text
stringlengths
428
70.7k
శ్రీ‌కాకుళం న‌గ‌రం : ప‌విత్ర య‌జ్ఞం చేస్తున్నాం ఆద‌రించండి అంటూ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పారు. శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంలో సోమ‌వారం నిర్వ‌హించిన మూడో విడ‌త అమ్మ ఒడి ప‌థ‌కానికి సంబంధించి నిధులు విడుద‌ల చేసే కార్య‌క్ర‌మానికి అతిథిగా విచ్చేసి, సంబంధిత స‌భ‌లో ప్ర‌సంగించారు. ముఖ్యంగా గ‌త ప్ర‌భుత్వం ఉంచిన బ‌కాయిల‌ను తీరుస్తూ, నాటి ఎన్నిక‌ల హామీల‌ను నెర‌వేరుస్తూ, మ్యానిఫెస్టోను అమ‌లు పరుస్తూ పాల‌న చేస్తున్నామ‌ని అన్నారు. అదేవిధంగా జిల్లాకు కీల‌కంగా ఉన్న ప్రాజెక్టుల‌కు నిధులు విడుద‌ల చేసి స‌భికుల హ‌ర్ష‌ద్వానాలు అందుకున్నారు. స‌భ‌లో శ్రీ‌కాకుళం ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌కు చెందిన నిహారిక ఇంగ్లీషులో మాట్లాడి ఆక‌ట్టుకుని, సీఎం దీవెన‌లు అందుకుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌నేమ‌న్నారంటే.. 43,96,402 మంది తల్లుల‌కు, వారి 80 ల‌క్షల మంంది కి పైగా పిల్ల‌ల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చే విధంగా అమ్మ ఒడి ఆరు వేల కోట్ల 595 రూపాయ‌ల‌కు పైగా నిధులు జ‌మ చేస్తున్నాం. ఆడ‌బిడ్డ‌ల‌కు తోడుగా ఓ అన్న‌య్య తోడుగా ఉన్నాడ‌ని చెప్పే కార్య‌క్ర‌మం.. ఇది. ఒక మ‌నిషి త‌ల‌రాత‌ను మార్చ‌గ‌లిగే శ‌క్తి చ‌దువుకు మాత్ర‌మే ఉంది..మ‌న మ‌నిషి బ‌తుకు మార్చ‌గ‌లిగే శ‌క్తి చ‌దువుకే ఉంది..ఒక స‌మాజం త‌ల రాత‌ను ఒక‌దేశం త‌ల‌రాను మార్చ‌గ‌లిగే శ‌క్తి ఉండేది చ‌దువుకే ! ఉంది. చ‌దువులు బాగా ఉన్న దేశాల‌లో ఆదాయాలు ఎక్కువే ! మ‌న క‌న్నా త‌ల‌స‌రి ఆదాయం ఎక్కువే !చ‌దువుకు ఆ శ‌క్తి ఉంది క‌నుక వాళ్ల‌కు మ‌న‌కూ తేడా క‌నిపిస్తూ ఉంది. చ‌దువే నిజం అయిన ఆస్తి.. ఈ ప్ర‌భుత్వం చ‌దువుపై పెట్టే ప్ర‌తి పైసా కూడా ఓ ప‌విత్ర‌మైన పెట్టుబ‌డి ..ఒక త‌రాన్నీ వారి త‌ల‌రాత‌ల్నీ కూడా మార్చ గ‌లిగే శ‌క్తి కూడా చ‌దువుల‌కే ఉంది. ప్ర‌పంచంలో ఎక్క‌డికి అయినా బ‌త‌క గ‌లిగే శ‌క్తి చ‌దువుల వ‌ల్లే వ‌స్తుంది. అలాంటి క్వాలిటీ చ‌దువులు అందాల‌న్న త‌ప‌న‌తో గ‌త మూడేళ్లుగా విద్యా రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకు వ‌చ్చాం. దేశంలో అన్ని రాష్ట్రాల‌కు భిన్నంగా మన రాష్ట్రం మంచి చ‌దువులు అందించడం అన్న‌ది ఓ హక్కు గా ఓ బాధ్య‌త‌గా తీసుకుని ఈ ప్ర‌భుత్వం అందిస్తూ ఉంది.. పిల్ల‌ల‌ను బ‌డికి పంపిస్తున్న ప్ర‌తి నిరుపేద త‌ల్లుల‌కు జగ‌న‌న్న అమ్మ ఒడి ద్వారా నేరుగా అందుతుంది.. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కూ చ‌దివే పిల్ల‌ల‌కు ఆర్థిక సాయం అంద‌నుంది. 6595 కోట్లు అందించ‌నున్నాం. ఈ మూడేళ్ల‌లో 19618 కోట్ల రూపాయ‌లు నేరుగా త‌ల్లుల ఖాతాల్లోకి జ‌మ చేయ‌గ‌లిగాం. ఏ త‌ల్లి అయినా కూడా త‌మ బిడ్డ‌ల‌ను బాగా చ‌దివించాల‌నే భావిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా చ‌దివించ‌లేక‌పోవ‌డం జ‌ర‌గ‌కూడ‌దు.. నా పాద‌యాత్రలో ప్ర‌తి త‌ల్లి ప్ర‌తి చెల్లి కీ నేను ఉన్నాను అని చెప్పాను. చెప్పిన ఆ మాట‌ను నిల‌బెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల‌లో మూడో సారి కూడా ఈ ప‌థకం కింద నిధులు ఇస్తున్నాం. ఈ ప‌థ‌కం కింద ప్ర‌భుత్వం పాఠ‌శాలలో అయినా, ప్ర‌యివేటు పాఠ‌శాల‌లో చ‌దివించినా అభ్యంత‌రం లేదు. ఏడాదికి 15 వేలు ఆర్థిక సాయం అందించే గొప్ప కార్య‌క్ర‌మం అమ్మ ఒడి.. ఎంత మంది ఎక్కువ పిల్ల‌లు చ‌దువుకుంటే అంత ఆనందం..ఎంత మంది త‌ల్లుల‌కు ఈ ప‌థ‌కం అందితే అంత ఆనందం. క‌నీస హాజ‌రు శాతం 75 శాతం ఉండాల‌ని చెప్పాం. అంటే బ డి నాలుగు రోజులు జ‌రిగితే మూడు రోజులు అయినా జరిగితేనే ఈ ప‌థ‌కం వ‌ర్తింపు చేస్తామని చెప్ప‌డం జ‌రిగింది. ఎందుకంటే పిల్ల‌ల‌ను ఓ త‌పస్సులా చ‌దివిస్తేనే త‌ల రాత‌లు మారుతాయి. అందుకే ఈ నిబంధ‌న. తొలి సారి అమ్మ ఒడి ప‌థకం అమ‌లులో ఈ నిబంధ‌న లేదు. త‌రువాత ఏడాది అనుకోకుండా కోవిడ్ రావ‌డంతో ఈ నిబంధ‌న‌ను హాజ‌రు శాతం మిన‌హాయింపు ఇవ్వ‌క త‌ప్ప‌లేదు. గ‌త సెప్టెంబ‌ర్ నుంచి పాఠ‌శాల‌లు య‌థావిధిగా న‌డుస్తున్నాయి. క‌నీసం 75 శాతం హాజ‌రు ఉండాల‌న్న నిబంధ‌న‌తో 1.14 శాతం త‌ల్లుల‌కు అమ్మ ఒడి ఇవ్వ‌లేక‌పోయాం. ప‌థ‌కం అమ‌ల్లో భాగంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ నిమిత్తం ఒక్కో ల‌బ్ధిదారుకు ఇచ్చే మొత్తంలో వెయ్యి రూపాయ‌లు కేటాయింపు చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్ మెయింటెనెన్స్ లో భాగంగా మ‌రో వెయ్యి రూపాయ‌లు ల‌బ్ధిదారుల‌కు అందించే మొత్తం నుంచి మిన‌హాయింపు చేస్తున్నాం. నాడు నేడు లో భాగంగా బ‌డులు బాగు ప‌డినందున అవి రేప‌టి వేళ కూడా ఉండాల‌న్నా, అదేవిధంగా చిన్న చిన్న మ‌ర‌మ్మ‌తులు ఏమ‌యినా చేయించాలంటే నిధుల కేటాయింపు చేసే విధంగా ఈ ఫండును ఉప‌యోగించే విధంగా పేరెంట్స్ క‌మిటీ వెచ్చిస్తారు. ఈ నిధుల‌ను టాయిలెట్ మెయింటైనెన్స్ కోసం అదేవిధంగా పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ కోసం ప్ర‌ధానోపాధ్యాయుడి అనుమ‌తితో ఈ నిధులు వెచ్చింపు చేస్తారు. ఈ విధంగా చేస్తే త‌ల్లుల‌లో బాధ్య‌త ఉంటుంది. అదేవిధంగా బ‌డి బాగుండ‌క‌పోతే అడిగే హ‌క్కు వ‌స్తుంది. అందుకే ఈ రెండు కార్య‌క్ర‌మాలు రూపొందింప జేస్తున్నాం. ఈ రెండు వేల రూపాయ‌ల మిన‌హాయింపుపై విమ‌ర్శ‌లు కూడా కొంద‌రు చేస్తున్నారు.. ఇదే ఆశ్చ‌ర్య‌క‌రం. అయినా ఈ మాట‌లు చెబుతున్న వారు వారి జీవితంలో ఏనాడ‌యినా అమ్మ ఒడి లాంటి ప‌థ‌కాన్ని ఏనాడ‌యినా ఇచ్చారా అని అడుగుతున్నాను. మ్యానిఫెస్టోను తూచ త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తూ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నాం. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఆన్లైన్ పాఠాలు అందించే ఉద్దేశంతో బైజూస్-తో ఒప్పందం చేసుకున్నాం. అదేవిధంగా ఎనిమిదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌లతో ట్యాబ్ లు అందిస్తున్నాం. బైజూస్ యాప్ ద్వారా నాలుగో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు మ‌రింత సుల‌భంగా మ‌రింత అర్థ‌వంతం అయ్యే విధంగా విజువ‌ల్ కంటెంట్ రూపొందుతుంది. సీబీఎస్సీఈ సిల‌బ‌స్ తో బై లింగ్విల్ ప్రాట్య‌న్ లో పాఠ్య పుస్త‌కాలు అందించ‌నున్నాం. ఎనిమిదో త‌ర‌గ‌తి లో అడుగుపెట్టబోయే విద్యార్థికి సెప్టెంబ‌ర్ నుంచి 12 వేలు రూపాయ‌లు విలువ చేసే ట్యాబ్ అందించ‌నున్నాం. ఇక‌పై ఎనిమిదో త‌ర‌గ‌తిలో అడుగుపెట్ట‌బోయే విద్యార్థికి ఒక నిరంత‌ర ప్ర‌క్రియ‌గా, ఒక నిరంత‌ర కానుక‌గా విద్యా కానుక‌తో పాటు 12 వేలు విలువ చేసే ట్యాబ్ కూడా అంద‌జేస్తాం.. అదేవిధంగా పిల్ల‌ల జీవితాల‌ను మార్చే విధంగా ప్ర‌తి క్లాస్ రూంలో టీవీని అదేవిధంగా డిజిట‌ల్ మోడ్ లో క్లాస్ రూం ను మార్చేవిధంగా కార్యక్ర‌మానికి శ్రీ‌కారం దిద్ద‌నున్నాం. మ‌న పిల్ల‌లు పోటీ ప్ర‌పంచంలో నెగ్గాలి.. అదేవిధంగా పేద‌రికం నుంచి వాళ్లు బ‌య‌ట‌ప‌డి విజేత‌లు కావాలి. అందుకోసం నేను మీకు తోడుగా ఓ అన్న మాదిరిగా ఉంటాను. విద్యా దీవెన, వ‌సతి దీవెన ప‌థ‌కాల‌నూ వ‌ర్తింప జేస్తున్నాం. మూడేళ్ల‌లో 11 వేల కోట్ల రూపాయ‌లు ఇందుకోసం వెచ్చించాం. గ‌తంలో ఇలా ఉండేది కాదు. గ‌త ప్ర‌భుత్వం పెట్టిన 17 వేల కోట్ల‌కు పైగా బ‌కాయిల‌ను తీర్చాం. విద్యా కానుక ద్వారా మంచి నాణ్య‌త‌తో కూడిన బ్యాగులు, యూనిఫాంలో, బైలింగ్విల్ టెక్స్టు బుక్సు, నోటుబుక్సు,బూట్లు అందించి, ఇందుకోసం రూ. 2324 కోట్లు వెచ్చింపు.. చేశాం.. జ‌గ‌నన్న గోరు ముద్ద ద్వారా 43 ల‌క్షల మందికి మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం వ‌ర్తింపు. గ‌త ప్ర‌భుత్వం ఇవ్వాల్సిన ఎనిమిది నెల‌ల బ‌కాయిలు కూడా మేం అధికారంలోకి వ‌చ్చాక తీర్చాం. అదేవిధంగా నాడు నేడుతో ప్రభుత్వ బ‌డుల రూపు రేఖ‌లు మారిపోయాయి.రెండో ద‌శ‌లో ఎనిమిది వేల కోట్ల‌తో నాడు నేడు చేప‌ట్ట‌నున్నాం. వైఎస్సార్ సంపూర్ణ పోష‌ణ ద్వారా పౌష్టికాహారం పంపిణీ.. మొత్తంగా విద్యా రంగ ప‌థ‌కాల‌కు 52 వేల ఆరువంద‌ల కోట్ల రూపాయ‌లు..వెచ్చించాం. అప్ప‌ట్లో ప్ర‌భుత్వ బ‌డుల‌లో 37 ల క్ష‌ల మంది పైగా ఉండేవారు అదే మేం అధికారంలోకి వ‌చ్చాక గత విద్యా సంవ‌త్సరానికి ఏడు ల‌క్ష‌ల ప‌ది వేల మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు విద్యా సంస్థ‌ల‌లో విద్యార్థుల సంఖ్య 2018 – 19 క‌న్నా 2020 – 21లోనే అనూహ్యంగా ఎక్కువ‌గా ఉంది. అయినా కూడా విష ప్రచార‌మే ! ఇంత మంచి చేస్తున్నా మారీచుల‌తో యుద్ధం చేస్తున్నాం. దుష్ట చ‌తుష్ట‌యంతో యుద్ధం చేస్తున్నాం. వీరందరితో పాటు ఓ ద‌త్త‌పుత్రుడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం. నాకు మీపై నమ్మ‌కం ఉంది.. నాకు ఏ ప్ర‌ధాన మీడియా తోడుగా లేక‌పోయినా మీ తోడు ఉంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. శ్రీ‌కాకుళం జిల్లాకు వ‌రాలు – శ్రీ‌కాకుళంలో కోడిరామ్మూర్తి స్టేడియం పనులకు ప‌ది కోట్ల రూపాయ‌లు మంజూరు – ఇంటిగ్రేటెడ్ క‌లెక్ట‌రేట్ 69 కోట్ల రూపాయ‌లు అద‌నంగా మంజూరు – శ్రీ‌కాకుళం – ఆమ‌దాల‌వ‌ల‌స రోడ్డుకు రూ.40 కోట్లు ఇచ్చాం.. ల్యాండ్ ఎక్విజిషేన్ .. ఇతర ప‌నులు కోసం 18 కోట్లు మంజూరు – వంశ‌ధార నీరు ఎత్తి పోసేందుకు గొట్టా బ్యారేజ్ వ‌ద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ కు రూ.129 కోట్లు – టెక్క‌లి ఆఫ్ షోర్ కు 855 కోట్లు మంజూరు – వంశ‌ధార ఫేజ్ 2 ప‌నులు జ‌రుగుతున్నాయి.. – స‌వ‌రించిన అంచనాల ప్ర‌కారం రూ. 2407 కోట్లు..మంజూరు – ఈ ఏడాది డిసెంబ‌ర్-కు ప్రాజెక్టు పూర్తి – ఉద్దానం ప్రాంతంలో వంశ‌ధార నీరు అందించేందుకు రూ.700కోట్ల‌తో ప‌నులు జ‌రుగుతున్నాయి. 70 శాతం ప‌నులు పూర్త‌య్యాయి. ఆ ప్రాజెక్టుకు, ఇచ్ఛాపురం, ప‌లాస, పాత‌ప‌ట్నంలో మూడు మండ‌లాల‌కు రెండు వంద‌ల 50 కోట్ల‌కు పైగా నిధులు.. దాదాపు వెయ్యి కోట్ల రూపాయ‌ల‌తో పైప్ లైన్ ద్వారా వంశ‌ధార అందించేందుకు ప‌నుల‌కు నిధులు మంజూరు చేస్తూ సీఎం కీల‌క ప్ర‌క‌ట‌న.
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలు మీ కోసం… ‘యశోద’ కథ విన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఇటువంటి క్యారెక్టర్లను ఎలా రాశారు? ఈ కథను ఎలా ఆలోచించారు? అని ఆశ్చర్యపోతూ అడిగాను. మీరు ట్రైలర్ చూస్తే… నా క్యారెక్టర్ చాలా కామ్ గా ఉంటుంది. కథ ముందు సాగేటప్పుడు క్యారెక్టర్ గురించి మరింత రివీల్ అవుతుంది. గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశా. సమంత క్యారెక్టర్, నా క్యారెక్టర్ మధ్య ఉన్న రిలేషన్… మా కథలు ఆసక్తిగా ఉంటాయి. ఈ స్క్రిప్ట్ వరకు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? పెద్ద ఛాలెంజెస్ ఏమీ లేవు. సమంతలా నేను ఫైట్స్ ఏమీ చేయలేదు. నటిగా మంచి క్యారెక్టర్ చేశాను. ఒక డిఫరెంట్ రోల్ చేసేటప్పుడు నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటా. ఆ విధంగా ఛాలెంజింగ్ అనిపించింది. మీరు ‘యశోద’ చేయడానికి, ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి? సమంతతో పాటు నా క్యారెక్టర్ కూడా ప్యారలల్ గా ఉంటుంది. సినిమాలో లీడ్ రోల్ సమంత చేశారు. ఆమెకు ఒకరు అవసరం అవుతారు. అప్పుడు నా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. రెండు కథలు జరుగుతాయి. ఆ రెండూ ఎలా కలిశాయి? అనేది సినిమా. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. నాది సెకండ్ లీడ్ అని చెప్పవచ్చు. ఇంత కంటే ఎక్కువ చెబితే స్టోరీ రివీల్ అవుతుంది. ప్రతి ఒక్కరిలో మంచి చెడులు చూపించారు. మీది డాక్టర్ క్యారెక్టరా? డాక్టర్ కాదు అండి. ట్రైలర్ లో చూపించిన సరోగసీ ఫెసిలిటీ సెంటర్ హెడ్. ఆమె చాలా రిచ్. డబ్బులు అంటే ఇష్టం. నిజ జీవితంలో నా డ్రసింగ్ స్టైల్, ఇతర అంశాలకు పూర్తి విరుద్ధంగా ఆ పాత్ర ఉంటుంది. తనను తాను బాగా ప్రేమించే పాత్ర. దర్శకులు హరి, హరీష్ గురించి చెప్పండి! దర్శకులు ఇద్దరూ చాలా కామ్. నేను పని చేసిన దర్శకుల్లో అంత కామ్ గా ఎవరినీ చూడలేదు. వాళ్ళిద్దరూ అరవడం ఎప్పుడూ చూడలేదు. వాళ్ళకు ఏం కావాలో బాగా తెలుసు. ఒక్కో క్యారెక్టర్ కోసం చాలా రీసెర్చ్ చేశారు. మహిళల పాత్రలను చాలా మంది రిలేట్ చేసుకుంటారు. ఆ విధంగా క్యారెక్టర్లు డిజైన్ చేశారు. టెక్నికల్ పరంగా సినిమా ఎలా ఉండబోతోంది? సినిమాటోగ్రాఫర్ సుకుమార్ గారు అద్భుతంగా షూట్ చేశారు. సినిమాలో సంగీతానిది కీలక పాత్ర. మణిశర్మ గారు మంచి సంగీతం అందిస్తున్నారు. మీరు పెట్టే టికెట్ రేటుకు వేల్యూ ఉంటుంది. సినిమాలో అంత మంచి కంటెంట్ ఉంది. క్వాలిటీ విజువల్స్ ఉంటాయి. మా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారు ఎంతో ఖర్చుపెట్టి సెట్స్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ కనబడుతోంది. సరోగసీ గురించి ఇండియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. కథ ఏ విధంగా ఉండబోతోంది? సరోగసీ కాంప్లికేటెడ్ ఏమీ కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల డిస్కషన్స్ జరుగుతున్నాయి. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్ అంతే! అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు. ఇది ఫిక్షనల్ స్టోరీ. కానీ, సమాజంలో అటువంటి మనుషులు ఉన్నారని అనిపిస్తుంది. ‘యశోద’లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏది? నా క్యారెక్టర్‌లో డెప్త్ నాకు బాగా నచ్చింది. ‘యశోద’ క్యారెక్టర్ కూడా వెరీ స్ట్రాంగ్ రోల్. సమంత చాలా కష్టపడ్డారు. క్యారెక్టర్స్ కంటే కథ నా ఫేవరెట్. నాకు, రావు రమేశ్ గారికి మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయి. అలాగే… ఉన్ని ముకుందన్, నాకు మధ్య సీన్స్ ఉన్నాయి. అన్నీ బావున్నాయి. ‘యశోద’లో కథే హీరో. మేమంతా ఆ కథలో పాత్రధారులు మాత్రమే. సమంతతో ఫస్ట్ టైమ్ సినిమా చేశారు. ఆమెతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? నాకు సమంత పది పన్నెండు ఏళ్ల క్రితమే తెలుసు. మాకు చెన్నైలో పరిచయం అయ్యింది. సినిమాలో తనకు సీరియస్ సీన్స్ ఉన్నాయి. నేను ఏమో షూటింగ్ గ్యాప్ వస్తే జోక్స్ వేసేదాన్ని. తను నవ్వేది. ‘షాట్ ముందే ఎందుకు ఇటువంటి జోక్స్ వేస్తావ్?’ అనేది. తనతో నటించడం సరదాగా ఉంటుంది. తను స్ట్రాంగ్ విమెన్. పాత్రలో జీవించింది. పవర్ ఫుల్ రోల్ బాగా చేసింది. తెలుగులో మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు ప్రేక్షకుల గురించి… ‘క్రాక్’లో జయమ్మ తర్వాత నాకు మంచి రోల్స్ వస్తున్నాయి. రచయితలు నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాస్తున్నారు. ఇప్పుడు నేను తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. బయటకు వెళ్ళడానికి ఖాళీ లేదు. తమిళ సినిమాలు చేయడానికి డేట్స్ లేవు. నాకు స్టీరియో టైప్ రోల్స్ రావడం లేదు. అది సంతోషంగా ఉంది. ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు? తెలుగులో ‘శబరి’ చేస్తున్నా. అందులో నాది లీడ్ రోల్. ‘వీర సింహా రెడ్డి’లో నాది క్రేజీ క్యారెక్టర్. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి.
అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. ఈ నెల 29న టీజర్‌ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. Source: Eenadu నటి కాజల్‌ అగర్వాల్ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఆమె శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన కాజల్‌తో పలువురు అభిమానులు ఫొటోలు దిగారు. Source: Eenadu తుమ్మలగుంట శ్రీ కల్యాణ వెంకన్న ఆలయాన్ని త్రిదండి చిన్నజీయర్‌ స్వామి సందర్శించారు. అనంతరం అక్కడి వేద పాఠశాలను, ఆలయ పుష్కరిణి, పరిసరాలను చిన్నజీయర్‌ స్వామి పరిశీలించారు. Source: Eenadu చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకుని సిద్దిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్‌లో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి తన్నీరు హరీశ్‌రావు. Source: Eenadu విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. Source: Eenadu హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ‘సూత్ర దీపావళి ఎగ్జిబిషన్‌’ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. Source: Eenadu ఫిలిప్పీన్స్‌లో ‘నోరు’ తుపాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల కారణంగా పలువురు మృతి చెందారు. అక్కడి అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు చేపట్టారు. Source: Eenadu మంత్రి కేటీఆర్‌ బాసర ఐఐఐటీలో విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.
‘సిరివెన్నెల’ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం. ప్రకాష్‌ పులిజాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కమల్‌ బోరా, ఏఎన్‌బాషా, రామసీత నిర్మాతలు. మహానటి ఫేమ్ సాయి తేజస్విని, బాహుబలి ఫేమ్ కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆడియో ఫంక్ష‌న్ 20 జూన్, శ‌నివారం ఆర్‌.కె.మ‌ల్టీ ప్ల‌క్స్‌లో ఘ‌నంగా జరిగింది. ఈ స‌మావేశ వివరాలు 64 పాఠకులకోసం… ఆర్‌.పి. ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ…మా మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి ప్రొడ్యూస‌ర్ గా భాషా రావ‌డం చాలా ఆనందంగా ఉంది. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారి న‌ట‌వార‌సురాలు సాయి చాలా బాగా చేసింది. ఆల్ ద బెస్ట్‌. నీకు చాలా పెద్ద హీరోయిన్ వి అవుతావు. ఈ చిత్రంలో న‌టించిన వారంద‌రికీ గుడ్‌ల‌క్‌. బెమిని సురేష్ నా స్నేహితుడు ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్ట‌ర్ చేశారు. ఎంటైర్ టీమ్ కి ఆల్ ద బెస్ట్ అన్నారు. ప్రియ‌మ‌ణి మాట్లాడుతూ… నేను ఈ సినిమాలో ఇంత బాగా క‌నిపించ‌డానికి కార‌ణం ప్ర‌కాష్‌గారు. నాకు చెన్నైలో ఉండ‌గా ఓం ప్ర‌కాష్‌, భాషాగారు వ‌చ్చి క‌థ వినిపించారు. నేను ఒక‌రోజు సమయం అడిగి మా ఇంట్లోవాళ్ళ‌కి చెప్పి, క‌థ నాకు కూడా న‌చ్చడంతో ఓకే చెప్పాను. ఈ సినిమాతో నా సెకన్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన‌ట్లే. ఇందులో సెకెండ్ హీరోయిన్‌గా న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ చాలా బావున్నాయి. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన భాషాగారికి ఓం ప్ర‌కాష్‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ… నా ఎస్‌.కె. పిక్చ‌ర్స్ స్టూడెంట్ నెం.1 చిత్రం నుంచి ప్రారంభ‌మైంది. అప్ప‌టి నుంచి భాషా నాకు ప‌రిచ‌యం. ఇండ‌స్ట్రీలో ఎన్నో చూశారు ఆయ‌న‌. ఆయ‌న‌కి మంచి స‌క్సెస్ రావాల‌ని కోరుకుంటున్నాను. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ… మీ తాతయ్య న‌వ్వించేవారు నువ్వు భ‌య‌పెడుతున్నావు. మ‌హాన‌టితో స్టార్ట్ చేశావ్. మ‌న స‌క్సెస్ క‌న్నా మ‌న పిల్ల‌ల స‌క్సెస్ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. భాషాకి రాజ‌మౌళి తెలుసు, రాఘ‌వేంద్ర‌రావు తెలుసు అంద‌రితోనూ ప‌ని చేశారు. నా సినిమాల‌కు చాలా వ‌ర‌కు ఆయ‌నే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఒక సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేక పోతే సినిమానే లేదు. క‌మ‌ల్‌గారు మీరు చాలా క‌రెక్ట్ ప‌ర్స‌న్‌ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నారు. ప్రియ‌మ‌ణి స‌తిసావిత్రి లాగా అటు మోడ్ర‌న్‌, ఇటు ట్రెడిష‌న‌ల్ ఏపాత్ర కైనా సూట్ అవుతుంది. ప్ర‌స్తుతం యాక్ష‌న్ చిత్రం చెయ్య‌డం చాలా బావుంది. అంద‌రికీ థ్యాంక్స్‌. ట్రైల‌ర్ స్టార్టింగ్ జై జై గ‌ణేషా సాంగ్ అన్నారు. ఆల్ ద బెస్ట్ అని అన్నారు. ద‌ర్శ‌కుడు ఓం ప్రాకాష్ మాట్లాడుతూ…’ అన‌గ‌న‌గా ఓ దుర్గా’ చిత్రం చేశాను. ఆ సినిమా చూసి భాషాగారు ఏద‌న్నా క‌థ ఉంటే చెప్ప‌మ‌న్నారు. అప్పుడు ఈ క‌థ చెప్పాను. భాషాగారికి, బోరా గారికి క‌థ న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఓ కే అయింది. క్యారెక్ట‌ర్ కోసం ఎదురు చూస్తున్న స‌మ‌యంలో ప్రియ‌మ‌ణిగారికి ఈ క‌థ చెప్ప‌డంతో ఆవిడ‌కి న‌చ్చ‌డంతో ఓకే అన్నారు. నా రెండో చిత్ర‌మే నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌తో చెయ్య‌డం దేవుడిచ్చిన వ‌రంగా భావిస్తున్నాను. సిరివెన్నెల పాత్ర ఎవ‌రు అని ఆలోచించే స‌మయంలో మ‌హాన‌టి చిన్నారి గుర్తుకువ‌చ్చింది. రాజేంద్ర‌ప్రసాద్‌గారికి చెప్పి డేట్స్ తీసుకున్నాము. మంచి క్యారెక్ట‌ర్స్ సిరివెన్నెల పాప చాలా బాగా న‌టించింది. సినిమా కూడా చాలా బాగా వ‌చ్చింది. నాకు ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన భాషా, బోరా గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. ప్రొడ్యూస‌ర్ భాషా మాట్లాడుతూ… ఇంత మంచి చిత్రం అందించిన ప్రొడ్యూస‌ర్ క‌మ‌ల్‌బోరాగారికి, డైరెక్ట‌ర్ ఓం ప్ర‌కాష్‌కి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. ప్రొడ్యూస‌ర్ క‌మ‌ల్ బోరా మాట్లాడుతూ… ఇది నా రెండ‌వ సినిమా నా మొద‌టి చిత్రంకి మంచి పేరు వ‌చ్చింది. రెండో చిత్రానికి పేరుతో పాటు డ‌బ్బులు కూడా రావాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంది అని అన్నారు. ఎం.ఎం. కీర‌వాణి మాట్లాడుతూ… ప్రొడ్యూస‌ర్ భాషా శివ‌రాం అనే కీబోర్డ్ ప్లేయ‌ర్ ద‌గ్గ‌ర ఆఫీస్ బాయ్‌గా చేరారు. ఆ త‌రువాత అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ నా ద‌గ్గ‌ర మ్యూజిక్ కోఆర్డినేట‌ర్‌గా ప‌నిచేశారు. ఆయ‌న‌లో ఉన్న ప్ర‌త్యేక‌త ఏమిటంటే ఒక సినిమాకి ప‌నిచేస్తూ కూడా అన్ని ప‌నులు ఏక‌కాలంలో చెయ్య‌గ‌ల‌రు. ఒక ప్రొడ్యూస‌ర్‌కి కావ‌ల‌సిన అన్ని ల‌క్ష‌ణాలు భాషా గారిలో ఉన్నాయి. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించి ఇండ‌స్ట్రీకి ఎంతోమంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌ని ప‌రిచ‌యం చెయ్యాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ…నేను ఈ స్టేజ్ మీద నిల‌బ‌డ‌డానికి కార‌ణ‌మైన భాషాగారికి కృత‌జ్ఞ‌త‌లు. తెలుగు సినిమాని ఇంట‌ర్‌నేష‌న‌ల్ స్టాయికి ప‌రిచ‌యం చేసిన కీర‌వాణిగారికి, ఆర్‌.పి. ప‌ట్నాయ‌క్ ఇంత మంచి మ‌హానుభావులను ఒకే వేదిక‌మీద క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది అన్నారు. ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ సినిమా జయ్ జ‌య్ గ‌ణేషా అనే పాట‌తో ప్రారంభించారు. అంతా మంచే జ‌రుగుతుంది. ప్ర‌తి వినాయ‌క‌చ‌వితికి పెట్టుకుని వినే పాట అవుతుంది. మా మ‌న‌వ‌రాలు గురించి నేను చెప్ప‌కూడ‌దు మీరే ఈ సినిమా చూసి ఎలా న‌టించిందో చెప్పండి అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎం జగన్ వెళ్తుండగా.. ఆయనను చూసిన కొం... Breaking : సీఎం జ‌గ‌న్ పర్యటనలో అపశృతి.. సీఎం జ‌గ‌న్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం సీఎం జగన్‌ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించారు.ఈ సందర్భంగా పరిసర జిల్లాలకు చెందిన... పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చే వారిని.. ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారు.. జగన్ తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చే వారిని ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నార... 15రోజుల్లో భూ పత్రాలు .. ఇదొక మహాయజ్ఙం..సీఎం జగన్ 15రోజుల్లో అందరికీ భూ పత్రాలు అందిస్తామని.. ఇదొక మహాయజ్ఙం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జ... డిసెంబర్ 23లోగా భూ రీ సర్వే పూర్తి .. సీఎం జగన్ భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోందని, డిసెంబర్ 23లోగా రీ సర్వే పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నార... నరసన్నపేటకు చేరుకున్న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నరసన్నపేటలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పత్రాల పంపిణీని ఆయన ప్రార... 23న శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 23వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జగనన్న శాశ్వత భూ... రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు మృతి.. శ్రీకాకుళం : జిల్లాలోని నందిగాం మండలం పెద్దినాయుడుపేట జాతీయ రహదారిపై ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందార... అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత శ్రీకాకుళం : అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వ‌హించి ప‌ట్టుకున్నారు. ప్రాంతీయ నిఘా అమలు అధికారి ... శ్రీకాకుళం జిల్లాలో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. ఊడిన ఆర్టీసీ బస్‌ చక్రాలు.. బ‌స్ ర‌న్నింగ్ లో ఉండ‌గా చ‌క్రాలు ఊడిపోయిన ఘ‌ట‌న శ్రీ‌కాకుళం జిల్లా సోంపేట మండ‌లంలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని పలాసపుర... శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రత్యర్థు... Bear : బేతాళపురంలో ఎలుగుబంటి హల్‌చల్‌ శ్రీకాకుళం : బేతాళపురంలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. పాతాళేశ్వర స్వామి ఆలయంలోకి ఎలుగుబంటి చొరబడింది. దీంతో అక్కడ ఉన్న భక్తులు ఎలుగుబంటిని చ...
“The sole purpose of the Constitution is to unite people of the country”, said Indresh Kumar Ji, national executive member of the Rashtriya Swayamsevak Sangh. On Nov 26, Samajika Samarasatha Vedika, Muslim Rashtriya Manch, and SC/ST Rights Forum organized an event commemorating the National Constitution Day at the Zakir Hussain Auditorium of Hyderabad Central University. […] Bharat has to be strong for Vishwa Kalyaan: Sarsanghchalak Mohan Bhagwat Ji Sarsanghchalak of Rashtriya Swayamsevak Sangh (RSS) Dr. Mohan Bhagwat said that India will have to become powerful for the welfare of the world. Till now the superpowers have only run their stick on on the world. These superpowers have been running their own system for their own benefit. Once upon a time, Britain used to […] కేరళ : మదర్సాలలో మైన‌ర్ బాల‌బాలిక‌లపై లైంగిక వేధింపులు… పెరుగుతున్న‌ పోక్సో కేసులు గత కొన్ని రోజులుగా కేర‌ళ రాష్ట్రం నలుమూలల నుండి అనేక పోక్సో (లైంగిక నేరాల నుండి బాలల రక్షణ) చట్టం కేసులు నమోదయ్యాయి. ఎడక్కాడ్‌లో మైన‌ర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మదర్సా మతాధికారిని కోజికోడ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కన్నూర్‌కు చెందిన షంషీర్ రిమాండ్‌కు తరలించారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని షంషీర్ బాధితురాలిని బెదిరించినట్లు సమాచారం. అయినప్పటికీ మైనర్ తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వ‌డంతో నిందితున్ని అరెస్టు చేశారు. మరికొంత మంది […] VIDEO: సైన్స్ ప్రపంచంలో భారత కీర్తి పతాక డా. జ‌గ‌దీష్ చంద్ర‌బోస్‌ ప్రపంచానికి మిల్లీమీటర్ తరంగాలు, రేడియో, క్రెస్కోగ్రాఫ్ ప్లాంట్ సైన్స్ అందించిన శాస్త్రవేత్తగా జగదీష్ చంద్ర బోస్ పేరుగడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక అంతర్జాతీయ పురస్కరాలను బోస్ అందుకున్నారు. అంతర్జాతీయ పరిశోధనా రంగంలో భారతీయ కీర్తి పతాకను ఎగురవేశారు. అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన భారతీయ పరిశోధక శాస్త్రవేత్తగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. The post VIDEO: సైన్స్ ప్రపంచంలో భారత కీర్తి పతాక డా. జ‌గ‌దీష్ చంద్ర‌బోస్‌ appeared first on VSK Telangana. విజ్ఞానశాస్త్రానికీ, విశ్వాసానికీ దూరమెంత? నవంబర్‌ 30 ‌- జగదీశ్‌ ‌చంద్రబోస్‌ ‌జయంతి ‘రాత్రివేళ మొక్కలని బాధ పెట్టకూడదు. అవి నిద్రపోతాయి.’ ఎందుకో మరి, ఒకరాత్రి పూట ఆ పిల్లవాడు పువ్వు తెంపడానికి ఒక మొక్కవైపు చేయి చాపినప్పుడు అతడి తల్లి అలా మందలించింది. ఆ బాలుడే జగదీశ్‌ ‌చంద్ర బోస్‌ (‌జేసీ బోస్‌), ‌మందలించిన ఆ మహిళ బామాసుందరీ బోస్‌. అతని కన్నతల్లి. ఇదేమాట ఎన్నో తరాలలో ఎందరో తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు ఎందరో పిల్లలకు చెప్పారు కూడా. కొందరు పిల్లలు […] ఆధునిక మహర్షి జగదీశ్‌ చంద్రబోస్ నవంబర్‌ 30 జగదీష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా బ్రిటీష్‌ ఇండియా బెంగాల్‌ ప్రావిన్స్‌లోని మున్షీగంజ్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) లో 1858 నవంబరు 30వ తేదీన జగదీశ్‌ చంద్రబోస్‌ జన్మించాడు. అతని తండ్రి భగవాన్‌ చంద్రబోస్‌ బ్రహ్మసమాజీ. ఇతను డిప్యూటి మెజిస్ట్రేట్‌, సహాయ కమిషనరుగా ఫరీద్‌పూర్‌, బర్దమాన్‌ వంటి పలుచోట్ల పనిచేశారు. జగదీశ్‌ చంద్రబోస్‌ ప్రాథమిక విద్యభ్యాసం బంగలా భాషలో, స్వదేశీ స్కూల్లో ప్రారంభమైంది. ఆ రోజుల్లో ధనవంతులకు ఆంగ్ల విద్య మీద మోజు ఉన్నా జగదీశ్‌ […] ఢిల్లీలో ఇమామ్‌లకు వేతనాలు… రాజ్యాంగ ఉల్లంఘనే – కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్‌ ఢిల్లీలోని మసీదులలో ఇమామ్‌లు, ముస్లిం మతపెద్దలకు వేతనాన్ని అనుమతిస్తూ 1993 సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పన్ను చెల్లింపుదారుల డబ్బును ఏదైనా ప్రత్యేక మతానికి అనుకూలంగా ఉపయోగించరాదని పేర్కొన్న రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్ ఉదయ్ మహుర్కర్ అన్నారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ పిటిషన్ ఆధారంగా, 1993లో సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డు నిర్వహించే మసీదుల్లోని ఇమామ్‌లకు వేతనం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మసీదుల ఇమామ్‌లకు […] చైనాలో ప్ర‌జ‌ల ఆగ్ర‌హం… COVID లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు ప్ర‌మాదంలోనూ నిబంధ‌న‌లు స‌డ‌లించ‌ని వైనం ప‌త్రికా స్వేచ్చకు భంగం చైనా పశ్చిమ జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో కోవిడ్ లాక్‌డౌన్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చెలరేగాయి. చైనా దేశవ్యాప్తంగా అంటువ్యాధులు రికార్డును స్థాయిలో న‌మోదవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఆగ‌స్టు నుంచి లాక్‌డౌన్ విధించారు. అయితే ఇటీవ‌ల ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించడం ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి కార‌ణమ‌యింది. ఒక‌వైపు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు, మ‌రో వైపు అగ్నిప్ర‌మాదంలో ప్ర‌జ‌లు చిక్కుకుపోయారు. దీంతో లాక్‌డౌన్ ఎత్తివేయాల‌ని ఆందోళ‌న చేశారు. నవంబర్ 25 శుక్రవారం రాత్రి […] మార్గదర్శి బాలాసాహెబ్‌ దేవరస్‌ 28 నవంబర్ (మార్గశిర‌ శుక్ల పంచమి, 1915) – బాలాసాహెబ్‌ దేవరస్ జ‌యంతి రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి మూడవ సర్‌సంఘచాలక్‌గా నేతృత్వం వహించిన బాలాసాహెబ్‌ దేవరస్‌ది విశిష్ఠ వ్యక్తిత్వం. బాలాసాహెబ్‌ అసలు పేరు మధుకర్‌ దత్తాత్రేయ దేవరస్‌. మధుకర్‌, అతని తమ్ముడు భావురావు దేవరస్‌ ఇద్దరూ 1929లో తమ 12వ యేటనే బాల స్వయంసేవకులుగా ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో చేరారు. ఇద్దరిలో చిన్నప్పటి నుండే సహజంగా నాయకత్వ లక్షణాలుండేవి. మధుకర్‌ నిర్వహించే ఆర్‌.ఎస్‌.ఎస్‌. గణకు ఎప్పుడూ ఎక్కువ సంఖ్యలో బాల […] ‘‌సెక్యులరిజం అంటే మెజారిటీ ప్రజల హక్కులను హరించడం కాదు!’ రాజ్యాంగ దినోత్సవం (నవంబర్‌ 26) ‌సందర్భంగా జస్టిస్‌ ‌నరసింహారెడ్డితో జాగృతి ముఖాముఖీలోని కొన్ని అంశాలు: రెండ‌వ భాగం ప్ర‌శ్న‌ : సెక్యులరిజం అనే మాటను లేక భావనను రాజ్యాంగంలో చేర్చడానికి మన రాజ్యాంగ నిర్మాతలు సందేహించారు. కానీ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ దానిని రాజ్యాంగంలోకి తీసుకొచ్చారు. తరువాత పరిణామాలు ఏమిటి? ఇపుడు సెక్యులరిజం పేరుతో, కొత్త భాష్యాలతో దేశాన్ని వర్గాలుగా చీల్చే ప్రయత్నం, ఒక విషాదకర దృశ్యం కనిపిస్తోంది. దీన్ని ఎలా చూస్తారు? జ‌వాబు : సెక్యులరిజమనేది […]
-బంగారు తెలంగాణ దిశగా బలమైన అడుగులు -సంపద సృష్టించాలి.. సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలి -ఇదే ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం పురోగమిస్తున్నది -ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా -అదేరోజు నుంచి కంటివెలుగుకు శ్రీకారం -సత్ఫలితాలనిస్తున్న ప్రభుత్వ పథకాలు -యావత్ దేశం దృష్టిని ఆకర్షించాం -ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలో మన పథకాలు -21% ఆదాయం వృద్ధితో నంబర్‌వన్ -నిరంతర ఆరాటంలోంచి ఉద్భవించిందే రైతుబంధు -బీమాపత్రాలు కావవి.. రైతుకు అందించే భద్రతాపత్రాలు -తెలంగాణకు జీవనదాయిని కాళేశ్వరం -ఇక క్రియాశీలకంగా పంచాయతీ పాలకవర్గాలు -రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు సకల జనుల సౌభాగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. సంపద సృష్టించాలి.. సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలి అనే సూత్రం ప్రాతిపదికగా ప్రభుత్వం పురోగమిస్తున్నదని తెలిపారు. గడిచిన నాలుగేండ్లలో బంగారు తెలంగాణ దిశగా బలమైన అడుగులు వేయగలిగామని అన్నారు. నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించామని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్నదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును వ్యవసాయానికి వరదాయిని, తెలంగాణకు జీవనదాయినిగా సీఎం అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన ప్రధాన కార్యక్రమానికి హాజరైన సీఎం.. జాతీయజెండా ఎగురవేసి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం గత నాలుగేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ ఆలోచనలను వివరించారు. రాష్ట్ర సాధనకోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి వెలుగు పేరిట నేత్ర పరీక్షలను ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి రైతులకు అందించే బీమా పత్రాలు.. రైతుల కుటుంబాలకు భద్రతా పత్రాలని అభివర్ణించారు. త్వరలో నూతన రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. రైతులను ఆదుకునేందుకే రైతుబంధు వ్యవసాయ సీజన్ వస్తే పెట్టుబడి కోసం రైతులు ఎన్ని బాధలు పడుతారో ఒక రైతుగా నాకు తెలియంది కాదు. పెట్టుబడి కోసం ఇండ్లు, భూము లు, నగలు కుదువపెట్టి, అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకునే దుస్థితి ఉండేది. ఇంతాచేస్తే పంట చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు. వచ్చినా గిట్టుబాటు ధర లభిస్తుందో లేదో తెలియదు. ఫలితంగా రైతులు అప్పులపాలై చితికిపోయేవారు. ఈ పరిస్థితుల నుంచి రైతును బయటపడేయాలి.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి.. ఎంత భారమైనా రైతులను మరింత ఆదుకోవాలి.. వారి ముఖంలో ఆనందం చూడాలి.. అనే నిరంతర ఆరాటంలోంచి ఉద్భవించిందే రైతుబంధు పథకం. రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి రూ.8వేల చొప్పున ఈ ఏడాది నుంచే పెట్టుబడి సాయం అందిస్తున్నాం. తొలి విడుత చెక్కుల పంపిణీతో గ్రామాల్లో, రైతాంగంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ పథకం రైతన్నలలో ఆత్మైస్థెర్యాన్ని నింపింది. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగాల్సిన దుస్థితి తొలిగించింది. ఈ పథకం ప్రారంభంతో ఇన్నాళ్లకు రైతు మోములో ఆనందాన్ని చూడగలుగుతున్నాం. ఈ పథకం ఇతర రాష్ట్రాలలోనే కాదు, విదేశాలలో ఉంటున్నవారిలో కూడా చైతన్యం కలిగించింది. కొంతమంది సంపన్నవర్గాల రైతులు, దాతలు తమకు వచ్చిన పెట్టుబడి మొత్తాలను రైతు సంక్షేమానికే వినియోగించాలంటూ ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని కొన్ని పార్టీలు మన కార్యక్రమాలకు ఆకర్షితమై ఆయా పథకాలను యథాతథంగా వారి ఎన్నికల ప్రణాళికల్లో పెట్టుకోవడం విశేషం. రైతులకు జీవిత బీమా రైతులకు భూమి తప్ప మరే జీవనాధారం ఉండదు. రాష్ట్రంలో చాలామంది చిన్న, సన్నకారు రైతులే. ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 18 లక్షలమంది ఉన్నారు. పేదరైతులెవరైనా దురదృష్టవశాత్తూ చనిపోతే, వారి కుటుంబాలు ఉన్నట్టుండి అగాథంలో పడిపోతాయి. అటువంటి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఉండాలనే ఉదాత్తమైన ఆలోచనతో ప్రభుత్వం ఎల్‌ఐసీ ద్వారా రైతులకు జీవితబీమా పథకాన్ని ప్రారంభిస్తున్నది. ఇకపై తెలంగాణలో ఏ రైతు మరణించినా అతని కుటుంబానికి 10 రోజుల్లోనే ఐదు లక్షల జీవిత బీమా మొత్తం అందితీరుతుంది. రైతు మీద ఒక్క పైసా భారం వేయకుండా ప్రీమియాన్ని ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది. ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా పత్రాలు అందుతాయి. ఇవి కేవలం బీమా పత్రాలు కావు.. రాష్ట్రంలోని రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న భద్రతా పత్రాలు. సృష్టించిన సంపద ప్రజలకు పంచాలి 21% ఆదాయాభివృద్ధి రేటుతో ధనిక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. సంపద సృష్టించాలి.. సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలి అనే సూత్రం ప్రాతిపదికగా ప్రభుత్వం పురోగమిస్తున్నది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.40వేల కోట్లతో 40 పథకాల ద్వారా ప్రజాసంక్షేమానికి పెద్దఎత్తున పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఆసరా పింఛన్లు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు, ఇమామ్, మౌజన్‌లకు ప్రభుత్వం జీవనభృతి అందిస్తున్నది. కల్యాణలక్ష్మి ద్వారా రూ.1,00,116 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రైతు రుణమాఫీ, నిరంతర విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, పెద్ద ఎత్తున గోదాంల నిర్మాణం, నీటితీరువా బకాయిల రద్దు తదితర నిర్ణయాలతో రైతుల జీవితాల్లో ఆనందపు వెలుగులు నిండాయి. గణనీయంగా పెరుగుతున్న పశుసంపద గొల్ల, కురుమలకు 75% సబ్సిడీపై ప్రభుత్వం పెద్ద ఎత్తున గొర్రెలు పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే పంపిణీచేసిన గొర్రెలు పిల్లలను పెడుతుండటంతో రాష్ట్రంలో పశుసంపద గణనీయంగా పెరుగుతున్నది. చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. వీటి పెంపకానికి అవసరమయ్యే పెట్టుబడిని ప్రభుత్వమే భరించి, లాభాలు మాత్రం బెస్త, ముదిరాజ్ తదితర మత్స్యకారులకు అందిస్తున్నది. నవీన క్షౌరశాలల ఏర్పాటుకు నాయీ బ్రాహ్మణులకు, అధునాతన యంత్రపరికరాల కొనుగోలుకు రజకులకు, అదే విధంగా ఇతర కులాల వారికి ఆర్థిక సహాయం అందించబోతున్నది. కల్లుగీత వృత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే రాష్ట్రవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఈత, తాటిచెట్ల పెంపకం చేపట్టింది. సంచార, ఆశ్రిత కులాలు, తదితర వర్గాలవారి కోసం రూ.1000 కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటుచేశాం. నాలుగేండ్లలో కొత్తగా 3155 కి.మీ. జాతీయ రహదారులు రాష్ట్రం ఏర్పడేనాటికి మనకు జాతీయ రహదారులు చాలా తక్కువగా ఉండేవి. జాతీయ సగటు 2.80 కిలోమీటర్లుంటే తెలగాణలో కేవలం 2.20 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణలో 2,527 కిలోమీటర్ల హైవేలుంటే, ఈ నాలుగేండ్లలో కొత్తగా 3,155 కిలోమీటర్ల జాతీయ రహదారులు సాధించుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో 5,682 కిలోమీటర్ల జాతీయ రహదారులున్నాయి. హైవేల్లో దేశ సగటు 3.81 కిలోమీటర్లుంటే, రాష్ట్రంలో 5.02 కిలోమీటర్లుంది. నిరుపేదల ఆత్మగౌరవం పెంచే డబుల్ ఇండ్లు నిరుపేదల ఆత్మగౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2.65 లక్షల ఇండ్లు మంజూరుచేసి, నిర్మిస్తున్నాం. హైదరాబాద్ నగరంలోనే నిరుపేదలకు లక్షకు పైగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నాం. ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ కంటి పరీక్షలు, చికిత్స ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం కంటి వెలుగు పేరుతో పథకాన్ని రూపొందించింది. ఆగస్టు 15వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి పరీక్ష శిబిరాల నిర్వహణ ప్రారంభమవుతుంది. ఉచితంగా కండ్లద్దాలు పంపిణీ చేయడంతోపాటు, అవసరమైనవారికి ప్రభుత్వం శస్త్ర చికిత్సలు చేయిస్తుంది. రికార్డుస్థాయిలో గురుకులాలు కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానం అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను ఏర్పాటుచేశాం. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర వర్గాలకు 296 గురుకులాలే ఉండేవి. రికార్డుస్థాయిలో 542 కొత్త గురుకులాలు ఏర్పాటుచేసుకున్నాం. వీటిలో ఉచిత విద్య, హాస్టల్ వసతితోపాటు ఒక్కో విద్యార్థికి ఏడాదికి మూడు జతల యూనిఫారాలు, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు చక్కటి పోషకాహారం, గుడ్లు, పాలు, పెరుగు, మాంసాహారం, నెయ్యి కూడా అందిస్తున్నాం. మన గురుకులాల్లోని వసతులు, అందిస్తున్న ఆహారం, విద్యావిధానాన్ని గమనించేందుకు వివిధ రాష్ట్రాల ఉన్నతాధికార బృందాలు వచ్చివెళ్తున్నాయి. రాష్ట్రంలో అటవీప్రాంతాన్ని 33 శాతానికి పెంచే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున అమలుచేస్తున్నాం. గత మూడేండ్లలో 82 కోట్ల మొక్కలు నాటాం. తెలంగాణ గర్వకారణం అనుదీప్ సివిల్స్‌లో ఎంతోమంది తెలంగాణ బిడ్డలు విజయం సాధించారు. దేశం మొత్తం మీద ప్రథమస్థానం సాధించిన అనుదీప్ తెలంగాణ బిడ్డే కావడం మనందరికీ గర్వకారణం, నాకెంతో సంతోషం కలిగించింది. రాష్ర్టానికి పెట్టుబడుల వెల్లువటీఎస్‌ఐపాస్ విధానం పారిశ్రామికవేత్తలకు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 7155 పరిశ్రమలు అనుమతి పొందాయి. రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 5.74 లక్షలమందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌కు పరిమితమైన ఐటీరంగాన్ని ప్రభుత్వం ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరింపజేస్తున్నది. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన టీ హబ్ ఎంతోమంది ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తున్నది. క్రియాశీలకంగా పంచాయతీ పాలకవర్గాలు నామమాత్రంగా ఉన్న పంచాయతీ పాలకవర్గాలను క్రియాశీలకం చేసేందుకు చట్టంలో మార్పులుచేశాం. అధికారాలతోపాటు కచ్చితమైన విధులను కూడా పొందుపరిచి ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చూశాం. పంచాయతీరాజ్ ఉద్యమస్ఫూర్తిని తిరిగి గ్రామీణప్రాంతాల్లో నెలకొల్పేలా రాబోయే రోజుల్లో ప్రభు త్వం మరింత కృషిచేస్తుంది. తండాలు, గూడేలు, శివారుపల్లెలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చాలని సమైక్య పాలనలో ప్రజలు ఎంత మొత్తుకున్నా వారి వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. గిరిజనుల చిరకాల వాంఛను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చింది. కొత్తగా 4383 గ్రామ పంచాయతీలను ఏర్పాటుచేసింది. 1326 ప్రత్యేక ఎస్టీ గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటుచేసింది. వీటితోపాటు ఇతర గ్రామాల్లో జనాభా నిష్పత్తిని అనుసరించి ఎస్టీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్ లభిస్తుంది. మా తండాలో మా రాజ్యం.. మా గూడెంలో మా రాజ్యం అని గిరిజనులు, ఆదివాసీలు కన్న కలను తెలంగాణ ప్రభుత్వం నిజంచేసింది. సమర్థంగా శాంతిభద్రతలు శాంతిభద్రతలను ప్రభుత్వం సమర్థంగా పరిరక్షిస్తున్నది. పోలీసుశాఖను ఆధునీకరించడంతో పోలీసుసేవలు ప్రజలకు మరింత మెరుగ్గా అందుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఏర్పాటుచేస్తున్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం పూర్తికావస్తున్నది. వ్యవసాయరంగానికి ముప్పుగా పరిణమించిన కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులను నిరోధించడానికి ఈ నేరాలను పీడీ యాక్టు పరిధిలోకి తెచ్చాం. అన్ని రకాల కల్తీలపై ఉక్కుపాదం మోపాం. ఇప్పుడూ ప్రతీఘాత శక్తులున్నాయి ఒక చారిత్రాత్మక విజయయాత్ర పురోగమనాన్ని అడ్డుకోవాలనే ప్రతీఘాత శక్తుల ప్రయత్నాలు ఆనాడు పోరాటంలో ఎదురయ్యాయి. ఈనాడు పరిపాలనలోనూ ఎదురవుతున్నాయి. సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలనైనా అవలీలగా అధిగమించవచ్చని ప్రభుత్వం రుజువుచేసింది. రాబోయే రోజుల్లోనూ అదే విధంగా ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు సాగుదాం. అవిశ్రాంతంగా పరిశ్రమించి, బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడుదాం. వడివడిగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి సమైక్యరాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో పడేసిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, మిడ్‌మానేరు, సింగూరు, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెంవాగు, కుమ్రంభీం, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథ్‌పూర్‌లాంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా ఇప్పటికే 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. ఈ ఏడాది వానకాలం పంటనాటికి మొత్తం ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలు, సదర్‌మాట్ బరాజ్, మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం చేపట్టింది. అసంపూర్తిగా ఉన్న దేవాదులను పూర్తిచేయడంతోపాటు 365 రోజులపాటు ఈ ప్రాజెక్టుకు నీరు అందుబాటులో ఉండేందుకు గోదావరిపై తుపాలకుగూడెం బరాజ్ నిర్మిస్తున్నాం. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పాలమూరు జిల్లాతోపాటు నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని భూములకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం పట్టుదలతో చేస్తున్న కృషిపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను త్వరితగతిన పూర్తిచేయడం ద్వారా పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు ప్రభుత్వం సాగునీరు అందించింది. తెలంగాణకు జీవనదాయిని.. కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవసాయానికి వరదాయిని, తెలంగాణకు జీవనదాయిని. జిల్లాలకు సమృద్ధిగా నీరందించే కాళేశ్వరం నిర్మాణం రికార్డు సమయంలో పూర్తిచేసేలా పనులు జరుగుతున్నాయి. 37 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే అన్నిరకాల అనుమతులు సాధించాం. భారీ ఎత్తున సాగుతున్న నిర్మాణపనులను తిలకించేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పలువురు ప్రముఖులు వచ్చి వెళ్ళారు. గవర్నర్ నరసింహన్ కూడా ఈ ప్రాజెక్టును తిలకించి, ఇది రాష్ట్రప్రజలకు జీవధారగా మారబోతున్నదని ప్రశంసించారు. కేంద్ర జలసంఘం ప్రతినిధి బృందం రెండ్రోజులపాటు కాళేశ్వరం పనులను పరిశీలించి, ఈ ప్రాజెక్టు దేశచరిత్రలోనే భిన్నమైనదని, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణరంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలరీత్యా కూడా అన్నివిధాలా ప్రత్యేకమైనదని ప్రశంసించింది. ఉమ్మడి రాష్ట్రంలో దారుణ నిర్లక్ష్యానికి గురై, విధ్వంసమైన వేల చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కాకతీయ సత్ఫలితాలనిచ్చింది. దీంతో సాగుభూమి విస్తీర్ణం పెరుగడంతోపాటు, భూగర్భ జలమట్టం కూడా పెరిగింది. గ్రామాల్లోని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. 46500 చెరువుల పునరుద్ధరణ లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే ప్రధాన చెరువుల పనులు పూర్తయ్యాయి. చిన్న చెరువులు, కుంటల పనులు పురోగతిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రజల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే పథకం మిషన్ భగీరథ. దీనిద్వారా ఇప్పటికే వేల గ్రామాలకు శుభ్రమైన తాగునీరు అందుతున్నది. రాబోయే కొద్దినెలల్లోనే అన్ని గ్రామాలకు తాగునీరు అందుతుంది. గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చురుకుగా సాగుతున్నది. ఆశించిన ఫలితాలను ప్రభుత్వం అందించబోతున్నది. భూరికార్డుల ప్రక్షాళన సాహసం ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, మరే ఇతర రాష్ట్రంలోనూ, ఎవరూ సాహసించలేని భూరికార్డుల ప్రక్షాళనను కేవలం వందరోజుల్లోనే విజయవంతంగా పూర్తిచేశాం. పంట పెట్టుబడి చెక్కులతో పాటు పట్టాదార్ పాస్‌పుస్తకాలను కూడా రైతులకు అందిస్తున్నాం. జూన్ 20లోగా రైతులందరికీ వీటి ని పంపిణీ పూర్తిచేసే పనిలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది. 2.38 కోట్ల ఎకరాల భూమికి సం బంధించిన రికార్డులను ప్రక్షాళన చేయడంతోపాటు 1.40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమిపై స్పష్టత సాధించగలిగాం. రైతులు తమ భూమి కుదువపెట్టకుండానే, పాస్‌బుక్కులు తీసుకోకుండానే బ్యాం కర్లు రుణాలిచ్చే విధానాన్ని అమలుచేస్తున్నాం. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడానికి, అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. అవినీతికి, జాప్యానికి ఆస్కారంలేకుండా రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని త్వరలోనే ప్రారంభిస్తున్నాం. ప్రతీ మండలంలో రిజిస్ట్రేషన్లు జరుగాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతోపాటు అన్ని మండలాల తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తున్నాం. రికార్డుల ప్రక్షాళనతో తేలిన సమాచారాన్ని పొందుపరుస్తూ ప్రభుత్వం ధరణి పేరుతో వెబ్‌సైట్ రూ పొందిస్తున్నది. జూన్ 20 వరకు భూములకు సం బంధించి పూర్తిస్థాయి స్పష్టత సాధించి, ఆ వివరాలను పారదర్శకంగా ధరణిలో నమోదు చేస్తారు. అపూర్వ పథకం కేసీఆర్ కిట్స్ నిరుపేద మహిళలు గర్భవతులుగా ఉన్న సమయంలో కూడా కూలికి పోవాల్సి రావడం బాధాకరం. ఈ పరిస్థితుల నుంచి వారిని ఆదుకొనేందుకు మానవీయ కోణంతో కేసీఆర్ కిట్స్ పేరుతో అపూర్వమైన పథకాన్ని అమలుచేస్తున్నాం. పేద గర్భిణులకు నాలుగు విడుతలుగా 12 వేల రూపాయలు చెల్లిస్తున్నాం. ఆడపిల్లను ప్రసవించిన తల్లికి ప్రోత్సాహకంగా మరో వేయి రూపాయలు అదనంగా చెల్లిస్తున్నాం. దీనితోపాటుగా నవజాత శిశువులకు 16 రకాల వస్తువులతో రెండువేల రూపాయల విలువైన కిట్‌ను కూడా అందిస్తున్నాం. ఈ పథకం అమలు తరువాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు రెండు లక్షల మంది మహిళలకు ఈ ప్రయోజనాలు అందించాం. ప్రభుత్వ చర్యల ఫలితంగా సర్కారు దవాఖానల పనితీరు మెరుగుపడింది. ప్రజల్లో విశ్వాసం పెరిగింది. స్వయంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గాంధీ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకోవడం ప్రభుత్వానికి గర్వకారణం. ఈ సందర్భంగా గవర్నర్ అక్కడి సదుపాయాలను చూసి ఎంతగానో అభినందించారు. కిడ్నీ వ్యాధి బాధితుల కోసం ఉచితంగా డయాలసిస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. 39 కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా ఇప్పటికే 17 పనిచేస్తున్నాయి. ఉత్తమ వైద్యసేవలు అందించినందుకు రాష్ట్రానికి పలు జాతీయస్థాయి అవార్డులు కూడా లభించాయి. హైదరాబాద్‌లో వెయ్యికి పైగా బస్తీ దవాఖానలు ఏర్పాటుచేస్తున్నాం. కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా ప్రాజెక్టులు సమైక్యరాష్ట్రంలో సాగునీటిలో జరిగిన అన్యాయాన్ని సవరించి, గోదావరి, కృష్ణాజలాలను తెలంగాణ పొలాలకు తరలించేలా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. రైతుల కలలను నిజంచేయడానికి ప్రభుత్వం నడుంబిగించింది. రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరాలనే దృఢ సంకల్పంతో ప్రాజెక్టులు శరవేగంగా నిర్మిస్తున్నాం. సమైక్యపాలనలో ప్రాజెక్టు స్థలం ఎంపిక దగ్గరనే వారి కుట్ర ప్రారంభమయ్యేది. అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారం కల్పించేలా డిజైన్‌చేసి, తరువాత ఆ వివాదాలనే సాకుగా చూపించి ప్రాజెక్టులు నిర్మించలేదు. అదేమిటంటే నెపం పక్క రాష్ట్రం నెత్తిన వేయడం, ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడమనే పన్నాగాన్ని అమలుచేశారు. సమైక్యపాలకులు తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతుంటే తెలంగాణ నాయకులు తమ చేతకానితనాన్ని ప్రదర్శించారే తప్ప ఏనాడూ ఎదురుతిరిగి ప్రశ్నించలేదు. అందుకే సమైక్య పాలకులు చేసిన ప్రాజెక్టుల డిజైన్లను తెలంగాణ అవసరాలకు తగిననట్టు రీ డిజైన్ చేయాల్సి వచ్చింది. గోదావరి జలాల సమగ్ర వినియోగం కోసం తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి, చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నది. దీనిని కేంద్ర జలసంఘం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాయి. గత 70 ఏండ్లలో ఏ ప్రభుత్వమూ మహారాష్ట్రతో ఒప్పందాన్ని సాధించలేదు. ఆదిలాబాద్ జిల్లాలో లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతీసారి ఎన్నికల అంశంగా వాడుకున్నారు. మహారాష్ట్ర నుంచి అనుమతి సాధించడం కానీ, నిర్మాణం ప్రారంభించడం కానీ చేసిన పాపానపోలేదు. తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధితో చనాఖా-కొరాటా బరాజ్ నిర్మాణం వేగంగా జరుగుతున్నది. గోదావరి, కృష్ణానదులపై 23 భారీ, 13 మధ్యతరహా ప్రాజెక్టుల పనులు ఇప్పటికే చేపట్టాం. కొన్ని పూర్తిచేయగలిగాం. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు బడ్జెట్‌లో ఏటా రూ.25వేల కోట్లు కేటాయించుకుంటున్నాం. రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరాలనే దృఢ సంకల్పంతో ప్రాజెక్టులు శరవేగంగా నిర్మిస్తున్నాం. సమైక్యపాలనలో ప్రాజెక్టు స్థలం ఎంపిక దగ్గరనే వారి కుట్ర ప్రారంభమయ్యేది. అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారం కల్పించేలా డిజైన్‌చేసి, తరువాత ఆ వివాదాలనే సాకుగా చూపించి ప్రాజెక్టులు నిర్మించలేదు..ఒక చారిత్రాత్మక విజయయాత్ర పురోగమనాన్ని అడ్డుకోవాలనే ప్రతీఘాత శక్తుల ప్రయత్నాలు ఆనాడు పోరాటంలో ఎదురయ్యాయి. ఈనాడు పరిపాలనలోనూ ఎదురవుతున్నాయి. సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలనైనా అవలీలగా అధిగమించవచ్చని ప్రభుత్వం రుజువుచేసింది. రాబోయే రోజుల్లోనూ అదే విధంగా ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు సాగుదాం. అవిశ్రాంతంగా పరిశ్రమించి, బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడుదాం. – ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు
ఒక గ్రామంలో రామయ్య జానకమ్మ అను బీద దంపతులు ఉండేవారు. వారి అన్యోన్య దాంపత్యం వలన వారికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వారిని చదివించుటకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఆ ఇద్దరు ఆడపిల్లలు శ్రద్ధతో చదువుకొని ఆ పాఠశాలకు అందులోని ఉపాధ్యాయులకు మంచి పేరును తెచ్చారు. ఒకరోజు రామయ్య తో ఆ పాఠశాల ఉపాధ్యాయులు" చూడండి రామయ్య గారు మీ ఇద్దరు పిల్లలు చాలా తెలివైన వారు. పది 10 ర్యాంకుతో పాసై మాకు, మా పాఠశాలకు మంచి పేరు తెచ్చారు. తెలివైన మీ పిల్లల చదువు ఆపక పై చదువులు చెప్పించండి. అనగా "మాస్టార్లూ! నాకు చదివించాలని ఉంది. కానీ మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. 10 చదివించేటప్పటికే మాకు దేవుళ్ళు దిగి వచ్చినంత పని అయింది. ఇక వాళ్లని పట్నం తోలించి పై చదువులు చెప్పించాలంటే ఉన్న నా పొలం అమ్మితేనే అది సాధ్యమయ్యేలా ఉంది. అని అన్నాడు" మాస్టార్లు వెంటనే రామయ్య! నీ పిల్లలు చాలా హుషారైన వారు. పై చదువులు చదివి నెగ్గుకోస్తారని మాకనిపిస్తుంది. అప్పుడు మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఏదో ఒకటి చేసి వారిని పై చదువులకు పంపించండి అని చెప్పి వారు వెళ్ళిపోయారు. గత్యంతరం లేక రామయ్య ఓ ఎకరం పొలం అమ్మి పిల్లలను పై చదువులకు పట్నం పంపించాడు. పట్నంలో పిల్లలు కష్టపడి చదివి ఒకరు డాక్టర్ పట్టాను, మరొకరు లాయర్ పట్టాను సాధించారు. మరొక ఎకరం పొలం అమ్మి ఆసుపత్రికి కావలసిన వసతి ఏర్పాట్లు చేసి డాక్టర్ అయిన చిన్నమ్మాయిలతో గ్రామంలో ప్రాక్టీస్ పెట్టించాడు. పెద్దమ్మాయితో లాయర్ ప్రాక్టీస్ పట్నంలో ఏర్పాటు చేశాడు. ఇటు గ్రామంలో, అటు పట్నంలో ఇద్దరమ్మాయిలు వారి వారి వృత్తిలో పేరు ప్రఖ్యాతులతో పాటు డబ్బు కూడా బాగా సంపాదించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం గ్రామ జ్యోతి కార్యక్రమం ప్రకటించింది. ఆ గ్రామ జ్యోతి కార్యక్రమం వివరాలు తెలుసుకొని ఇద్దరమ్మాయిలు తమ స్వగ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి పరుచుటకు తీర్మానించుకున్నారు. రామయ్య బిడ్డల నిర్ణయాన్ని విన్న ఆ ఊరి ప్రజలు ఎంతో సంతోషించారు. అంతేగాకుండా వారికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ప్రజల కోర్కెను తన బిడ్డల నిర్ణయాన్ని విని రామయ్య జానకమ్మలు ఎంతో సంతోషించారు. పై చదువుల్లో తమ స్నేహితురాండ్లైన ఇంజనీర్లు, రమ, ఉమలను సంప్రదించి గ్రామంలో పాఠశాల భవనం, ఆస్పత్రి భవనం నిర్మించి చక్కని రోడ్లను వేయించారు. నీటి ఎద్దడిని నివారించేందుకు గ్రామంలోని చెరువు పూడికలు తీయించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదించి వీధిలైట్లను, ఇంటింటికి నల్ల కలెక్షన్లను, రహదారి వెంట పచ్చ పచ్చని చెట్లను నాటించారు గ్రామంలో పరిశుభ్రతను నెలకొల్పారు. ఇలా సకల సౌకర్యాలను ఆ గ్రామానికి కల్పించి ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి గ్రామ ప్రజల సమక్షంలో వీరిని పట్టు శాలువలతో సన్మానించి, గోల్డ్ మెడల్స్ ఇచ్చి సత్కరించింది. గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఉడతా భక్తిగా ఆ ఇద్దరు అమ్మాయిలను బంగారు కిరీటంతో సన్మానించి తమ యొక్క భక్తి ప్రవృత్తుల సేవలను సమర్పించుకున్నారు సమర్పించుకున్నారు. ఆ అమ్మాయి లిద్దరూ తమ తల్లిదండ్రులతోను, ప్రజలతోనూ కలసి ఆనందాన్ని పంచుకొని ఆ సంబరాల సాగరంలో మునిగిపోయారు.
పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) నుండి డబ్బులు ఇవ్వాలంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలి, అందుకే తాజాగా కొరోనా విపత్తు నుండి దేశాన్ని కాపాడడానికి PMNRF ఫండ్ కి బదులుగా కొత్తగా పీఎం కేర్స్ (PM CARES) ఫండ్ ని తీసుకొని వచ్చారని చెప్తున్న ఒక యూట్యూబ్ వీడియోని (ఆర్కైవ్డ్) సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం. ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు. క్లెయిమ్: పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) నుండి డబ్బులు ఇవ్వాలంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనుమతి కావాలి, అందుకే పీఎం కేర్స్ (PM CARES) ని తీసుకొని వచ్చారు. ఫాక్ట్ (నిజం): PMNRF ని 1948 లో మొదలు పెట్టినప్పుడు మేనేజింగ్ కమిటీ లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి చోటు కలిపించారు, కానీ 1985 లో మేనేజింగ్ కమిటీ తీసేసి మొత్తం బాధ్యత ప్రధాని చేతికి ఇచ్చారు. ఇప్పుడు ఫండ్ ని ఎలా ఉపయోగించాలో నిర్ణయం మొత్తం ప్రధాని చేతుల్లో ఉంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) గురించి గూగుల్ లో వెతకగా, PMNRF వెబ్సైటు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. PMNRF ఫండ్ ని 1948 లో మొదలు పెట్టారని, ఆ ఫండ్ ని మేనేజ్ చేసే కమిటీ లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి చోటు కలిపించారని తెలుస్తుంది. అయితే, ఇప్పుడు మాత్రం ఆ ఫండ్ ని ఎలా ఉపయోగించాలో నిర్ణయం మొత్తం ప్రధాని చేతుల్లో ఉందని ఆ వెబ్సైటులో చూడవొచ్చు. 1985 లో మేనేజింగ్ కమిటీ తీసేసి మొత్తం బాధ్యత ప్రధాని చేతికి ఇచ్చారని ఒక ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ లో చదవొచ్చు. PMNRF మరియు PM-CARES గురించి మరిన్ని వివరాల కోసం FACTLY రాసిన వివరమైన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. చివరగా, PMNRF నుండి డబ్బులు ఇవ్వాలంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనుమతి అవసరం లేదు. ఆ నిబంధనని 1985 లోనే తీసేసారు.
