాధారణంగా అతనిచే ఎంపిక చేయబడిన ఇద్దరు సలహాదారుల సహాయంతో, చర్చి యొక్క చట్టాలకు అనుగుణంగా సంఘం యొక్క వ్యవహారాలను నిర్వహిస్తారు. మందను కాపరి చేసే పని బ్రాంచ్ లేదా మిషన్‌లోని ఇతర స్టాండింగ్ మినిస్టర్‌లందరితో పంచుకోబడుతుంది, అయితే వారి పనిలో ఈ అధికారుల నిర్దేశానికి అతను బాధ్యత వహిస్తాడు. ప్రతి పరిచర్య చేయడానికి అవసరమైన అన్ని బహుమతులు ఎవరికీ లేవు. ప్రతి ఒక్కటి ఇతరులను పూర్తి చేస్తుంది. అధ్యక్ష పదవి, విస్తృత కోణంలో, స్థానిక మంత్రులందరికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. భాగస్వామ్య పరిచర్యను అందించడానికి ఇది మన పరలోకపు తండ్రి యొక్క తెలివైన ఏర్పాటు. ప్రతి యాజకత్వ సభ్యుడు మంద యొక్క మతసంబంధమైన సంరక్షణలో బ్రాంచ్ అధ్యక్షుడికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి మరియు సన్యాసిత్వం యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి, సమర్థవంతమైన పురోగతికి అవసరమైన సమన్వయం మరియు పర్యవేక్షణ కోసం ప్రిసైడింగ్ అధికారి(ల) వైపు చూస్తారు. ఏ ప్రత్యేక మార్గాల్లో సభ్యులు పాస్టోరల్ సహాయం పొందవచ్చు? జీవిత అవసరాలను ప్రభావితం చేసే విషయాలలో సభ్యుడు ఎప్పుడైనా ప్రిసైడింగ్ అధికారిని లేదా అర్చకత్వంలో ఎవరినైనా సంప్రదించడానికి సంకోచించకూడదు. సభ్యులు తమ ఇళ్లలోని సన్నిహిత సర్కిల్‌లోకి మంత్రిత్వ శాఖను ఆహ్వానించాలని ఆశించాలి. ఇక్కడ ప్రత్యేక అవసరం ఉన్న సందర్భాలలో గౌరవం మరియు విశ్వాసం యొక్క పునాది వేయబడింది. మాస్టర్ షెపర్డ్ చెప్పారు, "...అపరిచితుడిని వారు అనుసరించరు..." (యోహాను 10:5) కాపరులు మరియు మంద ఒకరినొకరు బాగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. కింది సమయాల్లో మీకు సహాయం అందించడానికి బ్రాంచ్ ప్రెసిడెంట్ సంతోషిస్తారు: ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్ మీరు బాధల భారాన్ని పంచుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, అతను (వారు) సానుభూతిగల స్నేహితుడుగా ఉంటారు. టైమ్స్ ఆఫ్ జాయ్ మీరు విజయాన్ని సాధించినప్పుడు, మీకు వార్షికోత్సవం ఆనందంగా ఉన్నప్పుడు, మీ ఆనందాన్ని పంచుకోవడానికి మీకు స్నేహితులు ఉన్నప్పుడు, అతను (వారు) సంతోషంగా పాల్గొంటారు మరియు మీతో జరుపుకుంటారు. ఇన్ టైమ్స్ ఆఫ్ బీరేవ్‌మెంట్ మరణం మీ ఇంటి సర్కిల్‌లోకి ప్రవేశించినప్పుడు, అతను (వారు) మీ ఓదార్పునిచ్చే వ్యక్తికి దగ్గరగా ఉండటానికి మీకు సహాయం చేయగలడు మరియు మీ కష్టాలను ఎదుర్కొంటూ ఆచరణాత్మకమైన సహాయం అందించడానికి సంతోషిస్తాడు. అనారోగ్య సమయాలలో అతను (వారు) అనారోగ్యం వచ్చినప్పుడు మీ కోసం ప్రార్థిస్తారు మరియు మీ జ్ఞానం మరియు బలం కోసం దేవుని నుండి సలహా కోరుకుంటారు. అతను (వారు) రికవరీకి కొన్ని ఆచరణాత్మక దశలను సూచించగలరు మరియు అటువంటి పరిస్థితుల వల్ల కలిగే దేశీయ మరియు ఇతర అత్యవసర పరిస్థితులను తీర్చడంలో మీకు సహాయం చేయగలరు. ఇన్ టైమ్స్ ఆఫ్ పర్‌ప్లెక్సిటీ మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, అతను (వారు) మీతో పంచుకోవడానికి సంతోషిస్తారు. అతను/వారు ఆరాటపడరు, కానీ మీ సహాయం కోసం ప్రత్యేక లేఖనాల సలహాను తీసుకువస్తారు. మీరు వారితో మాట్లాడవచ్చు. ఒక వృత్తిని ఎన్నుకునే సమయాలలో నేటి బ్రాంచ్ ప్రెసిడెంట్ మరియు ఇతర అర్చకత్వ సభ్యులు మా యువకులకు సహాయం చేయగల సామర్థ్యాన్ని పెంచుతున్నారు మరియు వృత్తిపరమైన మార్గదర్శకత్వంలో వారు అభివృద్ధి చేసిన ఏదైనా నైపుణ్యం మీ సేవలో ఉంటుంది. అతను (వారు) మీకు ఉత్తమ సహాయాన్ని పొందడంలో సహాయం చేస్తాడు. మీ వివాహ సమయంలో మీ వివాహంలో మీకు సహాయం చేయడానికి మీ అర్చకత్వం సంతోషిస్తుంది, కానీ ఈ ముఖ్యమైన మతకర్మను తెలివిగా చేరుకోవడంలో మీకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుంది. బ్రాంచ్ ప్రెసిడెంట్ మరియు ఇతర అర్చకత్వం గృహ సంబంధాల ప్రాంతంలో కౌన్సెలింగ్ కోసం ఎక్కువగా సిద్ధమవుతున్నారు మరియు సహాయం చేసే అవకాశాన్ని అభినందిస్తారు. తప్పు చేసే సమయాల్లో అతను కూడా తనకు తెలిసినట్లుగా క్రీస్తును అనుసరిస్తున్నందున, అతను మిమ్మల్ని దూషించడు. అతను విశ్వాసాన్ని గౌరవిస్తాడు. మీ భారాన్ని యేసు పాదాల వద్ద ఉంచడానికి మరియు తండ్రిలా మీకు మార్గం చూపడానికి అతను మీకు సహాయం చేస్తాడు. ఈ అవసరమైన అన్ని సమయాల్లో, పాస్టోరల్ మరియు షెపర్డింగ్ మంత్రిత్వ శాఖ సభ్యులకు ఓదార్పు, సలహా మరియు ప్రోత్సాహం కోసం అందుబాటులో ఉంటుంది. మా మంత్రులకు ప్రతి నిర్దిష్ట సమస్యకు సమాధానం తెలియకపోవచ్చు, కానీ మీకు అత్యంత అవసరమైన వాటిని కనుగొనడంలో వారు మీకు సహాయం చేయగలరు మరియు సహాయం చేస్తారు. వారు అనేక మంది నిపుణులు కాదు, కానీ అర్హత కలిగిన బ్రాంచ్ ప్రెసిడెంట్ మరియు అతని తోటి మంత్రులు మీకు అవసరమైన సమయంలో మీకు ఉత్తమమైన సహాయాన్ని తెలుసుకుంటారు లేదా పొందుతారు. అధ్యాయం 10 కంఫర్ట్ మరియు సహాయానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక మంత్రిత్వ శాఖలు చేతులు వేయడం అనేక ప్రయోజనాల కోసం లేఖనాలలో వివరించబడింది: ధృవీకరణ కోసం, రోగులకు పరిపాలన, పరిచర్యకు నియమించడం, పితృస్వామ్య ఆశీర్వాదం మరియు పిల్లల ఆశీర్వాదం కోసం. అనారోగ్యం కోసం పరిపాలన అనారోగ్యం కోసం పరిపాలన అంటే ఏమిటి? ఇది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక అనారోగ్యం మరియు బాధల ఉపశమనం మరియు నివారణ కోసం యేసు తన భూసంబంధమైన పరిచర్యలో ఆచరించిన శాసనం. ఇది పురాతన రోజులలో వలె చర్చిలో అందుబాటులో ఉంది. క్లుప్తంగా వివరించబడినది, ఆర్డినెన్స్ అనేది చర్చి యొక్క పెద్దలు బాధితుడి తలపై నూనెతో అభిషేకం చేసి, అతని తలపై చేతులు వేసి, వైద్యం మరియు ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తారు. ఈ ఆర్డినెన్స్ యొక్క లేఖనాధారం ఏమిటి? ప్రపంచానికి తన సందేశాన్ని అందించడానికి యేసు తన అనుచరులను పంపినప్పుడు, అతను ఇతర వాగ్దానాలలో చేర్చాడు, "వారు జబ్బుపడిన వారిపై చేయి వేస్తారు, మరియు వారు కోలుకుంటారు." (మార్కు 16:19) అపొస్తలుడైన జేమ్స్ ఈ శాసనంపై బైబిల్లో అత్యంత సమగ్రమైన ప్రకటనను ఇచ్చాడు: "మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? అతను చర్చి యొక్క పెద్దలను పిలవనివ్వండి; మరియు వారు అతనిపై ప్రార్థించనివ్వండి, ప్రభువు నామంలో అతనికి నూనెతో అభిషేకం చేయనివ్వండి; విశ్వాసం యొక్క ప్రార్థన రోగులను రక్షిస్తుంది మరియు ప్రభువు లేపుతాడు. అతన్ని లేపు; మరియు అతను పాపాలు చేసి ఉంటే, వారు అతనికి క్షమించబడతారు." (జేమ్స్ 5:14, 15) ప్రయోజనంలో భాగస్వామ్యం చేయడానికి ఒకరు ఎలా కొనసాగాలి ఈ నిబంధన? అనారోగ్యం లేదా అవసరం ఉన్న వ్యక్తి, మొదట, పెద్దలను పిలవాలి. అలా చేయడంలో వైఫల్యం ఆ వ్యక్తి విశ్వాసం ద్వారా తన ఆత్మను సిద్ధం చేసుకునే అధికారాన్ని దోచుకుంటుంది. అసలు కాల్‌కు దారితీసే దశలు స్పష్టంగా కొంత ఆధ్యాత్మిక తయారీ మరియు దేవుడు మరియు చర్చితో ఒకరి సంబంధాన్ని గ్రహించడం వంటివి కలిగి ఉంటాయి. అందువల్ల అవసరమైన వ్యక్తి ఈ సేవ యొక్క అవసరాన్ని మంత్రిత్వ శాఖ ఊహించి ఉండకూడదు. పెద్దలు అభ్యర్థన లేకుండా తమ జీవితంలోకి వెళ్లనందున కొందరు గాయపడినట్లు భావించారు. పెద్దల పనిలో సభ్యులకు వారి విధులు మరియు అధికారాలను అర్థం చేసుకోవడానికి బోధన మరియు నడిపించడం ఉన్నప్పటికీ, ఈ గొప్ప శాసనం యొక్క దరఖాస్తులో మొదటి అడుగు వేయడం అవసరంలో ఉన్నవారి కర్తవ్యం అని గుర్తుంచుకోవాలి. అందువల్ల, వయస్సు కారణంగా అసమర్థత లేదా అభ్యర్థనను తెలియజేయడానికి సామర్థ్యం లేకపోవడం వంటి వ్యక్తి యొక్క విధి, పెద్దలను పిలవడం. అవసరమైన వ్యక్తి స్వయంగా పెద్దలను లేదా కుటుంబ సభ్యుడిని పిలవవచ్చు లేదా అతను చేయలేకపోతే అతని కోసం ఒక సహాయకుడు కాల్ చేయవచ్చు, ఇది అనారోగ్యంతో ఉన్న వ్యక్తి యొక్క కోరికలను తీర్చగలదని తెలిసినట్లయితే. పరిపాలన ఉండాలా వద్దా అని నిర్ణయించే బాధ్యత మంత్రికి ఉందా? ఆర్డినెన్స్ తీవ్రంగా మరియు గౌరవప్రదంగా మరియు అవగాహనతో అవసరమైన స్థాయిలో మరియు పరిస్థితులలో సహేతుకమైన స్థాయిలో నమోదు చేయబడిందని నిర్ధారించడం పెద్దల విధి. ఒక వ్యక్తి తన కోరికలను తెలియజేయలేని విధంగా అసమర్థుడైన చోట, పెద్దల ప్రార్థనలు మరియు ప్రార్థనలు సహజంగా పరిస్థితులకు సరిపోతాయి మరియు కుటుంబ కోరికలు లేదా అభ్యర్థనలకు సంబంధించినవిగా ఉంటాయి. ప్రయోజనం పొందాలంటే ఏ డిగ్రీ విశ్వాసం అవసరం? "...దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని మరియు ఆయనను శ్రద్ధగా వెదకువారికి ప్రతిఫలమిచ్చునని నమ్మవలెను." (హెబ్రీయులు 11:6) "ప్రభూ, నేను నమ్ముతున్నాను; నా అవిశ్వాసానికి సహాయం చెయ్యండి." (మార్కు 9:21) చర్చి యొక్క హీలింగ్ ఆర్డినెన్స్ సభ్యుడు మరియు మంత్రి మధ్య పరలోక తండ్రికి సహకార విధానాన్ని కలిగి ఉంటుంది. అవసరమైన వ్యక్తి యొక్క విశ్వాసం మరియు సిద్ధత తప్పనిసరిగా చర్చి మరియు దాని పరిచర్యతో దేవునికి పూర్తి ఆశీర్వాదాన్ని రక్షిస్తుంది. ఈ ఆర్డినెన్స్ అందరికీ ఉచితం, చర్చి సభ్యుడైనా లేదా కాకపోయినా, దానిని విశ్వాసంలో చిత్తశుద్ధితో సంప్రదించాలి. "మరియు వారు పాపాలు చేసినట్లయితే, వారు క్షమించబడతారు" అంటే ఏమిటి? జబ్బుపడిన వ్యక్తి యొక్క పరిస్థితిలో పాపం ప్రత్యక్ష కారకంగా ఉన్నవారిని సూచించడానికి ఇది అర్థం చేసుకోవాలి. పాపం అజ్ఞానంతో లేదా ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండవచ్చు మరియు దేవుని దయ అమలులో ఉందని ప్రకటన సూచిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, స్వస్థత జరగడానికి ముందు, పాపం చేసిన చోట, పశ్చాత్తాపం మరియు భవిష్యత్తులో ఆ పాపాన్ని నివారించాలనే సంకల్పం అవసరం. అటువంటి పరిస్థితిపై మాస్టర్ స్పందన "వెళ్ళి ఇక పాపం చేయకు." (జాన్ 8:11) లేఖనాల యొక్క ఈ నిబంధన అత్యంత ఆధునిక వైద్య విధానం మరియు శాస్త్రీయ చికిత్సలో ప్రతిరూపాన్ని కనుగొంటుంది. అనేక మానవ రుగ్మతలు తప్పులు, సామాజిక దుష్ప్రవర్తనలు మరియు పాపాల వల్ల సంభవిస్తాయనే వాస్తవాన్ని ఇది పరిగణనలోకి తీసుకుంటుంది. మానసిక క్షోభ మరియు ఉద్రిక్తతలు శారీరక బాధలు, క్రియాత్మక ఆటంకాలు మరియు సేంద్రీయ మార్పులకు దారితీస్తాయని అందరికీ తెలుసు. ఈ సందర్భాలలో అవసరమైన మొదటి దశలలో ఒకటి పాప క్షమాపణ పొందడం మరియు అపరాధం యొక్క ఆత్మను క్లియర్ చేయడం. వైద్యులు అటువంటి కేసులతో సుపరిచితులు మరియు మనోరోగ వైద్యులు పశ్చాత్తాపం మరియు క్షమాపణకు సంబంధించిన ప్రాథమిక సూత్రాల చుట్టూ వారి చికిత్సలో ముఖ్యమైన భాగాలను నిర్మిస్తారు. గాయం మరియు వ్యాధిలో, అతను ఎప్పుడు నయం అయ్యాడో బాధితుడికి తెలుసు. కానీ ఆత్మ యొక్క అనారోగ్యంలో, వైద్యం ప్రారంభించే ముందు దేవుడు క్షమించే అధికారిక మరియు దైవిక మూలం నుండి ఒక ప్రకటన అవసరం. పాపంపై ఈ ప్రకటనను వచనంలో భాగంగా చేయడంలో దైవిక జ్ఞానం వెల్లడైంది. ఏ ఆయిల్ ఉపయోగించబడుతుంది మరియు ఏ పరిస్థితులలో ఉంది? జీసస్ కాలంలో పాలస్తీనాలో సాంప్రదాయకంగా ఉపయోగించిన ఆలివ్ నూనె ఈ ప్రయోజనం కోసం బాగా సరిపోతుంది మరియు ఈ ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది. ఈ ప్రయోజనం కోసం నూనెను ప్రతిష్టించడానికి నిర్దిష్ట ఆదేశం లేనప్పటికీ, పవిత్రమైన ప్రయోజనాల కోసం స్థిరంగా ఉపయోగించే ఏ ఇతర ఏజెంట్‌నైనా ఆశీర్వదించడం లేదా వేరు చేయడం వంటివి చేయడం సహేతుకమైనది మరియు తగినది. ఇది పెద్దల సంప్రదాయాలలో సరిగ్గా ఉంది మరియు చర్చిలో సమర్థించబడుతూనే ఉన్న దీర్ఘకాల అభ్యాసం. అభిషేకం ఎల్లప్పుడూ తలపైనే చేయబడుతుందా? పరిపాలన సమయంలో, ఒక పెద్ద అవసరమైన వ్యక్తి తలపై నూనెతో అభిషేకం చేయడం, ఉద్దేశ్యాన్ని సంక్షిప్తంగా చెప్పడం మరియు ఆచారం కోసం విజ్ఞప్తి చేయడం ఆచారం. దీనిని అనుసరించి, అసోసియేట్ పెద్దలు అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచి, వారిని దేవుని చేతుల్లో వదిలివేయడం కోసం దేవునికి విశ్వాసం యొక్క తీవ్రమైన ప్రార్థనను అందిస్తారు. తలకు మాత్రమే అభిషేకం చేయాలి మరియు ఇందులో ఔచిత్యాన్ని గౌరవించడం తప్పనిసరి. "పెద్దలు" అనే బహువచనాన్ని గుర్తించడం తెలివైన విషయం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పెద్దలు పరిపాలనను నిర్వహించడం ఆచారం మరియు అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఒంటరిగా ఉన్న చోట, పాల్గొన్న అన్ని పక్షాల ప్రయోజనం కోసం నియమాన్ని ఖచ్చితంగా పరిగణించాలి. ఈ ఆర్డినెన్స్ శారీరక రుగ్మతలకు మాత్రమే అందుబాటులో ఉందా? ఏదైనా పరిస్థితి, శారీరక, మానసిక లేదా ఆధ్యాత్మికం, ఈ ఆచారం యొక్క ప్రయోజనం యొక్క అవసరాన్ని సూచించవచ్చు. మానసిక మరియు ఆధ్యాత్మిక ఆశీర్వాదం కోసం పిలుపు మరింత అత్యవసరం అవుతుంది, ఎందుకంటే మోడెమ్ జీవితం యొక్క ఒత్తిడి మరియు ఒత్తిడి ఆత్మ యొక్క శాంతి మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు యొక్క పెరుగుతున్న అవసరాన్ని కలిగిస్తుంది. వైద్యం యొక్క ఈ శాసనానికి సరైన మరియు భక్తిపూర్వక విధానం ద్వారా దీనిని పొందవచ్చు. తక్షణ మరియు అద్భుత ఫలితాలు ఆశించాలా? ఇది అవసరం లేదు. క్రమమైన స్వస్థతలను లేఖనాలు నమోదు చేశాయి. అవసరమైన వ్యక్తి మాత్రమే సరిదిద్దగల కారకాలు ఉండవచ్చు మరియు దానికి సమయం అవసరం కావచ్చు. జ్ఞానం కోసం ప్రార్థన, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మరియు పెద్దలు ఏ మార్గాన్ని అనుసరించాలో తెలుసుకోవాలనేది ప్రాముఖ్యమైన పరిశీలన. వ్యక్తి స్వయంగా లేదా మెడికల్ థెరపిస్ట్‌ల ద్వారా సహాయం అందుబాటులో ఉన్న చోట, సహాయం వివేకంతో ఉపయోగించబడుతుందని సాధారణంగా గుర్తించబడింది. అడ్మినిస్ట్రేషన్ ఆర్డినెన్స్‌ను విశ్వాసం యొక్క చట్టంగా అంగీకరించేటప్పుడు బాధితుడు వైద్య లేదా ఇతర సహాయానికి దూరంగా ఉండాలా? విశ్వాసం యొక్క వైరుధ్యం లేకుండా మానవ మరియు దైవిక సహాయాన్ని కోరవచ్చు. అనారోగ్యంతో ఉన్నవారి కోసం, కోలుకోవడానికి సహాయం చేయడానికి సాధ్యమైనదంతా చేయాలి, అదే సమయంలో అతని ద్వారా పని చేయమని దేవుడిని అడుగుతుంది. ప్రాణాపాయం స్పష్టంగా ఉన్న చోట మనం వైద్య సహాయాన్ని కోరడం జ్ఞానం అవసరం. విపరీతమైన వైఖరితో ఈ విలువైన ఆర్డినెన్స్‌పై ఎలాంటి అపఖ్యాతి కలగకుండా సభ్యులు అప్రమత్తంగా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ నిర్వహించాలి? "కాల్" చేయవలసిన బాధ్యత అవసరమైన వ్యక్తి యొక్క ఇంటిని సూచిస్తుంది లేదా పెద్దవారి ఇంటిలో లేదా ఆసుపత్రి వంటి సంరక్షణ స్థలంలో నిర్వహించబడవచ్చు. ఆర్డినెన్స్ యొక్క ఉద్దేశ్యం మరియు స్ఫూర్తి అత్యంత కీలకమైన వారి సమక్షంలో నిర్వహించబడే చోట ఉత్తమంగా అందించబడుతుందని భావించబడింది మరియు ఈ ప్రయోజనం కోసం ఇల్లు లేదా చర్చి భవనం చాలా అనుకూలంగా ఉంటుంది. రోగుల ప్రయోజనం కోసం ఉపవాసం మరియు ప్రార్థన కోసం ఒక సమాజాన్ని పిలవడం తెలివైనది మరియు కోరదగినది మరియు సలహా ఇస్తే, బ్రాంచ్ ప్రెసిడెంట్ ఏర్పాటు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ, చర్చి యొక్క సమావేశాలు ఆర్డినెన్స్ యొక్క కవాతు కోసం ఎన్నటికీ ఒక సందర్భం కాకూడదు, ఇక్కడ పరిపాలనను కోరుకోని వారు బహిరంగంగా పరిపాలన కోసం పెద్దలను వరుసగా సంప్రదిస్తారు. ఇందులో శాఖా అధ్యక్షుడి విజ్ఞత తప్పక మార్గదర్శకంగా ఉండాలి. అవిభక్త ప్రార్థన మరియు విశ్వాసం కార్యరూపం దాల్చేలా పరిస్థితులు ఉండాలి. కొన్ని సమయాల్లో ఆసుపత్రులు కూడా ఈ స్ఫూర్తికి అనుకూలంగా ఉండవు మరియు ఒక వార్డు లేదా గదిలో ఒక స్క్రీన్ సాధారణంగా కోరబడుతుంది, పరిపాలనను దాచిపెట్టాలనే కోరికతో కాదు, కానీ పాల్గొనేవారిలో ఆత్మ యొక్క ఐక్యత అవసరం అని గతంలో పేర్కొన్నది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ కోసం కాల్ చేయవచ్చు అదే అనారోగ్యం కోసం? ఈ శాసనం ద్వారా దేవునికి తరచుగా మరియు క్రమబద్ధమైన విధానాలు అవసరం కావచ్చు. విశ్వాసాన్ని బలోపేతం చేయవలసిన అవసరం గొప్ప అంశం కావచ్చు మరియు ఈ ఆచారం ద్వారా నిరంతర విధానాన్ని కలిగి ఉండవచ్చు. కాంతి మరియు జ్ఞానం కోసం నిరంతర శోధన అవసరం ఉండవచ్చు మరియు ఈ విధంగా మాత్రమే ప్రయోజనం పొందవచ్చు. అటువంటి పిలుపులకు అన్ని సమయాలలో పెద్దలు ఇచ్చిన త్యాగం మరియు ముడుపు కోసం పరిగణనలోకి తీసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ పెద్దలకు అనవసరమైన కష్టాలకు కారణం కాకూడదు. ఈ వ్యక్తుల సూత్రం, వారి శక్తిలో ఉన్న సహాయాన్ని అందించడానికి ఎప్పుడూ నిరాకరించకూడదని, మన అభ్యర్థనలు సమయానుకూలంగా మరియు సహేతుకంగా ఉండాలని మాకు అవసరం. జబ్బుపడిన వారి వైద్యం కోసం ఆర్డినెన్స్ పునరుద్ధరించబడిన చర్చిలో అత్యంత ఓదార్పునిస్తుంది మరియు ఫలవంతమైనది, మరియు ఆ కారణంగా దీనిని అత్యంత గౌరవించబడాలి మరియు సంయమనం మరియు అవగాహనతో ఉపయోగించాలి, ఇది మాత్రమే ఆధ్యాత్మిక అధికారాల సాధనలో గౌరవాన్ని కాపాడుతుంది. పితృస్వామ్య దీవెన పితృస్వామ్య ఆశీర్వాదం అంటే ఏమిటి? ఇది పితృదేవత తన చేతుల మీదుగా ఇచ్చిన వరం. ఆశీర్వాదం సమయంలో మాట్లాడిన విధంగా పితృస్వామ్య మాటలు నమోదు చేయబడ్డాయి. ఆశీర్వాదం లిప్యంతరీకరించబడింది మరియు అభ్యర్థికి ఇవ్వబడుతుంది మరియు ఒకటి చర్చి ప్రధాన కార్యాలయంలోని పితృస్వామ్య ఆర్డర్ ఫైల్‌లలో ఉంచబడుతుంది. ఆశీర్వాదం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? పితృస్వామ్య ఆశీర్వాదం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈ పదంలోనే సూచించబడింది, దేవునికి మరియు అతని చర్చికి ప్రాతినిధ్యం వహించే ఆధ్యాత్మిక తండ్రి ద్వారా అధికారికమైన, పూజారి ఆశీర్వాదం అందించడం. ఆ ముఖ్య విధిని మరచిపోకూడదు. చిన్నపిల్లలు ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపు లేదా దాని అర్థాన్ని అర్థం చేసుకోకముందే ఆశీర్వాదం పొందుతారు. మరింత పరిణతి చెందిన వ్యక్తులు ఆశీర్వాదం పొందేందుకు స్వచ్ఛందంగా వస్తారు, ఆ స్ఫూర్తితో వారు మేధోపరంగా మరియు మానసికంగా ప్రవేశించవచ్చు. ఈ శాసనం, దేవుని చిత్తానికి నమ్మకమైన విధేయతతో పాటు, దైవిక ఆశీర్వాదాలు మరియు మార్గదర్శకత్వాన్ని తెస్తుంది మరియు జీవితానికి సహాయంగా ఉంటుంది. అవసరమైనప్పుడు ఓదార్పు లేదా ఉపదేశాన్ని అందించడం లేదా దైవిక జీవన విధానానికి సంబంధించి మంచి సలహా ఇవ్వడం, తిరిగి అంకితం చేయడం మరియు పవిత్రం చేయడం, పై నుండి ఒక ఆశీర్వాదం తీసుకురావడం, ఒకరికి సహాయం చేయడం వంటి ఇతర ముఖ్య విధులు ఇప్పుడు ప్రస్తావించబడిన ప్రాథమిక విధుల్లో ఉన్నాయి. తనను తాను కనుగొని, జీవితం మరియు దాని సమస్యలకు సర్దుబాటు చేయండి. ఇజ్రాయెల్ పిల్లలు చెరలోకి తీసుకోబడినప్పటి నుండి శతాబ్దాలలో, వారు చెల్లాచెదురుగా ఉన్నారు మరియు ఇజ్రాయెల్ యొక్క "కోల్పోయిన తెగలు" అని పిలుస్తారు. వాటిలో కొన్ని అనేక ఇతర దేశాలతో కలిసిపోయాయి మరియు వలసలు వారిని ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లాయి. అటువంటి వంశాన్ని సూచించే ఆ పితృస్వామ్య ఆశీర్వాదాలలో వారి వారసులకు ఆధ్యాత్మిక వారసత్వం ఉంది. కొందరు వంశం పేరు పెట్టడానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఉండవచ్చు; వారు ఎఫ్రాయిము లేదా మనష్షే లేదా బహుశా యూదా పిల్లలలో లెక్కించబడాలి. ఏది ఏమైనప్పటికీ, అతను ప్రతి సందర్భంలో వంశాన్ని సూచించాలా వద్దా అనేది పాట్రియార్క్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. ఇది చేయకపోతే అనవసరంగా ఆందోళన చెందకండి. ఇది ఆశీర్వాదం యొక్క ప్రధాన ఉద్దేశ్యం కాదు. భవిష్యత్తును ప్రవచించడం ఆశీర్వాదం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం కాదు, అయితే ప్రవచనం యొక్క ఆత్మ వివిధ స్థాయిలలో పని చేస్తుంది మరియు తరచుగా పని చేస్తుంది. ఆశీర్వాదం యొక్క ప్రాథమిక విలువ ఒకరి వ్యక్తిత్వం మరియు జీవితంలోని ప్రత్యేక పరిస్థితుల వెలుగులో భరోసా మరియు సలహా ఇవ్వడం. స్వీకరించడానికి ఏ ప్రిపరేషన్ చేయాలి a దీవెన? ఆశీర్వాదం పొందవలసిన వారు కొన్ని నిర్దిష్టమైన తయారీని చేసుకోవడం మంచిది. ఈ తయారీలో ప్రార్థన, ధ్యానం, స్వీయ-పరిశీలన, ఉపవాసం, లేఖనాలను చదవడం మరియు దానిపై ధ్యానం చేయాలి. ఆశీర్వాదం పొందే వ్యక్తికి ఆశీర్వాదం యొక్క ఉద్దేశ్యం మరియు ఏమి ఆశించవచ్చు అనే దాని గురించి కొంత స్పష్టమైన ఆలోచన ఉండాలి. మన అవసరాలకు ప్రభువు మనకు బాగా సరిపోయే విధంగా ప్రతిస్పందించేలా, ఈ సందర్భాన్ని చాలా చిత్తశుద్ధితో మరియు ఆత్మ యొక్క వినయంతో సంప్రదించడం చాలా ముఖ్యం. "మీ పితృస్వామ్య ఆశీర్వాదం" అనే కరపత్రం పఠనం ఆశీర్వాదం కోరుతున్న వారందరికీ సిఫార్సు చేయబడింది. దీనికి తోడు, ఆశీర్వాదం కోసం అభ్యర్థనను వీలైనంత త్వరగా పాట్రియార్క్‌కు తెలియజేయాలి, తద్వారా అన్ని పార్టీలు సిద్ధం చేస్తాయి. చాలా ముందుగానే పూర్తి చేయవచ్చు. పితృస్వామ్య ఆశీర్వాదాలకు ఏదైనా రుసుము ఉందా? ఆశీర్వాదం కోసం ఎప్పుడూ ఎటువంటి రుసుము విధించబడదు. అటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని ఏ విధంగానైనా కిరాయికి మార్చడం అత్యంత అనైతికం. ఇది పితృస్వామ్య మంత్రి యొక్క ఏకైక కార్యమా? ఈ మంత్రి గురించి, చర్చి యొక్క సిద్ధాంతం మరియు ఒప్పందాలు ఇలా పేర్కొన్నాయి, "పాట్రియార్క్ ఒక సువార్త పరిచారకుడు. ఈ కార్యాలయం యొక్క విధులు సువార్త పరిచారకుడిగా ఉండాలి; బోధించడం, బోధించడం, వివరించడం, ఉద్బోధించడం, పునరుజ్జీవనం చేయడం మరియు జ్ఞానం సూచించే విధంగా శాఖలు మరియు జిల్లాలను సందర్శించడం, ఆహ్వానం, అభ్యర్థన లేదా దేవుని ఆత్మ నిర్ణయిస్తుంది మరియు కోరుతుంది; సెయింట్స్‌ను ఓదార్చడం; చర్చికి తండ్రిగా ఉండటం; అలాంటి వారిని కోరుకునే వ్యక్తులకు సలహాలు మరియు సలహాలు ఇవ్వడం; ఆధ్యాత్మిక ఆశీర్వాదం కోసం చేతులు వేయడం, మరియు అలా నడిపించినట్లయితే, ఆశీర్వదించబడిన వ్యక్తి యొక్క వంశాన్ని సూచించడానికి." సిద్ధాంతం మరియు ఒడంబడికలు 125:3 పితృస్వామ్య మంత్రిత్వ శాఖ చేతిలో లభించే అనేక అధికారాలలో ఆశీర్వాదాల ప్రదానం ఒకటి అని ఈ ఉల్లేఖనం నుండి చూడవచ్చు. పితృస్వామ్యుడు చర్చి యొక్క వ్యవస్థీకృత విభాగాలను నిర్వహించే సమస్యల నుండి విముక్తి పొందిన మంత్రి, మరియు ఈ వ్యక్తిగత మరియు సహాయకరమైన పరిచర్యకు స్వేచ్ఛగా ఉంటాడు. వ్యక్తిగత సాధువు సమస్యలలో ఎవరైనా ఈ మంత్రిని సలహా కోరవచ్చు, అయితే సాధువుల మధ్య వ్యక్తిగతంగా లేదా అధికారికంగా ఉన్న ఇబ్బందుల పరిష్కారానికి ఆయన అందుబాటులో ఉండరు. ప్రతి సభ్యుని విధి ఇది తెలుసుకోవడం మరియు లేఖనాల నిబంధన ప్రకారం పరిచర్య కోసం అతనిని సంప్రదించడం. పిల్లల ఆశీర్వాదం పిల్లల ఆశీర్వాదం కోసం స్క్రిప్చరల్ బేస్ యేసు జనసమూహానికి బోధిస్తున్నప్పుడు, ఆయనను చుట్టుముట్టిన కొంతమంది తమ పిల్లలను ఆయన తాకడానికి ముందుకు తీసుకొచ్చారు. శిష్యులు వారిని మందలించారు మరియు వారిని పంపించివేయాలని అనుకున్నారు, కానీ గురువు ఇలా అన్నాడు: "... చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి మరియు వారిని నిషేధించకండి, ఎందుకంటే పరలోక రాజ్యం అలాంటి వారిది." (మత్తయి 19:14) ఈ ప్రకటన నుండి మనం చిన్నపిల్లలు దేవుని దృష్టిలో పవిత్రులని తీర్మానించాము. బుక్ ఆఫ్ మార్మన్ పిల్లల అమాయకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. పిల్లలు తమ ఎంపికలను బాధ్యతాయుతంగా చేసే వయస్సు వచ్చే వరకు దేవుని ముందు స్వచ్ఛంగా ఉంటారనే సత్యాన్ని చాలా అందంగా వివరించడం కోసం మొరోని, 8వ అధ్యాయం చదవండి. దీని కారణంగా, క్రీస్తు బోధనల యొక్క నిజమైన అవగాహన, జవాబుదారీ వయస్సు (8 సంవత్సరాలు) చేరుకోని వారికి బాప్టిజం యొక్క శాసనం యొక్క నిర్వహణను అనుమతించదు. చర్చిగా మనం యేసు యొక్క ఉదాహరణను అనుసరిస్తాము "వారిపై చేతులు వేశాడు." (మత్తయి 19:15) "మరియు అతను వాటిని తన చేతుల్లోకి తీసుకున్నాడు మరియు వారిపై తన చేతులు ఉంచి, వారిని ఆశీర్వదించాడు." (మార్కు 10:14) పిల్లలను ఆశీర్వదించడం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఇది చిన్న పిల్లవాడిని దేవునికి అంకితం చేసే స్వభావం. ఒక చిన్న పిల్లవాడిని పరిపక్వతకు తీసుకురావడానికి మరియు ఆ పనిలో సహజంగా దైవిక సహాయాన్ని కోరుకోవడంలో వారు తీసుకున్న గురుతర బాధ్యతను తల్లిదండ్రులు గుర్తించాలి. వారు యువ జీవితంపై దేవుని ఆశీర్వాదం కూడా కోరుకుంటారు. పిల్లల ఆశీర్వాదం ఎక్కడ నిర్వహిస్తారు? "క్రీస్తు చర్చిలోని ప్రతి సభ్యుడు పిల్లలను కలిగి ఉంటే, వారిని చర్చి ముందు ఉన్న పెద్దల వద్దకు తీసుకురావాలి, వారు యేసుక్రీస్తు నామంలో వారిపై చేతులు ఉంచాలి మరియు అతని పేరులో వారిని ఆశీర్వదించాలి." (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 17:19) ఇది చాలా కావాల్సిన స్థలం సమాజం ముందు అని స్పష్టంగా ఉంది. ఇది పిల్లల తల్లిదండ్రులు మరియు వేడుకను చూసే వారి ద్వారా పితృ బాధ్యతను తీవ్రంగా ఆలోచించే అవకాశాన్ని అందిస్తుంది. ఇది దేవుని రాజ్యానికి అవసరమైన స్వచ్ఛత యొక్క ఆదర్శాలను కూడా సమాజం ముందు తీసుకువస్తుంది. చర్చి సమావేశానికి ముందు పిల్లవాడిని తీసుకురావడం అసాధ్యం అయితే, పెద్దలు ఆశీర్వాదం కోసం చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందించడంలో విఫలం కాదు. ఏదేమైనా, ఈ శాసనం యొక్క శక్తి కేవలం అధికారిక శాసనంలో కాదు, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభువు ముందు సమర్పించినప్పుడు వారికి వచ్చే పనిని అర్థం చేసుకోవడం మరియు అంకితం చేయడంలో ఉంది. ఈ ఆచారం మరియు బాప్టిజం మధ్య సంబంధం ఉందా? సారూప్యత లేదు. సత్యం నుండి వైదొలగడం వలన బాప్టిజం కోసం "క్రైస్టెనింగ్" చివరికి భర్తీ చేయబడింది. కానీ ఆశీర్వాదానికి "నామకరణం" లేదా బాప్టిజంతో సంబంధం లేదు. పెద్దలు సాంప్రదాయకంగా పిల్లల పేరును ప్రస్తావించినప్పటికీ, ఇది పిల్లల పేరు పెట్టడం కూడా కాదు. బాప్టిజం లేదా దానికి ఏదైనా ప్రత్యామ్నాయం సరికాదు ఎందుకంటే దీనికి స్వేచ్ఛా ఎంపిక చేసుకునే సామర్థ్యం అవసరం. ఒక చిన్న పిల్లవాడు జవాబుదారీ వయస్సును చేరుకోనందున ఎంపిక చేయలేరు. ఆశీర్వాదం కోసం పిల్లవాడిని సమర్పించినప్పుడు వాస్తవానికి ఏమి జరుగుతుంది? సేవలో తగిన సమయంలో, తల్లిదండ్రులు పిల్లలను పెద్దల వద్దకు తీసుకువస్తారు. పిల్లవాడు చిన్నవాడైతే, పెద్దలలో ఒకరు పిల్లవాడిని తన చేతుల్లోకి తీసుకుంటారు, మరొకరు (ఇద్దరు ఉంటే) కూడా పిల్లలపై చేతులు ఉంచుతారు. రెండవ పెద్దవాడు అంకితభావంతో కూడిన ప్రార్థనను అందజేస్తాడు, జీవితం ద్వారా రక్షణ కోసం మరియు శరీరం, మనస్సు మరియు ఆత్మలో అభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తల్లిదండ్రులలో జ్ఞానం కోసం ప్రార్థిస్తాడు మరియు పిల్లవాడిని అతని వాచ్ సంరక్షణ కోసం దేవునికి సమర్పించాడు. ఎనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బిడ్డను ఆశీర్వదించాలా? పిల్లవాడికి ఎనిమిదేళ్ల వయస్సు వచ్చినప్పుడు అతను చర్చిలో పూర్తి సభ్యత్వానికి అర్హులుగా పరిగణించబడాలని, అందువల్ల ఆశీర్వాదం కోసం అంగీకరించకూడదని చర్చి పెద్దలకు ఆదేశాలు ఇచ్చింది. తల్లిదండ్రులు మరియు చర్చి అధికారులు బాప్టిజం నీటిలో యేసును అనుసరించడానికి బాధ్యతాయుతమైన ఎంపిక చేయడంలో అవసరమైన వాటిని పిల్లలకు నేర్పించడం తమ బాధ్యతగా పరిగణించాలి. పెద్దవారి ఆశీర్వాదం కారణంగా పిల్లవాడు చర్చిలో సభ్యుడు కాదు. పూర్తి సభ్యత్వానికి బాప్టిజం మరియు నిర్ధారణ అవసరం. ప్రమాదంలో ఉన్న పిల్లల మోక్షం ఆశీర్వాదానికి ముందు మరణం సంభవించాలా? ప్రతి బిడ్డను ఆశీర్వాదం కోసం సమర్పించడం చాలా సరైన మరియు కావాల్సిన ప్రక్రియగా మేము భావిస్తున్నప్పటికీ, ఇది మోక్షానికి సంబంధించిన శాసనం అని ధృవీకరించడం లేఖన విరుద్ధం. అలాంటి భయం అనేది క్రీస్తు యొక్క నిజమైన సిద్ధాంతం నుండి తప్పుకున్న వారిచే తప్పుగా బోధించబడిన మూఢనమ్మకాల యొక్క అవశేషం. తల్లిదండ్రులు ఆశీర్వాదం పొందే ముందు బిడ్డను కోల్పోయేంత దురదృష్టవంతులైతే, వారు మాస్టర్ మాటల సౌలభ్యంతో విశ్రాంతి తీసుకోవచ్చు, "... పరలోక రాజ్యం అలాంటి వారిది." (మత్తయి 19:14) తల్లిదండ్రులు చర్చిలో సభ్యులుగా ఉండటం అవసరమా? సభ్యత్వంతో సంబంధం లేకుండా ఈ మంత్రిత్వ శాఖ అందరికీ అందుబాటులో ఉంటుంది. అయితే, పిల్లల తల్లిదండ్రులు చట్టం యొక్క నిజమైన స్వరూపాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇంకా, ఇది తరచుగా క్రీస్తు మరియు అతని చర్చి యొక్క బోధనలను స్నేహితుల ముందు తీసుకురావడానికి ఒక అవకాశం.