Telugu News » Andhra pradesh » Amaravati » AP Assembly sessions will start on15th of this month govt planning to introduce these key bills Telugu News AP Assembly: 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మరోసారి ఆ కీలక బిల్లులు సభ ముందుకు.. Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. Ap Assembly Basha Shek | Sep 10, 2022 | 8:48 AM Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కాగా సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. ఇక సమావేశాల తొలి రోజున జరిగే బీఏసీ సమావేశంలో సభ అజెండాను ఖరారు చేయనున్నారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రధానంగా చర్చ చేయాలని అధికార పక్షం భావిస్తోంది. పోలవరం – పునారావాస ప్యాకేజీ పైన సభలోనే చర్చించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు.. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల గురించి సభ ద్వారా ప్రజల ముందు ఉంచాలని వైసీపీ భావిస్తోంది. ఇక ప్రతిపక్షాలు ఆందోళన చేస్తోన్న నిత్యావసర ధరలు.. శాంతి భద్రతల పైన చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. కాగా ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లులను మరోసారి సభ ముందుకు తీసుకొస్తుందనే ప్రచారం సాగుతోంది. అయితే, హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్చు ఇవ్వడంతో.. న్యాయ పరంగా అడ్డంకులను పరిష్కరించుకున్న తర్వాత మాత్రమే మూడు రాజధానుల విషయంలో ముందడుగు వేస్తామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీ సమావేశాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవి కూడా చదవండి Viral Video: వామ్మో.. సలసలా కాగుతున్న నూనెలో చేతులు ముంచి వడపావ్ తయారీ.. నెటిజన్లు ఏమంటున్నారంటే? Viral Video: నా గణపతి బప్పాను తీసుకెళ్లద్దు.. నిమజ్జనం వేళ చిన్నారి కన్నీళ్లు.. మనసులను కదిలిస్తోన్న వీడియో Cricket: 5 ఓవర్లు.. 4 మెయిడెన్లు.. ఒక్క పరుగు..2 వికెట్లు.. వన్డే క్రికెట్‌లో సన్‌రైజర్స్‌ బౌలర్‌ సంచలనం Virat- Anushka: అనుష్క ఐరన్ లేడీ.. కోహ్లీ స్టీల్‌ మ్యాన్‌.. వైరలవుతోన్న పాక్‌ స్పీడ్‌స్టర్ వ్యాఖ్యలు..
వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. . ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే. అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు.ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి పండుగను భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తేదీన జరుపుకుంటారు నలుగుపిండితో వినాయకుడు ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరుల పుత్రుడు గణపతి. తండ్రి వల్ల తలను పోగొట్టుకోవాల్సి వచ్చింది. హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. ఏ పనులు తలపెట్టిన విఘ్నాలు లేకుండా కాపాడేవాడు. చివరకు ఏ శుభకార్యాలు తలపెట్టిన ముందుగా పూజలు అందుకునే ఆది దేవుడు. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. దీనికి ప్రసన్నమైన శివుడు.. ఏ వరం కావాలో కోరుకోమంటాడు. దీనికి ఆ రాక్షసుడు ‘నీవు ఎల్లప్పుడు నా ఉదరంనందే నివసించాలి అంటాడు’ శివుడి అతని కోరికను మన్నించి గజాసురుడి కడుపులో ప్రవేశించి అతని ఉదరంలో నివసించసాగాడు. విషయం తెలుసుకున్న పార్వతీదేవి.. విష్ణువు వద్దకు వెళ్లి ‘నా భర్తను భస్మాసురుడి నుంచి కాపాడినట్లుగా.. గజాసురిడి నుంచి కూడా రక్షించమ’ని వేడుకుంటుంది. దీనికి ఉపయం ఆలోచించిన విష్ణుమూర్తి దీనికి గంగిరెద్దు మేళమే సరైందని.. శివుడి ద్వారపాలకుడైన నందిని గంగిరెద్దుగా మారుస్తాడు. మిగతా బ్రహ్మాదిదేవతలను వివిధ వాయిద్యాకారులుగా మార్చి గజాసురిడి పురానికి వెళ్లి నందిని ఆడించారు. అందుకు తన్మయత్వం చెందిన గజాసురుడు ఏం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. ఇది మహాన్నోతమైన గంగిరెద్దు, శివుడిని వెతుక్కుంటూ వచ్చింది, కాబట్టి నీ ఉదరంలో ఉన్న శివుడిని ఇచ్చేయమని కోరతారు. అది అడిగింది ఎవరో కాదు సాక్షాత్తూ ఆ మహావిష్ణువేనని తెలుసుకున్న గజాసురుడు తనకింక మరణం తథ్యమని గ్రహిస్తాడు. దీంతో శివుడితో ‘నా ముఖం లోకమంతా ఆరాధించేట్టుగా.. నా చర్మాన్ని ధరించాలని కోరతాడు’ దీనికి శివుడు అంగీకరించగా.. విష్ణువు సైగతో నంది తన కొమ్ములతో గజాసురుడి కడుపును చీల్చి చంపేస్తుంది. అప్పుడు బయటకు వచ్చిన శివుడు.. విష్ణువును స్తుతిస్తాడు. విష్ణువు ఇలా దుష్టులకు అడిగిన దానాలు చేయకూడదని శివుడితో అంటాడు. గజాసుర సంహారానంతరం…పరమేశ్వరుడు కైలాసం వస్తున్నాడని పార్వతీదేవికి తెలుస్తుంది. ఆ సంతోషంలో పార్వతీ..వంటికి నలుగు పెట్టుకుని స్నానం చేయబోతూ..ఆ నలుగుపిండితో ఓ బొమ్మను తయారుచేసి ప్రాణం పోస్తుంది. ఆ బొమ్మ బాలుడిగా మారుతుంది. ఆ బాలుడ్ని ద్వారం దగ్గర కాపలాగా వుంచి తన అనుమతి లేకుండా ఎవ్వరినీ లోనికి రానివ్వద్దని చెబుతుంది. కాసేపటికి అక్కడకు చేరుకున్న పరమశివుడు లోపలకు వెళుతుండగా ద్వారం వద్ద ఉన్న బాలుడు అడ్డుకుంటాడు. లోపలకు వెళ్ళాలి అడ్డు తొలగమంటాడు శివుడు చాలాసార్లు చెబుతాడు. తల్లి ఆజ్ఞ మీరని ఆ బాలుడు శివుడిని లోనికి ప్రవేశించనివ్వడు. ఆగ్రహంతో శివుడు తన త్రిశూలంతో బాలుడి శిరస్సు ఖండిస్తాడు. ఇంతలో అక్కడకు వచ్చిన పార్వతీదేవి బిడ్డ అలా పడి ఉండడం చూసి శోకిస్తుంది. అప్పుడు గజాసురుడి తలను బాలుడికి అతికింది ప్రాణం పోస్తాడు. గజ ముఖం ఉండడం వల్ల వినాయకుడు గజాననుడిగా పేరు పొందాడు. కొన్ని రోజుల తర్వాత దేవతలంతా పరమేశ్వరుడి వద్దకు వెళ్లి తమకు విఘ్నం రాకుండా ఉండేందుకు కొలవడానికి ఓ దేవుడిని ప్రసాదించమని కోరగా ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ముల్లోకాల్లోని పుణ్య నదులన్నింటిలో స్నానం చేసి తిరిగి మొదట వచ్చిన వారే ఈ పదవికి అర్హులు అని చెప్పగా వెంటనే కుమార స్వామి నెమలి వాహనం ఎక్కి వెళ్లిపోయాడు. గజాననుడు మాత్రం నా బలాబలాలు తెలిసి మీరీ షరతు విధించడం సబబేనా? అని అడగ్గా.. తండ్రి అతడికో తరుణోపాయం చెప్పాడు. ఓ మంత్రాన్ని వివరించి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దాన్ని పఠించమని చెప్పగా మంత్ర పఠనం చేస్తూ వినాయకుడు అక్కడే ఉండిపోయాడు. ఈ మంత్ర ప్రభావం వల్ల కుమార స్వామికి తాను వెళ్లిన ప్రతి చోట తనకంటే ముందుగా వినాయకుడే స్నానం చేసి వెళ్తున్నట్లుగా కనిపించసాగింది. దాంతో తిరిగొచ్చి తండ్రీ అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం అప్పగించండి అని చెప్పాడు. అలా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు. ఆ రోజు దేవతలు, మునులు అందరూ వివిధ రకాల కుడుములు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకం, వడపప్పు వంటివన్నీ సమర్పించారు. వాటిని తినగలిగినన్ని తిని మిగిలినవి తీసుకొని భుక్తాయాసంతో రాత్రి సమయానికి కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రుల కాళ్లకు నమస్కారం చేయడానికి ప్రయత్నిస్తే కడుపు నేలకు ఆనుతుందే కానీ చేతులు ఆనట్లేదు. ఇది చూసి చంద్రుడు నవ్వగా దిష్టి తగిలి పొట్ట పగిలి వినాయకుడు చనిపోతాడు. దీంతో పార్వతీ దేవి ఆగ్రహించి ఆ రోజు చంద్రుడిని చూసిన వాళ్లందరూ నీలాపనిందలకు గురవుతారని శాపమిస్తుంది. చంద్రుడిని చూసిన రుషి పత్నులు తమ భర్తల దగ్గర అపనిందలకు గురవుతారు. రుషులు, దేవతలు ఈ విషయాన్ని శ్రీమహా విష్ణువుకి విన్నవించగా ఆయన అంతా తెలుసుకొని రుషులకు తమ భార్యల గురించి నిజం చెప్పి ఒప్పించడంతో పాటు వినాయకుడి పొట్టను పాముతో కుట్టించి ఆయనకు అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత దేవతలందరి విన్నపం మేరకు పార్వతి తన శాపవిమోచనాన్ని ప్రకటిస్తుంది. ఏ రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆరోజు మాత్రం అతడిని చూడకూడదు అని చెబుతుంది. దీంతో దేవతలంతా సంతోషిస్తారు. ఆ రోజే భాద్రపద శుద్ధ చవితి. ఆ రోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం.
సంగీతకారుడు, దర్శకుడు, మానవతావాది - డేవ్ గ్రోల్ ఒకరు బిజీగా ఉన్నారు ఫూ ఫైటర్ ఈ సంవత్సరం. ఇప్పుడు, అది ఫూస్ ద్వారా వెల్లడైంది. ట్విట్టర్ Eలో 'చెల్సియా లేట్లీ' షోలో ఫ్రంట్‌మ్యాన్ అతిథి హోస్ట్‌గా వ్యవహరించే పేజీ! నెట్‌వర్క్ టునైట్ (డిసెంబర్. 6), షో యొక్క సాధారణ హోస్ట్, చెల్సియా హ్యాండ్లర్‌ను నింపడం. గ్రోల్ అర్థరాత్రి టెలివిజన్‌కి కొత్తేమీ కాదు, అతను గతంలో 'చెల్సియా లేట్‌లీ'కి అతిథిగా వచ్చాడు. మేము ఇటీవల నివేదించారు గ్రోల్ యొక్క డాక్యుమెంటరీ 'సౌండ్ సిటీ' జనవరి 17న పార్క్ సిటీ, ఉటాలో జరిగే సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడుతుంది. గ్రోల్ తన చిత్రనిర్మాణ అరంగేట్రం గురించి ఇలా చెప్పాడు: “మొదటిసారి దర్శకుడిగా, ఈ అద్భుతమైన సంగీత విద్వాంసులతో పాటల రచన మరియు కథలు చెప్పడం పట్ల నాకున్న అభిరుచిని పంచుకోగలిగినందుకు నేను వినయంగా ఉన్నాను,” అతను కూడా భాగమవుతాడు అని చెప్పలేదు 12-12-12 హరికేన్ శాండీ రిలీఫ్ షో మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో పెర్ల్ జామ్ గాయకుడు ఎడ్డీ వెడ్డెర్, బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్, బాన్ జోవి, ది హూ మరియు ఇతరులు. ఫూ ఫైటర్స్ వీడియోలలో ఎల్లప్పుడూ తన హాస్యభరితమైన భాగాన్ని అన్వేషించే గ్రోల్, టునైట్ 'చెల్సియా లేట్‌లీ' షోకి హోస్ట్‌గా ఫన్నీని తీసుకురావడం ఖాయం. అతను షోలో అతిథిగా ఉన్నప్పుడు చెల్సియాతో చాట్ చేస్తున్న వీడియోను క్రింద చూడండి:
అల్పాహారం అనేది మన రోజువారీ జీవన వ్యవస్థ పై ఎంతో ప్రభావం చూపుతుంది. కానీ కొంతమంది వారి వారి పనుల కారణంగా ప్రతిరోజు అల్పాహారాన్ని మిస్ చేస్తూ ఉంటారు. అయితే అల్పాహారం తినకపోవడం వల్ల కడుపులో ఉబ్బరం , గ్యాస్ , అజీర్తి , మంట వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఇక మరికొంతమంది మాత్రం ఏ మాత్రం వైద్యుల సలహాలు వినకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు . పైగా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మరికొంతమంది అల్పాహారం చేసేటప్పుడు పక్కన కాఫీ లేకపోతే వారు అల్పాహారం తినడానికి ఇష్టపడడం లేదు. అల్పాహారం చేస్తూ కాఫీ తాగితే ఏమవుతుంది..? మనం తీసుకునే అల్పాహారంలో ఎటువంటి తప్పులు చేయడం వల్ల బరువు పెరుగుతారు ..? అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. అల్పాహారం చేసేటప్పుడు జ్యూస్ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా త్వరగా ఆకలి వేస్తుందట. ఇలా ఆకలి వేయడం వల్ల తిండి పైన ధ్యాస పెరిగి , బరువు పెరిగే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేటప్పుడు కాఫీ కానీ జ్యూస్ గానీ తాగకుండా ఉంటేనే మంచిది. అంతేకాదు కొంతమంది బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం లో భాగంగానే బ్రెడ్ జామ్ లేదా ఏదైనా తీపి కలిగిన పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఉదయాన్నే ఇలా తీపి పదార్థం కలిగిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ అన్ బ్యాలెన్స్డ్ అవడంవల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉందట. బ్రేక్ ఫాస్ట్ ను ఎనిమిది గంటల లోపు చేయడానికి ప్రయత్నం చేయాలి . ఆ తరువాత చేసినా కూడా ఫలితం ఉండదు .. ఎందుకంటే ఉదయం లేచిన రెండు గంటలలోపు ఏదైనా తీసుకోవాలని , లేకపోతే ఖాళీ కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి, కడుపులో మంట వచ్చే ప్రమాదం కూడా ఉందట. ప్రోటీన్స్ అధికంగా ఉండే పదార్థాలను కూడా ఉదయం పూట తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం వల్ల అధిక బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.
కొన్ని నెలలుగా కేసీఆర్ జాతీయ రాజకీయాల పాట పాడుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను వరుసబెట్టి మరీ కలుస్తున్నారు. ఇప్పుడున్న ఎన్డీయే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ రావాలని ప్రాంతీయ పార్టీల సీఎంలను కలుస్తున్నారు. అయితే కేసీఆర్ వెళ్లినంత సేపు బాగానే ఉంటుంది. ఆయన రాకను ఆయా రాష్ట్రాల సీఎంల సానుకూలంగా ఆహ్వానిస్తున్నారు. కానీ ఆ తరువాత కేసీఆర్ చెప్పిన మాటను పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూడో ఫ్రంట్ గురించి వివరించారు. అప్పటి వరకు ఓకే అన్న నితీశ్.. ఆ తరువాత మాట మార్చినట్లు సమాచారం. మేమంతా కాంగ్రెస్ తోనే ఉంటున్నామని.. థర్డ్ ఫ్రండ్ అనేదీ ఏమీ లేదని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు సక్సెస్ గా పాలించానని చెబుతున్న కేసీఆర్.. జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ పెడుతారని.. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతున్నారని.. రకరకాలుగా ప్రచారం సాగుతోంది. అయితే జాతీయ రాజకీయాల్లోకి పోదాం.. అని చెబుతున్న కేసీఆర్.. పార్టీ మార్పు విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. ఈ తరుణంలో ఆయన ఇతర రాష్ట్రాల సీఎంలను కలుస్తూ వస్తున్నారు. గతంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేను కలిశారు. అయితే కేసీఆర్ ను కలిసిన తరువాత స్టాలిన్ కాంగ్రెస్తోనే ఉంటానని చెప్పారు. ఇటు ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం పూర్తిగా పడిపోయింది. ఇక ఫోన్లో నిత్యం కాంటాక్ట్ ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా మొదట్లో థర్డ్ ఫ్రంట్ అంటూ వేడి పెంచారు. కానీ ఆ తరువాత మరోసారి ఆ విషయంపై మాటెత్తడమే కాకుండా.. భవిష్యత్ లో కాంగ్రెస్ తోనే కలిసి ఉంటామని ప్రకటించారు. దీంతో మూడో ఫ్రంట్ పై ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేక ఇంట్రెస్ట్ లేనట్లే తెలుస్తోంది. ఈ తరుణంలో బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ను సీఎం కలిశారు. మూడో ఫ్రంట్ పై ముచ్చటించారు. అయితే కేసీఆర్ మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు. కానీ తాజాగా థర్డ్ ప్రంట్ సాధ్యం కాదన్నట్లు మాట్లాడారు. అంతేకాకుండా కాంగ్రెస్ తోనే ఉంటామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దీంతో భవిష్యత్ తో కేసీఆర్ కూడా కాంగ్రెస్ తో కలిసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ తో జతకడుతారా..? అనేది తేలాల్సి ఉంది. అదీ గాక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ముందు రాష్ట్రం ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తామన్నారు. ఆ తరువాత మాట మార్చారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ ను దరిచేర్చుకుంటుందా..? అనేది చర్చనీయాంశంగామారింది. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుతుంది.. అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. Tupaki TAGS: NationalPolitics ChiefMinisterKCR KCRAlliancewithCongress TRSGovernment CMNitishKumar CongressParty
వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో 'మేజర్' చిత్రం ఒక మైలురాయని కితాబిచ్చారు. చిత్రం దేశవ్యాప్తంగా ప్రభంజన విజయం సాధించిన నేపధ్యంలో ''ఇండియా లవ్స్ మేజర్ ' ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఒక అలవాటు వుంది. మార్నింగ్ షో అయిపోగానే సినిమా గురించి మంచిగా వింటున్నాం అని మెసేజ్ వస్తే.. సినిమా పొయిందని అర్ధం. ఫోన్ కంటిన్యూగా మ్రోగుతుంటే సినిమా హిట్ అని అర్ధం. నిన్నటి నుండి కంటిన్యూ కాల్స్ తో నా ఫోన్ ఫ్రీజ్ అయిపొయింది. కొత్త ఫోన్ కొనుక్కువాల్సివస్తుంది. ఎమోషనల్ గా, కలెక్షన్స్ పరంగా ఇప్పటివరకూ నా సినిమాలన్నీటి కంటే 'మేజర్' ఐదు రెట్లు పెద్దది. మేజర్ సందీప్ విషయానికి వస్తే ఆయన్ని ఎంత ప్రేమించినా సరిపోదనే భావన వుంది. నా గత చిత్రం 'ఎవరు' కంటే ఐదు రెట్లు ఎక్కువగా మేజర్ ఓపెనింగ్స్ వున్నాయని బాక్సాఫీసు లెక్కలు చెబుతున్నాయి. ఐతే మేజర్ ని నేను సినిమాగా చూడటం లేదు ఇది ఎమోషన్. ఇదే సంగతి ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పా. ఈ ఎమోషన్ ఇంకా బిగ్గర్ కాబోతుందని ఇప్పుడు పోస్ట్ రిలీజ్ ఈవెంట్ లో చెబుతున్నా. నా యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. మేజర్ సందీప్ పేరెంట్స్ ని మిస్ అవుతున్నా. అలాగే మా గురువు గారు అబ్బూరి రవి గారి సపోర్ట్ ని మర్చిపోలేను. ఈ చిత్రానికి గ్రేట్ గైడ్ అబ్బూరి రవి గారు. అన్నపూర్ణ స్టూడియోస్ టీంకి కృతజ్ఞతలు. ఒక పోస్ట్ ప్రొడక్షన్ హౌస్ చేయాల్సిన పనికంటే పది రెట్లు ఎక్కువ చేశారు. అలాగే కాస్ట్యూమ్స్ ని అద్భుతంగా డిజైన్ చేసిన రేఖాకి స్పెషల్ థ్యాంక్స్. మేజర్ సినిమా చూసిన చాలా మంది ఫోర్స్ లో జాయిన్ అవ్వాలని వుందని మెసేజ్ పెడుతున్నారు. ఈ వేదికపై మేజర్ ప్రామిస్ చేస్తున్నా. సిడిఎస్, ఎన్డీఏ లో జాయిన్ అవ్వాలనుకుని సరైన వనరులు లేక కష్టపడుతున్న వారికి సపోర్ట్ చేయాలని మేజర్ టీమ్ నిర్ణయించింది. అది ఎలా అనేది రాబోతున్న రోజుల్లో స్పష్టంగా వెల్లడిస్తాం. మొదట ఒక పదిమందితోనే మొదలుపెడతాం. అది కోట్లమందిగా మారుతుందని నమ్ముతున్నాం. ఇదో పెద్ద మూమెంట్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతో ఈ మూమెంట్ ని లాంచ్ చేస్తాం. మేజర్ చిత్రాన్ని మా పేరెంట్స్ కి డెడికేట్ చేస్తున్నా. ఈ చిత్రాన్ని మరింత పెద్ద విజయం చేయాలని కోరుతున్నా.' అన్నారు అడవి శేష్ దర్శకుడు శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ.. మేజర్ అడవి శేష్ డ్రీం ప్రాజెక్ట్ అని నాకు ఎప్పుడో తెలుసు. ఐతే మేజర్ ని నన్ను డైరెక్ట్ చేయమన్నప్పుడు నేను పెద్దగా స్పందించలేదు. మేజర్ సందీప్ రియల్ హీరో అని తెలుసు. ఐతే ఆయన పాస్ పోర్ట్ సైజ్ ఫోటో చూడటం తప్పితే ఆయన గురించి డీప్ గా అప్పటికి తెలీదు. ఐతే నా టీం ని ఏర్పాటు చేసుకొని సందీప్ గురించి ఒకొక్క విషయం తెలుసుకోవడం మొదలుపెట్టాం. నా డైరెక్షన్ టీం వినయ్, రాజీవ్ ఎప్పుడూ నా పక్కనే వున్నారు. గౌతమ్ వీఎఫ్ ఎక్స్ అంతా తానె చూసుకున్నాడు. దినేష్ , అనురాగ్, మనోజ్ కూడా అద్భుతంగా పని చేశారు. సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు అద్భుతమైన విజువల్స్ అందించారు. నా మనసులో వున్న విజువల్స్ ని ప్రజంట్ చేశారు. అవినాస్ కొల్లా అద్భుతమైన సెట్స్ వేశారు. తాజ్ హోటల్ ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. కస్ట్యూమ్స్ ని అద్భుతంగా డిజైన్ చేసిన రేఖాకి థ్యాంక్స్ . శోభితా, సాయీ అద్భుతంగా చేశారు. అడవి శేష్ కి స్పెషల్ థాంక్స్. మేజర్ లాంటి గొప్ప సినిమా చేసే అవకాశం ఇచ్చారు. రచయిత అబ్బూరి రవి గారి సపోర్ట్ ని కూడా మర్చిపోలేం. మేజర్ సందీప్ పేరెంట్స్ తో ప్రయాణం మర్చిపోలేం. వాళ్ళు చెప్పిన ప్రతి మాటని నోట్ చేసుకున్నాం. సందీప్ ఫాదర్ నాతో ఒక మాట చెప్పారు. సందీప్ మాతోనే వున్నాడు. మాకు ప్రతి విషయాన్ని గైడ్ చేస్తుంటాడని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పింది అప్పుడు నాకు అర్ధం కాలేదు. నేను మేజర్ షూటింగ్ లో వుండగా మా నాన్నగారు చనిపోయారు. శేష్ కి ఫోన్ చేసి వెళ్ళిపోయాను. అక్కడి వెళ్ళిన తర్వాత నువ్వు సినిమా షూటింగ్ వెళ్ళు. ముందు సినిమాని పూర్తి చెయ్'' అని మా నాన్న చెప్పినట్లనిపించింది. అప్పుడు మేజర్ సందీప్ నాన్నగారి మాటలు గుర్తుకువచ్చాయి. మూడు రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్ కి వచ్చేశాను. ప్రకాష్ రాజ్ గారిని ఈ సీన్ లో చూస్తే మా నాన్న గుర్తుకు వచ్చారని, రేవతి గారిని చూస్తే అమ్మ గుర్తుకు వచ్చిందని చాలా మంది నాకు మెసేజులు పెడుతున్నారు. నాకు మా నాన్న గుర్తుకు వచ్చారు. కొందరు చాటుగా ఏడుస్తున్నామని చెబుతున్నారు. కానీ చాటుగా ఏడవద్దు. గర్వంతో కన్నీళ్లు కార్చండి. మేజర్ సందీప్ గారిది గొప్ప జీవితం. ఆయన చాలా గొప్పగా బ్రతికారు'' అన్నారు హీరోయిన్ సయీ మంజ్రేకర్‌ మాట్లాడుతూ... మేజర్ చిత్రంలో భాగం కావడం గర్వంగా వుంది. చాలా ప్యాషన్, డెడికేషన్, గౌరవంతో ఈ చిత్రం చేశాం. దేశ వ్యాప్తంగా మేజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఆనందంగా వుంది. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన అడివి శేష్, శశి కిరణ్, నిర్మాతలు శరత్, అనురాగ్, జీఎంబీ, సోనీ పిక్చర్స్ కి కృతజ్ఞతలు'' తెలిపారు. నిర్మాత శరత్ మాట్లాడుతూ.. మేజర్ చిత్రానికి సందీప్ గారు పై నుండి ప్రతిక్షణం మమ్మల్ని ముందుకు నడుపుతున్నారని అనిపించేది. మా మొదటి మేజర్ గొప్ప విజయాన్ని సాధించడం ఆనందంగా వుంది. ఇంత గొప్ప చిత్రం తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఆందోళన కూడా వుంది. ఈ విషయంలో అడివి శేష్ మా వెంట ఉంటారని భావిస్తున్నా. సినిమా నచ్చితే బావుందని అంటారు. కానీ మేజర్ కి స్టాండింగ్ ఒవేషన్ మర్చిపోలేని అనుభూతి. అడివి శేష్ మమ్మల్ని ముందుండి నడిపించారు. మేజర్ సందీప్ కథ చెప్పడం, నమ్రత మేడమ్ గారిని కలవడం, తర్వాత సోనీ పిక్చర్స్ రావడం.. ఈ ప్రోసస్ అంతటిలో శేష్ వున్నారు. దర్శకుడు శశికి ఈ సినిమా తర్వాత ఫ్యాన్ అయిపోయా. యూనిట్ అంతా నమ్మకంగా పని చేశాం. ఆ నమ్మకమే ఈ రోజు మీకు తెరపై అంత అద్భుతంగా కనిపించింది. మేజర్ లాంటి క్లాసిక్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మేజర్ నిప్రతి ఒక్కరూ తప్పక థియేటర్ లో చూడాలని కోరుతున్నా'' అన్నారు నిర్మాత అనురాగ్ మాట్లాడుతూ.. మేజర్ చిత్రానికి వస్తున్న రెపాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సినిమాని చూసిన ప్రేక్షకులు ఒక ఎమోషనల్ లెవల్ దాటి మనసుతో స్పందిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చుడుకునే యూత్ మేజర్ చూసిన తర్వాత ఫోర్స్ లోకి వెళ్లాలని ప్రేరణ పొందడం మాకు ఎంతోఆనందాన్ని ఇస్తుంది. శరత్ వాళ్ళ అన్నయ్య కూడా ఫోర్స్ లో పని చేస్తారు. ఆయన లక్ష్య సినిమా చూసి ఫోర్స్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఇప్పుడు మేజర్ సినిమా చూసి మళ్ళీ అదే ప్రేరణ వచ్చిందని చెప్పడం చాలా ఆనందంగా వుంది. నెక్స్ట్ జనరేష్ ఇండియా మేజర్ చూసి ఫోర్స్ ని కెరీర్ ఎంచుకోవడమే అన్నిటికంటే పెద్ద విజయమని భావిస్తున్నా. చిత్రంలో పని చేసిన యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు'' తెలిపారు. సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు మాట్లాడుతూ.. మేజర్ చిత్రానికి దేశం వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తుంది. నా ఫోన్ కంటిన్యూగా మ్రోగుతూనే వుంది. ఇండస్ట్రీలో కొందరు ఫోన్ చేసి .. సినిమా రోలింగ్ టైటిల్స్, లైట్స్ ఆన్ అయినప్పటికీ ఎవరూ సీట్ నుండి లేవడం లేదని చెప్పారు. ఇంత మంచి విజువల్స్ రావడానికి కారణమైన నా టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. మేజర్ చిత్ర నిర్మాతలకు, దర్శకుడు శశి కిరణ్ తిక్క, హీరో అడవి శేష్ కృతజ్ఞతలు. మేజర్ సందీప్ బయోపిక్ మ్యూజిక్ అందించడం గొప్ప అదృష్టం, గౌరవంగా భావిస్తున్నా. మూడేళ్ళు పాటు మేజర్ జర్నీ సాగింది. కరోనా లాంటి పాండమిక్ ని దాటోచ్చాం. దర్శకుడు శశి గారి ఫాదర్ చనిపోయిన మూడో రోజుకే శశి ఎంతో ధైర్యంగా సెట్స్ కి వచ్చారు. మా నాన్నగారి 11రోజు పూజ తర్వాత నేనూ మేజర్ టీజర్ మిక్సింగ్ కి వచ్చాను. మేజర్ విజయం మాకెంతో గర్వంగా వుంది. నా యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. మేజర్ సందీప్ గారి ఈ చిత్రం గొప్ప నివాళి.'' అన్నారు నటుడు అనీష్ కురువిల్లా మాట్లాడుతూ.. మేజర్ లాంటి గొప్ప సినిమా తీసిన మహేష్ బాబుగారికి కృతజ్ఞతలు. హీరో అడవి శేష్ మేజర్ చిత్రాన్ని ఎంతో అంకిత భావంతో చేశారు, అది తెరపై కనిపించింది. సినిమా మొదలైనప్పటి నుండి తెరకి అతుక్కుపోయా. దర్శకుడు శశి కిరణ్ మేజర్ చిత్రాన్ని అద్భుతంగా తీశారు, మేజర్ సందీప్ కి ఘనమైన నివాళిగా నిలిపారు. మేజర్ టీం అద్భుతమైన టీమ్ వర్క్ తోనే ఇంత పెద్ద విజయం సాధ్యమైయింది. ఈ చిత్రంలో బాగం కావడం గర్వంగా వుంది.'' అన్నారు. Author : rajkamal Publisher : FilmyBuzz INTERESTED ARTICLES పవన్, రానా సినిమా నుంచి తప్పుకున్న హీరోయిన్? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న � .. Read More ! త్రివిక్రమ్ తప్పుకుంటే... పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� .. Read More ! చరణ్ సూపర్ ప్లాన్.. మెగా డీల్ కి సైన్ చేసిన కొరటాల? డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ .. Read More ! రాంచరణ్ హీరోయిన్ కావాలంటున్న అల్లు అర్జున్? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా .. Read More ! చిరు కోసం బాలీవుడ్ పై దృష్టి పెట్టిన కొరటాల? 'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల� .. Read More ! ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ డైరెక్టర్ తోనే ఎన్టీఆర్ సినిమా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత � .. Read More ! రాంచరణ్ హీరోయిన్ పై కన్నేసిన అల్లు అర్జున్? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా .. Read More ! మహేష్ బాబును క్యాష్ చేసుకోబోతున్న కొరటాల? ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో � .. Read More ! Ads Fertility centers in Hyderabad | Car Loan in Hyderabad Home | About Us | Contact Us | Advertising Programs | Privacy Policy � 2019 Copyright FILMYBUZZ.COM All rights reserved.
టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ వంటి హీరో ఎప్పటికి రాడు. ఎంతో అందంగా,అమాయకంగా కనిపించే ఉదయ్ కిరణ్ నిజ జేవితంలో ఎంతో సున్నిత మనస్సు కలిగిన వాడు. ఏ కొత్త హీరోకి రానంత పేరు ప్రతిష్టలు,క్రేజ్,ఊహించని రెమ్యునరేషన్ ఉదయ్ కిరణ్ ని స్టార్ హీరోగా మార్చాయి. అయితే ఉదయ్ కిరణ్ జీవితం ఒక సంఘటనతో తారుమారు అయిందనే చెప్పాలి. చిరంజీవి కూతురుతో నిశ్చితార్ధం క్యాన్సిల్ అయ్యాక ఉదయ్ కిరణ్ జీవితంలో బ్యాడ్ రోజులు ప్రారంభం అయ్యాయి. సరైన అవకాశాలు రాకపోవటం, చేసిన సినిమాలు ప్లాప్ అవ్వటం,పెళ్లి చేసుకున్న మారని పరిస్థితులు ఉదయ్ కిరణ్ ని మానసికంగా దెబ్బతిశాయి. ఆ తర్వాత ఏమి జరిగిందో మనకు తెలిసిన విషయమే. కుటుంబ సభ్యులను,అభిమానులను తీవ్ర వేదనకు గురి చేస్తూ తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించాడు. అయితే ఉదయ్ కిరణ్ కి ముందే ఉదయ్ కిరణ్ అన్నయ్య కూడా ఇదే రీతిలో చనిపోయాడని చాలా మందికి తెలియదు. మస్కట్ లో ఉండే ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. తల్లి చనిపోయిన తర్వాత తమ కుటుంబం చిన్నాభిన్నం అయిందని… ఉదయ్ కిరణ్ కి ముందు తన అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. అతను పెద్ద మేధావి అని సమాజంలో జరిగే సంఘటనలకు చలించిపోయేవాడని… ఎవరికీ ఏ అన్యాయం జరిగినతట్టు కోలేక పోయేవాడని… ఇలాంటి లోకంలో జీవించటం కంటే హిమాలయాల్లో జీవించటం బెటర్ అని భావించేవాడని చెప్పింది. అయితే ఉన్నట్టు ఉండి డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. అన్నయ్య బాటలోనే ఉదయ్ కిరణ్ కూడా ఆత్మహత్య చేసుకోవటం మమ్మల్ని ఎంతగానో బాధకు గురి చేసిందని శ్రీదేవి చెప్పుతూ… తల్లిని,అన్నయ్యను,తమ్ముడిని కోల్పోయి తాను ఒంటరి అయ్యిపోయానని కంట తడి పెట్టింది. ఉదయ్ కిరణ్ చివరి రోజుల్లో ఆర్ధిక ఇబ్బందులు పడ్డాడని కథనాలు చాలా వచ్చాయని వాటిలో ఏమాత్రం నిజం లేదని…సినిమాలు లేకపోయినా దర్జాగా బ్రతికేంత ఆస్థి తమ్ముడు పేర ఉందని శ్రీదేవి చెప్పారు. ల్యాండ్స్,బంగారం చాలా ఉందని ఉదయ్ కిరణ్ మరణానికి డబ్బు కారణం కాదని చెప్పింది.
ప‌ర్యాట‌కుల‌కు గుడ్ న్యూస్. క‌రోనాకు ముందు ఎలాగో ఇప్పుడూ అలాగే. అండ‌మాన్ నికోబార్ దీవుల‌కు హాయిగా వెళ్లొచ్చు. అయితే రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి అయి ఉండాలి. ఆర్ టీపీసీఆర్ నెగిటివ్ స‌ర్టిఫికెట్ వంటి అవ‌స‌రాలు లేకుండా ఈ ద్వీప ప్రాంత సౌంద‌ర్యాల‌ను చూసిరావొచ్చు. ఈ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు సెప్టెంబ‌ర్ 25 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. కొత్త‌గా జారీ చేసిన ప్రామాణిక నిర్వ‌హ‌ణ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం రెండు డోసుల వ్యాక్సినేష‌న్ పూర్తయిన 15 రోజుల త‌ర్వాత పోర్ట్ బ్లెయిర్ లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. అయితే ఎలాంటి ల‌క్షణాలు లేనివారికే ఇవి వ‌ర్తిస్తాయి. అండ‌మాన్ నికోబార్ సంద‌ర్శ‌న‌కు వెళ్ళిన వారికి ఎవ‌రికైనా ఏమైనా కోవిడ్ ల‌క్షణాలు క‌న్పిస్తే మాత్రం అక్క‌డ ఆర్ టీపీసీఆర్ ప‌రీక్షలు నిర్వ‌హిస్తారు. అది వ్యాక్సిన్ తీసుకున్న వారికి అయినా స‌రే. అయితే ఒక డోస్ తీసుకున్న వారు..అస‌లు వ్యాక్సినేష‌న్ తీసుకోని వారు మాత్రం విధిగా ఆర్ టీపీసీఆర్ నెగిటివ్ స‌ర్టిఫికెట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది..అంతే కాదు..అక్క‌డ విమానాశ్ర‌యంలో కూడా మ‌ళ్లీ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం అయిన అండ‌మాన్ నికోబార్ లో కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ అన్ని ప‌ర్యాట‌క ప్రాంతాల్లోకి అనుమ‌తులు ఇస్తున్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ కేవ‌లం 17 క‌రోనా కేసులు మాత్ర‌మే ఉన్నాయి. Andaman and Nicobar Tourists Need not carry Rtpcr negitive certificate Vaccinated Tourists only Latest travel news అండ‌మాన్ నికోబార్ ఇక‌ హాయిగా వెళ్లొచ్చు Similar Posts Recent Posts International HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog. HoneyBunnyOnline.com is one of the best parenting Blog.
త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ… ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, శిల్పా చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సోమవారానికి సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏఎంబీ సినిమాస్‌లో స్పెషల్ షో వేశారు. ఈ ప్రదర్శనకు చిత్ర బృందం హాజరయ్యారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ ”వనమాలి హౌస్‌లో ‘నువ్వే కావాలి’ షూటింగ్ జరుగుతుంది. రవికిశోర్ గారు, నేను పక్కన ఖాళీ స్థలంలో నడుస్తూ మాటల మధ్యలో కథ చెప్పా. ఆయన చెక్ బుక్ తీసి ఒక అమౌంట్ వేసి ఇచ్చారు. ‘నువ్వే కావాలి’కి రైటర్‌గా ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో…దాదాపుగా అంత అమౌంట్ అడ్వాన్స్‌గా ఇచ్చారు. నేను దాంతో బైక్ కొనుక్కున్నాను. అప్పటికి నేను రాసిన ‘నువ్వే కావాలి’ షూటింగ్‌లో ఉంది. నేను ఏం చేయగలనో తెలియదు. కానీ, నేను చెప్పిన కథ విని రవికిశోర్ గారు ఎంతో నమ్మారు. ఆయనకు నేను ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా సరిపోదు. మద్రాసులో ‘నీరం’ చూసి అందులో సన్నివేశాలను నా ఇష్టం వచ్చినట్లు ఎలా మార్చేయాలో చెబుతుంటే విన్న రవికిశోర్ గారు… ‘స్వయం వరం’ రాసిన తర్వాత నన్ను ఎవరూ పిలవకపోతే నేను భీమవరం వెళ్లి క్రికెట్ ఆడుకుంటుంటే మా ఇంటి పక్కన ఎస్‌టీడీ బూత్ నంబర్ కనుక్కుని నాకు ఫోన్ చేసిన రవికిశోర్ గారు… ‘నువ్వు నాకు నచ్చావ్’ కథను మీరు అనుకున్న హీరోకి కాకుండా పెద్ద హీరోకి చెబుతానని వాదిస్తే ‘నీ ఇష్టం వచ్చినట్టు చావు’ అని ప్రోత్సహించిన రవికిశోర్ గారు… రాత్రిపూట స్క్రిప్ట్ చదివి నేను రాసిన డైలాగ్ నచ్చితే ఫోన్ చేసి ఏడ్చిన రవికిశోర్ గారు… నేను పంజాగుట్టలో ఉన్నప్పుడు మా రూమ్ దగ్గరకు వచ్చి కింద నుంచి హారన్ కొట్టి పిలిచే రవికిశోర్ గారు… ఆయనకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలి? రసికుడు కానివాడికి కవిత్వం నివేదించే దరిద్రం నా నుదుటి మీద రాయొద్దని కాళిదాసు చెప్పాడు. నేను రాసిన మాటలు వినే రసికుడిని నాకు ప్రదర్శించినందుకు దేవుడికి నేను ఎన్నిసార్లు కృతఙ్ఞతలు చెప్పాలి! ‘నువ్వే నువ్వే’ కోసం ఢిల్లీకి వెళ్లి శ్రియ‌తో పాటు వాళ్ళ అమ్మకు కథ చెప్పడం నుంచి శ్రీనగర్ కాలనీలో రవికిశోర్ గారి ఆఫీసులో అందరికీ స్క్రిప్ట్ రీడింగ్ ఇవ్వడం నుంచి ప్రకాశ్ రాజ్ గారి ఇంటికి వెళ్లడం, ఊటీలో షూటింగ్ చేయడం… ప్రతిదీ ఇప్పటికీ గుర్తు. ‘నువ్వే నువ్వే’ షూటింగ్‌లో ఫైట్ మాస్టర్ లేకపోతే తరుణ్ చేత ఒక కిక్ కొట్టించే సీన్ చేశా. అప్పుడు నాలో వయలెన్స్ ఉందని అర్థమైంది. ‘అతడు’ తీసిన తర్వాత వెంకటేష్ గారు ‘నువ్వు చూస్తే సాఫ్ట్ గా ఉంటావ్. సినిమా వైలెంట్ గా తీశావ్’ అన్నారు. ఆ వయలెన్స్ ‘నువ్వే నువ్వే’లో కిక్ తో స్టార్ట్ అయ్యింది. నాలో ఉన్న రచయితను గానీ… దర్శకుడిని గానీ… నాకంటే ఎక్కువగా గుర్తించిన, ఇష్టపడ్డ వ్యక్తి రవికిశోర్ గారు. ఆయన్ను నేను చాలా ప్రేమిస్తా. గౌరవిస్తా. రవికిశోర్ గారు అనడమే వచ్చు. నాకు ఆయన అన్నలాగా! ఆయనకు, సీతారామశాస్త్రి గారి మధ్య ఉన్న లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ ఇంకెవరి మధ్య చూడలేదు. అందుకు నేను సాక్షిని. ‘గాలిపటం గగనానిదా? ఎగరేసే నేలదా?’ అని రాసిన శాస్త్రి గారి గురించి నేను ఏం చెప్పగలను! ఆయన మాటల్లో చెప్పాలంటే… ‘ఆయన ఉఛ్వాసం కవనం. ఆయన నిశ్వాసం గానం. ఆయన జ్ఞాపకం మన అందరికీ ఎప్పటికీ అమరం’. అటువంటి సీతారామశాస్త్రి గారి దివ్య స్మృతికి ఆయన పాదాల దగ్గర ఈ సినిమాను రవికిశోర్ గారు, నేను, మా చిత్ర బృందం నివాళిగా అర్పిస్తున్నాం” అని అన్నారు. దర్శకుడిగా తనను పరిచయం చేసిన ‘స్రవంతి’ రవికిశోర్ పాదాలకు త్రివిక్రమ్ నమస్కరించారు. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”నాకు ‘నువ్వే కావాలి’ సినిమా టైమ్‌లో త్రివిక్రమ్ కథ చెప్పాడు. కథంతా రెడీగా ఉంది. సినిమా తీయడమే ఆలస్యం అనుకున్నాం. 2002లో స్టార్ట్ చేసి విడుదల చేశాం. త్రివిక్రమ్ కథ చెప్పినప్పుడు ఇందులో తండ్రి పాత్ర ప్రకాశ్ రాజ్ మాత్రమే చేయాలని అతడిని ఫిక్స్ చేశాం. ఆయన చెప్పినట్లు ‘నువ్వు నాకు నచ్చావ్’ షూటింగ్ టైమ్‌లో ఆయన మీద బ్యాన్ ఉంది. ప్రకాశ్ రాజ్ కోసం పదిహేడు రోజులు ఇతర సన్నివేశాలు తీశాం. ఆయన తప్పితే ఆ సన్నివేశాలకు ఎవరూ ప్రాణం పోయలేరు. ‘నువ్వే నువ్వే’లో కూడా అంతే! ఆయన అద్భుతంగా నటించారు. వండ‌ర్‌ఫుల్‌ కాస్ట్ అండ్ క్రూ ఈ చిత్రానికి కుదిరింది. నేను త్రివిక్రమ్ గురించి చెప్పడం కరెక్ట్ కాదు. అతనొక వండర్. మేజిక్ క్రియేట్ చేస్తాడు. ఇక, నేను రాముడు అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారు లేకపోవడం… ఆయనతో నాకున్న అనుబంధం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. సుమారు 80 నుంచి 90 పాటలకు అసోసియేట్ అయ్యాం. చాలా పాటలకు రాత్రుళ్ళు కూర్చున్నాం. నా కళ్ళలోకి చూసి నచ్చిందో లేదో చెప్పేవారు. త్రివిక్రమ్ చెప్పినట్లు ‘నువ్వే నువ్వే’ను ఆయనకు అంకితం ఇస్తున్నాం” అని అన్నారు. తరుణ్ మాట్లాడుతూ ”సినిమా విడుదలై 20 ఏళ్ళు అయినా… ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు ఉంది. నాకు బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్ లో సినిమా చూస్తా. నన్ను ‘నువ్వే కావాలి’తో రామోజీరావు గారు, ‘స్రవంతి’ రవికిశోర్ గారు హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత స్రవంతి మూవీస్ సంస్థలో ‘నువ్వే నువ్వే’, ‘ఎలా చెప్పను?’ చేశా. ఈ సంస్థలో మూడు సినిమాలు చేయడం నా అదృష్టం. హీరోగా నా తొలి సినిమా ‘నువ్వే కావాలి’కి త్రివిక్రమ్ మాటలు రాశారు. దర్శకుడిగా ఆయన తొలి సినిమాలో నేను హీరో కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎంత మంది హీరోలతో చేసినా… ఆయన ఫస్ట్ హీరో నేనే. ప్రకాశ్ రాజ్ గారితో కలిసి ఈ సినిమాలో తొలి సారి చేశా. ఆయన, శ్రియ, ఇతర నటీనటులు అందరితో పని చేయడం సంతోషంగా ఉంది. ‘నువ్వే నువ్వే’ లాంటి సినిమా ఇంకొకటి చేయమని చాలా మంది అడుగుతారు. నాకు ఇటువంటి సినిమా చేసే అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. అమ్మ, ఆవకాయ్, అంజలి, నువ్వే నువ్వే…. ఎప్పటికీ బోర్ కొట్టవు” అని అన్నారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ ”నువ్వు లేకపోతే ‘నువ్వే నువ్వే’ లేదని రవికిశోర్ గారు అన్నారు. మేమంతా లేకపోతే ‘నువ్వే నువ్వే’ లేదు. టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు. నేను ఈ రోజు ఫుల్ సినిమా చేశా. ‘నువ్వు నాకు నచ్చావ్’ కోసం నన్ను బ్యాన్ చేస్తే… నాపై బ్యాన్ తీసే వరకూ వెయిట్ చేశారు. సినిమా అంటే ఎంతో ప్రేమించే రవికిశోర్, త్రివిక్రమ్ తో జర్నీ ఎంజాయ్ చేశా. త్రివిక్రమ్ దర్శకుడు కాక ముందే రచయితగా నాకు తెలుసు. నా కోసమే మాటలు రాసేవాడిని అనిపించేది” అని అన్నారు. శ్రియ మాట్లాడుతూ ”త్రివిక్రమ్ గారు, రవికిశోర్ గారు ఢిల్లీ వచ్చారు. ఈ కథ వినగానే నచ్చేసింది. ‘మీరు నిజంగా ఈ కథలో నేను నటించాలని అనుకుంటున్నారా?’ అని అడిగా. షూటింగ్ చాలా ఎంజాయ్ చేశా. తరుణ్ స్వీట్ కో స్టార్. ప్రకాశ్ రాజ్ నా తండ్రిలా ఉండరు. కానీ, సినిమాలో తండ్రిలా చేశారు. మా మధ్య మ్యూజిక్ గురించి డిస్కషన్స్ జరిగాయి. ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ మెమరీ” అని అన్నారు. నృత్య దర్శకులు సుచిత్రా చంద్రబోస్ & శంకర్, సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు, నటీమణులు మధుమిత, అనితా చౌదరి, శిల్పా చక్రవర్తి, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
అప్పుడు హుద్ హుద్ కారణంగా విశాఖ ప్రజలు టపాసులు కాల్చడానికి దూరంగా ఉన్నారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడ ఉంటే కరోనా బారిన పడకుండా ఉండవచ్చు. November 12, 2020 at 7:51 PM in Andhra Pradesh, General, Latest News Share on FacebookShare on TwitterShare on WhatsApp ( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి ) కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది అనేక పండుగులకు ప్రజల దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ దీపావళి వచ్చేసరికల్లా లాక్ డౌన్లు ఎత్తివేయడం, జనం బయటకు రావడం పెరిగింది. అన్ని పండుగుల కన్నా ఈ పండుగకు ఉన్న ప్రత్యేకతలు వేరు. దీంతో అందరి దృష్టి దీపావళి పండుగపై పడింది. ప్రతి ఇంటిలోను పిల్లలు ఉండడంతో ఈ పండుగను కోలాహలంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా అన్ని మతాల వారు ముందు గుండు సామగ్రిని కాల్చడానికి ఉత్సాహపడతారు. అయితే, కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఈ ఏడాది దీపావళికి ప్రజలు వీలైనంత దూరంగా ఉండాలని, తప్పనిసరి పరిస్థితిలో గ్రీన్ క్రాకర్స్ కాల్చాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. హుద్ హుద్ కారణంగా… దీపావళి అంటేనే ఉవ్వెత్తున ఎగిసే తారాజువ్వలు.. చెవులు హోరెత్తే టపాసులు.. కళ్ళు మిరుమిట్లు గొలిపే మతాబులు… ఒక్కటేంటి కొన్ని గంటల పాటు అంతా వెలుగుల మయమే. కాని, అటువంటి దీపావళిని దేశమంతా జరుపుకుంటుండగా, ఒక్క విశాఖ వాసులు మాత్రమే దూరంగా ఉన్న సందర్భం జిల్లా చరిత్రలో నమోదయింది. అది కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి దివ్వెల దీపావళి మాత్రమే చేసుకున్నారు. విశాఖలో ఒక్క బాంబు కూడా పేలని ఆ ఏడాదే 2014. విశాఖను కకావికలం చేసిన హుద్ హుద్ తుఫాను కారణంగా విశాఖ వల్లకాడుగా మారింది. ఎక్కడ చూసినా లక్షలాది వృక్షాలు నేలకూలి… కారు చిచ్చు రేగిన అడవిలా మారింది. అప్పటి పరిస్థితుల్లో టపాసులు కాలిస్తే అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉండడంతో. ప్రజలను అప్రమత్తం చేస్తూ చంద్రబాబు వాటిని నిషేధించాలని పిలుపునిచ్చారు. తుఫాను తరువాత పునరుద్ధరణ చర్యల్లో భాగంగా సుమారు రెండు వారాల పాటు ఆయన నగరంలోనే ఉండి ఆయన స్వయంగా పర్యవేక్షించడంతో… ప్రజలంతా దీపావళికి దూరంగా గడిపారు. ఇంటి ముందు దీపాలు వెలిగించి పండుగను సరి పుచ్చుకున్నారు. అయితే, ఈ ఏడాది ఇప్పటికే చాలా చోట్ల అన్ని రకాల టపాసుల అమ్మకాలు జరిగాయి. ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలి గాని నిషేదాజ్ఞల అమలును పర్యవేక్షించడం కూడ ఫ్రభుత్వాలకు సాధ్యమయ్యే విషయం కాదు. గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలన్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తులు ఏ మేరకు సఫలమవుతాయో చూడాలి. Tags: #central government#covid-19ap state governmentban firecrackerschandra babu naiduCyclone_Hudhuddiwali 2020diwali celebrationslatest ap newsleonewsLockdownrestriction on crackerstelugu newsvishakapatnam
శాస్త్రీయ సంగీతంలో జుగల్‌బందీ కచేరీలకి కొంత ప్రత్యేకత ఉంది. రెండు వేరువేరు శైలులనో, వాయిద్యాలనో ఉపయోగించి వాటి మధ్యనున్న సామాన్య లక్షణాలని ఈ కచేరీలు విశదం చేస్తాయి. ఇది జరుగుతున్న క్రమంలో ఒక్కొక్క శైలిదీ విశిష్టత మనకు తెలుస్తూనే ఉంటుంది. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అన్న పద్ధతిలో ఈ మిశ్రమ సంగీతాన్ని శ్రోతలు స్వాదించి, ఆనందించగలుగుతారు. ఇందుకు భిన్నంగా రాధాజయలక్ష్మి వంటి గాయనుల ద్వయం ఒకేసారిగా కలిసి ఒకే పద్ధతిలో పాడుతూ ఉంటారు. బృందగానంలాగా సాగే ఇటువంటి కచేరీలకు జుగల్‌బందీకి ఉన్న అందం ఉండదు. పడుగూ పేకలాగా, కలినేత వస్త్రంలాగా విడివిడిగానూ, అప్పుడప్పుడు కలిసికట్టుగానూ వినబడే రెండు రకాల జుగల్‌బందీ సంగీతం దారే వేరు. మునవ్వర్ అలీ ఖాన్ బాలమురళీకృష్ణ 1969లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో కేంపస్ బైట కాల్టెక్స్ కంపెనీ క్వార్టర్స్‌లో ఒక జుగల్‌బందీ కచేరీకి నేను హాజరు కాగలిగాను. కాగలిగాను అనడానికి కారణమేమిటంటే అది ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే ఏర్పాటు చెయ్యబడింది కాబట్టి. అందులో బాలమురళీకృష్ణ, మునవ్వర్ అలీ ఖాన్ (బడే గులాం అలీ కుమారుడు) పాడారు. 1980లలో బాలమురళి భీంసేన్ జోషీతోనూ, కిశోరీ అమోణ్‌కర్ తదితరులతోనూ తరుచుగా జుగల్‌బందీ కచేరీలు పాడడం జరిగింది కాని అప్పట్లో ఇది చాలా అరుదైన సంఘటనే. బాలమురళిగారితో నాకున్న పరిచయం కారణంగా గేట్‌క్రాష్ అయిన నేను కచేరీ జరిగే ముందు నుంచీ అక్కడే ఉన్నాను కనక కొన్ని విశేషాలు నా కంటబడ్డాయి. ముందుగా బాలమురళి, మృదంగ విద్వాన్ దండమూడి రామమోహనరావు తదితరులు దిగిన ఇంటికి మునవ్వర్ తదితరులు వచ్చారు. పరస్పర పరిచయాలూ, ఆలింగనాలూ, కుశలప్రశ్నలూ అయిన తరవాత కర్ణాటక, హిందుస్తానీ సంగీత పద్ధతుల గురించి కాస్త మాట్లాడుకున్నారు. రెండూ స్థూలంగా ఒకే సంగీతానికి వేర్వేరు రూపాలనీ, పేర్లు వేరైనా కామన్ రాగాలెన్నో ఉన్నాయనీ ఎవరికొచ్చిన యాసలో వారు ఇంగ్లీషులోనే మాట్లాడుకున్నారు. మాటల మధ్యలోనే కల్యాణి (యమన్) రాగాల్లో తలొక సంగతీ, వరసలూ పాడుకోగా మేమంతా మా సంతోషాన్ని వ్యక్తం చేశాం. అలాగే హిందోళం (మాల్కౌస్) రాగాల ప్రస్తావన వచ్చింది. ఇలా కాసేపు ముచ్చటించుకున్నాక డిన్నర్ తినడానికని ఎవరి విడిదికి వారు వెళిపోయారు. ఇదంతా చూస్తున్న నాకు ఆందోళన తగ్గలేదు. నేను చిన్న గొంతుతో బాలమురళిగారితో ‘అయ్యా, మీరు ఏ రాగాలు పాడబోతున్నారో అనుకున్నారు, సరే. మరి వాటిలో ఏయే పాటలు పాడతారో అనుకోలేదేం?’ అని అడిగాను. దానికాయన చిరునవ్వుతో ‘చూద్దాంలే, అతనికి తోచిందతను పాడతాడు. నాకు తోచిందేదో నేను పాడతాను ‘ అన్నాడు. ఆయన ధీమాగానే ఉన్నాడు కాని నాకే మధ్యలో ఆత్రుతగా అనిపించింది. ఇంతలో దండమూడివారు ‘ఇదిగో, మరొహరూ మరొహరూ అయితే నేనిలాంటి కచేరీలకి ఒప్పుకోను తెలుసా? బాలమురళిగారు గనక పరవాలేదు. ఆయన మహా సమర్థుడు ‘ అన్నాడు. ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠతో నేను లోలోపలే తబ్బిబ్బయాను. ఆ సంస్థ ఏర్పాట్లన్నీ ఘనంగా ఉన్నాయి. కళాకారులు నడిచి వస్తున్నప్పుడు ఇరువేపులా పిల్లలు నిలబడి వారు నడుస్తున్న దారిలో మల్లెపూలు చల్లారు. వారికి నిలువెత్తు మల్లెపూల దండలు సమర్పించారు. ప్రతిచోటా అమెరికన్ కంపెనీ డాలర్ల బలం కనబడింది. ఏర్పాట్లన్నీ చాలా చక్కగా జరిగాయి. కాసేపటికి కచేరీ మొదలయింది. కలకత్తా నుంచి వచ్చిన మునవ్వర్ అలీకి తబలా వాయించడానికి బొంబాయి నుంచి నిజాముద్దీన్ ఖాన్ వచ్చాడు. దాదాపు ఒకే వయసుగల బాలమురళి, మునవ్వర్‌లకు అభిమానులం చాలామందిమి వింటూ ఉన్నాం. మొదటగా కల్యాణి ఆలాపన ప్రారంభించారు. యమన్‌లో మునవ్వర్ శైలి హుందాగా, అందంగా సాగింది. చిరపరిచితమైన బాలమురళి గానం కల్యాణి అందాలని ఎత్తి చూపింది. కొంతసేపటికి హెచ్చరికలాంటిదేమీ ఇవ్వకుండా మునవ్వర్ యమన్‌లో ఒక తరానా (తిల్లానా) పాడటం మొదలుపెట్టాడు. తాన్న ధీం అంటూ సాగే ఇటువంటి పాటలకు సాహిత్యం ఉండదు. హిందుస్తానీ పద్ధతిలో సాహిత్యానికి ఎలాగూ ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ద్రుత్ తీన్‌తాల్‌లో మొదలైన ఈ గీతానికి బాలమురళి ఎలా స్పందిస్తారోనని అందరమూ వేచి చూస్తున్నాం. అయిదు నిమిషాల తరవాత ఆయనవంతు రానేవచ్చింది. మునవ్వర్ పాడిన ట్యూన్ వరసలోనే ఆయన అప్పటికప్పుడు ‘కల్యాణీ రాగిణీ’ అంటూ పల్లవి ఎత్తుకోగానే చప్పట్లు మారుమోగాయి. ఎంతో సమయస్ఫూర్తితో ఆయనొక చిన్న అనుపల్లవి కూడా కట్టి పాడేశారు. మునవ్వర్ కూడా అవే మాటలు పట్టుకుని ‘కల్యానీ రాగ్‌నీ’ అంటూ కొనసాగించాడు. ఏమాత్రమూ పోటీ ధోరణి లేకుండా ఇద్దరూ రాగాన్ని ఆహ్లాదంగా పాడి వినిపించారు. తరవాత హిందోళం గానం చేశారు. మునవ్వర్ హిందుస్తాని పద్ధతిలో ఆలాపన తరవాత లక్షణగీతం శైలిలో ‘గావో మాల్కౌస్ ‘ అని ఊరుకున్నాడు. దానికి ప్రతిగా బాలమురళి ‘మనమంతా హిందువులం’ (హిందోళం అనేదానికి దగ్గరి మాట) అన్నారు! (మునవ్వర్ హిందువు కాదు గనక వ్యక్తిగతంగా నాకది తప్పు మాటేమో అనిపించింది గాని రాగం పేరుతో పోలినది కదా అని సరిపెట్టుకున్నాను) చివరగా ఇద్దరూ సింధుభైరవి పాడారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఆ కచేరీ ఎంతో అద్భుతంగా, అపురూపంగా అనిపించింది. బాలమురళి లయవిన్యాసాలకి ముగ్ధుడైన నిజాముద్దీన్ ఆయన పాడుతున్నప్పుడు మృదంగంతో బాటుగా వాయించసాగాడు. చివరకు తాళవాద్యాల ‘తని ఆవర్తనం’ కూడా ఎంతో బాగా కుదిరింది. ఆ తరవాత సుమారు పదిహేనేళ్ళకు మునవ్వర్ కచేరీ బొంబాయిలో విన్నప్పుడు ఆయనను కలుసుకుని ఆనాటి కచేరీ గురించి గుర్తుచేశాను. ఆయన పరమానందంతో ‘ఓహో, మీరది విన్నారా? మేమానాడు చరిత్ర సృష్టించాం’ అన్నాడు. ఆయన 60 ఏళ్ళ లోపునే 1989లో చనిపోవడం చాలా దురదృష్టకరం. అంతవరకూ నేను విన్న ప్రసిద్ధ జుగల్‌బందీ సంగీతంలో పాకిస్తాన్ గాయకులైన నజాకత్, సలామత్ అలీ సోదరులదీ, రవిశంకర్ (సితార్), అలీ అక్బర్ (సరోద్) లదీ ముఖ్యమైనవి. అలాగే విలాయత్ ఖాన్ (సితార్), ఆయన తమ్ముడు ఇమ్రత్ ఖాన్ (సుర్‌బహార్) వాయించిన అమోఘమైన కచేరీ విన్నాను. మరికొంత కాలానికి విలాయత్ ఖాన్ (సితార్) బిస్మిల్లా ఖాన్ (షెహనాయి) తో కచేరీ చేసి చరిత్ర సృష్టించారు. బిస్మిల్లా ఖాన్ (షెహనాయి), వి.జి.జోగ్ (వయొలిన్) కలిసి వాయించిన కచేరీలు కూడా ప్రసిద్ధమైనవే. హరిప్రసాద్ చౌరాసియా (వేణువు), శివకుమార్ శర్మ (సంతూర్) అనేక జుగల్‌బందీ కచేరీలు చేశారు. ఇటీవల షాహిద్ పర్వేజ్ (సితార్), రషీద్ ఖాన్ (గాత్రం) కలిసి అద్భుతమైన సంగీతం వినిపించారు. కర్ణాటక పద్ధతిలో లాల్గుడి జయరామన్ (వయొలిన్), రమణి (వేణువు) అనేక కచేరీలు చేశారు. రెండు విభిన్న సంప్రదాయాల సమ్మేళనం మాత్రం నేను 1969లో వినడం అదే మొదటిసారి. ఆ తరవాత విలాయత్ ఖాన్ (సితార్), అంజాద్ అలీ ఖాన్ (సరోద్) లిద్దరూ లాల్గుడి (వయొలిన్) తో కలిసి హిందుస్తానీ, కర్ణాటక కచేరీలెన్నో చేశారు. ఈ మధ్య రాం నారాయణ్ (సారంగీ), రమణి (వేణువు) కూడా అటువంటిది చేశారు. టి.ఎన్.కృష్ణన్, ఆయన సోదరి ఎన్. రాజం లిద్దరూ వయొలిన్ మీద కర్ణాటక హిందుస్తానీ జుగల్‌బందీ కచేరీలు చేశారు. ఇలాంటివి ఇంకెన్నో జరుగుతున్నాయి. అప్పట్లో మాత్రం ఇవి చాలా అరుదుగా జరుగుతూ ఉండేవి. అటు రవిశంకర్ యెహుదీ మెనూహిన్ (వయొలిన్)తోనూ, జపానీయులతోనూ జుగల్‌బందీలు వాయించాడు కాని అవన్నీ ముందుగా కంపోజ్ చేసుకుని వాయించినవి. జుగల్‌బందీ సంగీత కచేరీల్లో ఇద్దరు సంగీతకారులు ఒకే రాగం వినిపిస్తారు. ఇద్దరూ ఒకే బాణీకి చెందినవారయినా, వేరు పద్ధతుల్లో శిక్షణ పొందినవారయినా ఎవరి శైలి, దృక్పథం వారికుంటాయి. ఇద్దరూ కలిసినప్పుడు రాగానికీ, పాడే కృతికీ ఉన్న విభిన్న అంశాలు విదితం అవుతాయి. అన్నీ సరిగ్గా ఒనగూడితే ఈ శైలులు ఒకదానికొకటి సంపూరకంగా (సప్లిమెంటరీ లేదా కాంప్లిమెంటరీ) పనిచేస్తాయి. ఏ నాయుడుగారికో మంగతాయారులా కాకుండా ఇద్దరు కళాకారులకీ సమాన హోదా ఉంటుంది. ఉదాహరణకు పాకిస్తాన్ సోదరుల్లో నజాకత్ శైలి మృదువుగా, రాగ స్వరూపాన్ని నిర్దేశిస్తూ ఉండేది. సలామత్ అతి వేగంగా, దూకుడుగా, విద్వత్తుతో వివరాలన్నీ నింపేవాడు. ఇద్దరూ కలిసి పాడుతున్నప్పుడు అద్భుతమైన సమన్వయం ఉండేది. వాద్యకారులైతే రెండు వాయిద్యాల్లోని తేడాలూ, శబ్ద విశేషాలూ అందంగా కలుస్తాయి. చిన్నతనం నుంచీ కలిసి నేర్చుకున్న రవిశంకర్, అలీ అక్బర్‌ల మధ్య అద్భుతమైన సమన్వయం ఉండేది. సరోద్ గాంభీర్యానికి సితార్ చిలిపితనం అందంగా తోడయేది. దీర్ఘమైన స్వరాలను పలికించగల షహనాయితో బాటు విస్ఫులింగాలు వెదజల్లగలిగిన సితార్ మోగినప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. వీటన్నిటినీ మించి రాగాలను గురించిన ఇద్దరు మేధావుల సంభాషణ వింటున్నట్టుగా ఉంటుంది. ఉన్న సమయాన్ని ఇద్దరు పంచుకుంటున్నప్పటికీ, ఏ ఒక్కరికీ నిరాటంకంగా తమ ఆలోచనా సరళిని వ్యక్తం చేసే అవకాశం తగ్గినప్పటికీ జుగల్‌బందీ కచేరీలకు ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ‘ఈ ఇద్దరి కుమ్ములాటలో ఎవడు గెలుస్తాడ్రా’ అనే ధోరణిలో ప్రేక్షకులు వింటే అది చాలా పొరపాటే. పరస్పర అభిమానం, గౌరవం ఉన్న సందర్భాల్లోనే జుగల్‌బందీలు రాణిస్తాయి. నేను విన్న కొన్ని కచేరీల్లో విలాయత్ ఖాన్ సితార్ సంగీతం బిస్మిల్లా గారిని ఎంత ప్రభావితం చేసేదంటే ఆయన మామూలు కన్నా గొప్పగా షహనాయి వాయించాడనిపించేది. ఒక కచేరీలో విలాయత్ ఖాన్ పిలూ రాగం వాయిస్తున్నప్పుడు బిస్మిల్లా వాయించకుండా తలవంచుకుని వింటూ కూర్చున్నారు. రెండు మూడు సార్లు తనవంతు వచ్చినా ‘మీరే కానివ్వండి’ అనే సైగ చేశారు. ఆ తరవాత కొద్ది సేపు బిస్మిల్లా తన వర్షన్ ఎంతో భావయుక్తంగా వాయించగానే ప్రేక్షకులు చలించిపోయారు. అందుకనే పెద్ద కళాకారుల మధ్య సయోధ్య కుదిరితే వర్ణనాతీతమైన సంగీతం పుట్టుకొస్తుంది. ఇది సోలో కచేరీల్లో వీలవదు. కర్ణాటక, హిందుస్తానీ జుగల్‌బందీల సంగతి కాస్త భిన్నమైనది. హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల గురించి తెలిసినవారికి వాటి మధ్య గల పోలికలూ, వ్యత్యాసాలూ ఎటువంటివో చెప్పక్కర్లేదు. ఒకే రాగానికి వేరు వేరు పేర్లుండడమూ (మోహన, భూపాలీ), ఒకే పేరు కలిగిన విభిన్న రాగాలుండడమూ (తోడి), కర్ణాటక రాగాలు ఉత్తరాది శైలిలో జనాదరణ పొందడమూ (హంసధ్వని, కీరవాణి), హిందుస్తానీవి కర్ణాటక సంగీతంలో పాడడమూ (దేశ్, బాగేశ్రీ) మామూలే. లోతుగా విశ్లేషించని శ్రోతలకు కర్ణాటక సంగీతం గమకభూయిష్ఠంగా, పట్టు కలిగిన సంగతులతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. హిందుస్తానీ శైలి నింపాదిగా, అంత బిగువుగా అనిపించని సంగతులతో సాగుతుంది. కలిసి వాయిస్తున్నప్పుడు ఈ తేడాలు అందాన్ని కలిగిస్తూనే కొన్ని ఇబ్బందులను కూడా తెచ్చిపెట్టగలవు. నేను గమనించినంత వరకూ వాయిద్యాల కర్ణాటక, హిందుస్తానీ జుగల్‌బందీల్లో అతి వేగంగా మోగే సితార్, సరోద్‌ల ప్రభావం కాస్త “సంసారపక్షంగా” మోగే కర్ణాటక సంగీతం మీద ఎక్కువగా పడుతుంది. ఇదంత హర్షణీయంగా అనిపించదు. గాత్రంలో బాలమురళి, జోషీగార్ల కచేరీలో అప్పుడప్పుడూ పోటాపోటీ ధోరణి కనిపించినప్పటికీ ఇద్దరూ ఉన్నత శ్రేణికి చెందిన అనుభవజ్ఞులు కనక హుందాగా సాగింది. అయితే బాలమురళి తప్ప హిందుస్తానీ గాయకులతో ‘తలపడి’ ధైర్యంగా ప్రయోగాలు చెయ్యగలిగిన కర్ణాటక గాయకులు తక్కువే. బొంబాయిలో అరుణా సాయిరాం, నీలా భాగవత్‌లు ఇటువంటి ప్రయత్నం చేశారు. ఈమధ్య రవికిరణ్ (చిత్రవీణ), విశ్వమోహన్ భట్ (మోహన్ వీణ) జుగల్‌బందీ చేశారు. హిందుస్తానీ గాత్రంలో స్వరాలు పలుకుతూ స్వరకల్పన చెయ్యడం తక్కువ. వారి ‘తాన్‌లన్నీ ‘అ’ కారం మీదనే సాగుతాయి. ఆ పద్ధతిలో వేగంగా పాడడం కర్ణాటక గాయకులకు అలవాటు ఉండకపోవచ్చు. వారిది ప్రధానంగా సరిగమలతో సాగే విన్యాసం. ఒక్క బాలమురళి మాత్రం ఎంత వేగంగానైనా, ఏ పద్ధతిలోనైనా పాడగల సమర్థుడనేది తెలిసినదే. బహుశా అందుకే ఇతర కర్ణాటక గాయకులు ఇటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చెయ్యరేమోనని నాకనిపిస్తుంది. నాకు వ్యక్తిగత పరిచయం ఉన్న చిట్టిబాబుగారితో జుగల్‌బందీ విషయం ప్రస్తావించినప్పుడల్లా ఆయన ‘అబ్బే, మనకి ఇతరులతో కుదరదయ్యా’ అని తోసిపుచ్చేవారు. ఆయనా (వీణ), మా గురువుగారైన ఇమ్రత్ ఖాన్ (సితార్) కలిసి వాయిస్తే వినాలని నాకు మహా కోరికగా ఉండేది. చాలా ఏళ్ళ క్రితం ఈమని శంకరశాస్త్రిగారు (వీణ) రేడియోలో గోపాలకృష్ణ (విచిత్రవీణ) తో కలిసి వాయించారు. ఆయన ముందు గోపాలకృష్ణ ‘నిలవలేకపోయాడని’ నాకనిపించింది గాని అది వేరే సంగతి. కర్ణాటక-హిందుస్తానీ జుగల్‌బందీలో మరొక ఇబ్బంది పాటలకు సంబంధించినది. కర్ణాటక పద్ధతిలో ప్రసిద్ధ వాగ్గేయకారుల రచనలే ఎక్కువగా ఉంటాయి. హిందుస్తానీలో వాటిని పోలినవేవీ ఉండవు. ఇందులోని కష్టసుఖాలు నేను శ్రీకాంత్ చారి (వీణ) తో 1994లో కాలిఫోర్నియాలో సితార్ జుగల్‌బందీ కచేరీ వాయించినప్పుడు బాగా తెలిసివచ్చాయి. కర్ణాటక సంగీతజ్ఞులకు ఉత్తరాది సంగీతం గురించి తెలిసినంతగా హిందుస్తానీ వారికి దక్షిణాది సంగీతం గురించి తెలియదు. కాని తమాషా ఏమిటంటే వాతాపి వంటి కీర్తనలకు నకళ్ళు హిందుస్తానీలో తయారయాయి. అలాగే మరాఠీ నాటకాల్లో పాడేవారు కర్ణాటక సంగీతంలోని వరములొసగి (కీరవాణి) వంటి కీర్తనలను అనుకరించారు. ఏవో మీరా భజనలు తప్ప హిందుస్తానీ పాటలను కర్ణాటకంవారు పాడిన సందర్భాలేవీ నాకు గుర్తురావడం లేదు. మొత్తం మీద ఈ ఉత్తర దక్షిణ సంప్రదాయాల మధ్య సంపర్కం ఏర్పడడానికి రాగాలు మాత్రమే తోడ్పడతాయని అనిపిస్తుంది. భాష, సాహిత్యాదుల వల్ల కలిగే అవరోధాలను ప్రయత్నపూర్వకంగా ‘భారతీయత’ను దృష్టిలో ఉంచుకుని అధిగమించాలి. అసలీ కలుపుగోలు పద్ధతి ఎందుకు? పులిహోరనూ, పులావునూ విడిగా తిని ఆనందించవచ్చునుగదా అనేవారూ లేకపోలేదు. ఇటువంటి కర్ణాటక-హిందుస్తానీ సమ్మేళనాల్లో కొంతవరకూ రాజీపడక తప్పదేమో. అలా కాకుండా ఒకే పద్ధతిలో ఇద్దరు గాయకులో, వాద్యకారులో కలిసి పాల్గొంటే మరింత గొప్పగా ఉంటుందనేదాంట్లో సందేహం లేదు.