* తల్లిదండ్రులకు ఆశీర్వాదం యొక్క సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది మరియు ఆశీర్వాదం యొక్క రికార్డు సూచన కోసం జనరల్ చర్చి ప్రధాన కార్యాలయంలో ఉంచబడుతుంది. *అయితే, తల్లిదండ్రులు అవివాహితులైన సందర్భాల్లో, ఈ మతకర్మ యొక్క పవిత్రత రాజీపడకుండా ఉండటం చాలా ముఖ్యం. చర్చి ఆమోదించని ప్రత్యామ్నాయ జీవనశైలి యొక్క పెరుగుతున్న అభ్యాసాన్ని అంగీకరించకుండా ఉండటానికి జాగ్రత్తగా పరిశీలించాలి. అనుమానం ఉన్నట్లయితే, తగని ఏర్పాట్లలో పాల్గొనే ముందు న్యాయవాది కోసం మొదటి ప్రెసిడెన్సీ కార్యాలయాన్ని సంప్రదించండి. అధ్యాయం 11 దేవుని ఆర్థిక ప్రణాళిక అతని ఆస్తుల పట్ల చర్చి సభ్యుని బాధ్యత ఏమిటి? ప్రతి సభ్యుని బాధ్యత తన సంరక్షణలో ఇవ్వబడిన ప్రతిదానికీ తనను తాను ఒక నిర్వాహకుడిగా భావించడం. చర్చిలోని ప్రతి సభ్యుడు ప్రపంచంలో జియోనిక్ ఆదర్శాన్ని స్థాపించడానికి ప్రతి ప్రతిభను ఉపయోగించాల్సిన బాధ్యత ఉంది. ఈ స్టీవార్డ్‌షిప్‌లో మానసిక మరియు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు, అలాగే భౌతిక విలువలు ఉంటాయి. ప్రపంచాన్ని పునరుత్పత్తి చేసే పెద్ద పనికి అతని సామర్థ్యాలన్నింటినీ అందుబాటులోకి తెచ్చేటప్పుడు, రాజ్యం యొక్క భౌతిక అంశాలకు వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. అందువల్ల మనం మన తాత్కాలిక స్టీవార్డ్‌షిప్‌లను నిర్వహించేందుకు ఒక నిర్దిష్ట చట్టం ఇవ్వబడింది. D&C 101: 2c-d చర్చి యొక్క ఆర్థిక చట్టం ఏమిటి? ఇది చర్చి యొక్క ఆదాయాన్ని పొందే విధానం, దానిని ఉపయోగించే ప్రయోజనం మరియు ఖర్చులు చేసే మార్గాలను నియంత్రించే దేవుని చట్టం. ఆర్థిక చట్టం, అలాగే దేవుని ప్రతి ఇతర చట్టం, న్యాయం, ఈక్విటీ మరియు ధర్మంపై స్థాపించబడింది. ఆర్థిక చట్టానికి విధేయత, కార్యనిర్వాహకుల జీవితాన్ని ఖగోళ సూత్రాలకు అనుగుణంగా ఉంచుతుంది. ఈ ఖగోళ సూత్రాలు జియోను పునాది. ఫైనాన్స్‌కి సంబంధించిన చట్టం యొక్క వివరణ కోసం ఎవరికి వెతకాలి? చర్చి యొక్క ప్రవక్తల ద్వారా వెల్లడైన విషయాలు వారి పరస్పర అధ్యయనం మరియు దేవుని వాక్యంలో పరిశోధన ఫలితంగా ఆర్థిక చట్టం యొక్క చర్చి వివరణను తీసుకురావడం బిషప్‌రిక్ యొక్క విధి. (సిద్ధాంతము మరియు ఒడంబడికలు 129:8 చూడండి.) ఈ వివరణలు జనరల్ కాన్ఫరెన్స్ ఆమోదం పొందేందుకు వారు దీనిని చేసారు మరియు కొనసాగిస్తారు. ఆర్థిక చట్టం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ప్రయోజనం అనేకం. మొదటి మరియు ప్రాథమిక ప్రయోజనం పాత్రను నిర్మించడం. ఈ చట్టం యొక్క సూత్రాలకు నమ్మకంగా కట్టుబడి ఉండటం స్వార్థానికి తక్కువ స్థలాన్ని వదిలివేస్తుంది. ఆర్థిక చట్టానికి విధేయత చూపడం అనేది మన రోజువారీ జీవితంలో క్రీస్తు యొక్క స్వచ్ఛమైన ప్రేమ యొక్క వ్యక్తీకరణగా ఉత్తమంగా కనిపిస్తుంది. ఇది ఒకరి వ్యక్తిగత మరియు కుటుంబ ఆర్థిక నిర్వహణలో సామర్థ్యం మరియు నైపుణ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది, తద్వారా సాధారణంగా మానసిక క్షోభ మరియు ఆర్థిక అభద్రతకు దారితీసే తప్పుడు నిర్వహణ యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు. (మిగులు) సభ్యులను ఉన్నతమైన (ఖగోళ) జీవన మరియు ఆలోచనా స్థాయికి మరియు క్రీస్తుతో సన్నిహిత సంబంధానికి తీసుకురావడానికి ఇది స్థాపించబడింది, ఎందుకంటే దాని అవసరాలను నెరవేర్చడానికి ఒకరు అతనితో మరియు అతని దైవిక ఉద్దేశ్యానికి అనుగుణంగా పని చేయాలి. (దశవ భాగం) వార్షిక పెరుగుదలను సరిగ్గా నిర్ణయించడానికి మరియు ఒకరి ఆర్థిక లాభాలలో తన వాటాగా భగవంతునికి చెల్లించాల్సిన మొత్తాన్ని తెలుసుకోవడానికి ఒక ఆధారాన్ని అందించడం. ఇది చర్చి యొక్క పని నిర్వహణ మరియు జియోను నిర్మాణానికి సంబంధించిన ఖర్చులను చెల్లించడానికి నిధులను పొందే దైవిక మార్గం. దశమభాగాలు మరియు విరాళాలు ఎవరికి చెల్లించాలో ఇది నిర్దేశిస్తుంది. నిధులను ఖర్చు చేయాల్సిన ప్రయోజనాలను t పేర్కొంది. స్టీవార్డ్‌షిప్ చట్టంతో పూర్తి సమ్మతిని కలిగి ఉండే దశలు ఏమిటి? చర్చిలోని ప్రతి సభ్యుని కర్తవ్యాన్ని పూర్తిగా గుర్తించడానికి బిషప్‌ల క్రమం క్రింది వాటిని పేర్కొంది: అతని ముడుపుల ఫారమ్‌లను దాఖలు చేయడం అతని మిగులు రెండరింగ్. ఆ తర్వాత దేవుని చట్టం (వార్షిక అకౌంటింగ్)లో అందించిన విధంగా ఏటా అతని సారథ్యం గురించి వివరిస్తుంది. తన దశమభాగాలు రెండరింగ్ తన సమర్పణలు చేయడం నా ముడుపును సిద్ధం చేయడానికి నేను ఎలా కొనసాగాలి? ఈ అకౌంటింగ్‌లో సభ్యులకు సహాయం చేయడానికి బిషప్రిక్ ద్వారా ఒక ఫారమ్ సంకలనం చేయబడింది. ఈ ఫారమ్ ఒకరి మొత్తం ఆస్తులను జాబితా చేయడానికి మరియు ఒకరి బాధ్యతలకు వ్యతిరేకంగా సమతుల్యం చేయడానికి సదుపాయాన్ని కల్పిస్తుంది మరియు తద్వారా నికర విలువ నిర్ణయించబడుతుంది. ఈ ఫారమ్ జియాన్‌లో స్టీవార్డ్ వార్షిక బడ్జెట్, వారసత్వ అవసరాలు మరియు స్టీవార్డ్‌షిప్‌ను నిర్ణయించడంలో సహాయపడుతుంది. ఈ ప్రకటనను తయారు చేయడంలో సభ్యులకు సహాయం చేయడం బిషప్ యొక్క ప్రత్యేక పని. అలాంటి అధికారులు అలా ఆహ్వానించినప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్థిక మిగులు ఎలా లెక్కించబడుతుంది? మీ సమర్పణను దాఖలు చేసేటప్పుడు, మీ అవసరాలు మరియు కోరికలను నిర్ణయించిన తర్వాత మిగిలి ఉన్న మీ నికర విలువలో ఆ భాగం నుండి మిగులు నిర్ణయించబడుతుంది. మిగులును నిర్ణయించడానికి ఉపయోగించే ఫార్ములా లేదు, బిషప్‌తో సంప్రదించి స్టీవార్డ్ సరైన మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఒక వ్యక్తి తన సన్యాసాన్ని ఎంత తరచుగా సిద్ధం చేసుకోవాలి? ఆర్థిక చట్టం యొక్క ఆవశ్యక స్వభావాన్ని గుర్తిస్తూ, సారథ్యం యొక్క సూత్రాన్ని గుర్తిస్తూ ఒక ముడుపును ఒకసారి దాఖలు చేయాలి. ఆ తర్వాత వార్షిక అకౌంటింగ్ చేయాలి, సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివరిలో చెల్లించాల్సిన దశాంశాన్ని మరియు ఏదైనా అదనపు విరాళాలను నిర్ణయించడానికి. దశాంశం ఎలా లెక్కించబడుతుంది దశమ భాగం పెరుగుదలపై మాత్రమే లెక్కించబడుతుంది. ఒకరు వార్షిక అకౌంటింగ్ చేసినప్పుడు, సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఆదాయం నుండి అవసరమైన జీవనంపై ఖర్చు చేయవలసిన మొత్తాన్ని తీసివేయడం ద్వారా పెరుగుదల లెక్కించబడుతుంది. మిగిలిన దానిలో, పెరుగుదల, పదవ వంతు భగవంతునికి దశాంశంగా చెల్లించాలి. దశమభాగాలు ఎప్పుడు చెల్లించాలి? ఈ చెల్లింపులు సాపేక్షంగా తక్కువ మొత్తంలో చేసినప్పటికీ నగదు అందుబాటులో ఉన్నప్పుడే దశమభాగాలు క్రమం తప్పకుండా చెల్లించాలి. ఇందుకు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనిషి ప్రయత్నానికి మొదటి ఫలం భగవంతుడికే చెందుతుంది. బాధ్యతలు తగ్గినప్పుడు, దేవుని ఆశీర్వాదం ఒకరి స్టీవార్డ్‌షిప్‌పై ఆశించబడవచ్చు. చెల్లింపును ఆలస్యం చేయడం నిజంగా దేవునికి సంబంధించినది ఖర్చు చేయడానికి మార్గం తెరుస్తుంది. ఒకరి సారథ్యానికి సంబంధించి జాగ్రత్తగా మరియు క్రమబద్ధమైన అకౌంటింగ్ ప్రాథమికమైనది మరియు అందరికీ అవసరం. చిన్న కాలానుగుణ చెల్లింపులు వార్షిక అకౌంటింగ్ చేయడానికి సభ్యులకు వారి బాధ్యత నుండి ఉపశమనం కలిగించవు. సాధారణ చెల్లింపులు ఒకరి బాధ్యత యొక్క ప్రధాన భాగాన్ని చెల్లించాల్సి వచ్చినప్పుడు నెరవేరేలా చూస్తాయి. చర్చి తన పనిని కొనసాగించడానికి క్రమం తప్పకుండా ఆర్థిక సహాయం అవసరం మరియు దాని బాధ్యతలను చెల్లించడం ప్రారంభించే ముందు దశమభాగాలు ఒక సంవత్సరం చేరడం కోసం వేచి ఉండకూడదు. ప్రతిష్ఠాపన మరియు దశమభాగాల చెల్లింపు తప్పనిసరి కాదా? చర్చి యొక్క ప్రతి ఇతర చట్టంతో ఉమ్మడిగా, సమ్మతి అనేది వ్యక్తిగత విధేయతకు సంబంధించిన విషయం. ఏది ఏమైనప్పటికీ, జవాబుదారీ సూత్రానికి విధేయత అనేది దేవుని పట్ల ఒకరి బాధ్యతలను అంచనా వేయడంలో మరియు ఒకరి తాత్కాలిక వ్యవహారాలను విశ్లేషించడంలో సహాయం చేస్తుంది. బాప్టిజం ఒడంబడికను దాని నిజమైన అర్థంలో పాటించాలంటే, ఈ విధిని తప్పించుకోలేరు. చర్చి లేదా అధికారిక సభ్యులు ఎవరైనా ఈ చట్టం నుండి మినహాయింపు పొందారా? స్టీవార్డ్‌షిప్ చట్టానికి విధేయత నుండి ఎవ్వరూ మినహాయించబడరు మరియు ప్రతి ఒక్కరూ తన స్టీవార్డ్‌షిప్ గురించి దేవునికి లెక్కలు చెప్పాలి. మిగులు మరియు దశాంశం ఏ ప్రయోజనాల కోసం ఉపయోగించబడతాయి? మిగులు స్టోర్హౌస్ నిర్మాణం కోసం సీయోను పునాది వేయడం వారసత్వాలను మంజూరు చేయడం ప్రీస్ట్‌హుడ్ మరియు ప్రెసిడెన్సీ యొక్క అప్పుల కోసం భూముల కొనుగోలు స్టీవార్డ్‌షిప్‌ల అభివృద్ధి (వ్యాపారం, పారిశ్రామిక మరియు వ్యవసాయం) పేదలు మరియు పేదల సంరక్షణ కోసం ప్రార్థనా గృహాల నిర్మాణం కొత్త జెరూసలేం నిర్మాణం దశమభాగము మిషనరీలు మరియు చర్చి యొక్క సాధారణ పనిలో నిమగ్నమైన వారి మద్దతు వంటి ఖర్చులను కలిగి ఉండే లార్డ్స్ పనికి ఆర్థిక సహాయం చేయడానికి ఇది ప్రధానంగా ఉపయోగించబడుతుంది. ఇది జనరల్ చర్చి కార్యాలయాల నిర్వహణలో ఉపయోగించబడుతుంది. చర్చి యొక్క నిర్వహణలో అయ్యే పరిపాలనా ఖర్చులను అందించడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఇది చర్చి యొక్క విద్యా కార్యక్రమం యొక్క మద్దతు కోసం ఉపయోగించబడుతుంది. మిగులు లేదా దశమ భాగం చెల్లింపు ఎవరికైనా కష్టాన్ని కలిగిస్తుందా? మిగులును చెల్లించడం ఎవరికైనా కష్టాన్ని సృష్టించదు. పెంపులో పదో వంతు చెల్లింపు కూడా ఎవరికీ కష్టాలు తీరడం లేదు. ఎక్కువ పెరుగుదల ఉన్నవారు దామాషా ప్రకారం పెద్ద చెల్లింపును భరించగలరు, అయితే తక్కువ వృద్ధి సాధించిన వారు తక్కువ చెల్లించవలసి ఉంటుంది. అయితే, బకాయి ఉన్నప్పుడు చెల్లించడంలో నిర్లక్ష్యం చేసేవారు అప్పులు పేరుకుపోవడంతో తదుపరి సమస్యను కనుగొంటారు. మొదటి బకాయి ఉన్నప్పుడు బాధ్యతలను నెరవేర్చడంలో వైఫల్యం కారణంగా పేరుకుపోయిన రుణాన్ని నిజమైన స్టీవార్డ్ తిరస్కరించడు. మిగులు లేదా దశాంశం చెల్లించడానికి చాలా తక్కువగా ఉన్న వ్యక్తులు కొందరు లేరా? ఇది సాధ్యమే, కానీ అరుదుగా "అవసరమైన జీవన వ్యయాలు" యొక్క నిర్వచనానికి మించి కొంత మొత్తాన్ని నిర్వహించని స్టీవార్డ్ ఉంటాడు మరియు తద్వారా పెరుగుదలగా పరిగణించబడుతుంది. భగవంతుడు మనకు ఇచ్చినదానిపై అధిపతిగా మిగులును సృష్టించడం కూడా ఖగోళ సూత్రం. మిగులును సృష్టించే దిశగా మనమందరం కృషి చేయాలి. సమర్పణలలో నియమం "ఉచితంగా మీరు స్వీకరించారు, ఉచితంగా ఇవ్వండి." శేషాచల చర్చి ఆఫ్ జీసస్ క్రైస్ట్ మిగులు విరాళాలు లేదా ధనవంతుల విరాళాల ద్వారా మాత్రమే మద్దతు ఇవ్వబడదు, కానీ ర్యాంక్ మరియు ఫైల్ సభ్యులను పవిత్రంగా ఇవ్వడం ద్వారా మద్దతు ఇస్తుంది. దశమ వంతు చెల్లించడమంటే ఋణం తీర్చుకోవడమే. చర్చికి ఉదారంగా మరియు ఉదారంగా సమర్పణలు ఇవ్వడం అనేది మన నిజమైన స్వభావం మరియు విలువ, దేవుని పట్ల మనకున్న ప్రేమ మరియు కృతజ్ఞత యొక్క వ్యక్తీకరణ. దశమ భాగం, పెరుగుదల, మిగులు మరియు సమర్పణలు అంటే ఏమిటి? TITHE అంటే పదవ వంతు. ఒకరి పెరుగుదలలో దశమ భాగం అంటే ఒకరి పెరుగుదలలో పదవ వంతు. ప్రతి తదుపరి వార్షిక అకౌంటింగ్‌కు సంబంధించి పెరుగుదల అనేది సంవత్సరానికి అన్ని మూలాల నుండి వచ్చే మొత్తం ఆదాయం మధ్య వ్యత్యాసం, సాధారణ ఆరోగ్యవంతమైన జీవితానికి ఒక స్టీవార్డ్‌గా ఒకరు అవసరమని నిర్ణయించిన దానికంటే తక్కువ. ఈ పెరుగుదలలో పదవ వంతు దశాంశం. SURPLUS అనేది ఒకరి నికర విలువలో భాగం, డబ్బు లేదా ఆస్తి అయినా, ఒకరి అవసరాలు మరియు అవసరాలకు మించి. "అవసరాలు మరియు కేవలం కావాలి" అనే పదం వ్యక్తి యొక్క స్థానం, చర్య యొక్క రంగం, అతని వ్యాపారం మరియు అతనిపై ఆధారపడిన వ్యక్తుల ద్వారా నిర్ణయించబడుతుంది. అటువంటి చెల్లింపులు జియోను నిర్మాణంలో ఉపయోగించబడతాయి. సమర్పణలు అంటే దశమ భాగం మరియు మిగులు లెక్కించబడిన తర్వాత మిగిలి ఉన్న వాటి నుండి ఉచితంగా ఇవ్వబడిన డబ్బు; అంటే తొమ్మిది పదుల నుండి. ఒకరికి అవసరమైన జీవన వ్యయాలుగా పరిగణించబడే వాటి నుండి త్యాగం యొక్క స్ఫూర్తితో కూడా వాటిని ఇవ్వవచ్చు. సంవత్సరంలో చర్చికి అర్పణలు చేయడానికి తరచుగా అవకాశాలు ఉన్నాయి. మిగులు మరియు దశాంశం ఎవరికి చెల్లించబడుతుంది? కస్టడీ కోసం బిషప్ కార్యాలయానికి క్రమం తప్పకుండా అటువంటి డబ్బును బదిలీ చేసే బిషప్ యొక్క స్థానిక ఏజెంట్‌కు దశమ భాగం చెల్లించాలి. దశమభాగాలుగా డబ్బును స్వీకరించిన ప్రతి అధికారి అది స్వీకరించబడిన మొత్తం మరియు ఉద్దేశ్యాన్ని తెలుపుతూ అధికారిక రశీదును జారీ చేస్తారు. ఒకరి సభ్యత్వం యొక్క సంవత్సరాలలో చెల్లించిన అన్ని మిగులు మరియు దశాంశాల రికార్డులు ఉంచబడతాయి. అబ్లేషన్ అంటే ఏమిటి? నైవేద్యం అనేది ప్రభువు రాత్రిపూట సేవ యొక్క మతకర్మ వద్ద స్వీకరించబడిన ప్రత్యేక సమర్పణ. ఈ అబ్లేషన్ల నుండి చర్చి అంతటా పేదలకు సహాయం అందించబడుతుంది. అటువంటి అవసరాలను తీర్చడానికి చర్చి యొక్క సామర్థ్యానికి అనుగుణంగా ఇది జరుగుతుంది. ఇది ఒక సాధారణ చర్చి సమర్పణ మరియు స్థాపించబడిన విధానం ప్రకారం బిషప్రిక్ ద్వారా నిర్వహించబడుతుంది మరియు చెదరగొట్టబడుతుంది. స్థానిక ఖర్చులు ఎలా తీర్చబడతాయి? ప్రతి శాఖలో నిర్ణయించిన పద్ధతుల ద్వారా స్థానిక ఖజానాకు సమర్పించిన సమర్పణల నుండి సంఘాల అవసరాలు తీర్చబడతాయి. ఈ సమర్పణలు సాధారణ చర్చి అవసరాల కోసం బిషప్‌కు చేసిన వాటికి భిన్నంగా ఉంటాయి. స్థానిక శాఖలు స్థానిక ఖర్చుల కోసం సాధారణ నిధుల నుండి తీసుకోవు; అందువల్ల, ప్రతి సభ్యుడు ఈ అవసరాలను గుర్తుంచుకోవడం మరియు స్థానిక అవసరాలను తీర్చడానికి క్రమం తప్పకుండా సహకారం అందించడం అవసరం. ఆర్థిక చట్టం యొక్క అవసరాలను నెరవేర్చాలని కోరుకునే సభ్యునికి ఏ అకౌంటింగ్ సహాయం అందించబడుతుంది? వయోజన మరియు యువ సభ్యుల ఆదాయం మరియు వ్యయాలను జాగ్రత్తగా మరియు సరళంగా లెక్కించడానికి చర్చి ఆదాయ మరియు వ్యయ రికార్డు పుస్తకాలను సిద్ధం చేసింది. అడల్ట్ స్టీవార్డ్‌షిప్ రికార్డ్ ప్రత్యేకంగా ఇంటిని ఏర్పాటు చేసుకున్న వారి కోసం సంకలనం చేయబడింది. కుటుంబ బడ్జెట్ కేవలం నిర్వహించబడుతుంది మరియు వార్షిక అకౌంటింగ్ సమయంలో అవసరమైన మొత్తం సమాచారం తక్షణమే అందుబాటులో ఉంటుంది. ప్రతి ఇల్లు మరియు వ్యక్తిగత సభ్యులు ఈ సహాయాన్ని ఉపయోగించాలి. యూత్ స్టీవార్డ్‌షిప్ రికార్డ్ యువతకు ప్రత్యేక సహాయంగా అందించబడుతుంది. ఇది ప్రత్యేకంగా చర్చిలోని పెళ్లికాని యువకుల కోసం ఉద్దేశించబడింది, వారు తమ ఆర్థిక నిర్వహణను వ్యాపారపరంగా చూసుకోవాలి. ఇది దశమభాగాలను క్రమం తప్పకుండా మరియు స్థిరంగా చెల్లించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది, ఇది ప్రభువుకు చెందిన పెరుగుదల వాటా. తమ ఇళ్లను ఏర్పాటు చేసుకున్న యువకులు సాధారణ అడల్ట్ స్టీవార్డ్‌షిప్ రికార్డ్ పుస్తకాన్ని ఉపయోగించాలి. అధ్యాయం 12 నమ్మకం యొక్క సంక్షిప్త ప్రకటన శేషాచలం చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ చేత ఆమోదించబడిన అధికారిక మతం ఏదీ లేదు. చర్చి యొక్క మతం "అన్ని సత్యం" అని బాగా చెప్పబడింది. అన్ని సత్యాలకు దారితీసే ఫండమెంటల్స్ హోలీ స్క్రిప్చర్స్, బుక్ ఆఫ్ మార్మన్ మరియు డాక్ట్రిన్ మరియు ఒడంబడికలలో ప్రేరేపిత వెర్షన్‌లో పేర్కొనబడిందని మేము నమ్ముతున్నాము. అయితే, కొన్ని ప్రాథమిక సత్యాలు వాటి స్వభావం కారణంగా ధైర్యంగా నిలిచిపోయాయి మరియు స్థాపక అధ్యక్షుడు జోసెఫ్ స్మిత్, జూనియర్ ద్వారా తయారు చేయబడిన ఒక ప్రకటన లేదా విశ్వాసం యొక్క ఎపిటోమ్‌లో సేకరించబడ్డాయి. ఈ ప్రాథమిక జాబితా అధ్యయనం మరియు అవగాహనకు అర్హమైనది. వాస్తవానికి, ఒక సభ్యుడు ఇప్పుడే ప్రస్తావించబడిన లేఖనాలలో మరియు ప్రాతినిధ్య చర్చి రచయితల ప్రామాణిక సాహిత్య రచనలలో శ్రద్ధగా శోధించినప్పుడు మాత్రమే అది వస్తుంది. మేము నమ్ముతున్నాము దేవునిలో శాశ్వతమైన తండ్రి, స్వర్గం మరియు భూమి యొక్క సృష్టికర్త. యేసుక్రీస్తు యొక్క దైవిక పుత్రత్వంలో, అతని సువార్తను పాటించే మనుషులందరి రక్షకుడు; పరిశుద్ధాత్మలో, మానవులందరినీ సత్యం వైపు నడిపించడం దీని పని. మోక్షానికి దేవుని శక్తి అయిన యేసుక్రీస్తు సువార్తలో. సువార్త యొక్క ఆరు ప్రాథమిక సిద్ధాంత సూత్రాలలో: విశ్వాసం; పశ్చాత్తాపం; నీటిలో ముంచడం ద్వారా బాప్టిజం; పవిత్ర ఆత్మ యొక్క బాప్టిజం; జబ్బుపడిన వారి స్వస్థత కోసం చేతులు వేయడం, పరిశుద్ధాత్మను ప్రదానం చేయడం, ఆర్డినేషన్, పిల్లల ఆశీర్వాదం మరియు ఇతర ప్రత్యేక ఆశీర్వాదాలు; చనిపోయినవారి పునరుత్థానం మరియు శాశ్వతమైన తీర్పు. దేవుని న్యాయంలో, వారి వృత్తిని బట్టి మాత్రమే కాకుండా, మనుషులందరికీ వారి వారి పనుల ప్రకారం ప్రతిఫలమివ్వడం లేదా శిక్షించడం. ఆదిమ చర్చిలో ఉన్న అదే రకమైన సంస్థలో: అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, పాస్టర్లు, ఉపాధ్యాయులు, పెద్దలు, బిషప్‌లు, డెబ్బైలు మొదలైనవి. బైబిల్‌లో ఉన్న దేవుని వాక్యంలో, సరిగ్గా అనువదించబడినంతవరకు. బుక్ ఆఫ్ మోర్మన్‌లో ఉన్న దేవుని వాక్యంలో, పాత ప్రపంచంలో వలె కొత్త ప్రపంచంలో మనుషులతో దైవిక వ్యవహారాల రికార్డుగా ఉంది. దేవుని వాక్యంలో నేడు వెల్లడి చేయబడింది మరియు చర్చి యొక్క సిద్ధాంతం మరియు ఒడంబడికలలో నమోదు చేయబడింది. దేవుని సుముఖత మరియు సామర్థ్యంలో, మానవులకు తన సంకల్పం యొక్క ప్రత్యక్షతను సమయం చివరి వరకు కొనసాగించడానికి. సువార్త యొక్క శక్తులు మరియు బహుమతులలో: విశ్వాసం, ఆత్మల వివేచన, ప్రవచనం, ప్రత్యక్షత, స్వస్థత, దర్శనాలు, భాషలు మరియు వాటి వివరణ, జ్ఞానం, దాతృత్వం, నిగ్రహం, సోదర ప్రేమ మొదలైనవి. వివాహంలో, మరణం సంభవించినప్పుడు మినహా, పురుషుడు లేదా స్త్రీ వివాహంలో ఒకరి సహచరుడిని మాత్రమే చట్టం ద్వారా ఏర్పాటు చేసిన మరియు దేవుడు నియమించిన వివాహం. అతిక్రమణ ద్వారా వివాహ ఒప్పందం విచ్ఛిన్నమైనప్పుడు, అమాయక పక్షం తిరిగి వివాహం చేసుకోవడానికి స్వేచ్ఛగా ఉంటుంది. బుక్ ఆఫ్ మోర్మన్ డిక్లరేషన్‌లో: "మీలో ఒక్క భార్య తప్ప మగవాడు ఉండడు; అతనికి ఉపపత్నులు ఎవరూ ఉండరు." స్టీవార్డ్‌షిప్‌ల సిద్ధాంతంలో; అంటే, ప్రతి మనిషి తన జీవిత ప్రవర్తన మరియు అతని భౌతిక ఆశీర్వాదాల ఉపయోగం కోసం దేవునికి జవాబుదారీగా ఉంటాడు. స్టీవార్డ్‌షిప్ మరియు అవకాశాల సమానత్వ సూత్రం ఆధారంగా నిర్మించబడిన జియాన్ అనే క్రైస్తవ సంఘాన్ని స్థాపించడానికి చర్చికి దైవిక కమీషన్‌లో, మరియు ప్రతి సభ్యుడు తన సామర్థ్యానికి అనుగుణంగా సహకారం అందించాలి మరియు అతని అవసరాలకు అనుగుణంగా స్వీకరించాలి. (టైమ్స్ అండ్ సీజన్స్, వాల్యూం. 3, pp 709-710) చర్చి యొక్క మూడు ప్రధాన గ్రంథాలు, పవిత్ర గ్రంథాల ప్రేరేపిత వెర్షన్, మార్మన్ పుస్తకం మరియు సిద్ధాంతం మరియు ఒప్పందాలు ప్రతి ఇంటి లైబ్రరీలో ఉండాలి. ఇవి కేవలం ఆస్తులుగా ఉండకూడదు, కానీ క్రమం తప్పకుండా ఉపయోగించే జ్ఞానం మరియు ప్రేరణ యొక్క మూలాలు. మంచి సభ్యుడు ఈ అధ్యయనం కోసం రోజులో కొంత భాగాన్ని కేటాయించారు. (816) 461-7215 700 వెస్ట్ లెక్సింగ్టన్ ఏవ్. స్వాతంత్ర్యం, MO 64050 మాకు ఇమెయిల్ చేయండి మా గురించి మా విశ్వాసం చర్చి నాయకత్వం మహిళా మంత్రిత్వ శాఖలు యువత బ్రాంచ్ ఫైండర్ మ్యాప్ చేరి చేసుకోగా వాలంటీర్ ఇంకా నేర్చుకో సెంటర్ ప్లేస్ మినిస్ట్రీస్ జియోన్స్ అకాడమీ © 2022 ది రిమెంట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్. సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి. గోప్యతా విధానం
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ సిటీ న్యూస్: తూర్పు గోదావరి జిల్లాలో మే 6 వ తేదీ నుంచి మే 24 వతేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియేట్ పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమనవ్యయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసారు. సమావేశంలో ఆర్ఐఓ జిజికె నూకరాజు, అడిషనల్ ఎస్పీ సిహెచ్. పాపారావు లతో కలిసి డిఆర్ఓ సుబ్బారావు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 6 నుంచి మే 24వ తేదీ వరకు ఉదయం 9.00 గంటల నుంచి మ.12.00 గంటల వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లా కలెక్టరు వారి అదేశాలు మేరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణకు నియమించబడిన చీఫ్ సూపరింటెండెంట్ల్లు, డిపార్టుమెంటల్ అధికారుల శిక్షణ కార్యక్రమం లో తెలిపిన అన్ని అంశాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలని ఏమైనా సందేహలుంటే నివృత్తి చేసుకోవాల న్నారు. జిల్లాలో 33,981మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, ఇందుకు 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజమహేంద్రవరం డివిజన్ లో 32 సెంటర్లు, కొవ్వూరు డివిజన్ లో 17 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 17,654 మంది,రెండవ సంవత్సరం పరీక్షలకు 16,327 మంది విద్యార్థులు హాజరు అవుతారని,మొదటి సంవత్సరం వొకేషనల్ పరీక్షలకు 1,650 మంది,రెండవ సంవత్సరం వొకేషనల్ పరీక్షలకు 1,596 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.ఈ పరీక్షలను సిసి కెమెరాల నిఘా తో పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పోలీస్ శాఖ ద్వారా పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. 49 పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎక్కడ కూడా జిరాక్స్ కేంద్రాలు తెరవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్లను, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలన్నారు. తపాలా శాఖ సంబంధించి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ను ఆయా పరీక్షా తేదీల్లో నిర్దేశించిన సమయం వరకు తీసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.అన్ని పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్లు, ఫర్నిచర్, తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించి ముందస్తుగా చెక్ లిస్ట్ ఏర్పాటుచేసుకుని ఆ మేరకు ఏర్పాట్లను పకడ్బందీగా పరిశీలించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పరీక్షా కేంద్రాల్లో ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి ఆశా, ఏఎన్ఎం లను నియమించడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు,అవసరమైన మందులు 108 ను అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ విద్యార్థులకు సౌకర్యవంతంగా బస్సులను ఏర్పాటు చేయాలన్నారు . పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను పంపిణీకి అవసరమైన వాహనాలను రవాణా శాఖ ద్వారా సమకూర్చాలన్నారు. సమావేశంలో ఆర్ఐఓ జి జి నూకరాజు, అడిషనల్ ఎస్పీ సిహెచ్ పాపారావు, ఆర్జేడీ ఐ శారద, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సుకన్య సమృద్ధి యోజన అనేది బాలికల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పథకం. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పోస్టాఫీసులు/నియమించబడిన బ్యాంకులలో ఈ ఖాతాను తెరవవచ్చు. అదేవిధంగా మీరు బ్యాంకు నుండి పోస్టాఫీసుకు, పోస్టాఫీసుకు బ్యాంకుకు లేదా ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు బదిలీ చేయవచ్చు. ఖాతాను ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు ఉచితంగా బదిలీ చేసుకోవచ్చు. పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు బదిలీ రుసుము రూ. 100 చెల్లించాలి. సంవత్సరానికి ఒకసారి ఖాతాను మార్చుకోవచ్చు. మీరు కూడా ఖాతాను మార్చాలనుకుంటున్నారా? కానీ ఖాతా బదిలీకి ముందు ఈ ప్రక్రియను తెలుసుకోండి. SSY Account Transfer - ఖాతాను బదిలీ ఎలా చేయాలి? ముందుగా మీరు ఖాతా తెరిచిన బ్యాంకు శాఖ లేదా పోస్టాఫీసును సందర్శించి నగదు బదిలీ కోసం అభ్యర్థించాలి. బ్యాంక్/పోస్టాఫీసు మీకు బదిలీ ఫారమ్‌ను జారీ చేస్తుంది. ఫారమ్‌ను పూర్తి చేయాలి. బదిలీ ఫారమ్‌ను నింపేటప్పుడు, ఖాతా బదిలీ చేయబడే బ్యాంక్/పోస్టాఫీసు పేరు మరియు చిరునామాను అభ్యర్థన ఫారమ్‌లో పక్కాగా పేర్కొనాలి. ఆ తర్వాత పాస్‌బుక్ తో పాటు పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. ఖాతా బదిలీకి ఒరిజినల్ పాస్‌బుక్‌ను అందజేయడం తప్పనిసరి. మీ ప్రస్తుత బ్యాంక్/పోస్టాఫీసు మీ దరఖాస్తు ఫారమ్ మరియు ఇతర పత్రాలను పరిశీలిస్తుంది మరియు ఖాతా బదిలీని ప్రాసెస్ చేస్తుంది. బ్యాంక్ ఖాతాను మూసివేసి, దరఖాస్తు ఫారమ్‌లో మీరు పూరించిన కొత్త బ్యాంక్ చిరునామాకు అన్ని పత్రాలను (SSY ఖాతాలో పెండింగ్‌లో ఉన్న బ్యాలెన్స్ చెక్/DDతో సహా) పంపుతుంది. ఒకసారి కస్టమర్‌కు డెలివరీ చేయబడింది. అందువల్ల, ఖాతా బదిలీని అభ్యర్థించడానికి ముందు, బదిలీ ఫైల్ నేరుగా కొత్త బ్యాంక్ చిరునామాకు పంపబడుతుందా లేదా మీకు డెలివరీ చేయబడుతుందా అనేది మీరు తెలుసుకోవాలి. మీరు మీ ప్రస్తుత బ్యాంక్ బదిలీ పత్రాలను నేరుగా కొత్త బ్యాంక్ చిరునామాకు పంపితే, సంబంధిత కొత్త పాస్‌బుక్ కస్టమర్‌కు జారీ చేయబడుతుంది. కొన్ని బ్యాంకులకు కొత్త దరఖాస్తు ఫారమ్‌తో పాటు KYC పత్రాలు అవసరం కావచ్చు. పత్రాలు కస్టమర్‌కు డెలివరీ చేయబడిన తర్వాత, మీరు ఈ పత్రాలను మీరు ఖాతాను బదిలీ చేయాలనుకుంటున్న కొత్త బ్యాంక్/పోస్టాఫీసుకు సమర్పించాలి. ఖాతాను కొత్త బ్యాంక్/పోస్టాఫీసుకు బదిలీ చేయడానికి దరఖాస్తు ఫారమ్‌ను మరోసారి పూరించండి. ఫారమ్‌ బ్యాంక్/పోస్టాఫీసులో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు ఫారమ్‌తో పాటు KYC పత్రాలు, ఫోటోగ్రాఫ్ మరియు నమూనా సంతకాన్ని సమర్పించాలి. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, కొత్త బ్యాంక్ కస్టమర్ వివరాలతో కొత్త పాస్‌బుక్‌ను రూపొందిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణీ లీల వల్ల తరతరాలుగా వస్తున్న మా పట్టా భూమిని రెవెన్యూశాఖాధాకారులు మరొకరకి రిజిస్ట్రేషన్ చేశారని..మాకు న్యాయం చేయాలని తహసీల్దార్ ను సంప్రదిస్తే నేనేమి చేయలేదని చేతులేత్తయడంతో మనస్థాపానికి గురైన బాధిత రైతు భార్య గాజె బాగ్యలక్ష్మి మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.దీంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ సృహా కొల్పోయి పడిపోవడంతో కుటుంబీకులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు తమ అవేదన వ్యక్తం చేశారు.దాచారం శివారులోని సర్వే నంబర్ 569/4బీ యందు 0.39 ఎకరాల భూమిని ఎస్సీ కార్పోరేషన్ ద్వారా కనగండ్ల లచ్చవ్వకు ప్రభుత్వ పంపిణీ చేసి పట్టా అందించింది.568/2బీ యందు గాజే మల్లేశంకు 0.39 గుంటల భూమి పట్టాకలదు.ధరణి సృష్టించిన 568/3బీ సర్వే నంబర్ ను ఆసరాగా చేసుకుని కనగండ్ల లక్ష్మి 568/2బీ యందు భూమిని స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి మ్యాకల నాగారాజుకు విక్రయించింది.భూ రికార్డులను పరిశీలించకుండా రియల్టర్ నాగారాజుకు రెవెన్యూశాఖాధిఖారులు రిజిస్ట్రేషన్ తతంగం పూర్తి చేశారు.తమ భూమిని మరోకరికి రిజిస్ట్రేషన్ చేసి అన్యాయం చేశారని..తమకు న్యాయం చేయాలని పలుమార్లు తహసీల్దారుకు పిర్యాదు చేశామని బాధితులు అవేదన వ్యక్తం చేశారు.గత రెండేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తహసీల్దార్ రియల్టర్ కు వత్తాసు పలికుతూ దాటవేసే దోరణిని అవలంబిస్తున్నాడని అగ్రహం వ్యక్తం చేశారు.మా భూమిని మరోకరికి రిజిస్ట్రేషన్ చేసి అన్యాయం చేస్తున్నారని..మీ తీరు వల్ల పురుగుల మందు తాగి చనిపోతామని తహసీల్దార్ ను వేడుకుంటే చస్తే చావండని బెదిస్తున్నారా వ్యగ్యంగా తహసీల్దార్ బదులివ్వడంతో మనస్థాపానికి గురైన భాధిత రైతు భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పైరవీలతో ప్రభుత్వ,వివాస్పద భూములకు రెవెన్యూశాఖాధిఖారుల రాజమార్గం చేస్తున్నారని ఆరోపించారు. తహసీల్దార్ అన్యాయం చేస్తున్నాడు పలుమార్లు పిర్యాదు చేసిన తహసీల్దార్ పట్టించుకోకుండా తమ భూమిని మరోకరికి రిజిస్ట్రేషన్ చేశారు. తమ భూమిని మరోకరికి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేశారో వివరాలందించాలని ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసిన వివరాలందించడం లేదు.తమ భూమిని రియల్లర్ కు అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ పై చట్టపరమైన చర్యలు చేపట్టి న్యాయం చేయాలి. -గాజే మల్లేశం,బాధిత రైతు,దాచారం ధరణి వల్లే సమస్యలు.. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూముల వివరాలు ధరణి వల్ల అందుబాటులో లేవు. కరీంనగర్ జిల్లాధికారులకు పలుమార్లు వివరాలందించాలని కోరిన అధికారులు అందించలేదు. 568/3బీ సర్వే నంబర్ యందున్న భూమి నేను రిజిస్ట్రేషన్ చేయలేదు.రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో నేను విధుల్లో లేను.నాయిభ్ తహసీల్దార్ విధుల్లో ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.స్పష్టమైన భూ వివరాల్లేని రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలుపుదల చేయాలని సూచించాను.ధరణిలోని వివరాల ప్రకారమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాం.రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసే విధానం మాత్రమే ధరణిలో అందుబాటులో ఉంది. రద్దు చేసే ప్రక్రియ లేదు.
కాదేది కవితకనర్హం అని శ్రీశ్రీ అన్నట్లు, ఈ పోటీ ప్రపంచంలో వస్తువుల తయారీలో కూడా వినూత్న అలోచనలతో వస్తేనే విజయం. అలాంటి ఒక కొత్త అలోచనలతో ప్రారంభించిందే ‘అల్లిక ‘ సంస్థ. గుర్రపు డెక్క గురించి మీరు వినేవుంటారు. నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడమే కాకుండా, రైతులకు నష్టం కల్గించే ఒకరకమైన కలుపుమొక్క. వీటిని తొలగించడానికి యేటా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుచేస్తుంది ప్రభుత్వం. విదేశీ టెక్నాలజీ ఉపయోగించినా సమస్య తీరలేదు. చెరువు మీద చిక్కగా పచ్చగా పారుతూ, కొంతకాలం తర్వాత ఏకంగా చెరువునే మింగేస్తుంది. పర్యావరణం మీద ప్రభావం చూపించే అనేకానేక అంశాల్లో గుర్రపు డెక్క ఒకటి. పర్యావరణానికి హాని కిలిగించే గుర్రపుడెక్క కాడలతో అద్భుత కళాఖండాలు తయారు చేయిస్తూ, 70 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువకుడు అబ్దుల్ ముజీబ్. పనికిరాని గుర్రపు డెక్కను కుటీర పరిశ్రమకు ముడిసరుకుగా వాడి, నిరుపేద కుటుంబాల్లో ఆకలి లేకుండా చేశాడు. గుర్రపు డెక్కతో అద్భుతాలు చేయడమే కాదు.. మనిషి మనుగడకు అవసరమైన నీటి వనరులను కలుపు మొక్కల బారినుంచి తనవంతు ప్రయత్నంగా కాపాడుతున్నాడు. మొదటగా గుర్రపు డెక్కను స్థానికంగా ఉండే చెరువు నుంచి సేకరించి ఎండబెట్టాడు. ఒక్కో కాడను సన్నగా చీరి, మ్యాట్ తయారు చేశాడు. తొలుత చేసిన ప్రయోగం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అలా మొదలైంది అతడి ప్రయాణం. పరిశోధనలో భాగంగా ఒకసారి అస్సాంకి వెళ్లాడు. అక్కడ ఇలాంటి కలుపు మొక్కలతోనే అందమైన హాండిక్రాఫ్ట్స్ తయారు చేయడం గమనించాడు. అలా పదిరోజుల పాటు, అనేక ప్రాంతాలు తిరిగి ఈ హ్యాండ్ మేడ్ వస్తువుల గురించి పూర్తిగా నేర్చుకున్నాడు. ఫేస్ బుక్ ద్వారానే: తిరిగి ఆంధ్రాకు వచ్చాక, గుర్రపు డెక్క తీవ్రంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాల్లో సర్వే చేశాడు. అలా 2014 అక్టోబర్ లో ‘అల్లిక’ అనే సంస్థను స్థాపించాడు. మొదటగా ఆరుగు మహిళలకు శిక్షణ ఇచ్చాడు. ఒక్కో ఐటెం పెంచుకుంటూ మార్కెట్ మీద పట్టు సంపాదించాడు. రెండున్నరేళ్లలో ఊహించని విధంగా ‘అల్లిక ‘ క్లిక్ అయింది. ప్రస్తుతం 70 మంది కళాకారులు తన సంస్థలో పని చేస్తున్నారు. హాండ్ బ్యాగులు, బుట్టలు, డైనింగ్ మ్యాట్స్, హోం డెకార్, లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్, లాప్ టాప్ బ్యాగ్స్, కాన్ఫరెన్స్ బ్యాగులు, లాంప్ షేడ్స్ తదితర వస్తువులు తయారు చేసి మార్కెటింగ్ చేస్తారు. గుర్రపు డెక్కను సేకరించడానికి కొందరిని నియమించుకున్నాడు. దాదాపు 30 మంది దానికోసమే పనిచేస్తారు. వాళ్లంతా చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువుల్లో గుర్రపు డెక్కను కోసి తీసుకొస్తారు. తెనాలి, పెద్రవూరు, అంగల్ కుదురు, జగడగుంటపాలెంతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లోని చెరువులు, కుంటల నుంచి వాటిని సేకరిస్తారు. దీనితో రైతులు కూడా ఆనందంగా వున్నారు. భారతదేశంలో హస్తకళా పరిశ్రమ ఇంకా కుటీర పరిశ్రమగానే వుంది. కొన్నేళ్లుగా లక్షలాది కుటుంబాలకు ఇదే ప్రధాన ఆదాయ వనరు. ఏటా 20 శాతం ఆర్ధిక ప్రగతి సాధిస్తున్నదీ రంగంలో విప్లవాత్మక మార్పులు రావల్సిన అవసరం ఉందంటాడు అబ్దుల్ ముజీబ్. మార్కెటింగ్ అంతా ఫేస్ బుక్ ద్వారానే (https://www.facebook.com/AllikaWeave) చేసుకుంటాడు. ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా అక్కడ స్టాల్స్ పెడతాడు. అయితే, డిమాండ్ అనుకున్నంతగా లేదనేది ముజీబ్ అభిప్రాయం. దాన్నిబట్టి భవిష్యత్తులో కొత్త ప్రాడక్ట్స్ తయారు చేయాలని భావిస్తున్నాం అంటాడు. ఫ్యూచర్ ప్లాన్స్: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన అబ్దుల్ ముజీబ్ ఆలోచనంతా పర్యావరణ పరిరక్షణ మీదనే. ఇకో ఫ్రెండ్లీ ప్రాడక్ట్స్ తయారుచేయడం మీదనే తన ఫోకసంతా. ఇప్పుడు గుర్రపుడెక్క కాడల నుంచే ప్రాడక్ట్స్ తీసుకొస్తున్నాడు. భవిష్యత్తులో దాని ఆకులు, వేర్లను ఎండబెట్టి సేంద్రియ ఎరువు తయారు చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఈ మొక్కల నుంచి వచ్చే నార ద్వారా శానిటరీ ప్యాడ్స్ తయారు చేయాలన్నది అల్లిక మరో ప్రాజెక్ట్. ఏపీ, తెలంగాణలో ఎక్కడైతే గుర్రపు డెక్క అందుబాటులో వుంటుందో అక్కడ టీంని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చూస్తున్నాడు. తద్వారా మహిళలకు ఆర్ధికంగా చేయూతనివ్వడమే కాకుండా, గుర్రపు డెక్క బారినుంచి చెరువులను తనవంతు సాయంగా కాపాడాలని చూస్తున్నాడు. ఇలాంటి యువతను ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అవిష్కరణలు వెలుగు చూస్తాయనడంలో సందేహంలేదు. ఎక్కడ దొరుకుతాయి: రూ.150 నుండి రూ.1500 వరకు ఉండే ఈ వస్తువులను కొనడానికి ముందుగా ఎవ్వరూ అంతగా ఆసక్తి చూపకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కున్నా కాని, ఇకో ఫ్రెండ్లి ఇంకా నాణ్యత, స్టైల్ నచ్చడంతో ఇప్పుడు బిజినెస్ చాలా బాగా పుంజుకుంది . హైదరాబాద్ లామాకాన్, ఆర్గానిక్ స్టోర్స్, శిల్పరామంలో ఈ వస్తువులు లభిస్తాయి. అల్లిక సంస్థ మొబైల్ పౌచ్, డైనింగ్ మాట్స్, హ్యాండ్ బ్యాగ్స్, లంచ్ బాక్స్ బ్యాగ్స్, హోమ్ డెకరేటింగ్ ఐటమ్స్ లాంటి వెన్నో తయారుచేస్తున్నారు. గుర్రపై డెక్క నారతో తయారు చేసిన ఈ వస్తువులు చాలా ధృడంగా ఉంటాయి 12కేజీల వరకు బరువు మోయగలిగే సామర్ధ్యంతో పది నుంచి 15సంవత్సరాల వరకు మన్నికగా ఉండగలవు. అల్లిక సంస్థ – ఫోన్‌: 09948703646
HYDERABAD: సీఎం కేసీఆర్ కొత్త భారత్ రాష్ట్ర సమితి పార్టీపై కాంగ్రెస్ నాయ‌కుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ అన్నాడీఎంకే, టీఎంసీల పేర్లు ఏఐఏడీఎంకే, ఏఐటీఎంసీగా మారాయనీ, అయితే జాతీయ స్థాయిలో అవి పెద్దగా విజయం సాధించలేదని అన్నారు. Mahesh Rajamoni First Published Oct 10, 2022, 6:29 AM IST Congress Leader Mallikarjun Kharge: సీనియ‌ర్ నాయ‌కుడు, కాంగ్రెస్‌ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున తెలంగాణ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్), భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) గా మారిన టీఆర్ఎస్ పార్టీపైనా ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. హైద‌రాబాద్ లోని గాంధీ భ‌వ‌న్ లో టీపీసీసీ ప్రతినిధులను ఉద్దేశించి మ‌ల్లికార్జున‌ ఖర్గే మాట్లాడుతూ.. కేసీఆర్ ఒకరిని ప్రేమించారని, మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారంటూ ఆయ‌న తీరును విమ‌ర్శించారు. తెలంగాణ రాష్ట్రావతరణ తర్వాత టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని సోనియాగాంధీకి హామీ ఇచ్చిన కేసీఆర్‌ కాంగ్రెస్‌పై ప్రేమను వ్యక్తం చేశారనీ, అయితే కొత్త రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీజేపీతో చేతులు కలిపారని ఆయన పేర్కొన్నారు. అలాగే, జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లే క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) ను బీఆర్ఎస్ గా (భార‌త్ రాష్ట్ర స‌మితి) గా మారుస్తూ ఇటీవ‌ల ఆ పార్టీ విస్తృత స్థాయిలో స‌మావేశంలో నాయ‌కులు ఆమోదం తెలిపిన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ కొత్త భారత రాష్ట్ర సమితి పార్టీపై మ‌ల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ అన్నాడీఎంకే, టీఎంసీల పేర్లు ఏఐఏడీఎంకే, ఏఐటీఎంసీగా మారాయనీ, అయితే జాతీయ స్థాయిలో అవి పెద్దగా విజయం సాధించలేదని అన్నారు. "కేవలం పేరు మార్చడం, జాతీయ నామకరణాన్ని జోడించడం అనేది ఎలాంటి సహాయం చేయదు. జాతీయ స్థాయికి వెళ్లేందుకు తమ పేర్లను మార్చుకున్న ఇతర ప్రాంతీయ పార్టీల మాదిరిగానే బీఆర్‌ఎస్‌కు కూడా అదే గతి పడుతుందని" ఆయన అన్నారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయనున్న 238 మంది పీసీసీ ప్రతినిధుల మద్దతు కోరేందుకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వ‌చ్చిన మ‌ల్లికార్జున‌ ఖర్గే.. పార్టీ యువ నాయకుడికి అధ్యక్ష పదవి ఇవ్వకుండా 80 ఎండ్ల వ్య‌క్తికి ఇచ్చేందుకు సిద్ద‌మైంద‌న్న‌ చర్చను పక్కన పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఓటు వేస్తే యువ నాయకులకు పార్టీలో 50% పదవులు ఇవ్వడం ద్వారా 'ఉదయ్‌పూర్ డిక్లరేషన్'ను అమలు చేస్తానని పార్టీ సీనియర్ నాయకుడు హామీ ఇచ్చారు. ఇదిలావుండ‌గా, గాంధీ కుటుంబం తనను, తన ప్రత్యర్థి మల్లికార్జున్ ఖర్గేను ఆశీర్వదిస్తున్నదని, వారిద్దరి పట్ల తమకు ఎలాంటి పక్షపాతం లేదని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి శశి థరూర్ ఆదివారం అన్నారు. ముంబ‌యిలోని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మాజీ దౌత్యవేత్త 2024 ఎన్నికలలోపు కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే తన లక్ష్యమని అన్నారు. గాంధీ కుటుంబం నన్ను, ఖర్గేను ఆశీర్వదిస్తున్నదని, పార్టీని బలోపేతం చేయడం కోసం పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఖర్గేతో కొనసాగుతున్న ఎన్నికల పోరు అధికారిక అభ్యర్థి (ఖర్గే), అనధికారిక వ్యక్తి (తనకు) మధ్య అని కొందరు నేతలు పేర్కొన్నట్లు వచ్చిన ఊహాగానాలను శ‌శి థ‌రూర్ తోసిపుచ్చారు. "గాంధీ కుటుంబంతో నా పరస్పర చర్యలు నాకు లేదా ఖర్గేకు వారి నుండి ఎటువంటి పక్షపాతం లేదని నన్ను ఒప్పించాయి" అని ఆయన అన్నారు. 2024 ఎన్నికల తర్వాత అక్కడ కూర్చోవాల్సిన అవసరం ఉన్నందున బీజేపీ ప్రతిపక్షంలో భాగం కావడానికి సన్నాహాలు ప్రారంభించాలని థరూర్ అన్నారు. "మా పార్టీకి మార్పు అవసరం.. నేను మార్పుకు ఉత్ప్రేరకంగా ఉంటానని నేను భావిస్తున్నాను" అని ఆయ‌న అన్నారు. కాంగ్రెస్ దేశాన్ని చక్కగా నడిపిస్తోందని, అనుభవం ఉన్న వ్యక్తులు పార్టీలో ఉన్నారని చెప్పారు. ముంబ‌యిలోని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన డెలిగేట్ ఔట్రీచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాము ఓటర్ల విశ్వాసాన్ని గెలుచుకోవాలని అన్నారు. కాగా, కాంగ్రెస్ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలే దీనికి హాజరు కాలేదు. "నేను పటోలే జీతో ఒక మాట చెప్పాను.. ఆయన తన ముందస్తు నిబద్ధత గురించి నాకు తెలియజేసారు. నేను అస్సలు ఫిర్యాదు చేయడం లేదు" అని మిస్టర్ థరూర్ చెప్పారు. మిస్టర్ పటోలే గైర్హాజరు గురించి అడిగినప్పుడు ఆయ‌న పై విధంగా స్పందించారు. తిలక్ భవన్‌లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ సభ్యులు థరూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌సభ మాజీ ఎంపీ ప్రియాదత్, రాజ్యసభ మాజీ ఎంపీ భాల్‌చంద్ర ముంగేకర్ కూడా హాజరయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన తిలక్ భవన్‌కు చేరుకోవడానికి ముందు థరూర్ చైత్యభూమి, బీఆర్ అంబేద్కర్ దహన స్థలి, శివాజీ పార్క్‌లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక స్థూపం, సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. సంస్థాగత పోల్‌లో ఓటు వేయనున్న 9,000 మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధుల కోసం థరూర్ ట్విట్టర్‌లో వీడియో అప్పీల్ కూడా జారీ చేశారు. "భారత జాతీయ కాంగ్రెస్‌లో మేము పెద్ద సవాలును ఎదుర్కొంటున్నాము. మా పార్టీని పునరుద్ధరించడం, 2024 ఎన్నికలలో బలీయమైన బీజేపీతో పోరాడేందుకు దానిని తగినట్లుగా మార్చడం సవాలుగా ఉంది" అని ఆయన తన వీడియో అప్పీల్‌లో పేర్కొన్నారు. "మరే ఇతర పార్టీ చేయలేని అంతర్గత పార్టీ ప్రజాస్వామ్యాన్ని మా పార్టీ దేశానికి అందించడం ద్వారా ఈ సవాలు మరింత ముఖ్యమైనది" అని థరూర్ అన్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ఎన్నికలను స్వాగతిస్తున్నామనీ, ఇది ప్రజలను పార్టీ వైపు ఆకర్షిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా నొక్కిచెప్పారు. అధికార వికేంద్రీకరణ, కార్యకర్తలకు సాధికారత కల్పించడం, నిర్ణయాధికారం అన్ని స్థాయిల్లో అందుబాటులో ఉండేలా, పార్టీలో భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంతోపాటు కార్యకర్తలందరికీ సాధికారత కల్పించడం వంటి అనేక ఆలోచనలను తన మేనిఫెస్టోలో అందించానని చెప్పారు. అక్టోబరు 17న తనకు ఓటేయాలని ఆయన ప్రతినిధులను కోరారు.