సరసమైన ధరలు మరియు సులభమైన నిర్వహణ వంటి అనేక ప్రయోజనాల కారణంగా టైప్ 36 హౌస్ డిజైన్‌లు నేడు ట్రెండ్‌గా మారుతున్నాయి. ఈ ఇల్లు ప్రతి ఒక్కరికి కలల ఇల్లు అని ఆశ్చర్యపోనవసరం లేదు. రకం 36 ఇల్లు మినిమలిస్ట్ థీమ్‌ను కలిగి ఉంది, కాబట్టి ఇది కొత్తగా పెళ్లయిన జంటలు లేదా చిన్న కుటుంబాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది కొద్దిపాటి పరిమాణాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఈ ఇల్లు నివసించడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. నేటి వాస్తుశిల్పులు పరిమిత స్థలాన్ని కలిగి ఉన్న అనేక ఇంటి డిజైన్లను చాలా ఆదర్శవంతమైన మరియు సొగసైన ఇల్లుగా మార్చారు. సరే, ఈ ఆర్టికల్‌లో, మీలో ఈ రకమైన ఇంటిని నిర్మించడానికి ఆసక్తి ఉన్నవారికి సూచనగా ఉపయోగించగల టైప్ 36 హౌస్ డిజైన్ యొక్క ఉదాహరణను మేము చర్చిస్తాము. 1. పక్కపక్కనే రెండు గదులు ఉన్న ఇల్లు 1 అంతస్తు మీలో పిల్లలు ఉన్నవారికి ప్రక్కనే ఉన్న గది కాన్సెప్ట్‌తో కూడిన ఇల్లు సరైనది ఎందుకంటే మీరు ఎప్పుడైనా పక్క గదిలో శిశువు యొక్క కార్యకలాపాలను తనిఖీ చేయవచ్చు. బాగా, ముందు మరియు వెనుక రెండు తోటలు ఉన్నాయి, తద్వారా అవి పిల్లల బొమ్మల కోసం తయారు చేయబడతాయి. 2. హౌస్ టైప్ 36 రెండు గదులు 1 ఫ్లోర్ ఈ ఇల్లు రెండు పడక గదుల ఫ్లోర్ ప్లాన్ మరియు పెద్ద గార్డెన్ కాన్సెప్ట్‌ను కలిగి ఉంది. మీకు పెద్ద ఇల్లు ఇష్టం లేకున్నా పెద్ద స్థలం ఉంటే, మీరు ఈ ఫ్లోర్ ప్లాన్‌ను స్ఫూర్తిగా ఉపయోగించవచ్చు. ఇది కూడా చదవండి: ప్రతిపాదన: నిర్వచనం, లక్షణాలు మరియు దీన్ని ఎలా తయారు చేయాలి 3. సహజ కాంతిని పెంచే 1 అంతస్తు ఉన్న ఇల్లు ప్రతి ఇంటికి మంచి లైటింగ్ మరియు గాలి వెంటిలేషన్ అవసరం, కాబట్టి ఈ ఇంటి డిజైన్ గది యొక్క అమరిక మరియు చాలా కిటికీలతో కూడిన ఇంటి భావనను ఇష్టపడే వారికి అనుకూలంగా ఉంటుంది. 4. టెర్రేస్ లేకుండా ఇంటి రకం 36 టెర్రస్ లేని ఈ ఇల్లు మీలో స్థలాన్ని పెంచుకోవాలనే భావనను ఇష్టపడే వారికి ఖచ్చితంగా సరిపోతుంది. మీరు టెర్రస్ లేకుండా టైప్ 36 ఇంటిని నిర్మించాలనుకుంటే పైన ఉన్న మినిమలిస్ట్ హౌస్ డిజైన్‌ను ప్రేరణగా ఉపయోగించవచ్చు. 5. గ్యారేజ్ లేకుండా 36 ఇల్లు టైప్ చేయండి ఈ ఇంటి డిజైన్ వాహనం లేని వారికి అనుకూలంగా ఉంటుంది, ఇంటి ముందు భాగంలో మీరు వివిధ రకాల అలంకారమైన మొక్కలను నాటడానికి ఉపయోగించవచ్చు, తద్వారా ఇల్లు మరింత అందంగా మరియు అందంగా కనిపిస్తుంది. 6. ఒక పడకగది రకం 36 ఇల్లు ఈ రకమైన 36 వన్-బెడ్‌రూమ్ ఇల్లు మీలో ఒంటరిగా ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది, అయినప్పటికీ ఈ ఇంటిని నిర్మించడంలో మీకు సమస్య లేదు, ఎందుకంటే మీరు ఇప్పటికీ దాని కనీస భావనతో సుఖంగా ఉన్నారు. 7. తోటతో కూడిన ఇల్లు 36 రకం మీలో సృజనాత్మక పరిశ్రమలో పనిచేసే వారికి ఈ ఇంటి డిజైన్ ప్రేరణ సరైనది, ఎందుకంటే ప్రత్యేకమైన కాన్సెప్ట్ మీకు ఇంట్లో మరింత సుఖంగా ఉంటుంది, ముఖ్యంగా ఇంట్లో పని చేస్తున్నప్పుడు. 8. టైప్ 36 విశాలమైన గ్యారేజీతో 2-అంతస్తుల ఇల్లు మీలో కార్లను సేకరించడానికి ఇష్టపడే వారి కోసం, మీరు విశాలమైన గ్యారేజ్ భావనతో ఈ రకం 36 హౌస్ ఇన్‌స్పిరేషన్‌ని సూచనగా ఉపయోగించవచ్చు. 9. బేస్మెంట్ మోడల్తో ఇల్లు బేస్‌మెంట్ మోడల్ అనేది ఇంటి నమూనా, ఇది నేల తరచుగా రహదారి స్థాయి కంటే తక్కువగా ఉండే అంతస్తును కలిగి ఉంటుంది. భూమి యొక్క లక్షణాలు రహదారి కంటే తక్కువగా ఉంటే మీరు ఈ ఇంటి డిజైన్‌ను ఉపయోగించవచ్చు. 10. స్విమ్మింగ్ పూల్‌తో కూడిన ఆధునిక ఇల్లు మీ ఇల్లు మినిమలిస్ట్ అయినప్పటికీ, మీరు ఇప్పటికీ ఈ డిజైన్‌తో స్విమ్మింగ్ పూల్‌ని నిర్మించవచ్చు. స్విమ్మింగ్ పూల్ ఉన్న ఇంటి మోడల్ మీ ఇంటిని విలాసవంతంగా మారుస్తుందనడంలో సందేహం అవసరం లేదు. ఇవి కూడా చదవండి: పారాబెన్స్ అంటే: పదార్థాలు, ఉపయోగాలు మరియు ప్రభావాలు ఆ విధంగా మీరు ఒక సూచన చేయగల రకం 36 రెసిడెన్షియల్ హౌస్ డిజైన్ ఉదాహరణ యొక్క వివరణ. ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము!
హరికేన్ ఇయాన్ ఇది మంగళవారం తెల్లవారుజామున ప్రధాన కేటగిరీ 3 తుఫానుగా మారింది మరియు ఇది ఫ్లోరిడాకు సమీపంలో ఉన్నందున ఇది బలపడుతుందని జాతీయ హరికేన్ సెంటర్ తెలిపింది. ఇయాన్ మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ క్యూబా తీరం దాటిందని అమెరికా అధికారులు తెలిపారు. పినార్ డెల్ రియో ​​ప్రావిన్స్‌లోని లా కొలోమా నగరానికి నైరుతి దిశలో 4:30 a.m. ETకి కొండచరియలు విరిగిపడ్డాయి, గరిష్టంగా 125 mph వేగంతో గాలులు వీచాయి. నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం, ప్రస్తుతం ఆగ్నేయ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఉన్న హరికేన్ ఉత్తరాన ఫ్లోరిడా వైపు 10 mph వేగంతో కదులుతోంది మరియు బలపడుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు అప్‌డేట్ చేయండి. ఇది గల్ఫ్ మీదుగా కదులుతున్నందున, ఇయాన్ కేంద్రం మంగళవారం చివరిలో కేటగిరీ 4 హరికేన్‌గా బలపడుతుందని ఎన్‌బిసి న్యూస్ భవిష్య సూచకులు తెలిపారు. ఇయాన్ అప్పుడు ఫ్లోరిడా యొక్క పశ్చిమ తీరాన్ని చేరుకుంటుంది మరియు బుధవారం చివరి నుండి గురువారం ఉదయం వరకు 2 లేదా 3 తుఫానులుగా ల్యాండ్‌ఫాల్ చేస్తుంది. జాతీయ హరికేన్ సెంటర్. టంపా బే మరియు షార్లెట్ హార్బర్ మధ్య ఎక్కడో తుఫాను ల్యాండ్ ఫాల్ చేస్తున్నట్లు మోడల్స్ ఇప్పుడు చూపిస్తున్నాయి. భారీ వర్షం, బలమైన గాలులు మరియు తుఫాను ఉప్పెన ప్రభావాలను విస్తరిస్తూ, వ్యవస్థ మరో 3 నుండి 4 mph వేగంతో క్షీణించవచ్చని అంచనా వేయబడింది. హరికేన్ ఇయాన్‌ను ప్రత్యక్షంగా చూడటానికి NBC న్యూస్‌ని అనుసరించండి మరో మూడు రోజుల పాటు ఫ్లోరిడా ద్వీపకల్పాన్ని హరికేన్ తాకే అవకాశం ఉంది. తుఫాను ఫ్లోరిడా తూర్పు తీరాన్ని కూడా తాకవచ్చు, ఇక్కడ జార్జియా తీరం వెంబడి మెరైన్‌ల్యాండ్ నుండి సెయింట్ మేరీస్ నది వరకు హెచ్చరిక జారీ చేయబడింది. హరికేన్ సెంటర్. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు, ఇయాన్ అనేక అడుగుల తుఫానును తీసుకురాగలడు. భవిష్య సూచకుల ప్రకారం, ఇయాన్ షార్లెట్ హార్బర్‌కు 12 అడుగుల వరకు మరియు టంపా బే ప్రాంతానికి 7 అడుగుల తుఫానును తీసుకురాగలదు. “మన వద్ద ఉన్నది నిజంగా చారిత్రాత్మక తుఫాను మరియు సంభావ్య వరదలు” అని మంగళవారం ఉదయం ఒక వార్తా సమావేశంలో ఆయన అన్నారు. “ఆ తుఫాను ఉప్పెన ఘోరమైనది.” డిసాంటిస్ పినెల్లాస్ కౌంటీ నుండి ఫోర్ట్ మైయర్స్ ప్రాంతానికి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లడం ద్వారా తరలింపు ఆదేశాలను పాటించమని నివాసితులను ప్రోత్సహించారు. దాదాపు 2.5 మిలియన్ల నివాసితులు ఏదో ఒక రకమైన తరలింపు ఆర్డర్‌లో ఉన్నారని ఆయన చెప్పారు. ఒక వార్తా సమావేశంలో మాట్లాడిన ఫ్లోరిడా అత్యవసర నిర్వహణ డైరెక్టర్ కెవిన్ గుత్రీ ప్రకారం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు మూడు రోజుల నుండి వారం వరకు ఎక్కడైనా విద్యుత్తు లేకుండా ఉండవచ్చు. టంపాకు పశ్చిమాన 25 మైళ్ల దూరంలో ఉన్న ఇండియన్ బీచ్‌లోని కిటికీలు సోమవారం ఇయాన్ హరికేన్ సందేశాన్ని కలిగి ఉన్నాయి.రికార్డో అర్డుయెంగో / AFP – గెట్టి ఇమేజెస్ జార్జియా మరియు దక్షిణ కరోలినా కూడా తుఫాను నుండి కొన్ని ప్రభావాలను చూడవచ్చు. దక్షిణ కరోలినాలోని సెయింట్ మేరీస్ నది నుండి సౌత్ శాంటీ నది వరకు తుఫాను ఉప్పెన హెచ్చరిక జారీ చేయబడింది మరియు తూర్పు తీరానికి ఉష్ణమండల తుఫాను హెచ్చరిక ఉత్తరాన జార్జియాలోని అల్టామహా సౌండ్ మరియు దక్షిణాన బోకా రాటన్, ఫ్లోరిడా వరకు విస్తరించింది. హరికేన్ సెంటర్ ప్రకారం, తూర్పు తీరం వెంబడి ఉన్న ప్రాంతాలు, అల్తామహా సౌండ్‌కు ఉత్తరాన మరియు శాంటీ నదికి ఉత్తరాన కూడా ఉష్ణమండల తుఫాను వాతావరణాన్ని అందుకోవచ్చు. క్యూబాలోని పినార్ డెల్ రియో ​​నుండి లక్షలాది మంది ప్రజలు ఖాళీ చేయబడ్డారు, అధికారులు ఈ వారం తుఫానుకు ముందు అత్యవసర మరియు వైద్య కార్మికులను పంపారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. రెండు గంటల తూర్పు, హవానాలో, మత్స్యకారులు తమ పడవలను బయటకు లాగారు, నగర కార్మికులు తుఫాను కాలువలను అన్‌బ్లాక్ చేశారు మరియు నివాసితులు వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారని AP నివేదించింది. “మేము దీని నుండి బయటపడతామని నేను ఆశిస్తున్నాను” అని 54 ఏళ్ల అబెల్ రోడ్రిగ్జ్ వార్తా సంస్థతో అన్నారు. “మాకు ఇప్పటికే చాలా తక్కువ ఉంది.” అంతకుముందు సోమవారం, ఇయాన్ సమీపంలోని కేమాన్ దీవులను దాటింది మరియు పెద్దగా నష్టం జరగలేదు. అత్యవసర అధికారులు “ఆల్ క్లియర్” ప్రకటనను జారీ చేసింది స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు, ప్రీమియర్ వేన్ బాంటన్ మాట్లాడుతూ, బ్రిటీష్ భూభాగం “అత్యంత తుఫాను నుండి తప్పించుకోవడం చాలా అదృష్టమని” అన్నారు. ఇయాన్ హరికేన్ పై తాజా వార్తలు ఇయాన్ బుధవారం నాడు ఫ్లోరిడా యొక్క గల్ఫ్ కోస్ట్‌లోని వెనిస్‌ను 125 mph వేగంతో కూడిన గాలులతో కేటగిరీ 3 హరికేన్‌గా తాకుతుందని భావిస్తున్నారు. తుఫాను ఉప్పెన, గాలి మరియు ఆకస్మిక వరద ప్రభావాలను తట్టుకుని, గురు మరియు శుక్రవారం ఫ్లోరిడా యొక్క పశ్చిమ తీరంలో లేదా సమీపంలో ఇయాన్ 3 నుండి 4 mph వరకు నెమ్మదిస్తుంది. జార్జియా మరియు దక్షిణ కెరొలిన కూడా తుఫాను నుండి ప్రభావాలను చూడవచ్చు, తుఫాను ఉప్పెన గడియారాలు మరియు US తూర్పు తీరం వెంబడి ఉష్ణమండల తుఫాను హెచ్చరికలు జారీ చేయబడతాయి. దాదాపు 2.5 మిలియన్ల ఫ్లోరిడా నివాసితులు ఏదో ఒక రకమైన తరలింపు ఆర్డర్‌లో ఉన్నారు. ఫ్లోరిడాలోని ప్రాంతాలు మూడు రోజుల నుండి వారం రోజుల వరకు ఎక్కడైనా కరెంటు ఆగిపోవచ్చు. తుఫాను ఫ్లోరిడా వైపు వెళుతుండగా, చమురు కంపెనీలు గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని డీప్‌వాటర్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు విమానాశ్రయాల నుండి కార్మికులను ఖాళీ చేయించాయి. టంపా, ఓర్లాండో మరియు ఫ్లోరిడాలోని పినెల్లాస్ కౌంటీ మంగళవారం మరియు బుధవారం మూసివేతలను ప్రకటించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణ మినహాయింపులను ప్రకటించింది ఫ్లోరిడా మరియు కరేబియన్‌లోని 20 విమానాశ్రయాలలోకి లేదా బయటికి వెళ్లే వ్యక్తుల కోసం. టంపా బే బక్కనీర్స్ బృందం తాత్కాలికంగా తన కార్యకలాపాలను మియామి-డేడ్ కౌంటీకి తరలిస్తోందని తెలిపారు. ఫ్లోరిడా గల్ఫ్ కోస్ట్ నివాసితులు ఆహారాన్ని నిల్వ చేసుకున్నారు మరియు ఇసుక సంచులు మరియు ప్లైవుడ్‌తో తమ కిటికీలను సిద్ధం చేసుకున్నారు. లక్షలాది మంది ప్రజలు తరలింపు ఉత్తర్వుల్లో ఉన్నారు. బాబ్ కోప్‌ల్యాండ్ విల్బర్ విల్లామరిన్, ఎడమవైపు, మరియు అతని కుమారుడు ఫాబియన్ హరికేన్ ఇయాన్ రాక కోసం సోమవారం ఆరెంజ్ కౌంటీ పార్క్‌లో ఉచిత ఇసుక సంచులను నింపడంలో సహాయం చేస్తాడు.ఫెలాన్ ఎం. ఎబెన్‌హాక్ / AB “ఈ తుఫాను మందగిస్తుంది, అంటే ఇది 47 గంటల పాటు మనపై కూర్చుని ఉంటుంది” అని పినెల్లాస్ కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ కాథీ పెర్కిన్స్ అన్నారు. టంపా యొక్క NBC అనుబంధ WFLA నివేదించింది. “అది చాలా వర్షం మరియు అది త్వరగా పోదు,” అతను చెప్పాడు. టిమ్ స్టెల్లో NBC న్యూస్ డిజిటల్ కోసం యాంకర్ న్యూస్ రిపోర్టర్. చంటల్ డ సిల్వా లండన్‌లోని ఎన్‌బిసి న్యూస్ డిజిటల్‌కు లీడ్ న్యూస్ ఎడిటర్. మైర్నా అల్షరీఫ్ ఎన్‌బిసి న్యూస్‌కి కరస్పాండెంట్. కాథరిన్ ప్రోసివ్ కాథరిన్ ప్రోసివ్ NBC న్యూస్‌కు సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త మరియు నిర్మాత. Arzu టపా నావిగేషన్ డౌ, S&P 500 2020 నుండి కనిష్ట స్థాయి వద్ద ముగిసిన తర్వాత బౌన్స్, డౌ ఫ్యూచర్స్ 300 పాయింట్లు పెరిగాయి S&P 500 సంవత్సరానికి కొత్త కనిష్టానికి చేరిన తర్వాత స్టాక్ ఫ్యూచర్లు పడిపోతాయి; 10-సంవత్సరాల ట్రెజరీ రాబడులు క్లుప్తంగా 4% పైన ఉన్నాయి
ప‌తాకంపై డా.య‌ల‌మంచిలి ప్ర‌వీణ్ స‌మ‌ర్ప‌ణ‌లో అరుణ్ తేజ్ , చ‌రిష్మా శ్రీక‌ర్ జంట‌గా బియ‌న్ రెడ్డి అభిన‌య ద‌ర్శ‌క‌త్వంలో డా.య‌ల‌మంచిలి ప్ర‌వీణ్‌, డా.ఏయ‌స్ కీర్తి, డా.జి.పార్థ సార‌ధి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం నీతోనే హాయ్ హాయ్‌. ఈ చిత్రం ఆడియో ఇటీవల తిరుపతి లో నటుడు 30 ఇయర్స్ పృథ్వి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎస్వీబిసి ` చైర్మైన్ అయిన తర్వాత నేను హాజరైన మొదటి ఆడియో ఫంక్షన్ `నీతోనే హాయ్ హాయ్‌`. ఇందులో ఐదు పాటలు చాలా బావున్నాయి. ముగ్గురు నిర్మాతలు మంచి అభిరుచి తో చిత్రాన్ని నిర్మించారు. హీరో , హీరోయిన్స్ మంచి నటన కనబరిచారు. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడి ప్రతిభ ఏంటో తెలుస్తుంది. కంటెంట్ బావుంటే కొత్త , పాత లేకుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఈ సినిమా కూడా విజ‌య‌వంతం కావాలని కోరుకుంటూ యూనిట్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు అన్నారు. - Advertisement - ద‌ర్శ‌కుడు బియ‌న్ రెడ్డి అభిన‌య మాట్లాడుతూ…ఎస్వీబిసి ` చైర్మైన్ అయిన తర్వాత మొదటిసారిగా మా ఆడియో ఫంక్షన్ కి పృథ్వి గారు రావడం చాలా సంతోషం గా ఉంది. ఇక నిర్మాత‌లు న‌న్ను , నా క‌థ‌ని న‌మ్మి ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను నిర్మించారు. పాట‌ల షూటింగ్ కోసం వెళ్లిన‌ప్పుడు చిక్ మంగుళూరు లో కొన్ని స‌మ‌స్య‌లు ఎదురైనా వాట‌న్నింటినీ అధిగ‌మించి షూటింగ్ కంప్లీట్ చేశాం. ఇటీవల సెన్సార్ పూర్తి చేసాం. సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. సినిమాను ఈ నెల 23 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం అన్నారు. హీరో అరుణ్ తేజ్ మాట్లాడుతూ…` ఒక మంచి సినిమాలో పార్ట్ ఐందుకు హ్యాపీ. హీరోగా బ్రేక్ వస్తుందన్న నమ్మకం తో ఉన్నాను. అన్ని వ‌ర్గాల వారికి న‌చ్చే విధంగా సినిమా ఉంటుంద‌ని అన్నారు. నిర్మాత డా.పార్థ‌సార‌ధి రెడ్డి మాట్లాడుతూ…ఎన్నో వ్య‌య ప్ర‌యాల‌స‌కోర్చి సినిమా చేశాం. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా అన్నారు. డా.ఏయ‌స్ కీర్తి మాట్లాడుతూ…`ఇటీవల కాలం లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలను ఆదరిస్తున్నారు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న మా సినిమాను కూడా ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా అన్నారు. మరో నిర్మాత , స‌మ‌ర్ప‌కులు డా. య‌ల‌మంచిలి ప్రవీణ్ మాట్లాడుతూ…ఎంతో పాష‌న్ తో ఈ సినిమా చేశాం. అంతే పాష‌న్ తో ఉన్న ద‌ర్శ‌కుడు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా చేశారు. గ్రాండ్ గా సినిమాను ఈ నెల 23 న రిలీజ్ చేస్తున్నాం అన్నారు ఆనంద్, బెన‌ర్జి, నారాయ‌ణ‌రావు, ఏడిద శ్రీరామ్, జ‌య‌చంద్ర‌, జ‌బ‌ర్ద‌స్త్ రాంప్ర‌సాద్, శ్రీ ప్రియ‌, శిరీష‌, కృష్ణ ప్రియ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి కెమెరాః ఈద‌ర ప్ర‌సాద్, సంగీతంః ర‌వి క‌ళ్యాణ్‌; కొరియోగ్ర‌ఫీః సాయి రాజ్‌; ఫైట్స్ః ర‌వి; కో-డైర‌క్ట‌ర్ః పి.న‌వీన్‌; పీఆర్వోః బాక్సాఫీస్ మీడియా (చందు ర‌మేష్‌); ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ః మ‌ట్టా కృష్ణారెడ్డి; నిర్మాత‌లుః డా.య‌ల‌మంచిలి ప్ర‌వీణ్‌; డా.ఏయ‌స్ కీర్తి; డా. జి. పార్థ‌సార‌ధి రెడ్డి; స్టోరీ -డైలాగ్స్- స్క్రీన్ ప్లే-డైర‌క్ష‌న్ః బియ‌న్ రెడ్డి అభిన‌య.
మంచి మనుష్యులు, మర్యాదస్తులు, నీతి, నిజాయితీ, నిబద్ధత కలవారు, నిజమైన సత్తావున్నవారు, అనుభవశాలురు, అధ్యయన శీలం, ఆలోచనాశక్తి, ఆచరణ శుద్ధి వున్నవారు ఎన్నికల్లో నిబడ్డం కష్టమే. నిలబడితే నెగ్గడం కష్టమే. నెగ్గితే పరిపాలించడం కష్టమే. ఇదీ ఇప్పుడు రాజకీయ రంగంలో, పరిపాలనా రంగంలో పరిపాటిగా మనం అనుభవిస్తున్న స్థితి, దుస్థితి.. ఇలాంటి స్థితిగతుల్లో అనేకాలోచనలతో, అర్ధవంతమైన అనుభవంతో, సారవంతమైన అనుభూతులతో పండిన తల అతనిది. ఆటుపోట్లనెన్నింటినో తట్టుకొని నిలబడి నడిచిన రాజకీయ నావ అతనిది. ఎందరేమన్నా, ఎన్ని విధాల అతన్ని విమర్శించినా, సహనంతో, సంయమనంతో, అందర్నీ కలుపుకొని, ‘విజన్‌ – విజ్‌డమ్‌’ ద్వారా అందర్నీ మెప్పించి, ఒప్పించి పాలించిన పాలన అతనిది. ఒక దక్షిణ భారతీయునిగా అందులో మరీ వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణలోని మారుమూల గ్రామమైన వంగర నుండి హైద్రాబాద్‌ మీదుగా ఢల్లీలో అతడు ప్రధాన మంత్రి గావడమే ఒక విచిత్రం. ప్రధాన మంత్రి అయి, మెజారిటీ లేని పార్టీలో మనుగడ సాగించి, ఏ పార్టీతో పొత్తు లేకుండా, అయిదేళ్ల పాటు పూర్తి కాలం ప్రధాన మంత్రిగా ప్రభుత్వాన్ని నడపడం – అదొక విచిత్రం. దేశం అత్యంత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రోజుల్లో మన్మోహన సింగ్‌ని రాజకీయాల్లోకి ఆహ్వానించి ఆయన చేతుల్లో ఆర్థికశాఖను పెట్టి తాను కృష్ణుడై మన్మోహనుడర్జునుడుగా – ఆర్థిక సంస్కరణ రథాన్ని సృజనాత్మకంగా, సమయస్ఫూర్తితో సమంజసంగా నవ్యపథంలో నడిపించడం మరో విచిత్రం. అరాచకానికి, హింసాకాండకు ఆలవాలమై ఎన్నేళ్ళుగానో కొట్టుమిట్టాడుతున్న పంజాబును ప్రశాంతత వైపు మరలించడం ఇంకో విచిత్రం. కాశ్మీర్‌ క్రైసిస్‌ని మరీ ఉధృతం కాకుండా అరికట్టడం అతి విచిత్రం. ఏ ఆర్భాటం లేకుండా, ఏ మాత్రం హంగామా కనబర్చకుండా అమెరికా వారి ఆతి సూక్ష్మ దృష్టికి కూడ దొరకకుండ అణ్వస్త్ర పరీక్షకు అంకురార్పణ చేయడం బహువిచిత్రం. ఎన్నెన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న మౌన యుద్ధమతనిది. అతని మౌనమే ఎన్నోసార్లు అక్కరకొచ్చిందతనికి. అతని ఓపికే, అతని తాత్సారమే, అతని నిర్ణయం తీసుకోలేని అనిర్ణయతత్వమే ఎన్నో చోట్ల గెలిపించిందతన్ని. ఆయన నవ్వు, నడక, మాట, చూపు, హావభావాలు, ఉపన్యాస విన్యాసాలు, వ్యక్తిత్వ వైవిధ్యాలు తెలిసిన వాళ్ళందరు, ఆయన నైజాన్ని ఎరిగిన వారందరు, ‘అనువు కాని చోట అధికుమనరాద’న్న భావ స్వభావాన్ని గుర్తించే వారందరు విశేషానుభవంతో వ్యవహరించే ఒక మేధావిగా, ఒక వివేకిగా, ఒక వికాస పురుషుడిగా, ఒక పరిణతికి ప్రతీకగా సంభావించే అపర చాణుక్యుడతను. భౌతికంగా వామనుడైతే కావచ్చు కానీ, బౌద్ధికంగా విరాట్‌ స్వరూపుడు. తన నుంచి తాను విడిపోయి దూరంగా నిలిచి తనను తాను విమర్శనాత్మకంగా పరిశీలించానుకొని తన ‘లోపలి మనిషి’తో సంఘర్షించడం ఆయనకొక నిత్యకృత్యం. గుండెలో అగ్నిపర్వతం బద్దలవుతున్నా నిర్విచారంగా, నిర్వికారంగా, నిబ్బరంగా ఓటమిని గొపుగా మలచుకోగలిగే అజేయుడతను, కలసిరాని కాలాన్ని కూడా తన వైపు త్రిప్పుకొన్న మహామహుడతను. ఇంట జయపతాక నెగురవేస్తూ, బయట భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసేందుకు అతి మెలుకువగా పావు కదిపిన చతురుడతను. సిద్ధాంతాలకు విధేయుడతడు. వ్యక్తులకు కాదు. క్షుద్ర రాజకీయాలకు, అనిబద్ధ విధానవర్తనులకు అందని వాడతడు. అంతుచిక్కనివాడు. అంతర్ముఖుడు. ప్రజాస్వామ్యమంటే ఎనలేని గౌరవమతనికి. ఎన్నికలు లేకుండా ఏండ్ల తరబడి ఒకే వ్యక్తి చేతిలో పార్టీ ఉండటం కన్న, తప్పుల తడకయైనా సరే, ఎన్నికలు నిర్వహించడం మంచిదన్న అభిప్రాయంతో ఏకనాయకాశ్రితంగా వున్న కాంగ్రెస్‌ పార్టీలో దీర్ఘకాలంగా ఎన్నికలు లేక కునారిల్లుతున్న దశలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించిన సమర్థుడతడు, మత్తగజ సదృశ ధీరత ఆయన స్వంతం. సహనం ఆయనకు పెట్టని కిరీటం. సహజంగా స్వతహాగా సంస్కరణాభిలాషి. ఆయన ప్రతిపాదించిన ప్రతి సంస్కరణ వెనుక సామాన్య ప్రజా హితమే ప్రాతిపదిక. ఆయన వెలిగించిన దీపమే దేశ సౌభాగ్యం. ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హయాంలో జైళ్ళ శాఖా మాత్యులుగా శిక్షార్హుల మానసిక పరివర్తనకు అది దారి తీస్తుందని ‘ఓపెన్‌ జెయిల్‌ సిస్టము’ను కొత్తగా ప్రవేశపెట్టి, అనంతపురంలో మొట్ట మొదటి ‘ఓపెన్‌ జెయిల్‌’ను ఏర్పాటు చేశాడతను. అప్పటి ఆరోగ్య శాఖామాత్యులుగా ప్రభుత్వ వైద్యు ‘ప్రైవేట్‌ ప్రాక్టీస్‌’ను నిషేధించాడతడు. అప్పటి విద్యామంత్రిగా రెసిడెన్షియల్‌ విద్యా విధానాన్ని, నవోదయ పాఠశాలలనేర్పాటు చేసినవాడతడు. తెలుగును అధికార భాషగా తీర్చిదిద్దిన వాడతడు. తెలుగు భాషాభివృద్ధికై తెలుగు అకాడమీని ఏర్పాటు చేశాడతడు. దేవాదాయ, ధర్మాదాయ శాఖామాత్యులుగా శ్రేయోనిధిని ఏర్పరచి, పండితును, వేద పండితులను ప్రోత్సహించిన వాడతడు. సమగ్రమైన దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని ప్రవేశపెట్టి ప్రశంసలందుకొన్నవాడతడు. ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా దేశంలో తొలిసారిగా భూ సంస్కరణలు చేపట్టి సుమారు ఇరవై తొమ్మిది లక్ష ఎకరాలను పేదలకు పంపిణీ చేసిన సంస్కార శీలి అతను. భారత స్వాతంత్య్రానంతరం వచ్చిన రాజకీయ నాయకుల్లో అధికారమనుభవించిన ముఖ్యమంత్రుల్లో ఇలాంటి నిస్వార్ధ బుద్ధి, త్యాగనిరతి కల్గినవాడు అతడు తప్ప మరొకరు లేరు. పంచాయతీ రాజ్‌కు అధికార బదలాయింపు అతడు తలపెట్టిన సంస్కరణల్లో భాగమే. మానవ వనరుల శాఖామాత్యులుగా దేశంలో నూతన జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి, సాంకేతిక, శాస్త్రీయ విద్యవైపు యువత దృష్టిని మళ్ళించాడతను. విదేశాంగ విధానం, విదేశీ మారక నిల్వలు, లైసెన్స్‌ విధానం, వ్యవసాయోత్పత్తుల ధర పెంపు, ప్రైవేటు విద్యుదుత్పాదన, ప్రైవేటు సంస్థ, వ్యక్తుల ప్రమేయం, ఉపాధి కల్పనలో ప్రభుత్వేతర సంస్థ భాగస్వామ్యం, భారత దేశ విఫణిలో పాశ్చాత్య కంపెనీ పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, మెరుగైన జీవన శైలి, ఆర్థిక స్వావలంబన విధానం… సంపన్న భారతం వైపు దూసుకుపోతూన్న విధానాలన్నీ ఆయన తలపెట్టిన ఆర్థిక సంస్కరణ వృక్షం అందించే ఫలాలన్నది నిర్వివాదాంశం. ఈనాటి సుప్రతిష్ఠిత భారతానికి పునాది ఆతను తలపెట్టిన సంస్కరణలే. రాజకీయాల్లో తనకు తగిన పాత్ర లేదని భావించిన వేళ తన శక్తిని సాహితీ సేద్యానికి వినియోగించిన కృషీవలుడిగా వేయిపడగలు వంటి బృహత్తర నవలను ‘సహస్ర ఫణ్‌’గా హిందీలోకి అనువదించడం అతనికే సాధ్యం. పండిట్‌ జవహర్లాల్‌ నెహ్రూ తర్వాత భారత దేశాన్ని పరిపాలించిన పండిత ప్రధాని అతను మాత్రమే. సామాన్యుల్లో సామాన్యుడు, ఆసామాన్యుల్లో ఆసామాన్యుడు. ‘అణోరణియాన్‌ మహితో మహియాన్‌.’ భారత దేశ ప్రణాళికాబద్ధ పురోగమన వాదులైన తొలితరం రాజకీయ నాయకుల్లో చివరివాడతను. వృత్తిరీత్యా అతడు రాజకీయ నాయకుడే అయినా ప్రవృత్తి రీత్యా ఉదాత్త రాజనీతిజ్ఞుడు. ఆయనెవరో కాదు…. ఒక దీర్ఘదర్శి, ఒక సూక్ష్మగ్రాహి. ఒక తాత్త్విక శక్తి. ఒక దీపస్తంభం. భారతీయ సంస్కృతికి మానవాకృతి. తెలుగు నాట పుట్టి, దేశ సౌభాగ్యానికి వెలుగై నిల్చి, శాశ్వత యశస్కుడైన ఈ నాయక శిఖామణి…. భారత జాతి యావత్తు గర్వించ దగ్గ మహోన్నత మూర్తి … తొలి తెలుగు దేశ ప్రధాని… పీవీగా పిలవబడే మన పాములపర్తి వెంకట నరసింహారావు !! ఈ సంవత్సరం పీవీ శతజయంత్యుత్సవ వత్సరం. ‘పీవీ మన తెలంగాణ ఠీవి’ అని నినదించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీవీ నరసింహారావు శతజయంత్యుత్సవాలను నిర్వహించడం ప్రపంచంలోని తెలుగు జాతి యావత్తు హర్షించే అంశం. ప్రశంసించే విషయం. రాజర్షిగా, కర్మయోగిగా పీవీ ప్రాతః స్మరణీయుడు.
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేత, కూచ్ బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ రబీంద్ర నాథ్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక షాపుల్లో బిర్యానీ వంటకంలో వేస్తున్న మసాలాలు పురుషుల లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. రెండు బిర్యానీ షాపులను బంద్ చేశారు. Mahesh K First Published Oct 24, 2022, 1:59 PM IST న్యూడిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ నేత రబీంద్ర నాథ్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ కూచ్ బెహార్‌లోని బిర్యానీ షాపుల్లో బిర్యానీ వంటకాల్లో వేస్తున్న మసాలా పురుషుల లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. పురుషుల సెక్స్‌డ్రైవ్‌నే కాదు.. మగతనాన్ని కూడా తగ్గిస్తున్నదని ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో గతంలో మంత్రిగా చేసిన రబీంద్ర నాథ్ గోష్ ఈ ఆరోపణలను చాలా మంది చేస్తున్నారని వివరించారు. బిర్యానీలో వేస్తున్న మసాలాలు పురుషుల సెక్స్ డ్రైవ్ తగ్గిస్తున్నాయని చాలా మంది ఆరోపణలు చేసినట్టు తెలిపారు. ‘గత కొన్ని రోజుల స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సెక్సువల్ డ్రైవ్‌ను దెబ్బ తీస్తున్న మసాలాలు ఏవో ఆ బిర్యానీల్లో వేస్తున్నారని వారంతా చెబుతున్నారు’ అని వివరించారు. Also Read: చికెన్ బిర్యానీ ఆలస్యం అయిందని రెస్టారెంట్ తగలబెట్టాడు.. న్యూయార్క్ లో ఘటన.. ఈ ఏరియాలో బిహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వారు బిర్యానీ షాపులను నడుపుతున్నారని ప్రస్తుత కూచ్ బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ తెలిపారు. వీరు లైసెన్సులు లేకుండానే షాపులు నిర్వహిస్తున్నారని వివరించారు. అన్ని రకాల ఫిర్యాదులు స్వీకరించిన తర్వాతే తాము ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. ఈ షాపులకు ట్రేడ్ లైసెన్స్ లేదని తెలిపారు. కాబట్టే ఈ షాపులను మూసేస్తున్నట్టు పేర్కొన్నారు.
1938వ సంవత్సరంలోనే అబ్ద్-రు-షిన్ తన ఉపన్యాసాలను వర్గీకరించుటకు మొదలుపెట్టాడు. 1939 నుండి 1941 సంవత్సరాలలో అతడు తన సంపూర్ణ రచనను, ఇర్మింగార్డ్ బెర్న్-హార్డ్ 15 మే 1956న ఇచ్చిన వివరణలో వర్ణించిన విధంగా క్రమబద్ధీకరించాడు. శ్వాత్స్ జిల్లా కోర్టు ఎదుట ఇవ్వబడిన వివరణ యొక్క నకలు: „గ్రాలుసందేశము, దాని రచయిత, ఓస్కార్ ఎర్న్-స్ట్ బెర్న్-హార్డ్ ద్వారా స్వయంగా 1939 నుండి 1941 సంవత్సరాలలో సవరించబడింది. 1938వ సంవత్సరం సెప్టెంబరు నెలలో మేము – ఓస్కార్ ఎర్న్-స్ట్ బెర్న్-హార్డ్, అతని భార్య మరియ బెర్న్-హర్డ్, నా సహోదరుడు అలెక్సాండరు మరియు నేను – గెస్టపో ద్వారా గోర్లిట్స్ సమీపంలో ఉన్న శ్లౌరోత్ కు బలవంతంగా పంపబడ్డాము. 1939 మార్చి నెలలో గెస్టపో అనుమతితో మేము ఎర్జ్ పర్వతశ్రేణిలో ఉన్నట్టి కిప్స్-డోర్ఫ్ అనే ఆరోగ్య కేంద్రానికి తరలిపోయాము. అదే సంవత్సరంలో ఓస్కార్ ఎర్న్-స్ట్ బెర్న్-హార్డ్ గ్రాలుసందేశమును సవరించుటకు మొదలుపెట్టాడు. 1941 మే నెలాఖరికి సవరణ యొక్క లిఖిత ప్రతి ముద్రణకు సిద్ధమైయుండింది. సవరణలు పలు విధమైన మార్పులతో కూడియుండినవి. కొంతమట్టుకు విరామ చిహ్నాలను సరిచేయుట, పదముల స్థానమార్పిడి, అంతకు పూర్వపు వాక్యములు మరియు పరిచ్చేదములలో వ్యక్తీకరించబడిన ఆలోచనలను పునరావృతంచేసే పూర్తి వాక్యముల లేక పరిచ్చేదముల తొలగింపు లేక కుదింపు మొదలగునవి. అయితే, వ్యక్తీకరించబడిన ఆలోచనలను మనుష్యులు గ్రహించలేరనే అభిప్రాయాన్ని కలిగియున్న చోట్లలో అతడు పదాలను, వాక్యాలను మరియు పూర్తి పేజీలను కూడా తొలగించాడు. ఈ అభిప్రాయాన్ని అతడు కలిగియుండుటకు అతడు వెళ్ళిపోవుటకు ముందు ఆఖరి సంవత్సరాలలో అతని అనుభవాలు దీనికి కారణమైయుండినవి. ఓస్కార్ ఎర్న్-స్ట్ బెర్న్-హార్డ్ ఈ దిద్దుబాట్లను ఏ విధంగా చేసాడంటే, అతడు దానికై ప్రత్యేకించబడిన ఒక గ్రాలుసందేశ ప్రతిని తీసుకొని, దానిలో పెన్సిలుతో తన సూచనలను వ్రాసాడు, కొట్టివేతలు చేసాడు మరియు ఎక్కడ అతడు మార్పులను లేక పూరింపులను ఆశించాడొ అక్కడ వివరణలను వ్రాసాడు. ఈ మార్పులను మరియు పూరింపులను ఒక ప్రత్యేకమైన పేపరు మీద వ్రాసాడు. ఆ తరువాత నేను, పెన్సిలుతో వ్రాయబడిన వివరణలు అస్పష్టమైపోయి చదువరాకుండా కాగలవనే ప్రమాదమున్నందువల్ల, పేపరు చీటీలను టైపుచేసి, గ్రాలుసందేశం యొక్క ఆ సవరణల-ప్రతిలోని పెన్సిలు వ్రాతలను తుడిపివేసి, టైపుచేసిన చీటీలను దానిలో అతికించుట ద్వారా పూరించాను. గ్రాలుసందేశంలో ఏ పేజీలలోనైతే పెద్ద పరిచ్చేదములు కొట్టివేయబడ్డాయో అక్కడ కొట్టివేతలు ఉన్నంతవరకు వాటిని పేపరు అతికించుట ద్వారా కప్పివేసాను, లేక ఆ పేజీని మార్పుచేయబడిన రూపంలో పూర్తిగా కొత్తగా టైపుచేసి ఆ కొత్త పేజీని దానిలో అతికించాను. ఉపన్యాసాల వరుసక్రమం కూడా మారినందున, ఒక ఉపన్యాసం దాని వరుసలోనుండి తీయబడి వేరొకచోట చేర్చబడవలసివచ్చింది. సవరణలనన్నింటిని నేను గ్రాలుసందేశ రచయిత చేసిన సూచనల ప్రకారమే ఖచ్చితంగా చేసాను. ప్రతి సవరణను అతడు పరీక్షించాడు. ఓస్కార్ ఎర్న్-స్ట్ బెర్న్-హార్డ్ చేతివ్రాతతో చేసిన సవరణలను కలిగియిన్న లిఖిత ప్రతి పేజీలు కేవలం కొన్ని మాత్రమే అందుబాటులో ఉండుటకు ఈ సవరణ విధానమే కారణం.“ ఫొంపర్‌బెర్గ్, 15 మే 1956 ఇర్మింగార్డ్ బెర్న్-హార్డ్ గ్రాలుసందేశము యొక్క “ఆఖరి అధికృత ప్రచురణ” సంపుటం I లో అబ్ద్-రు-షిన్ ముఖ్యంగా, 1937వ సంవత్సరంలో “దీ స్టిమ్మె” పత్రికలో ప్రచురించబడిన ఉపన్యాసాలను, 1931వ ప్రచురణలోని వాటి వరుసక్రమం ప్రకారమే చేర్చాడు కాని అవి ఆ పత్రికలో వెలువడిన క్రమంలో కాదు. ఇది “ఉపాసనము”, “జడత్వము”, “పిల్లలవంటి నైజము”, “శీలము”, “మొదటి అడుగు”, “రక్షణ! విమోచన!” మరియు “ప్రభువు యొక్క భాష” అనే ఉపన్యాసాలకు వర్తిస్తుంది. సంచిక 1 లోని “రక్తం యొక్క మర్మము” అనే ఉపన్యాసం సంపుటం IIIలో “భౌతికశరీరము” మరియు “స్వభావము” అనే ఉపన్యాసాల మధ్యలో చేర్చబడింది. “గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనులు” సంపుటం I లోనుండి మరియు ఏకమాత్ర ఉపన్యాసాల సేకరణలోనుండి కూడా ఉపన్యాసాలు ఈ మొదటి సంపుటంలో చేర్చబడ్డాయి. దీనికొరకు కొన్ని శీర్షికలు మార్చబడ్డాయి. ఉదాహరణకు “ఒక చివరి మాట” అనేది “ఒక ఆవశ్యకమైన మాట”గా వెలువడింది, “అంత్యతీర్పు” అనేది “లోకము” అనే శీర్షికను పొందింది మరియు “నాయకుని కొరకు కేక” అనేది “సహాయకుని కొరకు కేక” అని మారింది. (ఎందుకంటే “నాయకుడు” అనే పదం జాతీయ సామ్యవాదుల వాడుక ద్వారా చెడ్డపేరు పొందియుండింది.) గ్రాలుసందేశము యొక్క “ఆఖరి అధికృత ప్రచురణ” సంపుటం II ప్రధానంగా 1931వ సంవత్సరపు ప్రచురణలోని ఉపన్యాసాలను, ఇర్మింగార్డ్ బెర్న్-హార్డ్ వర్ణించినట్లు సవరించబడిన రూపంలో కలిగియున్నది. “దైవకుమారుడు మరియు మనుష్యకుమారుడు” మరియు “పిలువబడినవారు” అనే ఉపన్యాసాలు అబ్ద్-రు-షిన్ ద్వారా ప్రచురణకొరకు పరిగణించబడలేదు. అదే విధంగా “మరియు అది నెరవేరింది” అనే ఉపన్యాసము మరియు “చివరిమాట” కూడా వదిలివేయబడ్డాయి. అనుబంధంలోని “జీవము” అనే ఉపన్యాసంతో సంపుటం II ముగుస్తుంది. సంపుటం III, “గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనులు” సంపుటం I లోని ఉపన్యాసాలను మరియు ఏకమాత్ర ఉపన్యాసాల సేకరణలోనుండి అబ్ద్-రు-షిన్ ప్రచురించుటకు నిశ్చయించిన వాటిని, కలిగియున్నది. “దీ స్టిమ్మె” పత్రిక, సంచిక 1 లోని “రక్తం యొక్క మర్మము” అనే ఉపన్యాసం కూడా దీనిలో చేర్చబడింది. “ఎవడు నా వాక్యమును … ఎరుగగోరడో …” అనే ఉపన్యాసం “నామము” అనే శీర్షికతో వెలువడింది. “గ్రాలుసందేశము ఏ విధంగా గ్రహించబడవలసియున్నది” అనే చివరిమాటతో సంపుటం III ముగుస్తుంది. “గ్రాలుసందేశం యొక్క ప్రతిధ్వనులు” సంపుటం I నుండి ఐదు ఉపన్యాసాలు మరియు ఏకమాత్ర ఉపన్యాసాల సేకరణలోనుండి నాలుగు ఉపన్యాసాలు గ్రాలుసందేశం సంపుటాలు I, II, III లలో చేర్చబడలేదు. అవేవనగా, “ఆవశ్యకమైన పరిహారము”, “యేసు మరియు ఇమ్మానుయేలు”, “శుద్ధరాత్రి” (ఇది మరియు “ఆఖరి అదికృత ప్రచురణ” సంపుటం లోని “శుద్ధరాత్రి” ఒకటికావు), “శుద్ధరాత్రి ధ్వనులు హెచ్చరిస్తూ విశ్వం ద్వారా ప్రకంపిస్తున్నవి”, “నేను మిమ్మును పంపుతున్నాను!”, “ద్వారము తెరువబడుతుంది! “, “గాయము”, “నూతనసంవత్సరము 1935” మరియు “త్యాగము”.
ఇది కనిపిస్తుంది, ఎందుకు నేను టాయిలెట్ లో ఒక గది అవసరం? టాయిలెట్లో ఈ విషయం యొక్క అవసరాన్ని చూడని వారు చాలా తప్పుగా ఉన్నారు. గృహ రసాయనాలు, టాయిలెట్ పేపర్ స్టాక్లు, ఎయిర్ ఫ్రెషనర్లు, పునర్వినియోగపరచలేని తువ్వాళ్లు, వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులు మొదలైన వాటికి అవసరమైన అత్యవసర వస్తువులను నిల్వ చేసే సమస్య - చిన్న అపార్టుమెంటుల యజమానులచే దాని అవసరాన్ని మెచ్చుకోవాలి. అందువలన, జాగ్రత్తగా మరియు ఔత్సాహిక హోస్టెస్ టాయిలెట్, కూడా చిన్న, ఇరుకైన అలమారాలు మరియు లాకర్స్ లో నిర్మించడానికి. అదనంగా, ఇటువంటి మంత్రివర్గాల ప్రదర్శన మరియు మరొక ముఖ్యమైన పని - చాలా విజయవంతంగా ప్లంబింగ్ కమ్యూనికేషన్స్ కొద్దిగా -స్తస్తటి రకమైన దాచడానికి సహాయం. టాయిలెట్ లో అల్మారాలు యొక్క రకాల నిజంగా అంతర్గత అందం మీద పజిల్ లేదు వారికి తగిన ఇది బడ్జెట్ ఎంపిక, తో ప్రారంభిద్దాం. ఈ సందర్భంలో, సమీప హార్డ్వేర్ స్టోర్ వద్ద కొనుగోలు చేయవచ్చు టాయిలెట్, లో సాధారణ ఉరి గదిలో, అనుకూలంగా ఉంటుంది. మరియు, ఎక్కువగా, మీరు ఉత్తమ నాణ్యత కాదు, టాయిలెట్ లో ఒక ప్లాస్టిక్ గదిలో అందిస్తారు. చాలా తరచుగా, అలాంటి లాకర్స్ ఆర్డర్ చేయడానికి, అన్ని వ్యక్తిగత శుభాకాంక్షలు మరియు కొలతలు పరిగణనలోకి తీసుకుంటాయి, లేదా వారి చేతులతో. మరియు ఈ ప్రయోజనాల కోసం చాలా సరిఅయిన ఇది మొదటి ఎంపిక, టాయిలెట్ లో ఒక అంతర్నిర్మిత గది అని పిలుస్తారు. ఇటువంటి కేబినెట్ కోసం టాయిలెట్లో అత్యంత అనుకూలమైన స్థలం టాయిలెట్ పైన ఉంటుంది, మరియు దాని అమలు కోసం అనేక ఎంపికలు ఉన్నాయి. బాగా అనుభవం కలిగిన నిపుణుడిని కూడా తయారుచేసే అతి సులభమైన ఎంపిక, టాయిలెట్లో ఒక బహిరంగ క్లోసెట్ షెల్ఫ్. మరింత అందమైన, అది కనిపిస్తుంది, ఎటువంటి సందేహం, టాయిలెట్ లో ఒక దాచిన గదిలో. సంపూర్ణ ఆమోదయోగ్యమైన ఎంపికగా, టాయిలెట్లో టాయిలెట్ను కలిపి ప్రత్యేకంగా టాయిలెట్లో అద్దం క్యాబినెట్ని కూడా పరిగణించవచ్చు. అలాంటి కేసులకు దారి తీయడం అసాధ్యం కాబట్టి, ఆజ్ఞాపించిన చిన్న గదిలో టాయిలెట్కు సరిపోతుంది. మరియు ఇటువంటి ఆవరణలో తేమ పెరిగిన స్థాయిని కలిగి ఉన్న కారణంగా, గ్లాస్ (ప్రత్యామ్నాయంగా అద్దాలు) తయారు చేయబడిన టాయిలెట్ ఆకులలో టాయిలెట్లో ఒక గాజు కేబినెట్ను ఎంచుకోవడం చాలా సరైనది. సమాచార ప్రసారం మూలలో గుండా వెళుతున్న సందర్భంలో, టాయిలెట్లో ఒక మూలలో క్యాబినెట్ని అమర్చడం ద్వారా వారు చాలా సమర్థవంతంగా దాచవచ్చు. పైకప్పు నుండి నేల వరకు సంస్థాపించబడినట్లయితే ఇది కూడా తుడుపుకర్ర లేదా చీపురు రూపంలో తొలగించబడుతుంది. ఏమి టాయిలెట్ లో ఒక గదిలో చేయడానికి? తమ సొంత టాయిలెట్ కోసం ఒక లాకర్ చేయడానికి నిర్ణయించుకుంటారు వారికి, ఖచ్చితంగా, ఇది తయారు చేయడానికి ఉత్తమ ఏమి పదార్థాలు ప్రశ్న ఆసక్తి ఉంటుంది. చాలా ఎంపికలు ఉన్నాయి. ప్రత్యేక దుకాణాలలో, మీరు ఏ ఫర్నిచర్ ఉపకరణాలు తీయవచ్చు, తలుపు అతుకులు ప్రారంభించి, అన్ని రకాల హ్యాండిల్స్ మరియు అలంకరణ అంశాలతో ముగుస్తుంది. మీ దృష్టిని కలప లేదా MDF తయారుచేసిన రెడీమేడ్ తలుపుల విస్తృత ఎంపికను కూడా అందిస్తారు. టాయిలెట్ ఇప్పటికీ కొంతవరకు తడిగా ఉన్నట్లయితే, మీరు గడియారాల నుండి గాజు (మాట్టే, రంగు లేదా పారదర్శకంగా - రుచికి ఏవైనా) లేదా ప్లాస్టిక్ ద్వారా కదులుతున్న మెటల్ గైడ్లు తయారు చేసిన లాకర్ యొక్క సంస్కరణను పరిగణించవచ్చు. పైన పేర్కొన్న విధంగా క్లోసెట్ క్లోసెట్ టాయిలెట్లో అమరిక కోసం, దాని ముందు భాగం ప్యానెల్లు తయారు చేయవచ్చు, వీటిలో ఉపరితలం సిరామిక్ టైల్స్ యొక్క పొరను అనుకరిస్తుంది - ఇటువంటి ప్రాంగణంలోని గోడలను పూర్తి చేయడానికి సంప్రదాయ పదార్థం. మీరు మరమ్మత్తు చేసిన తర్వాత మీతో పాటు ఉండే ప్లాస్టార్వాల్ యొక్క అవశేషాలు కూడా టాయిలెట్లో ఒక లాకర్ను తయారు చేయగలవు (ప్లాస్టార్ బోర్డ్ ఆకుపచ్చ - తేమ నిరోధకత). లేదా మీరు అదే జిప్సం కార్డ్బోర్డ్ ముక్కలు కొనుగోలు చేయవచ్చు (మరియు దాదాపు ఒక తక్కువ ధర వద్ద), ఇది భవనం సూపర్మార్కెట్లలో షీట్లను కటింగ్ తరువాత ఉంటాయి. మీ ఇంటిని ఏర్పాటు చేయడానికి ప్రామాణికం కాని పరిష్కారాలను దరఖాస్తు చేయడానికి బయపడకండి.
ఒక కాలువ ఒడ్డున ఒక చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఎన్నో చీమలు నివాసం ఉండేవి. దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు ప్రతిరోజూ ఒక పాపురం వచ్చేది. చీమలు ఆ పావురంతో స్నేహం చేయడం మొదలు పెట్లాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ సంవత్సరం వర్షాలు బాగా కరి శాయి. చెరువులు, నదులు పొంగి పొర్ట సాగాయి. చీవలి పుట్ట దగ్గరలో ఉన్న కాలువ నిండా నీళ్ళ వచ్చాయి. వర్జాలు ఇంకా తగ్గలేదు. రోజురోజుకీ కాలువ నీటి మట్టం పెరిగిపోసాగింది. ఇలాగే సాగితే తమ పుట్ట నీళ్ళల్లో మునిగిపోయి, తామంతా చచ్చి పోతామని భయపడసాగాయి చీమలు. ఆరోజు మామూలుగా అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండటం చూసి… “ఏమైంది మిత్రులారా? రోజులా ఆడుతూ పాడుతూ నంతోషంగా లేరు. ఏం జరిగింది? ఎందుకలా విచారంగా ఉన్నారు?” అని అడిగింది. “ఏం చెప్పమంటావు నేస్తం, మేము ఈ (ప్రపంచంలో అన్నిటికన్నా అల్పులమైన (పాణులం. గాలి వీబినా, ఎండ కాసీనా, వాన కురిసినా మాక అన్నీ కష్టాలే. ఈ కాలువ నిండి నీళ్ళ బైటకి పారితే వాకు ప్రమాదం. మా నివాసం ఆ నీళ్ళలో కరిగిపోయి మేమంతా చచ్చి పోతాం. ఆ ఉపద్రవం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది” అని తమ గోడును వెళ్ళబోసుకున్నాయి. “మరి ఇక్కడి నుంబి దూరంగా వెళ్ళిపోతీ మంచిది కదా!” అంది పావ్సరం. “ఎక్కడకని వెళ్తాం, ఎలా వెళ్తాం? పూ బంధువులు ఆ కాలువ అవతల ఉన్నారు. కాని అక్కడికి చేరువకోవడం మా తరమా?” అంటూ దిగులుపడ్డాయి. ఆ మరునాడు పావురం అక్కడికి వచ్చేసరికి చీమలు భయ పడుతున్నట్టే నీళ్ళలో పుట్ట మునిగిపోయి ఉంది. చీమలు ఆ పక్కనే ఉన్న ఆకులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నాయి. నెంటనే పావురానికి ఒక ఉపాయం తట్టింది. “బెంతించకండి. నేను మిమ్మల్ని అవతలి ఒడ్డుకు చేరుస్తాను. మీరంతా త్వరగా వన్చి నా వీపు మీద ఎక్కండి” అంటూ పావురం పుట్టకు దగ్గరలో నేల మీద కూర్చుంది. చీమలు పావురం మీదకు ఎక్కి కూర్చున్నాయి. పావురం నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఎగురుతూ కాలువకు అవతలి వైపుకు వెళ్ళింది. దూరంగా ఎక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరీ వాటిని అక్కడికి చేర్చింది పావురం. పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి చీమలు.
thesakshi.com : గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని దీసాలో భారత వైమానిక దళం (IAF) యొక్క కొత్త వైమానిక స్థావరానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపన చేశారు మరియు ఇది భారతదేశ భద్రతకు సమర్థవంతమైన కేంద్రంగా అభివర్ణించారు. ఇండో-పాక్ సరిహద్దుకు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీసా ఎయిర్ బేస్ పశ్చిమం వైపు నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా మెరుగైన స్పందనను అందించగలదని ఆయన చెప్పారు. 2000లో వాజ్‌పేయి ప్రభుత్వం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF)కి ఇచ్చిన సూత్రప్రాయ ఆమోదంతో డీసా ఎయిర్‌బేస్ కోసం భూమిని కేటాయించినప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌ను UPA ప్రభుత్వం తదుపరి 14 సంవత్సరాలకు వెనుకంజ వేసింది. నరేంద్ర మోడీ, (narendra modi)ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రాజెక్ట్ పునరుద్ధరించబడినప్పటికీ, 2017లో బనస్కాంతలో సంభవించిన భారీ వరదలు ఈ ప్రాజెక్టును నిజంగా ప్రారంభించాయి. వరద సాయం అందించాలని ప్రధాని మోదీ, అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఐఏఎఫ్‌ని కోరినప్పుడు, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బిఎస్‌ ధనోవా నేతృత్వంలోని ఎయిర్‌ హెడ్‌క్వార్టర్‌ ప్రతికూల వాతావరణం కారణంగా, సమీపంలోని ఎయిర్‌ఫీల్డ్‌ లేకపోవడంతో బాధిత ప్రాంతానికి రిలీఫ్ ఎయిర్ బ్రిడ్జిని అందించడం చాలా కష్టమైంది. దీసా ఇప్పటికీ ఫైళ్లలో పడి ఉంది. 1,000 కోట్ల నిధులతో పాటు ఎయిర్‌బేస్‌ను ప్రభుత్వం ఆమోదించింది అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్వారా ఎయిర్‌బేస్ నిర్మాణం కోసం ప్రధాని మోదీ నిధులు విడుదల చేయడంతో, వచ్చే రెండేళ్లలో ఎయిర్ డిఫెన్స్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో IAF కొత్త ఫార్వర్డ్ స్థావరాన్ని కలిగి ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. డీసా ఎయిర్‌బేస్ ఈ సెక్టార్‌లో ఐఏఎఫ్‌కి వేగవంతమైన దాడి సామర్థ్యాన్ని అందిస్తుందని ప్రధాని మోదీ చెప్పగా, కొత్త ఎయిర్‌ఫీల్డ్ గుజరాత్‌లోని నలియా, భుజ్ మరియు రాజస్థాన్‌లోని ఫలోడీలోని ఫార్వర్డ్ ఎయిర్ బేస్‌ల మధ్య కీలకమైన వ్యూహాత్మక అంతరాన్ని కూడా పూరిస్తుంది. దీసా వైమానిక స్థావరం, హైదరాబాద్‌లోని మీర్పూర్ ఖాస్, పాకిస్తాన్‌లోని జాకోబాబాద్‌లోని షాబాజ్ ఎఫ్-16 ఎయిర్‌బేస్ నుండి టేకాఫ్ అయిన శత్రు విమానాల మధ్య ఫైర్ వాల్‌గా ఉంటుంది, ఇది గుజరాత్‌లోని అహ్మదాబాద్, భావ్‌నగర్ మరియు వడోదరలో ఆర్థికంగా లక్ష్యంగా ఉంది. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో భారత్‌ను దెబ్బతీసింది. డీసా తన డీప్ పెనెట్రేషన్ స్ట్రైక్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో పాకిస్తాన్ నగరాలైన హైదరాబాద్, కరాచీ మరియు సుక్కూర్‌లను కూడా హాని చేస్తుంది. డీసా ఒక ఫార్వర్డ్ ఎయిర్‌బేస్ కాబట్టి, ఈ ఎయిర్‌ఫీల్డ్‌లో తన ఫ్రంట్‌లైన్ రాఫెల్ లేదా Su-30 MKI ఫైటర్లను మోహరించే ఉద్దేశం IAFకి లేదు. బదులుగా, ఇది MiG-29 మరియు తేజాస్ వంటి వాయు రక్షణ యుద్ధ విమానాలను నిలబెడుతుంది, తద్వారా శత్రు యుద్ధ విమానాలు అడ్డగించబడతాయి మరియు గుజరాత్ యొక్క పారిశ్రామిక సముదాయాన్ని లక్ష్యంగా చేసుకునే వారి సామర్థ్యం నిర్వీర్యమవుతుంది. గుజరాత్‌లో లేదా నైరుతి సెక్టార్‌లో పెద్ద ఉగ్రదాడి జరిగినప్పుడు పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా ఈ వైమానిక స్థావరం ఉపయోగపడుతుంది. 2024లో వచ్చే రెండేళ్లలో డీసా ఎయిర్‌బేస్ పని చేస్తుందని అంచనా వేయడంతో, పాకిస్తాన్ వైమానిక దళం కూడా ఈ రంగంలో తన వైమానిక ఆస్తులను పెంచుకోవాలని భావిస్తున్నారు, ఎందుకంటే భారత యుద్ధ విమానాలు అంతర్జాతీయ సరిహద్దును కేవలం రెండు నిమిషాల్లో మ్యాక్ 2.0 వేగంతో దాటగలవు. ఎర్ర జెండా ఎగురుతుంది.
ఒక అందమైన వసంతం రోజున నేను మీ కోసం ఈ కథను వ్రాయడం ప్రారంబించాను. నేను మా తోటలో ఉన్నాను, చుట్టూ పూర్తిగా వికసించిన పువ్వులు మరియు సీతాకోకచిలుకలు ఒక పువ్వు నుండి మరొక పువ్వుకు ఎగురుతాయి. వాటిలో ఒకటి పెద్ద పసుపు పువ్వు మీద వ్రాలి తేనెను తింటుంది. నేను జాగ్రత్తగా దాని వైపు నడుస్తూ సీతాకోకచిలుకను దగ్గరగా చూస్తున్నాను. అందమైన ఆకారం మరియు దాని రంగులు చూసి నేను ఆశ్చర్యపోయాను. తరవాత అది దాని శరీరంపై పుప్పొడి యొక్క మందపాటి పొరతో ఎగిరిపోతుంది. దాని ప్రయాణం మరో పువ్వు వైపు సాగుతుంది. మీకు తెలుసా భూగ్రహం మీద దాదాపు 400,000 రకాల పువ్వులు మరియు మొక్కలు ఉన్నాయని? మీరు ఊహించగలరా? నేను చూసే ప్రతిసారీ అన్ని పువ్వుల మధ్య ఉన్న బేధాలు నన్ను ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి పువ్వుకు అందమైన రంగు మరియు ప్రత్యేకమైన ఆకారం కలిగి ఉంటాయి. అన్ని తేడాలు నన్ను ఆశ్చర్యపరిచాయి కాబట్టే, నేను ప్రకృతిని గూర్చి అధ్యయనం చేయడం ప్రారంభించాను. ఆ తేడాలు అద్భుతమైనవె, కానీ మొక్కలు, జంతువులు మరియు మానవులను జీవించేలా చేసేవి మరింత అద్భుతమైనవి. మన శరీరము ఒక అద్బుతమైనది మీరు ఎప్పుడైనా “డూ-ఇట్-యువర్ సెల్ఫ్” అనే కిట్ కొనుగోలు చేసారా? ఉదాహరణ కుఆది ఒక బుక్‌కేస్. కిట్‌లో చాలా అల్మారాలు, స్క్రూలు మరియు మాన్యువల్ ఉన్నాయి. మీ శరీరం కూడా కొంచెం అలాంటిదే. ఇది బిలియన్ల కణాలను కలిగి ఉండి, ప్రతి కణం మీ మొత్తం శరీరానికి సంబంధించిన నియమ సంపుటిని కలిగి ఉంటుంది. ఈ నియమసంపుటిని DNA అంటారు – మీ శరీరం యొక్క రూపురేఖలు. మీ DNA నే మిమ్మల్ని మీరు కనిపించే విధంగా చేస్తుంది. మీ జీవితం ప్రారంభమైనప్పుడే కణంలో కూడా ఈ పూర్తి దాని నమూనా అప్పటికే ఉంది. మీ DNA మీ శరీరం ఎలా నిర్మితమైందో – ఆది తల, చేతులు, కాళ్లు, మీ కంటి రంగు మరియు మీ ముక్కు ఆకారంను నిర్దేశిస్తుంది కానీ ఇది మీ అవయవాలు మరియు అవి ఎలా కలిసి పని చేస్తాయో కూడా నిర్ణయిస్తుంది. అది అద్భుతం కాదా? కాబట్టి DNA మీ శరీరం యొక్క నియమ సంపుటి ఇది కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోడ్ లాంటిది. మీ కంప్యూటర్ సరిగ్గా పనిచేయడానికి ఈ కోడ్ అవసరం. ఇది మీ కంప్యూటర్‌లో ఇంటర్నెట్‌ను సర్ఫ్ చేయడం లేదా లేఖ రాయడం సాధ్యం చేస్తుంది. మానవ శరీరములో ఉన్న డి ఎన్ ఏ గూర్చి పరిశోధకుల పరిశీలనలో తేలిన విషయాలన్నింటి గూర్చి వ్రాయ లంటే 1 మిలియన్ పేజీలు కలిగిన పుస్తకము కూడా సరిపోదు పెద్ద పరిమాణం అంటే 2,500 కంటే ఎక్కువ . ఈ కోడ్ మీ శరీరములో ఉన్న ప్రతి కణములో దాగి ఉన్నది . జీవితం అనుకోకుండా ప్రారంభమైందా? చాలా మంది శాస్త్రవేత్తలు భూమిపై జీవితం అనుకోకుండా ప్రారంభమైందని నమ్ముతారు. రసాయన ప్రక్రియల వల్ల మరియు దశల వారీగా ఏర్పడింది లేక సంభవించిందని వారు భావిస్తున్నారు. కానీ ఎక్కువ మంది శాస్త్రవేత్తలు DNA చాలా సంక్లిష్టమైనదని గ్రహించారు, అది అనుకోని రీతిలో రసాయన ప్రతిచర్యల శ్రేణి నుండి ఉద్భవించలేదు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ గురించి మరోసారి ఆలోచిద్దాం. మీరు కంప్యూటర్ ప్రోగ్రామర్ వంటివారు కాకపోవచ్చు, కాబట్టి ఒక మానవ కణంలోని DNA Windows కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ వలె సంక్లిష్టంగా ఉంటుందని మీకు బహుశా తెలియకపోవచ్చు. విండోస్ వంటి సంక్లిష్టమైన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లు యాదృచ్ఛికంగా వచ్చినట్లు మీరు భావిస్తున్నారా? ఈ ప్రోగ్రామ్ మానవ డి ఎన్ ఏ వంటి అనేక సూచనలను కలిగి ఉంటుంది[3] విండోస్ అనేవి వేల కొలది కార్యప్రణాళికల ద్వారా సంవత్సరాలు సంవత్సరాలు గా అవి ఏర్పడినది. డిజైన్ లేకుండా కోడ్ లేదు. డిజైన్ లేకుండా మరియు ప్రోగ్రామర్లు పని చేయకుండా, అనుకోకుండా ఏ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఆవిర్భవించలేదు. మన DNA కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ లాగా సంక్లిష్టంగా ఉంటే, మనుషులు అనుకోకుండా ఆవిర్భవించి ఉండేవారా?