బ్రహ్మోత్సవాల చివరి ఘట్టమైన ధ్వజావరోహణం బుధవారం రాత్రి వైభవంగా జరగడంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 దేవతలను సాగనంపిన గరుడాళ్వార్‌ తిరుమల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):బ్రహ్మోత్సవాల చివరి ఘట్టమైన ధ్వజావరోహణం బుధవారం రాత్రి వైభవంగా జరగడంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.ధ్వజారోహణం సందర్భంగా ఆహ్వానించిన దేవతలను గరుడాళ్వార్‌ కృతజ్ఞతలతో తిరిగి పంపే ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయంలో స్వామివారి ఉత్సవర్లకు విశేష సమర్పణ కావించారు. అనంతరం స్వామివారిని ఉభయ దేవేరుల సమేతంగా బంగారు తిరుచ్చిలో సాయంత్రం 7 గంటలకు తిరువీధుల్లో ఊరేగించారు.తిరిగి ఆలయం చేరుకున్న ఉత్సవర్లు ధ్వజస్తంభం వద్దకు వేంచేశారు. 9 గంటలకు అర్చకస్వాములు పూజాదికార్యక్రమాలు నిర్వహించి ధ్వజస్తంభంపై ఉన్న గరుడ పటాన్ని శాస్త్రోక్తంగా కిందకు దించారు. గరుడధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగ ధ్యం,దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక మంత్రాలను అర్చకులు జపించిన అర్చకస్వాములు బ్రహ్మోత్సవాలు ముగిసినట్టు వేదపారాయణం ద్వారా ప్రకటించారు. అనంతరం ధ్వజపడి నివేదన కావించి, ఆలయంలోని బంగారువాకిలిలో ఉత్సవర్లకు ఆస్థానం నిర్వహించారు.బుధవారం ఉదయం బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టాల్లో ఒకటైన చక్రస్నానం కనులవండువగా జరిగింది. ఉదయం 3 నుంచి 6 గంటల మధ్యలో ఆలయం నుంచి ఉత్సవర్లు తిరుచ్చిలో, చక్రత్తాళ్వార్‌ పల్లకీలో తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా వరాహస్వామి ఆలయానికి చేరుకున్నారు.9 గంటల దాకా స్నపన తిరుమంజనం, ఇత్యాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించాక చక్రత్తాళ్వార్‌ను అర్చకస్వాములు పుష్కరిణిలో మూడుమునకలు వేయించారు.పుష్కరిణిలో అప్పటికే వేచివున్న వేలాదిమంది భక్తులు గోవింద నామస్మరణలతో స్నానమాచరించారు.అంతకు ముందు గేటువద్ద భక్తు లు స్వల్పవత్తిడికి గురయ్యారు.సుప్రీం కోర్టు మాజీ సీజే జస్టిస్‌ ఎన్వీరమణ దంపతులు, జార్ఘండ్‌ హైకోర్టు సీజే రవిరంజన్‌, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి దంపతులు,టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. రెండేళ్ళ తర్వాత భక్తుల నడుమ... కరోనా కారణంగా రెండేళ్లపాటు ఆలయానికే పరిమితమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈసారి మాడవీధుల్లో భక్తులమధ్య వైభవంగా జరిగాయి.అయితే భక్తులు భారీగా వస్తారని టీటీడీ అంచనా వేసినప్పటికీ గరుడసేవ, కల్పవృక్ష, సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవల్లో మినహా గ్యాలరీల్లో భక్తులు పలుచగానే కనిపించారు.సర్వదర్శనాన్ని అమలుచేస్తూ ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేయడమే దీనికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమయినప్పటికీ వాహనసేవలకు హాజరైన, మూలమూర్తిని దర్శించుకున్న భక్తులందరూ సామాన్యులేననే సంతృప్తిలో ఉంది టీటీడీ. మాడవీధుల్లోని హారతి పాయింట్ల వద్ద ఈ ఏడాది ప్రవేశపెట్టిన వాహనసేవ దర్శనం విజయవంతమైంది. గరుడ వాహన సేవలో ఈ పద్ధతి ద్వారా దాదాపు 15 నుంచి 20 వేల మందికి వాహన దర్శనం కల్పించారు. గరుడోత్సవం వీక్షించేందుకు వచ్చిన వీఐపీల వాహనాలను ఈ ఏడాది రాంభగీచా సర్కిల్‌ వరకే అనుమతించడంతో రాంభగీచా 1, 2, 3 వద్ద వాహనాల హడావుడి, రద్దీ లేకుండా ప్రశాంతంగా కనిపించింది.గరుడసేవ రోజు ఉదయం 11 గంటలకే గ్యాలరీలు నిండిపోవడంతో మాడవీధుల గేట్లన్నీ మూసివేశారు. దీంతో సాయంత్రం 5 గంటల సమయంలో లేపాక్షి సర్కిల్‌ వద్ద తోపులాట జరిగింది.భద్రతాసిబ్బంది అప్రమత్తమై భక్తులను అక్కడి నుంచి ఒక్కొక్కర్నీ పంపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.ఎస్వీ మ్యూజియం, నందకం వద్ద కూడా చిన్నపాటి తోపులాటలు జరిగాయి.పోలీసులు, టీటీడీ ఉద్యోగులు, ప్రెస్‌ పాసులపై కుటుంబ సభ్యులను అనుమతించే క్రమంలో సప్తగిరి విశ్రాంతి భవనం వద్ద తోపులాట జరిగి ఓ మహిళ కిందపడి స్వల్పంగా గాయపడింది. అలాగే ఆ ప్రాంతంలోనే పాసులు కలిగిన వారిని లోపలికి అనుమతించే క్రమంలో ఇద్దరు పోలీసులు ఒకరినొకరు నెట్టుకోవడం విమర్శలకు దారితీసింది.అన్నప్రసాద భవనం నుంచి గరుడవాహనసేవ దర్శనానికి భక్తులను అనుమతించే క్రమంలో రద్దీ అధికమై క్యూలైన్‌ పక్కకు ఒరిగిపోయి ఓ యువతి కాలికి గాయమైంది.గరుడవాహనసేవ సందర్భం గా మధ్యాహ్నం ఒంటిగంటకే తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలను అలిపిరి వద్దే గంటలకొద్దీ నిలిపివేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.తిరుమలలో ఏ చిన్నపాటి ఉత్సవం జరిగినా డాలర్‌ శేషాద్రి హడావుడి కనిపించేది.అయితే గత నవంబరు నెలలో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే.ఈసారి ఉత్సవాల సమయంలో చాలామంది ఉన్నతాధికారులు, ఉద్యోగులు, అర్చకులు, భక్తులు డాలర్‌ శేషాద్రిని గుర్తుచేసుకోవడం కన్పించింది. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు : టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, శ్రీవారి సేవకుల కృషి, భక్తుల సహకారంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమలలో ఆయన బుధవారం ఈవో ధర్మారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.5.69 లక్షల మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు.గరుడసేవరోజు 81,318 మందికి దర్శనం లభించగా వాహనసేవలో 3 లక్షల మందికిపైగా పాల్గొన్నారన్నారు.హుండీ ఆదాయం రూ.20.43 కోట్లు లభించిందన్నారు.2.20 లక్షలమంది తలనీలాలు సమర్పించగా, 20.99 లక్షల భోజనాలు, ఆల్పాహారం అందించామన్నారు.తిరుపతి నుంచి తిరుమలకు 12,638 ట్రిప్లుల్లో 3.47 లక్షలమంది భక్తులను ఆర్టీసీ చేరవేసిందని, తిరుమల నుంచి తిరుపతికి 12,835 ట్రిప్పుల్లో 4.47 లక్షలమందిని చేరవేసిందన్నారు.వాహనసేవలను వీక్షించేందుకు తగినన్ని ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేయాలేకపోయామని,గరుడవాహనసేవరోజు లేపాక్షి సర్కిల్‌ వద్ద స్వల్పతోపులాట జరిగిందన్నారు. అలిపిరిలో కొంతసమయం వాహనాలు నిలిపివేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారన్నారు. భవిష్యత్తులో ఈ సమస్యలు ఏవీ లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యుడు మధుసూదన్‌ యాదవ్‌, ఢిల్లీ ఎల్‌ఏసీ చైర్మన్‌ ప్రశాంతిరెడ్డి, చెన్నై ఎల్‌ఏసీ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒక దళిత యువతిపైన అత్యాచారం, దాడి జరగడం, ఆమె ఆస్పత్రిలో చికిత్స జరుగుతుండగా మరణించిన తర్వాత ఆమె మృతదేహాన్నీ తల్లిదండ్రులకు అప్పగించకుండా పోలీసులు దగ్గరుండి అర్దరాత్రిపూట దహనం చేయడం ఎక్కడైనా విన్నామా? ఉత్తరప్రదేశ్ లోని హాథ్ రస్ అనే గ్రామంలో జరిగిన ఈ దారుణంపట్ల దిగ్భ్రాంతి చెందిన దేశప్రజలు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. దిల్లీ నిర్భయ, మన దిశపై అఘాయిత్యాలను మించిపోయిన దుర్ఘటన ఇది. నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యాయత్నం జరిగింది. ఇక్కడ ఆ రెండింటితో పాటు బాధితురాలి కుటుంబసభ్యులను గృహనిర్బంధంలో ఉంచి, ఆమె భౌతికదేహం తమకు అప్పగిస్తే అంతిమ సంస్కారం చేసుకుంటామంటూ కంటతడిపెట్టుకొని విన్నవించుకున్న వినకుండా పోలీసులు అమానవీయంగా అంత్యక్రియలు చేశారు. ఇది దేశంలో, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న దారుణాలకు పరాకాష్ట. సెప్టెంబర్ 14వ తేదీన సామూహిక అత్యాచారం, దాడి జరిగితే 19 ఏళ్ళ యువతి దిల్లీ అస్పత్రిలో సెప్టెంబర్ 29న చనిపోయింది. తన తల్లితో పాటు పశుగ్రాసం సేకరిస్తున్న తరుణంలో ఆ యువతిపైన అత్యాచారం జరిగింది. దుండగులు ఆమె నాలుకను కోసివేశారు. వెన్నెముకను విరిచివేశారు. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలకు ఈ దేశంలోభద్రత లేదనే సత్యాన్ని నిత్యం గుర్తు చేసే ఘటనలు ఉత్తరప్రదేశ్ లో తరచు సంభవిస్తున్నాయి. దళిత, ఆదివాసీ అత్యారాల నిరోధక చట్టం (అట్రాసిటీస్ యాక్ట) అమలులో ఉన్నప్పటికీ దళిత మహిళలపైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ గ్రామాలలో అగ్రకులాలకు చెందినవారూ, వెనుకబడిన కులాలకు చెందినవారూ దళితులపైన తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి అత్యాచారాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. నిర్భయ ఉదంతానికి మించిన దారుణం దిల్లీలో 2012లో నిర్భయ ఉదంతం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మ నాయకత్వంలో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్పు మేరకు 2013లో క్రిమినల్ లా (అమెండ్ మెంట్ ) చట్టాన్ని తీసుకువచ్చారు. భారత శిక్షాస్మృతిలో మార్పులు చేశారు. నిర్భయ కేసులో నిందితులైన నలుగురినీ ఈ సంవత్సరం మార్చిలో ఉరితీశారు. ఈ దళిత యువతిపైన అత్యాచారం చేసినవారికి కూడా తీవ్రమైన శిక్ష పడుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ లో తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్-సిట్)ను నియమించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ ఉత్తర ప్రదేశ్ లోనే మహిళల పట్ల అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది. దేశం మొత్తంమీద జరిగిన అత్యాచారాలలో 14.7 శాతం ఒక్క యూపీలోనే జరుగుతున్నాయి. యూపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి నాలుగు రాష్ట్రాలు కలిపినంత విశాలమైనది కావడం ఒక కారణం కావచ్చు. ప్రజలలో నేరప్రవృత్తి పెరగడం, పోలీసుల నిజాయితీ, శక్తిసామర్థ్యాలు ప్రశ్నార్థకం కావడం, సామాజిక విలువలు క్షీణించడం కూడా కారణం కావచ్చు. కోవిద్ కారణంగా మరణించినవారికి అంత్యక్రియలు చేసే సమయంలో మృతుని కుటుంబానికి చెందిన నలుగురుని అంత్యక్రియలు చేసే సమయంలో అనుమతిస్తున్నారు. ఇదివరకు ప్లేగు వంటి అంటురోగాలు వచ్చినప్పుడు కూడా కొద్దిమందినైనా శవాన్ని చూడటానికీ, అంత్యక్రయలు నిర్వహించడానికీ అనుమతించేవారు. కానీ యూపీలో పోలీసులు ఈ దళిత యువతి అంత్యక్రియలకు తల్లినీ, సోదరుడినీ సైతం ఎందుకు అనుమతించలేదో తెలియదు. ఇది నైతికంగా, చట్టప్రకారం సహించలేని, సహించరాని నేరం. దళితులపైన అత్యాచారాలు చేసినవారికి శిక్ష పడకపోవడం దళితులపైన దాడులు పెరగడానికి ప్రధాన కారణం. చట్టం ముందు అందరూ సమానమేనా? వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ఈ యువతికి బతికి ఉండగా, చనిపోయిన తర్వాత కూడా రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వం లభించలేదు. కుల, మత దురాచారాల నుంచి విముక్తి పొందడం కోసం రాసుకున్న రాజ్యాంగాన్ని యధేచ్ఛగా ఉల్లంఘించడం వల్ల సమాజం పురోగతి చెందకుండా వెనకడుగులు వేస్తున్నది. హాథ్ రస్ ఘటనలో మరణించిన యువతి తల్లి మాటలలో చెప్పాలంటే, ‘ మా కూతురు నగ్నంగా పడి ఉంది. ఆమె నోట్లో నుంచి నాలుక బయటకు వచ్చి ఉన్నది. ఆమె కనుగుండ్లు బయటికి వచ్చాయి. ఆమె నోటి నుంచీ, మెడ నుంచీ, మర్మాంగం నుంచీ నెత్తురు కారుతోంది. నా వోణీ తీసి ఆమెపైన కప్పాను.’ ఆ తర్వాత తల్లి, సోదరుడు కలిసి యువతిని చాంద్పా పోలీసు స్టేషన్ కు మోటర్ సైకిల్ పైన తీసుకొని వెళ్ళారు. స్టేషన్ నుంచి ఆమెను తీసుకువెళ్ళమని పోలీసులు పదేపదే చెప్పారు. అనంతరం వైద్యంకోసం అలీగఢ్ లోని జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ అస్పత్రిలో చేర్పించారు. అందుకు కూడా అంబులెన్స్ లో యువతి రెండు గంటలు వేచి ఉండవలసి వచ్చింది. వెన్నెముకకు దెబ్బతగలడం వల్ల యువతి ‘క్వాడ్రీప్లేజియా’ వ్యాధితో బాధపడుతోందని అక్కడి వైద్యుడు డాక్టర్ షాహిద్ అలీ సిద్దికీ చెప్పారు. అంటే చేతులూ, కాళ్ళూ చచ్చుబడిపోయాయని అర్థం. ‘యవతి పరిస్థితి క్లిష్టంగా ఉంది. కానీ ఆమెపైన అత్యాచారం జరిగిందని మాత్రం ఇప్పుడు చెప్పలేము’ అంటూ ఆమె అస్పత్రిలో చేరిన తర్వాత 13 రోజుల తర్వాత వైద్యులు అన్నారు. సెప్టెంబర్ 23న యువతి స్పృహలోకి వచ్చిన తర్వాత సమాచారం ఇచ్చింది. నలుగురు వ్యక్తులు తనపైన అత్యాచారం చేశారని వారి పేర్లతో సహా చెప్పింది. తర్వాత ఆమెను దిల్లీలోని సఫ్దర్ గంజ్ హాస్పటల్ కు తరలించారు. అక్కడ చికిత్స జరుగుతుండగా సెప్టెంబర్ 29న మరణించింది. నలుగురు కీచకుల అరెస్టు యువతి ఫిర్యాదు మేరకు ప్రథమ సమాచార నివేదిక (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ – ఎఫ్ ఐ ఆర్)ను తయారు చేశామనీ, అత్యాచారం చేసిన మనుషుల పేర్లు యువతి చెప్పిన తర్వాత నలుగురినీ అరెస్టు చేశామనీ, అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లను కూడా ఎఫ్ ఐ ఆర్ లో చేర్చామనీ హాథ్ రస్ ప్రాంతానికి చెందిన పోలీసు అధికారి ప్రశాంత్ కుమార్ ఎన్ డీటీవీ ప్రతినిధికి తెలిపారు. సవరించిన క్రిమినల్ లా ప్రకారం బాధితురాలికి మానసికంగా, భౌతికంగా చికిత్స అందించాలి. యువతిపైన లైంగిక దాడి జరినట్టు దాఖలా లేదంటూ ఫ్లొరెన్సిక్ నివేదిక వెల్లడించడం పట్ల పరిశీలకులు విస్మయం వెలిబుచ్చుతున్నారు. వైద్యులూ, పోలీసుల విశ్వనీయత ప్రశ్నార్థకం అవుతున్నదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ మహిళ అయినా తనపైన అత్యాచారం జరగకుండా జరిగినట్టు చెబుతుందా అని వారు అడుగుతున్నారు. వాల్మీకి యువతిపైన అత్యాచారం జరిగిన తర్వాత పోలీసు స్టేషన్ కు వెళ్ళిన వెంటనే పోలీసు అధికారులు సవరించిన క్రిమినల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకొని చికిత్స చేయించి ఉన్నట్లయితే ఆమె సజీవంగా ఉండేది. దర్యాప్తు చేయడానికి సిబ్బంది లేరని చెబుతున్న పోలీసులు హాథ్ రస్ లో 144 వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలు చేయడానికి మాత్రం చాలామంది పటాలాలకొద్దీ తయారైనారు. గురువారం నాడు హాథ్ రస్ వెళ్ళి బాధితులను పరామర్శించాలనే సంకల్పంతో బయలు దేరిని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వద్రాలను పోలీసులు యూపీ సరిహద్దు దగ్గరే అడ్డుకున్నారు. వారి కారును ఆపు చేయగా వారు కాలినడకన బయలు దేశారు. అప్పుడు కూడా పోలీసులు అడ్డుతగిలి అడుగు ముందుకు వేయనీయలేదు. తోపులాట జరిగి రాహుల్ గాంధీ కిందపడగా మోచేతి దగ్గర గాయమైనట్టు వార్తలు వచ్చాయి. సమాజ్ వాదీ పార్టీకి చెందిన కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని తర్వాత వదిలిపెట్టారు. యోగి రాజీనామా కోరుతున్న ప్రతిపక్షాలు శుక్రవారంనాడు దిల్లీ జంతర్ మంతర్ లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భీం ఆర్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్, ఇతర కార్యకర్తలు ప్రదర్శన చేశారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా ప్రదర్శనలో పాల్గొన్నారు. దిల్లీ వాల్మీకి దేవాలయంలో జరిగిన ప్రార్థనలలో ప్రియాంకగాంధీ వద్రా పాల్గొన్నారు. ప్రదర్శన చేసినవారంతా యూపీ ముఖ్యమంత్ర యోగి ఆదిత్యనాథ్ పదవి నుంచి వైదొలగాలని కోరారు. దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శనలు జరుగుతున్నాయి. మన ప్రాథమిక హక్కులను కాపాడే బాధ్యతను రాజ్యాంగం న్యాయవ్యవస్థకు అప్పగించింది. పౌరుల హక్కులను ప్రభుత్వాలు హరించకుండా కాపాడవలసిన బాధ్యత కూడా న్యాయవ్యవస్థదే. సమాజంలో అత్యంత బలహీనమైన వర్గాలపైన అత్యారాలు రాక్షసంగా జరిగిపోతుంటే దేశ పౌరులు చేష్టలుడిగి చూస్తున్నారు. రాజ్యాంగం ఆదేశించినట్టు న్యాయవ్యవస్థ ఇప్పటికే రంగంలో దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకోవలసింది. రాజకీయ నాయకత్వాన్నీ, పోలీసు వ్యవస్థనూ శాసించవలసింది. రాజ్యాంగాన్నీ, రాజ్యాంగస్ఫూర్తినీ, రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వాన్నీ రక్షించుకోకపోతే మన ప్రజాస్వామ్యానికి రక్షణ ఉండదు. ఇది యూపీకి చెందిన ఒక వాల్మీకి యువతికి సంబంధించిన సమస్య కాదు. దళిత సమాజానికి మాత్రమే సంబంధించిన ప్రశ్న కాదు. యావత్ దేశానికీ, సమాజానికీ, ప్రజానీకానికీ ప్రమాదం సూచిస్తున్న పరిస్థితి. పౌరసమాజం స్తబ్దుగా ఉంటే, నిర్వికల్పంగా, నిర్వికారంగా ఉంటే మొత్తం సమాజానికే ప్రమాదం ముంచుకొస్తుందని గ్రహించి పిడికిలి బిగించి ఉద్యమించాలి.
లీడర్లు విజన్, సెన్స్ ఆఫ్ మిషన్ కలిగి ఉంటారు. స్త్రీ పురుషులలో ఆ మిషనను బృహత్కార్యాన్ని సాధించడానికి సాయపడగల స్ఫూర్తిని నింపి ఉత్తేజపరుస్తారు. పనిచేసేవారిని విజయంకేసి నడిపిస్తూ, తమ టీమ్ గెలిచి తీరుతుందన్న దృఢవిశ్వాసం కలిగించగల మీ సమర్ధతే లీడర్ గా మీ శక్తిని సులువుగా పదిలపరుచుకోవడానికి కీలకమైనది. బెస్టు లీడర్లు కష్టపడి పనిచేస్తారు. ఎక్కువసేపు పనిచేస్తారు. ఈ ప్రవర్తన ఇతరులు కూడా అలా పనిచేయడానికి స్ఫూర్తినిస్తుంది. About the Author(s) బ్రయిన్ ట్రేసీ కెనడా, అమెరికా లలో పబ్లిక్ స్పీకర్ గా పేరు గడించారు. 80 పుస్తకాల పైగా రచించారు. వీరి పుస్తకాలు పన్నెండు భాషలలో అనువాదమయ్యాయి.
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 హైదరాబాద్ సిటీ/మాదాపూర్‌ : ఎన్నో కళలు, ఆదివాసుల జీవనశైలిని ప్రతిబింబించే అనేకరకాల చిత్రాలు, శాసనాలు, చరిత్ర సంపదలు భవిష్యత్‌ తరానికి నిలువుటద్దంగా నిలిచాయి. మాదాపూర్‌లోని చిత్రమయి ఆర్ట్‌గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఆద్యకళ ఎగ్జిబిషన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు సేకరించిన అద్భుత కళాసంపదను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలతోపాటు ప్రపంచ నాగరికతకు సంబంధించిన అనేక శాసనాలు ప్రదర్శనలో కొలువుతీరాయి. ఇతర దేశాలకు చెందిన గిరిజన తెగకు సంబంధించిన సంగీత వాయిద్యాలు, వేల ఏళ్లనాటి శాసనాలు ఉన్నాయి. సారంగి వాయిద్యం : దీన్ని బంజారా తెగవారు వాయిస్తారు. బంజారాల ఉపతెగ బాన్స్‌ మాత్రం బరాబ్‌ అనే తంత్రి వాయిద్యం అంటారు. జానపదాల్లో సారంగి వాయిద్యం బాగా ఉపయోగపడేది. ప్రస్తుతం ఇది కనుమరుగైంది. జానపద కిన్నెర : దీన్ని పూర్వకాలంలో గిరిజన తెగతోపాటు పలువురు ఉపయోగించేవారు. ప్రస్తుతం కనుమరుగైంది. తెలంగాణలో గొప్ప సంగీత వాయిద్యంగా ఉండేది. మహబూబ్‌నగర్‌, నల్లగొండ ప్రాంతాల్లో కిన్నెరను వాడేవారు. ముఖ్యంగా దీన్ని దళితులు మాత్రమే వాయించేవారు. తొటిబుర్ర వాయిద్యం : ఈ వాయిద్యాన్ని తొటిలనే కొర్రరాజులు వాయించేవారు. ఆదిలాబాద్‌లో గిరిజన తెగవాళ్లు ఎక్కువగా ఉపయోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. తోళ్లు, ఎముకలపై ఎందరో మహానుభావులు రాసిన శాసనాలను భవిష్యత్‌ తరానికి అందజేయడం కోసం ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు బృందం సేకరించింది.
Telugu News » Spiritual » Health effective benefits of colouring meditation know the details in telugu Colour Meditation: మనసు ప్రశాంతత కోసం ధ్యానం గొప్ప మార్గం.. ఏకాగ్రత కోసం రంగులతో ధ్యానం చేయండి ఇలా.. మనస్సు తన గతాన్ని, భవిష్యత్తును మరచి వర్తమానం గురించి మాత్రమే ఆలోచించినప్పుడు ధ్యానం చేయడానికి వీలుకలుగుతుంది. అయితే, ప్రస్తుతం కలర్ మెడిటేషన్ చేయడం చాలా ఈజీగా చేయవచ్చు అంతేకాదు మరింత ప్రభావవంతంగా ఉంటుంది. Colour Meditation Surya Kala | Sep 10, 2022 | 10:33 AM Colour Meditation: మనందరికీ రంగులంటే అమితమైన ప్రేమ. బాల్యం అంటే మనం రంగులు పూయడం, డ్రాయింగ్ బుక్‌లో రకరకాల బొమ్మలు వేసి రంగులు నింపడం. నిజానికి ప్రతి ఒక్కరూ రంగులను ఇష్టపడతారు. మన జీవితంలో రంగులకు ముఖ్యమైన స్థానం ఉంది. రంగుల ప్రపంచంలో ద్వారా చిక్కుల నుండి మనం దూరంగా వెళ్లవచ్చు. రంగుల ద్వారా మీ ఊహలకు రూపం ఇవ్వవచ్చు. అయితే రంగులకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం చాలామందికి తెలియదు. ధ్యానం చేయడానికి రంగులు కూడా గొప్ప మార్గం. ధ్యానం అంటే ప్రశాంత స్థితిలో ఏకాగ్రతపై దృష్టి పెట్టడం. రంగులతో ధ్యానం చేయండి ధ్యానం వాస్తవానికి.. ఇది కేవలం ఒక పద్ధతి. మనస్సు లో కలిగే అన్ని ఆలోచనలు, ఇబ్బందులు, ఉద్రిక్తత నుండి విముక్తి నిచ్చి .. ధ్యానం.. ప్రశాంతంగా ఒక విషయంపై కేంద్రీకరించేలా చేస్తుంది. మనస్సు తన గతాన్ని, భవిష్యత్తును మరచి వర్తమానం గురించి మాత్రమే ఆలోచించినప్పుడు ధ్యానం చేయడానికి వీలుకలుగుతుంది. అయితే, ప్రస్తుతం కలర్ మెడిటేషన్ చేయడం చాలా ఈజీగా చేయవచ్చు అంతేకాదు మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కలర్ మెడిటేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు: మెడికల్ కి గాంగ్ ప్రకారం రంగులను పూరించే సమయంలో మెదడు కదలికలు కుడి , ఎడమ వైపులా చురుకుగా ఉంటాయి. అంతేకాదు సృజనాత్మక ఆలోచన, నిర్ణయం తీసుకోవడం కలిసి జరుగుతుంది. దీని వల్ల మెదడు అభివృద్ధి చెందుతుంది. అంతే కాదు ఇది మన మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరుస్తుంది. కలర్ మెడిటేషన్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. రంగును నింపేటప్పుడు, మనస్సు మొత్తం దృష్టి ఇతర చింతలకు దూరంగా రంగును మాత్రమే నింపడంపైనే ఉంటుంది. ఇలా ధ్యానం చేయండి ఒకే చోట కూర్చుని కళ్లు మూసుకోండి. అనంతరం మీ శ్వాసపై దృష్టి పెట్టడం కంటే మిమ్మల్ని మీరు ఆనందిస్తూనే రంగులతో ధ్యానం చేయడం సులభం. ఇది మీకు శాంతితో పాటు ఆనందం, సంతృప్తి రెండింటినీ ఇస్తుంది. ఓ కలర్ ఆర్ట్ పూర్తయ్యాక గెలిచినంత ఆనందం కలుగుతుందని అంటున్నారు. ఇది ఒక వ్యక్తికి మానసిక ప్రయోజనాన్ని ఇస్తుంది. కలరింగ్ ధ్యానంలో సహాయపడటమే కాకుండా, సృజనాత్మక నైపుణ్యాలను కూడా పెంచుతుంది. మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. ఇవి కూడా చదవండి Success Mantra: మీరు దుఃఖాన్ని ఆనందంగా మార్చుకోవాలంటే.. సక్సెస్ కు చెందిన 5 సూత్రాల గురించి తెలుసుకోండి .. Chanakya Niti: మనిషి ఈ 4 పక్షుల నుంచి ఈ లక్షణాలను అలవర్చుకుంటే జీవితంలో విజయం సొంతం అంటోన్న చాణక్య Ganesha Statue: 3 వేల అడుగుల ఎత్తులో శిఖరం అంచున వెలసిన బొజ్జ గణపయ్య.. ప్రయాణం ఓ సాహసమే.. (ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా ఉంది. TV9 హిందీ వీటిని ధృవీకరించలేదు. నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)
thesakshi.com : తాను సుస్మితా సేన్ తో డేటింగ్ లో ఉన్నట్లు ప్రముఖ బిజినెస్ మేన్ లలిత్ మోడీ ధృవీకరించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఓ ట్వీట్ లో సూచన ప్రాయంగా వెల్లడించారు. నిజానికి ఇది ఊహించనిది. సడెన్ గా బయటపడ్డ కొత్త విషయం కావడంతో సుష్ అభిమానులు ఎంతో సర్ ప్రైజ్ అవుతున్నారు. అంతేకాదు ఈ వార్త సుస్మితాసేన్ సోదరుడికి కూడా షాక్ నిచ్చింది. తాను స్వయంగా తన సోదరితో మాట్లాడి కన్ఫామ్ చేసుకుంటానని తెలిపాడు. Just back in london after a whirling global tour #maldives # sardinia with the families – not to mention my #betterhalf @sushmitasen47 – a new beginning a new life finally. Over the moon. 🥰😘😍😍🥰💕💞💖💘💓 pic.twitter.com/Vvks5afTfz — Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022 సుస్మితా సేన్ .. వ్యాపారవేత్త లలిత్ మోడీ డేటింగ్ విషయం వెకేషన్ ఫోటోల లీకులతో బయటపడింది. ఈ రోజు (జూలై 14)న వారి ఇటీవలి పర్యటన నుండి కొన్ని ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ వార్తలను ధృవీకరించారు. లలిత్ మోడీ సుస్మితను తన `బెటర్ హాఫ్` అని సంబోధించాడు. ఇది ఇద్దరికీ కొత్త ప్రారంభం అని చెప్పాడు. మరో పోస్ట్ లో ఇద్దరూ డేటింగ్ మాత్రమే చేస్తున్నామని పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశాడు. అందరిలాగే సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ కూడా ఈ వార్త విని ఆశ్చర్యపోయాడు. “నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. నేను దీని గురించి మా సోదరితో మాట్లాడతాను“ అంటూ తనని సంప్రదించిన మీడియాకు జవాబిచ్చారాయన. సుష్ తో డేటింగ్ పై పెద్దాయన ఏమని చెప్పారంటే…“కుటుంబాలతో కూడిన గ్లోబల్ టూర్ #మాల్దీవులు # సార్డినియా తర్వాత లండన్ కు తిరిగి వచ్చాను – నా #బెటర్ హాఫ్ సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు – ఎట్టకేలకు కొత్త ప్రారంభం. చంద్రుడు పైకి.. అని రాసారు. “స్పష్టత కోసం చెబుతున్నా.. ఇంకా వివాహం కాలేదు – ఒకరితో ఒకరు డేటింగ్ మాత్రమే. అది కూడా ఏదో ఒక రోజు జరుగుతుంది“ అని మోడీ వ్యాఖ్యానించారు. సుస్మిత ఇంతకుముందు మోడల్ రోహ్మాన్ షాల్ తో కొంతకాలం డేటింగ్ చేసింది. ఇటీవలే వీరిద్దరూ విడిపోయారు. ఈ వార్త అందరినీ షాక్ కి గురి చేసింది. పరిశ్రమ అగ్ర హీరోలతో సుష్ డేటింగ్ చేసిందని కథనాలొచ్చినా కానీ చాలా కాలం పెళ్లి మాట లేకుండా తాను ఒంటరిగానే ఉంది. ఇప్పుడు లలిత్ మోడీతో డేటింగ్ సాగిస్తోంది. Tags: # Lalit Modi#actress Sushmita Sen#businessman Lalit Modi#Sushmita Sen#Sushmita Sen and Lalit Modi
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ Compare Bible Prev Next 1. బబులోనునుగూర్చియు కల్దీయుల దేశమునుగూర్చియు ప్రవక్తయైన యిర్మీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు 2. జనములలో ప్రకటించుడి సమాచారము తెలియ జేయుడి ధ్వజమునెత్తి మరుగుచేయక చాటించుడి బబులోను పట్టబడును బేలు అవమానము నొందును మెరోదకు నేల పడవేయబడును బబులోను విగ్రహములు అవమానము నొందును దాని బొమ్మలు బోర్లద్రోయబడును 3. ఉత్తరదిక్కునుండి దానిమీదికి ఒక జనము వచ్చు చున్నది ఏ నివాసియు లేకుండ అది దాని దేశమును పాడు చేయును మనుష్యులేమి పశువులేమి అందరును పారిపోవుదురు అందరును తర్లిపోవుదురు. 4. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలువారును యూదా వారును కూడి వచ్చెదరు ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవాయొద్ద విచారించుటకై వచ్చెదరు 5. ఎన్నటికిని మరువబడని నిత్యనిబంధన చేసికొని యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు సీయోనుతట్టు అభిముఖులై ఆచ్చటికి వెళ్లు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు ఇదే యెహోవా వాక్కు. 6. నా ప్రజలు త్రోవతప్పిన గొఱ్ఱెలుగా ఉన్నారు వారి కాపరులు కొండలమీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి జనులు కొండకొండకు వెళ్లుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి. మత్తయి 10:6 7. కనుగొనినవారందరు వారిని భక్షించుచు వచ్చిరి వారి శత్రువులు మేము అపరాధులము కాము వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవామీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించెనని చెప్పుదురు. 8. బబులోనులోనుండి పారిపోవుడి కల్దీయులదేశములోనుండి బయలువెళ్లుడి మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు ముందర నడువుడి. ప్రకటన గ్రంథం 18:4 9. ఉత్తరదేశమునుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు దానిమీదికి యుద్ధపంక్తులు తీర్చుచున్నారు వారి మధ్యనుండియే ఆమె పట్టబడును ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడుసొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును. 10. కల్దీయుల దేశము దోపుడుసొమ్మగును దాని దోచుకొను వారందరు సంతుష్టి నొందెదరు ఇదే యెహోవా వాక్కు. 11. నా స్వాస్థ్యమును దోచుకొనువారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడిచేయుచు పెయ్యవలె గంతులువేయుచు బలమైన గుఱ్ఱములవలె మీరు సకిలించుచున్నారే? 12. మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మును కన్నది తెల్లబోవును ఇదిగో అది జనములన్నిటిలో అతినీచ జనమగును అది యెడారియు ఎండినభూమియు అడవియు నగును. 13. యెహోవా రౌద్రమునుబట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును బబులోను మార్గమున పోవువారందరు ఆశ్చర్యపడి దాని తెగుళ్లన్నియు చూచి ఆహా నీకీగతి పట్టినదా? అందురు 14. ఆమె యెహోవాకు విరోధముగా పాపముచేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరు బబులోనునకు విరోధముగా దాని చుట్టు యుద్ధపంక్తులు తీర్చుడి ఎడతెగక దానిమీద బాణములు వేయుడి 15. చుట్టు కూడి దానిని బట్టి కేకలువేయుడి అది లోబడ నొప్పుకొనుచున్నది దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు విరుగగొట్టబడుచున్నవి ఇది యెహోవా చేయు ప్రతికారము.దానిమీద పగతీర్చుకొనుడి అది చేసినట్టే దానికి చేయుడి. ప్రకటన గ్రంథం 18:6 16. బబులోనులో నుండకుండ విత్తువారిని నిర్మూలము చేయుడి కోతకాలమున కొడవలి పట్టుకొనువారిని నిర్మూలము చేయుడి క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరు తమ ప్రజలయొద్దకు వెళ్లుచున్నారు తమ తమ దేశములకు పారిపోవుచున్నారు. 17. ఇశ్రాయేలువారు చెదిరిపోయిన గొఱ్ఱెలు సింహములు వారిని తొలగగొట్టెను మొదట అష్షూరురాజు వారిని భక్షించెను కడపట బబులోను రాజైన యీ నెబుకద్రెజరు వారి యెముకలను నలుగగొట్టుచున్నాడు. 18. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోనురాజును అతని దేశమును దండించెదను. 19. ఇశ్రాయేలువారిని తమ మేతస్థలమునకు నేను తిరిగి రప్పించెదను వారు కర్మెలుమీదను బాషానుమీదను మేయుదురు ఎఫ్రాయిము కొండలమీదను గిలాదులోను మేయుచు సంతుష్టినొందును. 20. ఆ కాలమున ఆ నాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. యూదా పాపములు వెదకిను అవి దొరుకవు శేషింపజేసినవారిని నేను క్షమించెదను ఇదే యెహోవా వాక్కు. 21. దండెత్తి మెరాతయీయుల దేశముమీదికి పొమ్ము పెకోదీయుల దేశముమీదికి పొమ్ము వారిని హతముచేయుము వారు శాపగ్రస్తులని ప్రకటించుము నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటినిబట్టి చేయుము. 22. ఆలకించుడి, దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది అధిక నాశనధ్వని వినబడుచున్నది 23. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగ గొట్టబడెను అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను. 24. బబులోనూ, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి యున్నాను తెలియకయే నీవు పట్టబడియున్నావు యెహోవాతో నీవు యుద్ధముచేయ బూనుకొంటివి నీవు చిక్కుపడి పట్టబడియున్నావు. 25. కల్దీయులదేశములో ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పనియున్నది యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపముతీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చు చున్నాడు. రోమీయులకు 9:22 26. నలుదిక్కులనుండి వచ్చి దానిమీద పడుడి దాని ధాన్యపుకొట్లను విప్పుడి కసవు కుప్పలువేసినట్లు దానిని కుప్పలువేయుడి శేషమేమియు లేకుండ నాశనము చేయుడి 27. దాని యెడ్లన్నిటిని వధించుడి అవి వధకు పోవలెను అయ్యో, వారికి శ్రమ వారి దినము ఆసన్నమాయెను వారి దండనకాలము వచ్చెను. 28. ఆలకించుడి, పారిపోయి బబులోను దేశములోనుండి తప్పించుకొని వచ్చుచున్నవారి శబ్దము వినబడు చున్నది మన దేవుడగు యెహోవా చేయు ప్రతికార సమా చారమును తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతికార సమాచారమును సీయోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు. 