'హిరణ్యకశ్యప' కథపై .. తన పాత్రపై రానా చాలా ఆసక్తితో ఉన్నాడట. అందువలన ఈ ప్రాజెక్టు ఏడాది తరువాత సెట్స్ పైకి వెళ్లడం ఖాయమనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగానే వినిపిస్తోంది... December 2, 2020 at 2:53 PM in Tollywood Share on FacebookShare on TwitterShare on WhatsApp రానా కథానాయకుడిగా దర్శకుడు గుణశేఖర్ ‘హిరణ్యకశ్యప’ సినిమాను రూపొందించడానికి రంగాన్ని సిద్ధం చేసుకున్నారు. సురేశ్ బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ఫాక్ స్టార్’ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది. 180 నుంచి 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జరగనున్నట్టుగా వార్తలు వచ్చాయి. గుణశేఖర్ ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకోవడం కూడా జరిగిపోయింది. దాంతో ఇక ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంతా అనుకున్నారు. ఆ సమయంలోనే లాక్ డౌన్ మొదలుకావడంతో, ముందస్తుగా వేసుకున్న ప్రణాళికలో మార్పులు చేసుకోవలసి వచ్చింది. గతంలో రానా ఒప్పుకున్న కొన్ని ప్రాజెక్టులు, ఆయన అనారోగ్య కారణాల వలన ఆగిపోయాయి. ఆ తరువాత ఆ సినిమాలను పూర్తి చేయాలని ఆయన అనుకుంటున్న సమయంలోనే లాక్ డౌన్ ప్రకటన వచ్చింది. దాంతో ఆ సినిమాల నిర్మాణంలో మరింత ఆలస్యం జరిగింది. దాంతో రానా ఇప్పుడు ఆ సినిమాలను పూర్తిచేసే పనిలో వున్నాడు. కరోనా .. లాక్ డౌన్ లేకపోతే ఈ సినిమాలను పూర్తిచేసి, హిరణ్యకశ్యపుడు పాత్రధారికి తగిన దేహధారుడ్యం కోసం రానా కసరత్తు చేయాలనుకున్నాడు. కానీ అనుకున్నది ఒకటి .. అయ్యింది ఒకటి అన్నట్టుగా జరిగిపోయింది. ప్రస్తుతం రానా చేస్తున్న సినిమాలు పూర్తికావడానికి కొంతకాలం పడుతుంది. ఆ తరువాత ఆయన హిరణ్యకశిప పాత్ర కోసం ఫిట్ నెస్ తో పాటు బరువు కూడా పెరగవలసి ఉంటుంది. అందుకు మరి కొంతకాలం పడుతుంది. ఈ విధమైన ఆలస్యం అవుతుంది గనుకనే, గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆ సినిమాకి సంబంధించిన పనిలోనే ఉన్నారు. గుణశేఖర్ ఒక సినిమా పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకుంటారు. అందువలన ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్టు చాలా ఆలస్యం కావొచ్చని అనుకున్నారు. కానీ వచ్చే ఏడాదిలోనే ‘శాకుంతలం’ పూర్తిచేసి, ఆ పై ఏడాది అంటే 2022లో ‘హిరణ్యకశిప’ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. ‘హిరణ్యకశ్యప’ కథపై .. తన పాత్రపై రానా చాలా ఆసక్తితో ఉన్నాడట. అందువలన ఈ ప్రాజెక్టు ఏడాది తరువాత సెట్స్ పైకి వెళ్లడం ఖాయమనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగానే వినిపిస్తోంది. Tags: Covid-19 lockdowndirector gunasekharhiranyakashyap telugu movielatest telugu film newslatest telugu movie newsshakuntalam movietelugu newstollywood hero rana daggubatiTollywood movies
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 లోపాలు బయటపడినా ప్రత్యక్ష చర్యలు నిల్‌ నివేదికతో సరిపెడుతున్న తనిఖీ బృందాలు మిర్యాలగూడ అర్బన్‌, సెప్టెంబరు 26: ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రత్యక్షచర్యలపై రాజకీయ ఒత్తిళ్లు మొదలైనట్లు సమాచారం. తొలిదఫా చేపట్టిన క్షేత్రస్థాయి తనిఖీల్లో డీఎంహెచ్‌వో పాల్గొనగా, సోమ వారం మిర్యాలగూడ డాక్టర్స్‌కాలనీలో జరిగిన తనిఖీల్లో పాల్గొన్న ద్వితీయ శ్రేణి అధికారులు నామ మాత్రంగా తనిఖీలు నిర్వహించడం చర్చనీయాం శంగా మారింది. స్థానిక డిప్యూటీ డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో రెండు బృందాలు 27ఆస్పత్రుల్లో తనిఖీలు చేశాయి. ఈ సందర్భంగా పలు ఆస్పత్రుల్లో లోపాలను అధికారులు గుర్తించినప్పటికీ తక్షణ చర్యలు తీసు కోలేదు. పలువురు వైద్యులు తమ రిజిస్ట్రేషన్లను రెన్యూవల్‌ చేయించుకోకుం డానే వైద్యసేవలు అందిస్తున్నట్లుగా తనిఖీ బృందాలు గుర్తించాయి. అలాగే ఆస్పత్రుల అనుసంధానంతో పనిచేస్తున్న డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ఎక్స్‌– రే ల్యాబ్‌ల్లో విద్యార్హతలేని పారమెడికల్‌ సిబ్బందితో పరీక్షలు పరీక్షలు చేయిస్తున్నట్లుగా నిర్ధారించారు. కొందరు ఆర్‌ఎంపీలు భవనాలను లీజుకు తీసుకొని విజిటింగ్‌ డాక్టర్లతో ఓపీ, ఐపీ సేవలు అందిస్తున్న తీరు తనిఖీలో బయటపడింది. ఈనెల 22న నిర్వహించిన తొలిదఫా తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగు చూడగా, రెండు ఆస్పత్రులు, ఐదు ల్యాబ్‌లను సీజ్‌ చేశారు. రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనలు విరుద్ధంగా ఉన్న ఆరు ఆస్పత్రులకు అధికారులు షోకాజ్‌ నోటీలు జారీచేశారు. అయితే సోమవారం చేపట్టిన తనిఖీలు మాత్రం అందుకు భిన్నంగా కొనసాగడం విశేషం. కళ్లఎదుట లోపాలను గుర్తించిన తనిఖీ బృందాలు తక్షణ చర్యలకు సాహసించకపోవడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఏదో అంతర్గత శక్తి అధికారుల చర్యలకు అడ్డుకట్ట వేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. కనీస సదుపాయాలు, విద్యార్హత కలిగిన సిబ్బంది లేకుండా ఆస్పత్రులు, ల్యాబ్‌లు యథేచగా కొనసాగిస్తూ రోగుల నుంచి వేలాది రూపాయల బిల్లు వసూలు చేస్తున్న వైద్యమాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నివేదికతో సరి డాక్టర్స్‌కాలనీలో సుమారు 93 వరకు ప్రైవేటు ఆస్పత్రులను నడిపి స్తున్నారు. అందులో కొన్ని ప్రభుత్వ వైద్యులకు చెందిన ఆస్పత్రులు కూడా ఉన్నాయి. వీటన్నింటిని అధికారులు తమ తనిఖీలో గుర్తించారు. అలాగే ఆస్పత్రుల్లో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణ పరిస్థితులు, ల్యాబ్‌లో జరుగుతున్న దోపిడీ తదితర అంశాలతోపాటు కొందరు గైనిక్‌ డాక్టర్లు నార్మల్‌ డెలివరీ చేయకుండా సిజేరియన్లనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తించినప్పటికీ తక్షణ చర్యలు తీసుకునేందుకు అధికారులు సాహసం చేయలేదు. ఆస్పత్రుల పేర్లు, అందులో గుర్తించిన లోపాలపై మాత్రమే నివేదిక తయారు చేశారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి వారి సలహా మేరకే చర్యలు ఉంటాయని, ప్రత్యక్ష చర్యలు తీసుకునే అధికారం తమ చేతుల్లో లేదని తనిఖీ బృందాలు వెల్లడించడం గమ నార్హం. ఈ తతంగమంతా చూస్తుంటే తనిఖీలతో సరిపెట్టి శాఖాపరమైన చర్యలకు కాలయాపన చేయాలన్న ఉద్ధేశంతో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తనిఖీ బృందాల్లో డిప్యూటీ డీఎంహెచ్‌వో కేస రవి, మెడికల్‌ ఆఫీసర్లు ఉపేందర్‌, శ్రీనాథ్‌, సీహెచ్‌వో వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
babesnetwork kitchen b grade sex telugu video sex telugu videos 18 age latest telugu homemade sex videos ryan conner sat full kac lane about sex feelsings in telugu by sex specialist deep videos south ndiian telugu language sex videos back sex telugu indian college students sex videos in telugu car rap video xxx telugu girl real story sex telugu sex stories vanndana aunty fat aunti sex video in telugu desi murga c com sex video telugu pussy aunt telugu sex stories anna chelli sex videos telugu 716 new york xxxx sex telugu com సెక్సీ గర్ల్స్ సినిమాల హాట్ పోర్న్ వీడియోలు Xxx Porn - దుర్భేద్యమైన మరియు ఒక బిట్ మొద్దుబారిన నా లో జీవితం, లో పోర్న్ వీడియో ఈ అమ్మాయిలు చేయవచ్చు అద్భుతమైన మరియు సమర్థించడం చూడండి ఈ తెల్లని చర్మం మరియు వైట్ లైన్స్ girls are very nice. మరియు వారు నిరూపించడానికి ఒకసారి మళ్ళీ సంఖ్య సెక్స్ సమాన ప్రత్యర్థులు. రాగి జుట్టు కొంటె మరియు పూజ్యమైన creatures on the planet. ఎందుకు అంటే చాలా వాచ్ వీడియో క్లిప్లు అభిప్రాయం, పురుషులు ప్రముఖ ఈ తెలుపు అమ్మాయిలు. అభివృద్ధి చెందుతున్న వారి పొడవాటి జుట్టు, తెల్లని చర్మం మరియు అద్భుతమైన ఛాతీ తో గులాబీ ఉరుగుజ్జులు మరియు ఒక సన్నని, అధిక మాడ్ మెన్. కాబట్టి, ఇప్పటికీ ఒక మార్గం ఒక భాగస్వామి ఉంది. ఒక గొప్ప విజయం పురుషులు. Porn videos రాగి జుట్టు తో చాలా సెక్సీ మరియు వేడి బ్లోన్దేస్ వెదుక్కోవచ్చు మాత్రమే మా వెబ్సైట్! HD Sex VIDEOS Copyright 2020 All Hashtag #freeporn Web Site PORN HD VIDEOS! DMCA | 18 U.S.C. 2257 | Privacy Policy | Terms and conditions | Telugu Porn videos | Telugu xxx videos
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 గర్భిణుల్లో(pregnant women) సహజంగా కనిపించే సమస్యలు అసిడిటీ, మలబద్ధకం. అయితే ఈ సమస్యలను మందులతో కాకుండా, తినే ఆహారం, అనుసరించే అలవాట్ల్ల మార్పులతో సరిదిద్దవచ్చు. గర్భధారణతో గర్భకోశం పరిమాణం పెరిగి జీర్ణాశయం మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో తిన్న వెంటనే ఆహారం అన్నవాహికలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. జీర్ణాశయంలోని యాసిడ్‌ అన్నవాహికలోకి ఎగిసి పడుతుంది. దాంతో ఛాతీలో, గొంతులో మంట వేధిస్తాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. ఒకేసారి భారీగా తినేయకుండా కొద్ది పరిమాణాల్లో ప్రతి రెండు గంటలకోసారి తింటూ ఉండాలి. ఇక మలబద్ధకం నివారణ కోసం పీచుపదార్థం ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు తినాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. స్వల్ప వ్యాయామం చేయాలి. మొదటి నెలలో... గర్భం దాల్చినట్టు తెలియగానే కొందరు మహిళలు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలనే అపోహలో ఉంటారు. కానీ ప్రారంభంలో అంతకుముందు ఎలాంటి జీవనశైలిని గడిపారో దాన్నే కొనసాగించవచ్చు. అదనపు విశ్రాంతి అవసరం ఉండదు. పూర్వం వరస గర్భస్రావాలు అయి ఉన్నా, గర్భాశయ ముఖద్వార సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యల ఉండి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తే తప్ప గర్భిణులు మొదటి నెలలో అవసరానికి మించి విశ్రాంతి తీసుకోనవసరం లేదు. వ్యాయామం(exercise) విషయంలో కూడా ఎలాంటి నిబంధనలూ లేవు. ఏరోబిక్స్‌ లాంటి హెవీ ఎక్సర్‌సైజ్‌లు కాకుండా వాకింగ్‌, ఇతరత్రా తేలికపాటి వ్యాయామాలన్నీ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. ఆహారంలో మాంసకృత్తులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఐరన్‌ ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి.
పవన్ కల్యాణ్ ఫుల్ క్లారిటీతో ఉన్నారా?2024 ఎన్నికలకు పక్కా స్కెచ్ వేశారా? ముందుండి వైసీపీ సర్కార్‌ని ఢీ కొట్టబోతున్నారా?సీఎం అభ్యర్థిగా సేనాని కదనరంగంలోకి దూకుతారా?బీజేపీ ఒప్పుకుంటుందేమోగానీ చంద్రబాబు మాటేమిటి?పవన్ కల్యాణ్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ వెనుక అర్థం ఇదేనా? ఏపీలో పొలిటికల్ ఈక్వెషన్స్ మారుతున్నాయా? సేనాని దూకుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. నిత్యం ఏదో ఓ పోరాటం పేరుతో జనం మధ్య ఉంటున్నారు. శ్రీకాకుళం ఉద్దానం నుంచి మొన్నటి ఇప్పటం దాకా ఇదే చేశారు.ఇక్కడ నుంచి సేనాని మరింత దూకుడు పెంచారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ జనంలోకి వెళ్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి..ఏపీ రూపురేఖలు మార్చేస్తా, అవినీతి రహిత పాలన అందిస్తానంటూ మాట్లాడుతున్నారు. ఏ సభలోనైనా ఇదే మాట్లాడుతున్నారు. టార్గెట్ ఫిక్స్ మరి బాణాలు వదులుతున్నారు. రాసుకో బాబు అంటూ జగన్ సర్కార్ పై రగిలిపోతున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా సేనాని అడుగులు పడుతున్నాయి. జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ ముందుండి పోరాడుతానంటున్నారు. ఒక్క ఛాన్స్ ఫ్లీజ్ వ్యాఖ్యల వెనుక అర్థం ఇదే రీ సౌండ్ చేస్తోంది. బీజేపీ ఓకే అంటుందా? బీజేపీ,జనసేన మధ్య దోస్తీ కొనసాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలదాకా కలిసే నడుస్తారు. రోడ్ మ్యాప్ ఇస్తామని బీజేపీ హైకమాండ్ చెప్పింది. ఈ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్ననని పవన్ కల్యాణ్ పలుమార్లు చెప్పారు. మొన్న విశాఖలో ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనూ ఏపీ భవిష్యత్ పైనే చర్చించానని పవన్ చెప్పారు. అంటే 2024లో బీజేపీతో కలిసి పక్కా ఎన్నికలకు వెళ్తున్నానని స్పష్టం చేశారు. మరి బీజేపీతో పాటు టీడీపీని కలుపుకుపోతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బాబుతో పవన్‌కు మంచి స్నేహం ఉంది.స్నేహం 2024లో ఎన్నికల పొత్తుగా మారుతుందా? పొత్తు పొడిచేనా? ఏపీలో టీడీపీ, జనసేనకు అధికారికంగా ఇంకా పొత్తులేదు. కానీ చాలా కార్యక్రమాలు రెండుపార్టీలు కలిసిపనిచేశాయి. ఆలోచనలు ఒకేలా ఉంటాయి. వైసీపీ సర్కార్‌ని గద్దెదించడమే లక్ష్యం. పవన్ కల్యాణ్ చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తున్నారని ఎప్పటినుంచో వైసీపీ ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్టే పవన్ అడుగులు ఉన్నాయి. ఆ మధ్య చంద్రబాబు-పవన్ కల్యాణ్ సంయుక్త ప్రెస్ మీట్‌తో ఇదే స్పష్టమైంది.ఈ స్నేహం భవిష్యత్‌లో పొత్తుగా మారబోతుందా? బాబు రాకను బీజేపీ స్వాగతిస్తుందా?ఏపీలో విపక్షాలన్ని ఏకమవుతాయా? బాబు ఓకే అంటారా? గతంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైనా సరే..జగన్ సర్కార్‌ని మాత్రం సాగనంపాలని చంద్రబాబు అన్నారు. అంటే చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేశారా?పవన్ కల్యాణ్‌ను ముందు పెట్టి ఎలక్షన్ మిషన్‌ 2024ని నడిపించబోతున్నారా?కాపు ఓటు బ్యాంకే టార్గెట్ చేస్లూ పావులు కదుపుతున్నారా? కమ్మ ప్లస్ కాపు ఓట్ల సమీకరణాలతో ఏపీ రాజకీయాల ఈక్వేషన్స్ మార్చబోతున్నారా..? వపన్ కల్యాణ్ వ్యాఖ్యలను చూస్తే ఇదే అర్థం వస్తోంది.
బ్లూటూత్‌ హెడ్‌ఫోన్స్‌లో ఆడియో క్వాలిటీకి సంబంధించి ఈ ఎల్‌సీ3 కోడెక్‌ కీలకపాత్ర పోషించనుందని చెబుతున్నారు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 బ్లూటూత్‌ హెడ్‌ఫోన్స్‌లో ఆడియో క్వాలిటీకి సంబంధించి ఈ ఎల్‌సీ3 కోడెక్‌ కీలకపాత్ర పోషించనుందని చెబుతున్నారు. దీనికంటే ముందుగా ఎనర్జీ ఆడియో అంటే ఏమిటో తెలుసుకోవాలి. బ్లూటూత్‌లో రెండు రకాలు - క్లాసిక్‌, ఎల్‌ఈ. ఎల్‌ఈ అంటే లో ఎనర్జీ. లో పవర్‌, లో బ్యాండ్‌విడ్త్‌. అయితే ఇది ఐఓటి డివైసెస్‌ అంటే స్మార్ట్‌ వాచీలు, ఫిట్‌నెస్‌ బ్యాండ్స్‌కి పరిమితమై ఉంది. బ్లూటూత్‌ క్లాసిక్‌ ద్వారా ఆడియో ట్రాన్స్‌మిషన్‌ జరుగుతుంది. ఎల్‌సీ3(లో కాంప్లెక్సిటీ కమ్యూనికేషన్‌)కోడ్‌ అనేది బ్లూటూత్‌ ఆడియో కోడెక్‌ - లో ఎనర్జీ ప్రొఫైల్స్‌ కోసం ప్రత్యేకించి దీన్ని డిజైన్‌ చేశారు. స్పీచ్‌ను ఎన్‌కోడ్‌ చేయగలదు. అలాగే వివిధ సంగీతాలను ఇన్‌కార్పొరేట్‌ చేసుకోగలదు. బ్లూటూత్‌ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఎల్‌సీ3 కోడెక్‌ - ఆడియోను కంప్రెస్‌ చేస్తుంది. ఆడియో క్వాలిటీ దెబ్బతినకుండా చూసుకుంటూనే చిన్నపాటి బిట్‌రేట్‌కి మారుస్తుంది. ఫలితంగా లిమిటెడ్‌ బ్యాండ్‌విడ్త్‌లోనే వేగంగా డేటాని ట్రాన్స్‌మిట్‌ చేసుకోవచ్చు. ‘సౌండ్‌ గైస్‌’ డేటా ప్రకారం ఎల్‌సీ3 స్కేల్‌ 345కేబీపీఎస్‌ ఆడియో ఓఏ 160 కేబీపీఎస్‌. ఎస్‌బీసీ, క్వాల్కామ్‌తో పోల్చుకుంటే కాంపాక్ట్‌(కుదించిన)గా ఉంటుంది. బ్లూటూత్‌ ఎస్‌ఐజి ప్రచురించిన గ్రాఫ్‌ ప్రకారం బిట్‌ రేటు తక్కువగా ఉన్నప్పటికీ ఎస్‌బీసీతో పోల్చుకుంటే ఆడియో క్వాలిటీ బాగా ఉంటుంది. కొత్త కోడ్‌తో పలు ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ఎనర్జీతో అతి పెద్ద ప్యాకేజీలు పంపుకోవచ్చు. లోబిట్‌ రేట్‌ అంటే తక్కువ బ్యాండ్‌విడ్త్‌ అని అర్థం చేసుకోవాలి. 8కేహెచ్‌జెడ్‌ నుంచి 48 కేహెచ్‌జెడ్‌ వరకు వేర్వేరు రేట్లతో ఆడియో చానల్స్‌ను అపరిమితంగా ఇది సపోర్ట్‌ చేస్తుంది. అంతేకాకుండా ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ కోసం నేటివ్‌ సపోర్ట్‌తో ఎల్‌ఈ ఆడియో వస్తుంది. యూజర్లకు మెరుగైన సేవలు అందిస్తూ, తమ ప్రొడక్ట్‌లు అమ్ముకునేందుకు కంపెనీలు తెగ ఉత్సాహపడుతుంటాయి. తాజాగా ఆడియోలో నాణ్యత పెంచడానికి యాపిల్‌ కంపెనీ దృష్టిసారించింది. తదుపరి జనరేషన్‌ యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌లో అందుకోసం ‘ఎల్‌ఈ ఆడియో’, ‘ఎల్‌సీ3 బ్లూటూత్‌ కోడెక్‌’ సపోర్ట్‌ను అందిస్తోంది. ముఖ్యంగా ‘ఎల్‌సీ3 కోడెక్‌’ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుందంటే...
Thirumala Brammotsavalu : పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి కన్యామాసం(ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించార‌ట‌. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెంది అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు 9 రోజుల పాటు జ‌రుగ‌నున్న ఈ ఉత్స‌వాల్లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తి అయిన శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు వివిధ వాహ‌నాల‌పై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు దివ్య‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. ప్ర‌పంచ మాన‌వాళి సంక్షేమాన్ని కాంక్షించ‌డంతో పాటు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి దివ్య‌మైన ఆశీస్సుల‌ను భ‌క్తులంద‌రికీ అందించేందుకు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను టిటిడి నిర్వ‌హిస్తుంది. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుండి అర్ధ‌రాత్రి ఒంటి గంట వరకు జరుగుతుంది. క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత మాడ వీధుల్లో బ్ర‌హ్మోత్స‌వ వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హించ‌నున్నందున విశేషంగా విచ్చేసే భ‌క్తులకు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. భ‌క్తులంద‌రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల‌తో పాటు మూల‌విరాట్ ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దారు. గ్యాల‌రీల‌లో వేచివుండే భ‌క్తుల సౌక‌ర్యార్థం తాగునీరు, మ‌రుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. భ‌క్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు. సెప్టెంబ‌రు 26న అంకురార్పణం సెప్టెంబ‌రు 26న సోమ‌వారం రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్స‌వం నిర్వ‌హించే ముందు అది విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్ప‌ణం నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు. సెప్టెంబ‌రు 27న ధ్వజారోహణం సెప్టెంబర్ 27వ తేదీ మంగ‌ళ‌వారం సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత రాత్రి 9 నుండి 11 గంటల వ‌ర‌కు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది. వాహ‌న సేవ‌ల వైశిష్ట్యం ఇలా…. పెద్దశేషవాహనం (27-09-2022) (రాత్రి 9 గంటలకు) మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. చిన్నశేషవాహనం (28-09-2022) (ఉదయం 8 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. హంస వాహనం(28-09-2022)(రాత్రి 7 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని(శరణాగతి) కలిగిస్తాడు. సింహ వాహనం(29-09-2022)(ఉదయం 8 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహం బలానికి (వహనశక్తి), వేగానికి (శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు – భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం. ముత్యపు పందిరి వాహనం(29-09-2022)(రాత్రి 7 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. కల్పవృక్ష వాహనం(30-09-2022)(ఉదయం 8 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. సర్వభూపాల వాహనం(30-09-2022)(రాత్రి 7 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మోహినీ అవతారం (01-10-2022)(ఉదయం 8 గంటలకు) బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిస్తాడు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నాడు. గరుడ వాహనం(01-10-2022)(రాత్రి 7 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు. హనుమంత వాహనం(02-10-2022)(ఉదయం 8 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. స్వర్ణరథం(02-10-2022)(సాయంత్రం 4 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ స్వర్ణోత్సవ సేవలో కల్యాణకట్ట సేవాపరులు తొలుత బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది. గజవాహనం(02-10-2022)(రాత్రి 7 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది. సూర్యప్రభ వాహనం(03-10-2022)(ఉదయం 8 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయి. చంద్రప్రభ వాహనం(03-10-2022)(రాత్రి 7 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతాడు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హ దయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. శ్రీవారి రథోత్సవం(04-10-2022)(ఉదయం 7 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఉదయం ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుధ్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీన్నివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు కానీ, సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అన్నమయ్య అనడం ముదావహం. అశ్వవాహనం(04-10-2022)(రాత్రి 7 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలను వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు. చక్రస్నానం(05-10-2022)(ఉదయం 6 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. ధ్వజావరోహణం(05-10-2022) (రాత్రి 7 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావరోహణ ఘట్టంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. Related News Facial Recognition: ఎయిర్‭పోర్ట్‭కి వెళ్తే ఇక నుంచి ముఖాన్ని స్కానింగ్ చేయాల్సిందే Digital Rupee : డిజిటల్ రూపీ వచ్చేసిందోచ్.. క్రిప్టోకరెన్సీకి, డిజిటల్ రూపాయికి తేడా ఏంటి? ఇది ఎలా కొనాలి? ఎలా వాడాలి? పూర్తి వివరాలు మీకోసం..! Tokay Gecko Lizard : ఇది నిజం .. ఈ బల్లి ధర అక్షరాల కోటి రూపాయలు Afghanistan: పాఠశాలపై బాంబు దాడి.. 15 మంది విద్యార్థులు మృతి Pangeos: సముద్రంలో తేలియాడే మహా నగరం నిర్మిస్తున్న సౌదీ అరేబియా… 65 వేల కోట్లతో సిద్ధంకానున్న భారీ నౌక! Birthday at Crematorium: స్మశానంలో పుట్టినరోజు వేడులకు చేసుకున్న వ్యక్తి.. బర్త్‭డే కేక్ కటింగ్‭తో పాటు బిర్యాని విందు కూడా అక్కడే
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది 24, మార్చి 2021, బుధవారం జీవన 'మంజూ'ష.. ఏప్రిల్ సాహిత్యానికి షష్టిపూర్తి, స్వాతంత్ర్యానికి డెబ్భై ఐదు వసంతాలంటూ పండుగలు చేసుకుంటున్నాం కాని ఏం సాధించామని ఈ ఉత్సవాలు చేసుకుంటున్నామని ఓ క్షణమైనా ఆలోచిస్తున్నామా? జీవితం సప్త సాగర గీతం అన్న సినీ కవి మాటలు ఓసారి గుర్తు చేసుకుంటే కాస్తయినా జీవితపు విలువలు తెలుస్తాయి. కాదేది కవిత్వానికి అనర్హం అన్నారు మహాకవి శ్రీ శ్రీ. ప్రతి రాతా పురస్కారానికి అర్హమే అంటున్నాయి ఈనాటి సాహితీ విలువలు. కేంద్రమూ లేదు, రాష్ట్రమూ లేదు అన్నీ ఒకేలా వ్యవహరిస్తున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఎన్నో సాహితీ సంస్థలు పురస్కారాలను డబ్బులతో జత చేసి ఇబ్బడిముబ్బడిగా అవార్డులిచ్చేస్తూ, అవార్డులంటే నలుగురు నవ్వుకునేటట్లు చేసేస్తూ, తెలుగు సాహిత్యాన్ని నవ్వులపాలు చేసేస్తున్నాయి. మందు పార్టీలకు, మతలబు రాజకీయాలకు సాహిత్యం కూడా అమ్ముడుబోయినందుకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించేసి మనమూ చేతులు దులిపేసుకుందాం. ఎన్నో గొప్ప గొప్ప రాతలు ఎవరికి తెలియకుండా పోతున్నాయంటే దీనికి కారణాలు మనందరికి తెలిసినా గొంతు విప్పి ఓ మాట మాట్లాడం. కాపీ రాతలకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలిచ్చి చేతులు దులిపేసుకుంటాం. కులమతాలను హేళన చేసే రాతలకు గొప్ప శిల్పం, చట్టుబండలు ఉన్నాయని అందలం ఎక్కించేస్తాం. పురస్కారం అందుకునే సాహిత్యానికి మాత్రమే అర్హత ఉంటే సరిపోదు. ఆ పురస్కారం అందుకునే రచయిత వ్యక్తిత్వం కూడా అందుకు సరిపోయి ఉండాలి. ఏ ప్రాతిపదికన ఈ పురస్కారాలు పంచుతున్నారో వివరాలు చెప్పరెవరూ. కమిటిలో ఉన్న నలుగురికి నాలుగు మందు బాటిళ్ళు, నాలుగు మిడ్ నైట్ పార్టీలు ఇస్తే చాలు అవార్డ్ గారంటీ అన్న నమ్మకం అందరి మనసుల్లో లో వేళ్ళూరుకు పోయిందిప్పుడు. సమాజానికి హితం చేసేది సాహిత్యం అన్నది ఒకప్పటి మాట. మందు పార్టీలలో మునిగి తేలుతోంది అక్షరం అన్నది ఇప్పటి సత్యం. సరసమైన ధరలకు డాక్టరేట్ లు అంగడి సరుకులుగా దొరుకుతున్నాయిప్పుడు. పురస్కారాలకు, షష్టి డాక్టరేట్ లకు నియమ, నిబంధనలు ఏమీ లేవిప్పుడు. తెలుగు సాహిత్యం పరువు ఏమిటన్నది సాహితీ పెద్దలకే తెలియాలి మరి. ప్రపంచ సాహిత్యంలో మనమెక్కడున్నామెా ఓసారి ఆలోచించండి సాహితీ మేధావుల్లారా!
ముఖం మీది మచ్చలు ఇబ్బందికరంగా అనిపిస్తాయి. వాటిని పోగొట్టడం అనుకున్నంత కష్టమైన పనేమి కాదు. సెలూన్‌ లేదా ప్లారర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా కిచెన్‌లో లభించే అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ఆంధ్రజ్యోతి(28-09-2020) ముఖం మీది మచ్చలు ఇబ్బందికరంగా అనిపిస్తాయి. వాటిని పోగొట్టడం అనుకున్నంత కష్టమైన పనేమి కాదు. సెలూన్‌ లేదా ప్లారర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా కిచెన్‌లో లభించే యాలకులతో మచ్చలను మాయం చేసి, అందాన్ని పెంచుకోవచ్చు. ఎలాగంటే... యాలకులలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అన్నివిధాలా చర్మానికి రక్షణనిస్తాయి. అంతేకాదు ఎలర్జీలను తగ్గించి, చర్మానికి సాంత్వననిస్తాయి. పచ్చిపాలు, రెండు మూడు యాలకులు, కొద్దిగా తేనె తీసుకోవాలి. యాలకులను పొడి చే సి పాలలో కలపాలి. తరువాత టీ స్పూన్‌ తేనె వేసి పేస్ట్‌లా వచ్చేంత వరకూ కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖం మీద మచ్చలు, మొటిమలు ఉన్నచోట మసాజ్‌ చేస్తున్నట్టుగా రాసుకోవాలి. 15 నిమిషాలయ్యాక చల్లని నీళ్లలో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే ముఖం మృదువుగా మారుతుంది.
thesakshi.com : అల్లు అర్జున్ యొక్క పుష్ప: ది రైజ్ ఇటీవలి కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటి. దాదాపు 170–200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 355–365 కోట్ల వసూళ్లను రాబట్టింది మరియు పుష్ప 2 గురించి అభిమానులు చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఇప్పుడు, పుష్ప: ది రూల్ యొక్క ఆర్థిక వివరాలు బయటపడ్డాయి. దాని తయారీదారులకు కొద్దిగా వినాశకరమైనది. పుష్ప: ది రైజ్ – హిందీతో పాటు తెలుగులో కూడా విజయం సాధించిన తర్వాత, సినిమా బడ్జెట్‌లు సవరించబడ్డాయి మరియు నటీనటులు మరియు సిబ్బంది వేతనాలు పెంచబడ్డాయి. మరియు వారు ఎంత వసూలు చేస్తున్నారు మరియు దాని బడ్జెట్ ఎంత అనే దాని గురించి వివరాలు ఇలా ఉన్నాయి. పుష్ప: ది రూల్ కోసం అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్‌గా రూ. 125 కోట్లు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇక రెండో ఇన్‌స్టాల్‌మెంట్ కోసం సుకుమార్‌కు 75 కోట్లు పారితోషికం చెల్లించనున్నట్టు సమాచారం. ప్రధాన నటుడు మరియు దర్శకుడి ఫీజు కేవలం రూ. 200 కోట్లతో, సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ మొత్తాలను వెచ్చించనుందని అర్థం. మరియు మొదటి చిత్రం యొక్క విజయాన్ని బట్టి, అది డీల్‌తో ముందుకు వెళ్లడం తప్ప వారికి వేరే మార్గం లేకుండా పోయింది. పుష్ప: ది రూల్ కోసం అల్లు అర్జున్ మరియు సుకుమార్ ఎంత సంపాదిస్తున్నారనే దానిపై వివరాలు ఇలా ఉండగా, సినిమా తీయడానికి అయిన ఖర్చులు – అభిరుచులు మరియు ప్రచార ఖర్చులతో సహా రూ. 150 కోట్లు ఖర్చు అవుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే రెండో పుష్పా విడత బడ్జెట్ మొత్తం దాదాపు రూ.350 కోట్లు ఉంటుందని అంచనా. బడ్జెట్‌లో ఉండేలా త్వరిత షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేస్తానని దర్శకుడు హామీ ఇచ్చాడని నివేదిక పేర్కొంది. ఈ వివరాలతో పాటు, పుష్ప: ది రూల్‌కి సంబంధించిన అన్ని డీల్స్‌ను అల్లు అరవింద్ విడుదలకు ముందే ముగించనున్నందున థియేట్రికల్ యేతర ఒప్పందాలను మూసివేయవద్దని ప్రొడక్షన్ హౌస్ – మైత్రీ మూవీ మేకర్స్‌ను కోరినట్లు కథనం పేర్కొంది. అయితే ఈ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం సినిమా యొక్క ప్రధాన నటుడు మరియు దర్శకుడు పొందుతున్న మొత్తం పైన పేర్కొన్న మొత్తం ఉందా? సరే, లేదు. సినిమా లాభాల్లో అల్లు అర్జున్ మరియు సుకుమార్ 40 శాతం చొప్పున పంచుకుంటారని నివేదికలు చెబుతున్నాయి, అంటే మైత్రీ మూవీ మేకర్స్ లాభాల నుండి కేవలం 20 శాతం మాత్రమే పొందవలసి ఉంటుంది. వారు పెట్టుబడి పెట్టిన మొత్తం నుండి, సినిమా బాగా ఉంటే లాభాలు చాలా తక్కువగా ఉంటాయి. సినిమా బాంబ్ పేలితే మొత్తం ఒత్తిడి ప్రొడక్షన్ హౌస్‌పైనే పడేది. ఈ చిత్రం యొక్క నాన్-బడ్జెట్ అంశాల గురించి మాట్లాడుతూ, అల్లు అర్జున్ నేతృత్వంలోని పుష్ప: ది రూల్ షూటింగ్ ఆగస్టు మధ్యలో ప్రారంభమవుతుంది మరియు 2023లో వేసవి తర్వాత విడుదలను చూస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న తన పాత్రను తిరిగి పోషించింది. శ్రీవల్లి.
దీనికి లింకై ఉన్న పేజీల్లో జరిగిన చివరి మార్పులు ఇక్కడ చూడవచ్చు. మీ వీక్షణ జాబితాలో ఉన్న పేజీలు బొద్దుగా ఉంటాయి. ఇటీవలి మార్పుల ఎంపికలు గత 1 | 3 | 7 | 14 | 30 రోజుల లోని చివరి 50 | 100 | 250 | 500 మార్పులను చూపించు నమోదైన వాడుకరులను దాచు | అజ్ఞాత సభ్యులను దాచు | నా దిద్దుబాట్లను దాచు | బాట్లను చూపించు | చిన్న మార్పులను దాచు | పేజీ వర్గీకరణ చూపించు | వికీడేటా ను చూపించు 28 నవంబరు 2022, 08:47 తో మొదలుపెట్టి ఆ తరువాత జరిగిన మార్పులను చూపించు పేరుబరి: అన్నీ (మొదటి) చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీపీడియా వికీపీడియా చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ వేదిక వేదిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Gadget Gadget talk Gadget definition Gadget definition talk Topic ఎంచుకున్నది తప్ప మిగిలినవి చూపించు సంబంధిత పేరుబరి ట్యాగుల వడపోత: 2017 source edit Android app edit AutoWikiBrowser blanking campaign-external-machine-translation ContentTranslation2 DiBabel [1.2] Disambiguation links discussiontools (దాచిన ట్యాగు) discussiontools-added-comment (దాచిన ట్యాగు) discussiontools-source-enhanced (దాచిన ట్యాగు) Emoji Fountain [0.1.3] IABotManagementConsole [1.1] IABotManagementConsole [1.2] iOS app edit MassMessage delivery mentor list change meta spam id Modified by FileImporter newbie external link Newcomer task Newcomer task: copyedit Newcomer task: expand Newcomer task: links Newcomer task: references Newcomer task: update PAWS [1.2] PAWS [2.1] QuickCategories [1.1] rollback SWViewer [1.0] SWViewer [1.2] SWViewer [1.3] SWViewer [1.4] T144167 wikieditor (దాచిన ట్యాగు) అజ్ఞాత సృష్టించిన పేజీ ఉన్నత మొబైల్ దిద్దుబాటు ఉపదేశ ప్యానెల్ ప్రశ్న కొత్త దారిమార్పు కొత్త వాడుకరి ఇచ్చే బయటి లింకులు కొత్త విషయం గురూపదేశ మాడ్యూల్ ప్రశ్న చరవాణి ద్వారా వెబ్ సవరింపు చరవాణి సవరింపు తిరగ్గొట్టారు తుడిచివేత దారిమార్పు లక్ష్యాన్ని మార్చారు దారిమార్పును తీసేసారు ప్రత్యుత్తరం మానవిక తిరగవేత మార్చేసారు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు మూలం రద్దుచెయ్యి రోల్‌బ్యాక్ విజువల్ విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ విజువల్ ఎడిటర్:తనిఖీ విజువల్ ఎడిట్: మార్చారు విభాగపు అనువాదం విశేషణాలున్న పాఠ్యం వ్యాసాల అనువాదం
సూపర్ స్టార్ మహేష్ నటించిన సర్కార్ వారి పాట ఇటీవల విడుదలై ఆరంభ వసూళ్లను ఘనంగా సాధిస్తోంది. ఈ సినిమాకి థియేటర్ చైన్ సహకారం ప్లానింగ్ ఓపెనింగుల పరంగా కలిసొచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగానే మహేష్ తన తదుపరి సినిమాపై దృష్టి సారించారని టాక్ వినిపిస్తోంది. మహేష్ తదుపరి పాన్ ఇండియా సినిమాలో నటిస్తారు. ఆ చిత్రానికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. విజయేంద్రునితో కలిసి రాజమౌళి స్క్రిప్టు డెవలప్ మెంట్ ప్రాసెస్ లో బిజీగా ఉన్నారని ఇటీవల టాక్ వినిపించింది. అయితే రాజమౌళి సినిమాలో మహేష్ గెటప్ ఎలా ఉంటుంది? అంటే దానికి అభిమానులు ఎవరికి వారు ఊహిస్తున్నారు తప్ప ఆధారాలేవీ దొరకలేదు. చూస్తుంటే మహేష్ రాకుమారుడిని తలపించే లా ఉన్నాడన్న వ్యాఖ్యలు తాజాగా వినిపిస్తున్నాయి. ఇంతకుముందే జిమ్ లో మహేష్ కసరత్తులు చేస్తున్న ఒక వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మహేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక నిపుణుడైన కోచ్ సమక్షంలో అతడు మజిల్స్ ని బిల్డ్ చేస్తున్న తీరు ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా రాజమౌళి తన హీరోలను యోధులుగా బలాఢ్యులుగా ఆవిష్కరించేందుకు ఎంతో ఆసక్తిగా ఉంటారు. బాహుబలి కోసం ప్రభాస్ - రానాలను ఆయన భుజబల బాహుబల పరాక్రములుగా తయారు చేసారు. ఇటీవల విడుదలైన ఆర్.ఆర్.ఆర్ కోసం రామ్ చరణ్ - ఎన్టీఆర్ లను కూడా అంతే పర్ఫెక్ట్ ఫిజిక్ తో చూపించారు. ఈసారి మహేష్ ని ఎలాంటి కథలో చూపిస్తారు? అతడి రూపం ఎలా ఉండనుంది? అన్నది క్యూరియాసిటీని పెంచుతోంది. దానికి తగ్గట్టే మహేష్ తన శరీరాకృతిని మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారా? అంటూ ఈ వీడియో సందేహాల్ని రాజేసింది. ప్రస్తుతానికి ఇది ఊహ మాత్రమే. రాజమౌళి మూవీలో మహేష్ గెటప్ ఎలా ఉంటుంది? అన్నది అధికారికంగా వివరాలు రావాల్సి ఉంది. Tupaki TAGS: Superstar MaheshBabu Rajamouli SarkaruVaariPaata Gym VijendraPrasad Story Theatrical PanIndia TupakiUpdates
కువైట్ లో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో తెలుగు ప్రజలను ఉర్రూతలూగిస్తూ సంగీత జల్లులతో తడిపి మైమరపించిన ‘తమన్’ సుస్వరాల సంగీత విభావరి ‘సుస్వర తమనీయం’ కువైట్ లో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక పెద్ద తెలుగు సంఘం “తెలుగు కళా సమితి”. రెండున్నర సంవత్సరాల తరువాత ‘కోవిడ్’ అనంతరం మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రత్యక్ష సంగీత కార్యక్రమం ‘సుస్వర తమనీయం’, మైదాన్ హవల్లీ లోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో, యువతను ఉర్రూతలూగిస్తున్న సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ యస్.యస్. తమన్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయని గాయకులు శ్రీ కృష్ణ, సాకేత్ , పృథ్వి చంద్ర, విమల రోషిని , శ్రీ సౌమ్య, శృతి రంజని, మనీష, హరిక నారాయణ్ తది తరులు మరియు వాణిజ్య బృందంచే నిర్వహించ బడినది. జూన్ మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయం లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించ బడింది. ఈ మెగా ఇవెంట్ లో తెలుగు వారు దాదాపు 1500 మందికి పైగా పాల్గొన్నారు. వివిధ దేశాల తెలుగు సంస్ధల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈవెంట్ స్పాన్సర్స్ ALMULLA EXCHANGE మరియు SUBHODAYAM వారి చేతుల మీదుగా దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కువైట్, ఇండియా జాతీయగీతాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఇండియన్ ఎంబసీ కమ్యూనిటీ ఎఫైర్స్ & అసోసియేషన్ ఫస్ట్ సెక్రటరీ శ్రీ కమల్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. కువైట్ లో ముప్పై నాలుగు సంవత్సరాలు ఘన చరిత్ర కలిగినటువంటి తెలుగు కళా సమితి తెలుగు సంస్కృతి సంప్రదాయ విలువలను కాపాడుతూ చేపడుతున్న ఎన్నో కార్యక్రమాలను ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేసారు. తెలుగు కళా సమితి కార్యవర్గ అధ్యక్షులు శ్రీ సాయి సుబ్బారావు గారు మాట్లాడుతూ… విచ్చేసిన ఇండియన్ ఎంబసీ ముఖ్య అతిధి శ్రీ కమల్ సింగ్ రాథోడ్ గారికి మరియు విరాళాలను ఇచ్చిన స్పాన్సర్ కి, శ్రీ ఎస్.ఎస్. తమన్ బృందానికి, తెలుగు కళా సమితి సభ్యులకు, సలహాదారులకు,ఎన్నికల సంఘానికి, మరియు అన్నింటికీ వెన్నంటి వుండి నడిపిన తమ కార్యవర్గ సభ్యులకు తమ కృతజ్ఞతలను మరియు అభినందనలను తెలిపారు కార్యక్రమ విశేషాలు, మునుపటి కార్యక్రమాలను క్లుప్తంగా తెలియ పరిచారు.తెలుగు వారి మనసుల్లో పాటల రూపంలో మనసును ఆయన స్వరంతో సేదతీరుస్తూ చిరస్థాయిగా నిలిచిపోయిన శ్రీ. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారికి మరియు పలుకులనే బాణాలుగా చేసి మన గుండెలకు సంధించి వాటిలో మైమరచిపోయేలా చేసిన అద్భుతమైన కవి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి తెలుగు కళా సమితి సభ్యులందరు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. “తెలుగు కళా సమితి” ఎగ్జిక్యూటివ్ కమిటీ మాట్లాడుతూ.. గత ఎన్నో సంవత్సరములుగా తెలుగు కళా సమితికి వెన్నంటే వుంటూ ఎన్నో ఈవెంట్స్ కి స్పాన్సర్స్ గా వుంటూ, ఈ కార్యక్రమం సుస్వర తమనీయానికి కూడా అదేవిధంగా ఆర్ధికంగా ఎంతో సపోర్ట్ చేస్తున్న మెయిన్ స్పాన్సర్లు ALMULLA EXCHANGE మరియు SUBHODAYAM PROPERTIES వారికి వారి ప్రోత్సాహానికి తమ ధన్యవాదములు తెలియజేసారు. ప్రధాన కార్యదర్శి శ్రీ వత్స గారు మాట్లాడుతూ…కరోనా విజ్రింబిస్తున్న సమయంలో ఎంతో మందికి తెలుగు కళా సమితి ద్వారా చేపట్టిన రక్తదాన శిబిరం ,ఆరోగ్య శిబిరం మరియు కోవిడ్ సమయం లో అవసరమైన ఔషదాలు, మాస్క్స్, నిత్యావసర వస్తవులను అందించడం జరిగింది. గురువారం జరిగిన ‘మీట్ అండ్ గ్రీట్’ ఇవెంట్ ఎంతో అద్భుతంగా జరగడం ఆనందదాయకం. సహాయ సహ కారాలను అందించిన వారిని మరియు వారికి తోడ్పడిన ప్రతి ఒక్కరి కి తమ కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కమిటీ సభ్యులకు,దాతలుమరియు ప్రకటన కర్తలకు, తమన్ మరియు వారి బృందానికి, లేడీస్ వింగ్, వాలంటీర్స్, సలహాదారుల కమిటి మరియు ఆటపాటలతో అలరించిన పిల్లలకు, పెద్దలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి తమ అభినందనలను ధన్యవాదములను తెలిపారు. తమన్ బీట్స్ మరియు దాదాపు యాభై పాటలతో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం దద్దరిల్లింది సభ్యులందరు కేరింతలు,నృత్యాలు మరియు ఆనందో త్సాహాలతో కన్నుల పండుగగా తమన్ సుస్వర తమనీయం ఆద్యతం అలరించింది. తదనంతరం స్పాన్సర్స్ , తమన్ మరియు వారి బృందం, మిగతా సంస్థల అధ్యక్షులకు మరియు ఇండియన్ ఎంబసీ ముఖ్య అతిధి శ్రీ కమల్ సింగ్ రాథోడ్ గారిని “తెలుగు కళా సమితి” కార్యవర్గం జ్ఞాపికలతో సత్కరించారు. “తెలుగు కళా సమితి” స్మారక చిహ్నమైనటువంటి ‘సావెనీర్’ వార్షిక సంచికను తెలుగు కళా సమితి కార్యవర్గం అంగరంగ వైభవంగా విడుదల చేసారు.
బీజేపీ కూటమి అధికారంలో ఉన్న తమిళనాడు చేజారుతుందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో తమకు నష్టం కలిగించే అవకాశం ఉన్న చిన్నమ్మ శశికళ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. January 21, 2021 at 7:30 AM in Editors Pick, National, Politics Share on FacebookShare on TwitterShare on WhatsApp పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం బీజేపీ కూటమి అధికారంలో ఉన్న తమిళనాడు చేజారుతుందని సర్వేలు చెబుతున్న విషయం తెలిసిందే. ఆ సర్వేలను బీజేపీ ఎంతవరకు విశ్వసించిందనే విషయం పక్కన బెడితే.. బీజేపీ తన వ్యూహంలో మార్పులు చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకు, తమ కూటమిలోని AIADMKకి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉన్న చిన్నమ్మ శశికళ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. శశికళ ఈ నెల 27న విడుదల జయలలిత ఆప్త మిత్రురాలు, తమిళనాట చిన్నమ్మగా పిలిచే వివేకానంద్ కృష్ణవేణి శశికళ అలియాస్ శశికళ అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నారు. ఆమె ఈ నెల 27న విడుదల కానున్నారు. జయలలిత చనిపోయాక శశికళ AIADMK అధినేత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సీఎం కావాలని ఆశించారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆమె జైలుకి వెళ్లాల్సి వచ్చింది. నాలుగేళ్ల తరువాత విడుదల అవుతున్నారు. తరువాత జరిగిన పరిణామాలు, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తన మేనల్లుడు దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర ఖజగం పార్టీని పెట్టారు. ఈ పార్టీయే ఇప్పుడు బీజేపీకి మింగుడు పడని అంశంగా మారింది. రాష్ట్రంలోనూ శశికళకు అభిమానులున్నారు. AIADMKలోనూ ఆమె వర్గం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమె బయటకు రావడం, ఇప్పటికే ఆమెపై సానుభూతి ఉండడం, ఆ సానుభూతి తగ్గకముందే అంటే..రెండు నెలల్లోనే ఎన్నికలు ఉండడం. అంతేగాక.. తన మేనల్లుడి పార్టీ సారధ్య బాధ్యతలు ఆమె తీసుకుంటే..కచ్చితంగా AIADMKపైనా, బీజేపీపైనా విమర్శలు చేయడం కచ్చితం అనే విశ్లేషణలు వస్తున్న తరణంలో తమ కూటమి ఓట్లు చీలతాయని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ విధానాల ప్రభావం అంతంతే.. తమిళనాడులో బీజేపీ సైద్ధాంతికంగా నమ్ముకున్న హిందూత్వ, మేకిన్ ఇండియా లాంటి నినాదాల ప్రభావం కంటే తమిళ సెంటిమెంట్, జయలలిత పేరు, శశికళపై సానుభూతి లాంటి అంశాలే ఎక్కువగా ప్రభావం చూపుతాయి. గతంలోనూ ఇదే జరిగింది. అందుకే జాతీయ స్థాయి పార్టీలు కూడా అక్కడ ద్వితీయశ్రేణి పార్టీలుగానే ఉండాల్సిన పరిస్థితి దశాబ్దాలుగా వస్తోంది. ఈ పరిస్థితుల్లో జరగనున్న నష్టాన్ని నివారించుకునేందుకు బీజేపీ కొన్ని అప్రకటిత రాయభారాలకు తెరలేపిందని చెబుతున్నారు. రెండు రోజులుగా దినకరన్‌తో బీజేపీలోని నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు అక్కడ వార్తలు వస్తున్నాయి. హామీలు.. సంకేతాలు.. తమిళనాడులో రాజకీయ దిగ్గజాలైన మాజీ ముఖ్యమంత్రులు జయలలిత , కరుణానిధి మరణించడంతో రాష్ట్రంలో రాజకీయంగా కొంత స్తబ్దత ఏర్పడింది. ఆ స్థాయి ఇమేజ్ ఉన్న లీడర్ లేరని చెప్పవచ్చు. 2016లో బీజేపీ అండతోAIADMK అధికారంలో ఉంది. ఇక ఎప్పటి నుంచో డీఎంకే, కాంగ్రెస్ కూటమిగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో స్టాలిన్ ఒక్కరే అక్కడ కీలక నేతగా ఉన్నారు. AIADMKలో పన్నీరు సెల్వం లేదా ప్రస్తుత సీఎం పళనిస్వామి ఉన్నా.. స్టాలిన్‌ను ఎదుర్కోవాలంటే.. బిగ్ షాట్ ఉంటాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శశికళకు ఆ స్థాయి ఇమేజ్ ఉందని, ఒంటరిగా పోటీ చేస్తే అంతా నష్టపోతామని, కలిసొస్తే ‘పెద్ద’పదవి దక్కుతుందన్న హామీ ఇవ్వడమే అజెండాగా దినకరన్‌తో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద శశికళ మళ్లీ రాజకీయంగా కీలకంగా మారతారా అనేది నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది అమ్మ మక్కల్ మున్నేట్ర ఖజగం పార్టీని ఒంటరిగా పోటీ చేయించి AIADMK, BJPలను ఓడించడం, రెండోది సైద్ధాంతికంగా వ్యతిరేకమైనా సరే.. DMKకూటమితో కలవడం, మూడోది AIADMK, bjp కూటమితో కలసి రావడం, నాలుగోది తమిళనాడులో ఓటర్లు ముప్పై ఏళ్ల తరువాత 2016లో వరుసగా రెండోసారి ఒకేపార్టీని (AIADMK) గెలిపించారు. రానున్న ఎన్నికల్లో మరోసారి అంటే వరుసగా మూడోసారి గెలిపిస్తారా అనే అంశంకూడా చర్చకు వస్తోంది. ఈ అంశాల్లో మూడో అంశమే శశికళ మళ్లీ పూర్వవైభవం పొందేందుకు దగ్గరదారి అవుతుందనే అంచనాలున్నాయి. వ్యతిరేకతపై ఒత్తిడి.. ఇక శశికళ మళ్లీ AIADMKలో చేరేందుకు తాము ఒప్పుకునేది లేదని సీఎం పళనిస్వామి మంగళవారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. శశికళ మళ్లీ AIADMKలో చేరేందుకు సరే నంటే.. పళనిస్వామిని ఒప్పించడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే..బీజేపీ ముందస్తుగా కొందరు నాయకులను చర్చలకు పంపించినట్లు తెలుస్తోంది. Tags: aiadmk party updatesbjp changes stand on sasikalaedappadi k palaniswamisasikala release newstamil nadu politicstelugu newstelugu news updates
National Read a Book Day 2022 – నేషనల్ రీడ్ ఎ బుక్ డే అనేది దేశంలోని పుస్తక ప్రియులందరికీ ఒక ట్రీట్, ఎందుకంటే ఇది ప్రజలను పుస్తకాలు చదవమని ప్రోత్సహిస్తుంది & ఇది సెప్టెంబర్ 6న వస్తుంది. ఇటీవలి నివేదిక ప్రకారం, దాదాపు 81% మంది అమెరికన్లు తాము అంతగా చదవడం లేదని భావిస్తున్నారు. కాబట్టి మీరు ఈ వ్యక్తులలో ఉన్నారా, పుస్తకాలను చదవడానికి జాతీయ పుస్తక దినోత్సవాన్ని ఒక సాకుగా ఉపయోగించుకోండి. నా ఉద్దేశ్యం మనం డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాము మరియు మన జీవితంలో చాలా వరకు మన పనిలో మరియు స్మార్ట్‌ఫోన్‌లతో ఇప్పటికే బిజీగా ఉన్నాము కాబట్టి పుస్తకాలు చదవడానికి మనకు సమయం దొరకడం లేదా? నిజమైన పుస్తక ప్రేమికులు ఎల్లప్పుడూ పుస్తకాలు చదవడానికి సమయాన్ని వెతుక్కోవచ్చు కాబట్టి ఇది ఒక సాకులా అనిపిస్తుంది. అందువల్ల పుస్తక పఠనం యొక్క ఈ మంచి అలవాటు పట్ల ప్రజలను ప్రోత్సహించడానికి మరియు దాని ప్రయోజనాల గురించి వారికి అవగాహన కల్పించడానికి యునైటెడ్ స్టేట్స్ తన నేషనల్ రీడ్ ఎ బుక్ డేని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 6న జరుపుకుంటుంది. నేషనల్ రీడ్ ఎ బుక్ డే హిస్టరీ: మానవ చరిత్రలో చాలా కాలం క్రితం నుండి పఠనం ప్రసిద్ధి చెందింది, పుస్తకాలు పరిచయం కాకముందు కూడా ప్రజలు తమ రచనలను తాళపత్రాలు లేదా ఆకులపై వ్రాసేవారు. అయినప్పటికీ దాని సంక్లిష్టత కారణంగా ఇది చాలా పరిమితం చేయబడింది మరియు మొదటి శతాబ్దం A.D లో చైనాలో కాగితం ప్రవేశపెట్టబడినప్పుడు అదే సమయంలో పుస్తకాలు వచ్చాయి. ఆపై ప్రింటింగ్ ప్రెస్ ప్రవేశపెట్టినప్పుడు పుస్తకాలు ప్రపంచాన్ని అన్నింటినీ తీసుకువెళ్లాయి. మరియు గూటెన్‌బర్గ్ బైబిల్ ఐరోపాలో ప్రింటింగ్ ప్రెస్‌ని ఉపయోగించి ముద్రించబడిన మొట్టమొదటి పుస్తకాలలో ఒకటి, ఇది సగటు వ్యక్తికి విస్తృతంగా అందుబాటులో ఉంది. కానీ 19వ శతాబ్దం చివరిలో మరియు 20వ శతాబ్దం ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్‌లో అక్షరాస్యత పెరగడం వల్ల పుస్తకాలు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి, ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు పుస్తకాలు చదవగలుగుతున్నారు. ఆపై నవలలు మన ప్రపంచాన్ని ఆక్రమించాయి, అవి బాగా ప్రాచుర్యం పొందాయి, తరువాత సినిమాల కోసం కూడా తీసుకోబడ్డాయి, మనం స్పష్టంగా ఆలోచించగలిగేది హ్యారీ పాటర్. National Read a Book Day 2022 కామిక్ పుస్తకాలను చదవడం పట్ల పిల్లలలో ఆసక్తిని పెంచడానికి నవలల గురించి మాత్రమే కాదు, అక్కడ నుండి మాత్రమే మేము చాలా మంది సూపర్ హీరోలను పొందాము, ముఖ్యంగా మార్వెల్ మరియు DC కామిక్స్ మరియు తరువాత ఇవి ప్రస్తుత కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలలో ఒకటిగా మారాయి. కానీ కాలం గడిచేకొద్దీ పుస్తక పఠన ధోరణి కూడా బాగా తగ్గిపోయింది. కానీ సాంకేతికత మారినందున పుస్తక పఠన పద్ధతి కూడా మారిపోయింది, 2010 నాటికి USలోని 66% పబ్లిక్ లైబ్రరీలు మాత్రమే ఇ-పుస్తకాలను అందించడం ప్రారంభించాయి మరియు ఇప్పుడు ఇది లైబ్రరీలలో చాలా సాధారణం. నేషనల్ రీడ్ ఎ బుక్ డే ప్రాముఖ్యత: ఇప్పుడు చాలా విషయాలు డిజిటల్‌గా ఉన్నప్పటికీ, మేము ఖచ్చితంగా ఇ-బుక్స్ చదవమని మీకు సిఫార్సు చేస్తాము, కానీ దానితో పాటు భౌతిక పుస్తకాలను కూడా చదవడానికి ప్రయత్నించండి, ఇది పూర్తిగా భిన్నమైన అనుభవం కాబట్టి మీరు ఏదైనా పుస్తక ప్రియులను అడిగితే అది ఏమిటో చెబుతారు. పుస్తకం చదవాలని అనిపిస్తుంది. ఇప్పటికీ దాదాపు 74% మంది అమెరికన్లు గత ఏడాదిలో కనీసం ఒక పుస్తకాన్ని చదివారు. కాబట్టి స్పష్టంగా ఇది డెడ్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉంది, అయితే ఇది మీకు సరిపోతుందని నాకు చెప్పండి? నా ఉద్దేశ్యం ప్రకారం పుస్తకాలను పురుషుల మంచి స్నేహితులలో ఒకటిగా పిలుస్తారు మరియు దాదాపు 26% మంది ప్రజలు ఇప్పటికీ ఒక సంవత్సరం పాటు తమ స్నేహితులకు దూరంగా ఉంటారు. మరియు ఈ రోజు పుస్తక పఠనం యొక్క మంచి అలవాటు గురించి అవగాహన పెంచడానికి మరియు ఇప్పుడు మీరు పుస్తకాలు చదవడం ఎలా మంచి అలవాటు అని అడగవచ్చు కాబట్టి ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది, నిద్రలో మీకు సహాయపడుతుంది, మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. పదజాలం, నిరుత్సాహపరిచే సమస్యల నుండి మీ దృష్టిని మళ్లించడానికి మరియు మీ మెదడు శక్తిని బలోపేతం చేయడానికి ఇది మంచి మార్గం. కాబట్టి మీరు పుస్తకాలు ఎందుకు చదవాలి మరియు ఎందుకు చదవకూడదు అనేదానికి చాలా కారణాలు ఉన్నాయి. అందుకే ఈ రోజు పుస్తక పఠనాన్ని ఒక వీయ్ మంచిగా ప్రోత్సహిస్తుంది, ప్రతి వ్యక్తి దానిని అవలంబించాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. మరియు పుస్తక ప్రియుడిగా కాకపోతే కనీసం పుస్తకాలతో కొంచెం ఎక్కువ సమయం గడపండి. నేషనల్ రీడ్ ఎ బుక్ డే కార్యకలాపాలు: ఒక పుస్తకాన్ని చదవండి, అదే రోజు యొక్క పాయింట్. అయితే ఈ రోజున మీరు చదవాల్సినవి మరింత గుర్తుండిపోయేలా చేస్తాయి, తద్వారా ఇది మాకు ప్రత్యేకంగా ఉంటుంది. అందుకోసం ఈ రోజు కంటే ముందుగా గూగుల్‌లో నెట్ సర్ఫింగ్ చేయండి మరియు ఆ రోజు రద్దీని నివారించడానికి మీ ఆసక్తికి సంబంధించిన పుస్తకాలను వెతకండి. మీరు లైబ్రరీని చివరిసారి ఎప్పుడు సందర్శించారు? చాలా కాలం క్రితం ఉన్నట్లు కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటే, ఈ రోజును లైబ్రరీలకు వెళ్లి, ఈ రోజు చదవడానికి మీ ఆసక్తికి సరిపోయేవి అక్కడ మీరు దొరుకుతున్నారో మీరే చూడండి. ఈ రోజు గురించి మీ స్నేహితులందరికీ తెలియజేయండి మరియు మీతో ఈ రోజును జరుపుకోవడానికి ఎవరైనా సహచరుడిని కనుగొనండి, అయితే అతను తప్పనిసరిగా పుస్తకాలపై ఆసక్తిని కలిగి ఉండాలి, తద్వారా మీరిద్దరూ ఈ రోజున పుస్తకాల గురించి అర్థవంతమైన సంభాషణను జరుపుకోవచ్చు మరియు అలా చేయడంలో ఇది సహాయపడుతుంది పుస్తకాల గురించి మీ జ్ఞానాన్ని పెంచుకోండి.
మీరిచ్చిన స‌హ‌కారం, మ‌నోధైర్యంతో ముఖ్యమంత్రిగా మీ ముందున్నా.. సీబీఆర్ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ‘జయహో బీసీ మహాసభ’ను విజయవంతం చేయండి నాగ‌ళ్ల‌వ‌ల‌స మీదుగా చీపురుపల్లికి ఆర్టీసీ బ‌స్సు సీబీఆర్‌లో సీఎం వైయస్‌ జగన్‌ బోటింగ్‌ పెనుమాకలో తాగునీటి స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం `పార్నపల్లి` చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌ చంద్రబాబూ ...నీకు ఇదేం కర్మ అని ప్రజలు అంటున్నారు న‌వ‌ర‌త్నాల‌తో పేద కుటుంబాల్లో వెలుగులు పోలవరం వద్ద రక్తికట్టని చంద్రబాబు డ్రామా You are here హోం » ప్రత్యేక వార్తలు » వియ్‌ వాంట్‌ స్పెషల్‌ స్టేటస్‌.. వియ్‌ వాంట్‌ స్పెషల్‌ స్టేటస్‌.. 31 Dec 2018 12:56 PM పార్లమెంటు ఆవరణలో ఎంపీ విజయసాయి రెడ్డి నిరసన.. ఢిల్లీఃపార్లమెంటు ఆవరణలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేకహోదా గళాన్ని వినిపించారు. వియ్‌ వాంట్‌ స్పెషల్‌ స్టేటస్‌ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.చంద్రబాబుకు విలువలు లేవని..మిడిల్‌ మోదీ,జూనియర్‌ మోదీ అంటూ కేసీఆర్,జగన్‌లను చంద్రబాబు వర్ణించడం పట్ల ఫైర్‌ అయ్యారు.నాలుగు సంవత్సరాలు చంద్రబాబు మోదీతో చేసింది కాపురమా..వ్యభిచారమా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాలుగు లక్షల కోట్లు దోపిడీ చేశారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత చంద్రబాబు డబ్బంతా కక్కిస్తామన్నారు. డిసెంబర్‌కల్లా ఏపీలో అమరాతిలో హైకోర్టు భవనం పూర్తిచేస్తామని చంద్రబాబు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ ఫైల్‌ చేశారన్నారు. ఆ అఫిడవిట్‌ ఆధారంగా సుప్రీంకోర్టు డైరెక్షన్, ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. ఆ నోటిఫికేషన్‌ ప్రకారం ఏపీలో హైకోర్టును స్థాపించారన్నారు.ఎవరైనా హైకోర్టు వస్తుందంటే సంతోషపడతారు.కాని చంద్రబాబు వంటి దుర్మార్గ ముఖ్యమంత్రి హైకోర్టు వస్తుందంటే విమర్శలు గుప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. జగన్‌ కోసం హైకోర్టును విభజించారని చెప్పడం దారుణమన్నారు. హైకోర్టు విభజనపై తప్పుడు సమాచారం ఇచ్చిన చంద్రబాబుపై కోర్టు ధిక్కరణ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోస కేసీఆర్‌ మద్దతు స్వాగతిస్తున్నామన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు చిత్రావ‌తి బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బోటింగ్ - ఫొటో గ్యాల‌రీ చిత్రావ‌తి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ - ఫొటో గ్యాల‌రీ మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై స్పందించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. రాజగోపాల్ రెడ్డి ఒక హీరో లాగా యుద్ధం చేశారని.... ఒక్క బీజేపీ కోసం ఇంత మంది ఏకమయ్యారని ఆయన ఫైరయ్యారు. Siva Kodati First Published Nov 6, 2022, 7:55 PM IST ఓటమి ఎదురైనంత మాత్రాన తాము కుంగిపోయేది లేదన్నారు తెలంగాన బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్. మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించినప కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా తీర్పును తాము తప్పుకుండా శిరసా వహిస్తామని ఆయన పేర్కొన్నారు. గెలిచినా, ఓడిపోయినా నిరంతరం ప్రజల కోసం బీజేపీ పనిచేస్తుందని బండి సంజయ్ తెలిపారు. 2018లో బీజేపీ అభ్యర్ధిగా మనోహర్ రెడ్డి పోటీ చేశారని.. అప్పుడు అనుకున్న స్థాయిలో ఓట్లు రానప్పటికి పార్టీని మునుగోడులో బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ALso REad:మునుగోడు బైపోల్ 2022: రెండు రౌండ్లు మినహా అన్నింటిలో టీఆర్ఎస్‌దే పైచేయి బీజేపీ సిద్ధాంతాలు నచ్చి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరారని బండి సంజయ్ అన్నారు. బీజేపీ గెలుపుకోసం ఆయన తీవ్రంగా శ్రమించారని.. ప్రచారం చేసుకోనివ్వకుండా కొందరు గూండాలు అడ్డుకున్నప్పటికీ వెనక్కి తగ్గలేదన్నారు. రాజగోపాల్ రెడ్డి హీరోలాగా కొట్లాడారని బండి సంజయ్ ప్రశంసించారు. బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్‌లతో పాటు బైండోవర్ కేసులు పెట్టారని.. రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరించారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా తలొగ్గకుండా కార్యకర్తలు పనిచేశారని బండి సంజయ్ కొనియాడారు. మునుగోడులో గెలిచిన వెంటనే టీఆర్ఎస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని.. హామీలు నెరవేర్చుతామని మాత్రం చెప్పడం లేదని సంజయ్ ఫైర్ అయ్యారు. దమ్ముంటే టీఆర్ఎస్‌లో చేరిన 12 మందితో రాజీనామా చేయించాలని ఆయన సవాల్ విసిరారు. ఈ గెలుపు తండ్రి గెలుపా..? కొడుకు గెలుపా..? అల్లుడి గెలుపా అని సంజయ్ ప్రశ్నించారు. 11 వేల మెజార్టీతో గెలుపు గెలుపే కాదని.. బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పరోక్షంగా కాంగ్రెస్ కలిసి పనిచేశాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీది ఒక్క పైసా కూడా దొరకలేదని సంజయ్ ధ్వజమెత్తారు. మంత్రుల కాన్వాయ్‌, అంబులెన్స్‌లు, వ్యాపార సంస్థల గోడౌన్‌ల ద్వారా డబ్బులు పంపారని ఆయన ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ రూ.1000 కోట్లు ఖర్చు చేసిందని సంజయ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌ను అడ్డుకునేది ఒక్క బీజేపీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
దేవుడు అనుగ్రహించు పాల్ వెర్హోవెన్ . రెచ్చగొట్టే వ్యక్తి ఈ సంవత్సరం క్లాసిక్ కాథలిక్ చిత్రాలపై దృష్టి సారించాడు, తన సాహసోపేతమైన 'బెనెడెట్టా'లో మతం యొక్క నిర్మాణాలను అణచివేయడం మరియు సవాలు చేయడం, ఇప్పుడు వివాదాస్పద పండుగ రన్ తర్వాత పరిమిత విడుదలలో ఆడుతున్నాడు. మతంపై వెర్హోవెన్ యొక్క స్పష్టమైన లైంగికత నిస్సారమైన రెచ్చగొట్టేదా లేదా విశ్వాస సంస్థలలోని అవ్యక్త లింగ పక్షపాతం హింస మరియు దుర్వినియోగానికి ఎలా దారితీస్తుందో లోతైన విశ్లేషణ? నేను నిజాయితీగా పూర్తిగా ఖచ్చితంగా తెలియదు. వెర్హోవెన్ తన ఉద్దేశ్యపూర్వకంగా రద్దీగా ఉండే స్క్రీన్‌ప్లేలో చాలా ఆలోచనలను విసిరిన సందర్భాలు ఉన్నాయి, అది లెజెండరీ 'అరిస్టోక్రాట్స్' జోక్ యొక్క నాటకీయ వెర్షన్ వలె దృష్టి కేంద్రీకరించబడలేదని అనిపిస్తుంది. ఇంకా ఇది అతని కెరీర్‌కు పరాకాష్టగా భావించే సందర్భాలు కూడా ఉన్నాయి, లైంగికత, అవినీతి, విచ్ఛిన్నమైన వ్యవస్థలు మరియు రెచ్చగొట్టడాన్ని ఒక మనోహరమైన కథగా ఎలా మారుస్తుందో అతను అనివార్యంగా తీయబోతున్నాడు. నాకు ఖచ్చితంగా తెలియదు అన్ని పని చేస్తుంది, కానీ పరిగణలోకి తీసుకోవడానికి మరియు అన్‌ప్యాక్ చేయడానికి మరియు చాలా సరళంగా ఆనందించడానికి చాలా ఉన్నాయి, దానిని విస్మరించడం అసాధ్యం. పాల్ వెర్హోవెన్ తేలిగ్గా కొట్టిపారేయగలిగే సినిమాలు చేయడు. ప్రకటన బెనెడెట్టా కార్లిని 17 సంవత్సరాల ప్రారంభంలో నిజమైన సన్యాసి వ ఉత్తర ఇటలీలోని ఒక చిన్న గ్రామమైన పెస్సియాలో శతాబ్దం. ఆమె దేవుని తల్లి యొక్క కాన్వెంట్‌కు మఠాధిపతిగా ఉన్నప్పుడు ఆమె తన సన్యాసినులలో ఒకరితో సంబంధాన్ని కలిగి ఉందని నివేదించబడింది మరియు పాపసీ దాని గురించి తెలుసుకున్నప్పుడు ఆమె ర్యాంక్ తొలగించబడింది మరియు జైలు పాలైంది. ఆమెకు దర్శనాలు ఉన్నాయని నివేదించింది మరియు కళంకం కూడా పొందింది. 1619లో, ఆమె తనను తాను జీసస్ సందర్శించినట్లు పేర్కొంది, ఆమె తనను వివాహం చేసుకుంటానని బెనెడెట్టాతో చెప్పింది. ప్రజలు బెనెడెట్టా యొక్క ప్రకటనలను ప్రశ్నించడం ప్రారంభించారు మరియు తదుపరి పరిశోధన నిషేధించబడిన సంబంధాన్ని వెల్లడించింది. వెర్హోవెన్ ఒక పుస్తకంలో ఒకసారి వివరించిన ఈ అసాధారణ కథను స్వీకరించాడని చెప్పడం చాలా తక్కువ అంచనా. జుడిత్ సి. బ్రౌన్ అని పిలిచారు అసంబద్ధమైన చర్యలు: పునరుజ్జీవనోద్యమ ఇటలీలో లెస్బియన్ సన్యాసిని జీవితం , అతను మాత్రమే చేయగలిగిన రీతిలో. రెండు పాత్రలు ఒకదానికొకటి మలవిసర్జన చేసిన తర్వాత ఒక విధమైన శృంగార క్షణాన్ని కలిగి ఉండటంతో అతను శరీరం మరియు దాని పనితీరుపై తన మోహాన్ని స్పష్టంగా చూపించాడు. ఒక పక్షి ఒక మనిషి కంటిలో పడినప్పుడు మరియు ఒక స్టేజ్ షోలో ఒక వ్యక్తి తన అపానవాయువును వెలిగించినప్పుడు ఇది వాస్తవానికి దాని కంటే ముందుగానే ఉంటుంది. ఇంకా వీటన్నింటిని కేవలం వెర్హోవెన్ ప్లేఫుల్‌నెస్‌గా ఎవరూ రాయకూడదని అనిపిస్తుంది. దానికి ఇంకా ఉంది. అన్నింటికంటే, బెనెడెట్టా చెప్పినట్లు, 'మీ చెత్త శత్రువు మీ శరీరం.' స్త్రీ శరీరం దాని అన్ని అవసరాలు మరియు విధులలో అంతర్గతంగా పాపాత్మకమైనదిగా కనిపించే ప్రపంచం ఇది. వెర్హోవెన్ దానిని అన్వేషించడానికి ప్రయత్నిస్తాడు, ఆ శరీరాన్ని పూర్తి ప్రదర్శనలో ఉంచాడు మరియు మతపరమైన ఐకానోగ్రఫీ ద్వారా ఫిల్టర్ చేయబడిన శరీర అవసరాలకు మొగ్గు చూపుతాడు. వర్జీనీ ఎఫిరా బెనెడెట్టా మొదటిసారిగా ఒక అమ్మాయిగా పరిచయం చేయబడి, గొప్ప వ్యక్తి పోషించిన మఠాధిపతి నిర్వహించే కాన్వెంట్‌కు తప్పనిసరిగా విక్రయించబడటంతో నిర్భయంగా ఉంది షార్లెట్ రాంప్లింగ్ . చిన్నతనంలో కూడా, ఆమె శరీరం ఆస్తి, సరైన ధర కోసం కాన్వెంట్‌కు బేరం చేసింది. 'బెనెడెట్టా' టైటిల్ క్యారెక్టర్‌కి యేసు దర్శనాలు రావడంతో 18 సంవత్సరాలు ముందుకు దూకింది. క్రీస్తు యొక్క ఈ వ్యక్తీకరణలు నిజమైనవా లేదా చర్యలో భాగమా? బెనెడెట్టా యొక్క ఉద్దేశ్యాలు దాదాపు ఒక రహస్యం వలె మొత్తం చలనచిత్రం యొక్క గాలిలో వేలాడుతూ ఉంటాయి, కానీ వెర్హోవెన్, కనీసం ఈ వీక్షకుడికి, ఆమె విశ్వాసం యొక్క సమస్యల కంటే ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం గురించి వారు వెల్లడించే విషయాలపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తుంది, ముఖ్యంగా ఆ ప్రేరణలు ఎలా ప్రభావం చూపుతాయి కాన్వెంట్ మరియు మరియు ది నూన్సియో వంటి నీచమైన పురుషులు, ఎగతాళి చేసేవారు లాంబెర్ట్ విల్సన్ . ప్రకటన వాస్తవానికి, బార్టోలోమియా రాక తర్వాత విశ్వాసం యొక్క సమస్యలు దేహాభిమానానికి సంబంధించిన సమస్యలకు విరుద్ధంగా ఉన్నాయి ( డాఫ్నే పటాకియా ), ఒక యువతి తన దుర్వినియోగ కుటుంబం నుండి పారిపోయింది. కాన్వెంట్‌లో పెరిగిన యువతి కంటే ఎక్కువ ప్రాపంచికమైనది, ఆమె తన కామం మరియు ఆమె పిలుపుల మధ్య నలిగిపోతున్న బెనెడెట్టా కోసం కోరిక యొక్క వస్తువు అవుతుంది. మరలా, బెనెడెట్టా బార్టోలోమియాను వేడినీటిలో తన చేతులను ఉంచమని బలవంతం చేయడం లేదా వర్జిన్ మేరీ విగ్రహం నుండి ఆహ్లాదకరమైన వస్తువును కలిగి ఉండటం వంటి సన్నివేశాలలో వెర్హోవెన్ శారీరక విపరీతంగా ఆడతాడు. అయితే, వెర్హోవెన్ యొక్క అనేక ఉల్లాసభరితమైన టచ్‌లలో ఒకదానిలో, బెనెడెట్టా తన మొదటి ఉద్వేగం తర్వాత యేసు పేరు చెప్పింది. 'క్రీస్తును తెలుసుకోవాలంటే బాధ మాత్రమే మార్గం' అని ఒక పాత్ర చెబుతుంది. వెర్హోవెన్ ఆ ప్రకటనను ప్రశ్నించవచ్చు. లైంగిక సంబంధం అభివృద్ధి చెందిన తర్వాత మరియు కాన్వెంట్‌లో మరియు చుట్టుపక్కల విషయాలు అక్షరాలా నరకానికి వెళ్లడం ప్రారంభించిన తర్వాత-కామెట్ మరియు ప్లేగు ఉంది, ఇది చాలా చలనచిత్రం-“బెనెడెట్టా” కొద్దిగా ఆకారాన్ని కోల్పోయింది. నేను మొదట చేసిన దానికంటే తక్కువ సీరియస్‌గా తీసుకోకూడదా అని నేను ఆశ్చర్యపోతున్నాను. వెర్హోవెన్ ఆ వేదికపై తన విశ్వాసం యొక్క అస్థిపంజరాల నుండి పరిగెడుతూ, వారి దిశలో తన అపానవాయువును వెలిగించే ప్రదర్శనకారుడు కావడం సాధ్యమేనా? క్యాంప్ మరియు వ్యాఖ్యానాల మధ్య ఉన్న బూడిదరంగు ప్రాంతం నావిగేట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది మరియు 'బెనెడెట్టా' అలాగే కొన్ని గత వెర్హోవెన్ పని చేస్తుందని నాకు ఖచ్చితంగా తెలియదు. నాకు ఒక విషయం తెలుసు - ప్రయత్నించడానికి ఇష్టపడే అతనిలాంటి వారిని దేవుడు కాపాడుతాడు. ఇప్పుడు థియేటర్లలో ఆడుతోంది. సమీక్షలు పండుగలు & అవార్డులు రోజర్ ఎబర్ట్ ఫార్ ఫ్లంగర్స్ ఇంటర్వ్యూలు చాజ్ జర్నల్ కేన్స్ నుండి రావెన్ ఎవాన్స్ టీవీ/స్ట్రీమింగ్ లక్షణాలు వీడియో గేమ్‌లు
యాకోబు దేవునితో పోరాడిన దానికంటే దేవుడు యాకోబుతో ఎక్కువగా పోరాడుతున్నాడు. ఈ పోరాడుతున్నది నిబంధన పురుషుడైన మనుష్య కుమారుడే. దేవుడే మనిషి రూపంలో పాత యాకోబు జీవితాన్ని పిండి చేస్తున్నాడు. ఉదయమయ్యే వేళకు దేవుడు గెలిచాడు. యాకోబు తొడ ఎముక స్థానం తప్పింది. యాకోబు పడిపోతూ దేవుని చేతుల్లోకి ఒరిగిపోయాడు. ఆయన మెడ పట్టుకుని వేలాడుతూ ఆశీర్వాదం దొరికేదాకా పోరాటాన్ని కొనసాగించాడు, క్రొత్త జీవితంలో ప్రవేశించాడు. మనిషి దైవస్వరూపి అయ్యాడు. భూలోకం పరలోకానికి ఎదిగింది. తెల్లవారిన తరువాత అతడు నీరసంగా కుంటుతూ వెళ్ళాడు. అయితే దేవుడు అతనితో ఉన్నాడు. ఆకాశవాణి ప్రకటించింది, "నీవు దేవునితోను మనుష్యలతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు" మారిన ప్రతి జీవితంలోను ఇది ఒక ప్రామాణిక దృశ్యం కావాలి. దేవుడు మనలను ఒక ఉన్నతమైన సేవకు పిలిచినప్పుడు మన సాధన సంపత్తులన్నీ మనల్ని విడిచిపోయినప్పుడు, మనకందరికీ అత్యయిక పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి. మనం చెయ్యగలమనుకున్న దానికంటే ఉత్కృష్టమైన బాధ్యత ఎదురైనప్పుడు, దేవుని సహాయాన్ని పొందాలంటే ఏదో ఒకదాన్ని పరిత్యజించాలి, లోబడాలి. మన స్వంత జ్ఞానం, స్వనీతి, స్వశక్తి మొదలైనవాటిని విడిచి క్రీస్తుతోబాటు శ్రమలపాలై ఆయనతో కలసి తిరిగి లేవాలి. అత్యవసర పరిస్థితుల్లోకి మనల్నేలా తీసుకువెళ్ళాలో ఆయనకు తెలుసు. బయటకి ఎలా తీసుకురావాలో కూడా తెలుసు. ఆయన నిన్నిలా నడిపిస్తున్నాడా? ప్రస్తుతం నీకున్న శ్రమలు, కష్టాలు, అసాధ్యమైన విపత్కర పరిస్థితులు.. వీటన్నిటి అర్థమీదేనేమో. ఆయన తోడు లేకుండా సాగలేని పరిస్థితి నీకు ఏర్పడినది ఇందుకేనేమో. మరీ ఇప్పుడు కూడా నీ విజయ సాధనకు సరిపోయినంతగా ఆయన శక్తిని నీలో నిలుపుకోవెందుకు? యాకోబు దేవుని వైపుకి తిరుగు, నిస్సహాయంగా ఆయన పాదాలమీద వాలిపో. నీ స్వశక్తిని, నీ జ్ఞానాన్ని తోసిపుచ్చి ఆయన ప్రేమగల హస్తాల్లో కుప్పకూలిపోయి యాకోబులాగా ఆయన శక్తితో తిరిగి నిలబడు. ఉన్నతమైన క్రొత్త అనుభవాలను పొంది దేవుని స్థాయికి పెరగడంద్వారానే నీకు విడుదల కలిగేది. నీ పాదాలే శరణు నా సర్వస్వం నీదే జీవించినా మరణించినా బాధలు గెల్చినా చావు గెల్చినా ప్రభువు కోసమే Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
thesakshi.com : ఏపీలో రెండేళ్ల ముందుగానే ఎన్నిక‌ల హాడ‌విడి మొద‌లైపోయింది. ఒక వైపు ప్ర‌తిప‌క్ష పార్టీ ప్ర‌జ‌ల్లోనే ఉంటుంటే మ‌రో వైపు అధికార‌పార్టీ నేత‌లు కూడా ఎదో ఒక కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల్లో ఉండే ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు రోజుకో రొడ్డు షో తో ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. ప్ర‌తిప‌క్ష తెలుగు దేశం ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌క‌డుతూ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హాస్తోంది. అందులో భాగంగా తెలుగు దేశం చెప‌ట్టిన కార్య‌క్ర‌మాల్లో ఒక్క‌టైన బాదుడు బాదుడు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో స్పంద‌న వ‌స్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నందున అలాంటి ఓట్లను చీలనివ్వకుండా చూడాలన్నది పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. పవన్ కామెంట్స్ తో టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఐతే జనసేనతో పొత్తుకు టీడీపీ తలుపులు తెరిచినా.. పవన్ మాత్రం వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తు ద్వారా ప్రభుత్వ అధికార పార్టీని గద్దె దింపే ఆస్కారం ఉందని రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ పొత్తు కోసం జనసేన, బీజేపీలకు పరోక్షంగా సంకేతాలిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మ‌రో వ్యూహానికి తెర‌తీశారు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ద‌త్త‌పుత్రుడు, ద‌త్త‌పుత్రుడు అంటూ ప‌దే ప‌దే వ్యాఖ్య‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే అదంతా ఆయ‌న మైండ్‌గేమ్‌లో భాగ‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను ప‌రిశీలించినా జ‌గ‌న్ ప్ర‌ణాళిక ఏమిటో స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంద‌టున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌ణాళిక ప్ర‌కారం రాబోయే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన పొత్తు పెట్టుకోవాలి. చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకోవాలంటే జన‌సేన భార‌తీయ జ‌న‌తాపార్టీని వ‌దిలేయాలి. ఆ పార్టీతో మిత్ర‌ప‌క్షంగా అంట‌కాగినంత‌కాలం పొత్తుకు అవ‌కాశం లేదు. బీజేపీ త‌న మ‌న‌సు మార్చుకొని చంద్ర‌బాబునాయుడితో పొత్తు పెట్టుకోవ‌డానికి ముందుకు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయి. జ‌గ‌న్ ప్ర‌ణాళిక ప్ర‌కారం బీజేపీని కాకుండా తెలుగుదేశం పార్టీతో జ‌న‌సేన పొత్తుపెట్టుకుంటే పోటీచేసే ప్ర‌తిప‌క్షాల సంఖ్య ఎక్కువ‌వుతుంది. ఎన్నిక‌ల్లో వైసీపీకి అదే క‌లిసివ‌స్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. వైసీపీ ఒక‌వైపు, తెలుగుదేశం-జ‌న‌సేన మ‌రోవైపు, బీజేపీ విడిగా, కాంగ్రెస్ విడిగా, వామ‌ప‌క్షాలు విడిగా పోటీచేస్తాయి. దీనివ‌ల్ల ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలే అవ‌కాశం ఉంటుంద‌ని జ‌గ‌న్ అంచ‌నా వేస్తున్నారు. అలాకాకుండా రెండు లేదా మూడు పార్టీలు క‌లిసి ఒక కూట‌మిగా ఏర్ప‌డి పోటీచేస్తే వైసీపీకి న‌ష్టం జ‌రుగుతుంది. అందుకే ఆయ‌న బీజేపీ లేని తెలుగుదేశం-జ‌న‌సేన పొత్తు కోసం ఎదురుచూస్తున్నారు. ప్ర‌తిప‌క్షాల ఓట్ల‌లో చీలిక తేవ‌డంద్వారా అధికారం సులువ‌వుతుంది. తెలుగుదేశం-జ‌న‌సేన పొత్తులో రెండు పార్టీల మ‌ధ్య ఓట్ల బ‌దిలీ ఎంత‌మేర‌కు జ‌రుగుతుంద‌నే అనుమానం ఆ రెండు పార్టీల్లో కూడా ఉంది. వైసీపీకి కూడా ఇదే కావాలి. అందుకే జ‌గ‌న్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మైండ్‌గేమ్ ఆడుతున్నారు. ప‌దే ప‌దే ద‌త్త‌పుత్రుడంటూ వ్యాఖ్యానించ‌డంద్వారా జ‌న‌సేనాని రెచ్చ‌గొట్టి బీజేపీ లేకుండానే టీడీపీవైపు బ‌లంగా మ‌ళ్లేలా ప్ర‌య‌త్నిస్తున్నారంటూ సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌లు భావిస్తున్నారు. ఎవ‌రి వ్యూహాలు ఫ‌లిస్తాయో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడ‌క త‌ప్ప‌దు మ‌రి.!! Tags: #andhrapradesh politics#AP POLITICAL#JANASENA#NaraChandrababuNaidu#PAWANKALYAN#TeluguDesamParty#yskagan#YSRCP
తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ గట్టిగానే కష్టపడుతుంది. బలమైన అధికార టీఆర్ఎస్‌ పార్టీకి చెక్ పెట్టి…నెక్స్ట్ తాము అధికార పీఠం దక్కించుకుని…తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలనే లక్ష్యంగా బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు తెలంగాణలో బీజేపీకి బలం లేదు…2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకటే సీటు గెలుచుకుంది. అంటే బీజేపీ బలమెంత ఉందో అర్ధం చేసుకోవచ్చు…కానీ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న దగ్గర నుంచి…తెలంగాణలో బీజేపీ దూకుడు మొదలైంది. రెండు ఉపఎన్నికల్లో గెలవడం, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటడం…ఇలా వరుసగా బీజేపీ దూకుడుగా రాజకీయాలు చేస్తూ వచ్చింది…దీంతో టీఆర్ఎస్ పార్టీకి పోటీగా బీజేపీ రాజకీయం చేస్తుంది. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలో గెలిచి సత్తా చాటాలని చూస్తుంది. టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ తీవ్ర స్థాయిలో నడుస్తోంది. అయితే మునుగోడు విషయం పక్కన పెడితే…రాష్ట్ర స్థాయిలో కూడా రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. అసలు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అన్నట్లు పరిస్తితి వచ్చింది. రాజకీయ యుద్ధంలో అలా కనిపిస్తుంది గాని…క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పార్టీతో పాటు బలంగా బీజేపీ లేదు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కంటే వెనుకే ఉంది. కానీ ఇప్పుడుప్పుడే బీజేపీ బలం పెంచుకుంటూ వస్తుంది. అయితే బీజేపీ నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి నియోజకవర్గంలో బలమైన నాయకుడు కావాలి. మరి బీజేపీకి అలాంటి నాయకులు ఉన్నారంటే..పెద్దగా లేరనే చెప్పాలి. అలాగే చాలా నియోజకవర్గాల్లో బలమైన కేడర్ లేదు. కాకపోతే బలమైన నాయకుడు ఉంటే ఆటోమేటిక్ గా కేడర్ కూడా వస్తుంది…కాబట్టి ఇప్పుడు బీజేపీకి గెలుపు గుర్రాలు కావాలి. అయితే ఆ మధ్య వచ్చిన మస్తాన్ సర్వేలో టీఆర్ఎస్ పార్టీకి 80 పైనే నియోజకవర్గాల్లో బలమైన నాయకులు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 50 పైనే స్థానాల్లో బలమైన నాయకులు ఉన్నారని తేలింది…కానీ బీజేపీకి మాత్రం కేవలం 30 లోపు స్థానాల్లో మాత్రమే బలమైన నాయకులు ఉన్నారని తేల్చి చెప్పారు. అంటే బీజేపీకి ఇంకా ఎంత బలం కావాలో ఊహించుకోవచ్చు. ఇక ఇప్పటికిప్పుడు బీజేపీలో బలమైన నాయకులని తయారు చేయడం కష్టం…కాబట్టి టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల్లో ఉన్న బలమైన నాయకులని తీసుకుంటేనే బీజేపీకి గెలుపు అవకాశాలు మెరుగు అవుతాయని ఆ సర్వే చెప్పింది. ఇక ఆ దిశగానే బీజేపీ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా బండి సంజయ్ కూడా…గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని ప్రకటించారు. ఇక ఆ గెలుపు గుర్రాలని ఎంచుకోవడమే బీజేపీ పని…ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలతో పాటు…బీజేపీలో దూకుడుగా పనిచేసే నేతలు కూడా ఉన్నారు. వారు రోజురోజుకూ పుంజుకుంటున్నారు. అలాంటి వారికి కూడా సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే రేసు గుర్రాలతోనే బీజేపీ బండి నడవాల్సింది…ఇందులో ఎలాంటి పొరపాటు జరిగిన బీజేపీకి చిక్కులు తప్పవు. మరి బీజీపీకి రేసు గుర్రాలు దొరుకుతారో లేదో చూడాలి.
రంగనాయక సాగర్‌, సిద్ధిపేట సమీపంలోని కోమటి చెరువులలో చేప పిల్లలు, రొయ్య పిల్లలను రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, తన్నీరు హరీష్‌ రావులు విడుదల చేసి, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ వద్ద తెలంగాణ విజయ డెయిరీ నూతన ఔట్‌ లెట్‌ ను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ, కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని, మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతున్నదని పేర్కొన్నారు. వచ్చే ఒకటి రెండు సంవత్సరాలలో ఫెడరేషన్‌ ద్వారా మత్స్య సహకార సంఘాల నుండి చేపలను కొనుగోలు చేసి మార్కెట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. అప్పటి వరకు మత్స్యకారులు మత్స్య సంపదను స్థానికంగా తక్కువ ధరకు అమ్మకుండా ఎక్కువ డిమాండ్‌ ఉన్న హైదరాబాద్‌, ఇతర రాష్ట్రాల్లోని బహిరంగ విపణిలో విక్రయించి లాభాలు పొందాలన్నారు. మత్స్య సంపదను మరింతగా పెంపొందించేందుకు పంపిణీ చేస్తున్న చేప పిల్లల నాణ్యత, సైజ్‌ విషయంలో రాజీపడకుండా, అవకతవకలకు అవకాశం లేకుండా చేప పిల్లల విడుదల ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం జల వనరులలో 93 కోట్ల చేప పిల్లలు, 20 కోట్ల రొయ్య పిల్లలను వదిలే కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం చేయబడ్డ మత్స్య రంగాన్ని తెలంగాణ వచ్చాక సీఎం కేసీిఆర్‌ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి శ్రీనివాస యాదవ్‌ అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెరువుల్లో 365 రోజులు నీళ్ళు ఉండడం, ఉచిత చేప పిల్లల విడుదల వల్ల మత్స్య సంపద పెరిగేలా చూస్తున్నారని అన్నారు. మార్కెటింగ్‌ చేసుకునేందుకు మత్స్యకారులకు సబ్సిడీపై ద్విచక్ర వాహనాలను, ఆటోలను అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీష్‌ రావు సూచన మేరకు మొబైల్‌ ఔట్‌ లెట్‌లకు ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విజయ డైరీ నీ తెలంగాణ లో 750 కోట్ల వార్షిక టర్నోవర్‌ సాధించే స్థాయికి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. బహిరంగ విఫణిలో ప్రైవేట్‌ సంస్థల తో పోటీ పడుతూ వాటన్నింటి కంటే ముందంజలో విజయ డైరీని నిలిపామన్నారు. తెలంగాణలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఒకప్పుడు చేపలంటే.. కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారనే భావన ఉండేదని, కానీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఏడేండ్లలోనే చేపలను ఉత్తర భారతంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని చెప్పారు. గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు మంచి డిమాండ్‌ ఉందన్నారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని సిద్ధిపేట జిల్లా నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్‌ కొత్త వెలుగులు తీసుకొచ్చారని, రాష్ట్రంలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారని వెల్లడిరచారు. సిద్ధిపేట జిల్లాలో రూ.4.87 కోట్లతో అన్ని జలాశయాలు, చెరువుల్లో 4 కోట్ల 19 లక్షల చేప, రొయ్య పిల్లలను వదులుతున్నామని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. గుక్కెడు మంచి నీళ్లకోసం గోసపడ్డ ప్రాంతం ప్రస్తుతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నదని తెలిపారు. తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా, ధాన్యపు భాండాగారంగా భాసిల్లుతున్నదని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధాన్యపు సిరులు, మత్స్య సంపద కళ్లముందు కనబడుతున్నదని చెప్పారు. మత్స్య సంపద పెరగడంతో మత్స్యకారులకు ఆదాయంతో పాటు ప్రజలకు ఆరోగ్యం పెంపొందుతున్న దన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. సాంప్రదాయ వృత్తులను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్‌ అని మంత్రి హరీష్‌ రావు కొనియాడారు. షామీర్‌ పేట చెరువులో ….. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్‌ నియోజక వర్గంలోని శామీర్‌పేట్‌ చెరువులో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న చొరవతో తెలంగాణలో ఊహించనంత మత్స్య సంపద వస్తుందన్నారు. కులవృత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ ఆశయం అన్నారు. చెరువులు అన్నింటిని అన్ని విధాలుగా లాభదాయకంగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్‌ జిల్లాలో దాదాపు 414 చెరువులున్నాయని వాటిలో ఒక కోటి చేప పిల్లలు విడుదల చేసే యోచన లో ప్రభుత్వం ఉందని చెప్పారు. కూడా 96 లక్షల చేపలు చెరువులలో విడుదల చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. చెరువులను పటిష్ట పర్చడం ద్వారా వాటి చుట్టూ ఆర్థిక కార్య కలాపాలను ప్రోత్సహించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు .
Shocking Love: ప్రేమ గుడ్డిది.. ప్రేమ పిచ్చిది.. ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటుంటారు. అయితే వీటిని నిరూపించడానికి అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయేమో! అవును.. మీరు వింటున్నది నిజమే.. ఏ వయసులో అయినా ఎవరితోనైనా ప్రేమ పుట్టవచ్చు.. ఎప్పుడైనా ప్రేమలో పడవచ్చు. ఇక ప్రేమిస్తే ఎంతకైనా తెగించడం, ఎక్కడి వరకైనా వెళ్లడం సహజమే.. కానీ కొన్ని ప్రేమ జంటలు చేసే పనులు షాకింగ్ గా ఉంటాయి. అయితే ఆ ప్రేమ జంటే షాకింగ్ అయితే.. ఇప్పుడు అలాంటి షాకింగ్ లవ్ గురించి మీరే చదవండి.. ప్రేమకు అంతరాలు ఉండవు. దీన్ని నిరూపించాలనుకుందో ఏమో.. ఈ థాయిలాండ్ ప్రేమజంట. అతని వయసు 19సంవత్సరాలు. నిండు యవ్వనంలో ఉన్న యువకుడు. ఆమె 56 సంవత్సరాల మహిళ. పండు ముసలితనానికి పది రోజుల దూరంలో తాను ఉంది. అయితే థాయిలాండ్ కు చెందిన ఈ 19 ఏళ్ల యువకుడు 56 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. అంతటితో ఆగకుండా వారిద్దరి వివాహ నిశ్చితార్థం కూడా పూర్తి అవడంతో అందరు ఆశ్చర్యపోయారు. అసలు విషయానికొస్తే.. ఉతిచాయ్ చంతరాజ్ అనే ఈ యువకుడు 9సం.ల వయసు నుండే 56సం.ల జన్లా నమువాన్ గ్రాక్ ను ప్రేమిస్తున్నట్లు తెలుస్తుంది. మొదటి అందరు సరదాగా తీసుకున్నారు కానీ.. అతడిలో ప్రేమ మాత్రం అలాగే పెరిగింది. నాయనమ్మ వయసు కలిగిన ఆ మహిళపై అతడి ప్రేమ.. ఇప్పుడు వివాహం వరకు వెళ్లడంతో అందరు షాక్.. ఆమెతో జరిగిన నిశ్చితార్థం వేడుకల ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో.. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. సినిమాల్లో కామెడీ సీన్లలో కనిపించే ఇలాంటి సంఘటన నిజంగా జరిగే సరికి అందరు ఒకింత ఆశ్చర్యానికి గురి అయ్యారు. అందరు రకరకాలుగా మాట్లాడుతున్నా.. తాను చేసింది మాత్రం సరైనదేనని.. ఉతిచాయ్ చంతరాజ్ చెప్పుకొస్తున్నాడట. ఏదేమైనా అంత వయసున్న ఆవిడను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం సాహసోపేత నిర్ణయమని జనాలు చర్చించుకుంటున్నారు. కొందరు వింతగా, విచిత్రంగా ఈ సంఘటనను భావిస్తుండగా.. మరి కొందరు ట్రోల్ చేస్తున్నారు. Cinema Cinema news movie news Abhinaveen Achary Previous articleDaggubati Rana: దగ్గుబాటి ఇంట్లో ‘డబుల్ గుడ్’ న్యూస్.. తండ్రి కాబోతున్న రానా, అంతే కాదు… Next articlePragathi Aunty: డబ్బులు లేక చివరకు అలా చేయాల్సి వచ్చిందన్న నటి ప్రగతి.. ఆమెలోని చీకటి కోణం ఇదే!
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు విడివిడిగా వివాదాలకు ప్రసిద్ధులు. అలాంటివారు ఒకరికి ఒకరు తోడైతే.. ఇక రచ్చ రచ్చే! విశాఖపట్నం నోవాటెల్ హోటల్ లో అదే జరిగింది. వ్యవసాయ టెక్నాలజీపై అంతర్జాతీయ సదస్సుకోసం విశాఖపట్నం వచ్చిన ఎమ్మెల్యేలలో ఆ ఇద్దరూ భిన్నంగా వ్యవహరించారు. తమకు వసతి కేటాయించిన హోటల్ ను కాదని నోవాటెల్ లోనే కావాలని పట్టుపట్టారు. అదీ… అర్ధరాత్రి వేళ అనూహ్యంగా రచ్చ చేశారు. అగ్రిటెక్ సదస్సుకోసం వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధుల సాక్షిగా పరువు బజారున పడుతుందన్న ఇంగిత జ్ఞానమైనా లేకుండా దాాదాగిరికి దిగారు. ఆ ఇద్దరూ నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు. ఈపాటికి మీకు అర్ధమయ్యే ఉంటుంది వారెవరో…! ఒకరు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగంటి రామకృష్ణ. మరొకరు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఎపి ఆగ్రిటెక్ సమ్మిట్ 2017 పేరిట రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ, బిల్ అండ్ మెలిండా గేట్స్ సహకారంతో 15, 16, 17 తేదీల్లో కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి చివరి రోజున బిల్ గేట్స్ కూడా హాజరయ్యారు. అదే రోజున రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సుకోసం వివిధ దేశాలు, వివిధ రంగాలనుంచి హాజరైన ప్రముఖులకు నిర్వాహకులు వేర్వేరుగా వసతి ఏర్పాట్లు చేశారు. విదేశీ ప్రతినిధులు, రాష్ట్ర మంత్రులకు నోవాటెల్ హోటల్లో వసతి ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు, ఇతరులకు మారియట్ హోటల్లో రూములు బుక్ చేశారు. అంతా బాగానే ఉన్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఏమైందో ఏమో.. గురువారం రాత్రి నోవాటెల్ హోటల్ లో వీరంగం వేశారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం… వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణతో మొదలైంది రచ్చ. ఎప్పుడూ ముందుండే చింతమనేని ఈసారి సెకండరీ రోల్ ప్లే చేసినట్టు చెబుతున్నారు. తమకు అక్కడే వసతి కేటాయించాలని రామకృష్ణ హోటల్ సిబ్బందిని డిమాండ్ చేశారు. దీనికి వారు ససేమిరా అనడంతో తామేంటో తెలుసుకోవాలని హెచ్చరించారు. బెదిరింపులు కేకలతో నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. ఈ రచ్చ తర్వాత వారికి కూడా అక్కడే రూములు బుక్ చేసినట్టు సమాచారం. దీనికోసం నిర్వాహకులు అదనపు రూములకు డబ్బు చెల్లించినట్టు చెబుతున్నారు. ఆగ్రిటెక్ సదస్సుకు ఎమ్మెల్యేలు హాజరైంది ఒక్కరోజు.. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్యమిచ్చిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం.. తాము అధికారంలో ఉన్న పార్టీ ప్రజా ప్రతినిధులు. ఇవేవీ వారిలో ఆలోచనను రేకెత్తించలేకపోయాయి. తమకు వేరొక హోటల్ లో వసతి కల్పించినా పట్టించుకోకుండా మంత్రులకు కేటాయించిన చోటనే కావాలని పట్టుపట్టడం వెనుక కారణమేమిటో తెలియదు. అంతకు ముందు పగటి సమయంలో ఇదే ఎమ్మెల్యేలు ప్రశాంతంగా పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను సందర్శించారు. చింతమనేని అయితే… తమ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల సందర్శన కోసం వచ్చిన సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సాదరంగా స్వాగతం పలికారు. మధ్యాహ్న సమయంలో విందు ఏర్పాటు చేశారు. దగ్గరుండి కొసరి కొసరి వడ్డించారు. ముఖ్యులకు పుష్పగుచ్ఛాలిచ్చి స్వాగతం పలకడం నుంచి ప్రాజెక్టుల సందర్శన పూర్తయ్యేవరకు అందరికీ తలలో నాలుకలా నడుచుకున్నారు. మరోవైపు రామకృష్ణ ఏ హడావిడీ చేయకుండా కూల్ గా గడిపారు. మరి రాత్రి అయ్యేసరికి వీరికి ఏమైందో…! వ్యవసాయంలో డ్రోన్లు, ఐఒటి వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై సదస్సు నిర్వహించి ప్రజాప్రతినిధులు కూడా నేర్చుకుంటారని అసెంబ్లీకి విరామమిచ్చి మరీ తీసుకెళ్తే… ఏదో ముతక సామెత చెప్పినట్టు తమ మొరటుతనాన్నే ప్రదర్శనకు పెట్టారు.
జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా? బీసీల పల్లకి మోస్తున్న జ‌న‌నేత సీఎం వైయ‌స్ జగన్‌ మళ్లీ వైయ‌స్‌ జగన్‌నే గెలిపించుకుందాం You are here హోం » టాప్ స్టోరీస్ » కుటుంబ పెద్దలా సీఎం వైయస్‌ జగన్‌ కష్టపడుతున్నారు కుటుంబ పెద్దలా సీఎం వైయస్‌ జగన్‌ కష్టపడుతున్నారు 21 Oct 2022 3:24 PM దేశంలో ఏపీని నంబర్‌ వన్‌గా నిలపడమే సీఎం లక్ష్యం మనకు నాయకుడు ఒక్కడే.. మన నాయకుడి నినాదం కూడా ఒక్కటే.. వైయస్‌ జగన్‌ తలపెట్టిన యజ్ఞం కొనలాగేలా అంతా అండగా ఉండాలి నోటికొచ్చినట్టు తిడుతున్నవారు.. మేం ఎదురుతిరిగితే మీరు తట్టుకోగలరా..? వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు: మనకు నాయకుడు ఒక్కడే.. మన నాయకుడి నినాదం కూడా ఒక్కటేనని, అదే సంక్షేమం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని సీఎం వైయస్‌ జగన్‌ నెరవేర్చారన్నారు. కుటుంబ పెద్దలా రోజుకు 16 గంటలు కష్టపడుతున్నారన్నారు. ఏపీని దేశంలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలపడమే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ‘పదేళ్లు ఎన్నో కష్టాలు పడి అధికారంలోకి వచ్చాం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చిన వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌. మన నాయకుడు చేసిన మంచిని చెప్పుకుని సగర్వంగా ప్రజల్లోకి వెళుతున్నాం. నిత్యవిద్యార్థిలా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌∙మోహన్‌ రెడ్డి పనిచేస్తున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా పట్టుదలతో పనిచేస్తున్నారు. కుటుంబ పెద్దలా రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారు. ఏపీని దేశంలోనే నంబర్‌–1గా నిలపడమే మన నాయకుడు వైయస్‌ జగన్‌ లక్ష్యం..మన లక్ష్యం. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని తప్పించాలని జరుగుతున్న కుట్రను భగ్నం చేయాలి. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలి. ఎన్నికల వేడి మొదలైపోయింది. జగన్‌మోహన్‌రెడ్డినే ఎందుకు గెలిపించుకోవాలో ప్రజలకు వివరించాలి. సీఎం వైయస్‌ జగన్‌ తలపెట్టిన యజ్ఞం కొనలాగేలా అంతా అండగా ఉండాలి. మనమేం చేశామో జనానికి చెప్పాలి. 2014లో ప్రజలు పట్టం కడితే చంద్రబాబు రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాడు. మనం ఏం చేశామో చెప్పుకోగలం. చెప్పుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేదు. ఓ నటుడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు వద్ద పవన్‌ తన అభిమానాన్ని తాకట్టు పెట్టాడు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని నోటికొచ్చిన బూతులు తిడుతున్నారు. మేం ఎదురుతిరిగితే మీరు తట్టుకోగలరా..?, మూడు రాజధానులు ప్రకటించిన తర్వాతే అమరావతి ప్రాంతంలో మనం అన్ని ఎన్నికల్లోనూ గెలిచాం. మూడు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలి. మూడు రాజధానుల వల్లే రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుంది. వికేంద్రీకరణపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలతో ఎవరూ రెచ్చిపోవద్దు. బండబూతులు తిడుతున్న వారికి బుద్ధి చెప్పాలి...ప్రజలకు మనం చేస్తున్న సంక్షేమం చెప్పాలి’ అని పార్టీ శ్రేణులకు, ప్రజలకు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
ఇండోనేషియాలో అనేక మంది మరణాలకు కారణం క్యాన్సర్. ఎందుకంటే క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందుతాయి మరియు శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరును దెబ్బతీస్తాయి. చాలా మంది క్యాన్సర్ రోగులు నివారణ రేటు మరియు ఆయుర్దాయం తెలుసుకోవాలని కోరుకునేది ఇదే. కాబట్టి, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బాధితులు పూర్తిగా కోలుకోగలరా మరియు వారి ఆయుర్దాయం ఎంత? రండి, ఈ క్రింది సమీక్షలో సమాధానాన్ని కనుగొనండి! కడుపు క్యాన్సర్ నయం చేయగలదా? కడుపు క్యాన్సర్ తరచుగా కడుపు నొప్పి మరియు ఛాతీలో మంట వంటి జీర్ణ రుగ్మతలకు కారణమవుతుంది, తరువాత రక్తపు మలం మరియు తీవ్రమైన బరువు తగ్గడం. నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, కడుపు క్యాన్సర్‌కు చికిత్స చేయవచ్చు, కానీ కొన్ని పరిస్థితులలో దీనిని పూర్తిగా నయం చేయలేము. నివారణ రేటు క్యాన్సర్ రకం, కణితి పరిమాణం, క్యాన్సర్ కనిపించే మరియు వ్యాప్తి చెందుతున్న ప్రాంతం మరియు మొత్తం రోగి యొక్క సాధారణ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. దశ 0లో, గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌ను ఎండోస్కోపిక్ విచ్ఛేదనం ద్వారా చికిత్స చేయవచ్చు. ఈ ప్రక్రియలో, ఉదర గోడ యొక్క అనేక పొరలు గొంతు ద్వారా ఎండోస్కోప్‌తో తొలగించబడతాయి. ఎండోస్కోపిక్ విచ్ఛేదనం యొక్క ఫలితాలు క్యాన్సర్ మొత్తం తొలగించబడిందని చూపిస్తే, రోగి తదుపరి చికిత్స అవసరం లేకుండా నిశితంగా పరిశీలించబడతారు. అయినప్పటికీ, ఫలితాలు స్పష్టంగా లేకుంటే, కీమోథెరపీ మరియు రేడియోథెరపీ సిఫార్సు చేయబడవచ్చు. మరొక ఎంపిక, క్యాన్సర్‌ను తొలగించడానికి మరింత విస్తృతమైన శస్త్రచికిత్స చేయబడుతుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌ను 1వ దశలో గుర్తించినట్లయితే, శస్త్రచికిత్స ద్వారా వ్యాధిని నయం చేయవచ్చు. ఈ దశలో, క్యాన్సర్ కణాలు కడుపు లేదా కడుపు లైనింగ్ యొక్క బయటి పొరలో మాత్రమే ఉంటాయి, లోతైన పొరలకు వ్యాపించవు. సాధారణంగా, ఎంపిక యొక్క చికిత్స అనేది సబ్‌టోటల్ గ్యాస్ట్రెక్టమీ (కడుపు లైనింగ్‌లో కొంత భాగాన్ని తొలగించడం) మరియు మొత్తం గ్యాస్ట్రెక్టమీ (మొత్తం కడుపు లైనింగ్‌ను తొలగించడం). కొన్నిసార్లు, సమీపంలోని శోషరస కణుపులు కూడా తొలగించబడతాయి. పొట్ట లేదా పొట్ట గోడలో పెరిగే స్టొమక్ క్యాన్సర్, కానీ ఆ ప్రాంతం దాటి వ్యాపించే సంకేతాలు కనిపించకపోయినా, శస్త్రచికిత్స ద్వారా తొలగించడం ద్వారా కూడా నయం చేయవచ్చు. క్యాన్సర్ కడుపులో లేదా కడుపు లైనింగ్‌లో పెద్ద కణితిని ఏర్పరుచుకుంటే, ముందుగా కీమోథెరపీ లేదా రేడియోథెరపీ చేయబడుతుంది. లక్ష్యం, కణితి యొక్క పరిమాణాన్ని తగ్గించడం. కణితి తగ్గిపోయిన తర్వాత, గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేయవచ్చు. శస్త్రచికిత్స చేయడానికి ముందు రోగి క్యాన్సర్‌ను ఖచ్చితంగా దశకు తీసుకురావడానికి అన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఆ విధంగా, క్యాన్సర్ శరీరంలో ఎంతవరకు మెటాస్టాసైజ్ అయిందో వైద్యులు తెలుసుకుంటారు. మరింత విస్తరించిన క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్స ప్రభావవంతంగా ఉండదు. శస్త్రచికిత్స తర్వాత దుష్ప్రభావాల ప్రమాదం మరింత తీవ్రంగా మారడం దీనికి కారణం. చాలా సందర్భాలలో, ఇతర ప్రాంతాలకు వ్యాపించిన గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సాధారణంగా పూర్తిగా నయం కాదు. అంటే, శరీరంలో ఇంకా క్యాన్సర్ కణాలు ఉన్నాయి. అయినప్పటికీ, చికిత్స కడుపు క్యాన్సర్ లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది మరియు క్యాన్సర్ పురోగతిని నెమ్మదిస్తుంది. క్యాన్సర్ దశను ఖచ్చితంగా గుర్తించడానికి రోగులు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ డయాగ్నస్టిక్ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఆ విధంగా, క్యాన్సర్ శరీరంలో ఎంతవరకు మెటాస్టాసైజ్ అయిందో వైద్యులు తెలుసుకుంటారు. మరింత విస్తరించిన క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్స ప్రభావవంతంగా ఉండదు. శస్త్రచికిత్స తర్వాత దుష్ప్రభావాల ప్రమాదం మరింత తీవ్రంగా మారడం దీనికి కారణం. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ రోగుల ఆయుర్దాయం ఆయుర్దాయం ఐదు సంవత్సరాల బెంచ్‌మార్క్‌ని ఉపయోగించి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ రోగుల శాతం గురించి ఒక ఆలోచనను ఇస్తుంది. సరే, ఆ సమయ వ్యవధి సాధారణంగా క్యాన్సర్ రోగులకు సెట్ స్కేల్. అంటే, రోగి ఎంతకాలం జీవించగలడో ఆయుర్దాయం రోగికి ఖచ్చితంగా చెప్పదు. ఈ ఆయుర్దాయం రోగులకు వ్యాధి నుండి ఎంతవరకు కోలుకునే అవకాశం ఉందో అర్థం చేసుకోవడానికి మాత్రమే సహాయపడుతుంది. ఉదాహరణగా, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ SEER ఆయుర్దాయం గణాంకాలను ఉపయోగిస్తుంది (నిఘా, ఎపిడెమియాలజీ మరియు ముగింపు ఫలితాలు) నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (NCI)చే నిర్వహించబడుతుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఆయుర్దాయం స్థానిక, ప్రాంతీయ మరియు సుదూర దశలుగా విభజించబడింది. స్థానికీకరించబడింది: క్యాన్సర్ కడుపు దాటి వ్యాపించినట్లు ఎటువంటి సంకేతం లేదు. ప్రాంతీయ: క్యాన్సర్ పొత్తికడుపు దాటి సమీపంలోని నిర్మాణాలు లేదా శోషరస కణుపులకు వ్యాపించింది. దూరం: క్యాన్సర్ కాలేయం వంటి సుదూర శరీర భాగాలకు వ్యాపించింది. కింది 5 సంవత్సరాల సాపేక్ష మనుగడ రేట్లు (AKHR) 2010-2016 మధ్య గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. మీరు స్థానికీకరించిన సమూహంలో చేర్చబడితే, AKHR 70%. అదే సమయంలో, ప్రాంతీయ మరియు సుదూర ప్రాంతాలుగా వర్గీకరించినట్లయితే, AKHR 32% మరియు 6%. అంచనా ఫలితాలను చదవడం చాలా కష్టం, కాబట్టి మీ పరిస్థితికి చికిత్స చేసే డాక్టర్ నుండి వివరణను చేర్చడం అవసరం. ఈ సంఖ్యలు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ దశకు మాత్రమే వర్తిస్తాయని మీరు తెలుసుకోవాలి. క్యాన్సర్ వృద్ధి చెందడం, వ్యాప్తి చెందడం లేదా చికిత్స తర్వాత మళ్లీ కనిపించినట్లయితే అంచనా ఫలితాలు తర్వాత తేదీలో చెల్లవు. వయస్సు, మొత్తం ఆరోగ్యం, క్యాన్సర్ చికిత్సకు ఎంత బాగా స్పందిస్తుంది మరియు ఇతర అంశాలు వైద్యుని తీర్పును ప్రభావితం చేస్తాయి.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో సీజన్ 2 ఆల్రెడీ గ్రాండ్ స్టైల్ లో ప్రారంభం అయింది. మూడవ ఎపిసోడ్ నవంబర్ 4న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ లో టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోస్ శర్వానంద్, అడివి శేష్ హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో సీజన్ 2 ఆల్రెడీ గ్రాండ్ స్టైల్ లో ప్రారంభం అయింది. సీజన్ 2 ప్రారంభ ఎపిసోడ్ కి మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ హాజరైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండవ ఎపిసోడ్ కి యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ అతిథులుగా హాజరయ్యారు. ఇక మూడవ ఎపిసోడ్ నవంబర్ 4న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ లో టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోస్ శర్వానంద్, అడివి శేష్ హాజరయ్యారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది. బాలయ్యతో చాట్ షో కాబట్టి శర్వానంద్, అడివి శేష్ ఎంతో ఉత్సాహంగా ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు యువ హీరోలు.. బాలయ్య మధ్య ఎంతో సరదాగా కొన్ని అద్భుతమైన ఫన్నీ మూమెంట్స్ తో సంభాషణ జరిగింది. శర్వానంద్, అడివి శేష్ రాగానే బాలయ్యకి సర్ప్రైజింగ్ గిఫ్ట్ తీసుకువచ్చారు. గత ఎపిసోడ్ లో తనకి రష్మిక అంటే క్క్రష్ అని బాలయ్య సరాదాగా చెప్పిన సంగతి తెలిసిందే. దీనిని శర్వానంద్ సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నాడు. శర్వానంద్ తన ఫోన్ ని బాలయ్యకి ఇచ్చాడు. అందులో వీడియోలో కాల్ లో రష్మిక ఉంది. దీనితో బాలయ్య కూడా ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ ఫోన్ ని బాలయ్య తన హృదయంలో దాచుకున్నట్లు పాకెట్ లో పెట్టుకున్నాడు. అలా బాలయ్య రష్మికపై తన చిలిపి కోరిక బయట పెట్టుకున్నాడు. ఇక బాలయ్య వరుస ప్రశ్నలతో అడివి శేష్, శర్వానంద్ లని ముప్పతిప్పలు పెట్టారు. నేను చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లలో ఎవరు యాక్టింగ్ లో బెస్ట్ అని అడిగారు. దీనితో శర్వానంద్ మహాప్రభో అంటూ బాలయ్యకి దండం పెట్టేశాడు. పెళ్లి ప్రస్తావన రాగానే.. ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవాల్సిన వారు శర్వానంద్, ప్రభాస్ ఇలా చాలా మంది ఉన్నారు. కాబట్టి నా పెళ్ళికి తొందర లేదు అని అడివి శేష్ చెప్పాడు. ఈ హీరోయిన్ తో మాత్రం కిస్సు వద్దురా బాబు అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది. అని బాలయ్య అడగగా.. వెంటనే అడివి శేష్ పూజా హెగ్డే పేరు చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనితో అంతా ఆశ్చర్యపోయారు. అసలు పూజా హెగ్డే గురించి అడివి శేష్ ఎందుకు అలా చెప్పాడో ఫుల్ ఎపిసోడ్ చూసే తెలుసుకోవాలి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Follow Us: Download App: RELATED STORIES అనుపమ పరమేశ్వరన్ కి బిగ్ షాక్... డీజే టిల్లు సీక్వెల్ నుండి అవుట్! Bigg Boss Telugu 6: ముందు ఒకలా, వెనకాల మరోలా.. రేవంత్‌ నిజ స్వరూపం బయటపెట్టిన ఫైమా.. పోటుగాడిలా అంటూ.. సినిమా రంగం విలువేంటో రాజకీయాల్లోకి వెళ్లొచ్చాక తెలిసింది.. గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిరంజీవి కామెంట్స్ మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై మళ్లీ బజ్.. తొలిచిత్రమే మల్టీస్టారర్ గా.. తనయుడి కోసం బాలయ్య అలా చేస్తారా?
కస్టమ్ బోర్డ్ గేమ్‌లు, కస్టమ్ డైస్, కస్టమ్ మినియేచర్‌లు మొదలైన మా ఉత్పత్తుల గురించిన విచారణల కోసం, దయచేసి మీ ఇమెయిల్‌ను మాకు పంపండి, మేము 24 గంటలలోపు టచ్‌లో ఉంటాము. కస్టమ్ బోర్డ్ గేమ్‌లు, కస్టమ్ డైస్, కస్టమ్ మినియేచర్‌లు మొదలైన మా ఉత్పత్తుల గురించిన విచారణల కోసం, దయచేసి మీ ఇమెయిల్‌ను మాకు పంపండి, మేము 24 గంటలలోపు టచ్‌లో ఉంటాము. ఇప్పుడు తెలుసుకోండి +86-574-87078248 [email protected] కాపీరైట్ © 2022 నింగ్బో గేమ్ డూయర్ మాన్యుఫ్యాక్చరింగ్ కో., లిమిటెడ్. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
‘గౌతం ‘ అనే కలం పేరు తో కార్టూన్లు గీస్తున్న నా పేరు తలాటం అప్పారావు. పుట్టింది 1965 జూన్ 2 న, తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం లో. నా కార్టూన్‌గేట్రం 1983 లో క్రోక్విల్ హాస్యప్రియ పత్రిక ద్వారా జరిగింది. అలా మొదలయిన నా కార్టూన్ల ప్రస్థానం 1993 వరకు సాగి దాదాపు గా అని ప్రముఖ వార, మాసపత్రికలలో నా కార్టూన్లు వచ్చాయి. నిజానికి నా కార్టూన్ హాబీ చిత్రంగా మొదలయింది. చిన్నతనం నుంచి చిత్రకళ మీద నాకు కాస్తో కూస్తో ప్రవేశం ఉంది. దానికి ప్రేరణ చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర లాంటి పిల్లల పత్రికలలోని బొమ్మలు. అప్పటిలో ప్రముఖ కార్టూనిస్టులు టీవీ(టీ. వెంకటరావు) మరియు సత్యమూర్తి గార్ల ‘ కార్టూన్లు గీయడం ఎలా? ‘ అనే కార్టూన్ పాఠాలు ఓ రెండు వార పత్రికల్లో (ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి) వచ్చేవి. ఆ పాఠాలు చూసి నాకు చిత్రకళ లో ఉన్న అనుభవంతో కార్టూన్లు గీయడం నాకు నేనుగా నేర్చుకున్నాను. Gowtham cartoons డిగ్రీ చేస్తున్నప్పుడు కార్టూనిస్ట్ అంగర వెంకటేశ్వరరావు (కలం పేరు కమల్‌), బొబ్బిలి శ్రీనివాసరావులు నా బెంచ్ మేట్ లు అనడం తో ఆగ్గికి ఆజ్యం పోసినట్టై కార్టూన్లు మేం పోటీ పడి గీశాం. షరా మామూలే – మొదట్లో నా కార్టూన్లు తిరిగి వచ్చేవి. అయితే మరింత పట్టు వదలని నా ప్రయత్నం వల్లన ఇదిగో ఇలా ఈ నాటికి సుమారు గా 1000 కార్టూన్లు వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి. టీవీ వీక్షణం, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, మొబైల్ ఫోన్లు… ఇలా సాంకేతిక అభివృతి వల్ల పుస్తక పఠనం, పత్రికలు రెండు కనుమరుగు అయిన తరువాత 1993 లో కార్టూన్లు గీయడం మానేశాను. అందరూ కార్టూనిస్టులు తమ కార్టూన్లను ఇపుడు సోషల్ మీడియా లో పెట్టడం చూసి కార్టూన్లు గీయడం పున: ప్రారంభించాను. cartoon book ఈ సోషల్ మీడియా పుణ్యమా అని కొంత మంది కార్టూనిస్టులు శ్రీయుతులు లేపాక్షి, ప్రసాద్ కాజ, కళాసాగర్, కొడాలి రామ రావు, లాల్(లక్ష్మణ రావు), హరికృష్ణ, అశోక భోగ, TR బాబు… ఇలా చాలా మంది పరిచయం అవడం ఆనందకరమైన విషయం. 80 వ దశకం లో మేము గీసిన కార్టూన్లతో పుస్తకం ప్రచురించాడు మిత్రుడు శ్రీనివాసరావు.
Wearing Jeans: కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ లలో తలదూర్చడం అనేది ప్రతి ఒక్కరూ చేసే పని.. ఇందులో యంగ్ ఓల్డ్ అనే తేడా లేకుండా పోయింది.. X Wearing Jeans: కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ లలో తలదూర్చడం అనేది ప్రతి ఒక్కరూ చేసే పని.. ఇందులో యంగ్ ఓల్డ్ అనే తేడా లేకుండా పోయింది.. ముఖ్యంగా దుస్తుల విషయంలో అయితే మరీనూ.. ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. జీన్స్ లో అయితే అమ్మాయిలతో పోటీ పడుతున్నారు బామ్మలు కూడా.. అయితే గంటల తరబడి జీన్స్‌ ధరిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఓ మహిళ 8 గంటల పాటు జీన్స్‌ ధరించి ఆసుపత్రి పాలైంది.. ఐసీయూలో దాదాపుగా నాలుగు గంటల పాటు చికిత్స పొంది ఇంటికి చేరుకుంది. తనకి ఎదురైన ఈ అనుభవాన్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో ఇప్పుడు ఈ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నార్త్‌ కరోలినాకి చెందిన 25 ఏళ్ల సామ్‌ మూడేళ్ల క్రితం తన బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి డేటింగ్‌కు వెళ్లింది. అక్కడ ఆమె బిగుతుగా ఉండే జీన్స్ ధరించింది. అక్కడి నుంచి 8 గంటల తర్వాత ఇంటికి చేరుకున్న ఆమెకి మెల్లిగా నడుము నొప్పి మొదలైంది. ముందు లైట్ తీసుకుంది. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో డాక్టర్ ని సంప్రదించింది. ఆమెకి సెప్సిస్‌, సెల్యులైటీస్‌ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు వెల్లడించారు. ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువైతే మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుందట. ముందుగా అమె ఆసుపత్రిలో చేరిన పరిస్థితి ఏం మారలేదు.. ఆ తర్వాత వెంటనే ఆమెను ఐసీయూకి షిఫ్ట్ చేసి అక్కడ ఎనిమిది గంటల పాటు డీబ్రిడ్మెంట్ చికిత్సను అందించారు. చికిత్స సమయంలో మాటిమాటికీ ప్యాంట్‌ను తీసి వైద్యులకు గాయాన్ని చూపించాల్సి వచ్చేదని, ఇది చాలా చేదు అనుభవమని ఆమె చెప్పుకొచ్చింది. దాదాపుగా మృత్యువుతో పోరాడి ఇంటికి చేరుకున్నానని తెలిపింది. ఇంత అరుదైన వ్యాధి జీన్స్‌ వల్ల ఎలా వస్తుందని సర్వత్రా చర్చ కోనసాగుతోంది.
మార్కెట్ లో సామాజిక దూరాన్ని పాటిస్తూ కూరగాయలు అమ్ముతున్న ఫోటో ను ఫేస్బుక్ లో పోస్టు చేసి, అది మణిపూర్ లోని ఒక మార్కెట్ లో తీసారని చెప్తున్నారు. అలాంటి ఫొటోనే (అర్చివ్ద్) మరి కొంతమంది పోస్టు చేసి, అది మిజోరాం లోని మార్కెట్ లో తీసారని పేర్కొంటున్నారు. వాటిల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం. ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు క్లెయిమ్: మణిపూర్ (ఇండియా) లోని మార్కెట్ లో సామాజిక దూరాన్ని పాటిస్తూ కూరగాయలు అమ్ముతున్న ఫోటో. ఫాక్ట్ (నిజం): ఫోటో మణిపూర్ (ఇండియా) లో గానీ, మిజోరంలో (ఇండియా) గానీ తీసినది కాదు. దానిని మయాన్మార్ దేశంలోని షాన్ రాష్ట్రం లోని ‘కలావ్’ మార్కెట్ లో తీసారు. కావున, పోస్టు లో చెప్పింది తప్పు. పోస్టు లోని ఫోటోని అదే క్లెయిమ్ తో ఒక యూజర్ ట్విట్టర్ లో పెట్టినప్పుడు, కామెంట్స్ లో మరొక యూజర్ ఆ ఫోటో మయాన్మార్ దేశంలోని షాన్ రాష్ట్రానికి సంబంధించిన ‘కలావ్’ మార్కెట్ లో తీసారని పేర్కొన్నాడు. @Chopsyturvey that pic is not in https://t.co/Woew8gzEHE is only the Kalaw market in Shan state of Myanmar. — kyawlin (@kyawlin18) April 24, 2020 ఆ సమాచారంతో, గూగుల్ లో కీ-వర్డ్స్ తో వెతికినప్పుడు, ఆ ఫోటో మయాన్మార్ దేశంలో తీసిందంటూ ట్విట్టర్ లో కొంతమంది యుజర్లు మరియు కొన్ని న్యూస్ బ్లాగ్లు పేర్కొన్నట్లుగా తెలిసింది. ఫోటోని రెండు దేశాల్లో తమ దేశానికి సంబంధించినవిగా షేర్ చేస్తున్నారు కాబట్టి, వాటిని ఎక్కడ తీసారో నిర్ధారించడానికి కొన్ని ఆధారాల కోసం చూద్దాం. ఆధారం-1: ‘కలావ్’ మార్కెట్ ఫోటోల కోసం గూగుల్ లో వెతికినప్పుడు, పోస్టులో ఉన్న ఫోటోలోని పరిసరాలతో ఉన్న మరొక ఫోటో లభించింది. ఆధారం -2: ఫోటోలోని హోర్డింగ్‌ పై ‘High Class’ బ్రాండ్‌ తో ఉన్న ప్రకటన చూడవచ్చు. ఆ సమాచారంతో గూగుల్ లో కీ-వర్డ్స్ తో వెతికినప్పుడు, అది ‘Seagram’s High Class – Myanmar’ ప్రకటన అని తెలిసింది. ‘Seagram’s High Class’ విస్కీ ని మయాన్మార్ లో అక్టోబర్ 2018 లో లాంచ్ చేసారు. అంతేకాదు, వివిధ సమయాల్లో అనేక ప్రకటనలతో ఉన్న అదే హోర్డింగ్‌ యొక్క మరికొన్ని ఫోటోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. (ఆ ఫోటోల లొకేషన్ కూడా మయాన్మార్ లోని ‘కలావ్’ మార్కెట్ అని ఉంది). ఆధారం -3: అదే మార్కెట్ యొక్క మరికొన్ని తాజా ఫోటోలు ట్విట్టర్‌లో లభించాయి. ఆ ఫోటోలలో కూరగాయలు అమ్ముతున్న వారు ‘mytel’ అనే పేరుతో ఉన్న గొడుగు కింద కూర్చుని ఉన్నారు. ‘mytel’ అనేది మయన్మార్‌లోని మొబైల్ నెట్‌వర్క్ సంస్థ. చివరగా, పైన పేర్కొన్న ఆధారాలతో, మార్కెట్ లో సామాజిక దూరాన్ని పాటిస్తూ కూరగాయలు అమ్ముతున్న ఈ ఫోటోలు మయాన్మార్ దేశంలోని షాన్ రాష్ట్రం లోని ‘కలావ్’ మార్కెట్ లో తీసినట్టు నిర్దారించొచ్చు.
The Largest Viewed Website of Kadapa (YSR) District. Kadapa News, Information, Politics, Photos, Videos, Villages, Train Timings, Tourism Spots, Fairs and Festivals and What not? శనివారం, జూన్ 29, 2013 శాసనాలలో రాయల కాలంనాటి చరిత్ర కృష్ణదేవరాయలు పెనుగొండ నుంచి హంపీ విజయనగరానికి గుర్రంపై స్వారీ చేస్తోంటే గుర్రం వెంట పరిగెడుతూ భూబానాయుడు గొడుగు పట్టాడట. ఇందుకు మెచ్చుకున్న రాయలు గొడుగుపాలునికి ఒక రోజంతా అగ్రహారాలనూ, మాన్యాలనూ దానం చేసే అధికారం ఇచ్చారట! ఆంద్రకవితా పితామహుడు అల్లసాని పెద్దన కోకటం గ్రామంలోని సకలేశ్వర స్వామి దీపారాధన కోసం పది ఖండుగల భూమిని దానంగా ఇచ్చినట్లు క్రీ.శ. 1518 నాటి కోకటం గ్రామ శాసనం తెలుపుతోంది.
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సోదరి షర్మిలతో పాటు టీడీపీ, ప్రతిపక్ష పార్టీల నేతలు, నందమూరి కుటుంబ సభ్యులు అందరూ తీవ్రంగా ఖండించారు. అయితే, అన్నగారి పేరు మార్పుపై ఇంత రచ్చ జరుగుతున్నా సరే ఆయన సతీమణిగా చలామణి అవుతున్న లక్ష్మీపార్వతి మాత్రం ఇంతవరకు ఆ వ్యవహారంపై స్పందించలేదు. వైసీపీ నేతగా కొనసాగుతున్న లక్ష్మీపార్వతి తన పదవి పోతుందనే ఉద్దేశంతోనే పేరు మార్పు వ్యవహారంపై స్పందించలేదని విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ పై లక్ష్మీపార్వతికి ఉన్న ప్రేమ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని మీడియా ఛానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఉన్నావా…అసలున్నావా అంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు లక్ష్మీ పార్వతిపై ట్రోలింగ్ మొదలెట్టాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని లక్ష్మీ పార్వతి పరోక్షంగా సమర్థించారు. వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగారు పేరు మార్పుపై ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం, యూనివర్సిటీ నుంచి ఎన్టీఆర్ పేరు తొలగించడం వంటి రెండు ఆప్షన్లలో తాను జిల్లా పేరు ఆప్షన్ నే ఎంచుకుంటానని అన్నారు. తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే ఊరుకోనని, అటువంటి వారిపై కేసులు పెడతానని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. తన వ్యక్తిగత జీవితంపై కొన్ని మీడియా సంస్థలు దాడి చేస్తున్నాయని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఇష్టానుసారంగా తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వివాహం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదంటూ ఫైర్ అయ్యారు. చరిత్రను ఎవరు చెరిపివేయలేరని తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. తనకు టెక్కలి సీటు ఆఫర్ చేసినా తీసుకోలేదని గతాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో ఎన్టీఆర్ మాట్లాడిన స్టేట్మెంట్లు చూసి అసలు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో తమ వివాహం గురించి చాలా స్పష్టంగా చెప్పారని లక్ష్మీపార్వతి అన్నారు. పేరు మార్పును సమర్థిస్తూ లక్ష్మీ పార్వతి చేసిన కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
” ఏమీ తెలియకుండా ఇంత రాత్రి వేళ ఇలా అఘాయిత్యానికి పూనుకున్నావా? భానూ! ” అన్నాను. అతని తలను నా ఎద కు హత్తు కుంటూ… ” ఏమో నీ అందం ఆకర్షించింది. నా వయస్సు… నీ వయసుతో సంబంధం లేదంది…. ఇంత కన్నా నాకేం తెలియదు. నా భార్యతో పడుకున్నప్పుడు కూడా నా దృష్టిలో నీ రూపే కదలాడేది.అది పురిటి కెళ్ళిన నెల్లాళ్ళుగా నీ మీద వ్యామోహం దిన దిన ప్రవర్ధ మాన మవుతూ వచ్చింది. నీ గురించి తల పోస్తూ నిద్రలేని రాత్రులెన్నో గడి పాను. ఈనాడలా గడపలేక ఇలా వచ్చాను ” అవి మెప్పుకోలు మాటలు కావు. అతని హృదయం లో గూడు కట్టుకున్న భావాలను యధాత ధం గా బైట పెట్టాడు. పక్కలో చేరినప్పుడల్లా మా వారు నన్ను పొగుడుతూనే ఉంటారు. ఆయన ప్రశంశలు నాకు అల వాటై పోయాయి. నాకన్నా చిన్న వాడైన భాను మూర్తి నా అందాన్నంతగా కొనియాడుతుంటే నా మనసు తుళ్ళిపడింది. ” ఈ రెండు గంటలూ ఈ శరీరం నీదే భానూ!… నీ కోర్కెను తిరస్కరించే శక్తి నాలో లేదు… రా… ” అంటూ అతన్ని మంచం వైపు లాగాను. ” థాం క్యూ… ” అంటూ ఆనందం పట్టలేక మంచం మీది కి ఒక్క ఎగురు ఎగిరాడు.. నేనూ మంచం మీది కి ఒరిగి, అతని ఒళ్ళో తలానించి నక్షతాల్లా మెరుస్తున్న ఆ కళ్లలోకి కొంటె గా చూశాను. అలా చూసినందుకు శిక్షగా నా నయనాలను ముద్దాడాడు. ఆ తర్వాత తన అధరాలతో నా అధరాలు అందుకున్నాడు. ఆ చుంబ నంలో నాకు ఊపిరి అందటం కూడా కష్ట మయింది. అతని చేతులు నా రొమ్ముల మీదికి పాకి ముచ్చికల్ని సుతారంగా నలుపుతున్నాయి. ” వద్దు భానూ… ప్లీజ్ ” అన్నాను. మాట వరసకు అన్నానే గానీ అందులో నిజమయినా ఆజ్ఞాపన లేదు. . ” నిన్ను నగ్నంగా ట్యూబ్ లయిట్ కాంతి లో చూడాల నుందోయ్ ” చిలిపిగా నవ్వుతూ అన్నాడు. ఆ సమయంలో నాకెందుకో మా వారితో గడిపిన మొదటి రాత్రి గుర్తొచ్చింది. అప్పుడు పదహారేళ్ల ముగ్ధ ను కనుక సిగ్గు మొగ్గ తొడిగి ముద్దలా ముడుచుకు పోయాను. ఇప్పుడింక సిదెక్కడిది? ” ఆశకు అంతుండాలోయ్ ” అంటూ మంచం దిగి పెట లాగే సుకున్నాను. ఎదురుగా గోడ కున్న స్విచ్చి వేసి ఇటు వైపు తిరిగాను. మంచం దిగి కన్నార్పకుండా నా వైపే చూస్తున్నాడు భాను మూర్తి. అతని లుంగీని చూడగానే నాకు నవ్వాగలేదు. పైట లేని నా స్థన సౌందర్యాన్ని చూసి కసెక్కి పోయాడే మో అబ్బాయిగారు… లుంగీ లోంచి నిగడదన్నేస్తున్నాడు. కుచ్చిళ్ళు పట్టుకుని గుంజే సరికి చీర కుప్పలా నా కాళ్ల దగ్గర పడింది. లంగా జాకెట్ లో మిగిలాను. జాకెట్ లోంచి ఎగదన్నుతున్న నా రొమ్ముల్నీ, లంగా బొందుల కు పైన లోతుగా దిగుడు బావిలా కనబడుతున్న నా బొడ్డు నీ ఆరాటంగా చూస్తున్నాడు భాను మూర్తి, అడుగు ముందుకేసి అతని లుంగీ ఒక్క లాగు లాగాను. చలన రహితంగా నిలువు గుడ్లేసుకుని చూడ్డం ఇప్పుడు నా వంతయింది. చిలగడ దుంపలా ఏపుగా ఉంది భాను మూర్తి అంగం. దాని పొడవు చూస్తుంటే అయ్య బాబోయ్ అని పించింది. ‘ ముగ్గురు బిడ్డల తల్లి లో ఇంత ఆకర్షణ , ఇంతటి పటుత్వం దాగుందని నమ్మలేక పోతున్నాను… ” నా అవయవాలన్నిటినీ అతి సున్నితంగా స్పృశిస్తూ మనసులో అనుకోవాల్సిన మాటను పెకే అనేశాడు భాను మూర్తి. ” నచ్చానటోయ్ ” అంటూ సన్నని అతని నడుము చుట్టూ చేతులేసి దగ్గరకు లాక్కున్నాను. భాను మూర్తి శరీరం కొలి మిలా కాలి పోతోంది. నా తొడల మధ్య వేడిగా గుచ్చుకుంటున్నాడు. ఉదే కంతో అదురుతున్న అధరాలతో నా మీద ముద్దులు గుప్పించడం మొదలు పెట్టాడు. ఆ ఆవేశం నన్ను చకితురాలిని చే సింది. వీటి పొగరు చూశావా.. చేతులకు చిక్కడం లేదు ” అన్నాడు ఉడుకు మోత్త నంతో వాటిని కసిక్కున కొరుకుతూ, నాకు బాధని పించలేదు. నవ్వొచ్చింది. ” పసి పిల్లాడిలా ఏమిటీ ఆట… భానూ ” ఆనందాతిశయంతో అతని వళ్లంతా ని మర సాగాను. ” అసలు నీ మీద నాకు వ్యామోహం కలగడాని కి ఈ బంగారు ముద్దలే కారణం. అందుకని… ” అర్దోక్తి లో వదిలేసిన వాక్యం కన్నా అతను చేస్తున్న పని నన్ను మరింత ఆశ్చర్యం లో ముంచే సింది. వేరు వేరుగా ఉన్న ఆ రెంటినీ ఏకం చేసి, వాటి శిఖరాగాలను ఒకే సమయంలో .. అధరాలతో అందు కోజూస్తున్న అతని ప్రయత్నం… నాకు సరికొత్త అనుభ వం! నా స్థన సౌందర్యం చూసి అత ను ఎందుకంత మురిసిపోతున్నాడో ఊహించగలను. అతని భార్య శ్యామల చాలా నాజూకు మనిషి. అర్ధాంగిలో లోపించిన అందాన్ని నాలో చూసి నా మీద మోజు పడ్డాడన్న మాట. అందుకే ఈ ఉదే కం. ” భరించలేను భానూ… మంచం మీద కు పోదాం ” అంటూ అతన్ని బలవంతంగా నడిపించబోయాను. ” ఉహూ…. అప్పుడే వద్దు.. ” మొండిగా నా చేతుల్లోంచి జారి కింద నా కాళ్ల కు అడ్డు పడ్డాడు. ఇంకేం కదల్ను? ” చీ… పాడు… అక్కడ నోరు పెడతావా? ” దాని గురించి వినడ మేగానీ అనుభ వం లేదు. నాలుక నా రెమ్మల మధ్య గరుకుగా తిరుగుతోంటే వంట్లో రక్తం ఉడుకెత్తింది. ఆ ముందు రోజు గీసుకున్న అతని గడ్డం నా లో తొడల్లో గిలిగింతలు పెడుతోంది. ఆ అనుభూతి నన్ను నిలువెల్లా దహించి వేస్తోంది. నా కాళ్ళు పైపెకి తేలి పోతున్నాయి…. ముందుకు తూలి పడతానే మోనని అని పించింది. గిరజాల జుత్తులోకి చేతులు పోనిచ్చి అతని తలను ఊతంగా పట్టు కున్నాను. నయనాలు అర్ధ ని మీలి తాలయ్యాయి. అతను చేస్తున్న పనికి నాకు ఏదేదో అయిపోతోంది. కళ్ళు బైర్లుగ మ్మాయి. ఊపిరి వేగం పెరిగింది. ఎందుకో గట్టి గా అరవాలని అని పిస్తోంది. గొంతు పెగలడం లేదు. కాళ్ళలో బలం సన్నగిల్లి పోతోంది. ఇం కొక్క క్షణం కూడా
మా కంపెనీకి 1,000 మంది ఉద్యోగులు ఉన్నారు మరియు ఉత్పత్తి, OEM మరియు ODMలలో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. నిపుణులైన ఇంజనీర్లు స్రెస్కీకి 30 కంటే ఎక్కువ r&d ఇంజనీర్లు ఉన్నారు, వీరిలో సగం మందికి 10 సంవత్సరాల కంటే ఎక్కువ r&d అనుభవం ఉంది. తక్కువ ఖర్చు సమర్థవంతమైన ఉత్పత్తి సామర్థ్యం మరియు బలమైన సరఫరా గొలుసు మీకు చాలా ఖర్చులను ఆదా చేస్తుంది. అధిక ధర పనితీరు. హామీ సేవలు స్రెస్కీ వారంటీ సమయంలో ఉచితంగా భాగాలను భర్తీ చేస్తుంది మరియు రెండు గంటలలోపు కస్టమర్ ఫిర్యాదులపై ఫీడ్‌బ్యాక్ చేస్తుంది. హై క్వాలిటీ ఉత్పత్తి నాణ్యతను నిర్ధారించడానికి మేము కఠినమైన ఉత్పత్తి వ్యవస్థ, నాణ్యత పరీక్ష వ్యవస్థ మరియు మూడవ పక్ష ధృవీకరణను కలిగి ఉన్నాము. విశ్వసనీయ పని Sresky వాల్-మార్ట్ వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ బ్రాండ్‌లతో సహకరిస్తుంది, కాబట్టి మీరు కలిగి ఉన్న విశ్వాసం విలువైనది.