29. బబులోనునకు రండని విలుకాండ్రమ పిలువుడి విల్లు త్రొక్కువారలారా, మీరందరు దానిచుట్టు దిగుడి. అది యెహోవామీద గర్వపడినది ఇశ్రాయేలు పరిశుద్ధునిమీద గర్వపడినది దానిలో నొకడును తప్పించుకొనకూడదు దాని క్రియలనుబట్టి దానికి ప్రతికారము చేయుడి అది చేసిన పనియంతటినిబట్టి దానికి ప్రతికారము చేయుడి. ప్రకటన గ్రంథం 18:6 30. కావున ఆ దినమున దాని ¸యౌవనస్థులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరు తుడిచివేయబడుదురు ఇదే యెహోవా వాక్కు. 31. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై యున్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించుకాలము వచ్చుచున్నది 32. గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును అతని లేవనెత్తువాడెవడును లేకపోవును నేనతని పురములలో అగ్ని రాజబెట్టెదను అది అతని చుట్టుపట్టులన్నిటిని కాల్చివేయును. 33. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఒకడును తప్పకుండ ఇశ్రాయేలువారును యూదా వారును బాధింపబడిరి వారిని చెరపెట్టినవారందరు వారిని గట్టిగా పట్టుకొను చున్నారు వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. 34. వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడ ముట్టించును. ప్రకటన గ్రంథం 18:8 35. యెహోవా మాట యిదే కల్దీయులును బబులోను నివాసులును దాని అధిపతులును జ్ఞానులును కత్తిపాలగుదురు 36. ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద పడును 37. ఖడ్గము వారి గుఱ్ఱములమీద పడును వారి రథముల మీద పడును ఖడ్గము వారిమీదికి దిగుటచేత దానిలోనున్న పరదేశులు స్త్రీలవంటివారగుదురు అది దాని నిధులమీద పడగా అవి దోచుకొనబడును. 38. నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు. ప్రకటన గ్రంథం 16:12 39. అందుచేతను అడవిపిల్లులును నక్కలును అక్కడ నివసించును నిప్పుకోళ్లును దానిలో నివాసముచేయును ఇకమీదట అది ఎన్నడును నివాసస్థలము కాకపోవును తరతరములు దానిలో ఎవరును కాపురముండరు. ప్రకటన గ్రంథం 18:2 40. యెహోవా వాక్కు ఇదే సొదొమను గొమొఱ్ఱాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడును అక్కడ కాపురముండకపోవును ఏ నరుడును దానిలో బసచేయడు. 41. జనులు ఉత్తరదిక్కునుండి వచ్చుచున్నారు మహాజనమును అనేక రాజులును భూదిగంతములనుండి రేపబడెదరు. 42. వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరు వారు క్రూరులు జాలిపడనివారు వారి స్వరము సముద్రఘోషవలె ఉన్నది వారు గుఱ్ఱములను ఎక్కువారు బబులోను కుమారీ, ఒకడు యుద్ధపంక్తులు తీర్చు రీతిగా వారందరు నీమీద పంక్తులు తీర్చుచున్నారు. 43. బబులోనురాజు వారి సమాచారము విని దుర్బలు డాయెను అతనికి బాధ కలిగెను ప్రసవ స్త్రీ వేదనవంటి వేదన అతనికి సంభవించెను. 44. చిరకాల నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు నిమిషములోనే నేను వారిని దానియొద్దనుండి తోలి వేయుదును నేనెవని ఏర్పరతునో వానిని దానిమీద నియమించెదనునన్ను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణచేయువాడేడి?నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? 45. బబులోనునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి కల్దీయుల దేశమునుగూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి నిశ్చయముగా మందలోని అల్పులైనవారిని వారు లాగు దురు నిశ్చయముగా వారినిబట్టి వారి నివాసస్థలము విస్మయ మొందును. 46. బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది జనములలో అంగలార్పు వినబడుచున్నది. Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ పుట్టిన బిడ్డ ద‌గ్గ‌ర నుంచి పండు ముస‌లి వ‌ర‌కూ ప్రతి ఒక్కరికి ప్ర‌భుత్వం తోడు వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందనలు వైయ‌స్ఆర్‌సీపీ బీసీల పార్టీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణె రాజ్యాంగ స్ఫూర్తితో సీఎం వైయస్‌ జగన్‌ పాలన రాజ్యాంగం అణ‌గారిన వ‌ర్గాల‌కు అండ‌ అంబేడ్క‌ర్ భావ‌జాలంతో అనేక సంస్క‌ర‌ణ‌లు You are here హోం » ప్రత్యేక వార్తలు » ఎవరితోనూ పొత్తు ఉండదు: వైఎస్‌ జగన్‌ ఎవరితోనూ పొత్తు ఉండదు: వైఎస్‌ జగన్‌ 06 Jan 2019 10:06 AM వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తోన్న సీనియర్‌ జర్నలిస్ట్‌ దేవలపల్లి అమర్‌ అమరావతి : పాదయాత్ర మీ కుటుంబానికి కొత్తకాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు పాదయాత్ర చేశారు. ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేసిన వారందరూ అధికారంలోకి వచ్చారు. మీరూ వస్తారని ఆశిస్తున్నా. గత 14 నెలలుగా చేస్తున్న పాదయాత్రలో మీరు చాలా విషయాలపై మాట్లాడారు. స్పష్టత కూడా ఇచ్చారు. కానీ ఇంకా కొన్ని అంశాలపై స్పష్టత రాలేదని బయట అనుకుంటున్నారు. కొందరు విమర్శలు చేస్తున్నారు. వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా.. రాజకీయాలు వదిలేసి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యల మీద ప్రభుత్వంతో పోరాటం నుంచి దూరమయ్యారన్న విమర్శ ఉంది. మీరు ఏమంటారు? జగన్‌ : పోరాటానికి క్లైమాక్స్‌ పాదయాత్ర. పోరాటం అసెంబ్లీలో 2014 నుంచి చేస్తూనే ఉన్నాం. చివరకు 2017 దాకా కూడా చేశాం. అసెంబ్లీలో ప్రజల వాణి వినిపించగలిగాం. కానీ, ఆ అసెంబ్లీ పనితీరులో ప్రజాస్వామ్యం అసలు ఉందా? లేదా? అన్నట్టుగా తయారైంది. ప్రతిపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా అధికార పార్టీ కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన తర్వాత వారిని అనర్హులుగా ప్రకటించలేదు. వారి రాజీనామా కోసం అసెంబ్లీలో ఒత్తిడి చేశాం. దాదాపు రెండేళ్ల పాటు వేచి చూశాం. 2014లో శాసనసభ మొదలైతే ఆ ఏడాది చివరి నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై పశ్చాత్తాపం గానీ చేసింది తప్పనే భావన గానీ ఎక్కడా లేకుండా పోయింది. అదే తప్పును నిస్సిగ్గుగా వరుసగా చేయడం మొదలు పెట్టారు. చివరకు ఆ సిగ్గు లేని తనం ఏ స్థాయికి చేరిందంటే వాళ్లల్లో నలుగుర్ని ఏకంగా మంత్రులను కూడా చేశారు. నిజంగా ఇంత దారుణమైన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఉంది. చట్టసభలకు మనం ఎవరమైనా వెళ్లేది ఎందుకంటే చట్టాలను చేస్తామని. ప్రజలు మనవైపు చూసేది అందుకే. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. సాక్షి : ప్రతిపక్షం లేని శాసనసభలో ప్రత్యేక హోదా మొదలు పలు అంశాలపై ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు మీరు మీ పాదయాత్ర ద్వారా సమాధానం ఇచ్చామనుకుంటున్నారా? జగన్‌ : తప్పకుండా.. అసెంబ్లీలో ఉన్నా అంతకన్నా జవాబు ఇచ్చే పరిస్థితి ఏమీ ఉండదు. అసెంబ్లీలో అయితే అది కూడా ఇవ్వనివ్వరేమో... ఎందుకంటే అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఎలాగూ ఖూనీ అయిపోయింది. 2014 నుంచి జరుగుతున్న అప్రజాస్వామిక వ్యవస్థను ఆ స్పీకర్‌ అనే వ్యక్తే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించరు. ఏదైనా మాట్లాడబోతే మైకులు కట్‌ చేస్తారు. అడుగడుగునా అవాంతరాలు కల్పిస్తారు. అటువంటి పరిస్థితుల్లో జనం మధ్యనైనా మేము చెప్పదలచుకున్నది ఎటువంటి అంతరాయం లేకుండా చెప్పగలుగుతాం. బాధితులు ప్రజలు. ప్రజల దగ్గరకే మేము పోతున్నాం. ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అక్కడ జరిగిన అన్యాయాలు.. రాజధాని దగ్గర్నుంచి మొదలుకుని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాల వరకు, చివరకు ఆయన ప్రత్యేక హోదాను ఖూనీ చేస్తూ.. దాన్నే ధర్మపోరాట దీక్షలుగా మళ్లీ అభివర్ణిస్తూ ఏ రకంగా ప్రజలను మభ్యపెడుతున్నారో, మోసం చేస్తున్నారో అవన్నీ ప్రజలకు అసెంబ్లీలో కన్నా మంచిగా వివరించగలిగాం. ఎన్నికల ప్రణాళికను చంద్రబాబు మాదిరి బుక్కులు బుక్కులు తయారు చేయను. కులానికో పేజీ పెట్టి, ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలన్న ఆరాటంతో మేనిఫెస్టో చెయ్యను. నా మెనిఫెస్టో ఒకటి.. మహా అయితే రెండు పేజీలుంటాయి. ఆ మేనిఫెస్టోలో అంశాలు ఇవీ అని ప్రజలకు చూపించి, ఓట్లు వేయించుకున్న తర్వాత నేను అది అమలు చేయలేకపోతే నా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను. చంద్రబాబు మనస్తత్వం నాకు లేదు. నాకు అపారమైన విశ్వసనీయత ఉంది. దేవుడు ఆశీర్వదిస్తే, చెయ్యగలిగితే ప్రజలకు మంచి చేస్తాను. సాక్షి : శాసనసభలో మీ సభ్యుల్ని కొనుగోలు చేసినట్టే లోక్‌సభలోనూ మీ సభ్యుల్ని టీడీపీ కొనుగోలు చేసింది. అసెంబ్లీ స్పీకర్‌పై ఒత్తిడి చేసినట్టుగా లోక్‌సభ స్పీకర్‌పై అంత ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదన్న విమర్శ ఉంది? జగన్‌ : అక్కడా, ఇక్కడా తీవ్రంగానే ఆక్షేపించాం. తప్పుబట్టాం. అక్కడా ఇక్కడా అదే పరిస్థితి. టీడీపీ, బీజేపీలు ఇద్దరూ కలిసి నాలుగేళ్లు సంసారం చేశారు. అక్కడ వాళ్లు చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టకూడదని తొక్కిపెట్టారు. సాక్షి : ఇప్పుడు విడిపోయామంటున్నారు, ఇప్పుడైనా చర్య తీసుకుని ఉండాల్సింది కదా? జగన్‌ : ఆ మేరకు వ్యవస్థలు దిగజారిపోయాయి. బహుశా బీజేపీకి, చంద్రబాబుకు మధ్య లోపాయికారిగా సంబంధాలు కొనసాగుతున్నాయేమో.. సాక్షి : చంద్రబాబు నాయుడు తాజాగా మీ మీద చేసిన ఆరోపణ.. సీనియర్‌ మోదీ కేసీఆర్‌ అయితే జూనియర్‌ మోదీ మీర (జగన్‌)ని. అసలు మోదీ, సీనియర్, జూనియర్‌ మోదీలు ముగ్గురూ ముసుగులు తీసి కలిసి పోటీ చేయండంటున్నారు. మీరేమంటారు? జగన్‌ : మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేయాల్సిన విషయం ఒకటుంది. అసలు ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు? ఎవరు ఎవరితో కాపురం చేస్తున్నారు? చేశారు? 2014 ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు నరేంద్ర మోదీతో కలిసి ప్రయాణం చేశారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, మోదీ ముగ్గురూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి మా మీద యుద్ధం చేశారు. అప్పుడు వారన్న మాటలు కూడా చూడండి. జగన్‌కు ఓటేస్తే రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు వేసినట్టే అని చంద్రబాబు అన్నాడు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ అన్నాడు. తనకున్న ఎల్లో మీడియా ద్వారా గట్టిగా ప్రచారం కూడా చేయించారు. ఆ తర్వాత ఏమి జరిగింది? 2014 ఎన్నికలు అయిపోయాయి. 2019లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదేళ్లలో మేము ఎక్కడా కాంగ్రెస్‌ పార్టీతో కలవలేదు. కానీ అదే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2018 దాకా నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేశాడు. ఆ సమయంలో బీజేపీని టీడీపీ, టీడీపీని బీజేపీ పరస్పరం విపరీతంగా పొగుడుకున్నాయి. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని బీజేపీ చెప్పడం, చంద్రబాబు కోరిక మేరకు ప్యాకేజీ ఇచ్చామని బీజేపీ చెప్పడం.. దానికి ఏకంగా అసెంబ్లీలో ఈ చంద్రబాబు నాయుడు తీర్మానాలే చేసి బీజేపీని పొగడడం, చివరకు 2017 జనవరి 27న ప్రెస్‌మీట్‌ పెట్టి బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్రానికి చేయనంతగా ఆంధ్రప్రదేశ్‌కు చేసిందనడం, చేసి ఉంటే చెప్పండని ప్రతిపక్షాలను సవాల్‌ చేయడం జరిగింది. ఆ దశ వరకు ఆ ఇద్దరూ చిలకా గోరింకల్లా సంసారం చేశారు. కేవలం ఒక సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయనగా చంద్రబాబు నాయుడు తాను చేసిన మోసాలకు, అన్యాయాలకు, అవినీతి, అబద్ధాలకు ఎవరో ఒకరి మీద నెపం నెట్టాలని బలిపశువు కింద కేంద్రంపై ఆరోపణలు నెట్టేసి కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇదే కాంగ్రెస్‌ పార్టీని ఆవేళ రాష్ట్రాన్ని అడ్డగోలుగా, అన్యాయంగా విభజించిందని చెప్పిన వ్యక్తి, తల్లి కాంగ్రెస్‌ పిల్ల కాంగ్రెస్‌ అని అన్న వ్యక్తి, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి మళ్లా వస్తుందన్న ఇదే పెద్దమనిషి తానే కంకణం కట్టుకుని అదే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఏమి అబద్ధాలు చెప్పారో ఈవేళ కూడా.. అదే ప్రత్యేక హోదా, చంద్రబాబు నాయుడు గొప్పగా పాలిస్తాడు, గొప్పగా మేలు చేస్తాడనే పాత హామీలనే మళ్లీ తెరపై చూపిస్తున్నాడు. ఏదైనా ఆరోపణ చేయాలంటే దానికి ఏదైనా ప్రాతిపదిక ఉండాలి. కానీ చంద్రబాబు చేసే వాటికి అటువంటివేమీ ఉండవు. ఆ మనిషి ఏది చెప్పాలనుకుంటే అది చెబుతాడు, తాను ఏది చేస్తే అది కరెక్టు, అలా కాదన్నవాళ్లపై బురద జల్లుతారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాల పాలన అనైతిక పొత్తుల్లోనే కాదు.. నాలుగున్నరేళ్ల పాలనలోనూ అదే కనిపిస్తుంది. ఆయన నైజమే అంత. ఎన్నికలప్పుడు రైతులకు 87,612 కోట్ల రూపాయల పంట రుణాలు బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. కానీ ఈవేళ ఏమైంది? డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణ మాఫీ చేస్తానన్నాడు. డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబూ ముఖ్యమంత్రి కావాలన్నాడు. కానీ ఈరోజు పరిస్థితి ఏమిటీ? ఆయన చేసిన మోసంతో రైతులు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలు మాఫీ కాకపోగా సున్నా, పావలా వడ్డీలకు రుణాలు రాకుండా పోయాయి. సున్నా, పావలా వడ్డీల కోసం గత ప్రభుత్వాలు వీళ్ల తరఫున వడ్డీ డబ్బులు కట్టేవి. చంద్రబాబు వచ్చాక ఆ డబ్బుల్ని కట్టకుండా అన్యాయం చేశాడు. ఆయన చేసిన మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నాడు. ఏ చదువు లేకపోయినా పర్వాలేదమ్మ.., ఇంటింటికీ ఉద్యోగమో, ఉపాధో చూపిస్తా. లేకుంటే నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఆ రెండు వేలూ పోయే, ఉద్యోగాలూ రాలేదు, చివరకు ఉద్యోగాలు వచ్చేందుకు అంతో ఇంతో అవకాశం ఉన్న ప్రత్యేక హోదానూ ఖూనీ చేశారు. ప్రతి విషయంలోనూ అబద్ధాలు, మోసాలే. దారుణమైన పరిపాలన. ఎదుటి వాళ్ల మీద బురద జల్లడం, మీడియా మేనేజ్‌మెంట్‌ వంటి అన్యాయమైన పాలన చూస్తున్నాం. ముఖ్యమంత్రి స్థానంలో ఉండీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు దాన్ని ఖూనీ చేశాడు. ప్రత్యేక హోదా వల్ల ఏం మేలు జరుగుతుందని, అదేమన్నా సంజీవినా అన్నాడు. హోదా అంటే జైల్లో పెడతాను. పీడీ యాక్ట్‌ తెరుస్తాను అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మాట్లాడితే ఇక ప్రత్యేక హోదా సాధన ఎలా జరుగుతుంది? కాబట్టి వీళ్ళందరూ మోసం చేశారు. అలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేశాడు. హోదాకు మద్దతుగా అవసరమైతే కేంద్రానికి లేఖ రాస్తానని కూడా అన్నాడు. అంటే ప్రత్యేక హోదా కోసం మన 25 మంది ఎంపీలు వినిపిస్తున్న వాణికి మరో 15 మంది తోడవుతున్నారు. పార్లమెంట్‌ సాక్షిగా మీరు ఇచ్చిన ప్రత్యేక హోదా కావాలని అడిగే స్వరం 25 నుంచి 42 మందికి పెరిగింది. ఆ అడుగు వేసేందుకు కేసీఆర్‌ ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. సాక్షి : తెలంగాణ ఫలితం చూశారు కదా.. మీకు ఏమనిపించింది? జగన్‌ : ప్రజలు చంద్రబాబు అనుకున్నంత పిచ్చోళ్లు కాదు. అది చంద్రబాబుకు అర్థం అయ్యేలా ప్రజలు బుద్ధి చెప్పారు. బయటి నుంచి ఎవరైనా మూడో వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ను చూస్తే ఏమిటీ వ్యవస్థ అనిపిస్తుంది. రాజకీయ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంటే ఈ రాజకీయ నాయకుల్ని ఎలా క్షమించగలం అనేలా వ్యవస్థను దిగజార్చారు. అటువంటి అన్యాయమైన పరిస్థితిలోకి ఈ వ్యవస్థను దిగజార్చి మళ్లీ అవే అబద్ధాలతో తెలంగాణకు వెళ్లి అవే మాటల్ని చెబితే ప్రజలు నమ్ముతారా? ప్రజలు నిజంగా చైతన్యవంతులు కాబట్టి.. జరుగుతున్నది చూస్తున్నారు కాబట్టి.. అనైతిక పొత్తులకు, అనైతిక వ్యవహారాలకు తెర దింపే విధంగా తీర్పు ఇచ్చారు. అత్యధికంగా ఆంధ్రా సెటిలర్లు ఉన్న ఏరియా హైదరాబాద్‌. అనైతిక పొత్తులు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తులు 40, 50, 60 వేల తేడాతో గచ్చిబౌలి, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లోనే ఓడిపోయిన పరిస్థితి. హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్లే ఓటేయలేదంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్లు చంద్రబాబుపై ఏ స్థాయిలో కోపం పెంచుకుని ఉన్నారో అనేదానికి అదే నిదర్శనం. సెటిలర్లే ఓటేయకపోతే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎందుకు వేస్తారు? సాక్షి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో చంద్రబాబును ఉద్దేశించి ఒకమాట అన్నారు.. ఆంధ్రప్రదేశ్‌లో నేను ఇక మొదలు పెడతానన్నారు? జగన్‌ : కేసీఆర్‌ గారు ఏమన్నారో, ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు గానీ వాస్తవం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్‌ గారు ఏదయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా, ప్రత్యేక హోదాకు అనుకూలంగా మాట్లాడిన మాటల్ని స్వాగతించాను. ఎందుకంటే కేసీఆర్‌ గారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కాదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తాను ప్రధాన మంత్రికి లెటర్‌ కూడా రాస్తానని చెప్పి ఒక అడుగు ముందుకు వేస్తానన్న మాటలు హర్షించదగినవి. ఎందుకంటే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీని చట్టంలో చేర్చకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడింది. అదే కాంగ్రెస్‌ పార్టీ ఆవేళ రాష్ట్రాన్ని విడగొట్టకుండా ఉన్నా బాగుండేది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, బీజేపీ కలిసి ఏమి చెప్పారో ఈవేళ కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు కలిసి అవే హామీలు ఇస్తున్నారు. సినిమా ఒక్కటే.. యాక్టర్లే వేరు. ఇందులో విరుద్ధ (ఐరానిక్‌) విషయం ఏమిటంటే ఇద్దరితోనూ కాపురం చేసింది చంద్రబాబే. బీజేపీతో కాపురం చేసి విడాకులు ఇచ్చారు, మళ్లీ కాంగ్రెస్‌తో సంసారం చేస్తున్నాడు. ఇద్దరితోను కాపురం చేయని పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్‌ కాంగ్రెసే. మరి ఏ రకంగా ఈ ఆరోపణలు చేస్తున్నారో తెలియదు. తలాతోకా ఉండదు. సాక్షి : మీరు ప్రత్యేక హోదా సాధించుకునే క్రమంలో ఇలా చెబుతున్నారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నదేమిటి? తాను తెలంగాణకు వెళ్లి పోటీ చేస్తే టీఆర్‌ఎస్‌ దాన్ని సెంటిమెంట్‌కు ఎలా వాడుకుందో, ఇక్కడా అదే రీతిలో తెలంగాణ సీఎం వచ్చి జగన్‌మోహన్‌ రెడ్డితో కలవబోతున్నాడని, జగన్, మోదీ, కేసీఆర్‌ కలవబోతున్నారని ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. దానివల్ల ఇక్కడ ఎలాంటి పరిణామాలుంటాయి? జగన్‌ : అక్కడా కేసీఆర్‌.. కాంగ్రెస్, మోదీతో విభేదించి పోటీ చేశాడు. మోదీ హైదరాబాద్‌కొచ్చి తిట్టిపోయాడు. కేసీఆర్‌ కూడా మోదీని తిట్టాడు. కాంగ్రెస్, బీజేపీతో పోటీపడి ఆయన గెలిచాడు. ఎక్కడా కూడా బీజేపీతో కలిసి పోటీ చేసిందీ లేదు. కలిసి సపోర్ట్‌ చేసిందీ లేదు. పోనీ ఐదేళ్లలో ఆయన చేశాడా అంటే అదీ లేదు. అంతో ఇంతో చంద్రబాబు నాయుడు బీజేపీతో సంసారం చేశాడు తప్ప, ఆయనేం చేయలేదు. అదే వ్యక్తితో పొత్తు పెట్టుకునేందుకు ఇదే చంద్రబాబు నాయుడు హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని కేటీఆర్‌తో ప్రతిపాదన చేశానని నిస్సిగ్గుగా ఒప్పుకున్నాడు. ‘తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలని, కలిసి పోటీ చేద్దామని నేను ప్రతిపాదించాను. కానీ కేసీఆర్‌ ఒప్పుకోలేదు. అందుకే నేను కాంగ్రెస్‌తో జత కట్టాన’ని తనంతట తానే చెప్పాడు. ఇది చెప్పి రెండు నెలలు కాలేదు. అక్టోబర్‌లో హరికృష్ణ చనిపోయాడు. ఇది జరిగి నాలుగు నెలలు కాలేదు. అంటే నాలుగు నెలల క్రితం కేసీఆర్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆయనే సంసిద్ధత వ్యక్తం చేశాడు. అంటే దానర్థమేంటి? కేసీఆర్‌ మోదీతో లేనట్టే కదా? అలాంటి చంద్రబాబు నాలుగు నెలల తర్వాత చెప్పిందేంటి? ఆయన తప్ప కేసీఆర్, నేను మోదీతో ఉన్నామట. సాక్షి : 2014 ప్రస్తావన తెచ్చారు మీరు. పవన్‌ కళ్యాణ్, బీజేపీతో కలిసి టీడీపీ అధికారంలోకొచ్చింది. అదీ ఒకటి ఒకటిన్నర శాతం ఎక్కువ ఓట్లతో. అప్పట్లో మీరు అలాంటిదేదన్నా చేసుంటే అధికారంలోకి వచ్చుండే వారు. ఇప్పటికైనా పవన్‌తో పొత్తు పెట్టుకుంటే మీకు అధికారం చాలా సులభంగా వస్తుందని చెబుతున్నారు. జగన్‌ : రాష్ట్రం ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం. అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు. ఈ పరిస్థితికి ఎవరు కారణమని ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్తే, చంద్రబాబు నాయుడు, ఇదే బీజేపీ, ఇదే పవన్‌ కళ్యాణ్‌. ఆ రోజు ముగ్గురూ ఒక కూటమిగా ఏర్పడి, ప్రతీ హామీని మేం నెరవేరుస్తామని ప్రజలకు మాటిచ్చారు. ఇదే పవన్‌కళ్యాణ్‌ ఊరూరా తిరిగి చంద్రబాబుకు ఓటేయమన్నాడు. ఆయనకు అనుభవం ఎక్కువగా ఉందని, ఆయనిచ్చిన హామీలకు తాను పూచీ అంటూ చెప్పాడు. చంద్రబాబు గురించి చెప్పాడు. మోదీ గురించి ఇంకా ఎక్కువ చెప్పాడు. ఎన్నికలయిపోయిన తర్వాత జరిగిందేమిటి? ప్రత్యేక హోదా విషయమే కాకుండా, రైతులను, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను, చదువుకున్న పిల్లలను.. అందరినీ చంద్రబాబు ఎలా మోసం చేశాడు? ఆయన మేనిఫెస్టో చూస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలుగా చేస్తానని ప్రతీ కులాన్ని నమ్మించాడు. తన చేతుల్లో లేనిది కూడా చెప్పి ప్రతి కులాన్నీ మోసం చేశాడు. మేనిఫెస్టోలో ఒక్కో కులానికి ఒక పేజీ కేటాయించాడు. ఎంత నేర్పుగా మోసం చేయగలమన్న దానిపై పీహెచ్‌డీ చేసి మరీ మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాకపోగా వేలం నోటీసులు రైతుల ఇళ్లకు వస్తున్నాయి. చివరకు ఆయన చేసిన రుణమాఫీ అన్నది వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. రైతుల రుణాలు ఆవేళ 87,612 కోట్ల రూపాయలు ఉంటే 2018 వచ్చే సరికి రైతుల రుణాలు 1,26,000 కోట్లకు చేరాయి. వడ్డీలకు వడ్డీలు తడిసి మోపెడయి ఈయన చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. సాక్షి : మొదటి నుంచీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. హోదా ఇస్తానన్న పార్టీకే మద్దతిస్తామంటున్నారు. రాçహుల్‌ గాంధీ హోదా ఇస్తానంటున్నాడు. కాంగ్రెస్‌తో కలిసిపోతారా? జగన్‌ : నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా మాట్లాడుతున్నా. ఇప్పటి వరకూ మేం చాలా మోసపోయాం. హోదా ఇస్తామని అంతా మోసం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీ హోదాను చట్టంలో చేర్చకుండా మోసం చేసింది. బీజేపీ చేస్తానని ముందుకొచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ మద్దతు పలికారు. వాళ్లూ మోసం చేశారు. ఎవరో ఏదో చేస్తామని చెబితే నమ్మే పరిస్థితుల్లో మేం లేం. ఏపీ ప్రజలను కోరేది ఒకటే. 25కు 25 ఎంపీ స్థానాలను మనం సొంతం చేసుకుందాం. ఎవరికీ మద్దతునివ్వాల్సిన పనిలేదు. గెలిచిన తర్వాత సంతకం పెట్టు మద్దతిస్తామందాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి హోదాకు సంతకం పెట్టక తప్పని పరిస్థితి వస్తుంది. ఇవాళ మద్దతిస్తే.. ఇప్పుడు జరిగినట్టే మళ్లీ వాళ్లు చేతులెత్తేస్తే హోదా ఇవ్వకపోతే ఎవరిని అనగలుగుతాం? సాక్షి : సంతకం పెట్టాలంటే వాళ్లు అధికారంలోకి రావాలిగా? జగన్‌ : ఆ పరిస్థితి ఉంటేనే. ప్రధాని అయిన ఒకటో రోజో.. రెండో రోజో హోదా ఇస్తానని చెప్పు. అప్పుడు నేనొస్తా. చంద్రబాబునాయుడు మాదిరి నాలుగేళ్లు నిరీక్షించే అవకాశమే ఉండదు. వారమో... రెండు రోజులో ఎప్పుడో చెబితే నేను మద్దతిస్తా. సాక్షి : పోలవరం, అమరావతితో పాటు తాను చేస్తున్న అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ మేం రావాల్సిందే. జగన్‌మోహన్‌ రెడ్డి వస్తే ఇవన్నీ ఆపేస్తాడని చెబుతున్నారు.. జగన్‌ : అసలు అభివృద్ధి ఎక్కడ జరుగుతోంది? పోలవరం ప్రాజెక్టు పునాది దాటి ముందుకెళ్లలేదు. గట్టుదాటి ముందుకు కదల్లేదు. ఒక బొట్టు నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదు. ప్రాజెక్టు డిజైన్లు ఇంకా ఖరారు కాలేదు. డీపీఆర్‌ ఇంకా అవ్వలేదు. 48 గేట్లకు ఒకే ఒకటి పెట్టారు. ఒకటి పెట్టడానికి రెండు నెలలు పడుతుందట. ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఇక రాజధాని వ్యవహారం ఓ పెద్ద స్కాం. ఇంతకన్నా పెద్ద స్కాం ప్రపంచంలో ఎక్కడా కన్పించదేమో. రాజధాని ప్రాంతం ఎందుకు ముందుకు కదలడం లేదంటే అది స్కాం కాబట్టే. పర్మినెంట్‌ అనే పేరుతో రాజధానిలో ఒక్క ఇటుకా పడలేదు. శాశ్వత అసెంబ్లీ, సచివాలయం ఏదీ లేదు. హైకోర్టు భవనం కూడా తాత్కాలికమే. ఆ తాత్కాలిక భవనాల నిర్మాణానికి అడుక్కు రూ.10 వేలు. మళ్లీ భూమి ఉచితంగా వచ్చిందే. ఇక దాని నాణ్యత ఎలాంటిదంటే, బయట మూడు సెంటీమీటర్లు వర్షం పడితే, లోపల ఆరు సెంటీమీటర్లు నీళ్లొస్తాయి. అభివృద్ధి పేపర్‌ మీదే తప్ప ఎక్కడన్నా కన్పిస్తోందా? తనకున్న ఎల్లో మీడియా సామ్రాజ్యంతో, తనకున్న ఛానళ్లు, పేపర్లతో మభ్యపెట్టేందుకు చేస్తున్న గోబెల్స్‌ ప్రచారమే తప్ప అభివృద్ధి ఉందా? సాక్షి : అభివృద్ధి గురించి శ్వేతపత్రాలు విడుదల చేశారు కదా? జగన్‌ : శ్వేతపత్రాల్లో ఉన్నదంతా పూర్తిగా అవాస్తవం. అది అందరికీ తెలిసిన విషయమే. ఏపీలో ఏం జరుగుతోందనేది ఏ సామాన్యుడిని అడిగినా చెబుతారు. ఎంత అన్యాయమైన, దౌర్భాగ్యమైన పాలన సాగుతుందనేది అందరూ చెప్పుకుంటున్నారు. అభివృద్ధి అనే పదానికి అర్థమేంటి? పేదవాడి ఇంట్లో మంచి జరిగితే, పేదవాళ్లకు మంచి జరిగితే, పేదవాడి పొలంలో మంచి జరిగితే, పేదవాడు వెళ్లే స్కూల్లో మంచి జరిగితే, హాస్పిటల్‌లో మంచి జరిగితే అదీ అభివృద్ధి. ఇలా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? అంతా దిగజారిపోయింది. చివరకు పంట పడించే సాగు విస్తీర్ణం తగ్గిన పరిస్థితి చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో కనిపిస్తోంది. పంట దిగుబడి తగ్గిన పరిస్థితి ఉంది. దీన్ని అభివృద్ధి అంటారా? ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో పెట్టి ఉంటే కనీసం సుప్రీంకోర్టుకన్నా వెళ్లి దాన్ని అమలు చేయమని అడిగే పరిస్థితన్నా ఉండేది. కాంగ్రెస్‌ పార్టీ ఆ రెండూ చేయకుండా ఆ విధంగా అన్యాయం, మోసం చేసింది. అదేవిధంగా బీజేపీ కూడా. వాళ్లు అధికారంలో ఉన్నారు.. చేసే హోదాలో ఉన్నారు, చేస్తామని పార్టీ ప్రణాళికలో పెట్టారు. పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా ఇస్తామని మాట్లాడారు. మోదీ అయితే ఏకంగా తిరుపతి సభలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. చేసే పొజిషన్‌లో ఉండి చేయకుండా వాళ్లు రాష్ట్రానికి అన్యాయం చేశారు. రాజధాని పేరుతో అంతర్జాతీయ కుంభకోణం సాక్షి : విడిపోయిన రాష్ట్రానికి రాజధాని అవసరం కదా? జగన్‌: అక్కడ జరిగిన స్కాంలు ప్రపంచంలో ఇంకెక్కడా జరగలేదు. ఫలానా చోట రాజధాని వస్తుందని తనకు తెలిసి ఉన్నా, నూజివీడు ప్రాంతంలో వస్తుందని, నాగార్జున యూనివర్సిటీ దగ్గర వస్తుందంటూ తప్పుదారి పట్టించారు. మేలో తాను అధికారంలో కొస్తే, డిసెంబర్‌ చివరి దాకా రాజధాని ఎక్కడొస్తుందనేది చెప్పలేదు. కానీ రాజధాని ఎక్కడొస్తుందనేది మాత్రం ఆయనకు, ఆయన బినామీలకు మాత్రం తెలుసు. అందరినీ పక్కదారి పట్టించి, ఆయన, ఆయన బినామీలు భూములు కొనుగోలు చేశారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ కంపెనీ ఏకంగా 14 ఎకరాలు కొనుగోలు చేసింది. తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, అనౌన్స్‌మెంట్‌ చేసే మధ్య కాలంలో కొనుగోలు చేశారు. ఎక్కడ రాజధాని వస్తుందనేది తెలిసి రైతుల దగ్గర్నుంచి తక్కువ రేటుకు ముఖ్యమంత్రి, ఆయన బినామీలు భూములు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ల్యాండ్‌ పూలింగ్‌ మొదలు పెట్టారు. అదెంత అన్యాయమంటే, తను, తన బినామీల భూములను మినహాయించారు. లింగమనేని అనే వ్యక్తి విషయాన్ని చూస్తే, ఆయన భూముల దాకా వచ్చి ల్యాండ్‌ పూలింగ్‌ ఆగిపోతుంది. ఇక్కడేమో లింగమనేని తన రియల్‌ ఎస్టేట్‌ సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. కొంతమంది బినామీలను ల్యాండ్‌ పూలింగ్‌లో తక్కువ శాతం భూములిచ్చేట్టు వాడుకున్నాడు. ఎక్కువ శాతం బినామీల భూములు పూలింగ్‌కు ఇవ్వకుండా ల్యాండ్‌ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత కృష్ణ, గుంటూరు జిల్లాలు జోనింగ్‌ అన్నాడు. తన బినామీలకు చెందిన భూములను రియల్‌ ఎస్టేట్‌ జోన్లలో పెట్టాడు. మిగతా రైతులు పోటీకి రాకూడదని వాళ్లను వ్యవసాయ జోన్‌లో పెట్టాడు. ఆ తర్వాత మరో స్కాం. ఇంకో అడుగు ముందుకేశాడు. తను రైతుల దగ్గర్నుంచి బలవంతంగా సేకరించిన భూమిని తన ఇష్టమొచ్చిన రేట్లకు, ఇష్టమొచ్చినన్ని ఎకరాలు, ఇష్టమొచ్చిన వ్యక్తులకు శనక్కాయలు, బెల్లాలకు కట్టబెట్టాడు. రాజధాని భూముల్లో ఈ స్థాయిలో అవినీతి, కుంభకోణాలు జరుగుతుంటే ఇవి విచారణకు పోవా? రాజ్యాంగ అవసరాలను వ్యక్తిగత అవసరాలకు వాడుకోనని, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు. దీన్ని ఓత్‌ ఆఫ్‌ సీక్రసీ అంటారు. స్టాక్‌ మార్కెట్లో ఇలాగే చేస్తే దాన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటారు. ఇలా చేస్తే సాధారణంగా బొక్కలో పెడ్తారు. అలాంటి నేరాలకు పాల్పడిన ఈ వ్యక్తి, ఇంత అవినీతి చేసిన పరిస్థితుల్లో వాటిపై విచారణ కచ్చితంగా జరుగుతుంది. అసలు రాజధాని అంటే ఏమిటనేది ఓ స్పష్టత ఉండాలి. రాజధాని అంటే ఓ అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు. ఈ మూడు ఎక్కడుంటే అది రాజధాని. మిగిలిందంతా రైతులను ప్రోత్సహించాలి. ముఖ్యమంత్రిగా ఆయన చేసే పనేంటి? ఎలా సంపాయించుకుని బాగుపడాలని ఆలోచించడం కాదు. రైతులు ఎలా బాగుపడాలని ఆలోచించాలి కదా? రియల్‌ ఎస్టేట్‌ చేయాలంటే రైతులకు అవకాశం ఇవ్వాలి. అంతే తప్ప మనమేంటి తక్కువకు తీసుకుని, ఇష్టమొచ్చినవాళ్లకివ్వడం? ఎంటైర్‌ ల్యాండ్‌ ఈజ్‌ గవర్నమెంట్‌ ల్యాండ్‌. రైతుల దగ్గర్నుంచి అటువంటి పరిస్థితులు లేని భూమి ఉంటే చూడాలి. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా చేస్తే ఫర్వాలేదు గానీ, రైతుల దగ్గర్నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసి అన్యాయం చేయాలన్న రీతిలో అవినీతి చేయడం నిజంగా దుర్మార్గం. చంద్రబాబు, మంత్రులు మాట్లాడిన తీరు నాకు ఆశ్చర్యం కలిగించింది. అదే కోడి కత్తి పొరపాటున భుజంపైన తగిలింది. అదే గొంతు మీద తగిలి.. మూడు సెంటీమీటర్ల లోతు తెగితే మనిషి బతికుండే వాడా? ప్రమాదకరమైన పథకం వేశారనేందుకు ఇదే నిదర్శనం. సాక్షి : 2014 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ మీ విశ్వసనీయత పెరగడానికి అలవికాని హామీలు నేను ఇవ్వనన్నారు. రైతు రుణమాఫీని సమర్థించనన్నారు. అందువల్ల విశ్వసనీయత పెరిగింది. ఇప్పుడు మీరు ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలు కాకుండా పాదయాత్ర సందర్భంగా అన్ని సామాజిక వర్గాలకు హామీలు ఇస్తున్నారు. అధికారంలోకి వస్తే వీటన్నింటినీ పూర్తి చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? జగన్‌ : రైతు రుణమాఫీని నేను సమర్థించను అని నేను ఏనాడూ అనలేదు. అది చెయ్యలేనిది, సాధ్యం కానిదనే ఆ రోజు చెప్పాను. నిజంగా కేంద్రం ముందుకొచ్చి రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానంటే నా కన్నా సంతోష పడేవాళ్లు ఎవరూ ఉండరు. బంగారంగా చెయ్యమనే చెబుతాను. కానీ సాధ్యమవుతుందా? కాదా? అనేది తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయనకూ తెలుసు. అసలు రాష్ట్ర బడ్జెట్‌ ఏమిటి? నంబర్‌ ఏమిటి? ఏమేర చెయ్యగలుగుతాం? చెయ్యలేము అనేది ప్రతిపక్ష నాయకుడిగా నాకూ అవగాహన ఉంది. నాకూ సలహాదారులున్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై సరైన అవగాహనతో ఉన్న వ్యక్తిని నేను. బాధ్యతగల వ్యక్తులుగా మనం మాట్లాడాలి. ముఖ్యమంత్రిగా కాగల వ్యక్తులమని చెప్పి ప్రజల దగ్గర ఓట్లడుగుతున్నాం. అలాంటి మనకు విశ్వసనీయత ఉండాలి. మనం ఏదైనా మాట చెప్పి, అది చెయ్యలేకపోతే ప్రజలు మనల్ని క్షమించరు. చరిత్ర హీనులమవుతామనేది అర్థం కావాలి. దేవుడు ఆశీర్వదించి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు మాదిరి ఈ రోజు ఎంత సంపాదించాను, రేపు ఎంత సంపాదిస్తాననే అలోచన కోసం రావడం లేదు. నాకు డబ్బు మీద వ్యామోహం అంతకన్నా లేదు. నాకు ఒక్కదాని మీదే వ్యామోహం ఉంది ఒక్కటే... చరిత్ర సృష్టించాలి. ఒక్కసారి ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్తే ప్రజలకు ఎంత మంచి చేయాలంటే... ఆ మంచిని చూసి నేను చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నాన్న ఫొటోతో పాటు నా ఫొటో ఉండాలనేది నా కల. దాని కోసం తాపత్రయపడుతున్నాను. దేవుడు ఆశీర్వదించి నాతో చేయించగలిగితే అది చేస్తాను. నాతో కుదరదు అంటే నేను తప్పుకుంటాను. ఇంకొకటి లేదు. సాక్షి : రైతులకు తెలంగాణలో కేసీఆర్‌ అమలు చేస్తున్న రైతు బంధు గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు మమతా బెనర్జీ కూడా మాట్లాడుతున్నారు. మీరు అధికారంలోకి వస్తే ఇలాంటిది ఏమైనా చేస్తారా? జగన్‌: వీరందరికంటే ముందు రైతు భరోసా అని చెప్పింది మనం. ఈ స్కీమ్‌ గురించి ఎవరూ చెప్పకముందే నా పాదయాత్రకు ముందు గుంటూరులో జరిగిన మా పార్టీ ప్లీనరీలో నవరత్నాల సందర్భంగా రైతు భరోసా పథకం అమలు చేస్తామని ప్రకటించాం. తర్వాత కొన్ని నెలల తర్వాత పాదయాత్ర ప్రారంభించా. ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు మే మాసంలోనే ఇస్తాం. నాలుగు దఫాలుగా రూ.50 వేలు ఇస్తామని నవరత్నాల్లో భాగంగా ప్లీనరీలో ప్రకటించాం. వీళ్లెవరూ ఆలోచించకముందే నేను చెప్పిన మాట ఇది. రాష్ట్రంలో దాదాపు 85 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇందులో అర హెక్టారు (1.25 ఎకరాల లోపు భూమి) భూమి ఉన్న కుటుంబాలు అక్షరాలా 42 లక్షలు ఉన్నాయి. అనగా రైతు కుటుంబాల్లో సగమన్నమాట. హెక్టారు వరకూ ఉన్న వారిని తీసుకుంటే ఈ 42 లక్షలకు మరో 19 లక్షల కుటుంబాలు కలుస్తాయి. అనగా సుమారు 60 లక్షల కుటుంబాలు. అనగా మొత్తం రైతుల్లో 70 శాతం మంది హెక్టారు (2.5 ఎకరాల లోపు భూమి ఉన్న)లోపు ఉన్న వారే. అందువల్ల ఎకరాకు ఇంత అని ఇస్తే వీరు ఎప్పటికీ బాగుపడరు. ఆ రోజుల్లో వీళ్లెవరూ చెప్పకముందే రైతుల కోసం మేం రూ.4 వేలు ఇవ్వాలా? రూ.5 వేలు ఇవ్వాలా? రూ.8 వేలు ఇవ్వాలా? అని ఆలోచన చేశాం. అయితే రూ.8 వేలు లేదా రూ.9 వేలు ఇచ్చినా ఇలాంటి చిన్న రైతులకు నేను మేలు చేయలేను. అందువల్లే రైతు కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించాం. ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 ఇస్తామని చెప్పాం. పెద్ద రైతులకు బహుశా మనం ఇచ్చేది పెద్ద ఎక్కువగా అనిపించకపోవచ్చు. కానీ చిన్న రైతులకు మనం ఇచ్చే మొత్తం వల్ల ఉత్పత్తి వ్యయం బాగా తగ్గనుంది. బహుశా చాలా పంటలకు ఉత్పత్తి వ్యయాన్ని మనం ఇచ్చినట్లవుతుంది. అప్పు పుట్టని పరిస్థితిలో ఉన్న పేద రైతులకు రూ.12,500 చేతిలోకి వస్తుంది. రెండోది ఏమంటే ఒకవేళ రుణమాఫీ లాంటి పథకాలకు పోయామంటే అవి రైతులకు చేతికి రావు. బ్యాంకుల్లోకి వెళ్లిపోతాయి. దానివల్ల రైతులకు మానసికంగా అప్పులు తీరిపోయినట్లు అనిపిస్తుందే గానీ రైతు జీవితం బాగుపడదు. ఆ రోజు నవరత్నాల గురించి మాట్లాడిన సందర్భంగా ధరల స్థిరీకరణ నిధి గురించి కూడా చెప్పా. ఈ రోజు చంద్రబాబు అనే వ్యక్తి దళారీలకు కెప్టెన్‌ అయ్యారు. నువ్వే (చంద్రబాబు) వ్యాపారిగా, దళారీలకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పుడు రైతులు ఎన్నడూ బాగుపడలేరు. మేమైతే రూ.3,000 కోట్లతో రైతు స్థిరీకరణ నిధి తీసుకొస్తాం. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కరువు లేదా వరదలు వస్తున్నాయి. అందువల్లే రూ.4,000 కోట్లతో విపత్తు సహాయక నిధి తీసుకొస్తామని చెప్పాం. నవరత్నాల్లో ఇవన్నీ ఉన్నాయి. రూ.2,000 కోట్లు రాష్ట్రం పెడితే రూ.2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. సాక్షి : ఆంధ్రప్రదేశ్‌కు మేం రూ.20 వేల కోట్లు ఇస్తే ఎవరి జేబుల్లోకి పోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు కదా? దీనిని బట్టి ఏమనిపిస్తోంది? జగన్‌ : 2017 జనవరి 27న చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ చేసినంత మేలు ఏరాష్ట్రానికైనా చేసిందా? అని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. అంటే దాని అర్థం 2014 – 15, 2015 – 16, 2016 – 17 బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చిన సహాయం ఓకే అన్నట్లే. ఎందుకంటే వీళ్లే (టీడీపీవారే) కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. కేంద్రంలో వీరి మంత్రులు ర్యాటిఫై చేస్తుంటే ఇక్కడ చంద్రబాబు మైక్‌ పట్టుకుని బడ్జెట్‌ బ్రహ్మాండంగా ఉందని, మోదీ బాగా చేస్తున్నారని పొగిడారు. 2017 – 18 బడ్జెట్‌ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. చంద్రబాబు ఈ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడానికి నెల ముందు అంతా బాగుందని మోదీని పొగిడారు. మరి.. చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి డబ్బు రాలేదనడం ఏమిటి? నన్ను ప్రేమించే వారెవరైనా నన్ను చంపడానికి ప్రయత్నిస్తారా? ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఒక అబద్ధపు ఫ్లెక్సీని సృష్టించారు. ఆ ఫ్లెక్సీ మీద గరుడ పక్షి ఫొటో పెట్టారు. ఎవరైనా ఫ్లెక్సీ వేసేవారు గరుడ పక్షిని పెడతారా? మా అమ్మ ఫొటోనో, మా నాన్న ఫొటోనో పెడతారు. సాక్షి : బహుశా సమకాలీన భారత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల్లో మీరు నష్టపోయినంతగా ఎవరూ నష్టపోయి ఉండరు. వాటిని అడ్డుకోవడానికి మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? జగన్‌ : రాజకీయ నాయకుడికి తనమీద తనకు నమ్మకముండాలి. ప్రజలమీద నమ్మకముండాలి. దేవుడి మీద నమ్మకముండాలి. ఫలానా ఎమ్మెల్యే రావడానికి సిద్ధంగా ఉన్నాడని అనుకో. యూ షుడ్‌ హావ్‌ ద కరేజ్‌.. రాజీనామా చేసి రమ్మను. వచ్చిన తర్వాత బై ఎలక్షన్‌ కు వెళ్లు. మీ పార్టీ గుర్తుతో గెలిపించుకో. సాక్షి : అది మీరు చేస్తున్నారు.. అన్ని రాజకీయ పార్టీలు అలా చేయడం లేదు కదా.. ఇటీవల మాకు గాంధీభవన్‌లో జీతాలు, ఎలక్ట్రిసిటీ బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేవు. అందుకే మా శాసనసభ్యులు అమ్ముడు పోతున్నారని ఓ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అన్నారు. ఓ జాతీయ పత్రికలో వార్త వచ్చింది. జగన్‌ : వాళ్ల నాయకుడు రాహుల్‌గాంధే అమ్ముడు పోయినప్పుడు కింది వాళ్లను అని ఏం లాభం. ఇదే కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబునాయుడు మీద 2018లో జూన్‌ 8, జూన్‌2న పుస్తకాలు రిలీజ్‌ చేశారు. నాలుగేళ్ల బాబు అవినీతి పాలన మీద రాహుల్‌గాంధీ ఫొటో పెట్టి అన్యాయపు పరిపాలనపై చార్జిషీట్‌ అనే పేరుతో పుస్తకం రిలీజ్‌ చేశారు. ఇది జరిగి మూడు నెలలు తిరక్క ముందే బాబు అవినీతి సొమ్ములో వాటా ఇవ్వగానే, ఇదే కాంగ్రెస్‌ పార్టీ దాన్ని తీసుకుని అదే పార్టీతో పొత్తు పెట్టుకుంది. పై వాళ్లకే లేనప్పుడు చిన్న చిన్న ఎమ్మెల్యేలు, చిన్నా చితక లీడర్లకు విలువలుండాలని ఎక్స్‌పెక్ట్‌ చెయ్యడం కూడా తప్పే. సాక్షి : మీరు అవకాశం ఇవ్వనందునే రాహుల్‌ గాంధీ చంద్రబాబుతో వెళుతున్నారని అంటున్నారు? జగన్‌ :అవకాశం ఇవ్వాలి అనేది ఎందుకు ఎక్స్‌పెక్ట్‌ చెయ్యాలి. నీ బలం మీద నువ్వు పోటీ చెయ్యి. ప్రజలను నమ్ముకో. నువ్వు కష్టపడు. ఎవడో సపోర్ట్‌ చెయ్యాలి, ఎవడి భుజాలమీదో పరుగెత్తాలని అనుకుంటున్నావ్‌. నువ్వే విలువలను అమ్మేసుకుని, నువ్వే దిగజారిపోయి, రాంగ్‌ మెసేజ్‌ ఇచ్చావ్‌. నీకే విలువలు లేనప్పుడు వాళ్లు అమ్ముడు పోతే తప్పేముంది? సాక్షి : జనవరిలో చంద్రబాబు నాయుడు తెలంగాణ తరహాలో అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తాడని చెబుతున్నారు. మీరు కూడా ఇచ్చాపురం బహిరంగ సభలో అలాంటి సంచలన ప్రకటన ఏమైనా చెయ్యబోతున్నారా? జగన్‌ :అలాంటిదేమీ లేదు. అనౌన్స్‌ చెయ్యడమే ఒక సంచలనం అని ఎందుకనుకోవాలి? ఈ రోజుకు కూడా పాదయాత్ర జరుగుతూండగానే పార్లమెంటరీ వ్యూస్‌ తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే క్యాండిడేట్స్‌ను పిలిపించుకుని మాట్లాడుతున్నాం. మేము చేయించుకుంటున్న సర్వేలను బట్టి.. వాటిపై ఒకరికొకరం డిస్కస్‌ చేసుకుంటున్నాం. సాక్షి : ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబును మీరు తట్టుకోలేరని కదా? జగన్‌ :బేసికల్లీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే.. ‘సక్సెస్‌ హ్యాజ్‌ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్‌ ఈజ్‌ ఆర్ఫన్‌’ అని సామెత ఉంది. శ్రీశ్రీ గారు తెలుగులో ఇలాంటివే చెప్పారు. నిప్పులు చిమ్ముకుంటూ నేను నింగికి ఎగిరితే నిబిడాశ్చర్యంతో మీరు. నెత్తురు కక్కుతూ నేను నేలకు ఒరిగితే నిర్దాక్షిణ్యంగా వీరే. క్లిక్‌ అయితే నువ్వు అపర మేధావివి. కాలేదనకో నీకు తొందరెక్కువ.. నీకు దుడుకెక్కువ అంటూ.. ఇవన్నీ సర్వ సహజంగా జరిగేవే. కానీ ఎండ్‌ ఆఫ్‌ ద డే ఏది చేసినా విలువలతో కూడిన రాజకీయం చేయాలి. ప్రజలు మన జడ్జిలు, దేవుడు మన జడ్జి అనేది ఎప్పుడూ మరచిపోకూడదు. అదే నేను నమ్ముతా. సాక్షి : ఎప్పుడైనా ఏ మూలనైనా ఎందుకీ రాజకీయాలు అని విరక్తి కలిగిందా? జగన్‌ : ఒక్కోసారి అనిపిస్తుంది.. కానీ ఇన్ని కోట్ల మంది.. లాస్ట్‌ ఎలక్షన్స్‌లో 1.30 కోట్ల మంది నన్ను నమ్మి నాకు ఓట్లేశారు. చంద్రబాబు అన్ని పార్టీలతో కలిసి పోటీ చేసినా ఆయనకు 1.35 కోట్ల మంది మాత్రమే ఓట్లేశారు. నాకంటే కేవలం 5 లక్షల మందే ఎక్కువ. కోటి ముప్పయి లక్షల మంది నామీద నమ్మకం పెట్టుకుని ఓట్లేసినప్పుడు కష్టాలు వచ్చినాయి కదా అని వదిలేసి పోతే.. వీళ్లందరికీ అన్యాయం చేసినవాడినవుతానేమోనన్నది ఆల్వేస్‌ బిహైండ్‌ మై హెడ్‌. కష్టాలు అనేవి ఎల్లకాలం ఉండవు. ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగలు రావాలి. ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు కూడా వస్తుంది కదా.. బాబు ఇక్కడ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తాడు. తెలంగాణకు పోయి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంత దౌర్భాగ్యపు పని లేదంటాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని ఓడించండని ప్రజలకు పిలుపునిస్తాడు. ఆంధ్రాలోనేమో ఎమ్మెల్యేలను నిర్లజ్జగా కొనుగోలు చేసి నలుగుర్ని మంత్రుల్ని చేస్తాడు. మళ్లీ అదే వ్యక్తి తెలంగాణకు పోయి మరోమాట మాట్లాడతాడు. ఆంధ్ర రాష్ట్రం ఒక మనిషి అనుకుంటే దాన్ని పొడిచెందెవరు? ఒకరు కత్తిచ్చారు. ఇంకొకరు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. మూడో వ్యక్తి పొడిచాడు. ఇందులో ముగ్గురూ నేరస్తులు. అలాంటి వ్యక్తులు కూటమిగా వచ్చినా, విడివిడిగా వచ్చినా ఢీకొంటాం. ఇంతకు ముందు కూడా మేం కాంగ్రెస్, బీజేపీ.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. వచ్చే ఎన్నికల్లోనూ ఎవరితో పొత్తు పెట్టుకోం. మాకు ప్రజల మీద, దేవుడి మీద నమ్మకమెక్కువ. కాబట్టి ఎవరితోనూ పొత్తు పెట్టుకోం. హైకోర్టును విభజించండని అఫిడవిట్‌ ఇచ్చింది బాబే సాక్షి : జగన్‌పై ఉన్న కేసుల విచారణను జాప్యం చేయడం కోసమే హైకోర్టును విభజించారు. హడావుడిగా విజయవాడకు తీసుకొచ్చారనే ఆరోపణపై మీరేమంటారు? జగన్‌ :అసలు నాకు అర్థం కానిదేమంటే, హైకోర్టుకు, నాకు సంబంధం ఏముంది? హైకోర్టును విభజించాలని, వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని నేను ఎన్నడూ కోరలేదు. నేను ఏనాడూ డిమాండు చేయలేదు. నేను ఏనాడూ లేఖ రాయలేదు. పది సంవత్సరాలు మనకు హైదరాబాద్‌లోనే ఉండటానికి హక్కుంది. నువ్వు అక్కడింత వరకూ పర్మినెంట్‌ అనే పేరుతో ఒక్క భవనం కట్టలేదు. పర్మినెంట్‌ అనే పేరుతో హైకోర్టే కట్టకుండా హైకోర్టును షిఫ్ట్‌ చేయాలని ఏ బుద్ధి ఉన్న వాడూ అడగరు. ప్రతిపక్ష నాయకుని బాధ్యతలో నేనున్నప్పుడు అసలు అడగనే అడగను. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి జరుగుతుందో పూర్తిగా తెలిసి ఉండి కూడా హైకోర్టును ఎట్టిపరిస్థితుల్లోనూ విభజించండని విజ్ఞప్తి చేస్తూ.. దానికి సంబంధించిన భవనాలన్నీ తయారైపోయాయి.. మీరు షిఫ్ట్‌ చేయండి.. అని తానంతట తానే సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేశారు. దానికి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడే ఉన్నా తమకేమీ అభ్యంతరం లేదు, అవసరమైతే ఒక భవనం కూడా ఇస్తామని రివర్స్‌ అఫిడవిట్‌ ఫైల్‌ చేసింది. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు చంద్రబాబు సర్కారు భవనాలు ఇస్తామని అంటున్నప్పుడు ఆ రాష్ట్రానికి హైకోర్టు షిఫ్ట్‌ కావడం ధర్మం కదా? ఎందుకు మీరు షిఫ్ట్‌ చేయడం లేదు? అంటూ పలానా తేదీ నుంచి షిఫ్ట్‌ చేయండని కేంద్ర ప్రభుత్వానికి హుకుం జారీ చేసింది. ఆ నేపథ్యంలో హైకోర్టు షిఫ్ట్‌ అయింది. చంద్రబాబు నాయుడి కోరిక మేరకు హైకోర్టు బదిలీ అయితే దాన్ని తిరిగి రాజకీయం చేసి వేరే వాళ్లపై బురద చల్లేందుకు ఉపయోగించుకోవాలనే దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబుది. ఇంతటి దారుణమైన వ్యక్తి మరొకరు ఉండరు. నేను విశాఖలో అడుగు పెట్టినప్పటి నుంచి సీసీ కెమెరాలు ఆగిపోయాయి సాక్షి : మీపై హత్యాయత్నానికి సంబంధించిన కేసును కేంద్రం ఎన్‌ఐఏకు అప్పగించింది. దీనిపై చంద్రబాబు కామెంట్‌ చేశారు. దీనిని మీరేమంటారు? జగన్‌: అసలు దాడి ఎక్కడ జరిగింది.. ఈ విషయంలో మనం ఆలోచించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. వీఐపీ లాంజి అనేది అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. అలాంటి ప్రదేశంలోకి ఒక కత్తి.. అన్ని సెక్యూరిటీ ప్రమాణాలను దాటి ఎలా రాగలిగింది? అక్కడ పనిచేసిన ఆ మనిషి ఆ కత్తిని ఎలా తేగలిగాడు? ఆ మనిషి తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతిపరుడు హర్షవర్దన్‌ చౌదరికి చెందిన రెస్టారెంట్‌లో పని చేయగలిగాడు కాబట్టే ఆ కత్తిని తీసుకుని రాగలిగాడు. ఆ హర్షవర్దన్‌ చౌదరి 2014లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు ఆశించారు. ఆయనకు చంద్రబాబునాయుడి దగ్గర నుంచి లోకేశ్‌ వరకూ చివరకు విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ చౌదరి దాకా అందరితో సంబంధాలు ఉన్నాయి. హత్యాయత్నం చేసిన ఆ వ్యక్తి గతంలోనే హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్నారట. అలాంటి వ్యక్తికి పోలీసులు ఎన్‌ఓసీ ఎలా ఇచ్చారు? ఇంకో అడుగు ముందుకెళ్లి చూస్తే మొన్న కోర్టు అడుగుతున్న ప్రశ్నల్లో మరొకటి ముందుకొచ్చింది. నా పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించే నాటికే ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు ఆగిపోయాయి. నాపై హత్యాయత్నం జరిగేంత వరకూ ఎయిర్‌ పోర్టులో సీసీ కెమెరాలు పని చేయలేదట. అంటే దాదాపుగా మూడు నెలల పాటు విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేయడం మానేశాయి. అదీ కరెక్టుగా ఎప్పుడు పనిచేయడం మానేశాయంటే విశాఖపట్నం జిల్లాలోకి జగన్‌ అనే వ్యక్తి అడుగు పెట్టిన తర్వాతే. ఇంత దారుణమైన కుట్ర జరుగుతున్నప్పుడు సంఘటన జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ పెద్దలు స్పందించిన తీరు దారుణం. హత్యాయత్నం జరిగిన గంటలోపే డీజీపీ మీడియా ముందుకు వచ్చి నాపై హత్యాయత్నాన్ని వెటకారం చేస్తూ దాడి చేసిన వ్యక్తి జగన్‌ అనుచరుడని తేల్చేశారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడైతే అదీ బ్లూకలర్‌లో ప్లెక్సీ వేస్తాడు. కానీ ఆ ఫ్లెక్సీ ఎల్లో కలర్‌లో ఉంది. దానిపైన గరుడ పక్షి బొమ్మ పెట్టి మార్ప్‌డ్‌ ప్లెక్సీ ఎవడైనా పెట్టగలుగుతాడా? ఆ ఫ్లెక్సీని అప్పటికప్పుడు పాత ఫ్లెక్సీ మీద తయారు చేయించారు. ఎయిర్‌ పోర్టులో నాపై హత్యాయత్నం జరిగాక నేను చాలా హుందాగా చంద్రబాబు మీదగానీ, మరొకరి మీదగానీ అనవసరమైన ఆరోపణలు చేయలేదు. తెలిసీ తెలియకుండా ఆరోపణలు చేయడం ధర్మం కాదని అన్ని విషయాలు తెలిసిన తర్వాతే మాట్లాడాలని సంయమనం పాటించి మౌనంగా ఉన్నాను. ప్రథమ చికిత్స చేసిన తర్వాత అందరి ముందే చొక్కా మార్చుకుని ఒక్క మాట మాట్లాడకుండా హైదరాబాద్‌కు వచ్చి నేరుగా ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకున్నా. దాన్ని కూడా ఏ రకంగా చిత్రీకరించారంటే అన్యాయంగా మాట్లాడారు. అసలు దీని వెనుక ఎవరున్నారు? కత్తి ఎయిర్‌పోర్టులోకి ఎలా రాగలిగింది? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న పోలీసుల చేత విచారణ జరిపిస్తే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? బాబు, పవన్‌లు ముసుగు తీసి కలిసి రండి.. సాక్షి : మరి ఆయన (మోదీ) నిస్సహాయతను ఏమనుకోవాలి? జగన్‌ : ఇక్కడ ఎన్ని స్కామ్‌లు చేసినా, కుంభకోణాలు చేసినా మోదీ మాత్రం మన చంద్రబాబే కదా? పోనీలే అనుకుంటూ వదిలేసిన పరిస్థితులూ కనిపిస్తున్నాయి. సాక్షి : తాను, పవన్‌ కళ్యాణ్‌ కలిస్తే జగన్‌కు ఎందుకు బాధ అని చంద్రబాబు అంటున్నారు.. జగన్‌ : నాకెక్కడ బాధండీ. నాకసలు బాధ లేదు. నేను వాళ్లను కలవమనే చెబుతున్నాను. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట. ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు? ఇంతకు ముందు కలిసి మీరు పోటీ చేశారు. ఇప్పుడు విడిపోయినట్లు నటించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఎందుకు ప్రజలను మోసం చేస్తారు? ముసుగు తీసేసి కలిసికట్టుగా రండయ్యా.. నాకు భయం లేదు. నాకు ప్రజల మీద నమ్మకం ఉంది. ఇవ్వాళ కూడా నేను ఒక్కడినే పోటీ చేస్తానని చెబుతున్నా. మీరందరూ మళ్లీ కలిసి రండయ్యా అని చెబుతున్నా. పొత్తులు ఏమీ ఉండవని చెబుతున్నా. అసెంబ్లీలో రాజ్యాంగానికి ఏకంగా తూట్లు పొడుస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను ఏకంగా మంత్రులను చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము మళ్లీ శాసనసభలోకి ప్రవేశిస్తే దాన్ని కూడా అంగీకరించినట్టే అవుతుంది. అధికార పార్టీ ఈ మాదిరిగా చేసినా కూడా ఆమోదయోగ్యనీయమే అనే స్థాయికి ప్రజాస్వామ్యం వెళ్లిపోతుంది. అందువల్ల దీనికి ఎక్కడో చోట పుల్‌స్టాప్‌ పెట్టాలి. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి. అప్పుడే ఇటువంటి అప్రజాస్వామిక పరిస్థితుల నుంచి మంచి పరిస్థితులు వస్తాయి. అందుకే ఏకంగా ప్రజల వద్దకే వెళ్లి ఈ విషయం చెబుదాం అని పాదయాత్రకు శ్రీకారం చుట్టాం. జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెబుతూ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా నేషనల్‌ మీడియా కూడా దీనిపై దృష్టి సారించేలా చేశాం. – వైఎస్‌ జగన్‌ తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
మునుగోడు బై పోల్‌లో చిత్రవిచిత్రాలు జరిగాయి. నోట్లు నాట్యమాడాయి. మద్యం ఏరులై పారింది. ఓటర్ల ఆశల్ని ఆమాంతం పెంచేశారు. ఎక్స్‌పెక్టేషన్స్ సెన్సెక్స్‌లా మార్చేశారు.తులం బంగారమంటూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ టీజర్ వదిలారు. బొమ్మ పడే టైమ్‌కి బోర్డు తిప్పేశారు. ఇంకేముంది ఆశించిభగపడ్డ కొందరు ఓటర్లు ధర్నాకు దిగారు. తులం బంగారం లేదా డబ్బులు ఇస్తేనే ఓటేసేస్తామని తెగేసి చెప్పారు. అంతేకాదు ఓ ఊర్లో ధర్నాకు దిగారు. నాయకుల ఇళ్ల ముందు రచ్చ రచ్చ చేశారు. మైండ్ సెట్ మారింది… బై పోల్ పుణ్యమా అని తెలంగాణలో ఓటర్ మైండ్ సెట్ మారింది. లేదు లేదు బలవంతంగా పార్టీలు మార్చేశాయి. బై పోల్ అంటే ఇవ్వు రాజా ఇవ్వు. పోటీపడి మరి అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారు. హుజూరాబాద్ నుంచి ఈ విష సంస్కృతికి బీజం వేశారు. అక్కడ నుంచి మొదలైన ప్రలోభాలపర్వం మునుగోడులో ముదిరింది. ఓటుకోసం ఎంతైనా ఇస్తాం..మా అభ్యర్థిని గెలిపిస్తే చాలు.. అని ప్రధాన పార్టీలు ప్రచారం చేశాయి. అంతకుమించి ఖర్చుచేశాయి. తులం బంగారమంటూ ప్రత్యర్థి పార్టీపైకి సోషల్ మీడియాలో ఫేక్ అస్త్రాల్ని సంధించారు. తులం తెచ్చిన తంటా సరిగ్గా ఇక్కడే ఓ పార్టీ విసిరిన బాణం మరో పార్టీకి గట్టిగా గుచ్చుకుందట. పోలింగ్ ముందు ఏం చేయలేక ఆ పార్టీ చేతులెత్తేసిందట. ఇంకేముంది భంగపడిన ఓటర్లు ధర్నాకు దిగారు. తులం బంగారం ఇఛ్చి తీరాల్సిందేనని భీష్మించుకూర్చున్నారు. రూ.3వేలు కాదు తులం బంగారం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. లేదంటే ఓటు వేయబోమని తెగేసి చెప్పారు. అసలేం జరిగిందంటే…. గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఓటింగ్‌ని బాయ్ కాట్ చేశారు. నేతలు డబ్బులు పంచుతామని చెప్పి ఇవ్వలేదని మండిపడ్డారు. డబ్బులు తెచ్చుకొని నేతలు ఇంట్లో దాచుకున్నారని ఆరోపించారు. తులం బంగారం, డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటున్నారు. పక్క గ్రామాల్లో డబ్బులు పంచారు. మేము ఏమి అన్యాయం చేశామంటూ.. దూర ప్రాంతాల నుంచి వచ్చామని.. కానీ పైసాలు ఇవ్వలేదని చెబుతున్నారు. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని ఓటర్లు తేల్చిచెప్పారు. ఇది దేనికి సంకేతం మునుగోడు మాయలో హక్కుని అమ్ముకుంటున్నామని కొందరు ఓటర్లు మర్చిపోయారు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదం పడేస్తున్నామన్న సోయి లేకుండాపోయింది..వాళ్లు ఇస్తున్నారు..మేం తీసుకుంటున్నాం..అంతా వాళ్లదే తప్పు అని లాజిక్కులెత్తుకుంటున్నారు.ఇక్కడ పార్టీలది మొదటి తప్పు. డబ్బులు ఆశ చూపకపోతే వాళ్లు ఎందుకు అడుగుతారు. నచ్చిన అభ్యర్థికి ఓటేయండి…మేం డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదు.ఇలా చెప్పే దమ్ము, ధైర్యం ఏ పార్టీకి లేదు. అందుకే ఓటు అంగట్లో అమ్మకానికి పెట్టారు.భవిష్యత్‌లో ఉపఎన్నికలంటే భయపడేలా చేశారు.
Telugu News » World » Global indians » Indo Arab Confederation Council NRI Global meet on Dec 4 at Bangalore Non Resident Indians: ప్రవాస భారతీయుల సంక్షేమమే లక్ష్యంగా ‘ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్‌ మీట్‌’.. సమావేశం ఎప్పుడంటే.. ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 'ఇండో- అరబ్ కాన్ఫెడరేషన్‌ కౌన్సిల్‌ (IACC)' డిసెంబర్‌ 4న బెంగళూరులో సమావేశం కానుంది.. Basha Shek | Nov 12, 2021 | 3:09 PM ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ఇండో- అరబ్ కాన్ఫెడరేషన్‌ కౌన్సిల్‌ (IACC)’ డిసెంబర్‌ 4న బెంగళూరులో సమావేశం కానుంది. ‘ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్‌ మీట్‌’ పేరుతో జరిగే ఈ సమావేవాన్ని గోవా గవర్నర్‌ పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై ప్రారంభించనున్నారు. కేంద్రమంత్రి రామ్‌థాస్‌ అథవాలే అధ్యక్షత వహించనున్నారు. వివిధ రాష్ట్రాల మంత్రులు, దౌత్యవేత్తలు, విదేశాల్లో స్థిరపడిన భారతీయ పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 1980లో కేరళలోని కోజికోడ్‌ కేంద్రంగా ఏర్పాటైన IACC అసోసియేషన్‌ ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. 2014 ఛారిటబుల్‌ ట్రస్ట్‌గా మారిన ఈ అసోసియేషన్‌కు దిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటు అమెరికా, బ్రిటన్‌, అరబ్‌ దేశాల్లో శాఖలున్నాయి. ఎన్‌ఆర్‌ఐలను ప్రోత్సహించేలా… ఈ సందర్భంగా కౌన్సిల్‌ ప్రధాన కార్యదర్శి అట్టక్కోయ పల్లిక్కండి బెంగళూరులో జరిగే ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్‌ మీట్‌ వివరాలను వెల్లడించారు. ‘ కరోనా ప్రభావంతో IACC అసోసియేషన్‌ సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ఎట్టకేలకు వచ్చే నెలలో ఎన్‌ఆర్‌ఐ మీట్‌ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు కనుగొనడంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఇండియాకు తిరిగొచ్చిన ఎన్‌ఆర్‌ఐలకు గృహనిర్మాణాలు, పునరావాసం కల్పించడంపై కార్యాచరణ ప్రకటిస్తాం. అదేవిధంగా భారత ప్రభుత్వం ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తాం. దీంతో పాటు వివిధ రంగాల్లో సృజనాత్మకతను చాటుకుంటోన్న ఎన్‌ఆర్‌ఐలను ఘనంగా సన్మానిస్తాం’ అని పల్లిక్కండి తెలిపారు. Also read: NRI: ప్రవాస భారతీయులకు గుడ్‌ న్యూస్‌.. ఆన్‌లైన్‌లో సులభంగా డీమ్యాట్‌ అకౌంట్‌ సేవలు.. పూర్తి వివరాలు..
ఈ రోజు రజనీకాంత్ సినిమా ‘కాలా’ విడుదల అయింది. ఈ సినిమాలో ఎంతో మంది మంచి నటులు ఉన్నారు. ముంబై మురికివాడ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో డాన్ గా రజనీకాంత్,రాజకీయ నాయకుడు,విలన్ గా నానాపటేకర్ నటించారు. చాలా కాలం తరవాత తెలుగు అమ్మాయి ఈశ్వరి రావు రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఆమె చూపిన నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. రజనితో సమానంగా నటించిన ఈశ్వరి రావు తెలుగు అమ్మాయి అని చాలా మందికి తెలియదు. ఈశ్వరి రావు అసలు పేరు వైజయంతి. ఆమె స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం. సినిమాల మీద ఆసక్తితో చెన్నై వెళ్లగా 1990 లో ఒక తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. Actress Eswari Rao Pics @ A AA Audio Release అయితే ఆ సినిమా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా విడుదల కాలేదు. దాంతో అడపా దడపా చిన్న చిన్న పాత్రలను చేస్తున్న ఈశ్వరి రావు 1997 లో చేసిన తమిళ సినిమా రామన్ అబ్దుల్లా సినిమా ద్వారా హీరోయిన్ గా స్థిరపడింది. ఈశ్వరి రావు బాగా సెలక్ట్ చేసుకొని హీరోయిన్ గా మాత్రమే యాక్ట్ చేస్తూ ఉంది. 1998 లో మనోజ్ కుమార్ హీరోగా వచ్చిన గురు పారవర్ సినిమాలో నటించి మంచి పేరు సంపాదించింది. ఖుషూబు,ప్రకాష్ రాజ్ తదితరులతో భారతీరాజా తీసిన సినిమా నెపోలియన్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గటంతో టీవీ సీరియల్స్ మీద దృష్టి సారించింది. తెలుగు,తమిళంలో చాలా సీరియల్స్ లో కీలకమైన పాత్రలను పోషించింది. ఇప్పుడు చాలా కాలం తరువాత రజనీకాంత్ సినిమా కాలా లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కాలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రజనీకాంత్ హీరోయిన్ తెలుగు అమ్మాయి అని చెప్పటంతో ఆ అమ్మాయి ఎవరా అని అరా తీయటం మొదలు పెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ పెద్దాపురం అమ్మాయని తెలిసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక‘నిన్నే పెళ్లాడుతా’ సీరియల్‌లో నటించేటప్పుడు ఈశ్వరీరావు ఎల్‌.రాజాతో పరిచయం అయ్యింది. ఆ సీరియల్‌కు ఆయనే దర్శకులు. ఆయన ప్రవర్తన, మంచితనం ఈశ్వరీరావుని ఆకట్టుకున్నాయి. బాధ్యతగల మనిషి అనుకుంది. ఆయన మంచితనం చూసి ఇంట్లో వాళ్లు కూడా ఓకే చేయడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈశ్వరీరావుకు ఇద్దరు పిల్లలు. నివేదిత (9), రిషబ్‌రాజా (5). ఈశ్వరీరావు ఎల్‌ రాజాకు కూడా భార్య అంటే ప్రాణం.
భారత్ మరియు రష్యా సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి ఇది ప్రపంచంలోనే అత్యధిక వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీనికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కి చేరవేస్తున్న గూడచారిని అధికారులు అరెస్టు చేసారు. నాగ్ పూర్ లోని డీఆర్డీవోలో ఉన్న ‘బ్రహ్మోస్ క్షిపణి’ పరిశోధనా కేంద్రం లో నిశాంత్ అగర్వాల్ గత నాలుగు సంవత్సరాలుగా ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు ఈ నేపధ్యంలో బ్రహ్మోస్ క్షిపణికి సబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ తో పాటు మరికొన్ని దేశాలకు నిశాంత్ చేరవేసినట్లు భారత నిఘా వర్ఘాలు గుర్తించి నిశాంత్ అగర్వాల్ ను అదుపులోకి తీసుకున్నారు. భారత మిసైల్ సిస్టమ్ కు చెందిన కీలకమైన సాంకేతిక సమాచారాన్ని నిశాంత్ అగర్వాల్ సేకరించి ఐఎస్ఐకి లీక్ చేస్తున్నట్లు అదికారులు గుర్తించారు. దేశ రక్షణ వ్యవస్థలో కీలకంగా భావించే బ్రహ్మోస్ సాంకేతిక సమాచారాన్ని నిషాంత్ ఏమేరకు ఐఎస్ఐ కి చేరవేసాడనే దానిపై అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో మరో ఏజన్సీ పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. నిషాంత్ అగర్వాల్ పాకిస్థాన్ కు చెందిన కొందరు వ్యక్తులతో ఫేస్ బుక్ ద్వారా మాట్లాడుతున్నట్లు గుర్తించారు. నిందితుడిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అదికారులు పేర్కొన్నారు. రెండు నెలలక్రితం వివాహం చేసుకున్న నిశాంత్ వార్ధా రోడ్డులో అద్దె ఇంటిలో ఉంటున్నాడు. దీనిపై ఇంటి యజమాని మాట్లాడుతూ నిశాంత్ దాదాపు సంవత్సర కాలంగా ఇక్కడే అద్దెకు ఉంటున్నాడని, ఆధార్ కార్డుతో పాటు డీఆర్డీవో ఇచ్చిన కార్డు సంమర్పించాడన్నారు. క్షిపణి పనితీరు మామూలు క్షిపణుల కంటే ఇది మూడు రెట్ల అధిక వేగంతో గాలిలో ద్వనివేగం కంటే అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 290 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ద్వని వేగం కంటే మూడు రెట్ల వేగంతో కచ్చితమైన ఏక్యూరేసీతో లక్ష్యాన్ని చేదిస్తుంది. ప్రపంచంలోనే ఏకైక తొలి సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ దీనిని యుద్ద విమానం, నౌక, సబ్మేరైన్ నుంచి లేదా నేలపై నుంచి కూడా దీనిని ప్రయోగించవచ్చు. ఇది తక్కువ ఎత్తులో శత్రు క్షిపణులను చేదిస్తుంది కావున దీనిని శత్రు రాడార్ వ్యవస్థ పసిగట్టలేవు. బ్రహ్మోస్ క్షిపణి కొండ ప్రాంతాలలో ఉండే శత్రువుల బంకర్లను మరియు శత్రువుల క్షిపణులను కచ్చితత్వంతో చేదిస్తుంది.
ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు మూడు నెలలుగా అంటే 110 రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం లేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గణనీయంగా పెరుగుతున్నా, మన దేశంలో పెట్రో ధరలు పెరగకపోవడానికి గల కారణం ఎన్నికలేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రష్యా – ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మరింతగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ ముడిచమురు ధర 99.38డాలర్లకు చేరింది. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా పెట్రో ధరలు ఎన్నికల అనంతరం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. కనీసం లీటర్ కు రూ 10 చొప్పున పెరగవచ్చని భావిస్తున్నారు. ప్రపంచ చమురు ఉత్పత్తిలో 10 శాతానికి పైగా వాటా రష్యాదే. అంతేగాక ఐరోపా దేశాలకు సహజవాయు అవసరాలను మూడో వంతు రష్యానే తీరుస్తోంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఐరోపా దేశాలకు రష్యా చమురు సరఫరా చేయడం అసాధ్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే రష్యా నుంచి ఐరోపా దేశాలకు గ్యాస్‌ సరఫరా చేసే పైప్‌లైన్లు ఉక్రెయిన్‌ గుండా వెళతాయి. అంతటి కీలకస్థావరంగా ఉన్న ఉక్రెయిన్‌ను ఇప్పుడు యుద్ధ మేఘాలు అలుముకొనడంతో చమురు సరఫరాకు ఆటకం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా – ఉక్రెయిన్‌ల్లో నెలకొన్న సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. గతేడాది క్రూడాయిల్‌ ధరలను పరిశీలిస్తే.. 2021 అక్టోబరులో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌ 86.40 డాలర్లకు చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2021 నవంబరు 5 నాటికి 82.74 డాలర్లకు, డిసెంబరు నాటికి 68.87 డాలర్లకు దిగింది. ఇలా ధరలు తగ్గడంతోపాటు, ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉండడంతో మన చమురు కంపెనీలు ధరల పెరుగుదలను నిలిపివేశాయి. కానీ, ఉక్రెయిన్‌ సంక్షోభంతో ముడిచమురు ధర మళ్లీ పెరుగుతూ వచ్చింది. ఒక్క ఫిబ్రవరిలోనే 12 శాతం మేర పెరిగింది. ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్‌ ధరలు పెరగకపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కర్ణాటక ఎన్నికల సమయంలో కూడా అంతర్జాతీయ ధర పెరిగినా, మన దేశంలో 19 రోజులపాటు పెట్రోల్‌ ధర పెరగలేదు. ఎన్నికలు అయిన తర్వాత వరుసగా 16 రోజులపాటు పెట్రో ధర పెరుగుతూనే వచ్చింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఆరు వారల పాటు ధరలు పెరగలేదు. అలాగే 2017లో గుజరాత్‌ ఎన్నికల సమయంలో 14 రోజులపాటు పెట్రో ధర పెరగలేదు. ఆ తర్వాత ధరలు పెరిగాయి. అలాగే 2017 జనవరి 16 నుంచి ఏప్రిల్‌ 1 దాకా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా అప్పుడు కూడా ప్రభుత్వం పెట్రో ధరలను పెంచలేదు. 2019లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా చమురు కంపెనీలు రేట్లను పెంచలేదు. అయితే అన్నిరోజుపాటు ధర పెరగకుండా అలా పట్టి ఉంచినా.. పోలింగ్‌ మరుసటి రోజు నుంచే పెంచడం ప్రారంభించారు. రష్యా నుంచి మన దేశం దిగుమతి చేసుకునే చమురు శాతం 1 శాతానికి తక్కువే ఉంది. అయితే రష్యా – ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం చూపనుందని, అవి మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అవకాశముందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ద్రవ్య స్థిరత్వ అభివృద్ధి మండలి సమావేశంలోనూ చమురు ధరలపై చర్చించినట్లు ఆమె తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల పూర్తయిన తర్వాత లీటర్‌ పెట్రోల్‌ ధర ఎనిమిది నుండి పది రూపాయలు పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరించారు.
బెల్లంకొండ గణేష్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ `స్వాతిముత్యం`. ఈ సినిమా దసరాకి విడుదలై ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. అందుకే డేట్ ఫిక్స్ అయ్యింది. Aithagoni Raju First Published Oct 19, 2022, 12:30 PM IST నిర్మాత బెల్లంకొండ సురేష్‌ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్‌ హీరోగా పరిచయం అవుతూ నటించిన చిత్రం `స్వాతిముత్యం`. దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ క్లాసిక్ మూవీ `స్వాతిముత్యం` పేరుతో వస్తున్న చిత్రం కావడంతో అంతా అటెన్షన్‌ నెలకొంది. ఇందులో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించగా, సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కింది. దసరా కానుకగా ఈ సినిమా విడుదలైంది. మంచి ఆదరణ పొందింది. రెండు పెద్ద సినిమాలు (గాడ్ ఫాదర్‌, ది ఘోస్ట్)ల మధ్య విడుదలై ఫర్వాలేదనిపించుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రాబోతుంది. ఈ నెల 28న `ఆహా`లో `స్వాతిముత్యం` స్ట్రీమింగ్‌ కానుందని యూనిట్ వెల్లడించింది. అయితే ఇటీవల ఫిల్మ్ ఛాంబర్‌లో ఒక సినిమా విడుదలయ్యాక పది వారాలు(రెండు నెలలు) తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనే నిబంధన పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం కేవలం మూడు వారాల గ్యాప్‌లోనే రిలీజ్‌ కాబోతుండటం విశేషం. చిన్న సినిమా కావడం, వెంటనే థియేటర్ల నుంచి వాష్‌ ఔట్‌ కావడంతో ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నట్టు టాక్‌. ఈ సినిమా స్మెర్మ్ డొనేషన్‌ నేపథ్యంలో రూపొందిన విషయం తెలిసిందే. స్పెర్మ్‌ డొనేషన్‌ అనే కథని అంతర్లీనంగా చెబుతూ, మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు లక్ష్మణ్‌ కె కృష్ణ. స్వాతిముత్యం లాంటి ఓ యువకుడి కథతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో అతని జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాల నడుమ జీవిత ప్రయాణం ఎలా సాగిందనేది ఈ చిత్ర కథ. అక్టోబర్‌ 5న సినిమాకి మంచి టాక్ వచ్చినా, ఆశించిన స్థాయిలో కలెక్షన్లు లేకపోవడం విచారకరం.
మాధవ వరం అనే ఒక ఊరిలో సోము -భాగ్య దంపతులకి వరుణ్ ఒక్కగానొక్క బిడ్డ . ఆ ఊరికి ఉత్తరాన ఒక పెద్ద పర్వతం వుంది. ఆ పర్వతంపైకి సాయంత్రం ఆరుదాటితే ఎవరూ వెళ్ళరు . ఎవరైనా వెళ్ళితే తిరిగిరాని ఇంకా ఏవేవో కథలు ప్రచారంలో వున్నాయి . ఇక వరుణ్ ఎంత బాగా చదువుతాడో అలానే చాలా అల్లరి వాడు కూడా . వరుణ్ కి వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం . వాళ్ళ అమ్మ కోసం ఏమైనా చేస్తాడు . అది వర్షా కాలం వరుణ్ వాళ్ళ అమ్మ స్కూల్ వరుణ్ నుంచి రాగానే బయటకి వెళ్ళొదు వర్షం పడేలా వుంది తడిస్తే నీకు బాగా జలుబు చేస్తుంది . దాని వల్ల ఊపిరి ఆడక చాలా ఇబ్బంది పడతావ్ అని చెప్పింది. కానీ వరుణ్ వాళ్ళ అమ్మ మాట పెడచెవిన పెట్టి ఆడుకోవటానికి బయటకి వెళ్లి దగ్గుతూ ఇంటికి వచ్చిన కొడుకుని చూసి అమ్మ కోపంతో బాగా కొట్టేసింది. వరుణ్ ఏడ్చుకుంటూ రూంలోకి వెళ్ళిపోయాడు . అమ్మ తన పిల్లల్ని కొట్టేది వాళ్ళ మంచి కోసమే. భాగ్య తరువాత వరుణ్ తల తుడిచి పాలు ఇచ్చింది. వరుణ్ కి జలుబు చేసి బాగా దగ్గుతూ ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడతాడు అని అమ్మ మనసుకి తెలుసు. రాత్రంతా నిద్రపోకుండా మేలుకొని మందు వరుణ్ ఛాతీ భాగంపై రాస్తూ మధ్యలో ఆయుర్వేద కాషాయం తాగిస్తూ వుంది . వరుణ్ తన పడుతున్న బాధ పగ వాడు కూడా పడకూడదు అనుకోని (దగ్గు , ఊపిరి అందక తను పడే బాధను గుర్తుతెచ్చుకుంటూ ) అలానే తన అమ్మ సేవ చూస్తూ అనుకున్నాడు. వరుణ్ కి ఉదయానికి తగ్గింది. లేచి వాళ్ళ అమ్మకి సారీ చెప్పాడు. స్కూల్ వెళ్లే టప్పుడు వాళ్ళ నాన్న మాటల ద్వారా రేపు వాళ్ళ అమ్మ పుట్టినరోజు అని తెలుసుకున్నాడు. స్కూల్ నుంచి రాగానే అమ్మతో టీవీ చూస్తున్నపుడు వాళ్ళ అమ్మకి సప్త వర్ణ గులాబీ అంటే ఇష్టమని తెలుసుకుంటాడు . కానీ అది చాలా అరుదైన పువ్వు. వరుణ్ ఎలా అయినా వాళ్ళ అమ్మకి సప్త వర్ణ గులాబీ పుట్టినరోజు కానుకగా ఇవ్వాలని అనుకుంటాడు . అదే ఆలోచనతో స్కూల్ కి వెళ్లిన తనకి యాధృచ్చికంగా వరుణ్ సైన్స్ మాస్టర్ ఆ గులాబీ గురించి చెప్తాడు అది ఊరికి ఉత్తరాన వున్న కొండపైన వున్నది అని సమాచారం ఇస్తాడు . అలానే అక్కడికి వెళ్ళినవాళ్ళు ఎవరు తిరిగిరాలేదు అని కూడా సైన్స్ మాస్టర్ చెప్తాడు. (ముఖ్యంగా ఆ సాయంత్రం ఆరు సంగతి ) కానీ వరుణ్ ఎలా అయినా వాళ్ళ అమ్మకి ఈ రోజు పుట్టినరోజు కానుక ఇవ్వాలని నిశ్చయంచి కొని ఇంటర్వెల్ నుండి ఒంట్లో బాలేదు అని అబద్దం చెప్పి ఆ పర్వతం పైన వున్న సప్త వర్ణ గులాబీ తేవాలని బయలు దేరాడు. వరుణ్ కొంచెం సంకోచించిన ఆ ఆరు సంగతి గుర్తొచ్చి కానీ తాను అప్ప టికల్లా తిరిగొస్తాను అనే నమ్మక్కంతో బయలు దేరాడు . అందం, అపాయం రెండు పక్కపక్కనే ఉంటాయి. వరుణ్ కొండెక్కు క్రమంలో ప్రకృతి సోయగాన్ని చూస్తూ తననుతానే మర్చిపోయాడు . తనకి అలసటే తెలియలేదు కొండ పైకి ఎక్కేసాడు రంగు రంగుల తూనీగలను , సీతాకోకచిలకలను , కమ్మని కోయిలమ్మ పాటను మధ్యలో నెమలమ్మల నాట్యాన్ని చూస్తూ . సీతాకోకచిలుకలైతే పింక్ చీర కట్టుకొని ఉన్నటు వున్నాయి అంతేకాదు ఆ చీరపైనా నల్లని గుండ్రాటి చిన్న చుక్కలు . ఈ పింక్ రంగు సీతాకోకచిలకల సమూహంగా ఒక అలలా ఎగురుతూ వరుణ్ ని సప్త వర్ణ గులాబీ వుండే తోట కి తీసుకు వెళ్లాయి . అప్పటికి సమయం 6 అయ్యింది . ఆ తోట ని కావలి కాచే పిల్ల దయ్యం ఎవరు నువ్వు అని వరుణ్ ని తన వింత అరుపులతో , నవ్వులతో భయపెడుతూ ప్రశ్నించింది . భయంతో వణుకుతూ వరుణ్ ఆంజనేయ దండకాన్ని మనసులో స్మరించుకుంటూ నువ్వు ఎవరు అని అడిగాడు పిల్ల దయ్యాన్ని. అప్పుడు పిల్ల దైయ్యం ప్రత్యక్షమైంది . దాని రూపం చూడటానికి కోతి ముఖంతో రెండు కొమ్ములు కలిగి వుంది , దానికి కాళ్ళు లెవ్వు గాల్లో తేలుతూ వుంది . ఎవరివి నువ్వు ఎందుకు వచ్చావ్ అని వరుణ్ అడిగింది . అపుడు వరుణ్ తను వాళ్ళ అమ్మకి సప్త వర్ణ గులాబి పుట్టినరోజు కానుకగా ఇవ్వటానికి వచ్చాను అని చెప్పాడు. అప్పుడు పిల్ల దైయ్యం నేను నిన్ను రెండు ప్రశ్నలు అడుగుతాను నువ్వు సమాధానం చెప్తే కరెక్టుగా గులాబి ఇస్తా లేదా నిన్ను తినేస్తా అని హెచ్చరించింది . వరుణ్ సరే అన్నాడు .. పిల్ల దైయ్యం : అన్నింటికన్నా వేగంమైనది ఏది ? వరుణ్ : మనసు . (అది ప్రతీచోటకి వెళ్లకలదు వేగంగా.. ) పిల దైయ్యం : విలుకట్టలేనిది ఈ విశ్వంలో వరుణ్ : తల్లి ప్రేమ ( చాల నిస్వార్ధమైనది .. కోప్పడ్డా ఏమి చేసిన మన మంచి కోసమే అని చెప్పి వాళ్ళ అమ్మ తనకి చేసిన సేవ తనని ఎలా ప్రేమిస్తుందో అని చెప్తాడు ) పిల్ల ధైయం వరుణ్ మాటలకి సంతోషించి తను చేసిన తప్పు వాళ్ళ అమ్మ విషయంలో తెలుసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది . వరుణ్ సప్త వర్ణ గులాబీ తీసుకొని ఇంటికి బయలు దేరుతాడు . పిల్ల దైయ్యం వాళ్ళ అమ్మకి సారీ చెప్పి జరిగినదంతా చెప్తుంది . అప్పుడు వెంటనే తల్లి,పిల్ల దయ్యాలు వరుణ్ దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెప్పి తమ భుజాల పైన ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్తాయి . వరుణ్ జరిగినదంతా వాళ్ళ అమ్మ కి చెప్తాడు. తరువాత తల్లి , పిల్ల దయ్యాల్ని పరిచయం చేశాడు . మొదట భయ పడిన వాటి మంచితనానికి ఆమె కూడా వాటిని కుటుంబ సభ్యులుగా ఆదరించడం మొదలు పెట్టింది . వాటి మ్యాజిక్ తో అవి వరుణ్ వాళ్ళ అమ్మకి అన్ని పనుల్లో సహాయం చేస్తుండేవి . వరుణ్ వాళ్ళ అమ్మ , వరుణ్ ఈ విషయాన్ని వాళ్ళ నాన్నకి కూడా చెప్పకుండా ఒక రహస్యంగా ఉంచారు ఆ తల్లి , పిల్ల దయ్యాల మంచి కోసం .. వరుణ్ ఈ విధంగా వాళ్ళ అమ్మకి మర్చిపోలేని పుట్టినరోజు కానుక ఇచ్చాడు . అలానే అమ్మ ప్రేమ గొప్పతనం చెప్పి విడిపోయిన దైయ్యం వాటి పిల్లని కలిపి ఎవరికైనా తల్లి ప్రేమ గొప్పది అని .
“The sole purpose of the Constitution is to unite people of the country”, said Indresh Kumar Ji, national executive member of the Rashtriya Swayamsevak Sangh. On Nov 26, Samajika Samarasatha Vedika, Muslim Rashtriya Manch, and SC/ST Rights Forum organized an event commemorating the National Constitution Day at the Zakir Hussain Auditorium of Hyderabad Central University. […] Bharat has to be strong for Vishwa Kalyaan: Sarsanghchalak Mohan Bhagwat Ji Sarsanghchalak of Rashtriya Swayamsevak Sangh (RSS) Dr. Mohan Bhagwat said that India will have to become powerful for the welfare of the world. Till now the superpowers have only run their stick on on the world. These superpowers have been running their own system for their own benefit. Once upon a time, Britain used to […] కేరళ : మదర్సాలలో మైన‌ర్ బాల‌బాలిక‌లపై లైంగిక వేధింపులు… పెరుగుతున్న‌ పోక్సో కేసులు గత కొన్ని రోజులుగా కేర‌ళ రాష్ట్రం నలుమూలల నుండి అనేక పోక్సో (లైంగిక నేరాల నుండి బాలల రక్షణ) చట్టం కేసులు నమోదయ్యాయి. ఎడక్కాడ్‌లో మైన‌ర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మదర్సా మతాధికారిని కోజికోడ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కన్నూర్‌కు చెందిన షంషీర్ రిమాండ్‌కు తరలించారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని షంషీర్ బాధితురాలిని బెదిరించినట్లు సమాచారం. అయినప్పటికీ మైనర్ తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వ‌డంతో నిందితున్ని అరెస్టు చేశారు. మరికొంత మంది […] VIDEO: సైన్స్ ప్రపంచంలో భారత కీర్తి పతాక డా. జ‌గ‌దీష్ చంద్ర‌బోస్‌ ప్రపంచానికి మిల్లీమీటర్ తరంగాలు, రేడియో, క్రెస్కోగ్రాఫ్ ప్లాంట్ సైన్స్ అందించిన శాస్త్రవేత్తగా జగదీష్ చంద్ర బోస్ పేరుగడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక అంతర్జాతీయ పురస్కరాలను బోస్ అందుకున్నారు. అంతర్జాతీయ పరిశోధనా రంగంలో భారతీయ కీర్తి పతాకను ఎగురవేశారు. అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన భారతీయ పరిశోధక శాస్త్రవేత్తగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. The post VIDEO: సైన్స్ ప్రపంచంలో భారత కీర్తి పతాక డా. జ‌గ‌దీష్ చంద్ర‌బోస్‌ appeared first on VSK Telangana. విజ్ఞానశాస్త్రానికీ, విశ్వాసానికీ దూరమెంత? నవంబర్‌ 30 ‌- జగదీశ్‌ ‌చంద్రబోస్‌ ‌జయంతి ‘రాత్రివేళ మొక్కలని బాధ పెట్టకూడదు. అవి నిద్రపోతాయి.’ ఎందుకో మరి, ఒకరాత్రి పూట ఆ పిల్లవాడు పువ్వు తెంపడానికి ఒక మొక్కవైపు చేయి చాపినప్పుడు అతడి తల్లి అలా మందలించింది. ఆ బాలుడే జగదీశ్‌ ‌చంద్ర బోస్‌ (‌జేసీ బోస్‌), ‌మందలించిన ఆ మహిళ బామాసుందరీ బోస్‌. అతని కన్నతల్లి. ఇదేమాట ఎన్నో తరాలలో ఎందరో తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు ఎందరో పిల్లలకు చెప్పారు కూడా. కొందరు పిల్లలు […] ఆధునిక మహర్షి జగదీశ్‌ చంద్రబోస్ నవంబర్‌ 30 జగదీష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా బ్రిటీష్‌ ఇండియా బెంగాల్‌ ప్రావిన్స్‌లోని మున్షీగంజ్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) లో 1858 నవంబరు 30వ తేదీన జగదీశ్‌ చంద్రబోస్‌ జన్మించాడు. అతని తండ్రి భగవాన్‌ చంద్రబోస్‌ బ్రహ్మసమాజీ. ఇతను డిప్యూటి మెజిస్ట్రేట్‌, సహాయ కమిషనరుగా ఫరీద్‌పూర్‌, బర్దమాన్‌ వంటి పలుచోట్ల పనిచేశారు. జగదీశ్‌ చంద్రబోస్‌ ప్రాథమిక విద్యభ్యాసం బంగలా భాషలో, స్వదేశీ స్కూల్లో ప్రారంభమైంది. ఆ రోజుల్లో ధనవంతులకు ఆంగ్ల విద్య మీద మోజు ఉన్నా జగదీశ్‌ […] ఢిల్లీలో ఇమామ్‌లకు వేతనాలు… రాజ్యాంగ ఉల్లంఘనే – కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్‌ ఢిల్లీలోని మసీదులలో ఇమామ్‌లు, ముస్లిం మతపెద్దలకు వేతనాన్ని అనుమతిస్తూ 1993 సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పన్ను చెల్లింపుదారుల డబ్బును ఏదైనా ప్రత్యేక మతానికి అనుకూలంగా ఉపయోగించరాదని పేర్కొన్న రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్ ఉదయ్ మహుర్కర్ అన్నారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ పిటిషన్ ఆధారంగా, 1993లో సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డు నిర్వహించే మసీదుల్లోని ఇమామ్‌లకు వేతనం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మసీదుల ఇమామ్‌లకు […] చైనాలో ప్ర‌జ‌ల ఆగ్ర‌హం… COVID లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు ప్ర‌మాదంలోనూ నిబంధ‌న‌లు స‌డ‌లించ‌ని వైనం ప‌త్రికా స్వేచ్చకు భంగం చైనా పశ్చిమ జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో కోవిడ్ లాక్‌డౌన్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చెలరేగాయి. చైనా దేశవ్యాప్తంగా అంటువ్యాధులు రికార్డును స్థాయిలో న‌మోదవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఆగ‌స్టు నుంచి లాక్‌డౌన్ విధించారు. అయితే ఇటీవ‌ల ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించడం ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి కార‌ణమ‌యింది. ఒక‌వైపు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు, మ‌రో వైపు అగ్నిప్ర‌మాదంలో ప్ర‌జ‌లు చిక్కుకుపోయారు. దీంతో లాక్‌డౌన్ ఎత్తివేయాల‌ని ఆందోళ‌న చేశారు. నవంబర్ 25 శుక్రవారం రాత్రి […] మార్గదర్శి బాలాసాహెబ్‌ దేవరస్‌ 28 నవంబర్ (మార్గశిర‌ శుక్ల పంచమి, 1915) – బాలాసాహెబ్‌ దేవరస్ జ‌యంతి రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి మూడవ సర్‌సంఘచాలక్‌గా నేతృత్వం వహించిన బాలాసాహెబ్‌ దేవరస్‌ది విశిష్ఠ వ్యక్తిత్వం. బాలాసాహెబ్‌ అసలు పేరు మధుకర్‌ దత్తాత్రేయ దేవరస్‌. మధుకర్‌, అతని తమ్ముడు భావురావు దేవరస్‌ ఇద్దరూ 1929లో తమ 12వ యేటనే బాల స్వయంసేవకులుగా ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో చేరారు. ఇద్దరిలో చిన్నప్పటి నుండే సహజంగా నాయకత్వ లక్షణాలుండేవి. మధుకర్‌ నిర్వహించే ఆర్‌.ఎస్‌.ఎస్‌. గణకు ఎప్పుడూ ఎక్కువ సంఖ్యలో బాల […] ‘‌సెక్యులరిజం అంటే మెజారిటీ ప్రజల హక్కులను హరించడం కాదు!’ రాజ్యాంగ దినోత్సవం (నవంబర్‌ 26) ‌సందర్భంగా జస్టిస్‌ ‌నరసింహారెడ్డితో జాగృతి ముఖాముఖీలోని కొన్ని అంశాలు: రెండ‌వ భాగం ప్ర‌శ్న‌ : సెక్యులరిజం అనే మాటను లేక భావనను రాజ్యాంగంలో చేర్చడానికి మన రాజ్యాంగ నిర్మాతలు సందేహించారు. కానీ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ దానిని రాజ్యాంగంలోకి తీసుకొచ్చారు. తరువాత పరిణామాలు ఏమిటి? ఇపుడు సెక్యులరిజం పేరుతో, కొత్త భాష్యాలతో దేశాన్ని వర్గాలుగా చీల్చే ప్రయత్నం, ఒక విషాదకర దృశ్యం కనిపిస్తోంది. దీన్ని ఎలా చూస్తారు? జ‌వాబు : సెక్యులరిజమనేది […]
ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్కు పాకిస్థాన్ కోర్టు 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు కేసులకు సంబంధించి విచారణ ముగించిన ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు రూ.3,40,000 జరిమానా విధించింది. పాక్ కోర్టు ఆదేశాల మేరకు హఫీజ్ సయీద్ అక్రమంగా నిర్మించిన మసీదు, మదర్సాను సీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ పోలీస్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్లపై ఉగ్రవాద వ్యతిరేక కోర్టు న్యాయమూర్తి ఇజాజ్ అహ్మద్ భుట్టర్ ఈ తాజా తీర్పు ఇచ్చారు. 2019 నుంచి భారీ భద్రత మధ్య సయూద్‌ను ఉంచిన లాహోర్‌లోని లఖ్‌పట్ జైలు నుంచి ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లలో మొదటి కేసులో 15.5 సంవత్సరాలు, రెండో కేసులో 16.5 సంవత్సరాలు కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది హఫీజ్ సయీద్కు జైలు శిక్ష విధించడం ఇదే తొలిసారి కాదు. ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి 2020లో యాంటీ టెర్రర్ కోర్టు ఆయనకు15 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2019లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటన సమయంలో హఫీజ్ సయీద్ను అరెస్ట్ చేశారు. డెబ్బై ఏళ్ల సయీద్‌కు గతంలో 5 కేసుల్లో 36 ఏళ్ల జైలు శిక్ష పడింది. తాజా శిక్షతో ఆయనకు విధించిన జైలు శిక్ష 68 ఏళ్లకు చేరింది. ఏకకాలంలో శిక్ష అమలు అవుతున్నందున ఆయన ఎంతో కాలం జైలు జీవితం గడపకపోవచ్చని ఆయన తరఫు న్యాయవాది ఒకరు తెలిపారు. కాగా, 2020లో టెర్రర్ ఫండింగ్ కేసులో యాంటీ టెర్రర్ కోర్టు సయీద్‌కు 15 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2019 జూలైలో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో సయీద్ అరెస్టయ్యాడు. ఇదిలా ఉంటే 2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్ర దాడుల్లో హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అతని ప్లాన్ మేరకే పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి చొరబడి పలు ప్రాంతాల్లో మారణహోమం సృష్టించారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 175 మంది మృతి చెందగా.. 300 మందికిపైగా గాయపడ్డారు.
ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు మీ ఇంటి లోపల నుండి వెచ్చని గాలిని తీసివేసి, బయటికి పంపింగ్ చేయడం ద్వారా పని చేస్తాయి, అదే సమయంలో చల్లని గాలిని గదిలోకి విడుదల చేసి, ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ద్రవం వాయువుగా మారినప్పుడు, అది వేడిని గ్రహిస్తుంది మరియు సూత్రప్రాయంగా, అవి ఈ విధంగా పనిచేస్తాయి. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లు మీ ప్రామాణిక రిఫ్రిజిరేటర్ మాదిరిగానే చాలా పని చేస్తాయి, ఆ వేడిలో సిస్టమ్ లోపల శోషించబడుతుంది మరియు గది నుండి తీసివేయబడుతుంది. ప్రక్రియ ఇక్కడ ఉంది: మొదట, గది నుండి వెచ్చని గాలి వ్యవస్థలోకి లాగబడుతుంది. ఈ గాలి లోపల ఉన్న చల్లని ఆవిరిపోరేటర్ పైపులపై ప్రవహిస్తుంది, ఇది గాలిని చల్లబరుస్తుంది, అయితే డీహ్యూమిడిఫైయర్ అదనపు తేమను తొలగిస్తుంది. ఇంతలో, చిల్లర్ పైపుల ద్వారా ప్రవహించే శీతలకరణి గతంలో వీచే గాలి నుండి వేడిని గ్రహిస్తుంది మరియు ఆవిరైపోతుంది, చల్లని ద్రవం నుండి వెచ్చని వాయువుగా మారుతుంది. శీతలకరణి కంప్రెసర్ యూనిట్ మరియు కండెన్సర్ ద్వారా ప్రవహిస్తున్నప్పుడు ఈ వెచ్చని గాలి బయటికి పంపబడుతుంది, ఇది తిరిగి చల్లని ద్రవంగా మారుతుంది. చల్లటి గాలి గదిలోకి తిరిగి ప్రసరింపబడుతుంది, అక్కడ అది ఇప్పటికే ఉన్న గాలితో కలిసిపోతుంది మరియు ఉష్ణోగ్రత మరియు తేమను తగ్గిస్తుంది. ఆవిరిపోరేటర్ ఆవిరిపోరేటర్ అనేది ప్రాథమికంగా ఉష్ణ వినిమాయకం కాయిల్, ఇది రిఫ్రిజిరేటింగ్ గ్యాస్ ద్వారా గది లోపలి నుండి వేడిని సేకరించడానికి బాధ్యత వహిస్తుంది. ఈ భాగాన్ని ఆవిరిపోరేటర్ అని పిలుస్తారు మరియు ఇక్కడ ద్రవ శీతలకరణి వేడిని గ్రహిస్తుంది మరియు వాయువుగా ఆవిరైపోతుంది. స్ప్లిట్ ఎయిర్ కండీషనర్ స్ప్లిట్ ఎయిర్ కండీషనర్ యొక్క ఇండోర్ యూనిట్ ఆవిరిపోరేటర్ కాయిల్‌ను కలిగి ఉంటుంది (ఫోటో క్రెడిట్: షట్టర్‌స్టాక్) ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లలో ఉపయోగించే అత్యంత సాధారణ శీతలకరణి వాయువులలో హైడ్రోఫ్లోరోకార్బన్‌లు లేదా R-410A వంటి HFCలు, క్లోరోఫ్లోరోకార్బన్‌లు లేదా R-22 వంటి CFCలు మరియు R-290 వంటి హైడ్రోకార్బన్‌లు ఉన్నాయి. ఈ వాయువు వాస్తవానికి గది నుండి వేడిని గ్రహిస్తుంది మరియు తదుపరి ప్రాసెసింగ్ కోసం తదుపరి భాగానికి వెళుతుంది, ఇది… కంప్రెసర్ పేరు సూచించినట్లుగా, వాయు శీతలకరణి ఇక్కడ కంప్రెస్ చేయబడింది. ఇది బాహ్య యూనిట్లో ఉంది, అనగా ఇంటి వెలుపల ఇన్స్టాల్ చేయబడిన భాగంలో. కండెన్సర్ కంప్రెసర్ నుండి ఆవిరైన శీతలకరణిని కండెన్సర్ గ్రహించి, దానిని తిరిగి ద్రవంగా మారుస్తుంది మరియు వేడిని బయటికి పంపుతుంది. వాస్తవానికి, ఇది స్ప్లిట్ AC యొక్క వెలుపలి యూనిట్‌లో కూడా ఉంది. AC కండెన్సర్ AC కండెన్సర్ (ఫోటో క్రెడిట్: ట్రేడ్‌కోరియా) విస్తరణ వాల్వ్ విస్తరణ వాల్వ్, థొరెటల్ పరికరం అని కూడా పిలుస్తారు, ఇది రెండు కాయిల్స్, ఆవిరిపోరేటర్ యొక్క శీతలీకరణ కాయిల్స్ మరియు కండెన్సర్ యొక్క హాట్ కాయిల్స్ మధ్య ఉంది. ఇది ఆవిరిపోరేటర్ వైపు కదిలే శీతలకరణి మొత్తాన్ని నియంత్రిస్తుంది. విండో ACల విషయంలో, పైన పేర్కొన్న మూడు భాగాలు విండో ఓపెనింగ్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన చిన్న మెటల్ బాక్స్‌లో ఉన్నాయని గమనించండి. ఇవి ఎయిర్ కండీషనర్ యొక్క ప్రధాన భాగాలు. ఎయిర్ కండీషనర్ ఏమి చేస్తుందో వారు కలిసి ఎలా పని చేస్తారో చూద్దాం. ఎయిర్ కండీషనర్ యొక్క AC ఆపరేటింగ్ సూత్రం ఒక ఎయిర్ కండీషనర్ ఒక నిర్దిష్ట గది నుండి వేడి గాలిని సేకరిస్తుంది, రిఫ్రిజెరాంట్ మరియు కాయిల్స్ శ్రేణి సహాయంతో దానిని దానిలోకి ప్రాసెస్ చేస్తుంది, ఆపై వేడి గాలిని మొదట సేకరించిన అదే గదిలోకి చల్లని గాలిని విడుదల చేస్తుంది. ఇది ప్రాథమికంగా అన్ని ఎయిర్ కండీషనర్లు ఎలా పనిచేస్తాయి. పురాణాన్ని తొలగించడం ఎయిర్ కండీషనర్ దానిలో అమర్చిన యంత్రాల సహాయంతో చల్లబడిన గాలిని ఉత్పత్తి చేస్తుందని చాలా మంది నమ్ముతారు, ఇది గదిని త్వరగా చల్లబరుస్తుంది. ఇది ఎందుకు ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుందో కూడా ఇది వివరించవచ్చు. వాస్తవానికి, ఇది పొరపాటు. ఎయిర్ కండీషనర్ మాయా పరికరం కాదు; ఇది ఒక నిర్దిష్ట గదిని చల్లబరచడానికి కొన్ని భౌతిక మరియు రసాయన దృగ్విషయాలను మాత్రమే చాలా ప్రభావవంతంగా ఉపయోగిస్తుంది. మీరు ఎయిర్ కండిషనింగ్ ఆన్ చేసినప్పుడు ఏమి జరుగుతుంది? మీరు ఎయిర్ కండీషనర్‌ను ఆన్ చేసి, కావలసిన ఉష్ణోగ్రతను సెట్ చేసినప్పుడు, 20 డిగ్రీల సెల్సియస్ అని చెప్పండి, అందులో అమర్చిన థర్మోస్టాట్ గది గాలి యొక్క ఉష్ణోగ్రత మరియు మీరు ఎంచుకున్న ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం ఉన్నట్లు గుర్తిస్తుంది. పై రేఖాచిత్రంలో, కంప్రెసర్ (1) శీతలకరణి ఆవిరిని కంప్రెస్ చేస్తుంది మరియు కండెన్సర్ వైపు కదిలిస్తుంది. కుదింపు యొక్క వేడి రిఫ్రిజెరాంట్ ఆవిరి యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది, దీని వలన అది అధిక పీడన సూపర్ హీటెడ్ ఆవిరి అవుతుంది. ఈ శీతలకరణి కండెన్సర్ (2)లోకి కదులుతున్నప్పుడు, కండెన్సర్ శీతలకరణిలోని వేడిని తిరస్కరిస్తుంది, ఇది స్థితిని మార్చడానికి మరియు అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత ద్రవంగా ఘనీభవిస్తుంది. శీతలకరణి మీటరింగ్ పరికరం (3) గుండా వెళుతున్నప్పుడు, దాని ఉష్ణోగ్రత, పీడనం మరియు స్థితి మరోసారి మారుతుంది. అల్ప పీడన ద్రవ శీతలకరణిలో కొన్ని తక్షణమే “ఫ్లాష్ గ్యాస్” ఏర్పడతాయి. ఈ ద్రవ మరియు వాయువు మిశ్రమం ఆవిరిపోరేటర్ గుండా వెళుతున్నప్పుడు (4) వేడి గ్రహించబడుతుంది మరియు మిగిలిన ద్రవ శీతలకరణి దానిని తిరిగి ఆవిరిగా మారుస్తుంది. ఆవిరిపోరేటర్ యొక్క అవుట్‌లెట్ వద్ద 100% అల్ప పీడన ఆవిరి చూషణ రేఖ ద్వారా కంప్రెసర్‌కు తిరిగి ప్రవహిస్తుంది. దిగువ విండో ఎయిర్ కండీషనర్‌పై ప్రత్యేకంగా రంగుల కాయిల్స్ విద్యార్థికి శీతలకరణి యొక్క ప్రవాహాన్ని దృశ్యమానం చేయడంలో మరియు అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి మరియు సిస్టమ్ ద్వారా ప్రయాణించేటప్పుడు శీతలకరణి యొక్క స్థితిలో వివిధ మార్పులను అందిస్తాయి. ప్రత్యేక ఎయిర్ కండిషనింగ్ భాగాలు ఏమి చేస్తాయి? ఎయిర్ కండిషనింగ్ యూనిట్లకు గాలిని చల్లబరచడానికి కాయిల్స్ ద్వారా పంప్ చేయబడిన శీతలకరణి ద్రవం అవసరమని మాకు తెలుసు. ఎయిర్ కండిషనింగ్ ప్రక్రియ పని చేయడానికి, ఈ రిఫ్రిజెరాంట్ సర్క్యూట్ మూడు కీలక భాగాలను కలిగి ఉండాలి. ఎయిర్ కండిషనింగ్ ఆవిరిపోరేటర్. మీ ఇంటి లోపల నుండి వెచ్చని గాలి లోపలికి లాగబడుతుంది మరియు ప్రవాహాన్ని నియంత్రించే విస్తరణ వాల్వ్ ద్వారా పంపబడుతుంది. ఇది చల్లని ఆవిరిపోరేటర్ కాయిల్ మీద ఎగిరిపోతుంది, ఇది గాలి నుండి వేడిని గ్రహిస్తుంది. కాయిల్స్ లోపల ఉన్న రిఫ్రిజెరాంట్ వేడిని గ్రహిస్తుంది కాబట్టి, అది తిరిగి గ్యాస్‌గా మారి కంప్రెసర్ వైపు కదులుతుంది. ఎయిర్ కండిషనింగ్ కంప్రెసర్. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లోని కంప్రెసర్ పంప్‌గా పనిచేస్తుంది, గ్యాస్ వాల్యూమ్‌ను తగ్గిస్తుంది మరియు కండెన్సింగ్ ప్రక్రియ కోసం దాని ఒత్తిడి మరియు ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఎయిర్ కండిషనింగ్ కండెన్సర్. ఎయిర్ కండిషనింగ్ కండెన్సర్ రిఫ్రిజెరాంట్ ద్వారా గది లోపల నుండి సేకరించిన వేడిని ఇప్పుడు ఆవిరి రూపంలో తీసుకుంటుంది మరియు బయటి గాలి వేడిని గ్రహించి, స్థితిని తిరిగి వాయువు నుండి ద్రవంగా మార్చే చోట పంపుతుంది. వేడిని ఆరుబయట తరలించిన తర్వాత, శీతల శీతలకరణి ప్రక్రియను పునరావృతం చేయడానికి ఇంటి లోపల తిరిగి ఆవిరిపోరేటర్‌కు వెళుతుంది. ఎయిర్ కండీషనర్లు గాలిని మాత్రమే చల్లబరుస్తాయా? ఒక సాధారణ దురభిప్రాయం ఏమిటంటే, అన్ని ఎయిర్ కండిషనర్లు ఒక ప్రదేశంలో గాలి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. ఇది దాని అతిపెద్ద పని అయినప్పటికీ, వారు దాని కంటే చాలా ఎక్కువ చేస్తారు. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయి. ఎయిర్ కండిషనింగ్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు. ఎయిర్ కండీషనర్‌లు గాలిలోకి ప్రసరించేటటువంటి పుప్పొడి మరియు ధూళి వంటి కణాలు మరియు అలెర్జీ కారకాలను తొలగించే ఫిల్టర్‌ను కలిగి ఉంటాయి, మీ గదుల్లో మీరు పీల్చే గాలిని శుభ్రపరచడంలో సహాయపడతాయి. అదేవిధంగా, అవి డీహ్యూమిడిఫైయర్‌లుగా కూడా పనిచేస్తాయి. ఎందుకంటే కండిషనర్లు గదిలోని గాలి నుండి తేమను తీసుకుంటాయి, తేమను తగ్గిస్తుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, మీకు హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌తో, మీరు హీట్ స్ట్రోక్ మరియు ఇతర వేడి సంబంధిత అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తారు. ఆశ్చర్యకరంగా, ఎయిర్ కండిషనింగ్ నిర్జలీకరణ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. గదిలో తక్కువ ఉష్ణోగ్రతలు అంటే మీకు తక్కువ చెమట పడుతుంది. మీరు చెమట పట్టినప్పుడు, మీరు నిజంగా మీ శరీరం నుండి చాలా నీటిని కోల్పోతారు. హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా ముఖ్యం, అయితే ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ సాధ్యమైన నిర్జలీకరణాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. రాత్రి సమయంలో మరింత నియంత్రిత ఉష్ణోగ్రతలతో, మీరు మరింత మెరుగ్గా నిద్రపోగలుగుతారు. బెడ్‌రూమ్‌లను చల్లగా ఉంచడం వల్ల మీరు నిద్రపోతున్నప్పుడు మరింత సౌకర్యవంతంగా ఉంటారు, తద్వారా మీరు రాబోయే రోజులో విశ్రాంతి తీసుకుంటారు. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ నుండి స్వచ్ఛమైన గాలి అంటే పరిస్థితి బాధితులతో ఆస్తమా దాడులు తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఆ ప్రమాదాన్ని మరింత తగ్గించడానికి అవసరమైనప్పుడు ఫిల్టర్‌ని మార్చడం కూడా ముఖ్యం. ఇతర ప్రయోజనాలు. ఎయిర్ కండిషనింగ్ ప్రయోజనకరంగా ఉండే అనేక ఇతర మార్గాలు కూడా ఉన్నాయి: కిటికీలు మరియు తలుపులు తెరిచి ఉంచాల్సిన అవసరం లేకుండా, మీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ సిద్ధాంతపరంగా, మీ ఇల్లు సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవచ్చు. అధికారం లేని ఎవరైనా మీ ఇంటికి ప్రవేశించడానికి తెరిచి ఉన్న తలుపు లేదా కిటికీ లేకుంటే వారికి ప్రవేశించడం చాలా కష్టం. ఎయిర్ కండిషనింగ్ ఫిల్టర్‌ల కారణంగా మీ ఇంట్లో కీటకాలు లేదా బగ్‌లు తక్కువగా ఉంటాయి. ఈ ఫిల్టర్‌లు మీ పెంపుడు జంతువుల బొచ్చుపై ఈగలు వ్యాపించకుండా నిరోధిస్తాయి మరియు మీ ఇంటిని మొత్తం శుభ్రంగా ఉంచుతాయి. మీరు తెరిచిన కిటికీలతో ఊహించినట్లుగా, శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉంటుంది, ప్రత్యేకించి మీరు ప్రధాన రహదారుల చుట్టూ నివసిస్తున్నట్లయితే. మీరు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌తో ఈ శబ్దాన్ని తగ్గిస్తారు. కంప్రెసర్ మరియు ఫ్యాన్ మీ ఆస్తికి వెలుపల ఉన్నందున సిస్టమ్‌లు కూడా అమలు చేయడానికి నిశ్శబ్దంగా ఉంటాయి. ఒక ఎయిర్ కండీషనర్ భవనాన్ని చల్లబరుస్తుంది ఎందుకంటే ఇది ఇండోర్ గాలి నుండి వేడిని తొలగిస్తుంది మరియు దానిని బయటికి బదిలీ చేస్తుంది. వ్యవస్థలోని ఒక రసాయన శీతలకరణి అవాంఛిత వేడిని గ్రహిస్తుంది మరియు బయటి కాయిల్‌కు పైపింగ్ వ్యవస్థ ద్వారా పంపుతుంది. బయటి యూనిట్‌లో ఉన్న ఫ్యాన్, వేడి కాయిల్‌పై బయటి గాలిని వీస్తుంది, శీతలకరణి నుండి బాహ్య గాలికి వేడిని బదిలీ చేస్తుంది. చాలా ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు ఐదు యాంత్రిక భాగాలను కలిగి ఉంటాయి: • ఒక కంప్రెసర్ • ఒక కండెన్సర్ • ఒక ఆవిరిపోరేటర్ కాయిల్ • బ్లోయర్ • ఒక రసాయన శీతలకరణి చాలా సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు స్ప్లిట్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. అంటే, అవి మీ ఇంటి వెలుపల ఉన్న ‘హాట్’ సైడ్ లేదా కండెన్సింగ్ యూనిట్‌తో సహా-కండెన్సింగ్ కాయిల్, కంప్రెసర్ మరియు ఫ్యాన్‌ను కలిగి ఉంటాయి మరియు మీ ఇంటి లోపల ఉన్న ‘చల్లని’ వైపు ఉంటాయి.