తెలంగాణ గత ఐదున్నర సంవత్సరాలుగా అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు అన్నారు. ఢిల్లీలో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నిర్వహించిన ఇండియా ఎకనామిక్‌ సమ్మిట్‌ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన యూనియన్‌ అఫ్‌ స్టేట్స్‌ సెషన్‌ లో ఆర్థిక ప్రగతి సాధించేందుకు కేంద్ర, రాష్ట్రాల సంబంధాల పైన ఆయన తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అనేక పాలసీలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే అధికారం ఉన్నప్పటికీ అసలైన యాక్షన్‌ క్షేత్రస్థాయిలో రాష్ట్రాల్లోనే ఉన్నదని తెలిపారు. అభివృద్ధిపూర్వకమైన (ప్రొగెస్సివ్‌ లీడర్‌ షిప్‌) నాయకత్వం ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడుతుందని ఇందుకు తెలంగాణనే ఒక ఉదాహరణ అని తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్‌ఐపాస్‌ చట్టం అనేక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. దేశంలో పరిశ్రమల అనుమతులు, వాటిలో ప్రభుత్వాల పాత్ర విషయంలో ఈ చట్టం ద్వారా ఒక విస్తృతమైన చర్చకు తెర లేచిందన్నారు. తాము రూపొందించిన టి ఎస్‌ ఐసాస్‌ చట్టం ద్వారా ఇప్పటికే 11 వేలకు పైగా అనుమతులను ఇచ్చామని, ఇందులో 8400 పైగా అనుమతులు కార్యరూపం దాల్చాయని తెలిపారు. ఈ చట్టం వచ్చిన తర్వాత సుమారు 12 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని తెలిపారు. దీంతోపాటు రెండుసార్లు తెలంగాణ రాష్ట్రం ఈజ్‌ అఫ్‌ డూయింగ్‌ బిజిసెస్‌ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. కేంద్రం రాష్ట్రాలతో సమన్వయంతో కలిసి ఒక ఎకానామిక్‌ విజన్‌ కోసం పనిచేసినప్పుడే దేశ ఆర్థిక ప్రగతి వేగవంతం అవుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర జాబితాలతో పాటు ఉమ్మడి జాబితా అంటూ రాజ్యాంగం ప్రత్యేకంగా అధికారాలను నిర్ణయించిందని అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జాబితాలో ఉన్న అనేక అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అప్పగించాల్సిన సమయం ఆసన్నమైనదన్నారు. అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే ఆర్థిక అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. తమ రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ స్ఫూర్తి బలంగా ఉందని, అందుకే తెలంగాణ ఏర్పడ్డాక ఉన్న పది జిల్లాల నుంచి 33 జిల్లాలు, అనేక నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ చెప్పినట్లు ఇప్పటికీ దేశం పల్లెల్లోనే నివసిస్తున్నదని, అయితే దేశాన్ని, రాష్ట్రాలను ఆర్థికంగా నడిపిస్తువి కచ్చితంగా నగరాలు, పట్టణాలే అని అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా జీవితంలో మరింత ఉన్నతమైన అవకాశాల కోసం ప్రజలు కచ్చితంగా పట్టణాల వైపు చూస్తున్నారన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజానీకానికి అత్యుత్తమ విద్య, వైద్య సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అయితే పెద్ద ఎత్తున పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో పట్టణాల్లో మౌలిక వసతుల సంక్షోభం తలెత్తుతుందని తెలిపారు. దేశంలో ఇలాంటి సమస్యలకు అవసరమైన ఆలోచనలకు ఎలాంటి కొరత లేదని కేవలం అవి కార్యరూపం దాల్చేందకు కావాల్సిన క్యాపిటల్‌ కొరత మాత్రమే ఉన్నదని అన్నారు. పట్టణాల్లో మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక విదేశీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని, అయితే కేంద్ర ప్రభుత్వం నియంత్రణ వలన స్వేచ్ఛగా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టలేకపోతున్నాయని, ఈ విషయంలో కేంద్రం ఒక సహాయకారిగా నిలవాలి కానీ అడ్డు కాకుడదని, ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం కొంత సరళతరమైన నిబంధనలతో ముందుకు రావాలన్నారు. అప్పుడే పట్టణాల్లో మౌలిక వసతులను పెంచడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలను అభివృద్ధి పరిచేందుకు విస్తృతమైన అవకాశాలు కలుగుతాయని కెటిఆర్‌ తెలిపారు. మంత్రి కేటీఆర్‌ అక్కడికి హాజరైన కంపెనీలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, ఇక్కడి పెట్టుబడి అవకాశాలను వారికి వివరించారు. మంత్రి కేటీఆర్‌ తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి
Alokana - 1 Neelamraju Lakshmi Prasad Vidyardhi Mitra Prachuranalu ఆలోకన - 1 నీలంరాజు లక్ష్మీప్రసాద్‌ విద్యార్థిమిత్ర ప్రచురణలు సామాజిక - ఆధ్యాత్మిక వ్యాస సంపుటి Samajika Adhyatmika Vyasa Samputi Spiritual Puranas స్పిరిచ్యువాలిటి ఆధ్యాత్మికం Aadhyatmikam రెలిజియస్ డెవోషనల్ Devotion పురాణాలు Legend Classics Spiritual Essays ఆధ్యాత్మిక వ్యాస సంకలనం Adhyatmika Vyasa Sankalanam Let your friends know Description Reviews (0) ''అనేక వందల సంవత్సరాలుగా చీకట్లు నిండిన పాడుబడ్డ కొంపలోకి, వెలిగించిన కొవ్వొత్తితో నువ్వు ప్రవేశిస్తే - తానంతకాలం అక్కడ ఉంది కాబట్టి నీ కొవ్వొత్తి వెలుతురు తనమీద ఏ ప్రభావం చూపలేదని ఆ గాఢాంధకారం అనగలిగి ఉన్నదా?'' ''ఆచార్యుడు నిజానికి మృత్యువుతో సమానం. శిష్యుని మనస్సును అంతం చేయగలిగి ఉండాలి. మనసుకు మరణం సంభవించేట్టు, దానికి సమాధి జరిగేట్టు చూడాలి. అలాంటి జీవన్ముక్తి ప్రదాతే గురువు.'' ఇలాంటి అనర్ఘ రత్నాలు ఈ గ్రంథంనిండా పుష్కలంగా....
ఏటీఎం కేంద్రంలో దొంగ‌ను చూడ‌గానే స‌ద‌రు యువతి ధైర్యంగా ష‌ట్ట‌ర్ దించి, పోలీసులకు స‌మాచారం అందించింది. వెంట‌నే వాళ్లు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వాలివ్ లొకాలిటీకి చెందిన ఓ 26 ఏండ్ల మహిళ గురువారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల ప్రాంతంలో స్థానికంగా ఉన్న ఓ కేంద్రం నుంచి శ‌బ్దం రావ‌డం గ‌మ‌నించింది. దాంతో ఏటీఎం కేంద్రం ద‌గ్గ‌రికి వెళ్లి చూడ‌గా అందులో ఓ వ్య‌క్తి ఏటీఎం మిష‌న్‌ను ప‌గుల‌గొడుతూ క‌నిపించాడు. వెంట‌నే ఆ మ‌హిళ క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా ఏటీఎం కేంద్రం ష‌ట్ట‌ర్‌ను మూసేసి, పోలీసుల‌కు ఫోన్ చేసింది. పోలీసులు అక్క‌డికి చేరుకుని దొంగ‌ను అదుపులోకి తీసుకున్నారు.
Nov 14, 2022 # Peddapalli, #Anthargoan mandal, #Ts crime, #TTS colony, Latest crime News, Latest ts News Spread the News 365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పెద్దపల్లి,నవంబర్ 14,2022: తప్పిపోయిన కూతురి కోసం వెతుకుతుండగా రోడ్డు ప్రమాదంలో 44 ఏళ్ల వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి అంతర్గాం మండల కేంద్రంలోని టీటీఎస్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్గాంలోని వడ్డెర కాలనీకి చెందిన ఒల్లెపు రాజయ్య బైక్‌ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్ అయిన రాజయ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్న అతని కూతురు మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. పోలీసుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో రాజయ్య స్వయంగా వెతకడం మొదలు పెట్టాడు అంతర్గావ్ నుంచి రామగుండం వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే రాజయ్య మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రధానమంత్రి భద్రతా విధుల్లో మొత్తం బలగాలు నిమగ్నమై ఉన్నందున వెంటనే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించడంలో విఫలమయ్యామని ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు.
పవన్‌కు దమ్ముంటే 175 స్థానాల్లో అభ్యర్థులను దింపాలి ‘వైయ‌స్ఆర్‌సీపీ కంచుకోటను ఇంచుకూడా కదపలేరు’ వైయ‌స్ జగన్‌ గారిపై విషం చిమ్మడమే పవన్‌ కళ్యాణ్‌ లక్ష్యం వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ పుట్టిన బిడ్డ ద‌గ్గ‌ర నుంచి పండు ముస‌లి వ‌ర‌కూ ప్రతి ఒక్కరికి ప్ర‌భుత్వం తోడు వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందనలు వైయ‌స్ఆర్‌సీపీ బీసీల పార్టీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణె You are here హోం » ప్రత్యేక వార్తలు » సిబిఐ కుట్ర‌లు సిబిఐ కుట్ర‌లు 24 Oct 2018 1:23 PM సిఎం ర‌మేష్ ను ఇరికించే కుట్ర‌, చంద్ర‌బాబును అరెస్టు చేసే కుట్ర‌, మోదీ చేస్తున్న ఆప‌రేష‌న్ బిర‌డా కుట్రా అంటూ టిడిపి ప్ర‌భుత్వం కంటే ఎక్కువ‌గా ఎల్లో మీడియా తెగ క‌న్నీరు కారుస్తోంది. సిబిఐ కాద‌ది ఛీబిఐ అంటూ ముక్కు చీదేస్తోంది. ఏపాపం తెలియ‌ని పాల‌వంటి త‌మ ప‌చ్చ బాచ్ మీద అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తారా?? మీరు మ‌ట్టికొట్టుకుపోతారు. మా శాపాలే త‌గిలి సిబిఐ ప‌రువు గంగ‌లో క‌లిసింది అంటూ శాప‌నార్థాలు పెడుతున్నారు. అంటే కేంద్రంలో ఉన్న ప్ర‌భుత్వం చెప్పిన‌ట్ట‌ల్లా ఆడి సిబిఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థ‌లు ప‌నిచేస్తున్నాయ‌న్న‌మాట‌. మ‌రి అలా ఐతే కెడి ల‌క్ష్మీనార‌య‌ణ‌ను వాడుకుని వైఎస్ జ‌గ‌న్ మీద కేసులు బ‌నాయించి, అన్యాయంగా జైల్లో మ‌గ్గేలా చేసింది కూడా ఈ ఛీబీఐ అని అర్థం క‌దా! దొంగ సాక్ష్యాలు సృష్టించాడంటూ సిబిఐ అధికారి దేవేంద్ర కుమార్ ను అరెస్టు చేసిన‌ట్టుగా, ఆస్థానాపై ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్టుగా ఈ కెడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ను అరెస్టు చేసి విచార‌ణ ఎందుకు చేయ‌రు? జ‌గ‌న్ ఎపిసోడ్ ను చంద్ర‌బాబుకు అనుకూలంగా న‌డిపించిన జెడి ల‌క్ష్మీనారాయ‌ణ ఉద్యోగానికి రాజీనామా చేసి, తిరిగి ఎపి రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేదుకు రావ‌డాన్ని ఎందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోరు? చంద్ర‌బాబుకు, నాటి కాంగ్రెస్ పార్టీకి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన జ‌గ‌న్ పై కావాల‌నే కుట్ర‌లు చేసిన పావుగా జెడి ల‌క్ష్మీనారాయ‌ణ‌ను విచారించే తీరాలి. నేడు చంద్ర‌బాబు కోసం కాపు లీడ‌ర్ల‌తో మాట్లాడి మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేస్తున్నఈ మాజీ అధికారి, ఉద్యోగంలో ఉండ‌గా చేసిన అధికార దుర్వినియోగంపై కేసులు పెట్టేతీరాలి. జెడి జ‌గ‌న్ పై పెట్టిన కేసుల్లో సరైన ఆధారాలే లేవ‌ని కోర్టు కొట్టేస్తోంది. అంటే ఉద్దేశ‌పూర్వ‌కంగా పెట్టిన క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లివ‌ని బైట‌ప‌డ్డ‌ట్టే క‌దా? ఇక అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు పై విచార‌ణ చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు సిబ్బంది లేర‌ని సాకు చూపిన ఈ అత్యుత్త‌మ విచార‌ణాధికారిపై సిబిఐ ఎందుకు చ‌ర్య‌లు తీసుకోదు? నిజ‌మే సిబిఐ కుట్ర‌లు చేస్తోంది. అప్పుడు కాంగ్రెస్, టిడిపిల‌తో క‌లిసి, నేడు బిజెపి టిడిపిల‌తో క‌లిసి. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్యస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఎద్దేవా చేశారు. సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 మాజీ ఎమ్మెల్యే బొల్లినేని ఉదయగిరి రూరల్‌, ఆగస్టు 10: ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్యస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఎద్దేవా చేశారు. బుధవారం స్థానిక చెంచలబాబు అతిథిగృహంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెబోయిన చెంచలబాబుయాదవ్‌తో కలిసి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తేదీ పూర్తయినా ఇంకా 60 శాతం మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుర్భర పరిస్థితిలో సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నారన్నారు. కావలి-దుత్తలూరు జాతీయ రహదారి నిర్మాణం ఘనత తనదేనన్నారు. ఎంపీ మాధవ్‌ చర్యల వల్ల దేశంలో రాష్ట్రం పరువు పోయిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదని, నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధే ప్రస్తుతం కనిపిస్తుందన్నారు. పని చేసే నాయకుడు ఎవరో ప్రజలే గుర్తించాలన్నారు. సభ్యత్వ నమోదు లక్ష్యాలను ప్రతిఒక్కరు పూర్తి చేయాలన్నారు. దేశంలో ఏ పార్టీ లేనంత విధంగా టీడీపీ సభ్యత్వం తీసుకుంటే కార్యకర్తలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని, ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చేయాలన్నారు. 2024లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బయ్యన్న, రియాజ్‌, బొజ్జా నరసింహులు, వెంకటస్వామి, నల్లిపోగు రాజా, ఓబులరెడ్డి సందానీ, మతకాల శ్రీనివాసులు, మాబాషా, ఖాన్‌సా, శివకృష్ణ, రామ్మోహన్‌, జల్సాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిలో విశ్వవిద్యాలయాలదే కీలక పాత్ర అని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌ అన్నారు. విశ్వవిద్యాలయాలు పరిశోధనలను ప్రోత్సహించాలని సూచించారు. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 జేఎన్‌టీయూహెచ్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో వీకే సారస్వత్‌ హైదరాబాద్‌ సిటీ: శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిలో విశ్వవిద్యాలయాలదే కీలక పాత్ర అని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌ అన్నారు. విశ్వవిద్యాలయాలు పరిశోధనలను ప్రోత్సహించాలని సూచించారు. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌ గోల్డెన్‌ జూబ్లీ ముగింపు వేడుకల్లో వీకే సారస్వత్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంజనీరింగ్‌ విద్యా విధానంలో జేఎన్‌టీయూహెచ్‌ సమూల మార్పులు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. దేశంలోని అనేక వర్సిటీలకు జేఎన్‌టీయూ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. యూనివర్సిటీలు కేవలం విద్యను అందించడమే కాకుండా విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను పెంచి వారు సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాయన్నారు. జేఎన్‌టీయూ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా పూర్వ వీసీలు, రిజిస్ట్రార్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూహెచ్‌ వీసీ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ర్టార్‌ మంజూరు హుస్సేన్‌, రెక్టార్‌ గోవర్ధన్‌ పాటు పలు విభాగాల ప్రొఫెసర్లు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
వారు ఎలా ఉన్నారని వ్యక్తులు ఎవరినైనా అడిగినప్పుడు, వారు తరచుగా సమాధానం గురించి పట్టించుకోరు. కోల్పోయినది మరొక వ్యక్తితో కనెక్ట్ అయ్యే అవకాశం. కొత్త 'మీ ​​రోజు ఎలా ఉంది?' వీడియో, స్టెల్లా డోన్నెల్లీ ఇతరుల పోరాటాలపై నిజమైన ఆసక్తిని చూపుతుంది. కూల్ సహాయం నా జుట్టు దెబ్బతింటుంది విభిన్న పాత్రల ద్వారా చూసినట్లు మీ పొరుగువారిని ప్రేమించడం గురించి వీడియో. డొన్నెల్లీ సమస్యాత్మకమైన సంబంధంతో వ్యవహరిస్తోంది, ఆమె గదిలో తిరుగుతూ ఉంటుంది, కంగారుగా కనిపిస్తుంది. కారు ప్రమాద బాధితురాలు ఆమె నెత్తురోడుతున్న నుదిటిపై సేదతీరుతోంది, సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తి మరియు సాకర్ ఆటగాళ్ళు అతని చుట్టూ పరుగెత్తుతున్నప్పుడు నొప్పితో నేలపై పడుకున్న చిన్న పిల్లవాడు కూడా ఉన్నారు. చివరికి, గాయకుడు పూర్తి గానం మరియు మాట్లాడే పదాల మధ్య మారడం కొనసాగిస్తున్నప్పుడు, ప్రతి పాత్ర అద్భుతంగా ఒక ఫోన్‌ను అందుకుంటుంది, వారు ఎవరితోనైనా మాట్లాడటానికి ఉపయోగిస్తారు, బహుశా డొన్నెల్లీ, ఏమి జరుగుతుందో. ఎవరైనా పట్టించుకునే వాస్తవం ఆ అమ్మాయిని లేచి నిలబడి దుమ్ము దులిపేలా చేస్తుంది, మనిషి సముద్రాన్ని విడిచిపెట్టేలా చేస్తుంది మరియు సాకర్ ప్లేయర్‌ని మళ్లీ ఆటలోకి వచ్చేలా చేస్తుంది. ఇది ఒక చిన్న సానుభూతి ఏమి చేయగలదో దాని యొక్క శక్తివంతమైన వర్ణన. 'మీ రోజు ఎలా ఉంది?' ఈ సంవత్సరం విడుదలైన స్టెల్లా డోన్నెల్లీ యొక్క మూడు మునుపటి సింగిల్స్‌ను అనుసరిస్తుంది: ' వరద ,” “ఊపిరితిత్తులు,” మరియు “రుజువు.” ఆమె తదుపరి ఆల్బమ్ వరద సీక్రెట్లీ కెనడియన్ ద్వారా ఆగస్టు 26న విడుదల అవుతుంది, దాదాపు మూడున్నరేళ్ల తర్వాత వస్తోంది యొక్క విడుదల కుక్కల పట్ల జాగ్రత్త వహించండి .
1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో భారత సేనలు నిర్ణయాత్మక విజయం సాధించడంలో మన సేనలకు లభించిన అసమాన సారధ్యం కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పాలి. వీరిలో కీలక పాత్ర వహించిన నలుగురు యోధుల గురించి తెలుసుకుందాము. సామ్ మానెక్ షా, సామ్ బహదూర్ పేర్లతో పిలువబడే, మహావీర్ చక్ర అవార్డు గ్రహీత ఫీల్డ్ మార్షల్ సామ్ హోర్ముస్జీ ఫ్రామ్‌జీ జంషెడ్జీ మానేక్షా అనితరమైన నాయకత్వం వహించారు. ఆ సమయంలో భారత సైన్యాధిపతిగా ఉన్నారు. ఏప్రిల్ 1971లో, `మీరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’ అని ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ అడిగినప్పుడు, తన సాయుధ, పదాతిదళ విభాగాలు చాలా వరకు ఇతర చోట్ల మోహరించి ఉన్నాయని, 12 ట్యాంకులు మాత్రమే పోరాటానికి సిద్ధంగా ఉన్నాయని సూటిగా సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా, హిమాలయ పర్వత మార్గాలు త్వరలో తెరుచుకుంటాయని, ఈ ప్రాంతం వరదలకు గురవుతుందని ఆయన ఆమె దృష్టికి తీసుకు వచ్చారు. భారత ప్రధానిని తనను స్వతంత్రంగా ప్రణాళిక వేసుకొని, యుద్ధానికి నాయకత్వం వహించేటట్లు అవకాశం ఇస్తే యుద్ధంలో విజయం సాధించవచ్చని తెలిపారు. అందుకు ఆమె ఆమోదం తెలిపారు. మానెక్ షా రూపొందించిన వ్యూహం అనుసరించి, సైన్యం తూర్పు పాకిస్తాన్‌లో అనేక సన్నాహక కార్యకలాపాలను వెంటనే ప్రారంభించింది. ఇందులో బెంగాలీ జాతీయవాదుల స్థానిక మిలీషియా సమూహం అయిన ముక్తి బహినీకి శిక్షణ, సన్నద్ధం కూడా ఉంది. సాధారణ బంగ్లాదేశ్ దళాలకు చెందిన మూడు బ్రిగేడ్‌లు శిక్షణ పొందాయి. 75,000 మంది గెరిల్లాలు శిక్షణ పొందారు. వారికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చారు. యుద్ధం అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు తూర్పు పాకిస్తాన్‌లో ఉన్న పాకిస్తానీ సైన్యాన్ని వేధించడానికి ఈ దళాలను ఉపయోగించారు. డిసెంబర్ 16న పాకిస్థాన్ సైనికులు లొంగిపోయే ముందు ఆయన మూడు సార్లు రేడియో సందేశాలు పంపారు. వాటి సంక్షిప్త సందేశం “మీరు లొంగి పోండి లేదా తుడిచి పెట్టుకు పోవవడానికి సిద్ధం కండి” అనే స్పష్టమైన హెచ్చరిక కనిపిస్తుంది. డిసెంబర్ 9న తన సందేశంలో జనరల్ ఇలా అన్నారు: “భారత బలగాలు మిమ్మల్ని చుట్టుముట్టాయి. మీ వైమానిక దళం నాశనమైంది. వారి నుండి మీకు ఎలాంటి సహాయం అందుతుందనే ఆశ లేదు. చిట్టగాంగ్, చల్నా, మంగ్లా ఓడరేవులను కట్టడి చేసాము. సముద్రం నుండి మిమ్మల్ని ఎవరూ చేరుకోలేరు. మీకు మరో దారి లేదు” అంటూ స్పష్టం చేశారు. పైగా, “మీరు చేసిన అకృత్యాలకు, క్రూరత్వాలకు ప్రతీకారం తీర్చుకోవడానికి ముక్తి బాహినీ, ప్రజలందరూ సిద్ధమయ్యారు…ఎందుకు జీవితాలను వృధా చేసుకుంటారు? మీరు ఇంటికి వెళ్లి మీ పిల్లలతో ఉండకూడదనుకుంటున్నారా? సమయాన్ని కోల్పోవద్దు. మరో సైనికునికి మీ ఆయుధాలు ఇవ్వడంలో అవమానం లేదు. మేము మీకు ఓ సైనికుడికి తగిన చికిత్స అందిస్తాము” అంటూ లొంగిపొమ్మని స్పష్టమైన సందేశం ఇవ్వడంతో పాటు, హెచ్చరిక కూడా చేశారు. చివరకు, లొంగిపోవడం డిసెంబర్ 16, 1971న మధ్యాహ్నం 3:00 గంటలకు జరిగింది. రెండేళ్ల తర్వాత, 1973లో, ఫీల్డ్ మార్షల్ స్థాయికి పదోన్నతి పొందిన మొదటి భారతీయ సైనికుడిగా జనరల్ శామ్ మానెక్షా నిలిచారు. లెఫ్టినెంట్ జనరల్ జె ఎఫ్ ఆర్ జాకబ్ 1971 యుద్ధం సమయంలో, ఈస్టర్న్ కమాండ్ మేజర్ జనరల్‌గా పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ జె ఎఫ్ ఆర్ జాకబ్ మరొక ప్రముఖ భారతీయ సేనాని. ఆయన 36 ఏళ్ల సైనిక జీవితంలో, అప్పటికే రెండు యుద్ధాలు చేశారు. అవి రెండవ ప్రపంచ యుద్ధం, 1965 నాటి ఇండో-పాక్ వివాదం. జనరల్ జాకబ్ తూర్పు కమాండ్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేశాడు. ప్రతిభావంతుడైన సైనికుడిగా పేరొందాడు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఆయన ప్రత్యక్ష పాత్ర వహించారు. జనరల్ అనేక మంది సీనియర్ అధికారులతో విభేదించారు. తూర్పు పాకిస్తాన్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడమే తన ‘ఉద్యమ యుద్ధం’ ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకున్నారు. సుదీర్ఘ యుద్ధం భారతదేశ ప్రయోజనాలకు ఉపయోగపడదని జనరల్ జాకబ్ అర్థం చేసుకున్నారు. డిసెంబరు 16న, యుద్ధంలో ప్రశాంతత సమయంలో, జాకబ్ తన ముందు లొంగిపోవడానికి నియాజీని సందర్శించడానికి అనుమతిని కోరాడు. ఆయన ఢాకాకు వెళ్లి నియాజీ నుండి షరతులు లేకుండా లొంగిపోయే విధంగా చేశారు. ఆయన 1978లో భారత సైన్యం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, లెఫ్టినెంట్ జనరల్ జాకబ్ పంజాబ్, గోవా గవర్నర్‌గా పనిచేశారు. లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా 1971 యుద్ధ సమయంలో భారత సైన్యం తూర్పు కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (జిఓసి)గా ఉన్నారు. 1971 యుద్ధంలో పాకిస్తానీ సైన్యం ఘోర పరాజయానికి దారితీసిన భూ బలగాలను నిర్వహించడానికి, నాయకత్వం వహించడానికి జనరల్ బాధ్యత వహించారు. తూర్పు థియేటర్‌లో భారత, బంగ్లాదేశ్ దళాలకు జనరల్ కమాండింగ్‌గా, జనరల్ అరోరా తూర్పు పాకిస్తాన్ గవర్నర్, పాకిస్తాన్ ఆర్మీ తూర్పు కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఎఎకె నియాజీ నుండి లొంగిపోయారు. డిసెంబర్ 3, 1971న యుద్ధం ప్రారంభమైనప్పుడు, జనరల్ అరోరా తూర్పు పాకిస్తాన్‌లో యుద్ధాన్ని పర్యవేక్షించారు. జనరల్ కమాండ్ కింద ఉన్న బలగాలు అనేక చిన్న యూనిట్లలో తమను తాము ఏర్పాటు చేసుకున్నాయి. పాకిస్థానీ బలగాలను ఎంపిక చేసిన సరిహద్దుల్లో ఎదుర్కొని ఓడించేందుకు, ఇతర సరిహద్దుల్లో వారిని ఓడించేందుకు వారు నాలుగు-ముఖాల దాడిని నిర్వహించారు. 14 రోజులలో, ఆయన దళాలు భారత సరిహద్దు నుండి తూర్పు పాకిస్తాన్ రాజధాని ఢాకా వైపు ముందుకు సాగాయి. మొత్తం 93,000 మంది పాకిస్తాన్ సైనికులు, 80,000 మందికి పైగా యూనిఫాం ధరించిన సిబ్బంది, జనరల్ అరోరా ముందే లొంగిపోయారు. మిగిలిన 13,000 మందిలో పాకిస్తాన్‌కు తమ విధేయతను ప్రతిజ్ఞ చేసిన పౌరులు లేదా స్థానికులు లేదా సైన్యంలోని వారి కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. జనరల్ సుబాన్ సింగ్ ఉబాన్ 1971 యుద్ధంలో కీలక పాత్ర పోషించిన అనేక మంది భారతీయ సైనికులలో ఒకరు మేజర్ జనరల్ సుజన్ సింగ్ ఉబాన్. భారతదేశం ‘ఐదవ సైన్యం’కి పునాది వేశారు. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్ఎఫ్ఎఫ్) అని పిలువబడే ఈ సైన్యంలో ప్రధానంగా టిబెటన్ శరణార్థులు లేదా భారతదేశంలోని టిబెటన్ రెసిస్టెన్స్ ఫైటర్స్ ఉన్నారు. ఎస్ఎఫ్ఎఫ్ ప్రాథమిక పని చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్య్ ఎ) గ్రౌండ్ ఫోర్స్‌కు వ్యతిరేకంగా రక్షణ, చైనా సరిహద్దులో రహస్య గూఢచార సేకరణ, కమాండో కార్యకలాపాలను నిర్వహించడం. ఎస్ఎఫ్ఎఫ్ మొదటి ఇన్‌స్పెక్టర్ జనరల్ మేజర్ కారణంగా ‘స్థాపన 22′ లేదా కేవలం ’22’ అని కూడా పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, జనరల్ సుజన్ సింగ్ ఉబాన్ 22వ మౌంటైన్ రెజిమెంట్, రాయల్ ఇండియన్ ఆర్టిలరీకి నాయకత్వం వహించారు. ఎస్ఎఫ్ఎఫ్ యుద్ధంలో భారతదేశపు ప్రాథమిక పోరాట కార్యకలాపాలలో భాగం. సరిహద్దు దాడులు పెరిగినందున చిట్టగాంగ్ కొండలపై దాడి చేయాలని ఎస్ఎఫ్ఎఫ్ ను ఆదేశించారు. ఎస్ఎఫ్ఎఫ్ రెండవ అతిపెద్ద నగరమైన చిట్టగాంగ్‌ను స్వాధీనం చేసుకోవాలని ఇన్‌స్పెక్టర్ జనరల్ కూడా కోరారు. అయినప్పటికీ, ఈ ఆలోచన న్యూ ఢిల్లీ మిలిటరీ ప్లానర్‌లకు అనుకూలంగా లేదు, ఎందుకంటే యూనిట్‌లో అంత పరిమాణంలో మిషన్‌ను నిర్వహించడానికి ఫిరంగి లేదా ఎయిర్‌లిఫ్ట్ మద్దతు సామర్థ్యాలు లేవు.
భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 24 న జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజు మహిళా మరియు పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క చొరవ మరియు లింగ పక్షపాతం కారణంగా భారతీయ సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుతుంది. ఆడపిల్లల పట్ల సమాజ వైఖరిని మార్చడం కూడా ఆనాటి ఉద్దేశ్యం. జాతీయ బాలికల దినోత్సవం గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది: 1. 2008 లో మహిళా మరియు పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలను ఎత్తిచూపడం, ఆడపిల్లల హక్కుల గురించి అవగాహన కల్పించడం మరియు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ రోజును జరుపుకునే లక్ష్యం. బాలిక విద్య, ఆరోగ్యం మరియు పోషణ. 2. రోజును జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా, బేటీ బచావో, బేటీ పధావో (ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలకు విద్యను అందించండి) పథకం కింద ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 3. బాలల లైంగిక నిష్పత్తి (CSR) క్షీణిస్తున్న అంశంపై అవగాహన పెంచే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 2021 జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ప్రభుత్వ పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ వేడుకలు బేటి బచావో, బేటి పధావో (బిబిబిపి) పథకం వార్షికోత్సవం సందర్భంగా గుర్తుగా ఉంటాయి. 4. పంజాబ్ జనవరి 2021 ను “ఆడపిల్లల నెల” గా ప్రకటించింది. ధీయాన్ డి లోహ్రీ అనే పథకాన్ని కూడా ప్రారంభించారు. 5. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాల్యవివాహాలను తగ్గించడానికి కృషి చేసిన వ్యక్తులు మరియు సంస్థలను ఒడిశా ప్రభుత్వం సత్కరిస్తుంది. 6. బేతి పచావో, బేటి పచావో పథకం కింద “అవేర్ గర్ల్ చైల్డ్, ఏబుల్ మధ్యప్రదేశ్” అనే థీమ్‌తో మధ్యప్రదేశ్ జాతీయ బాలిక దినోత్సవాన్ని జరుపుకోనుంది. జనవరి 24 నుండి 30 వరకు రాష్ట్రం జాతీయ బాలికల వారోత్సవాన్ని కూడా పాటిస్తుంది. 7. నేషనల్ గర్ల్ చైల్డ్ డే కోసం గత సంవత్సరం థీమ్ “మై వాయిస్: “అవర్ ఈక్వల్ ఫ్యూచర్ ” మరియు 2019 లో ఇది “రేపు ప్రకాశవంతమైన అమ్మాయిల సాధికారత”.
బీజేపీ సీఎం అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ని ప్రకటిస్తే తెలంగాణ రాజకీయం మారుతుందా? 2023 ఎన్నికల్లో నువ్వు-నేనా అన్నట్లు ఉంటుందా? తెలంగాణలో ఈటలకు అంత వెయిటేజ్ ఉందా? సీఎం కేసీఆర్‌ను ఢీకొనే సత్తా ఉందా? ఈటెల బలం ఏంటి? కొందరు కార్యకర్తలు భావిస్తున్నట్లు ఆయనకు అంత సీనుందా? అసలు బీజేపీ మనస్సులో ఏముంది? మిషన్ 2023 తెలంగాణ బీజేపీ మిషన్ 2023 పట్టాలెక్కించింది. ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఢిల్లీ పెద్దల సూచనలతో పార్టీ శ్రేణుల్ని జోరుగా నడిపిస్తుంది. ఉప ఎన్నికల ఎత్తులు మిషన్ 2023లో భాగమే. దుబ్బాక, హుజూరాబాద్ ఉరిమే ఉత్సాహం ఇస్తే మునుగోడు.. కమలంలో కాన్ఫిడెన్స్‌ని పెంచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ -బీజేపీ మధ్యే రేసు ఉంటుందని భావిస్తోంది. కొంతకాలంగా కొనసాగుతున్న ఆపరేషన్ ఆకర్ష్‌ని భవిష్యత్‌లో మరింత స్పీడ్ పెంచాలని యోచిస్తోంది. సీఎం కేసీఆర్‌ని ఢీ కొట్టాలంటే మామూలు విషయం కాదు. ఎత్తుకుపైఎత్తులు వేయాలి..కేసీఆర్ ఎత్తుల్ని పసిగట్టాలి. పక్కా లెక్కలు వేసుకోవాలి. బాణం గురి చూసి కొడితే ప్రత్యర్థికి గుచ్చుకోవాలి. లక్ష్యం నెరవేరాలంటే లాంగ్ లైఫ్ మిషన్ ఉండాలి. ఇప్పుడు తెలంగాణ బీజేపీ ఇదే ఆలోచిస్తోంది. ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు కొందరు..ఈటెల పేరుని తెరపైకి తెస్తున్నారు. కేసీఆర్‌ని ఢీ కొట్టేందుకు సరైన మొనగాడు అని వారంటున్నారు. ఈటెల పేరు ప్రకటిస్తే… ఈటల రాజేందర్‌ను సీఎంగా అభ్యర్థిగా ప్రకటించాలని కొందరు అడుగుతున్నారు. అలా ప్రకటిస్తే తెలంగాణ రాజకీయం మారతుందని చెబుతున్నారు. కేసీఆర్ ఎత్తులు,గిత్తులు బాగా తెలిసిన నేత ఈటల. ఆయన్ను దగ్గర్నుంచి చూశారు. వ్యూహాల్ని పసిగట్టే తత్వం,,ప్రతి వ్యూహాలు పన్నే నైపుణ్యం ఈటల ఒక్కరికే ఉందని అంటున్నారు.అంతే కాదు ఈటల మంత్రిగా సమర్థంగా పనిచేసిన అవనుభవం ఉందని చూపిస్తున్నారు. మునుగోడులో అన్నీతానై నడిపించిన ఈటలతీరు వారిని ఆకట్టుకుంటుంది. 2023లో కూడా ఇలాగే చేస్తే తెలంగాణలో కమలం వికసిస్తుందని ఈటల అభిమానులు అంటున్నారు. రియల్ ఇన్నింగ్స్ నిజానికి ఈటల రాజేందర్…బీజేపీలో జాయిన్ అయిన తొలినాళ్లలో అంత జోరుమీద లేరు. ప్రయారిటీ ఇవ్వడం లేదనే ఫీలింగ్ ఆయనకు ఉన్నదో లేదోగానీ కొందరు బీజేపీ కార్యకర్తలకు ఉండేది. వేదిక పై చివరన కూర్చున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవేవి పట్టించుకోని ఈటల…ఆ తర్వాత కొన్ని రోజులకే డోస్ పెంచారు. కేసీఆర్ సర్కార్ పై తనదైన స్టయిల్‌లో విరుచుకుపడ్డారు. ఇది బీజేపీ ఢిల్లీ పెద్దలకు బాగా నచ్చినట్టుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడే అవకాశం ఇచ్చారు. తర్వాత ఢిల్లీ పిలిపించి మాట్లాడారు. బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌గా నియమించారు. ఇంకేముంది ఈటల రియల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. బీజేపీకి ఏకే 47 గన్‌లా మారారు. అవసరమైనప్పుడల్లా బీజేపీ ఈ గన్ తో కేసీఆర్ పై విమర్శల తూటాలు కురిపిస్తుంది. గారు గిరు పోయి అరే ఓరే ..అనేదాకా ఓవర్ డోస్ పెంచారు అందుకే ఈటల్ని ముందే బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కొందరు కోరుతున్నారు. ఎలక్లన్లకు ముందే బీజేపీ…సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుంది. ఇప్పటిదాకా అన్ని రాష్ట్రాల్లో ఇదే చేసింది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప అన్ని రాష్ట్రాల్లో ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించారు. తెలంగాణలో ఇలాగే ముందే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందా? ప్రకటిస్తే ఈటల పేరు ఎంచుకుంటుందా? లేదంటే కిషన్ రెడ్డిని తెరపైకి తెస్తుందా? సెగలు కక్కుతున్న బండికే ఆ అవకాశం ఇస్తుందా? అని పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది. బండి, కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌ల కన్నా ఈటల పేరు ప్రకటిస్తేనే బెటరని కొందరు అంటున్నారు. లాగుతున్న బండినే వదిలేస్తారా అనేవాళ్లూ ఉన్నారు. ఇంతకీ ఢిల్లీ పెద్దల మదిలో ఏముందో..?
న్యూఢిల్లీ : ఇష్టంలేని గర్భాన్ని సురక్షిత పద్దతులలో తొలగించు కునే హక్కు మహిళలందరికి ఉందని అత్యున్న త న్యాయస్థానం తేల్చిచెప్పింది. మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ (ఎంటిపి)కి సంబంధించి ఓ కేసు విచారణలో జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ జెబి.పార్దివాలా, జస్టిస్‌ ఎఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం గురువారం ఇచ్చిన తీర్పులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలూ ప్రాధాన్యతనంతరించుకున్నాయి. అబార్షన్లు చేయించుకోవడానికి పెళ్ళితో సంబంధం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం ఈ విషయంలో వివాహితులు, అవివావాహితులు అంటూ తేడా చూపడం రాజ్యాంగవిరుద్దమని పేర్కొంది. పెళ్ళైన తరువాత కూడా భార్య సమ్మితి లేకుండా భర్త వ్యవహరిస్తే అత్యాచారంగానే భావించాలని, ఆ సమయంలో ఆమె గర్భం దాల్చితే దానిని తొలగించుకోవచ్చని తెలిపింది. పెళ్లయినా, కాకపోయినా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్‌ చేయించుకోవచ్చని తెలిపింది. ఈ తీర్పుతో అబార్షన్లపైనా, వైవాహిక అత్యాచారాలపైనా దేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైవాహిక అత్యాచారాలపై కొన్ని దిగువ కోర్టులు భిన్నంగా స్పందిస్తున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పు మార్గదర్శకంగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సురక్షిత గర్భ విచ్ఛిత్తి కూడా హక్కే! అబార్షన్‌ను సురక్షిత పద్దతులలో చేయించుకోవడం కూడా మహిళల హక్కేనని ధర్మాసనం ఈ తీర్పులో స్పష్టం చేసింది. 'చట్ట ప్రకారం మహిళలందరికి సురక్షితంగా గర్భవిఛిత్తి చేయించుకునే హక్కు ఉంది. దానిని తిరస్కరించలేం.' అని పేర్కొంది. 'వైవాహిక స్థితి కారణంగా అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడానికి వీలు లేదని అనలేం. ఎంటిపి నిబంధనల ప్రకారం పెళ్లయినా, కాకపోయినా ఇష్టంలేకపోతే గర్భందాల్చిన 24 వారాల్లోగా తొలగించుకోవచ్చు. ఈ విషయంలో వివాహితులు, అవివాహితులు అంటూ వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్దం. అలా చేస్తే నేరంగా భావించాలి. ఇష్టంలేని గర్భాన్ని తొలగించుకోవడానికి వివాహితులకు 24 వారాలు గడువిస్తూ, అవివాహితులకు అనుమతించకపోవడం సరికాదు' అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎంటిపి చట్టంలో వైవాహిక అత్యాచారాలు మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ (ఎంటిపి) చట్టంలో వైవాహిక అత్యాచారాలను కూడా చేర్చాలని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 'అత్యాచారం అంటే సమ్మతి లేకుండా జరిగే ప్రక్రియ. పెళ్లయిన తరువాత చట్టపరమైన భాగస్వామి (భర్త) నుండి కూడా ఈ తరహా లైంగిక వేధింపులు ఎదురుకావచ్చు. భర్త బలవంతం కారణంగా లొంగిపోక తప్పని స్థితి ఏర్పడవచ్చు. గర్భం దాల్చవచ్చు. ఇటువంటి సంఘటనలను కూడా అత్యాచారాలుగానే భావించాలి.' అని సుప్రీంకోర్టు వివరించింది. ' వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఇటువంటి గర్భధారణల నుండి మహిళలను కాపాడాలి. ఎంటిపి చట్టంలో అత్యాచారానికి ఇచ్చిన అర్ధంలో వైవాహిక అత్యాచారాన్ని కూడా చేర్చాలి.' అని ఆదేశించింది. ప్రస్తుతం ఎంటిపి చట్టం ప్రకారం అత్యాచార బాధితులు, మైనర్లు, వివాహితులు, మానసిక సమస్యలతో ఉన్నవారు, పిండం సరిగా అభివృద్ధి చెందని ఘటనల్లో 24 వారాల వరకు అబార్షన్‌ చేయించుకునే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఇష్టంలేని గర్భాన్ని తొలగించుకునే హక్కు ఎటువంటి మినహాయింపులు లేకుండా మహిళలందరికి లభించింది. చట్టం స్థిరంగా ఉండదు...! అవివాహితులకు కూడా అబార్షన్‌ హక్కు ఉందని చెప్పిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఇప్పుడు కాలం మారింది. చట్టం స్థిరంగా ఎప్పుడూ ఒకేలా ఉండదు. సామాజిక వాస్తవాలకు అనుగుణంగా నిబంధనలు మారుతాయి. ఈ విషయాన్ని అందరు గుర్తించాలి. వివాహితులను అబార్షన్‌కు అనుమతిచ్చి, పెళ్లికాని వారికి ఆ అవకాశం లేదనం సబబుకాదు.' అని ధర్మాసనం వివరించింది. ఇదీ నేపథ్యం... 25 ఏళ్ల అవివాహిత మహిళ ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలకతీర్పును వెలువరించింది. అవివాహితనైనందున చట్టప్రకారం అబార్షన్‌కు అర్హత లేదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్‌ చేసింది. తాను గర్భం దాల్చి 23 వారాలైందని, తన భాగస్వామి పెళ్లికి నిరాకరించాడని ఆమె పిటిషన్‌లో పేర్కొంది. తన తల్లిదండ్రులు రైతులని, ఇంటికి తానే పెద్ద కుమార్తెనని, తనకు ఐదుగురు తోబుట్టువులు ఉన్నారని, ఇలాంటి సమయంలో బిడ్డను పోషించే స్థోమత తనకు లేదని పేర్కొంది. జులై 21న, గర్భంలోని పిండం ఆమెకు హానికలిగించదని మెడికల్‌ బోర్డు నిర్ధారించడంతో కోర్టు ఆ మహిళకు అబార్షన్‌కు అనుమతించింది. 2021లో సవరించిన అబార్షన్‌ చట్టంలోని నిబంధనలలో భర్త అనే పదానికి బదులుగా భాగస్వామి అనే పదాన్ని చేర్చారు.
న్యూ DELHI ిల్లీ (రాయిటర్స్) – వాణిజ్య వర్గాలు అందించే ట్యాంకర్ డేటాను వైవిధ్యపరచాలన్న ప్రభుత్వ పిలుపుకు ప్రతిస్పందనగా రిఫైనర్లు ప్రత్యామ్నాయాలను నొక్కడంతో మే నెలలో భారత చమురు దిగుమతుల మధ్యప్రాచ్య ముడి వాటా 25 నెలల కనిష్టానికి పడిపోయింది. ఫైల్ ఫోటో: ఏప్రిల్ 24, 2008 న ముంబైలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీలో ఒక కార్మికుడు సైకిల్ నడుపుతున్నాడు. REUTERS / Punit Paranjpe / File Photo ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారతదేశం తన ముడి పదార్థాలను వైవిధ్యపరచాలని మార్చిలో శుద్ధి కర్మాగారాలకు సూచించింది. ఎగుమతి ఎగుమతిదారు సౌదీ అరేబియా నేతృత్వంలోని ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) మరియు దాని మిత్రదేశాలు సరఫరా ఆంక్షలను తగ్గించాలని న్యూ Delhi ిల్లీ పిలుపును విస్మరించాయి. ఆసియా యొక్క మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మే నెలలో రోజుకు 4.2 మిలియన్ బారెల్స్ (బిపిడి) చమురును దిగుమతి చేసుకుంది, ఇది మునుపటి నెలతో పోలిస్తే కొద్దిగా తక్కువ, కానీ అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 31.5% ఎక్కువ. మిడిల్ ఈస్ట్ వాటా 52.7 శాతానికి పడిపోయింది, ఇది 2019 ఏప్రిల్ నుండి కనిష్ట మరియు ఏప్రిల్‌లో 67.9 శాతానికి పడిపోయింది. ఇరాక్ తరువాత భారతదేశంలో రెండవ అతిపెద్ద సరఫరాదారు సౌదీ అరేబియా నుండి దిగుమతులు ఏడాది క్రితం నుండి పావు శాతం తగ్గాయి, ఏప్రిల్‌లో 3 వ నుండి 7 వ స్థానంలో ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి వస్తువులు 39% పడిపోయాయి. డేటా చూపబడింది. సౌదీ అరేబియా నుండి చమురు ధరలను పెంచాలని మే నెలలో భారత ప్రభుత్వ శుద్ధి కర్మాగారాలు సిఫారసు చేసిన నేపథ్యంలో ఇది జరిగింది. మధ్యప్రాచ్యం నుండి తక్కువ చమురు కొనుగోళ్లు భారతీయ చమురు దిగుమతుల్లో ఒపెక్ వాటాను రికార్డు స్థాయికి లాగాయి. మధ్యప్రాచ్యంలో చమురును భర్తీ చేయడానికి, రిఫైనర్లు లాటిన్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ మరియు మధ్యధరా నుండి దిగుమతులను పెంచారు. రిఫైనేటివ్స్ ఆయిల్ రీసెర్చ్ అండ్ ఫోర్కాస్ట్స్ యొక్క ప్రముఖ విశ్లేషకుడు ఎహ్సాన్ ఉల్-హక్ మాట్లాడుతూ, భారత రిఫైనర్లు మార్చిలో పెద్ద మొత్తంలో యు.ఎస్. చమురును కొనుగోలు చేశారని, స్థానిక పెట్రోల్ డిమాండ్ రికవరీ తరువాత నెలల్లో ఇది కొనసాగుతుందని వారు భావిస్తున్నారు. తేలికపాటి ముడి నైజీరియాకు బలమైన డిమాండ్ రెండు పాయింట్ల మేర అప్‌గ్రేడ్ చేసి మే నెలలో భారతదేశానికి 3 వ సరఫరాదారుగా నిలిచింది. READ 30 ベスト 使い捨て タオル テスト : オプションを調査した後 ఏదేమైనా, ప్రైవేట్ ఇండియన్ రిఫైనరీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు నాయరా ఎనర్జీ కెనడియన్ ముడి చమురును 244,000 పిపిఎమ్కు పెంచింది, ఇది భారతదేశం యొక్క మొత్తం దిగుమతుల్లో 6%. “బ్రెంట్ మరియు డబ్ల్యుటిఐలతో పోలిస్తే ఆకర్షణీయమైన డిస్కౌంట్ల కారణంగా భారతీయులు కజకిస్తాన్ యొక్క సిబిసి మిశ్రమం మరియు కెనడియన్ చమురును కొనుగోలు చేశారు” అని ఉల్-హక్ చెప్పారు. తుఫానులు గత నెలలో భారత తీరం వెంబడి సరుకులను విడుదల చేయడంలో ఆలస్యం కావడంతో ట్యాంకర్ రాక డేటా ప్రారంభ ప్రభుత్వ డేటాకు విరుద్ధంగా అధిక దిగుమతులను చూపించింది.
సినిమా స్క్రిప్ట్ & రివ్యూ : 10/25/20 .Header h1 { font: normal normal 90px Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; color: #ffff00; } .Header h1 a { color: #ffff00; } .Header .description { font-size: 130%; } /* Tabs ----------------------------------------------- */ .tabs-inner { margin: 1em 0 0; padding: 0; } .tabs-inner .section { margin: 0; } .tabs-inner .widget ul { padding: 0; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; } .tabs-inner .widget li { border: none; } .tabs-inner .widget li a { display: inline-block; padding: 1em 1.5em; color: #ffffff; font: normal bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; } .tabs-inner .widget li.selected a, .tabs-inner .widget li a:hover { position: relative; z-index: 1; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } /* Headings ----------------------------------------------- */ h2 { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #00ffff; } .main-inner h2.date-header { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #0f0e0c; } .footer-inner .widget h2, .sidebar .widget h2 { padding-bottom: .5em; } /* Main ----------------------------------------------- */ .main-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner .section { margin: 0 20px; } .main-inner .column-right-inner { margin-left: 20px; } .main-inner .fauxcolumn-right-outer .fauxcolumn-inner { margin-left: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner { margin-right: 20px; } .main-inner .fauxcolumn-left-outer .fauxcolumn-inner { margin-right: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner, .main-inner .column-right-inner { padding: 15px 0; } /* Posts ----------------------------------------------- */ h3.post-title { margin-top: 20px; } h3.post-title a { font: italic bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #b02ef1; } h3.post-title a:hover { text-decoration: underline; } .main-inner .column-center-outer { background: #ffffff none repeat scroll top left; _background-image: none; } .post-body { line-height: 1.4; position: relative; } .post-header { margin: 0 0 1em; line-height: 1.6; } .post-footer { margin: .5em 0; line-height: 1.6; } #blog-pager { font-size: 140%; } #comments { background: #cccccc none repeat scroll top center; padding: 15px; } #comments .comment-author { padding-top: 1.5em; } #comments h4, #comments .comment-author a, #comments .comment-timestamp a { color: #b02ef1; } #comments .comment-author:first-child { padding-top: 0; border-top: none; } .avatar-image-container { margin: .2em 0 0; } /* Comments ----------------------------------------------- */ #comments a { color: #b02ef1; } .comments .comments-content .icon.blog-author { background-repeat: no-repeat; background-image: url(); } .comments .comments-content .loadmore a { border-top: 1px solid #b02ef1; border-bottom: 1px solid #b02ef1; } .comments .comment-thread.inline-thread { background: #ffffff; } .comments .continue { border-top: 2px solid #b02ef1; } /* Widgets ----------------------------------------------- */ .sidebar .widget { border-bottom: 2px solid #f1d08f; padding-bottom: 10px; margin: 10px 0; } .sidebar .widget:first-child { margin-top: 0; } .sidebar .widget:last-child { border-bottom: none; margin-bottom: 0; padding-bottom: 0; } .footer-inner .widget, .sidebar .widget { font: normal normal 14px Georgia, Utopia, 'Palatino Linotype', Palatino, serif; color: #ffe599; } .sidebar .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .sidebar .widget a:visited { color: #6ef12e; } .sidebar .widget a:hover { color: #c1c1c1; text-decoration: underline; } .footer-inner .widget a:link { color: #3630f4; text-decoration: none; } .footer-inner .widget a:visited { color: #000000; } .footer-inner .widget a:hover { color: #3630f4; text-decoration: underline; } .widget .zippy { color: #ffffff; } .footer-inner { background: transparent none repeat scroll top center; } /* Mobile ----------------------------------------------- */ body.mobile { background-size: 100% auto; } body.mobile .AdSense { margin: 0 -10px; } .mobile .body-fauxcolumn-outer { background: transparent none repeat scroll top left; } .mobile .footer-inner .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .mobile .footer-inner .widget a:visited { color: #6ef12e; } .mobile-post-outer a { color: #b02ef1; } .mobile-link-button { background-color: #3630f4; } .mobile-link-button a:link, .mobile-link-button a:visited { color: #ffffff; } .mobile-index-contents { color: #444444; } .mobile .tabs-inner .PageList .widget-content { background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } .mobile .tabs-inner .PageList .widget-content .pagelist-arrow { border-left: 1px solid #ffffff; } sikander777 --> సినిమా స్క్రిప్ట్ & రివ్యూ రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు... టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం! Sunday, October 25, 2020 990 : సందేహాలు- సమాధానాలు Q : ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘కలర్ ఫోటో’ వంటి సినిమాల రివ్యూస్ ఇవ్వొచ్చుగా, సంక్షిప్తంగానైనా? ―ఎపి, అసోసియేట్ A : ఇలాటివి చూసి చూసి రాసి రాసి వున్నాం. ఇంకా ఇలాటివి చూస్తే రాయ బుద్ధిగావడం లేదు, ఏం చేద్దాం. ఇవి చూసి మీరైనా నేర్చుకునేదేమిటి? నిర్మాణమా, కథాకథనాలా, మార్కెట్ - క్రియేటివ్ యాస్పెక్ట్సా? ఏం నేర్చుకుంటారు. మీరే నేర్పగల స్థాయిలో వుంటారు. కాబట్టి ఏదైనా రవంత నేర్చుకోదగ్గ సినిమాలుంటే వాటి గురించి చెప్పుకోవడం బెటర్. సినిమా లవర్స్ ప్రతీ సినిమా చూస్తూ కాలక్షేపం చేస్తారు. సినిమా మేకర్స్ ప్రతీ సినిమా చూడరు, మాట్లాడరు. Q : నావి రెండు ప్రశ్నలు. 1. ఈ రోజే (అక్టోబరు 24) ‘ఆహా’ ఓటిటి లో రిలీజ్ అయిన ‘కలర్ ఫోటో’ సినిమా చూశాను. అయితే సినిమాలో ఓ చోట హీరో పాత్ర 'నేను కథానాయకుడుని కాదు, కథా వస్తువుని మాత్రమే’ అని డైలాగ్ చెబుతాడు. మరి వాళ్ళు తెలిసి అలా డైలాగ్ వాడారో లేక తెలియకుండా చెప్పించారో గానీ, సినిమా మాత్రం మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయిపోయింది. అసలు ఈ కథానాయకుడు, కథావస్తువు ఏమిటో వివరించగలరు. 2. ప్రేమ సినిమాలలో ఎంత చెత్త సినిమా అయినా కూడా లవర్స్ కలుసుకోవడం, ప్రేమలో పడటం, ఆ తర్వాత విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం ఉంటుంది. నిజానికి ఇంటర్వల్ కి వాళ్ళు ప్రేమలో పడ్డాక, వాళ్ళ ప్రేమకు ఏదో అడ్డంకి వస్తుంది. కానీ ‘కలర్ ఫోటో’ సినిమా లో ఇంటర్వల్ టైమ్ కు హీరో హీరోయిన్ల ప్రేమ స్టార్ట్ అయింది. మళ్ళీ సెకండ్ హాఫ్ సగానికి పైగా ప్రేమించుకోవడానికే సరిపోయింది. వాళ్ల మధ్య సమస్య వచ్చేసరికి క్లయిమాక్స్ వచ్చేసింది. స్ట్రక్చర్ ఫాలో అవకపోతే ఇంత దారుణంగా ఉంటుంది వ్యవహారం. కొంచెం ప్రేమకథ సినిమాలకు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్నది వివరించండి. ―విడి, అసోసియేట్ A : 1. ‘నేను కథానాయకుడుని కాదు, కథా వస్తువుని మాత్రమే’ అనేది గొప్ప గ్రౌండ్ బ్రేకింగ్, చారిత్రాత్మక డైలాగు అనాలి. దీనర్ధం తెలిసే వాడారా లేదా అనేది దర్శకుణ్ణే అడగాలి. తెలిసి వాడి వుంటే, ఇలా సినిమా తీస్తే ఏమవుతుందో తెలిసే తీసి వుండాలి. దీనర్ధం ఏమిటయ్యా అని నిర్మాతే గనుక అడిగి వుంటే, ఆ నిర్మాతకి దర్శకుడు పూర్తి నిజం చెప్పేసి వుంటే, ఈ సినిమా తీయడం మానేసి పెట్టుబడి భద్రపర్చుకునే వాళ్లేమో. ‘నేను కథానాయకుణ్ణి’ అంటే కథకి నాయకుడు. అంటే కథని తాను నడిపే యాక్టివ్ క్యారక్టర్. ‘నేను కథావస్తువుని’ అంటే, తనే కథ, లేదా కథావస్తువు. అంటే కథే/కథావస్తువే తనని నడిపిస్తుంది. అంటే బస్సుని డ్రైవర్ నడిపినట్టు గాక, బస్సే వచ్చేసి డ్రైవర్ ని నడిపినట్టు ఇలాటి సినిమాలు తీసి ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు. అంటే కథావస్తువు లేదా కథ నడిపినట్టూ నడుచుకునే పాసివ్ క్యారక్టరన్న మాట తను. ‘నేను కథానాయకుణ్ణి’ అంటే అది కథవుతుంది. ‘నేను కథావస్తువుని’ అంటే గాథ అవుతుంది. కమర్షియల్ సినిమాలకి గాథలు పనికి రావని చాలాసార్లు చెప్పుకున్నాం. అయినా కథకీ గాథకీ తేడా తెలీక తీసి ఫ్లాప్ చేస్తూనే వుంటారు. ఈ సినిమాలో హీరో కథావస్తువుని అనడం, దీనికి తగ్గట్టే స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ గా వుండడమూ సరిపోయాయి గాథ లక్షణాలకి. కంగ్రాట్స్ చెపుదాం. 2. ఏ జానర్ సినిమాకైనా స్ట్రక్చరొకటే. బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలు, వాటి నియమిత నిష్పత్తులు, వాటిలో జరిగే బిజినెస్సులతో కూడిన త్రీయాక్ట్ స్ట్రక్చర్. నిష్పత్తులు గల్లంతయితే మిడిల్ మటాషులు, మటన్ షాపులు, కైమా కొట్టించుకున్న దర్శకుల జీవితాలు. ఈ మిడిల్ మటాషులెప్పట్నించి ప్రారంభమయ్యాయో తెలుసా? 2000 సంవత్సరం నుంచీ రచయితల్ని మూల కూర్చోబెడుతూ, ‘కథ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం’ అని తామేనంటూ సినిమా గురించి తెలియని కొత్తకొత్త దర్శకులు- యూత్ సినిమాలంటూ ప్రారంభించిన ‘లైటర్ వీన్’ అనే బలహీన ప్రేమ సినిమాల ‘ట్రెండ్’ తో. రచయితల్ని మూల కూర్చోబెట్టాక ఇక మిడిల్ మటాషులే మటాషులు ఈ 2020 వరకూ. 2000 కి పూర్వం మిడిల్ మటాషుల్లేవు. ప్రేమ సినిమాల స్ట్రక్చర్ అంటూ ప్రత్యేకంగా ఏమీ వుండదు. పైన చెప్పుకున్నట్టు అన్ని జానర్లకీ ఒకే త్రీయాక్ట్ స్ట్రక్చర్. జానర్ ని బట్టి స్ట్రక్చర్ మారేది కాదు. జీవితాల్ని బట్టి మనిషి బ్రెయిన్ స్ట్రక్చర్ మారుతుందా? అదే కాన్షస్ మైండ్, అదే సబ్ కాన్షస్ మైండ్, వీటితో ఆడుకునే అదే ఇగో - ఇదీ మనిషి బ్రెయిన్ స్ట్రక్చర్. మనిషి బ్రెయిన్ స్ట్రక్చర్ లోంచి ఏర్పాటయిందే వెండి తెరమీద స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. అప్పుడే మనిషి బ్రెయిన్ చక్కగా కనెక్ట్ అవగల్గుతుంది. మనిషి బ్రెయిన్ లాగే కథల స్ట్రక్చర్ శాశ్వతం, సార్వజనీనం. సినిమా కథలనే కాదు, ఇంకే రూపంలో కథకైనా ఇదే స్ట్రక్చర్. ఆధ్యాత్మికంగా ప్రపంచ పురాణాల్లోంచి, జానపదాల్లోంచీ వచ్చిన స్ట్రక్చర్. ఇందుకే స్ట్రక్చర్ గురించి మనమింత పట్టుబట్టేది. ఇక ఈ స్ట్రక్చర్ కి లోబడి ఏ జానర్ కా కథనం, జానర్ మర్యాదలు వుంటాయి. రోమాన్స్ జానర్లో రోమాంటిక్ కామెడీ సబ్ జానర్ కథనం, జానర్ మర్యాదలు వేరు; రోమాంటిక్ డ్రామా సబ్ జానర్ కథనం, జానర్ మర్యాదలు వేరు. వీటి గురించి విపులంగా ‘రోమాంటిక్ కామిడేడ్పులు’ అన్న వ్యాసం వుంది బ్లాగులో. Q : నేను డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ని. నా ఫ్యూచర్ గోల్ దర్శకుడిని కావడమే. నేను ఒక కథ మొదలు పెడతాను. అది పూర్తి చేయకుండా ఇంకొకటి మొదలు పెడతాను. ఇలా చాలా కథలు మొదలు పెట్టి పూర్తి చేయలేక పోతున్నాను. మీరు ప్రొడక్టివిటీ గురించి పెట్టిన పోస్టు చదివాను. అందులో నా సమస్య తీరలేదు. ఏం చేయమంటారో వచ్చే ఆదివారం చెప్పండి. ―రెడ్డి కెఎస్ A : చాలా పెద్దగా రాసిన ప్రశ్నని తగ్గించాం. కథ రాయడం గురించి చెప్పమంటే చెప్పవచ్చు గానీ, కథలు పూర్తి చేయలేక పోతున్నమీ వ్యక్తిగత క్రమశిక్షణకి సంబంధించిన సమస్యని వ్యక్తిత్వ వికాస నిపుణుల ముందు పెట్టాలేమో ఆలోచించండి. దర్శకుడు కావాలన్న మీ గోల్ పట్ల మీకు నిబద్ధత లేదేమో, వున్నానిలకడతనం లేదేమో. ఇలా మానసిక కారణాలుండవచ్చు. రాత సమస్యగా కథ పూర్తి చేయడంలో వచ్చే ఇబ్బందులు, వాటి పరిష్కారాల గురించయితే చెప్పొచ్చు. ఈ రాత సమస్య మీకుందేమో చెక్ చేసుకోండి. పూర్తి స్థాయిలో సినాప్సిస్ లేదా ఔట్ లైన్ ముందుగా సిద్ధం చేసుకోక పోతే, రాస్తున్న కథ ముందుకు కదలక పోవచ్చు. అప్పుడు ఈ కథ లాభం లేదని మధ్యలో ఆపేసి ఇంకో కథ మొదలెట్ట వచ్చు. అదీ ముందుకు కదలక ఆపేసి ఇంకోటి మొదలెట్టొచ్చు. ఇలా సాగుతూనే వుంటుంది. ముందు ప్లాను వేసుకోకుండా ఇల్లు కట్టగలరా? ఇదే మీ సమస్య అయితే ఇలా చేయాలి : ముందుగా కథ అనుకోకూడదు, చిన్న ఐడియా తీసుకోవాలి. ఏం ఐడియా తీసుకోవాలా అని ఐడియా కోసం షాపింగ్ చేయవద్దు. అయిడియా మీరు చూస్తున్న, చదువుతున్న, వింటున్న వాటిలోంచి యాదృచ్ఛికంగా మీకు స్ఫురించాలి. అప్పుడే ఒరిజినల్ అయిడియా అవుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. ఉదాహరణకి ఇటీవల ఒక ఉత్తరాది రాష్ట్రంలో ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ ఎన్ కౌంటర్, దీనికి పూర్వం ఇంకో రాష్ట్రంలో ఇంకో పెద్ద గ్యాంగ్ స్టర్ ఎన్ కౌంటర్ రెండూ గమనిస్తే ఒకటి అన్పించింది : ఈ గ్యాంగ్ స్టర్స్ బ్లడీ ఫూల్స్. ప్రభుత్వ యంత్రాంగంతో, రాజకీయ పక్షంతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళకోసం తాము చేస్తూ, తమ కోసం వాళ్ళతో చేయించుకుంటూ ఎదురు లేదని విర్రవీగుతారు. తీరా ఇద్దరి బండారం బయటపడే రోజు వస్తుంది. ఎవిరీ మ్యాడ్ డాగ్ హేజ్ టు ఫేస్ అడ్వాన్సుడు డెత్ అన్నమాట. ఆ రోజు రాగానే అదే అధికార యంత్రాంగం, రాజకీయ పక్షం అరెస్ట్ చేసి తీసికెళ్లి ఎన్ కౌంటర్ చేసేసి పునీతమైపోతారు. కాబట్టి ఇలాటి ప్రతీ గ్యాంగ్ స్టర్ ఫూలిష్ గా తన భవిష్యత్ ఎన్ కౌంటర్ కి తనే బాట వేసుకుంటున్నాడని తెలుసుకోని ఒక బలిపశువు. ఈ నీతితో కొత్త గ్యాంగ్ స్టర్ కథ పుట్టవచ్చు. ఇలా థ్రిల్లింగ్ ఐడియా స్ఫురిస్తే ఆపమన్నా ఆపలేరు. తర్వాత ఈ అయిడియాని రీసెర్చి చేయాలి. ఆ తర్వాత సినాప్సిస్ లేదా ఔట్ లైన్ స్ట్రక్చరల్ గా విభజించుకుని (బిగినింగ్- మిడిల్- ఎండ్) రాసుకోవాలి. అప్పుడు ఏం రాయాలో ఎలా రాయాలో పూర్తి బ్లూప్రింట్ చేతికొస్తుంది. దాంతో ఆర్డర్ వేసుకోవాలి. ఇక ఆగమన్న ఆగదు కథ. కాకపోతే ఏ ఆర్నెల్లకో ఒక సారి ఆవులిస్తూ వొళ్ళు విరుచుకుని లేచి పూర్తి చేయడానికి కూర్చోకూడదు. ఒకటే బండ గుర్తు : ప్రాక్టికల్ గా కథ ముందుకు కదలని రాత సమస్య వస్తోందంటే, వచ్చిన ఐడియాకి ప్రారంభ ముగింపుల సినాప్సిస్ లేదా ఔట్ లైన్ రాసుకోలేదనే, లేదా సరిగ్గా రాసుకోలేదనే అర్ధం. Q : సినిమా క్రియేటివిటీకి నేను కొన్ని పుస్తకాలు కొన్నాను. అర్ధం గావడం లేదు. బోరు కొడుతున్నాయి. వీటికంటే సినిమాలు చూసి నేర్చుకోవడమే బెటర్ అనుకుంటున్నాను. అర్ధమయ్యే మంచి స్క్రీన్ ప్లే పుస్తకాలు చెప్పండి. ―ఆర్ శ్రీనివాస్, అసిస్టెంట్ A : సినిమాలు చూసి నేర్చుకోవడం కూడా ఒక పద్ధతి. అదొక స్కూలు. సొంత స్కూలు. ఇంకో పద్ధతి అకడెమిక్ స్కూలు. స్క్రీన్ ప్లే పుస్తకాలు సరదాగా చదువుకునే సినిమా కబుర్లు కావు. స్క్రీన్ ప్లే పుస్తకాలు అకడెమిక్ (విద్యా సంబంధమైన) పుస్తకాలు. ఈ స్కూలుతో ఆసక్తి లేకపోతే అకడెమిక్ పుస్తకాలు బోరే కొడతాయి. కానీ సినిమా క్రియేటివిటీకి అకడెమిక్స్ తో సంబంధముంది. అకడెమిక్స్ లేకుండా సినిమా క్రియేటివిటీ లేదు. కాబట్టి బోరు కొడుతున్నాయనే అభ్యంతరకర మాట మానెయ్యాలి. పోతే, స్క్రీన్ ప్లే పుస్తకాలే కదాని ఏది పడితే అది చదవకూడదు. మార్కెట్ లో చాలాచాలా స్క్రీన్ ప్లే టాపిక్స్ తో పుస్తకాలు ఆకర్షిస్తూంటాయి. ‘150 స్క్రీన్ రైటింగ్ ఛాలెంజెస్’ అన్నాడు ఏమిటో చూద్దామని కొనేస్తే నెత్తినేసి కొట్టుకోవడమే. ‘ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’ అంటున్నాడు చదివేద్దామని చేజిక్కించుకుంటే నెత్తికింద తలగడ చేసుకుని నిద్రపోవడమే. చాలా మంది చేస్తున్న ఘోరమైన నేరాలు- అతి కిరాతకాలు ఇవే. ముందు ఎలిమెంటరీ, తర్వాత హై స్కూలు, ఆ తర్వాత కాలేజీ, ఇంకా తర్వాత యూనివర్సిటీ పుస్తకాలన్నట్టు, ఈ క్రమ పద్ధతిలో ప్రోటోకాల్ పాటిస్తేనే పుస్తకాలు అర్ధమై లాభపడతారు. ముందుగా స్ట్రక్చర్ కి సంబంధించి బేసిక్స్ సులభంగా అర్ధమవడానికి సిడ్ ఫీల్డ్ ‘స్క్రీన్ ప్లే’ చదువుకోవాలి. రివ్యూలు రాయడానికి మనం బుద్ధిగా చేసిన మొట్టమొదటి పని ఇదే. దీని మీద పట్టు సాధించకపోతే ఇంకేదీ చదవక్కర్లేదు, అర్ధంగావు కూడా. అప్పుడు ఈ స్కూలులో స్క్రీన్ రైటర్ అవుదామన్న ఆలోచన ఇక మానెయ్యొచ్చు. తర్వాత ఐడియాని ఎలా నిర్మించాలన్న దాని గురించి ఎరిక్ బోర్క్ ‘ది ఐడియా’ అన్న పుస్తకం, దీని తర్వాత సినాప్సిస్ ఎలా రాయాలన్న దాని గురించి scriptreaderpro.com అన్న వెబ్సైట్; ఇక ఆర్డర్ వేయడానికి జెన్నిఫర్ గ్రిసాంటీ ‘స్టోరీ లైన్’ అన్న పుస్తకం, ట్రీట్ మెంట్ రైటింగ్ కి studiobinder.com అన్న వెబ్సైట్ తీసుకోవచ్చు. దీంతో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అర్ధమవడం పూర్తవుతుంది. ఇది మన వరకు. హాలీవుడ్ లో డైలాగుల్ని కూడా కలుపుకుని స్క్రీన్ ప్లే అంటారు. ఈ స్ట్రక్చర్ అనేది అస్థిపంజరం. అస్థిపంజరం తయారీ అర్ధమైన తర్వాత, దీనికి రక్త మాంసాలద్దడానికి క్రియేటివిటీకి సంబంధించిన పుస్తకాల జోలికి పోవాలి. అప్పటివరకూ ఇప్పుడు చెప్పబోతున్న పుస్తకాల జోలికి పోకూడదు. పై అభ్యాసం లేకపోతే ఏమీ అర్ధంగావు. వీటిని ఈ వరస క్రమంలో చదవాలి : జాన్ ట్రూబీ ‘ది అనాటమీ ఆఫ్ స్టోరీ’, జెఫ్రీ కల్హాన్ ‘ది గైడ్ ఫర్ ఎవిరీ స్క్రీన్ రైటర్ - ఫ్రమ్ సినాప్సిస్ టు సబ్ ఫ్లాట్స్’, రాబర్ట్ మెక్ కీ ‘స్టోరీ’, థామస్ లెన్నన్ -రాబర్ట్ బెన్ గరాంట్ ‘రైటింగ్ మూవీస్ ఫర్ ఫన్ అండ్ ప్రాఫిట్’ అన్న పుస్తకాలు. దీంతో పూర్తి స్థాయి సమగ్ర స్క్రీన్ ప్లే విధానాన్ని స్వయంగా అర్ధం జేసుకోవడమో, నేర్చుకోవడమో పూర్తవుతుంది. అప్పుడే అడిషనల్ స్టడీస్ జోలికి పోవాలి. అంటే చేసే తప్పులు, పొరపాట్లు, వాటి పరిష్కారాలకి సిడ్ ఫీల్డ్ ‘ది స్క్రీన్ రైటర్స్ ప్రాబ్లం సాల్వర్’, విలియం అకర్స్ ‘యువర్ స్క్రీన్ ప్లే సక్స్’ మొదలైనవి. ఈ మొత్తం పుస్తకాల సెట్టుకి ఎనిమిది వేలు వరకూ పెట్టుకోవాలి. అయితే ఎంత హాలీవుడ్ నుంచి స్ట్రక్చర్ తెలుసుకున్నా, దాన్ని తెలుగు సినిమాలకి కస్టమైజ్ చేసుకున్నప్పడే ప్రయోజనం. స్ట్రక్చర్ గురించి ఏం తెలుసుకుంటున్నా, దాన్ని తెలుగు సినిమాలకి ఎలా అన్వయించాలా అని ఆలోచించాలే తప్ప, ఉన్నదున్నట్టు హాలీవుడ్ ని దింపెయ్యకూడదు. దెబ్బతింటారు. సింపుల్ గా చెప్పాలంటే స్ట్రక్చర్ని తెలుగుకి కస్టమైజ్ చేసుకుని ఓన్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేటివిటీకి పనిచెప్పాలి. ఇలా పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయిపోయాం కదాని మార్కెట్లో ఆకర్షించే ఇతర సవాలక్ష పుస్తకాల మీద పడకూడదు. పని చేసుకోవాలి. అవన్నీ చదువుకుంటూ కూర్చుంటే చదవడమే వ్యసనమై రాసే పని, తీసేపని మొదలెట్టలేరు. పుస్తకాలు పట్టుకుని తిరుగుతూ చర్చలు పెట్టుకుంటారు. పనికిరాని మ్యాడ్ మేధావి అయిపోతారు. ఇలాటి శాల్తీలున్నారు. ఈ ట్రాప్ లో పడకుండా అప్రమత్తంగా వుండాలి. ఇంతేగాకుండా, గొప్ప స్ట్రక్చరాశ్యులై పోయామని అభిప్రాయం కల్గించకూడదు. అందరూ స్ట్రక్చర్ స్కూల్లో వుండరు. సొంత స్కూళ్ళు వున్నాయి. వాటిదే హవా, వాటివే 90% ఫ్లాపులు. నేర్చుకున్న స్ట్రక్చర్ మీలోనే దాచుకుని, పనిలో ఉపయోగించుకుంటూ పోవాలి. డాంబికంగా స్ట్రక్చర్ అనో పచ్చిపులుసు అనో డిస్కషన్స్ లో అదరగొట్టే పని చేయకూడదు. రాబర్ట్ మెక్ కీ మాట గుర్తుంచుకోవాలి : విలుకాడు విలువిద్య నేర్చుకునే వరకే అందులో వుండే సాంకేతికాలు చర్చిస్తాడు. నేర్చుకున్న తర్వాత బాణాలేయడం దానికదే అలవాటైపోతుందే తప్ప, అందరి ముందూ నేర్చుకున్న శాస్త్రం వల్లె వేస్తూ బాణాలేయడు. ఆటోమేటిగ్గా వేసేస్తాడు. ఇది గుర్తు పెట్టుకోవాలి (మనమంటే ఈ బ్లాగులో రాయాలి కాబట్టి వివిధ భంగిమల్లో ఇలా శాస్త్రాభినయం చేస్తున్నాం, బయట నోర్మూసుకుని వుంటాం). అప్పుడు వృత్తిలో స్థిరపడ్డాక, వృత్తి ప్రయాణంలో అప్డేట్ అవుతూ వుండడానికి, తీరిక దొరికినప్పుడు ఇతర సవాలక్ష పుస్తకాలు నవలల్లాగా చదువుకుంటూ వుంటే ఇబ్బంది లేదు. (‘ది నట్షెల్ టెక్నిక్’, ‘మేకింగ్ ఏ గుడ్ స్క్రిప్ట్ గ్రేట్’ వంటివెన్నో). స్క్రీన్ ప్లే పుస్తకాలనే కాదు, కెమెరా, ఎడిటింగ్, సౌండ్ మొదలైన సాంకేతికాలకి సంబంధించిన పుస్తకాలూ చదవొచ్చు. ఇంకా వెబ్సైట్స్ చూడొచ్చు. సినిమా రచనా సాహిత్యం ప్రపంచంలో ఒక్క హాలీవుడ్ నుంచే ఉత్పత్తి అవుతోంది. ఎందుకంటే ఇతర దేశాల్లో రాయడానికి స్ట్రక్చర్ వుండదు. ఆ సినిమాలు ఎక్కడికక్కడ సొంత స్కూలు సినిమాలు. వీటికి రచనా సాహిత్యం వుండదు. ఉదాహరణకి వరల్డ్ మూవీస్. కమర్షియల్ సినిమాలకి అంతర్జాతీయ మార్కెట్ గల భారీ పరిశ్రమ అయిన ఒక్క హాలీవుడ్ మాత్రమే సొంత స్కూళ్ళు పెట్టకోకుండా సార్వజనీన, సార్వకాలిక మన్నికగల స్ట్రక్చర్ సాహిత్యం (సినిమా రచనా సాహిత్యం) తోబాటు, వివిధ శాఖల టెక్నాలజీ సాహిత్యం -అంటే కెమెరా, ఎడిటింగ్, సౌండ్ వగైరా - అందించగలదు. ఎక్కడి ఫిలిమ్ స్కూల్లోనైనా కోర్సులుండేది స్ట్రక్చర్ సాహిత్యంతోనే. క్రియేటివ్ ఫీల్డు నిత్య అధ్యయనం ఫీల్డు. స్టిరపడ్డాం కదాని అప్డేట్ అవడం మానేస్తే అవుట్ డేటెడ్ అయిపోతారు. ―సికిందర్ Posted by సికిందర్ at 12:11:00 PM Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Newer Posts Older Posts Home Subscribe to: Posts (Atom) ఈ కాన్సెప్ట్ కి బాధితురాలి కథ అవసరం! స్క్రీన్ ప్లే సంగతులు...? Search This Blog contact msikander35@gmail.com, whatsapp : 9247347511 Popular Posts 1255 : రివ్యూ! రచన- దర్శకత్వం : శైలేష్ కొలను తారాగణం : అడివి శేష్ , మీనా క్షీ చౌదరి , కోమలీ ప్రసాద్ , రావు రమేష్ , శ్రీకాంత్ అయ్యంగార్ , తనికెళ్ళ భర... 1258 : సండే స్పెషల్ రివ్యూ! ‘ చాం దినీ బార్ ’ (ముంబాయి బార్ గర్ల్స్ జీవితాలు) , ‘ పేజ్ త్రీ ’ (ఉన్నత వర్గాల హిపోక్రసీ ) , ‘ కార్పొరేట్ ’ (కార్పొరేట్ రంగం... 1257 : రివ్యూ! 2023 లో జరిగే 95 వ ఆస్కార్ అవార్డ్స్ కి మన దేశం తరపున అధికారిక ఎంట్రీ పొందిన గుజరాతీ చలన చిత్రం ‘ చెల్లో షో ’ (చివరి షో) అక్టోబర్... 1256 : రివ్యూ! రచ న -దర్శక త్వం : ఆనంద్ జె తారాగణం: రావణ్ రెడ్డి , శ్రీ ని ఖి త , లహ రీ గుడివాడ , రవీంద్ర బొమ్మకంటి , అమృత వర్షిణి తదిత తరులు సంగీతం: ఫ... 1259 : రివ్యూ! రచన - దర్శకత్వం : చెల్లా అయ్యావు తారాగణం : విష్ణు విశాల్ , ఐశ్వ ర్యా లక్ష్మి , కరుణాస్ , శ్రీజా రవి , మునిష్కాంత్ తదితరులు సంగీతం : జస్... రైటర్స్ కార్నర్ హై కాన్సెప్ట్ స్క్రిప్ట్ అంటే బిగ్ కలెక్షన్స్ ని రాబట్టే స్క్రిప్ట్. ఈ ఆర్టికల్ లో మీకు బిగ్ కలెక్షన్స్ ని సాధించి పెట్టే హై కాన్స... తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17 స్క్రీ న్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసల... 1254 : రివ్యూ! రచన - దర్శక త్వం : ప్రదీప్ రంగనాథన్ తారాగణం : ప్రదీప్ రంగనాథన్ , సత్యరాజ్ , యోగి బాబు , ఇవానా , రాధి కా శరత్‌కుమార్ , రవీనా తదితరులు సంగీ త... 1251 : స్క్రీన్ ప్లే సంగతులు -1 దె య్యాలు ఎలాగైతే మూఢ నమ్మకమో , చేతబడి అలాటి మూఢ నమ్మకమే. దెయ్యాలతో హార్రర్ సినిమాలు తీసి ఎంటర్ టైన్ చేయడం వరకూ ఓకే. చేతబడి వుందంటూ నమ... 1253 : రివ్యూ! రచన - దర్శక త్వం : ఏఆర్ మోహన్ తారాగణం : అల్లరి నరేష్ , ఆనంది , వెన్నెల కిషోర్ , ప్రవీణ్ , సంపత్ రాజ్ , శ్రీ తేజ్ , రఘుబాబు తదితరులు ...
దేవుడు తాను చేస్తానన్నదానిని చేసి తీరుతాడనీ మనం ఎంతవరకు నమ్ముతామో మన విశ్వాసం అంత బలంగా ఉంది అనుకోవాలి. విశ్వాసానికి మన ఆలోచనలతోగాని, అభిప్రాయాలతోగాని, ఒక విషయం జరగడానికి అవకాశం ఉందా లేదా అన్న మీమాంసతో గాని నిమిత్తం లేదు. బయటికి కనిపించే దానితో పనిలేదు. వీటన్నిటినీ విశ్వాసానికి ముడి పెట్టాలని చూస్తే మనం దేవుని మాటని నమ్మడం లేదన్నమాట. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడూ అంటే ఇక మనకి చీకటిలో పనిలేదు. విశ్వాసం అనేది కేవలం దేవుని మాట మీదనే ఆధారపడి ఉంటుంది. ఆయన మాటను మనం ఉన్నదున్నట్టుగా నమ్మితే మన మనస్సుకి శాంతి ఉంటుంది. మనలోని విశ్వాసాన్ని వాడుకోవడం దేవుడికెంతో సంతోషదాయకం. మొదటగా మన ఆత్మల్ని దీవించడానికి, రెండవదిగా సంఘాన్ని, సంఘంలో చేరని వాళ్ళని కూడా ఆశీర్వదించడానికి, కాని ఇలా ఉపయోగపడే స్థితినుంచి మనం మొహం చాటుచేసు కుంటాం. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనాలంటే "నా పరలోకపు తండ్రి ఈ శ్రమల గిన్నెని నా చేతుల్లో ఉంచాడు. ఇది గడిచిన తరువాత ఆయనే నాకు రుచికరమైన దాన్ని తాగడానికిస్తాడు." శ్రమలనేవి విశ్వాసానికి ఆహారం. మన పరలోకపు తండ్రి చేతుల్లో ఉండిపోదాం. తన పిల్లలకి మంచి చెయ్యడమే ఆయన మనసుకి ఆనందం.. విశ్వాసం ఉపయోగపడడానికీ, అభివృద్ధి పొందడానికీ సాధనాలు కేవలం కష్టాలూ, శ్రమలే కావు. వాక్యాన్ని చదవడం, తద్వారా దేవుడు తన గురించి తాను చెప్పుకున్నదాన్ని ఆకళింపు చేసుకోవడం కూడా విశ్వాసం పెంపొందించుకునే మార్గాలే. నీకు దేవుని వాక్యంతో ఉన్న పరిచయం వల్ల నువ్వు చెప్పగలగాలి "దేవుడెంత ప్రేయామయుడు!" అని. అలా కాని పక్షంలో నేను అపేక్షగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఇలాటి స్థితికి తీసుకురమ్మని దేవుణ్ణి అడగండి. ఆయన దయనూ, మృదుమధురమైన లాలననూ మీరు పూర్తిగా అనుభవించాలనీ, ఆయన ఎంత మంచివాడో తెలుసు కోవాలనీ, తన పిల్లలకి క్షేమం జరగడం ఆయనకెంత ఇష్టమో మీకు తెలియాలని అర్థించండి. ఇలాటి మానసిక స్థితికి మనం ఎంత దగ్గరగా రాగలిగితే అంత నిశ్చింతగా మనల్ని మనం ఆయన చేతులకి అప్పగించుకుంటాం. మన బ్రతుకులో ఆయన ఏమి చేసినప్పటికీ తృప్తిగానే ఉంటాము. అప్పుడు శ్రమలు వస్తే మనం చెప్పగలం. "వీటి ద్వారా దేవుడు నాకేమి చేయనున్నాడో ఓపికగా కనిపెట్టి చూస్తాను. ఆయన ఏదో ఒక మేలు చేస్తాడని నా నిశ్చయం." ఈ విధంగా ఒక హుందాతనంతో లోకం ఎదుట సాక్ష్యమిస్తాము. ఈ విధంగా ఇతరులను మనం బలపరుస్తాము. Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
ప్రియమైన చిన్న బిడ్డలారా... మీరంటే యేసయ్యకు ఎంతో ఇష్టం. “చిన్న బిడ్డలని నా యొద్దకు రానియ్యుడి దేవుని రాజ్యం వారిదే” అన్నారు యేసయ్య మీకందరికి మీ స్నేహితులంటే ఇష్టమా ?..చాలా ఇష్టమా..? మరి మనము దేవుని ఫ్రెండ్స్ ఎవరో చూద్దామా ! అబ్రహాము: అబ్రహాము అతని భార్య శారా ఒక దేశములో నివసించేవారు. ఆ దేశములో అందరు దేవునికి అవిధేయులై ఉండేవారు. ఒక రోజున దేవుడు అబ్రహాముతో, ఆ దేశము వదిలి నేను చూపించిన దేశమునకు వెళ్ళు అని చెప్పారు. అబ్రహాముకి దేవుడంటే చాల ఇష్టం. ఏమి అడగకుండా దేవునికి విధేయత చూపించి, ఆ దేశాన్ని వదిలి దేవుడు చూపించిన దేశముకి తన భార్యయైన శారాను, లోతును మరియు ఆయన పరిచారకులను తీసుకొని బయలుదేరారు. అప్పుడు అబ్రహాముకి 75 సంవత్సరాలు. అబ్రహాముకి బిడ్డలు లేరు. అబ్రహాము 25 సంవత్సరాలు ప్రయాణించి, దేవుడు చూపించిన ఆ కొత్త దేశమునకు వెళ్లారు. ఆ దేశం ఎంతో అందంగా ఉంది. అబ్రహమునకు ఎంతో సంతోషంగా ఉన్నది ఆ దేశమును చూసాక. అబ్రహాము అతని భార్య శారా ఒక గుడారములో ఉండేవారు. ఒక రోజు, కొంత మంది మనుషులు అబ్రహాము దగ్గరకి వచ్చారు. వీరెవరో అబ్రహాముకి తెలియదు. వారు దేవుని దూతలు. అబ్రహామునకు వారెవరో తెలియకపోయినా వారికి ఆతిధ్యమిచ్చి వారిని ఎంతో బాగా చూసుకున్నారు. వారు అబ్రహామును శారాను చూచి దేవుడు మీకు మంచి బాబును ఇస్తాడు అని దీవిస్తారు. అప్పుడు అబ్రహామునకు 100 సంవత్సరాలు అయినప్పటికీ అబ్రహాము ఆ మనుష్యులు చెప్పింది నమ్మాడు. అబ్రహాము శారాలకు దేవుడు ఎంతో మంచి బాబును అనుగ్రహించారు. అతని పేరు ఇస్సాకు. అబ్రహాము దేవునికి ఎంతో మంచి స్నేహితుడు. దేవునికి ఎప్పుడు వినయ విధేయతలతో ఉండేవారు. అందుకే దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. మరి మీరు కుడా స్నేహితులవుతారా?. మనమందరమూ దేవుని బిడ్డలము. దేవుడు మనలను ఎంతో ప్రేమించారు. దేవుడు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తారు. మనము ఆయనకు అబ్రహామువలె విధేయత చూపించాలి. Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీ స్టారర్ చిత్రాలకు ఒకప్పుడు కొదవలేదు. ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ కల్సి బ్లాక్ అండ్ వైట్ మూవీస్ సమయంలో మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి చిత్రాలు,,ఆతర్వాత కాలంలో కలర్ సినిమాల్లో రామకృష్ణులు,సత్యం శివం ఇలా ఇద్దరి కాంబినేషన్ అదిరిపోయేది. పలుచిత్రాల్లో ఇద్దరూ కల్సి నటించారు. ఇక ఆతర్వాత చెప్పుకోతగ్గ జంట హీరోలుగా కృష్ణ – శోభన్ బాబు కల్సి పుట్టినిల్లు – మెట్టినిల్లు, మండే గుండెలు,ముందడుగు ఇలా వీళ్ళిద్దరూ కల్సి పలు చిత్రాల్లో నటించారు. హిట్ అయ్యాయి కూడా. అప్పట్లో ఆయా హీరోల ఇమేజ్ లు ఆధారంగా చిత్రాలు రూపొందించి,మల్టీస్టారర్ తీసేవారు. ఫైటింగ్ సీన్స్,పాటలు ఇలా అన్నీ సమంగా ఉండి తీరాల్సిందే ఒకవేళ ఒకరికి తక్కువ మరొకరికి ఎక్కువ రోల్ వస్తే, అభిమానుల నుంచి విమర్శల వర్షం కురిసేది. ఆలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఆరోజుల్లో హీరోల మధ్య గొడవలు, వివాదాలు లేకున్నా, అభిమానుల మధ్య పోటీ హీరోలను శాసించే స్థాయిలో ఉండేది. ఫాన్స్ కి తలొగ్గే స్థితి నుంచి బయట పడలేక మల్టీస్టారర్ చిత్రాలను వద్దనుకునే దాకా పరిస్థితులు వెళ్లాయి.అలా కృష్ణ , శోభన్ బాబు ల నడుమ ఓ సినిమా విషయంలో అభిమానుల అహం దెబ్బతింది. అసలు ఇలాంటి చిత్రం ఎందుకు ఒప్పుకున్నారు, మీరు రోల్ చిన్నది,పైగా ఆడియన్స్ దృష్టిలో కూడా మీ పాత్ర తేలిపోయింది అంటూ అభిమానులు చెప్పేసరికి ఇక కల్సి నటించకూడదని శోభన్ బాబు గట్టి నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ ఆ చిత్రం పేరేమిటంటే, మహా సంగ్రామం. ఇందులో కృష్ణ విప్లవ కారుని పాత్ర అయితే, శోభన్ బాబుది పోలీసు అధికారి పాత్ర. చిత్రంలో సన్నివేశాల పరంగా కృష్ణకు కొంచెం ఎక్కువ ప్రాధ్యాన్యత ఆ చిత్రంలో కనిపిస్తుంది. పైగా డైలుగుల పరంగా కూడా కృష్ణ పాత్ర పవర్ ఫుల్. ఇక శోభన్ పాత్ర తేలిపోయింది. డైలాగులు కూడా అదే రీతిలో ఉన్నాయి. దీంతో శోభన్ బాబు అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇక దాంతో కృష్ణ, శోభన్ బాబు కల్సి నటించలేదు. అదండీ కథ.
జిల్లావ్యాప్తంగా సోమవారం దుర్గాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గోరంట్లలో దేవాంగులు అమ్మవారి కలశాన్ని చిత్రావతి నది వద్ద నుంచి ప్రధాన రహదారిపై ఊరేగింపుగా తీసుకువచ్చా రు. గోరంట్లలో దుర్గామాత అలంకరణలో వాసవీ అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 కోలాహలంగా అమ్మవారి ఆలయాలు గోరంట్ల, అక్టోబరు 3: జిల్లావ్యాప్తంగా సోమవారం దుర్గాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గోరంట్లలో దేవాంగులు అమ్మవారి కలశాన్ని చిత్రావతి నది వద్ద నుంచి ప్రధాన రహదారిపై ఊరేగింపుగా తీసుకువచ్చా రు. స్తోత్రాలతో స్థుతిస్తూ ఆరాధించారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, వరలక్ష్మీ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి కలశాన్ని చౌడేశ్వరీ కాలనీలోని కళ్యాణమండపం వరకు ఊరేగించారు. అనంతరం చౌడేశ్వరీ అ మ్మవారిని అందంగా అలంకరించి కుంకుమార్చన, విశేష పూజలు చేశారు. చక్కభజన, అన్నదాన కార్యక్రమం జరిగింది. పూజల్లో దేవాంగ సంఘం నా యకులు జౌళి కిష్టప్ప, మాజీ సర్పంచలు నిమ్మల నిర్మలమ్మ, నిమ్మల చం ద్రశేఖర్‌, సత్యవాణి దంపతులు, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, పలువురు దేవాంగులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని వాసవీమాత, చౌడేశ్వరీదేవి, గుమ్మయ్యగారిపల్లిలోని మారెమ్మ దేవతలు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సోమందేపల్లి: స్థానిక కన్యకాపరమేశ్వరీ దేవి, అంబాభవానీ ఆలయా ల్లో దుర్గామాతగా అమ్మవార్లు దర్శనమిచ్చారు. పాతూరు చౌడేశ్వరీదేవి, పె ద్దమ్మ, మరిగమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూపురం అర్బన: ఎరుకుల కులస్థుల ఆరాధ్యదైవం యల్లమ్మ త ల్లి ఆలయంలో జ్యోతుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పట్టణంలో ని చిన్న మార్కెట్‌ నుంచి నింకంపల్లి రోడ్డులోని యల్లమ్మ ఆలయం వరకు మహిళలు జ్యోతులను ఊరేగించి, అమ్మవారికి సమర్పించారు. ఈసందర్భం గా మూలవిరాట్‌ను వేపాకు, నిమ్మకాయలు, పూలతో అలంకరించారు. అ దేవిధంగా పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరీ, జలదుర్గమ్మ ఆలయాల్లో అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. నింకంపల్లి రోడ్డు యల్లమ్మ, కొ ల్హాపురమ్మ దేవతలకు పుష్పాలంకరణ చేశారు. సూరప్ప కట్ట బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారు కాళికాదేవిగా దర్శనమిచ్చారు. పులమతి రోడ్డు రాజరాజేశ్వరీదేవిని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. మధుగి రి మారియమ్మ ఆలయంలో దుర్గాదేవిగా, విజయనగర్‌ కాలనీ చౌడేశ్వరీ అ మ్మవారు కాళికామాతగా భక్తులకు దర్శనమిచ్చారు. గుడిబండ: మండలంలోని గుడిబండ తుమ్మల మారెమ్మ, ఎస్‌ రాయాపురం మారెమ్మ ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి, వి శేష పూజలు చేశారు. కొంకల్లు ఆంజనేయస్వామి, ఎస్‌ఎ్‌సగుండ్లు ఏడుమం ది అక్కదేవతల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మడకశిర టౌన: పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ, కొల్లాపురమ్మ, వడుసలమ్మ, గంగాభవాని, ఊరిమారమ్మ ఆలయాల్లో విశేష అలంకరణ, పూజ లు కొనసాగాయి. ఆలయాలు భక్తులతో కోలాహలంగా మారాయి. పెనుకొండ: స్థానిక లక్ష్మీ వెంకటరమణ స్వామి ఆలయంలో స్వామివారిని నరసింహ అవతార రూపంలో, వాసవీకన్యకాపరమేశ్వరి, కాళీమాతను దుర్గాదేవిగా అలంకరించారు. అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లేపాక్షి: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు స్థాని క దుర్గావీరభద్ర స్వామి ఆలయంలో అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. సుప్రభాతసేవ, సప్తసెతి పారాయణం, రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన, విశేష పూజలు నిర్వహించారు. తొమ్మిదోరోజు మంగళవారం మ హర్నవమి ఆయుధాల పూజ చేస్తామని అర్చకులు తెలిపారు. అగళి: మండలంలోని కొమరేపల్లి బీరలింగేశ్వరస్వామి, మధూడి వీరభద్రేశ్వరస్వామి, నరసంబూది లక్ష్మీరంగనాథస్వామి, అగళి శంకరేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేకపూజలు, ఆకుపూజలు నిర్వహించారు. ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. రొద్దం: స్థానిక రుద్రపాదాశ్రమం, వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, ఆర్‌ మరువపల్లిలోని కోన మల్లేశ్వరస్వామి, రేణుకా యల్లమ్మ ఆలయాల్లో ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు.
గోదావరి వరదలతో నీట మునిగిన ముంపు బాధితులకు ప్రభుత్వం అందజేసే రూ.10 వేల నష్టపరిహారం పై గందరగోళ పరిస్థితులు వీడడం లేదు. గోదావరి వరదలతో నిండా మునిగిన మాకు నష్ట పరిహారం డబ్బులు బ్యాంక్‌ ఖాతాలో జమ కాలేదు అంటూ కొంత మంది వరద బాధిత కుటుంబాలు నేటికీ తాసిల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణిలోని ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని నవతెలంగాణ ముందు వారు వాపోయారు. ఈ ఏడాది జులై నెలలో వచ్చిన గోదావరి వరదలతో గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్న పలు గ్రామాలు వరద ముంపుతో సర్వం కోల్పోయారు. దీంతో ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేం దుకు అధికారులతో ముంపు సర్వే నిర్వహించారు. సర్వే సమయంలో అధికారులు తప్పుల తడకగా సర్వే నిర్వహించారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. మండల వ్యాప్తంగా మొత్తం 23 ముంపు గ్రామాలలో 1936 మంది వరద బాధితులను అధికారులు గుర్తించి వారి వద్ద నుండి ఆధార్‌ కార్డులు, బ్యాంకు ఖాతా నెంబర్లు తీసుకుని ఆన్లైన్‌ చేశారు. వెను వెంటనే గోదావరి వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తామని చెప్పిన పది వేల రూపాయల నష్టపరిహారం బాధితుల బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు. వారిలో కొంతమంది వరద బాధితులు తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాలేదని, తమ పేర్లు నమోదు చేయలేదని తాసిల్దార్‌ కార్యాలయం వద్ద అనేక మార్లు ఆందోళన చేపట్టి వినతి పత్రాలు అందజేశారు. దీంతో రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కానీ వరద బాధితులకు చెందిన బ్యాంక్‌ ఖాతాలు, ఐఎఫ్‌సి కోడ్‌ వంటి వివరాలను తీసుకుని కరెక్షన్‌ చేసి తిరిగి మరలా జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి లిస్టు అందజేశారు. కాగా రెండవ విడత 386 మంది లబ్ధిదారులకు గుర్తించారు. ముంపు సర్వేలో అధికారులు చేసిన తప్పిదాలతో పాటు ఆన్లైన్‌ లో పేర్లు నమోదు చేసిన సమయంలో తప్పుల తడకగా నమోదు చేయడం వంటి పొరపాటు వలన నిజమైన ముంపు బాధితులకు నేటికీ నష్ట పరిహారం అందక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదులు గోదావరి వరదలతో తాము తీవ్రంగా నష్టపోయామని తమ బ్యాంకు ఖాతాలో నేటికీ నష్టపరిహారం సొమ్ము జమ కాలేదంటూ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో సైతం వరద బాధిత కుటుంబాలు ఫిర్యాదులు చేశారు. దుమ్ముగూడెం గ్రామానికి చెందిన సుమారు పది బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందలేదు అంటూ ప్రజావాణిలో అడిషనల్‌ కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లుకు బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సున్నం బట్టి, బై రాగులపాడు, ఎల్‌ఎన్‌ రావు పేట గ్రామాలకు చెందిన 20 కుటుంబాలకు చెందిన బాధితులు కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ కు ఫిర్యాదు చేశారు. కాగా కలెక్టర్‌ వారి వద్ద నుండి బ్యాంక్‌ ఖాతా నంబర్లు, ఆధార్‌ కార్డు జిరాక్సులు సైతం తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. రెండవ విడత నమోదు పక్రియలో 386 మంది వరద బాధితులను గుర్తించినప్పటికీ వారిలో ఏ ఒక్కరికి నేటికీ నష్ట పరిహారం సొమ్ము బ్యాంకు ఖాతా లో జమ కాలేదు.. టెక్నికల్‌ సమస్యే కారణమా టెక్నికల్‌ గా తలెత్తిన సమస్య వల్లనే కొంత మంది వరద బాధిత కుటుంబాలకు నేటికీ నష్ట పరిహారం అందక పోవడానికి కారణమా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై రెవిన్యూ అధికారులు సైతం ఎంతమంది ముంపు బాధితులకు నష్టపరిహారం సొమ్ము వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు. ఇంకా ఎంత మందికి నష్ట పరిహారం సొమ్ము చెల్లించాలి అనే లెక్కలు పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నారని చెప్పవచ్చు. ముంపు బాధితులకు తమ వద్ద జమ అయినట్లు చూపిస్తుందని రెవెన్యూ అధికారులు తెలుపుతున్నారు. ఏది ఏమైనా గోదావరి ముంపు నష్ట పరిహారం సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ పై గందరగోళ పరిస్థితి నెలకొంది అనే చెప్పవచ్చు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఇంకా చెప్పాలంటే తెలంగాణాలో బీజేపీకి మొన్నటి సాధారణ ఎన్నికల్లో దక్కిన ఫలితాల కన్నా ఇదే ఎక్కువ సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ముంగిట హోరాహోరీ పోరులో విజయం సాధించడం రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. స్వయంగా ముఖ్యమంత్రి కుమార్తెను ఓడించిన ధర్మపురి అరవింద్ గెలుపు కన్నా ట్రంప్ కార్డ్ అనుకునే హరీష్‌ రావు ఎత్తులను చిత్తు చేసిన రఘునందన్ రావు విజయమే జోష్ నింపుతుంది. అదే ఊపులో త్వరలోనే బీజేపీని తెలంగాణాలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలపాలని కమలనాధులు కలలు కంటున్నారు. అందుకు అనుగుణంగా వాతావరణం ఉండడంతో మరింతగా విజృంభించే అవకాశం ఉంది. కానీ ఏపీలో పరిస్థితి దానికి పూర్తి భిన్నం. అయినా తెలంగాణా విజయం సాధించిన ఉత్సాహం ఏపీ బీజేపీ నేతలను కూడా ఆవరించింది. తాము కూడా అదే బాటలో వెళ్లాలనే అత్యుత్సాహం చూపుతున్నారు. అంతకుమించి ఏకంగా తిరుపతి ఎంపీ స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నికలను కూడా దుబ్బాకతో పోల్చేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా సునీల్ దేవదర్ వంటి బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే తామే గెలుస్తున్నామనేటంత రీతిలో ఉంది. కానీ తెలంగాణాలో బీజేపీ పునాదికి ఏపీలో ఆపార్టీ క్షేత్రస్థాయి బలానికి చాలా వైరుద్యం ఉంది. అసలు పోలికే లేదు. పైగా తిరుపతి లాంటి చోట్ల బీజేపీకి కనీస బలం కూడా ఉన్నట్టు కనిపించదు. అయినా కానీ దుబ్బాక సీన్ రిపీట్ చేస్తామనే ధీమా వ్యక్తపరుస్తున్న తీరు విశేషంగానే చెప్పాలి. వాస్తవానికి దుబ్బాకలో బీజేపీ విజయం ఆపార్టీ బలం కన్నా కేసీఆర్ మీద వ్యతిరేకత ప్రధాన కారణం అని అంతా అంగీకరిస్తారు. రఘునందన్ రావు వ్యక్తిగత ఇమేజ్ దానికి దోహదపడింది. వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలవుతున్న సానుభూతి సహకరించింది. అందుకు అనుగుణంగా అన్ని పార్టీలు కేసీఆర్ వ్యతిరేకతతో బీజేపీని బలపరిచాయి. తమ సొంత పార్టీ అభ్యర్తులున్నప్పటికీ కాంగ్రెస్, టీడీపీ అనే తేడా లేకుండా అంతా బీజేపీ విజయానికి తోడ్పడ్డారు. చివరకు టీఆర్ఎస్ లోని అసంతృఫ్తి వాదులు కూడా బీజేపీ విజయంలో భాగస్వామ్యం అన్నాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు కలిసివచ్చి సాధించిన విజయాన్ని ఏకంగా తిరుపతి ఎంపీ స్తానంలో సాధించగమని చెప్పడం రాజకీయంగా ప్రచారానికి పనికొస్తుంది గానీ పార్టీ విజయానికి దోహదపడే అంశం కాదు. తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొన్ని మండలాల్లో నేటికీ బీజేపీ కి జెండా కట్టే నాథుడే లేడు అంటే అతిశయోక్తి కాదు. అయినా గానీ తామే విజయం సాధిస్తామని చెప్పడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని భావించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే జనసేన తమకు మిత్రపక్షం ఉండగా , టీడీపీ కూడా పోటీ నుంచి తప్పుకుని తమను బలపరిచేలా ఒత్తిడి పెంచే దిశలో బీజేపీ ఉందని అర్థమవుతుంది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం తమ వైపు మళ్లించుకోవాలనే సంకల్పంతో ఉన్నట్టు స్పష్టమవుతుంది. కానీ తిరుపతిలో కాంగ్రెస్, మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ వంటి వారు నేటికీ ఉనికి చాటుకుంటున్నారు. దాంతో బీజేపీ ఆశలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. అదే సమయంలో బీజేపీ ఒత్తిడికి తలొగ్గి పోటీ నుంచి విరమించుకుని బీజేపీకి ప్రత్యక్ష లేదా పరోక్ష మద్ధతు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధపడితే ఇక అది ఆత్మహత్యాసదృశ్యం అవుతుంది. ప్రధాన ప్రతిపక్ష హోదాని ఆపార్టీకి కట్టబెట్టేందుకు సంసిద్ధత అన్నట్టుగా మారుతుంది. తద్వారా టీడీపీ సొంత బలం త్యాగం చేసేందుకు తయారీ అన్నట్టుగా మారుతుంది. ఏమయినా దుబ్బాక ఫలితాల తర్వాత గంపెడాశలు పెట్టుకున్న బీజేపీకి తిరుపతిలో అలాంటి పరిస్థితి ఉండదని తెలుసు. అయినా గానీ రాజకీయంగా ఎత్తులు వేస్తూ తమ బలం పెంచుకునే ప్రయత్నంలో కమలనాథులు టీడీపీని కార్నర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసే అంశం అవుతుందని ఆశిస్తున్నారు. దుబ్బాక మాదిరిగా గెలవకపోయినా తిరుపతిలో కొంత ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
దయచేసి ఓపిగ్గా చదవండి! ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఇప్పటి వరకూ నేను చూసిన, నాకు ఎదురైన, నేను అనుభవించిన వాటి నుండి, నాకు మనస్ఫూర్తిగా అనిపించింది రాసాను. ఇది నాతోనే ఉంచేసుకుంటే ఏ ప్రయోజనం ఉండదు. మీ అందరితో పంచుకుంటేనే దీనికో అర్థం ఉంటుందని అనిపించింది. కాబట్టి, మీరు కూడా మనసు పెట్టి చదవండి! జీవితమేమి అనుకున్నంత పెద్దదేమీ కాదు! సుఖ-దుఃఖాలు, జయాపజయాలే కాకుండా, అనుకోని సంఘటనలు, పరిస్థితుల సమాహారమే జీవితం! ఇవన్నీ మనకి తెలుసు. కానీ, నిత్యం స్ఫురణ కి రావు. వచ్చినా ఈ క్షణం తీసిపారేస్తాం. ఎందుకంటే, కావాల్సినంత సమయం ఉన్నంతవరకూ దేని విలువ మనలో చాలా మంది తెలుసుకోలేము, గ్రహించలేం. తీరా సమయం అయిపోయాక, అంటే మన చివరి రోజుల్లోనో, లేదా మన అని అనుకునే వాళ్ళ చివరి రోజుల్లోనో అయ్యో అలా చేసుంటే బావుండేది, ఇలా చేసుంటే బాగుండేది, పలానా వ్యక్తిని అలా అనుండకూడదు, పలానా వ్యక్తితో ఈ విధంగా గడపాల్సింది వగైరా, వగైరా... ఇలా ఓ పశ్చాతాపం మొదలవుతుంది. పశ్చాతాపం అన్నది సమయం ఉన్నప్పుడే వస్తే మంచిది. మనకి కాలం చెల్లి, ఇక్కడ నుండి వెళ్లిపోయేటప్పుడు సంతృప్తి లేకపోయినా పర్లేదేమో గాని, పశ్చాతాపం మాత్రం ఉండకూడదు. అలా ఉంటే మన ఈ జీవిత ప్రయాణం అసంపూర్ణంగా ముగిసిందని అర్థం. కచ్చితంగా ప్రతీ ఒక్కరు ఏదోక లక్ష్యం తోనే ఇక్కడికి వస్తారు.. అయితే అవన్నీ పక్కన పెడితే, మొదలుపెట్టిన ఈ ప్రయాణం అసంపూర్ణంగా ముగియకూడదు. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి, సాధించడం మాత్రమే మన ఈ జీవితానికి సంపూర్ణత చేకూర్చదు. మన ఈ ప్రయాణంలో భాగమైన ప్రతీ దానికి విలువ ఉంటుంది, దేనికదే ప్రత్యేకం. పుట్టుక, ప్రయత్నం, నేర్చుకోవడం, పోరాటం, వైఫల్యం, విజయం, ప్రేమ, డబ్బు, కీర్తి, బంధాలు, బంధుత్వాలు, బ్రతుకు, అలసిపోవడం, చావు! వేటికీ ఎవరూ మినహాయింపు కాదు! ప్రతీది ప్రతీ వ్యక్తి జీవితంలోకి ప్రవేశిస్తాయి, నిష్క్రమిస్తాయి, మళ్ళీ ప్రవేశిస్తాయి, మళ్ళీ నిష్క్రమిస్తాయి. కానీ, ఏవి ఎంతకాలం మనతో ఉండాలి అనేది మాత్రం, మనం వాటికి ఇచ్చే ప్రాధాన్యతని బట్టి, మనం వాటిని నిలుపుకోవడానికి చేసే ప్రయత్నాన్ని బట్టి, ఆ ప్రయత్నంలో ఉన్న నిజాయితీని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మనమేదో గొప్ప గొప్ప పనులు, త్యాగాలు చేయక్కర్లేదు. అవి ఎవరి వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటాయి. కానీ, ఓ మనిషిగా మనకు కనీసం మన జీవితం మీద గౌరవం, మనం చేసే చిన్న పనిలో అయినా నిజాయితీ, వీలైనంతగా నిర్లక్ష్యంగా లేకుండా ఉండగలటం.. ఇవి ఉంటే చాలు. ఏదైనా కావాలి, సాధించాలి అనుకుంటే, ప్రాణం పెట్టి ప్రయత్నిద్దాం... వచ్చే ఫలితం గురించి కాదు, ఆ ప్రయత్నంలో మనం నేర్చుకునే పాఠం గురించి, తద్వారా మనం పొందే సంతృప్తి, ఆనందం గురించి. నిజంగా, మన ప్రయత్నంలో నిజాయితీ ఉంటే, ఫలితం ఎక్కడికి పోతుంది. ఒకవేళ వైఫల్యం ఎదురైనా, మనం నేర్చుకున్న పాఠం ఎలాగు ఉందిగా.. అదే మళ్ళీ సారి ప్రయత్నించినప్పుడు తప్పకుండ మనల్ని గెలిపిస్తుంది. డబ్బుతో ఎంత సుఖం ఉంటుందో, అంతే దుఃఖం, ఇబ్బందులు ఉంటాయి. అది ఏదో మనం బ్రతకడానికి ఉపయోగపడే ఒక వస్తువులా చూడాలి తప్ప, దాని మీద ఎక్కువ మమకారం పెంచుకోకూడదని నా అభిప్రాయం. కానీ, నువ్వు ఏదైతే ఓ వృత్తిని ఇష్టపడి ఎంచుకుని చేస్తున్నావో, అది నీకెప్పుడూ అండగా ఉంటుంది. అదే నీ ఐశ్వర్యం. ఇక నువ్వు చేసే పనులు బట్టి, నీ ప్రవర్తనను బట్టి పేరు, కీర్తి నీకు అనుసంధానంగా వస్తాయి. జీవితాన్నే నటించేవాళ్ళకి కూడా కీర్తి ప్రతిష్టలు వస్తాయి, కానీ, అన్నిటికన్నా కష్టమైంది నటన. ఏదోక రోజు ఓపిక నశించి, నటించడం మానేస్తే నీకున్నవన్నీ పోతాయి. కాబట్టి, నటించి నీ చుట్టూ ఓ అబద్దపు ప్రపంచాన్ని నిర్మించుకుని, అందులో బ్రతకడం కన్నా, సహజంగా ఉంటూ, వాస్తవంలో జీవించడం వేయిరెట్లు సంతృప్తిని ఇస్తుంది. ప్రేమ; పరాయి అన్న పదానికి తావులేకుండా ఎదురయ్యే ప్రతిఒక్కరినీ ప్రేమిద్దాం. దాన్ని అలుసుగా తీసుకుని, కొంతమంది అవివేకులు, అజ్ఞానులు, జీవితం విలువ తెలియని వాళ్ళు మోసం చేయచ్చు. అది వాళ్ళ తెలియనితనం అని అనుకుని వాళ్ళకి దూరం జరగడం తప్ప, బాధపడటం లో అర్థం లేదు. వాళ్ళకి కొద్దిరోజులు మీపై ఆధారపడి బ్రతికే అవకాశం కల్పించా అని గర్వపడండి! అలాగే, మిమ్మల్ని ప్రేమించే వారికి ఆంక్షలు విధించద్దు. ఎందుకంటే, వారు ఆ ఆంక్షలను దాటుకుని మిమ్మల్ని సంతోషపెట్టే క్రమంలో ఒకోసారి చిత్రవధ అనుభవిస్తారు. ప్రేమ అనేది బాధలో ఉన్నప్పుడు భరోసా గా నిలవాలి గాని, అదనపు భారం కాకూడదు. అసలు ఏ ఆంక్షలు లేనిదే ప్రేమ! మనం ప్రేమించే వ్యక్తి సరైన మార్గంలో లేకపొతే చెప్పే హక్కు మనకుంది. కానీ, సక్రమంగా ఉన్నప్పుడు కూడా, మనకి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకాలనుకోవడం ముమ్మాటికీ ప్రేమ కాదు! నిజంగా వాళ్ళ సంతోషమే కోరుకుంటే, మనం అలా మన వ్యక్తిగత ఆలోచనలతో, అభిప్రాయాలతో సంకెళ్లు వెయ్యం. వాళ్ళకి, వాళ్ళ అభిప్రాయాలకి, వాళ్ళ స్వేచ్ఛకి గౌరవమిస్తాం! వాళ్ళు మంచి చేస్తే మెచ్చుకుంటాం, చెడు చేస్తే మందలిస్తాం. కానీ, వారిలో ఉన్న మంచి-చెడుల రెంటినీ సమానంగా స్వీకరిస్తాం. ఎందుకంటే, ఆ రెండూ కలిసిందే మనిషి. అంతా మంచే ఉంటే దేవుడు, అంతా చెడే ఉంటే రాక్షసుడు. రెండూ కలిసి ఉన్నవాడే మనిషి. కానీ, రెంటిలో దేని ఆధిపత్యం ఎక్కువ ఉంది, ఇవన్నీ ఆ వ్యక్తి పెరిగిన వాతావరణం, తన చుట్టూ అల్లుకున్న పరిస్థితులు, తనకెదురైన సంఘటనలు నిర్ధారిస్తాయి. కాబట్టి, ఒక మనిషిని ప్రేమిస్తే, తనకు సంబంధించినవన్నీ స్వాగతించే, అర్థం చేసుకునే శక్తి మనకుండాలి. అలాగే, ఆ వ్యక్తికి కూడా మీ మీద అంతే ప్రేమ, గౌరవం ఉంటే, ఇది తప్పు అని మీరు ఏదైనా చెప్పినప్పుడు, కచ్చితంగా దాని గురించి పునరాలోచన చేస్తారు, కచ్చితంగా ఎంతోకొంత మారతారు. అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ, ముందుకి సాగాలి తప్ప, మనలో ఉన్న అహాల తో, అహంకారాలతో బంధాల్ని దూరం చేసుకోకూడదు. చాలా మంది ఈ బంధాలు బంధనాలు అనుకుంటారు. కానీ, మనం వాటిని సరిగ్గా అర్థం చేసుకుని మసులుకోగలిగితే అవే మనకు బలం! ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలు. పైన ప్రస్తావించినట్టుగా... అవి మన జీవితంలో ప్రవేశించినప్పుడు వాటి విలువ తెలుసుకుని జీవించగలిగితే.. ఏ ఒక్కరు చివరి క్షణాల్లో పశ్చాత్తాప పడరు! అలాగే, ఏ ఒక్కరి జీవితం అసంపూర్ణంగా ముగియదు! ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయంలో సారాంశం ఏ ఒక్కరికి అర్థం అయినా, నేను చాలా సంతోషిస్తాను. అలాగే నేను చెప్పిన ఈ విషయంలో వాస్తవాలు ఉన్నాయి అని మీకు అనిపిస్తే, మీ ప్రియమైన వ్యక్తులతో ఇది పంచుకోండి!
Uric Acid Banana Home Remedies : మన శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు సమస్యలు వస్తాయి. ఆ స్థాయిలు ఎక్కువగా ఉంటే చేతి వేళ్ళకు వాపులు రావటం,కీళ్ల నొప్పులు వస్తాయి. యూరిక్ యాసిడ్ కీళ్ల మధ్యకు చేరినప్పుడు కీళ్లలో మంట మరియు నొప్పి కలుగుతుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ చాలా వరకు రక్తంలో కరిగి మూత్రపిండాల ద్వారా విసర్జించబడుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల, కిడ్నీపై ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. దాని కారణంగా అది ఫిల్టర్ చేయలేకపోతుంది. ఈ యాసిడ్ కీళ్ళలో పేరుకు పోతుంది. కాబట్టి దాన్ని తగ్గించుకోవటం చాలా ముఖ్యం. యూరిక్ యాసిడ్ ని పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే యూరిక్ యాసిడ్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు అసలు అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి అరటిపండు సహాయపడుతుంది. ప్రతి రోజు ఒక అరటిపండ్లను తింటే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. ఒక అరటిపండులో దాదాపు 105 కేలరీలు ఉంటాయి. అలాగే చక్కెర తక్కువగా ఉంటుంది. కానీ విటమిన్లు B6, విటమిన్ C, ఫైబర్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ మరియు పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. అరటిపండ్లు యూరిక్ యాసిడ్‌ను ద్రవ రూపంలోకి మార్చి మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. కీళ్ల మధ్య స్పటికాలు ఏర్పడకుండా సహాయపడుతుంది. ఒక అరటిపండులో 24 mcg ఫోలేట్ లేదా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో మరియు కీళ్లలో విరిగిన కణజాలాన్ని సరిచేయడంలో సహాయపడుతుంది. ఇంకా, వాటిలో 10.3 mg విటమిన్ సి ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన యూరిక్ యాసిడ్ స్థాయిలను అందించడంలో సహాయపడుతుంది గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ← 7 రోజులు 1 స్పూన్ కీళ్ల నొప్పులు,కండరాల నొప్పులు,వెన్ను నొప్పి,వెరికోస్ వెయిన్స్ అన్నీ మాయం అవుతాయి
Nabha Natesh:టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ నభా నటేష్. కన్నడ సినిమాతో ఇండస్ట్రీ పరిచయం చేసుకున్న ఈ బ్యూటీ నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ లో చాందినిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. పైగా అందులో తన మాట తీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కానీ ఎందుకో ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్లో మళ్ళీ అంతగా అవకాశాలు అందుకోలేక పోతుంది. ప్రస్తుతం అవకాశాల కోసం బాగా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా అవకాశాల కోసం గ్లామర్ విషయంలో బాగా మెప్పిస్తుంది. ప్రతి రోజు ఏదోక విధంగా అందాల విందు వడ్డిస్తుంది ఇక తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో తన ఫ్రెండ్స్ తో తను ఏదో పార్టీ చేసుకుంటున్నట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఫోటోలు పంచుకుంది. ఇక ఆ ఫోటోలో తన అందాలను అన్ని చూపిస్తూ కుర్రాళ్ళను రెచ్చగొట్టింది. ప్రస్తుతం తన లుక్స్ బాగా వైరల్ అవుతుంది.
మనం చాలా ప్రేమించే మనుషులు మనకు దూరం అయితే,, మన అస్తిత్వానికి అర్థం లేకుండా పోయినట్టు అన్పిస్తుంది. చుట్టూ వున్న ప్రపంచం అర్థరహితంగా అనిపిస్తుంది. సుప్రసిద్ధ రచయిత్రి వసుంధరాదేవి రాసిన ఈ’జాన్ పాల్ చేసిన బీరువా కథ’, తన తండ్రి మరణం ద్వారా జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక గృహిణి గురించి. ఆమెకు సాంత్వన,ఎవరి వల్ల, ఎలా లభించింది అనేదే ఈ కథ. . వసుంధరాదేవి గారు రాసిన కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది. కథకు ముందు మాటనందించిన శ్రీ మధురాంతకం నరేంద్ర గారికి కృతజ్ఞతలు ఈ కథను అరసం వారు ప్రచురించిన ‘ఆర్.వసుంధరాదేవి కథలు’ అనే పుస్తకంలో చదవొచ్చు. ఈ పుస్తకం కొనాలంటే – https://www.anandbooks.com/R-Vasundhara-Devi ********************************************************************************************** “టేపులో నీ పాట తీసేసి కొత్త పాట, జానీ మేరా నామ్ లోది. మంచిది పెట్టేశాడు. అన్న…” పాప చెప్పింది. గబగబా ముందు హాల్లోకి వెళ్ళాను. రేడియోలో వస్తున్న పాటని చాలా శ్రద్దగా టేప్ రికార్డర్‌లో రికార్డు చేసుకుంటున్నాడు బాబు. “ఎందుకని నా పాట తీసేశావ్?” అనడిగాను. “ఇష్” అన్నాడు నావేపు చూడకుండానే. రికార్డింగ్ అయ్యాక “మంచిపాట నాశనం చేసేశావమ్మా, రికార్డు చేసుకుంటున్నప్పుడు మాట్లాడేశావ్” అన్నాడు. నాపాట పోగొట్టి ఇంకా పైగాను! “అది పాతపాట. ఎవరిగ్గావాలి?” అన్నాడు. “నాకు కావాలి. అందుకేగదా రికార్డు చేసుకున్నాను. అది తియ్యొద్దని చెప్పానుకదా!” అన్నాను. “అమ్మా అది రికార్డు చేసి సంవత్సరం అయింది. ఒక్కనాడు కూడా నీయంతట నీవు దాన్ని పెట్టుకొని వినలేదు. అది టేపులోవుంటే నీకేం, లేకుంటే నీకేం?… మంచిపాట వస్తున్నది. తొందరలో దాని మీద పెట్టేశాను” అన్నాడు. అంతటితో ఆ సంభాషణ అయిపోయిందని తాను కొత్తగా పెట్టుకున్న పాటలు వింటూ కూర్చున్నాడు. ఆ పాట పోయింది. ఇహరాదు. వాదించి లాభమేమిటి? నా పాట పోయినందుకు నాలో నిరాశ, ఎదో విలువైనది పోగొట్టుకున్నానన్న బాధ. ఆ పాట ఉన్నా నేను పెట్టుకోను. ఎప్పుడైనా ఎవరైనా వరుసలో పెడితే వినడమే. అది ఎవరికీ అక్కర్లేని పాతపాట. నాకు కావలసిన పాట. కావలసినదైనా నేను పెట్టుకోని పాట. అది ఆ టేపులోవుంటే నాకేదో తృప్తి. ఇప్పుడు అది పోయినందుకు బాధ. ఎందుకో ఆ పాట నాకు కావాలి. నాకు ఇష్టమైందని కాదు. కాని నాకు కావలిసింది. ఎందుకో అర్థం కాకపోయినా నాకు చాలా ముఖ్యమైనది. ‘ఆడేపాడే పసివాడ…. అది ఏ సినిమాలోదో, ఎవరు పాడినదో, దానిలో భావమేమిటో నాకు గుర్తులేదు. నాకు అక్కర్లేదు. ఆ పాట వింటూంటే నాలో, సంచలనం రేగుతుంది. ఉధృతంగా ఎగిరిపడుతున్న అలలతో, తుఫానునాటి సముద్రంలాగా అయిపోతుంది మనసు. ….ఎంతో ఆశించినదాన్ని పొందలేక విషాదభరితమైన జీవితం కల ఒక అమ్మాయి. ఆనందానికి ప్రతిరూపంగా కనిపించిన పసివాణ్ణి చూచి, ఎంతో ఆనందంతో పాడుతుంది. ఆ పాట. పాట అయిపోయేసరికి పిల్లవాడు దుర్మరణం పాలౌతాడు. మళ్ళీ కటిక చీకటిలాంటి విషాదం ఆవరిస్తుంది… ఆనందానికి విషాదానికీ గల సరిహద్దులో, రెండూ ఒకటయ్యేచోట ఆ పాట. పాట వింటూంటే ఆనందమూ, దాని వెనుకనే పొంచివున్న విషాదమూ రెండూ ఒక్కసారిగా తీవ్రమౌతాయి. ఊపిరి సలుపనివ్వకుండా పెరిగి పెరిగి… ఉక్కిరిబిక్కిరై నలిగిపోతుంది. గుండె. ఆ పాత పాట నాకు యిష్టమని కాదు. నేను నా అంతట ఎప్పుడూ దాన్ని పెట్టుకోను. కాని నాలోనే అందరాని లోతుల్లో ఉండే సత్యానికి ప్రతినిధిగా అది అక్కడ ఉండటం చాలా ముఖ్యం…. మనిషి మనసు చిత్రమైనది. ఆ పాట అక్కడ ఉన్నన్నాళ్ళూ నేను దాని గురించి తలచలేదు. కాని అది చెరిగిపోయేసరికి దాని గురించి యింతగా ఆలోచించుకున్నాను. అది మాటల్లేని మూగరాగమై నాలో నిలిచిపోయింది…. ఇంట్లో ఇంకో బీరువా ఉంటే నాకు ముఖ్యమైనవి పిల్లల చేతుల్లో పడకుండా భద్రంగా దాచుకోవచ్చును. కావలసినవి జారిపోకుండా, మాసిపోకుండా, చెరిగిపోకుండా, పోకుండా దాచుకోగలను. ఈ యింట్లో నాకు ఓ బీరువా చాలా అవసరం! ********************* ‘జాన్‌పాల్ బలే టక్కరివాడమ్మా” మా యింట్లో పనులు చేసి వెళ్తుండే పనివాళ్లు ముగ్గురూ ఒక్కరకంగానే చెప్పారు, జాన్ గురించి. ఆ విషయం నాకూ కొంచెం అనుభవమే. కాని ‘తెలియని దేవతకన్నా తెలిసిన దయ్యం మేలు’ అన్న సామెత ననుసరించి నడుస్తుంది నా బుద్ధి. బీరువాను రెడీమేడ్ గా కొనాలంటే పాతిక మైళ్ళవతల ఉన్న పట్నం వెళ్లి కావలసిన సైజులో ఆర్డరిచ్చి రావాలి. షాపువాళ్లు యిప్పుడిస్తాం, అప్పుడిస్తాం అంటుంటే అక్కడకు నాలుగుసార్లు వెళ్ళాలి. తర్వాత జాగ్రత్తగా పాక్ చేయించి దెబ్బ తగలకుండా బస్సుమీదనో లారీ మీదనో తీసుకురావాలి. ఇంతా చేశాక వాళ్లు రెండోరకం కొయ్యవేసిన చక్కగా పాలిష్ చేసి, ఘనంగా వార్నిష్ చేసి మసిపూసి చేసిన మారేడుకాయలాంటిది అంటగడితే ఎలాగా? చెక్క క్వాలిటీ మనం సరిగా కనుక్కోగలమా? అద్దంలా మెరిసే అందమైన బీరువా కావాలి. కాని దానికోసం ఎక్కువ యాతన పడడానికి ఓపికలేదు. అటువంటి సమయంలో జ్ఞాపకం వచ్చాడు జాన్‌పాల్. ఇదివరలో ఒకసారి పుస్తకాల షెల్పులు తయారు చెయ్యడానికి ఒచ్చినప్పుడు ఎన్నాళ్ళ బట్టో మా యింట్లో వుంటున్న బుక్ కేస్ను చూసి “ఇది. ఇంగ్లండులో దొరికే, పియానోలు చేసే వాల్నట్ కొయ్యతో చేసింది…అమ్మో! ఇదిక్కడ దొరికేదిగాదు…అమ్మా, ఇది ఫారిన్ చెక్క!’ అన్నాడు. ఆ మాటలంటుంటే జాన్ మొహంలో కనిపించిన గాంభీర్యాన్ని, గౌరవభావాన్ని చూచి ఆ బుక్కేస్ గొప్పదనాన్ని ఊహించుకున్నాను. అల్లాగే ఒక పాత. బీరువాను చూడగానే ‘ఇది బర్మాటేకులో ఒకటోరకం’ అని చెబుతూ టేకుల్లో ఎన్నిరకాలో, వాటి చరిత్రలగురించి ఒక ఉపన్యాసంలాంటిది ఇచ్చాడు. కొయ్యల్లో ఇన్ని రకాలున్నాయని నాకు ఇది వరకు తెలియదు. జాన్ మీద చాలా గౌరవం కలిగింది నాకు. అద్దంలో మెరిసే అందమైన బీరువాను ఒకటోరకం టేకుతో తయారు చెయ్యగల సామర్థ్యం జాన్ కు ఉన్నది అనుకున్నాను. కాని ఈ జాన్ తో ఇతరవిధాలైన చిక్కులు వస్తాయి. ఇదివరలో బుక్ రాక్లు చేసినప్పుడు పట్నంవెళ్ళి సామాన్లు తెస్తానని కొయ్యలు మేకులూ అంటూ, రెట్టింపుధరలు వేసిన దొంగబిల్లులు తెచ్చి డబ్బు తీసుకున్నాడు. అవి ఫ్లయివుడ్ షీట్లు కనుక, వాటి ధరలు వేరుగా కనుక్కోగా, మోసం బయటపడింది. జాన్ అప్పటికే డబ్బు తీసుకున్నాడు. మళ్లీ పిలిపించి అడిగాము. కొట్లవాళ్ళ మోసాలను గురించి చిన్న ఉపన్యాసం చాలా ‘ఇన్ఫర్మేటివ్’గా ఉండేది. ఒకటి ఇచ్చాడు. వడ్రంగిపనికి సంబంధించిన ఏ విషయం మీద మాట్లాడవలసి వచ్చినా ఇటువంటి మంచి ఉపన్యాసాలు ఇస్తాడు. అవి విన్న తర్వాత జాన్ మీదా, వడ్రంగి పనిమీదా కలిగిన గౌరవభావంతో నోరు మెదపలేము. పల్లెటూళ్ళలో ఏ పని జరగాలన్నా ఒక భగీరథ ప్రయత్నం కావాలి. ఒక ఇల్లు కట్టించుకోవాలంటే బేలుదారీలు, వడ్రంగులు, పెయింట్లు వేసే వాళ్ళు అంటూ అన్ని రకాలైన పనివాళ్ళకీ పనులు జరుగుతున్నంతకాలమూ ఇంట్లోనే భోజనాలు పెట్టాలి. కరెంటు వేయించుకోవాలంటే వైరింగు చేసేవాళ్లకూ అంతే. ఏదైనా వస్తువు చేయించాలంటే వడ్రంగులకూ అంతే. ఆఖరుకు బట్టలు కుట్టే టైలర్లకు కూడా అంతే. వాళ్ళ భోజనాలకు గడిచిపోగా, పనిచేసినన్ని రోజులకు కూలిడబ్బులు చేతబట్టుకొని ఇళ్ళకు వెళ్తారు. వాళ్ళు పనిని సాగదీసి, ఇంకో వారం రోజులు గడిపే తత్వంలో వుంటారు. .. మన పనిచేసే వాళ్ళు మనింట్లో భోజనం చెయ్యడం, తృప్తిగా పనిచెయ్యడం న్యాయమే కావచ్చును. కాని ఏ పని జరగాలన్నా ఇంత ప్రయత్నం కావలిసి రావడం పట్నాలనుండి వచ్చినవాళ్ళకు విసుగ్గా ఉంటుంది. డబ్బు పారేస్తే పని జరగటం, వస్తువు ఇంటికి రావడం అన్న పద్ధతికాదు ఇక్కడ. ఇది ఒక పాతపద్ధతి. వస్తువుకి, అది చేసే వారి మంచి చెడ్డలకీ గల అవినాభావ సంబంధాన్ని గుర్తించితీరాలి.. మా వారు ఇక్కడ కొత్తగా పెట్టిన చక్కెరమిల్లులో అసిస్టెంట్ మేనేజర్‌గా చేరారు. అందువలన ఈ పల్లెటూరికి వొచ్చాం మేము. ఊళ్ళో మరో ముగ్గురు వడ్రంగులు ఉన్నారు. కాని అందరిలోకీ జాన్ కి పని బాగా చేతనవునని…జాన్, ఇతరులు కూడా చెపుతూవుంటారు. మిల్లులో ఏవైనా కొయ్యపనులు జరగాల్సినప్పుడు జాన్ ని పిలుస్తారు. ఇది ఒకరకంగా జాన్ కి సహాయం చెయ్యడమే. ఆ సంబంధంవలన ఇదివరలో ఒకసారి వచ్చి బుక్ రాక్స్ చేశాడు. “అమ్మో, అయ్యగారింట్లో భోజనం పెట్టమని నేనడుగుతానా! వూళ్ళో నాకు ఇల్లుంది. వంట చేసుకుంటాను… కూలి కూడా అయ్యగారి దగ్గర ఒక్క రూపాయి తక్కువే తీసుకుంటాను” అన్నాడు జాన్. పెద్దాచిన్నా బాగా ఎరిగినవాడు. పెద్దవాళ్ళ దగ్గర వినయంగా ఉండటం నేర్చినవాడు. కొయ్యలూ వగైరాలు తేవడంలోనూ, కూలిలోనూ కూడా. ఎక్కు వ డబ్బు తీసుకున్నాడంటే అది వేరే మాట. వాళ్ళూ బతకాలిగద… అన్ని విషయాలూ ఆలోచించిన మీదట జాన్ కు కబురుపెట్టాను. మిల్లులో పనులు చేస్తూనే ఉంటాడు అడపాదడపా. కనుక మనల్ని చిక్కున పెట్టడు లెమ్మనుకున్నాను. పొట్టిగా దిట్టంగా చామననలుపులో ఉంటాడు జాన్. అరవై దగ్గరగా వయస్సయినా నలభైకి మించినట్లు కనబడడు. మొహం, ఎదురురొమ్మూ , చేతులూ, కాళ్ళూ అన్నీ వేటికవి బలంగా ధృడంగా కనిపిస్తాయి. పై వరుసలో ముందుపళ్ళు రెండు లేవుగాని మిగతా పళ్ళు రాళ్ళ మాదిరి గట్టిగా ఉన్నాయి. ఎత్తయిన నుదుటి క్రింద లోతుల్లో కనిపించే కళ్లు నల్లగా ఉండి ఎప్పుడూ చురుగ్గా చూస్తుంటాయి. రూపం, మాటతీరు అన్ని ప్రత్యేకంగా ఉండటాన జాన్ని ఒకసారి చూస్తే ఎవరూ మరచిపోలేరు. జాన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే…బలశాలి. మాటలో, చేతలో, చూపులో | అన్నిట్లోనూ బలం. అదీ జాన్ అంటే! నిజం చెప్పాలంటే జానన్ను చూస్తే కొద్దిగా భయం నాకు. దుర్బలులకు శక్తిని చూసినప్పుడు కలిగే భయం. స్థూలంగా చూస్తే దానికి వేరే కారణం లేదు మరి! చకచకా లెక్కలు వేశాడు జాన్. అంతా ఒక వందరూపాయలకు సామాను తెస్తే టేకు బీరువా యీ సైజుది తయారు చెయ్యొచ్చునట. పట్నంలో షాపునుంచీ ప్లైవుడ్ బీరువా యీ సైజుది నాలుగువందలకు తెచ్చారు. పక్కింటివాళ్ళు. అట్లాగని జాన్ తో నేను అనలేదు. ‘రోజ్ వుడ్ అయితే ఎక్కువ ఖరీదవుతుందా?” అనడిగాను. “లేదు. రెండూ ఒకటే” నన్నాడు. “తక్కువరకం సరుకు తెస్తాడేమో, లేకుంటే ఇంత చవగ్గా ఎలా వస్తుందీ” అనుకున్నాను. “మంచిరకం టేకు తేవాల”న్నాను. ‘అయ్యగారికి ఎట్లాంటివి తేవాలో నాకు తెలియదా? అంటూ తాను పట్నంలో పెద్ద పెద్ద ఆఫీసర్లకు ఎన్నెన్ని వస్తువులు చేసింది, వాటిని చూచి వాళ్ళు ఎంతెంత ఆశ్చర్యపడిందీ, మెచ్చుకున్నదీ అంతా చెప్పాడు. జాన్ క్రిష్టియన్ మిషనరీల దగ్గర పెరిగాడు. పని నేర్చుకున్నాడు. ఒక ఇంగ్లీష్ దొరగారు…పీటర్స్ దొరగారు..దయతో అన్ని పనులు నేర్పించారు. జాన్కు ఎంతో సహాయం చేశారు. ఆయన దయవల్ల ఎట్లాంటి వస్తువైనా చెయ్యగల నేర్పు అబ్బింది జాన్ కు . “ఒరే, ముండాకొడకా, సరిగ్గా చెయ్యకపోతే తంతాను” అన్నాట్ట కలెక్టరుగారు. ధైర్యంగా చేస్తానన్నాడు జాన్. పెద్దవాళ్ళను మెప్పించాలని జాన్ పట్టుదల. రోల్ టాప్ డెస్క్ చెయ్యాలి. ఆ పట్నంలో ఎవరికీ చేతగాని పని అది. అలాటిదాన్ని ఇదివరలో పీటర్ దొరగారి దగ్గర చూచివున్నాడు జాన్. అందుకే ధైర్యం చేసి ఒప్పుకున్నాడు. చేశాడు. కలెక్టరుగారు ‘సెభాష్’ అన్నారు. ఇంకోసారి ఒక పెద్ద డాక్టరుగారికి అసుపత్రిలో ఉపయోగించే ఒక వస్తువు చేయించవలసిన పనిబడింది. ఆ వస్తువును పై దేశాల్నుంచీ తెప్పించాలంటే చాలా ఆలస్యమూ, ఖర్చూను. అందువలన జాన్ను పిలిపించి చెప్పారు. జాన్ ఆలోచన చేశాడు. ఒకరకంగా ఊహించుకున్నాడు. దాన్ని చేశాడు. తప్పు అయింది. పారేశాడు. మళ్లీ చేశాడు. డాక్టరుగారు సరిగ్గానే ఉందన్నారు. ఇహ ఒక అద్దం బిగించాలి దానికి. అది ఎట్లా బిగించాలో చెప్పారు డాక్టరుగారు. కాని తాను దగ్గర ఉన్నప్పుడే బిగించాలనీ తొందరగా వొస్తానని చెప్పి వెళ్లారు. ఎంత సేపు చూచినా ఆయన రాలేదు. పని పూర్తి చేసుకుని డబ్బు తీసుకుని వెళ్ళాలని జాన్ ఆదుర్దా. డాక్టరుగారు చెప్పిన ప్రకారంగానే ఆయన రాకుండానే బిగించేశాడు. డాక్టరుగారు ఇంటికొచ్చారు. పనయిపోయింది, డబ్బులివ్వమని చెప్పుకున్నాడు జాన్. డాక్టరుగారికి కోపం మండిపోయింది. “నిన్నెవరు బిగించమన్నారురా రాస్కెల్! నేను రాకుండా బిగించవద్దనలేదా?’ అంటూ చెయ్యిచాచి మొహం మీదకొట్టారు” ముందుపళ్ళు రెండూ రాలిపడ్డాయి. జాన్ బయటికెళ్ళి రక్తం వూసివచ్చాడు. డాక్టరుగారు వస్తువు చూసుకున్నారు. సరిగ్గానే చేశాడు. జాన్. డబ్బులిచ్చి పంపేశారు. ఇప్పుడా డాక్టరుగారు పనిలో లేరు. ఎప్పుడైనా పట్నం వెళ్ళినప్పుడు కనబడితే అప్పుడు విషయం జ్ఞాపకం చేస్తూ పలకరిస్తారు… ఈ తీరులో జాన్ సొంతంగా ఊహతో వస్తువులు తయారుచేసి పెద్దలను మెప్పించిన వృత్తాంతాలు చెప్పాడు. పెద్దవాళ్లు కొట్టడంలోనూ మెచ్చుకోవడంలోనూ కూడా కుక్కను చూచినట్లు చూడడం నాకు నచ్చలేదు. కాని మా బీరువా చెయ్యడానికి తగినవాడని తెలిసిపోయింది. ఆయన ఆఫీసునుండి రాగానే బీరువా చేయించడానికి జాన్ను పిలిసి చెప్పాను. జాన్ ఆయనకు వివరాలన్నీ చెప్పాడు. ఒకటోరకం టేకు బీరువా. ముందుగా కొయ్యలు నూటయాభై రూపాయిలకి తేవాలి. కూలి డబ్బుల మాట అడగడు. “అయ్యగారి ఇష్టం. పదిరూపాయిలిస్తే పదే తీసుకుంటాడు…” “ఇందాక కొయ్యలు నూరురూపాయిలకు చాలన్నావే”అన్నాను. “అయ్యగారి దగ్గర కరెక్టుగా చెప్పాలి కదమ్మా. తర్వాత పొరపాటు రాకూడదు. పెద్ద దొరల దగ్గర ఎట్లా ఉండాలి?’ అంటూ నన్ను మందలించాడు. అది నిజమే. ఇప్పటి లెక్కలి బట్టి బీరువా ధర నూరు దగ్గర కాకుండా రెండునూర్లు అయేట్లుంది. కాని మంచిచెక్క చూసి తెచ్చి జాగ్రత్తగా ఇంట్లో చేస్తాడు. ఎట్లయినా షాపు వాళ్ళ దగ్గర కొన్నదానికంటే ధర తక్కువే పడుతున్నది గదా! నూట తొంభై రూపాయలకు బిల్లుతో కొయ్యలు తెచ్చి కట్ట యింట్లో పడేశాడు జాన్. తర్వాత నాలుగు రోజులు అంతులేడు. ఇంతకూ పని చేస్తాడో లేదో, వూరికే కొయ్యలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామే అనిపించింది. మా పనివాడు కొయ్యల్ని చూచి “కొయ్య ముళ్ళుగా వున్నది. అంత మంచిగా లేదు” అన్నాడు. ఇంతా చేసి నిగనిగ మెరిసే అందమైన బీరువా రాదా ఏమిటి? నాకు చాలా కోపం వచ్చింది. ఈయనేమో ఏ సంగతీ పట్టించుకోరు! నాలుగుసార్లు పిలిపించగా జాన్ వచ్చాడు. “అమ్మా ఫర్నీచరు షాపులవాళ్లు ఎక్కువగా కొంటారుగనుక వాళ్లని మంచి కొయ్యలు ఏరుకోనిస్తారు గాని నాబోటివాళ్లు ఒక్క బీరువాకు కొంటే ఏరుకోనివ్వరు. చెయ్యి పెట్టనివ్వరు. అయినా యివి దొరగారి కోసమని చెప్పి బలవంతాన రెండు మూడు మంచికొయ్యలు ఏరివేశాను…. ఆ ముళ్లూ అవీ తోపడంలో పోతై. కనపడవు. బాగానే వుంటుందిలెండి బీరువా” అన్నాడు. “పని చెయ్యడం లేదు. ఎందువలన” అనడిగాను. “కొయ్యలన్నీ మా ఇంటికే తీసుకెళ్లి చేస్తానంటే దొరగారు ‘ఒద్దు యింట్లోనే చెయ్యి’ అన్నారు. నేను పక్క వూళ్ళో హోటలుకు బల్లలు చేస్తున్నాను. ఇక్కడ పని చేస్తూ నడి మధ్యలో వొదిలి అక్కడకు పోతే… దొరగారి పని అట్లా చెయ్యకూడదు! పనిలో దిగితే |పూర్తి చెయ్యాల్సిందే. అందుకని ఆ పని పూర్తి చేసి వొద్దామని ఆలస్యం చేస్తున్నాను. మూడు నాలుగు రోజుల్లో వొచ్చి చేసెయ్యనా. అమ్మా!…దొరగారి పనంటే మాటలా!”. అన్నాడు. పదిహేను రోజుల తర్వాత వొచ్చాడు పనికి. ఆయన బాగా చీవాట్లు వేశారు. వంచిన తల ఎత్తలేదు జాన్. “అవును తప్పుచేశాను. పెద్దవాళ్లు…తిడితే పడాలి” అన్నాడు. దాని తర్వాత ఒక్క రోజు పని చేసి మళ్ళీ మాయమైపోయాడు. ఊళ్ళోనే ఎక్కడో దూలాలు కోస్తున్నాడట. రెండు రోజుల తర్వాత వచ్చాడు. “వాళ్లు నాకు ఇదివరలో డబ్బు ఇచ్చి ఉన్నారమ్మా. పీకలమీద కూచుంటే వెళ్ళవలసి వచ్చింది. అందులోనూ పెద్దవాళ్ళపని అని చెప్తే గూడా వాళ్లు ఊరుకుంటేనా” అన్నాడు. “అసలు వాడు పనిచేసే చోటునుంచీ కొయ్యలు చల్లగా దాటించేస్తాడమ్మా. జాగర్తగా ఉండాలి” అని హెచ్చరించాడు, మా శ్రీరాములు. ఒకే ఊళ్ళోవాళ్ళకు…. పల్లెటూళ్ళలో… ఒకరిగురించి ఒకరికి బాగా తెలిసివుంటుంది. లేనిపోని తంటా కొని తెచ్చుకున్నట్లనిపించింది. పనిచేస్తూ వున్నప్పుడు గంటకోసారి బయటకు వెళ్తాడు జాన్… బీడీలు కాల్చుకోడానికి, టీ తాగటానికి, ఎవరితోనైనా మాట్లాడ్డానికి, సామాన్లు ఎవరి దగ్గర్నుండో తెచ్చుకోడానికి.. ..ఎన్నోపనులు. ఇందులో ఏ సమయంలో దాటించేస్తాడో! అసలు తాను తీసుకెళ్లడానికి సగం కొయ్యలు వేరుగా ఎక్కువగా తెచ్చాడేమో! మొదట చెప్పినదానికంటే ఎక్కువ బిల్లు చేసుకొచ్చాడే! జాన్ కోసం మనుషులు వచ్చిపోతుంటారు కూడాను. ఎవరికిచ్చి పంపించేస్తాడో! ఎన్నో అనుమానాలు. అందుకని జాన్ దగ్గర ఒక మనిషి కాపలా ఉండవలసి వచ్చింది. శ్రీరాములికి ఇతరపనులు చెప్పకుండా, మా ఇద్దరిలో ఒకరు తప్పిస్తే ఒకరు అక్కడ ఉండవలసి వచ్చింది. శ్రీరాముల్ని చూస్తే జాను చాలా లోకువ. “ఏయ్ అబ్బాయ్, ఆ ఉలి ఇట్లా అందించు, ఈ బల్ల పట్టుకో… ఊ సరిగ్గా పట్టుకోవయ్యా…. ఏ పనీ సరిగా చెయ్యలేవు” అంటూ శ్రీరాములుకు ఏదో ఒకపనిని చెప్తూ గదమాయిస్తూనే వున్నాడు. చీటికీమాటికీ జాన్ బయటికి వెళ్తూండడంవలన పని వెనుకబడుతున్నది. టీకోసరం వెళ్తే గంటన్నర వెళ్లిపోతాడు. మొదటి రోజు సాయంత్రం మాతోపాటుగా టిఫిన్, టీ ఇచ్చాను. బయటకు వెళ్లకుండా ఇంకో గంట కూర్చుని పనిచేశాడు. మర్నాడు ఉదయం పనిలోకి రాకుండా మధ్నాహ్నం మూడుగంటలకు వచ్చాడు. ఇప్పడే కదా పనిలోకి వచ్చాడు, టిఫినూ టీలూ ఇచ్చి ఎదురు సేవలు చెయ్యాలా? అనుకొని ఇవ్వలేదు. అయిదుగంటలయ్యేసరికి కొయ్యలు, పనిముట్లు దభీదభీమని ఎత్తిపడెయ్యడం మొదలెట్టాడు. ఆ శబ్దాలు వినలేక అప్పటికప్పుడు టీ చేసి ఇచ్చాను. గ్లాసు చేతిలోకి తీసుకుంటూ నా కళ్లలోకి తీక్షణంగా చూశాడు. . “రెండుపూటలా అన్నం పెట్టి, కాఫీ టిఫినూ యిస్తామని ఎందరో పిలుస్తారమ్మా! దొరగారి పని అని వచ్చాను” అన్నాడు. ఆ చూపుకి నా గుండెలో దడవచ్చింది. మర్నాటి నుండీ నాలుగంటలకు సరిగ్గా టిఫిన్ టీలు ఇచ్చెయ్యాలనుకున్నాను. ఈ జాన్ పైకి కనిపించేటంత వినయవిధేయతలు కలవాడుగా తోచలేదు. మాటల్లో కనిపించే విధేయతకు పూర్తిగా వ్యతిరేకమైన స్వభావం కలవాడుగా చేతల్నిబట్టి తోస్తున్నది. ************************** జాన్ కి ఒక కొడుకూ, ఒక కూతురునట. కూతురు చదువుకొని పట్నంలో టీచరుగా ఉంటున్నది. జాన్ సరిగా చూడడు గనుక జాన్ భార్యకూడా పట్నంలో కూతురి దగ్గరే ఉంటున్నది. ఇదివరలో జాన్ సంపాదించినదంతా తాగేసి ఇంట్లో డబ్బు సరిగ్గా ఇచ్చేవాడు కాదట. ఏమని అడిగితే భార్యను బాగా తన్ని “ఆడముండవి,నోరు మూసుకొని పడివుండు” అనేవాడట. ఆవిడే కష్టపడి కూతురి చదివించుకున్నది. జాన్ మాత్రం కొడుకు ఫిలిప్తో యీ వూర్లో వుంటున్నాడు. ఇదివరలో రాక్ లు చేసేటప్పుడు ఒకనాడు ఫిలిప్ను వెంటబెట్టుకుని వచ్చాడు జాన్. వాడు కష్టపడలేని వాడు గనుక మిల్లులో ఏదైనా ఆఫీసు జవాను లాంటి పని ఇప్పించమని అడిగాడు. ఫిలిపు ఇరవై ఏళ్ళ పైన వయస్సుంటుంది. సెకండ్ ఫారమ్ చదువుతూ ఆపేశాడట. “అమ్మో వాడు చాలా తెలివికలవాడు. పంతులు క్లాసులో ఏదో అన్నాడని పంతం మీద మానేశాడు గాని…. చదివుంటేనా, వాడు..అమ్మా..ఎట్లుండ వలసినవాడు. ఎప్పుడైనా సమయం పడినప్పుడు నేను పనిలోకి రాలేకపోతే, వాడు వెళ్లి నాకంటే బాగా చేస్తాడమ్మా పని! …. అయితే ఎంతటివాళ్లయినా మాటంటే మాత్రం పడడు” అన్నాడు ఫిలిప్ ది తండ్రికిలాగే దృఢమైన శరీరం. నల్లగా నేరేడు పండులాగా నిగనిగలాడుతుంటాడు. కాని జాన్ మొహంలోనూ ఆకారంలోనూ కనిపించే గట్టిదనం ఫిలిప్లో కనిపించదు. మొహమూ చెంపలూ చేతులూ ఆడపిల్లలకున్నట్లు మృదువుగా వుంటాయి. వాడి ఇరవై ఏళ్ళ కళ్ళల్లో సోమరితనం, అలసత్వం కనిపిస్తాయి. జీవితంతో పోరాడి ఎన్నో ఢక్కామొక్కలు తిని రాటుదేలిన జాన్ కళ్ళు… అరవై ఏళ్ళవి…. వాడి చూపుతో వెలుగుతూవుంటాయి. ఇద్దరూ తండ్రీ కొడుకులు. ఒక రకంగా ఇద్దరికీ చాలా పోలికలున్నాయి. కాని అంతకంటే ఎక్కువ భేదమూ వున్నది. జాన్ కొడుక్కి ఉద్యోగం కావాలని అడుగుతూవుంటే ఆ విషయంతో తనకు ఏమీ సంబంధం లేనట్లు రెండు చేతులు కట్టుకుని ఎటో చూస్తూ ఒంటికాలిమీద నిలబడ్డాడు | ఫిలిప్. వాడు ఉద్యోగం అర్థిస్తున్న వాడిలా కనబడలేదు. జాన్ పనిచేసుకుంటుంటే అట్లాగే నిలబడి కొంచెం సేపు చూసి ‘నేనింటికెల్తా, నాయనా’ అన్నాడు. జాన్ పని ఆపి, ప్రేమగా కొడుకువైపు చూసి ‘వెళ్ళు’ అన్నాడు. ఫిలిప్ వెళ్లిపోయాడు. పనికోసరం వాళ్ళు మళ్ళీ అడగలేదు. జాన్ కి ఫిలిప్ కి ఉండే సంబంధం నాకు ఆశ్చర్యం కలిగించింది. భార్యనీ, మరీ అంత కరుగ్గా చూసే జాన్ ఫిలిప్ ను అంత ప్రేమగా చూస్తాడెందుకు? వాడు కంద పయోజకుడైనాడు. జాన్ వాడినట్లా చేశాడనడమే సబబేమో. పంతులు ఒక మాటంటే వాడు చదువు మానేస్తానంటే మానెయ్యనివ్వడమేనా? దండించి చదివించుకోరా! పోనీ చదువు అబ్బకపోతే తన పని నేర్పించితే ఒకరి సంపాదన కొకరికి తోడుగా ఇబ్బడిగా సంపాదించుకోవచ్చునే! జాన్ ప్రవర్తన చాలా చిత్రంగా ఉన్నది. తాను ఎన్నో అబద్దాలాడి నానా గడ్డీ కరచి నెట్టుకొస్తున్నాడు. కొడుకు మాత్రం ఒకరి చేత మాటపడని వాడుగా, కష్టపడలేనివాడుగా అబద్ధమూ అన్యాయమూ లేకుండా డబ్బంటే లెక్కలేకుండా ఉండాలా! ఒకరోజు వచ్చి ఒక రోజు రాత్రి దాకా పని చేసి, చేసి ఎట్లాగో బీరువా పని ఒక కొలిక్కి తెచ్చాడు జాన్. ఇహ అరలు పెట్టి తలుపులు బిగించాలి. అటువంటి సమయంలో మళ్ళీ మాయమైనాడు. ఆ ముందురోజునే పట్నం వెళ్లి సీలలు, బందులు, హాండిలు, తాళం, పాలిషు, ఎమెరీ పేపర్లు అన్నీ బస్సు ఛార్జీలతో సహా యాభై రూపాయల సామాన్లు తెచ్చాడు. ఇంకొక్క రోజు పనిచేస్తే పూర్తవుతుందన్నాడు. ఇంతవరకు పనిచేసినదానికి తనకు రావలసిన కూలిలో పది రూపాయలు మిగిలివుంటే తీసేసుకున్నాడు. అంతే పనిలోకి రాలేదు. ఎక్కడికైనా పారిపోయాడా అనుకోవడానికి జాన్ సామాన్లు-ఉలి, రంపం, క్లాంపు అన్నీ మా ఇంట్లోనే వున్నాయి. ఎన్నిసార్లు వెళ్లినా మా మనుష్యులకు జాన్ అంతు దొరకలేదు. మూడో నాడు శ్రీరాములికి బజార్లో కనబడ్డాడట. బాగా తాగివుండి శ్రీరాముల్ని నానా దుర్భాషలాడాట్ట. ఫిలిఫ్ సర్దిచెప్పి మర్నాడు పనిలోకి పంపుతానన్నాట్ట. ఎన్నో క్షమార్పణలతో మర్నాడు పనిలోకి వచ్చాడు. ఎక్కడో పని ఒప్పుకున్నాడట. రేపటితో యీ పని పూర్తి చేసుకుని వెళ్లిపోతాడట. ఇక్కడ పని సరిగా చెయ్యకుండా, మాట నిలకడ లేకుండా చేసుకున్నందుకు కొడుకు బాగా కోప్పడ్డాడట. మొదట ఇచ్చిన ఎస్టిమేటుకి అయిన ఖర్చుతో సంబంధం లేకుండా ఉన్నదనీ, పని తొందరగా చెయ్యలేదనీ జాన్ ను కోప్పడి ఆయన ఫాక్టరీకి వెళ్లిపోయారు. తరువాత నా దగ్గర మామూలుగా కనిపించే అతిశయంగానీ అతివినయంగాని లేకుండా మాట్లాడాడు. “సూటయాభై రూపాయలకు బీరువా చేసిస్తానని చెప్పాను. నిజమే. అంతా అయ్యేటప్పటికి రెండువందలయాభై దాటిపోతున్నది. ఇందాక అయ్యగారు తిట్టారు… నాకు అదే చాలా చింతగా ఉన్నది. ఇంట్లో గూడా చింతపడతాఉంటే నా కొడుకేమన్నాడంటే “మాట పొరపాటు రాకూడదు నాయినా. అయ్యగారు డబ్బు జాస్తి అవుతుందని కోప్పడితే నువ్వు కూలి డబ్బులు తీసుకోమాక! అన్నాడు….” అంటూ చెప్పాడు. కూలి డబ్బులన్నీ అప్పుడే తీసేసుకున్నాడుగదా! కొడుకు బడాయిమాటలన్నీ తమాషాకి వల్లిస్తున్నాడా? అనుకుంటూ జాన్ మొహంకేసి చూశాను. అక్కడ కనిపించిన ఆనందం మాటల్లో చెప్పగలనా? ఎంతో ప్రశాంతత, ఆనందం, మార్దవం వెలిగిపోతున్నాయి జాన్ మొహంలో. జాన్ టక్కరివాడు. తాగుబోతు. నిలకడ లేనివాడు. పొగరుబోతు. పైసా ఖరీదు చెయ్యని కొడుకు అప్రయోజకపు మాటలు జాన్లో ఇటువంటి భావం | కలిగిస్తాయా? ఎందుకని? ఆమాటల్లో ఏమున్నది? జాన్ అసాధారణ వ్యక్తి. వ్యక్తుల మధ్యనుండే సంబంధాలూ ఆ వ్యక్తుల్లాగే క్లిష్టమూ, సంకీర్ణమూ అయివుంటున్నాయి. అసలు మనుష్యుల మధ్య నిజంగా సంబంధం అనేది వుంటుందా? వుంటే దాని స్వభావం ఎలాటిది? ఇదంతా నా బుర్రకు అర్ధం అయే విషయంగా తోచలేదు. ఆలోచనల్ని పక్కకు నెట్టి, నేను చదవలేక పక్కన పెట్టిన పుస్తకం తీసుకున్నాను. -అడవి ఏమంత దట్టంగా లేదు. కాకులు దూరని కారడవీ, చీమలు దూరని చిట్టడవీ కాదు. రకరకాల చెట్లు కీసర బాసరగా పెనవేసుకుపోయి ఉన్నాయి. ఒక్కో చెట్టుకి ఒక్కో విలక్షణత. ఆకులో, కొమ్మలో, రూపులో ప్రత్యేకత. కాని వాటిని గుర్తించగల జ్ఞానం నాకు లేదు. నేత్రోత్సవం కలిగిస్తున్న ఆ దృశ్యంలో నేను గుర్తించగలిగింది ఒక సీతాఫలం చెట్టుని. కాయలు విరగ్గా ఉన్నాయ్. అటువంటి చెట్టును నేను ఇదివరకే చూచివున్నాను. అందుకే గుర్తించాను. మిగతా చెట్లన్నీ కలిసి ఒక అడవి. అందులో ఈ సీతాఫలంచెట్టు… ఈ ప్రపంచం ఒక అస్పష్టమైన వర్ణచిత్రం. అందులో మనం గుర్తించగలిగేది అంతకుముందే మనసులో ఎరుకగా ఉన్నదాన్ని మాత్రమే. తనలోని గుర్తునే బయట గుర్తిస్తాము. ఒక మనిషి జీవితానికి అర్థం ఇందునుంచే ప్రాప్తించాల్సిందే… ఆజీవితం ముందునుండీ అతనిలో నిబిడీకృతమై ఉన్నదే… ఒక చిన్న విషయం నుండి పెద్ద సూత్రాన్ని నిర్వచించబూనుకున్నట్లు కనిపిస్తున్నా, ఇది అనుభవసిద్ధమైన విషయమే. “ఇదేం నవలరా బాబూ’ అనుకుంటూ పుస్తకం మూసేశాను. ***************************************** బీరువాకు తలుపులు బిగించి జాన్, శ్రీరాములు ఇద్దరూ కలిసి దాన్ని వరండాలోకి తెచ్చి పెట్టారు. ఇహ పాలిష్ చెయ్యాలి. జాన్ కోసం మనిషి వొచ్చాడు. ఫిలిప్ మలి దేవిని దాటుతుండగా గభాల్న ఏరు వచ్చేసి కొట్టుకుపోయాట్ట. గాభరాగా పరుగెట్టాడు జాన్. తరువాత తెలిసింది ఫిలిప్ శవం దొరికిందని. జాన్ ఈ దెబ్బకు తట్టుకోలేడు అనుకున్నాను. ఫిలిప్ కీ జాన్ కీ వుండే సంబంధంఎట్లాంటిది! నాలుగోరోజు పనిలోకి వచ్చాడు జాన్. నాలుగు రోజులకే ముఖమంతా ఒడలిపోయి ముసలివాడయ్యాడు. ఇంతలోనే పనిలోకి రాకపోతేనేం? “నీకు బాగున్నట్లు లేదు. పనికి తొందర లేదులే. ఇంటికెళ్ళు” అన్నాను సానుభూతితో. “మైనం రుద్ది పాలిష్ కొడితే బీరువాపని అయిపోతుంది” అన్నాడు ముక్తసరిగా. జాన్ గొంతులో కొత్తగా ఒక హుందాతనం వచ్చింది. ఈ జాన్ ని ఎవరూ ఓదార్చవలసిన పనిలేదు! ఉప్పుకాగితం, మైనం బాగా రుద్దాడు. పాలిష్ మూడు కోటింగులు చేశాడు. తొమ్మిది గంటలకు పనిలోకి వచ్చాడు. బయటికి కదలనేలేదు. మధ్యాహ్నం రెండు గంటలైంది, పని పూర్తయ్యేసరికి. జాన్ తన సామాన్లు మూటగట్టుకున్నాడు. మిగిలిపోయిన కొయ్యముక్కలూ, పాలిషూ, సీలలూ వప్పజెప్పాడు. “కూలి ఏమిమ్మంటావ్?” అన్నారు ఆయన. “మామూలుగా ఈ బీరువాకు నలభై రూపాయలు తీసుకుంటాను. ఇదివరకే ముప్పయి అయిదు ఇచ్చారు. నేను మొదట చెప్పినదానికంటే ఖర్చు ఎక్కువై పోయింది. మీ ఇష్టం” అన్నాడు. ఆ జాన్ మాటల్లో ఇదివరకటి అతి వినయం, టక్కరితనం పోయి ఒక హుందాతనం, నిక్కచ్చిదనం వచ్చాయి .జాన్‌పాల్ చేసిన బీరువా చివరిమెరుగులు దిద్దుకున్నాక నిగనిగలాడిపోతూ నున్నగా, అందంగా వున్నది… ఇప్పుడు నాకు ఒక్క విషయం తెలిసింది. మనిషిని ధరించిన మనస్సు అనంతమూ, మహాశక్తివంతమూ అయినది! అలా అనుకోగానే నాలో స్వేచ్ఛ, ఆనందం వెల్లివిరిశాయి. జాన్ ధైర్యశాలి. బలశాలి. అదే జాన్ నిజస్వరూపం. ధైర్యమూ, బలమూ అనేవి మనిషిలోని సత్యానికి సంబంధించిన గుణాలు. అతను హీనుడుగా, బలహీనుడుగా వుంటే, అది అతని హేల! నాది జాన్ స్వభావానికి పూర్తిగా భిన్నమైన స్వభావం. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ముక్కలైపోయాను. మళ్లీ మనిషిగా నిలబడడానికి చాలా ప్రయత్నమూ, కాలమూ పట్టింది. ********************************************** నాన్న గారు పోయాక మొదటిసారి ఆకాశం క్రింద నిలుచున్నాను. పైన శతకోటి నక్షత్రాలు మిలమిల్లాడుతున్నాయి. వాటిని చూడగానే నాకు గాభరావేసింది. ఎన్ని నక్షత్రాలు! వాటిని గురించి నాకేమీ తెలియదే! నాన్నగారూ మేమూ యీ ఆకాశం కింద ఎన్నోసార్లు కూర్చున్నాము. నాన్నగారికి ఆ నక్షత్రాల గురించి తెలుసు. వాటి పేర్లు, నడక గురించి అప్పుడప్పుడు చెప్పేవారు. కాని నేను శ్రద్ధగా విని జ్ఞాపకం పెట్టుకోలేదు. నాన్న గారి నడిగితే తెలిసిపోతుంది గనుక. ఇప్పుడు నాన్నలేరు. ఈ నక్షత్రాల గురించి నాకు ఎలా తెలిసేది? చాలా ఆరాటం, భయం, నిస్పృహ, కలిగాయి. ఏమిటో పోగొట్టుకున్నటు బాధ… నాన్నగారున్నప్పుడు ఆకాశంగురించి నేనేమీ తెలుసుకోలేదు. అప్పుడు నాకు ఉన్నదీ, ఇప్పుడు కొత్తగా పోగొట్టుకున్నదీ ఏమీలేదు. మరి ఎందుకు నాలో యీ ఆరాటం! దేనికోసం ? ఆ నక్షత్రాలు అప్పుడూ, ఇప్పుడు ఎప్పుడూ అలానే మెరుస్తూనే వుంటవి! జాన్ జ్ఞాపకానికి వచ్చాడు. మనసులోని బరువు తొలగిషోయి అకారణమైన ఆనందంతో నిండిపోయింది… మనిషి అనంతుడూ, మహాశక్తిమంతుడూను! జాన్ పాల్ చేసిన బీరువా మెరుస్తున్నది. **************************************** “బీరువా బాగున్నదే! నా బట్టలూ, పుస్తకాలు అన్నీ పెట్టుకోడానికి బాగా సరిపోతుంది” అన్నాడు బాబు. “బాగుంటే నీకేనా? పై అరలు రెండూ నాకు అందవు గనుక నీవు పెట్టుకో. కింది రెండింట్లో నేను పెట్టుకుంటాను” పాప తగవు పెట్టుకుంది అన్నతో. అసలు బీరువా నాక్కావాలని గదా చేయించుకున్నాను. ముఖ్యంగా కావలసినవన్నీ పోకుండా దాచుకోవచ్చని అనుకున్నానే! కాని… ఇప్పుడు నేను దాన్ని ఉపయోగించుకోవచ్చు. నేను దాన్ని ఉపయోగించుకోకపోవచ్చు. ఏం చేసినా ఫరవాలేదు. ************************************************************************* ‘హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1 స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify) ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast) Share this: పంచుకోండి ట్విట్టర్ ఫేస్‌బుక్ దీన్ని మెచ్చుకోండి: ఇష్టం వస్తోంది… Related Posted in ప్రసిద్ధ కథకులు టపా నావిగేషన్ ‹ Previous‘సచ్చి సాదించడం’ – ఎండపల్లి భారతి గారు Next ›‘బేడమ్మ’ – శ్రీరమణ గారి కథ 2 thoughts on “‘జాన్ పాల్ చేసిన బీరువా కథ’” అనామకం అంటున్నారు: 3:10 సా. వద్ద మార్చి 23, 2021 It’s a beautiful story . The narrative brings out the complexity and beauty of human relations so very well .