వెబ్ సైట్ http://nirmal.telangana.gov.in జిల్లా అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్ నిర్మల్, తెలంగాణ ప్రభుత్వం. ప్రజలకు అత్యంత సాధారణంగా అవసరమైన సమాచారం అందించడం. ఈ వెబ్ సైట్ యొక్క కంటెంట్లను మాత్రమే ప్రజలకు ప్రయోజనం కోసం మరియు సమాచారాన్ని అందిస్తుంది.అయినప్పటికీ, ఇవి చట్టబద్ధమైన హక్కు లేదా బాధ్యతలను కలిగి ఉండవు.సరిగ్గా నిర్ధారించడానికి ప్రతి సంరక్షణ తీసుకున్నప్పటికీ సమాచారం మరియు విధానాలు, జిల్లా అడ్మినిస్ట్రేషన్, తెలంగాణా ప్రభుత్వం లేదా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, భారత ప్రభుత్వం భారతదేశంలో ఏవైనా అనుకోకుండా లేదా టైపింగ్ తప్పులకు బాధ్యత వహిస్తుంది. ఖచ్చితత్వం ఖచ్చితమైన సమాచారం అందించడానికి ప్రతి ప్రయత్నం చేయబడుతుంది. అయితే, మేము ఈ సైట్లో ఉన్న సమాచారం ప్రస్తుతమని హామీ లేదా అభయపత్రం ఇస్తాము,మారుతున్న పరిస్థితులలో లేదా ఇతర సమాచారం నుండి తలెత్తే విషయాలకు బాధ్యత వహించదు ఈ సైట్లోని సమాచారం యొక్క ఖచ్చితత్వం. ఇతర సైట్లకు లింక్లు ఈ సైట్ ఇంటర్నెట్లో ఇతర సైట్లకు లింక్లను కలిగి ఉండవచ్చు (“లింక్డ్ సైట్లు”).మేము ఖచ్చితత్వం, చట్టబద్ధత, మర్యాదకు బాధ్యత కాదు ఏదైనా లింక్డ్ సైట్ ద్వారా అందించబడిన ఏ లింక్డ్ సైట్ లేదా సేవల యొక్క కాపీరైట్ లేదా కాపీరైట్ సమ్మతి. చట్టపరమైన లేదా ఆర్థిక సలహా లేదు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన సమాచారం చట్టపరమైన, ఆర్థిక లేదా ఇతర సలహాలుగా పరిగణించరాదు మరియు సంప్రదింపులను మా నుండి అర్హతగల ప్రొఫెషనల్ లేదా నిర్దిష్ట వ్రాతపూర్వక నిర్ధారణతో భర్తీ చేయడానికి ఉద్దేశించినది కాదు. మేము నిర్దిష్ట చట్టపరమైన లేదా ఆర్థిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వము. యాక్సెస్ జిల్లా అడ్మినిస్ట్రేషన్, తెలంగాణలో వెబ్సైట్ యాక్సెస్ స్థిరమైన లభ్యతకు హామీ ఇవ్వదు మరియు ఎటువంటి బాధ్యతను తీసుకోదు సహేతుక నియంత్రణకు మించి పరిస్థితులు (ఐ ఎస్ పి లేదా సిస్టమ్ ప్రొవైడర్ ద్వారా ఏదైనా వైఫల్యంతో సహా) సమయం లేదా యాక్సెస్ వైఫల్యం. భద్రతా లక్షణాలు ఖచ్చితమైన సమాచారం అందించడానికి ప్రతి ప్రయత్నం చేయబడుతుంది. అయితే, సమాచారం ఈ వెబ్సైట్లో ఉన్న ఏ సమయంలోనైనా మార్చడం జరుగుతుంది.ఈ సైట్లో సమాచారం సరిగ్గా ఉందని మరియు సంభవించే విషయాలకు బాధ్యత వహించదని మేము హామీ లేదా అభయపత్రం ఇస్తాము
"ఆలస్యం అమృతం విషం "అన్నారు పెద్దలు. ఒకటి రెండు నిముషాల విలంబం జీవితాన్ని తల్లక్రిందులు చేయడం,అనుకున్నవి చేయి జారిపోవడం చూస్తూ ఉంటాం. సోమరిని చేసే లక్షణాల్లో విలంబము ఒకటి.దానితో సహవాసం చేస్తే అనుకున్నవి ఏవీ సాధించలేము. విలంబము వల్ల ఒక్కోసారి జీవితాంతం బాధ పడే సంఘటనలు కూడా ఎదురవుతుంటాయి. అంతటి ఇబ్బంది కలిగించే విలంబము అంటే ఏమిటో చూద్దాం...ఆలస్యము,కాలహరణము,జాగు,జాప్యము,తడవు,స్త్యారము,తేమాసము, జాలము లాంటి అర్థాలు ఉన్నాయి. అలాంటి విలంబము వలన ఉదాత్తముగా వ్యవహరించే అవకాశము పోగొట్టుకుంటాము.. కాబట్టి విలంబమును వీడాలి. విలంభము అనే మంచి బుద్ధి కలిగి జీవించాలి. ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు, వీరులు, మహనీయులు చేసిన ప్రాణ విలంభము వల్ల ఈ నాటికీ ప్రాతఃస్మరణీయులయ్యారు.మనకు ఆదర్శప్రాయులుగా నిలిచారు. అంతటి ప్రాణ త్యాగము చేయకపోయినా మనకు ఉన్న దాంట్లో కొంతైనా విలంభము చేసి మానవతా హృదయం కలిగిన వ్యక్తులుగా జీవించుదాం. మరి విలంభమునకు గల అర్థాలను పరిశీలిద్దాం...త్యాగము,ఉదాత్తము,చాగము,తేగము,పరిత్యాగము,వితరణము,ఉజ్జగింపు,ఉత్సర్గము,త్యజనము,విసర్గము నిర్యాతనము మొదలైన అర్థాలు ఉన్నాయి.
దుబ్బాక మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు దంపతులు హోమం నిర్వహించారు. దుబ్బాకలో పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 దుబ్బాక, అక్టోబరు 4: దుబ్బాక మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు దంపతులు హోమం నిర్వహించారు. దుబ్బాక రెడ్డి యువసేన ఆధ్వర్యంలో జరిగిన హోమంలో రెడ్డి సంఘం నాయకుడు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మండలంలోని గంభీర్‌పూర్‌ గ్రామంలోని బజరంగ్‌ సేనయూత్‌ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. లచ్చపేట నగరేశ్వరాలయంలో చండీహోమం, అష్టదిక్పాలక బలి, పూర్ణాహుతి నిర్వహించారు. మిరుదొడ్డి: మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలోని లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో జ్ఞానసరస్వతీదేవి అమ్మవారు రాజరాజేశ్వరదేవి రూపంలో దర్శనమిచ్చారు. చిన్నకోడూరు: చిన్నకోడూరులో జైభీమ్‌ యూత్‌ ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారిని మంగళవారం సర్పంచ్‌ ఉమే్‌షచంద్ర, ఎంపీటీసీ శారదారమేష్‌, ఉపసర్పంచ్‌ శ్రీకాంత్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు రాజలింగం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మద్దూరు: దూళిమిట్ట మండలం జాలపల్లిలో దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం చండీహోమం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని టీపీసీసీ ప్రతినిధి, జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ గిరి కొండల్‌రెడ్డి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సింహులు, వెంకటయ్య, గిరి గోవర్దన్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. కొండపాక: కుకునూరుపల్లిలోని భీష్మ గంగపుత్ర యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో మంగళవారం డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా యూత్‌ క్లబ్‌ సభ్యులు ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఎన్‌ఆర్‌ చైర్మన్‌ నరేందర్‌, ఎంపీటీసీ భూములుగౌడ్‌ పాల్గొన్నారు. సిద్దిపేట కల్చరల్‌: సిద్దిపేటలోని పార్వతీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు, కౌన్సిలర్లు బ్రహ్మం, పెద్ది నాగరాజు, మల్లికార్జున్‌ అమ్మవారిని దర్శించుకున్నారు. వారిని ఆలయం తరఫున ట్రస్టు సభ్యులు శాలువాలతో సత్కరించారు. గజ్వేల్‌ రూరల్‌: గజ్వేల్‌ పట్టణంలోని మహాకాళీ ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం మహిషాసుర మర్ధిని ఆకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. చేర్యాల: దేవీ శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని చేర్యాలలో చావడి వద్ద ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగం అధ్యక్షుడు సంపత్‌ ఆధ్వర్యంలో మహాన్నదానం నిర్వహించారు. అలాగే దేవీస్నేహాయూత్‌ నిర్వాహకులు సుహాసినీ, కన్య పూజ నిర్వహించారు. బెజ్జంకి: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌ గ్రామంలో నెలకొల్పిన దుర్గామాత మండపంలో మహిళలు మంగళవారం కుంకుమార్చనలు నిర్వహించారు.
ఈ రోజుల్లో విద్యార్థులు(Students), ఉద్యోగులు(Employees) ఇలా చాలా మందికి ల్యాప్‌టాప్‌(Laptop)లు బాగా యూజ్(Use) అవుతున్నాయి . మరి లాక్‌డౌన్‌ టైం లో అయితే ఆన్‌లైన్‌ క్లాసుల(Online Classes), ఆఫీస్‌ వర్క్‌ల(Office Works) కోసం చాలా మంది ల్యాప్‌టాప్‌ల పైనే ఆధారపడ్డారు. కానీ ఎక్కువ సేపు వాడటం వల్ల ల్యాప్‌టాప్‌లు హీట్(Heat) ఎక్కుతాయి . ఇవి బాగా వేడెక్కితే అందులోని సున్నితమైన భాగాలు కాలిపోయే ప్రమాదం ఉంది.నిజానికి ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ల్యాపీలు కాలిపోతుంటాయి.అయితే ల్యాప్‌టాప్‌లు కాలిపోయేంత వేడెక్కకుండా అందులోని కూలింగ్ ఫ్యాన్‌(Cooling Fans)లు ఎప్పటికప్పుడు చల్లదనాన్ని అందిస్తుంటాయి. అపరిశుభ్రమైన ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు ఈ ఫ్యాన్లలోకి దుమ్ము(Dust), ధూళి కణాలు చేరుతుంటాయి.దీని వల్ల ఆ ఫ్యాన్ల పనితీరుపై ప్రభావితమవుతుంది. అలా ఫ్యాన్లు కావాల్సినంత కూలింగ్‌ను ల్యాప్‌టాప్‌లకు అందించలేకపోతే, ఫలితంగా ల్యాప్‌టాప్‌ల్లోని కాంపోనెంట్స్(Components) కాలిపోతాయి. అయితే ల్యాప్‌టాప్‌లు హీట్ ఎక్కకుండా ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం. ల్యాప్‌టాప్‌(Laptop) టర్న్ ఆన్(Turn On) చేయగానే అందులోని కూలింగ్ ఫ్యాన్లు(Cooling Fan) వేగంగా తిరుగుతున్నట్టు శబ్దం(Sound) వినిపిస్తే వాటి పనితీరు తగ్గినట్లు మీరు అర్థం చేసుకోవాలి. దీనివల్ల ల్యాపీ ఎక్కువ హీట్ అవుతుందని గుర్తించాలి. ల్యాప్‌టాప్‌ వేడెక్కుతుందని గమనించగానే మీరు కూలింగ్ ఫ్యాన్లను క్లీన్(Clean) చేసుకోవాలి. సీపీయూ(CPU), జీపీయూ(GPU) పార్టులకు కూలింగ్‌ను అందించే ఫ్యాన్స్ లోకి దుమ్ము, ధూళి చేరితే ఫ్యాన్లు పాడైపోతాయి.అలాగే ఈ దుమ్ము అనేది ఎయిర్‌ఫ్లో(Air Flow)కు అడ్డుగా మారి హీట్ పెంచుతుంది. వీటిని శుభ్రం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు (Tips)పాటించడం(Follow) ముఖ్యం. క్లీన్ చేసే ముందు ల్యాప్‌టాప్‌ను ఆఫ్ చేసి కేబుల్స్‌(Cables), బ్యాటరీ(Battery)ని జాగ్రత్తగా రిమూవ్ చేయాలి.ఆ తర్వాత ల్యాప్‌టాప్‌ బ్యాక్ ఓపెన్ చేసి అందులోని ఫ్యాన్లను ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌లో ముంచిన కాటన్ తో క్లీన్ చేసుకోవాలి. ఐసోప్రొఫైల్‌ ఆల్కహాల్(Isoprofiel Alcohol) ల్యాప్‌టాప్‌లోని కాంపోనెంట్స్‌(Components) పై తడిగా ఉండకుండా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. లేదంటే అవి పాడయ్యే ప్రమాదం ఉంది. అతి తక్కువ ప్రెజర్‌ ఉన్న ఎయిర్‌ పంప్‌(Air Pumps)ల సాయం(Help)తో కూలింగ్‌ ఫ్యాన్‌లు క్లీన్ చేసుకోవచ్చు.అలాగే ల్యాప్‌టాప్‌ ఎగ్జాస్ట్‌(Exhaust), వెంటిలేటర్ల(Ventilators)ను సాఫ్ట్ బ్రష్‌(Soft Brush)తో శుభ్రం చేసుకుంటే ల్యాప్‌టాప్‌ వేడెక్కదు.
”రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికే ఉంటుంది. మీ బాధ మీరు పడండి అనడం అన్యాయం” అంటూ అనేక రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా దీనిపై కేంద్రానికి లేఖ రాశారు. జీఎస్టీ పరిహారం అంటే ఏమిటీ? రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారం అనేది ఎందుకు వచ్చింది? ఇది అర్థం కావాలంటే.. అసలు జీఎస్టీ అంటే ఏమిటి? న్యూఢిల్లీ : జీఎస్టీకి పూర్వం(2017 జులైలో జీఎస్టీ వచ్చింది) కేంద్రం ఎక్సైజ్‌ సుంకాలు విధించేది. రాష్ట్రం ముందు అమ్మకం పన్ను, తర్వాత వాల్యూ యాడెడ్‌ టాక్స్‌(వ్యాట్‌- విలువ ఆధారిత పన్ను) అనేది వేసేది. అలాగే కేంద్రం సర్వీసెస్‌ పైన సర్వీస్‌ ట్యాక్స్‌ వేసేది. ఇవన్నీ కలిపి జీఎస్టీ రూపంలో ఒక యునిఫైడ్‌ ఆలిండియా ట్యాక్స్‌ రెజిమ్‌.. దేశవ్యాప్తంగా జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. ఈ జీఎస్టీకి కేంద్రం తమకు రాజ్యాంగం ఇచ్చిన పన్నుల అధికారాలు కొన్నింటిని, రాష్ట్రము తమకు రాజ్యాంగం ఇచ్చినటువంటి పన్నుల అధికారాలు కొన్నింటిని మేళవించి జీఎస్టీగా రూపొందించారు. దీనికి జీఎస్టీ కౌన్సిల్‌ ఉంటుంది. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కలిపి జీఎస్టీ కౌన్సిల్‌ ఏర్పాటు అవుతుంది. జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే ఒక రకంగా కేంద్రం తమ ట్యాక్స్‌ సార్వభౌమాధికారాన్ని, రాష్ట్రాలు తమ ట్యాక్స్‌ సార్వభౌమాధికారాన్ని జీఎస్టీకి సరెండర్‌ చేశాయి. అందుకే రాజ్యాంగ సవరణ అవసరం వచ్చింది. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా జీఎస్టీ వచ్చింది. అయితే జీఎస్టీ తేవాలని చర్చలు జరిగినప్పుడు కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. మాకు ఇప్పుడొస్తున్న పన్నుల ఆదాయం కంటే జీఎస్టీ వస్తే ఆదాయం తగ్గుతుందేమో? అని అనుమానాలు వ్యక్తం చేశాయి. కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామన్నాయి. అయితే ‘జీఎస్టీతో ఆదాయం తగ్గదు. పెరుగుతుంది’ అని రాష్ట్రాలకు కేంద్రం చెప్పింది. ‘జీఎస్టీ చాలా మంచి ట్యాక్స్‌. ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో జీఎస్టీ ఉంది. కాబట్టి లాంగ్‌టర్మ్‌లో మీకు ఇంకా ఆదాయం పెరుగుతుంది’ అని కేంద్రం రాష్ట్రాలకు తెలిపింది. రాష్ట్రాలకు అనుమానాల నేపథ్యంలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి జీఎస్టీ చట్టం చేయాలి. ఎందుకుంటే జీఎస్టీకి పార్లమెంటు ఒక్కటే చట్టం చేస్తే సరిపోదు. రాష్ట్ర శాసనసభలకు కూడా రాష్ట్ర జీఎస్టీ చట్టాలు చేయాలి. అందువల్ల రాష్ట్రాలను ఒప్పించడానికి కేంద్రం ఒక ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదన ఏమిటంటే.. మీకు ఇప్పుడొస్తున్న ఆదాయం కంటే తక్కువగా ఆదాయం వస్తే దాన్ని మేము(కేంద్రం) భర్తీ చేస్తాం అని ఒక ప్రతిపాదించింది. ఇందుకోసం జీఎస్టీ చట్టంలో విధివిధానాలు పెట్టారు. ఆ విధివిధానాలు ఏమిటి? 2015-16లో వచ్చినటువంటి ఆదాయాన్ని బేస్‌ ఇయర్‌(ప్రాతిపదిక సంవత్సరం)గా తీసుకుంటారు. అప్పటి నుంచి ప్రతి యేటా 14 శాతం వార్షిక పెరుగదల రేటు ఉంటుందని లెక్క వేస్తారు. ఇలా ప్రతి ఏడాది 14శాతం ట్యాక్స్‌ గ్రోత్‌ అని లెక్క వేసి ప్రతి ఏటా అంత రాకపోతే ఆ లోటును భర్తీ చేస్తారు. ఉదాహరణకు, 2015-16లో రూ.100 ఆదాయం వచ్చింది. అది 2017-18లో 14శాతం పెరగాలి. అలా రాలేకపోతే జీఎస్టీ ద్వారా అప్పుడు లోటును భర్తీ చేస్తారు. ఇలా 14శాతం వార్షిక వృద్ధిరేటు ఉంటుందని అంచనా. ఐదేండ్ల పాటు అంటే 2022 వరకు కూడా ఇలా రాష్ట్రాలకు ఎవరికైతే తక్కువ ఆదాయం వచ్చిందో.. అంటే ఆ రాష్ట్రానికి 2015-16లో వచ్చిన ఆదాయమెంత? దాని పైన ప్రతియేటా 14 శాతం పెరిగిందా? లేదా? చూస్తారు. అంత రాకపోతే లోటును భర్తీ చేస్తారు. ఎక్కడ నుంచి భర్తీ చేస్తారు? దీని కోసం ఒక మెకానిజంను కూడా జీఎస్టీ చట్టం చెప్పింది. జీఎస్టీ నష్టపరిహార సెస్‌(జీఎస్టీ కంపెన్సెషన్‌ సెస్‌) అనేది ఒకటి విధిస్తారు. కొన్ని రకాల వస్తువుల పైన(పొగాకు ఉత్పత్తులు లాంటి వస్తువుల పైన) సెస్‌ విధించి దాని ద్వారా వచ్చిన నిధుల్ని జీఎస్టీ కంపెన్సెషన్‌ ఫండ్‌లో జమ చేస్తారు. ఐదేండ్లుగా ఈ ఫండ్‌లో జమ చేస్తుంటారు. ఈ నిధి ద్వారా వార్షిక పెరుగదల తక్కువగా నమోదు చేసిన రాష్ట్రాలుంటే ఆ లోటును భర్తీ చేస్తారు. ఐదేండ్ల తర్వాత అంటే 2022 తర్వాత జీఎస్టీ నష్టపరిహార సెస్‌ ఉండదు. అప్పటికి ఆ నిధిలో మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే అందులో 50శాతం రాష్ట్రాలకు ఇచ్చేస్తారు. 50శాతం కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఇండియాలోకి జమ చేస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఈ విధంగా రాష్ట్రాలపై జీఎస్టీ నష్టపరిహార సెస్‌ను విధించారు. మొదటి రెండు ఏండ్లు అంటే 2019-20 కంటే ముందు వాస్తవంగా జీఎస్టీ నష్టపరిహార సెస్‌ ఎక్కువగా వసూలైంది. రాష్ట్రాలకివ్వాల్సింది తక్కువ ఉండేది. ఈ రెండేండ్లలో కలిపి 47వేల కోట్ల మిగులు ఏర్పడింది. ఈ మొత్తాన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియాలో కలిపేసుకున్నారు. వాస్తవానికి ఐదేండ్ల తర్వాత మిగిలిన మొత్తాన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియాలో కలుపుకోవాలి. ది వైర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఢిల్లీ ఆర్థిక మంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ”ఈ రూ.47వేల కోట్లు మిగులున్నప్పుడు మీరు కలుపుకున్నారు. ఇప్పుడు తక్కువ పడుతున్నప్పుడు మమ్మల్ని అప్పులు చేసుకొమ్మంటున్నారు. ఇది కరెక్టా?” అని అడిగారు. ”కలుపుకొనేటప్పుడు ఏ అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్ని తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం తక్కువ పడుతున్నప్పుడు అటార్నీ జనరల్‌ ఒపీనియన్‌ను అడిగింది కేంద్రం” అని ఆయన అన్నారు. అయితే మాకు బాధ్యత ఏమీ లేదని రాష్ట్రాలకు కేంద్రం చెబుతున్నది. 2019-20లో ఆర్థిక మందగమనం వల్ల జీఎస్టీ వసూళ్లు ఓవరాల్‌గా తగ్గాయి. జీఎస్టీ పరిహార నిధిలో కూడా చాలినన్ని డబ్బులు లేవు. అంటే రాష్ట్రాలకేమో ఎక్కువ పరిహారం చెల్లించాలి. కంపెన్సేషన్‌ సెస్‌ ద్వారా వసూలైందేమో తక్కువ. దీన్ని ఏం చేయాలి? అనే చర్చ వచ్చింది. అయితే అంతక ముందు మిగులు ఉంది గనక రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చేసింది. 2020 మార్చి వరకు ఇచ్చారు. ఇప్పుడు మార్చి తర్వాత నష్టపరిహార సెస్‌ నిధులు ఇవ్వడం లేదు. ఏప్రిల్‌, మే, జూన్‌, జులై, ఆగష్టు మొత్తం ఐదు నెలలకు గానూ దాదాపు రూ. 2.35 లక్షల కోట్లు రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ నిధులు ఇవ్వాలని రాష్ట్రాలు అడిగితే కేంద్రం ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్‌లో రెండు ప్రతిపాదనలు పెట్టింది. రాష్ట్రాలు 14శాతం వార్షిక వృద్ధి రేటును పొందకపోవడానికి రెండు కారణాలను పేర్కొంది. అవి ఏంటంటే 1. కరోనా వల్ల 2. జనరల్‌ ఎకానమీ తగ్గుదల వల్ల. జనరల్‌ ఎకానమీ స్లోడౌన్‌ వల్ల రూ.97వేల కోట్లు రాష్ట్రాలకు జీఎస్టీ తక్కువగా వసూలైంది. మిగిలిన రూ. 1.38 వేల కోట్లు కోవిడ్‌-19 వల్ల అని రెండుగా వర్గీకరించి రెండు ప్రతిపాదనలను కేంద్రం పెట్టింది. 1. ఈ రూ.97వేల కోట్లకు కరోనాతో సంబంధం లేదు. సాధారణ ఆర్థిక మందగమనం ద్వారా వచ్చింది గనక ఈ రూ.97 వేల కోట్లు ను ఆర్బీఐ ద్వారా ప్రత్యేకంగా తక్కువ వడ్డీతో రాష్ట్రాలకు అప్పు రూపంలో ఇస్తాం. జీఎస్టీ కంపెన్సేషన్‌ సెస్‌ను 2022 తర్వాత కూడా రెండు నుంచి ఐదేండ్లు పెంచుతాం. అలా పెంచడం ద్వారా వచ్చిన డబ్బుతో ఈ ఆర్బీఐ దగ్గర తీసుకున్న డబ్బు, వడ్డీ కడతాం. 2. ఒక వేళ రాష్ట్రాలు రూ.2.35 లక్షల కోట్లు కావాలనుకుంటే ఆర్బీఐ దగ్గరం మేం అప్పు ఇప్పించం. తక్కువ వడ్డీ రేటు ఉండదు. మీరు(రాష్ట్రాలు) అప్పులు కావాలంటే బయట చేసుకోండి. మాకు సంబంధం లేదు. రాష్ట్రాలు తమకు రావాల్సిన రూ.1.38 వేల కోట్లను వదులుకుంటే బాధ్యత తీసుకుంటామని కేంద్రం అంటోంది. అలా కాదని రూ.2.35 లక్షల కోట్లు కావాలని రాష్ట్రాలు అడిగితే బాధ్యత తీసుకోబోమని మోడీ సర్కారు చెప్తోంది. తాము బాధ్యత తీసుకోకపోవడానికి గల కారణాన్ని ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ గా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ”అయితే ఇది సరైంది కాదు. మొత్తం రూ.2.35 లక్షల కోట్లు సమకూర్చాల్సింది కేంద్రమే” అని రాష్ట్రాలు అంటున్నాయి. దీనిని కేంద్రం తన జేబులో నుంచి కాకుండా ఎక్కడైనా అప్పు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్తున్నాయి. ”2022 తర్వాత కూడా జీఎస్టీ కంపెన్సేషన్‌ సెస్‌ను కొనసాగిద్దాం. దీని ద్వారా వసూలైన డబ్బుతో కేంద్రం తీసుకున్న అప్పును, వడ్డీని కూడా కడదాం” అని రాష్ట్రాలు అడుగుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం మాకు సంబంధం లేదనీ, రాష్ట్రాలే తమ రుణ పరిమితికి లోబడి అప్పులు చేసుకోవాలని వాదిస్తోంది. ఇక్కడ కేంద్రం వాదన పూర్తిగా అన్యాయమైనది. తాము అప్పుజేస్తే తమ క్రెడిట్‌ రేటింగ్‌ పెరుగుతుందని కేంద్రం వాదన. అయితే ఇది పూర్తిగా అర్థరహితం. ఎందుకంటే క్రెడిట్‌ రేటింగ్‌ ఇచ్చేటప్పుడు 1.జాతీయాదాయంలో అప్పులెంత అన్న దానిని చూస్తారు. 2. ద్రవ్యలోటును చూస్తారు. అయితే ఈ రెండింటిని రేటింగ్‌ సంస్థలు కేంద్రం, రాష్ట్రాలు, కార్పొరేట్‌ అప్పులు ఇలా మొత్తం కలిపి చూస్తాయి. ఒక కేంద్రానికి మాత్రమే చూడవు. కేంద్రం బాధ్యత ఎందుకు తీసుకోవాలి? జీఎస్టీ పార్లమెంటు చట్టం. పార్లమెంటు చట్టంలో ఇబ్బందులకు కేంద్రమే బాధ్యత వహించాలి. అసలు ఈ జీఎస్టీ తగ్గడమనేది కరోనాతో మొదలు కాలేదు. కరోనాకు ముందు కూడా ఇది ఉన్నది. కారణమేంటంటే.. జీడీపీ గత రెండేండ్లుగా తగ్గుతోంది. 2019-20లో కూడా జీడీపీ పడిపోయింది. దీంతో జీఎస్టీ తగ్గింది. పెద్దనోట్ల రద్దు అనంతరం ఇలా పడిపోతూ వస్తోంది. జీఎస్టీ లో ఉన్న లోపాల్ని సరిచేయకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడింది. అంటే కేంద్రం అనుసరించిన ఆర్థిక విధానాల, వైఫల్యాల వల్ల జీడీపీ పడిపోతోంది. ఫలితంగా జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. అందుకొరకు కేంద్రానిదే బాధ్యత అని రాష్ట్రాల వాదన. కరోనా వల్ల వసూళ్లు తగ్గలేదనీ, కరోనాకు ముందు నుంచే ఈ పరిస్థితి ఉన్నదని అంటున్నాయి. లాక్‌డౌన్‌ విధించేటప్పుడు తమను సంప్రదించలేదనీ, తమకు ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదని ఆరోపిస్తున్నాయి. దేశంలో విధించిన మొదటి లాక్‌డౌన్‌ నిర్ణయం ప్రధాని మోడీ తనంతట తానుగా తీసుకున్నదేనని బీజేపీ ఎంపీ, సీనియర్‌ నాయకుడు జీవీఎల్‌ నరసింహరావు కూడా ఓ వార్తా ఛానెల్‌ చర్చలో తెలిపారు. 21 రోజుల్లో అంతా సర్దుకుంటుందనీ, క్రెడిట్‌ అంతా మోడీకే దక్కాలని రాష్ట్రాలను సంప్రదించకుండా లాక్‌డౌన్‌ విధించారు. ఇందుకు రాష్ట్రాలకు కనీసం సమయం కూడా ఇవ్వలేదు. అయితే వృద్ధి రేటు, జీఎస్టీ పడిపోవడం ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ కంటే ‘యాక్ట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా’వల్ల జరిగింది. అనేక దేశాలు లాక్‌డౌన్‌ పూర్తిగా విధించలేదు. మరి కొన్నయితే అసలే విధించలేదు. అయినప్పటికీ కరోనాను అక్కడ కట్టడి చేశాయి. అందువల్ల కేంద్రం ఆర్థిక విధానాల, ఏకపక్ష లాక్‌డౌన్‌ నిర్ణయం వల్ల జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. ఇప్పుడు కేంద్రం తాను బాధ్యత తీసుకోను అంటే న్యాయమేనా?. 2016 డిసెంబర్‌ 22-23లో ఏడో జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌లో ” రాష్ట్రాలకు జీఎస్టీ ఆదాయం తగ్గితే వాటికి ఇవ్వాల్సిన బాధ్యత రాజ్యాంగరీత్యా కేంద్రం తీసుకుంటుంది” అని ఆనాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. దానిని మినిట్స్‌లో కూడా చేర్చారు. అసలు జీఎస్టీ చట్టంలో ఎక్కడైనా యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ అనే పదం ఉందా? ఇది కేవలం కమర్షియల్‌ కాంట్రాక్టుకు వర్తిస్తుంది. రాజ్యాంగ సవరణ ద్వారా, పార్లమెంటు చట్టం ద్వారా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య కుదిరే చట్టాలకు యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ వర్తించదు. ఇది అర్థరహితం. కానీ, కేంద్ర మంత్రి దీనికి యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ వర్తిస్తుందని పేర్కొనడం ఆశ్చర్యకరం. ఆర్బీఐ దగ్గర కేంద్రానికి పరపతి అధికం. కానీ, కేంద్రం మాత్రం తాను అప్పు తీసుకోననడం ఒక రకంగా భారత ఫెడరల్‌ వ్యవస్థకు తూట్లు పొడవడం అవుతుంది. భవిష్యత్తులో ఏ రాష్ట్రమైనా కేంద్రాన్ని నమ్మగలుగుతుందా? రాజ్యాంగ ఉల్లంఘనకు కేంద్రమే పాల్పడితే ఎలా అన్నదే ఇక్కడ ప్రశ్న.