Aunty Dengudu Kathalu Telugu Sex Stories Telugu Sex Series Akka Chelli Dengudu Kathalu తెలుగు సెక్స్ కథలు Telugu incest stories You are here Home » తెలుగు సెక్స్ కథలు » అక్క ముందా చెల్లి ముందా అ అక్క ముందా చెల్లి ముందా November 24, 2022 87 Min Read 4428 అక్క ముందా చెల్లి ముందా? నేను ఎమెస్చీ మేత్స్ చేసాను. ఉద్యోగాల వేటలో ఉన్నాను. ఉద్యోగం వచ్చిందాకా ఊరికే కూర్చోటం ఎందుకని తలుపు మీద “మేత్స్ లో ట్యూషన్లు చెప్ప బడును అని ఓ కాయితం ముక్క మీద బోల్డ్ లెట్టర్స్ లో రాసి అంటించాను. మేత్స్ కి ఇంత డిమేండ్ ఉందని నేను కలలోకూడా ఊహించలేదు. పొద్దుటికల్లా ముగ్గురు పిల్లలు వచ్చారు. ఇద్దరు ‘మెట్రిక్ వాళ్ళు ఒక్కరు బి యెస్ సి ఫస్ట్ ఇయర్ లో చదువుతున్నారు. అనుకోకుండా వచ్చిన ఈ స్టూడెంట్లకు ఫీసు ఎంత చెప్పాలో తెలియ లేదు. ఒక ఐడియా తట్టింది. ఓక్కొక్కరిని పిలిచి విడివిడిగా “ మీరెంత ఇవ్వగలరు?’ అని అడిగాను. వచ్చిన బేరం ఎందుకు వొదులుకోవాలని వొప్పుకున్నాను. వీళ్ళకు చెప్పటం మొదలు పెట్టాను. పదిరోజులలో నా పేరు ఆ కాలనీలో మారుమోగి పోయింది! ఓ పది మంది దాకా స్టూడెంట్లు వచ్చారు. తరవాత వచ్చిన వాళ్ళకు మర్కెట్ రేట్ కంటే ఓ యాభై తక్కువగా చెప్పాను. సంతోషంగా వచ్చారు. నేను చాలా బిజీ ఐపోయాను. ఓ రోజు పొద్దుననే ఇద్దరమ్మాయిలు వచ్చారు. లంగా వోణీలో చూడటానికి చక్కగా ఉన్నరు. పదిహేడు పధెనిమిది వయసులో ఉంటారు. ‘సార్, ఇక్కడ లెక్కల టూషన్ చెప్పే సార్ ఉన్నారుట. ఏవరు సార్?’ అన్నది ఇద్దరిలో చిన్నది. ‘నేనే. చెప్పండి.’ ‘సార్ మా యిద్దరికి లెక్కలలో టూషన్ కావాలి సార్’ ‘చెప్తాను. నా ఫీసు ఐదు వందలు. రోజూఒక్క గంట చెప్తాను. మీరు ఏ క్లాసులో చదువుతున్నారు?’ పెద్ద అమ్మాయి ఫస్ట్ ఏర్ రెండోది ఇంటర్లో ఉన్నారు. ‘మేము అంత ఇచ్చుకోలేము సార్’ ‘సరే మీరు ఏమి ఇచ్చుకోగలరు?’ వాళ్ళీద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు? నేనేమైనా తప్పు మాట్లాడానా అని అనుమానం వేసింది. ఆ ఇద్దరిలో చిన్నది ‘ సార్, మాఇద్దరికి కలిపి ఐదువందలు ఇవ్వగలము సార్. మీకు ఇంట్లో ఏదైనా పని చేసి తీర్చుకుంటాము సార్’ నాకు జాలేసింది. లోపలకు పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ గురించి అడిగాను. వాళ్ళది పేద కుటుంబం. చదువు కోవలని ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు. నాకు వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి ‘ సరే మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి. కాని సరిగా చదువుకోవాలి.’ ‘థేంక్ యూ సార్’ అని టైం ఫిక్స్ చేసుకొని బైటికి వెళ్ళారు. వాల్లు బైటికి వెల్లిన తర్వాత నేను తలుపు వేసి కిటికీ దగ్గర నుంచోని వాల్లను చూస్తున్నాను. వాల్లిద్దరు కొంచెం దూరం వెల్లి ఒకరి చేతిలో ఒకరు చప్పట్లు కొట్టుకొని “వీడిని విపి ని చేసాము’ అని నవ్వుకుంటున్నట్లు అనిపించింది. సరే చూద్దాము అనుకొని ఎలర్ట్ ఐయ్యాను. నెక్స్ట్ రోజునుంచి రావడం మొదలు పెట్టారు. ఒకల్లకి ప్రాబ్లం ఎక్స్ప్లైన్ చేస్తుంటే రెండోది నా గదిని సర్వే చెస్తు అటూ ఇటూ చూస్తుండేది. ‘ఏం చూస్తున్నావు?’ అని అదిగిటే ‘ఏమీ లేదు సార్. ఆలోచించుతున్నాను’ అనేది. రెండు రోజూల తర్వాత నిజంగా వాల్ల గురించి తెలుసుకుందామని వీధిలొ కొంత మంది ని అడుగుతూ డిటైల్స్ కలేక్ట్ చేశాను. ఛదువుకుంటున్నది నిజమే. కాని అంత లేనివాళ్ళు కాదు. వాళ్ళ నాయన బిజినెస్స్ చేస్తాదు. వాళ్ళ అమ్మ ఉద్యొగం చేస్తుంది. సొంత ఇల్లు ఉండి. సరే వీళ్ళ పని పడామని నేను రెడీ అయ్యాను. నెక్స్ట్ రోజు ఇద్దరూ వచ్చారు. ఒక అమ్మాయిని పంపించి రెండు గంతల తర్వాత రమ్మన్నాను. ఇద్దరూ మొహాలు చూచుకొని పెద్దమ్మాయిని కూర్చోమన్నాను. చిన్నది వెల్లి పోయింది. నెమ్మది గా మాటలలో పెట్టాను. దాని కళ్ళూ, ముక్కూ, వయసూ సొగసూ గురించి బాగా మెచ్చుకున్నాను. అసలు నీవొక్కదానివే వొచ్చినట్లైటే అసలు ఏమీ తీసుకునే వాడినే కాదు. ఇంత చక్కటి పిల్లదగ్గర డబ్బు తీసుకునేవాడినేకాదు. అందుట్లో కొంచెం పని కూడా చేసి పెడతానన్నారుగా’ అని ఒక బాణం విసిరాను. ‘ఒకపని చేద్దాము. నీవు మీచెల్లికి ఏమీ చెప్పవాకు. నీదగ్గర నేను ఏమీ తీసుకోను.’ అని షేక్ హేండ్ చెయ్యి ముందరికి చాపాను. అది కూడా చెయ్యి చాపి నా చేతిలో పెట్టింది. నేను నెమ్మదిగా ప్రెస్స్ చేసాను. ‘కానీ ఇది కాంఫిడెన్షల్ గా ఉంచు’ అన్నాను. అది సరేఅని తల ఊపింది. డీని పేరు సరళ. దీని చెల్లి పేరు దివ్య. తర్వాత దివ్యతోకూడా అదే దైలాగ్ కొట్టాను. అదికూడా వెంటనే ఒప్పేసుకుంది. అప్పటినుంచీ ఇద్దరూ విడివిడిగా రావటం మొదలు పెట్టారు. ఓరోజు సలరళతో ‘సరళా, నివ్వింత చక్కగా ఉంటావు కదా? నేకెవ్వరూ బాయ్ ఫ్రెడ్లు లేరా?’ అని అడిగా. ‘సార్, అబ్బాయిలు చాలా ట్రై చేస్తారు సార్. కాని నేనెవ్వరికీ చాన్స్ ఇవ్వను సార్’ ‘సరే. ముందుగానేనె చెప్పావు. నేనే నిన్ను ఫ్రెండ్ గా ఉందామని అడుగుదా మనుకుంటున్నాను!’ ‘మీరు వేరు సార్. మీరు హేండ్సం గా ఉంటారు. బాగా చదువుకున్నారు.మిమ్మల్ని ఎవరైనా వొద్దనరు సార్’ అంది. ‘నిజంగానా? ఐతే ఇవ్వాళ్టి నుంచీ మనిద్దరం ఫ్రెండ్స్ మి’ అని సరళ చెయ్యి పట్టుకొని లైట్గా ముద్దు పెట్టుకున్నాను. సరళ ఏమీఅనలేదు. కొంచెం దగ్గరగా జరిగింది. నేను సరళ బుజం మీద చెయ్యి వేసాను. ఏమీ అనలేదు. నెమ్మదిగా దాని నడుం మీదికి చెయ్యి జాపి నడుం మీద నెమ్మది గా నొక్కాను. ఎమీ అనలేదు కాని దాని బుగ్గలు ఎర్రబడటం గమనించాను. సరేపిల్ల దారిలోకి వచ్చింది కదా అనుకొని తొందరపడితే అసలుకే మోసం రావచ్చని అక్కడితో ఆపేసాను. కొంచెం సేపు ఏవో ప్రాబ్లెంస్ సాల్వ్ చేసి వెళ్ళటానికి లేచింది. నేను దాని చెయ్యి పట్టుకొని చేతి మీద ముద్దు పెట్టుకొని. “స్వీట్ డ్రీంస్’ అన్నాను. అది తల వంచుకొని వెళ్ళి పోయింది. కొంచెం సేపు తర్వాత దివ్య వొచ్చింది. దానితోకూడా అవే దైలాగ్లు వేసాను. అది సరళ కంటే కొంచెం ఫాస్ట్. వెళ్ళబోయేముందు షేక్ హేండ్ ఇచ్చినప్పుడు వొదలకుండా దానిని దగ్గరకు లాక్కొని ‘ గుడ్నైట్ కిస్స్ ఇవ్వవా ?’ అంటూ దాని జవాబుకోసరం ఎదురు చూడకుండా దివ్య బుగ్గల మీద ఓ చక్కటి ముద్దు పెట్టాను. ‘దివ్యా, మనిద్దరం ఫ్రెండ్సని మీ అక్కకు చెప్పవాకు. అది ఇంట్లో చెప్తే కొంపలంటుకుంటై. కీప్ థిస్ ఒన్లీ టు యువర్ సెల్ఫ్’ అన్నాను. అది తల ఊపింది. దివ్యా ని దగ్గరకు లాక్కొన్నప్పుడు అది దగ్గరగా వచ్చింది. దాని సళ్ళు నా చాతీ కి బాగా తగిలాయి. మంచి టైట్గా నే ఉన్నై. దివ్య, కొంచెం సిగ్గుతో తలకాయ దించుకొని ‘గుడ్నైట్ సార్’ అంటూ వెళ్ళిపోయింది. అల్లా సరళతో, దివ్యతో రోజు రోజు ఎడ్వాన్స్ ఔతూ వచ్చింది. వాళ్ళిద్దరికీ ఒకటే మాట చెప్పాను. ‘మనిద్దరి ఫ్రెండ్షిప్ లవ్ అనుకోవద్దు.నువ్వు నన్ను బాగా అర్ధం చేసుకోవాలి నాకు నువ్వు బాగా అర్ధం కావలి. అప్పుడే ప్రేమ. అప్పుడు ప్రేమిచుకుందాము!’ అని నా లైబిలిటీ ని లిమిట్ చేసుకున్నాను. నేను ఓ రోజు లేప్ టాప్ లో ఓ బీ గ్రేడ్ ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాను. సరళ వొచ్చి నా వెనక నిలబడి చూస్తున్నదన్న విషయం నేను కని పెట్టాను. కాని దానికి తెలియనివ్వలేదు. ఓ రెండునిమిషాల తర్వాత సడెంగా వెనక్కి తిరిగి ‘ఓ సరళా ఎంతసేపైంది వొచ్చి?’ అన్నాను. ‘ఇప్పుడే సాఋ అంటూ పుస్తకాలున్న చేత్తో కాళ్ళ మధ్య నొక్కుకోవటం చూసాను. లేప్ టాప్ మూసేసి ‘కొంచెం వాటర్ తెచ్చిపెట్టవా?’ అన్నాను. అది లోపలికి పోయింది. దాని వెనకనే నేను లోపలికి వెల్లి దానిని వెనకనించి గట్టిగా కావలించుకున్నాను. ఒకచేత్తో దాని బుగ్గలను నావైపు తిప్పుకొని దాని బుగ్గలమీద, చెవుల కిందా ముద్దుపెట్టుకున్నాను. ‘శరలా యూ లూక్ బ్యూటిఫుల్ ‘ అంటూ దానిని నావైపు తిప్పుకున్నాను. అదికూడా రెండుచేతులు నా వీపుమీద వేసుకొని గట్టిగా కావలించుకొని లిప్లాక్ చేసింది. నా మొడ్డ నా లుంగీలోనుంచి బైటపడటానికి తయారైంది. మా యిద్దరి కౌగలింపుకు నా మొడ్డ దాని పూకు మీద పొత్తి కడుపుమీద బాగా పొడుస్తున్నది. నేను దాని నడుమ్మీద నుంచి పట్టు వొదలకుండా ఒక చేత్తొ దాని సళ్ళమీద ప్రహారం మొదలుపెట్టా. అది బ్రహ్మాణ్డమైన రెస్పాన్సిచ్చింది. ఇద్దరి నోళ్ళూ అతుక్కు పోయాయి. ఒక్క నిమిషం తర్వాత సరళ విడిపించుకొని ‘సార్ ఇప్పుడుకాదు సార్!’ అన్నది. నేను కూడా తొందరెందుకని ‘సరే నీకెప్పుడు ఇష్టమైతే అప్పూడే డియర్!’ అంటూ ముద్దుపెట్టి బైటికి వచ్చాము. కొద్దిగ సేపు చదువుకొని వెళ్ళిపోయింది. గంట తర్వాత దివ్య వొచ్చింది. ఇవ్వాళ బలేగా మేకప్ ఐ వచ్చింది. దాన్ని చూడగానే షేక్ హేండ్ ఇచ్చాను. అది నా చేతిలో చెయ్యి పెట్టగానే నెమ్మది గ నొక్కి నా మిడిల్ ఫింగర్తో దాని అరచెయ్యి మీద గీరాను. అది నా చేతిలో చెయ్యి అలానే ఉంచి ముసిముసి నవ్వుతో తల దించుకుంది. నేను దానిని దగ్గరకు లాక్కొని ఇవ్వాళ ఏమిటీ విసేషం ఇంత చక్కగా మేకప్ చేసుకొచ్చావు? ‘ఏమీలేదు సర్ ‘ ‘కాదు ఇవ్వాళ ఏదో స్పెషల్ నీమనస్సులో ఉంది. ఏమిటి చెప్పు.’ అన్నాను. ‘ఏమీ లేదు సారు అసలే సరళ నన్ను బాగా వేడెక్కించి వెళ్ళింది. నేను దానిని దగ్గరకు తీసుకుని నెమ్మదిగా కావలించుకొని ‘నిజం చెప్పు. లేకపోతే ముద్దు పెట్టుకుంటానూ అన్నాను. దివ్య ఏమీ మాట్లాడలేదు. నేను దాని కావలింత ఇంకా గట్టిగా బిగించి, దాని గడ్డం పైకి లేపి చటుక్కని దాని పెదాలమీద ముద్దు పెట్టుకున్నాను. ‘ఇది నీవు చక్కగా మేకప్ చేసుకున్నందుకు బహుమతీ అన్నాను. అప్పటికే దాని కళ్ళు కొంచెం మత్తెక్కినై. నేను దానిన్ వదలకుండా మళ్ళీ పెదాల మీద ముద్దు పెట్టుకొని నెమ్మదిగా నా నాలిక దాని నోట్లోకి తోసి దాని నాలికతో మెలేసాను. ఒకచెయ్యి దాని పెర్రల మీద వేసి నావైపు నొక్కుతూ రెండొచేత్తొ దాని సన్ను మీద నెమురుతూ కొంచెం కొంచెంగా ప్రెషర్ పెంచాను. అది కూడా సుపెర్గా రెస్పాన్స్ ఐ నా నోట్లో తన నాలిక తోసింది. దాని రెండుచేతులు నా నడుమును బిగించి పట్టుకున్నై. లుంగీలో నా గురుడు ఫుల్ల్ ఫారం లోకి వచ్చి దాని లంగామీదనుంచే లోపలికి దూరిపోదామా అన్నంత ఆవేశంలోకి వచ్చేశాదు. అలానే ఇద్దరం అతుక్కుపోయి రెందు నిమిషాలు నుంచుండి పోయాం. అది ఇవ్వాళ బ్లౌజ్ లోపల ఏమీలేకుండా టాప్లెస్స్ గా వచ్చింది. నా మొదటి పిసుకుడుకే బాగా గట్టి పడ్డై. నా చెయ్యి నెమ్మది గా దాని బ్లౌజ్ లోకి దురింది. నాకు డైరెక్ట్గా దాని సల్లు తగిలేప్పటికి వెర్రెత్తి పోయింది. దివ్యాని ఇంకా గట్టిగా బిగించి దాని సల్లను మార్చి మార్చి పిసక సాగేను. ఇంక ఆగలేక దానిని వొదిలి బైట గది తలుపులు మూసి గడియ పెట్టి వచ్చాను. దివ్య రెడీగా ఉంది. దానిని మళ్ళీ కౌగలించుకొని నా గదిలోకి నడిపించుకుంటూ తీసుకెళ్ళాను. చటుక్కన దాని లంగా బొందు పట్టుకొని లాగేను. దాని లంగా చటుక్కని నేలమీద పడిపోయింది. అది ఇవ్వాళ పూర్తిగా దెంగించుకోటానికి రెడీగా వచ్చిందనిపించింది. లోపల చెడ్డీకూడ వేసుకోలేదు. బ్రా కూడ వేసుకోలేదు. దాని దెమ్మను చూస్తే నాకు మతిపోయింది. దాని పూకుమీద కొంచెం కొంచెం జుట్టు ఉంది. చూడటాని కి చాలా బాగుంది. నా చెయ్యి దాని బొచ్చులోపెట్టి కొంచెం కెలికాను. అది కొంచెం సిగ్గు నటించి నన్ను మరీగట్టిగా కరుచుకు పోయింది. నా చెయ్యి దివ్య వెనకి తీసుకుపోయి, నా రింగ్ ఫింగర్ దాని పిర్రల కిందకుండా దాని పూకులో పెట్టాను. అప్పటికే భలే ఊట వచ్చింది. నా వేలంతా చాల తడి ఐయంది. ఆ తడి వేలితో దాని గొల్లిని నెమ్మదిగా వొత్తాను. అది మెలికలు తిరిగిపోయి నన్ను ఇంకా గట్టిగా కావలించుకుంది. నేను దాని రెవిక హుక్కులు విప్పి మొత్తం విప్పేసాను. ఇంకా పెరుగుతున్న బత్తాయిల లా ఉన్నై దాని సళ్ళు. తలని కొంచెం దించి దాని సల్లమీద ముద్దుపెడుతూ దాని ముచ్చికలని నాలికతో నాకుతూ సన్ను మొత్తం నోటిలోపలికి సక్ చేసి నాలికతో దాని ముచ్చికను రౌండ్ రౌండ్గా నాకుతుంటే అది ఇంక ఉండలేక తన చేత్తో నా లుంగీ లోపలనుంచి నా గురుడుని పట్టుకుంది. ఒకచేత్తొ లుంగిలాగి పడేసింది. నేను దివ్యని ఎత్తుకొని మంచం మీద పడేసి నేను నుంచొనేదాని సల్లను నాక్ సాగేను. అది నన్ను పైకి లాకొంది. నేను మంచం మీద పడుకోంగానే అది నామీదికెక్కి ఎదురు దాడి మొదలు పెట్టింది. నా మీద పడుకొని దాని సల్లను నా రొమ్ముల మీద నొక్కుకుంటూ నా నోటిలో నోరుపెట్టి గట్టిగా సక్ చేయటం మొదలు పెట్టింది. కింద నా మొడ్డ లేచి లేచి దాని పూకు లోకి పోవటానికి దారి వెతుకుతున్నట్లున్నది. దివ్య కొంచెం కిందికి జరిగి నా రొమ్ముల మీద ముచ్చికలను నాలికతో నాకుతూ ఒక చెయ్యి కిందికి తీసుకుపోయి నా మొడ్డని కొంచెం పైకీ కిందికీ ఆడించి నెమ్మదిగా గురి చూచుకొని తన పూకులోకి ఎంట్రీ ఇంచ్చింది. తనే నెమ్మది గా పైనుంచి నొక్కుకుంటూ నా మొడ్డని పూర్తిగా లోపలికి దోపేసుకుంది. దివ్య మొత్త నా మొత్త గాలాడకుండా అతుక్కు పోయినై. అలా నా మొడ్డని పూర్తిగా పూకు చివరంటా దించుకొని నన్ను గట్టిగా కరుచుకు పోయింది. ఓ అరనిమిషం అలా నొక్కుకొని ఇంక దెంగటం మోదలు పెట్టింది. ఓ నాలుగైదుసార్లు నెమ్మది నెమ్మదిగా పైకి కిందికి తన పూకుని ఊపి ఇంక స్పీడ్ అందుకుండి. తలకాయను లెఫ్ట్ కీ రైట్ కీ తిప్పుకుంటూ యమ స్పీడ్ తో దంపుడు దెంగుడు మొదలు పెట్టింది. దాని ఎగురుడికి దాని సళ్ళు పైకి కిందికీ కదులుతుంటే నా చేతులు రెండూ దని సళ్ళను బిగించి దగ్గరకు లాక్కొని నోట్ళొ పెట్టుకొని చీకటం మొదలు పెట్టాను. అలా ఓ పదిమిమిషాలు స్పీడ్గా దెంగి దెంగి మళ్ళి అతుక్కుపోయింది. రెందొ రౌండ్ లో కూడా ఓ ఐదారు నిమిషాలు దెంగి ‘సార్ నాకు ఐపోతున్నది సాఋ అంది. నాకు కూడా దివ్య పూకు కండరాలు సిగ్నల్ ఇచ్చినై. ఒకటే బిగింపు సడలింపు. దానితో నాకు కూడ దగ్గర పడింది. ఇద్దరం ఒకేసారి కార్చుకున్నాము. దివ్య కార్చుకొని చెమతలోడ్చుకుంటూ నా మీద పడుకొని నా నోట్ళొ నోరుపెట్టి కమ్మగా జుర్రుకుంది. దియ పూకులోనుంచి మా ఇద్దరి రసాలు కలిసి బైటికి కారసాగాయి. నేను దివ్యను అలానే ఒడిసి పట్టుకొని లేచి నెమ్మది గా మంచం దిగి దాని పూకులోనుంచి నా మొడ్డ జారిపోకుండా దాని పిర్రలకిందచేతులు పెట్టి నెమ్మది గా బాత్రూంలోకి తీసుకెళ్ళాను. అది కూడా రెండుచేతులతో న మెడమీదనుంచి బిగించి దాని రెండుకాళ్ళు నా చుట్టూ పెనవేసి కోతి పిల్లా కరుచుకుంది. బాత్రూం లోకి చేరాక నేలమీద కాళ్ళు పెట్టి నుంచుంది. అప్పటికే నా తొడల మీద మా ఇద్దరి రసాలు కారినై. టేప్ విప్పి ఇద్దరం ఒకరిదొకరు కడుక్కున్నాము. బైటికి వచ్చి టవల్తో తుదుచుకుంటూ నేను” దివ్యా, ఇవ్వాళ నువ్వు నన్ను దెంగుదామనే ప్లాన్ లోనే వచ్చావు కదూ?’ అన్నా. అది తలదించుకొని ఔనన్నట్లు పైకి కిందికి చేసింది. నేను దానిని మళ్ళీ కౌగలించుకొని సళ్ళు పిసుకుతూ ‘కాని భలేగా దెంగావులే! నెనెప్పటికి మర్చిపోలేను.’ అని ముద్దు పెట్టుకున్నాను. దివ్య ‘సార్ అక్కకి తెలియనివ్వద్దు. అప్పుడప్పుడు ఇలా కలుద్దామూ అన్నది. ‘కలుద్దాము కాదు దెంగుకుందాము అనూ అంటు మరోసారి దానిని ముద్దు పెట్టుకొని ఇద్దరం బట్టలేసుకొని బైటికి వచ్చాము. నేను దివ్య తో ‘దివ్యా, మీ అక్క కూడా ఇలా అప్పుడప్పుడు దెంగించుకుంటుందా?’ అని అడిగాను. “ట్రై చెయ్యండి సార్” అంది. అప్పుడు నా కర్ధమైంది. వీళ్ళిద్దరూ చదువు కోసరం కాదు, ఎంజాయ్ చేయటం కోసరం వచ్చరని. ఇది ఎపిసోడ్ ఒకటి. నెక్స్ట్ ఎపిసోడ్లో సరళ అక్కటో దెంగుడు. మూడో ఎపిసోడ్లో ఇద్దరితొ కలిసి ఒక రోజంతా ఒకటే దెంగుడు. కధ చదివిన తర్వాత మీకు కలిగిన భావాలు నా మైల్ కి పంపగలరు. అందరికి థేంక్స్.అక్క ముందా చెల్లి ముందా? నేను ఎమెస్చీ మేత్స్ చేసాను. ఉద్యోగాల వేటలో ఉన్నాను. ఉద్యోగం వచ్చిందాకా ఊరికే కూర్చోటం ఎందుకని తలుపు మీద “మేత్స్ లో ట్యూషన్లు చెప్ప బడును అని ఓ కాయితం ముక్క మీద బోల్డ్ లెట్టర్స్ లో రాసి అంటించాను. మేత్స్ కి ఇంత డిమేండ్ ఉందని నేను కలలోకూడా ఊహించలేదు. పొద్దుటికల్లా ముగ్గురు పిల్లలు వచ్చారు. ఇద్దరు ‘మెట్రిక్ వాళ్ళు ఒక్కరు బి యెస్ సి ఫస్ట్ ఇయర్ లో చదువుతున్నారు. అనుకోకుండా వచ్చిన ఈ స్టూడెంట్లకు ఫీసు ఎంత చెప్పాలో తెలియ లేదు. ఒక ఐడియా తట్టింది. ఓక్కొక్కరిని పిలిచి విడివిడిగా “ మీరెంత ఇవ్వగలరు?’ అని అడిగాను. వచ్చిన బేరం ఎందుకు వొదులుకోవాలని వొప్పుకున్నాను. వీళ్ళకు చెప్పటం మొదలు పెట్టాను. పదిరోజులలో నా పేరు ఆ కాలనీలో మారుమోగి పోయింది! ఓ పది మంది దాకా స్టూడెంట్లు వచ్చారు. తరవాత వచ్చిన వాళ్ళకు మర్కెట్ రేట్ కంటే ఓ యాభై తక్కువగా చెప్పాను. సంతోషంగా వచ్చారు. నేను చాలా బిజీ ఐపోయాను. ఓ రోజు పొద్దుననే ఇద్దరమ్మాయిలు వచ్చారు. లంగా వోణీలో చూడటానికి చక్కగా ఉన్నరు. పదిహేడు పధెనిమిది వయసులో ఉంటారు. ‘సార్, ఇక్కడ లెక్కల టూషన్ చెప్పే సార్ ఉన్నారుట. ఏవరు సార్?’ అన్నది ఇద్దరిలో చిన్నది. ‘నేనే. చెప్పండి.’ ‘సార్ మా యిద్దరికి లెక్కలలో టూషన్ కావాలి సార్’ ‘చెప్తాను. నా ఫీసు ఐదు వందలు. రోజూఒక్క గంట చెప్తాను. మీరు ఏ క్లాసులో చదువుతున్నారు?’ పెద్ద అమ్మాయి ఫస్ట్ ఏర్ రెండోది ఇంటర్లో ఉన్నారు. ‘మేము అంత ఇచ్చుకోలేము సార్’ ‘సరే మీరు ఏమి ఇచ్చుకోగలరు?’ వాళ్ళీద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు? నేనేమైనా తప్పు మాట్లాడానా అని అనుమానం వేసింది. ఆ ఇద్దరిలో చిన్నది ‘ సార్, మాఇద్దరికి కలిపి ఐదువందలు ఇవ్వగలము సార్. మీకు ఇంట్లో ఏదైనా పని చేసి తీర్చుకుంటాము సార్’ నాకు జాలేసింది. లోపలకు పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ గురించి అడిగాను. వాళ్ళది పేద కుటుంబం. చదువు కోవలని ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు. నాకు వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి ‘ సరే మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి. కాని సరిగా చదువుకోవాలి.’ ‘థేంక్ యూ సార్’ అని టైం ఫిక్స్ చేసుకొని బైటికి వెళ్ళారు. వాల్లు బైటికి వెల్లిన తర్వాత నేను తలుపు వేసి కిటికీ దగ్గర నుంచోని వాల్లను చూస్తున్నాను. వాల్లిద్దరు కొంచెం దూరం వెల్లి ఒకరి చేతిలో ఒకరు చప్పట్లు కొట్టుకొని “వీడిని విపి ని చేసాము’ అని నవ్వుకుంటున్నట్లు అనిపించింది. సరే చూద్దాము అనుకొని ఎలర్ట్ ఐయ్యాను. నెక్స్ట్ రోజునుంచి రావడం మొదలు పెట్టారు. ఒకల్లకి ప్రాబ్లం ఎక్స్ప్లైన్ చేస్తుంటే రెండోది నా గదిని సర్వే చెస్తు అటూ ఇటూ చూస్తుండేది. ‘ఏం చూస్తున్నావు?’ అని అదిగిటే ‘ఏమీ లేదు సార్. ఆలోచించుతున్నాను’ అనేది. రెండు రోజూల తర్వాత నిజంగా వాల్ల గురించి తెలుసుకుందామని వీధిలొ కొంత మంది ని అడుగుతూ డిటైల్స్ కలేక్ట్ చేశాను. ఛదువుకుంటున్నది నిజమే. కాని అంత లేనివాళ్ళు కాదు. వాళ్ళ నాయన బిజినెస్స్ చేస్తాదు. వాళ్ళ అమ్మ ఉద్యొగం చేస్తుంది. సొంత ఇల్లు ఉండి. సరే వీళ్ళ పని పడామని నేను రెడీ అయ్యాను. నెక్స్ట్ రోజు ఇద్దరూ వచ్చారు. ఒక అమ్మాయిని పంపించి రెండు గంతల తర్వాత రమ్మన్నాను. ఇద్దరూ మొహాలు చూచుకొని పెద్దమ్మాయిని కూర్చోమన్నాను. చిన్నది వెల్లి పోయింది. నెమ్మది గా మాటలలో పెట్టాను. దాని కళ్ళూ, ముక్కూ, వయసూ సొగసూ గురించి బాగా మెచ్చుకున్నాను. అసలు నీవొక్కదానివే వొచ్చినట్లైటే అసలు ఏమీ తీసుకునే వాడినే కాదు. ఇంత చక్కటి పిల్లదగ్గర డబ్బు తీసుకునేవాడినేకాదు. అందుట్లో కొంచెం పని కూడా చేసి పెడతానన్నారుగా’ అని ఒక బాణం విసిరాను. ‘ఒకపని చేద్దాము. నీవు మీచెల్లికి ఏమీ చెప్పవాకు. నీదగ్గర నేను ఏమీ తీసుకోను.’ అని షేక్ హేండ్ చెయ్యి ముందరికి చాపాను. అది కూడా చెయ్యి చాపి నా చేతిలో పెట్టింది. నేను నెమ్మదిగా ప్రెస్స్ చేసాను. ‘కానీ ఇది కాంఫిడెన్షల్ గా ఉంచు’ అన్నాను. అది సరేఅని తల ఊపింది. డీని పేరు సరళ. దీని చెల్లి పేరు దివ్య. తర్వాత దివ్యతోకూడా అదే దైలాగ్ కొట్టాను. అదికూడా వెంటనే ఒప్పేసుకుంది. అప్పటినుంచీ ఇద్దరూ విడివిడిగా రావటం మొదలు పెట్టారు. ఓరోజు సలరళతో ‘సరళా, నివ్వింత చక్కగా ఉంటావు కదా? నేకెవ్వరూ బాయ్ ఫ్రెడ్లు లేరా?’ అని అడిగా. ‘సార్, అబ్బాయిలు చాలా ట్రై చేస్తారు సార్. కాని నేనెవ్వరికీ చాన్స్ ఇవ్వను సార్’ ‘సరే. ముందుగానేనె చెప్పావు. నేనే నిన్ను ఫ్రెండ్ గా ఉందామని అడుగుదా మనుకుంటున్నాను!’ ‘మీరు వేరు సార్. మీరు హేండ్సం గా ఉంటారు. బాగా చదువుకున్నారు.మిమ్మల్ని ఎవరైనా వొద్దనరు సార్’ అంది. ‘నిజంగానా? ఐతే ఇవ్వాళ్టి నుంచీ మనిద్దరం ఫ్రెండ్స్ మి’ అని సరళ చెయ్యి పట్టుకొని లైట్గా ముద్దు పెట్టుకున్నాను. సరళ ఏమీఅనలేదు. కొంచెం దగ్గరగా జరిగింది. నేను సరళ బుజం మీద చెయ్యి వేసాను. ఏమీ అనలేదు. నెమ్మదిగా దాని నడుం మీదికి చెయ్యి జాపి నడుం మీద నెమ్మది గా నొక్కాను. ఎమీ అనలేదు కాని దాని బుగ్గలు ఎర్రబడటం గమనించాను. సరేపిల్ల దారిలోకి వచ్చింది కదా అనుకొని తొందరపడితే అసలుకే మోసం రావచ్చని అక్కడితో ఆపేసాను. కొంచెం సేపు ఏవో ప్రాబ్లెంస్ సాల్వ్ చేసి వెళ్ళటానికి లేచింది. నేను దాని చెయ్యి పట్టుకొని చేతి మీద ముద్దు పెట్టుకొని. “స్వీట్ డ్రీంస్’ అన్నాను. అది తల వంచుకొని వెళ్ళి పోయింది. కొంచెం సేపు తర్వాత దివ్య వొచ్చింది. దానితోకూడా అవే దైలాగ్లు వేసాను. అది సరళ కంటే కొంచెం ఫాస్ట్. వెళ్ళబోయేముందు షేక్ హేండ్ ఇచ్చినప్పుడు వొదలకుండా దానిని దగ్గరకు లాక్కొని ‘ గుడ్నైట్ కిస్స్ ఇవ్వవా ?’ అంటూ దాని జవాబుకోసరం ఎదురు చూడకుండా దివ్య బుగ్గల మీద ఓ చక్కటి ముద్దు పెట్టాను. ‘దివ్యా, మనిద్దరం ఫ్రెండ్సని మీ అక్కకు చెప్పవాకు. అది ఇంట్లో చెప్తే కొంపలంటుకుంటై. కీప్ థిస్ ఒన్లీ టు యువర్ సెల్ఫ్’ అన్నాను. అది తల ఊపింది. దివ్యా ని దగ్గరకు లాక్కొన్నప్పుడు అది దగ్గరగా వచ్చింది. దాని సళ్ళు నా చాతీ కి బాగా తగిలాయి. మంచి టైట్గా నే ఉన్నై. దివ్య, కొంచెం సిగ్గుతో తలకాయ దించుకొని ‘గుడ్నైట్ సార్’ అంటూ వెళ్ళిపోయింది. అల్లా సరళతో, దివ్యతో రోజు రోజు ఎడ్వాన్స్ ఔతూ వచ్చింది. వాళ్ళిద్దరికీ ఒకటే మాట చెప్పాను. ‘మనిద్దరి ఫ్రెండ్షిప్ లవ్ అనుకోవద్దు.నువ్వు నన్ను బాగా అర్ధం చేసుకోవాలి నాకు నువ్వు బాగా అర్ధం కావలి. అప్పుడే ప్రేమ. అప్పుడు ప్రేమిచుకుందాము!’ అని నా లైబిలిటీ ని లిమిట్ చేసుకున్నాను. నేను ఓ రోజు లేప్ టాప్ లో ఓ బీ గ్రేడ్ ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాను. సరళ వొచ్చి నా వెనక నిలబడి చూస్తున్నదన్న విషయం నేను కని పెట్టాను. కాని దానికి తెలియనివ్వలేదు. ఓ రెండునిమిషాల తర్వాత సడెంగా వెనక్కి తిరిగి ‘ఓ సరళా ఎంతసేపైంది వొచ్చి?’ అన్నాను. ‘ఇప్పుడే సాఋ అంటూ పుస్తకాలున్న చేత్తో కాళ్ళ మధ్య నొక్కుకోవటం చూసాను. లేప్ టాప్ మూసేసి ‘కొంచెం వాటర్ తెచ్చిపెట్టవా?’ అన్నాను. అది లోపలికి పోయింది. దాని వెనకనే నేను లోపలికి వెల్లి దానిని వెనకనించి గట్టిగా కావలించుకున్నాను. ఒకచేత్తో దాని బుగ్గలను నావైపు తిప్పుకొని దాని బుగ్గలమీద, చెవుల కిందా ముద్దుపెట్టుకున్నాను. ‘శరలా యూ లూక్ బ్యూటిఫుల్ ‘ అంటూ దానిని నావైపు తిప్పుకున్నాను. అదికూడా రెండుచేతులు నా వీపుమీద వేసుకొని గట్టిగా కావలించుకొని లిప్లాక్ చేసింది. నా మొడ్డ నా లుంగీలోనుంచి బైటపడటానికి తయారైంది. మా యిద్దరి కౌగలింపుకు నా మొడ్డ దాని పూకు మీద పొత్తి కడుపుమీద బాగా పొడుస్తున్నది. నేను దాని నడుమ్మీద నుంచి పట్టు వొదలకుండా ఒక చేత్తొ దాని సళ్ళమీద ప్రహారం మొదలుపెట్టా. అది బ్రహ్మాణ్డమైన రెస్పాన్సిచ్చింది. ఇద్దరి నోళ్ళూ అతుక్కు పోయాయి. ఒక్క నిమిషం తర్వాత సరళ విడిపించుకొని ‘సార్ ఇప్పుడుకాదు సార్!’ అన్నది. నేను కూడా తొందరెందుకని ‘సరే నీకెప్పుడు ఇష్టమైతే అప్పూడే డియర్!’ అంటూ ముద్దుపెట్టి బైటికి వచ్చాము. కొద్దిగ సేపు చదువుకొని వెళ్ళిపోయింది. గంట తర్వాత దివ్య వొచ్చింది. ఇవ్వాళ బలేగా మేకప్ ఐ వచ్చింది. దాన్ని చూడగానే షేక్ హేండ్ ఇచ్చాను. అది నా చేతిలో చెయ్యి పెట్టగానే నెమ్మది గ నొక్కి నా మిడిల్ ఫింగర్తో దాని అరచెయ్యి మీద గీరాను. అది నా చేతిలో చెయ్యి అలానే ఉంచి ముసిముసి నవ్వుతో తల దించుకుంది. నేను దానిని దగ్గరకు లాక్కొని ఇవ్వాళ ఏమిటీ విసేషం ఇంత చక్కగా మేకప్ చేసుకొచ్చావు? ‘ఏమీలేదు సాఋ ‘కాదు ఇవ్వాళ ఏదో స్పెషల్ నీమనస్సులో ఉంది. ఏమిటి చెప్పు.’ అన్నాను. ‘ఏమీ లేదు సాఋ అసలే సరళ నన్ను బాగా వేడెక్కించి వెళ్ళింది. నేను దానిని దగ్గరకు తీసుకుని నెమ్మదిగా కావలించుకొని ‘నిజం చెప్పు. లేకపోతే ముద్దు పెట్టుకుంటానూ అన్నాను. దివ్య ఏమీ మాట్లాడలేదు. నేను దాని కావలింత ఇంకా గట్టిగా బిగించి, దాని గడ్డం పైకి లేపి చటుక్కని దాని పెదాలమీద ముద్దు పెట్టుకున్నాను. ‘ఇది నీవు చక్కగా మేకప్ చేసుకున్నందుకు బహుమతీ అన్నాను. అప్పటికే దాని కళ్ళు కొంచెం మత్తెక్కినై. నేను దానిన్ వదలకుండా మళ్ళీ పెదాల మీద ముద్దు పెట్టుకొని నెమ్మదిగా నా నాలిక దాని నోట్లోకి తోసి దాని నాలికతో మెలేసాను. ఒకచెయ్యి దాని పెర్రల మీద వేసి నావైపు నొక్కుతూ రెండొచేత్తొ దాని సన్ను మీద నెమురుతూ కొంచెం కొంచెంగా ప్రెషర్ పెంచాను. అది కూడా సుపెర్గా రెస్పాన్స్ ఐ నా నోట్లో తన నాలిక తోసినిద్. దాని రెండుచేతులు నా నడుమును బిగించి పట్టుకున్నై. లుంగీలో నా గురుడు ఫుల్ల్ ఫారం లోకి వచ్చి దాని లంగామీదనుంచే లోపలికి దూరిపోదామా అన్నంత ఆవేశంలోకి వచ్చేశాదు. అలానే ఇద్దరం అతుక్కుపోయి రెందు నిమిషాలు నుంచుండి పోయాం. అది ఇవ్వాళ బ్లౌజ్ లోపల ఏమీలేకుండా టాప్లెస్స్ గా వచ్చింది. నా మొదటి పిసుకుడుకే బాగా గట్టి పడ్డై. నా చెయ్యి నెమ్మది గా దాని బ్లౌజ్ లోకి దురింది. నాకు డైరెక్ట్గా దాని సల్లు తగిలేప్పటికి వెర్రెత్తి పోయింది. దివ్యాని ఇంకా గట్టిగా బిగించి దాని సల్లను మార్చి మార్చి పిసక సాగేను. ఇంక ఆగలేక దానిని వొదిలి బైట గది తలుపులు మూసి గడియ పెట్టి వచ్చాను. దివ్య రెడీగా ఉంది. దానిని మళ్ళీ కౌగలించుకొని నా గదిలోకి నడిపించుకుంటూ తీసుకెళ్ళాను. చటుక్కన దాని లంగా బొందు పట్టుకొని లాగేను. దాని లంగా చటుక్కని నేలమీద పడిపోయింది. అది ఇవ్వాళ పూర్తిగా దెంగించుకోటానికి రెడీగా వచ్చిందనిపించింది. లోపల చెడ్డీకూడ వేసుకోలేదు. బ్రా కూడ వేసుకోలేదు. దాని దెమ్మను చూస్తే నాకు మతిపోయింది. దాని పూకుమీద కొంచెం కొంచెం జుట్టు ఉంది. చూడతాని కి చాలా బాగుంది. నా చెయ్యి దాని బొచ్చులోపెట్టి కొంచెం కెలికాను. అది కొంచెం సిగ్గు నటించి నన్ను మరీగట్టిగా కరుచుకు పోయింది. నా చెయ్యి దివ్య వెనకి తీసుకుపోయి, నా రింగ్ ఫింగర్ దాని పిర్రల కిందకుండా దాని పూకుకో పెట్టాను. అప్పటికే భలే ఊట వచ్చింది. నా వేలంతా చాల తడి ఐయంది. ఆ తడి వేలితో దాని గొల్లిని నెమ్మదిగా వొత్తాను. అది మెలికలు తిరిగిపోయి నన్ను ఇంకా గట్టిగా కావలించుకుంది. నేను దాని రెవిక హుక్కులు విప్పి మొత్తం విప్పేసాను. ఇంకా పెరుగుతున్న బత్తాయిల లా ఉన్నై దాని సళ్ళు. తలని కొంచెం దించి దాని సల్లమీద ముద్దుపెడుతూ దాని ముచ్చికలని నాలికతో నాకుతూ సన్ను మొత్తం నోటిలోపలికి సక్ చేసి నాలికతో దాని ముచ్చికను రౌండ్ రౌండ్గా నాకుతుంటే అది ఇంక ఉండలేక తన చేత్తో నా లుంగీ లోపలనుంచి నా గురుడుని పట్టుకుంది. ఒకచేత్తొ లుంగిలాగి పడేసింది. నేను దివ్యని ఎత్తుకొని మంచం మీద పడేసి నేను నుంచొనేదాని సల్లను నాక్ సాగేను. అది నన్ను పైకి లాకొంది. నేను మంచం మీద పడుకోంగానే అది నామీదికెక్కి ఎదురు దాడి మొదలు పెట్టింది. నా మీద పడుకొని దాని సల్లను నా రొమ్ముల మీద నొక్కుకుంటూ నా నోటిలో నోరుపెట్టి గట్టిగా సక్ చేయటం మొదలు పెట్టింది. కింద నా మొడ్డ లేచి లేచి దాని పూకు లోకి పోవటానికి దారి వెతుకుతున్నట్లున్నది. దివ్య కొంచెం కిందికి జరిగి నా రొమ్ముల మీద ముచ్చికలను నాలికతో నాకుతూ ఒక చెయ్యి కిందికి తీసుకుపోయి నా మొడ్డని కొంచెం పైకీ కిందికీ ఆడించి నెమ్మదిగా గురి చూచుకొని తన పూకులోకి ఎంట్రీ ఇంచ్చింది. తనే నెమ్మది గా పైనుంచి నొక్కుకుంటూ నా మొడ్డని పూర్తిగా లోపలికి దోపేసుకుంది. దివ్య మొత్త నా మొత్త గాలాడకుండా అతుక్కు పోయినై. అలా నా మొడ్డని పూర్తిగా పూకు చివరంటా దించుకొని నన్ను గట్టిగా కరుచుకు పోయింది. ఓ అరనిమిషం అలా నొక్కుకొని ఇంక దెంగటం మోదలు పెట్టింది. ఓ నాలుగైదుసార్లు నెమ్మది నెమ్మదిగా పైకి కిందికి తన పూకుని ఊపి ఇంక స్పీడ్ అందుకుండి. తలకాయను లెఫ్ట్ కీ రైట్ కీ తిప్పుకుంటూ యమ స్పీడ్ తో దంపుడు దెంగుడు మొదలు పెట్టింది. దాని ఎగురుడికి దాని సళ్ళు పైకి కిందికీ కదులుతుంటే నా చేతులు రెండూ దని సళ్ళను బిగించి దగ్గరకు లాక్కొని నోట్ళొ పెట్టుకొని చీకటం మొదలు పెట్టాను. అలా ఓ పదిమిమిషాలు స్పీడ్గా దెంగి దెంగి మళ్ళి అతుక్కుపోయింది. రెందొ రౌండ్ లో కూడా ఓ ఐదారు నిమిషాలు దెంగి ‘సార్ నాకు ఐపోతున్నది సాఋ అంది. నాకు కూడా దివ్య పూకు కండరాలు సిగ్నల్ ఇచ్చినై. ఒకటే బిగింపు సడలింపు. దానితో నాకు కూడ దగ్గర పడింది. ఇద్దరం ఒకేసారి కార్చుకున్నాము. దివ్య కార్చుకొని చెమతలోడ్చుకుంటూ నా మీద పడుకొని నా నోట్ళొ నోరుపెట్టి కమ్మగా జుర్రుకుంది. దియ పూకులోనుంచి మా ఇద్దరి రసాలు కలిసి బైటికి కారసాగాయి. నేను దివ్యను అలానే ఒడిసి పట్టుకొని లేచి నెమ్మది గా మంచం దిగి దాని పూకులోనుంచి నా మొడ్డ జారిపోకుండా దాని పిర్రలకిందచేతులు పెట్టి నెమ్మది గా బాత్రూంలోకి తీసుకెళ్ళాను. అది కూడా రెండుచేతులతో న మెడమీదనుంచి బిగించి దాని రెండుకాళ్ళు నా చుట్టూ పెనవేసి కోతి పిల్లా కరుచుకుంది. బాత్రూం లోకి చేరాక నేలమీద కాళ్ళు పెట్టి నుంచుంది. అప్పటికే నా తొడల మీద మా ఇద్దరి రసాలు కారినై. టేప్ విప్పి ఇద్దరం ఒకరిదొకరు కడుక్కున్నాము. బైటికి వచ్చి టవల్తో తుదుచుకుంటూ నేను” దివ్యా, ఇవ్వాళ నువ్వు నన్ను దెంగుదామనే ప్లాన్ లోనే వచ్చావు కదూ?’ అన్నా. అది తలదించుకొని ఔనన్నట్లు పైకి కిందికి చేసింది. నేను దానిని మళ్ళీ కౌగలించుకొని సళ్ళు పిసుకుతూ ‘కాని భలేగా దెంగావులే! నెనెప్పటికి మర్చిపోలేను.’ అని ముద్దు పెట్టుకున్నాను. దివ్య ‘సార్ అక్కకి తెలియనివ్వద్దు. అప్పుడప్పుడు ఇలా కలుద్దామూ అన్నది. ‘కలుద్దాము కాదు దెంగుకుందాము అనూ అంటు మరోసారి దానిని ముద్దు పెట్టుకొని ఇద్దరం బట్టలేసుకొని బైటికి వచ్చాము. నేను దివ్య తో ‘దివ్యా, మీ అక్క కూడా ఇలా అప్పుడప్పుడు దెంగించుకుంటుందా?’ అని అడిగాను. “ట్రై చెయ్యండి సార్” అంది. అప్పుడు నా కర్ధమైంది. వీళ్ళిద్దరూ చదువు కోసరం కాదు, ఎంజాయ్ చేయటం కోసరం వచ్చరని. ఈది ఎపిసొడ్ ఒకటి. నెక్స్ట్ ఎపిసొదె లో సరళ అక్కతో దెంగుడు. మూడో ఎపిసొదె లో అక్కా చెల్లి తొ కలిప్ ఇద్దరితో రోజంతా ఒకటే దెంగుడు
Telugu News » Trending » Woman who swayed to love you zindagi in viral video dies of covid 19 doctor tweets Viral: పాపం.! ఆ యువతి చనిపోయింది.. ‘లవ్ యూ జిందగీ’ అంటూనే.. కన్నీరు పెట్టిస్తోన్న డాక్టర్ ట్వీట్.. ముక్కుకు ఆక్సిజన్‌ మాస్క్ పెట్టుకుని.. ఆసుపత్రి బెడ్‌పైన తనకు ఇష్టమైన 'లవ్ యూ జిందగీ' పాటను హమ్మింగ్‌ చేస్తూ ఎంజాయ్... Love You Zindagi Ravi Kiran | Edited By: Team Veegam May 14, 2021 | 5:47 PM Viral Video Update: ముక్కుకు ఆక్సిజన్‌ మాస్క్ పెట్టుకుని.. ఆసుపత్రి బెడ్‌పైన తనకు ఇష్టమైన ‘లవ్ యూ జిందగీ’ పాటను హమ్మింగ్‌ చేస్తూ ఎంజాయ్ చేసిన యువతి గుర్తుందా.? గతవారం ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఆమె కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. ఆ ధీర యువతి పోరాటం ముగిసింది. కరోనా ముందు ఓడిపోయింది. ఆ ధైర్యమైన గుండె ఆగిపోయింది. గతవారం డాక్టర్‌ మౌనిక లంగేష్‌ ఓ వీడియోను తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఐసీయూ బెడ్ దొరక్కపోవడంతో కరోనా సోకిన ఓ యువతికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు సదరు ఆసుపత్రి సిబ్బంది. రెమ్‌డెసివర్, ప్లాస్మా థెరపీని సైతం అందించారు. ఇలాంటి ఆరోగ్య పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి ఏమాత్రం కుంగిపోలేదు. చిరునవ్వులు చిందిస్తూ ప్రతి ఒక్కరిలో మనోధైర్యాన్ని నింపుతూ కనిపించింది. ఆ యువతి.. తనకు పాటలు వినాలని ఉందని డాక్టర్లకు చెప్పడంతో.. ఆమె రిక్వెస్ట్‌ మేరకు సాంగ్స్‌ను ప్లే చేస్తున్నట్లు డాక్టర్‌ మౌనిక పేర్కొంటూ అందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అందరూ కూడా ఆమె త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్ధించారు. అయితే ఆ ప్రార్ధనలు ఏవీ ఫలించలేదు. కరోనాపై పోరాటంలో ఆ ధీర యువతి ఓడిపోయింది. నాలుగు రోజుల క్రితం ఆమె పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్చారు. చివరికి చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని డాక్టర్ మోనికా నిన్న ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆ ట్వీట్ చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఓ ధైర్యమైన గుండెను కోల్పోయామంటూ కామెంట్స్ పెడుతున్నారు. I am very sorry..we lost the brave soul.. ॐ शांति .. please pray for the family and the kid to bear this loss🙏😭 https://t.co/dTYAuGFVxk — Dr.Monika Langeh🇮🇳 (@drmonika_langeh) May 13, 2021 She got the ICU bed but the condition is not stable. Please pray for brave girl. Sometimes I feel so helpless. It’s all in the hands of almighty what we plan what we think is not in our hands. A little kid is waiting for her at home. Please pray. https://t.co/zfpWEt5dYm
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య భయాలు వెంటాడుతున్నాయి.ఖర్చులు తగ్గించుకునుందేకు కంపెనీలు ఉద్యోగులను పెద్దసంఖ్యలో తొలగిస్తూ ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నాయి ఫేస్‌బుక్‌తో ప్రారంభం.. మెటా( ఫేస్‌బుక్) అధినేత మార్క్‌ జూకర్ బర్గ్ తన కంపెనీలో పనిచేస్తున్న 11వేల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వచ్చే ఆదాయం పడిపోవడంతో ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు 6 వారాల వేతనంతో పాటు 6నెలల ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ట్విట్టర్‌లో సగం ఖాళీ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్ సైతం తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించారు. దాదాపు 4 వేల మందికి ఉద్వాసన పలికారు. 12గంటల పాటు పనిచేయాలని నిబంధన విధించారు. ఈ నిబంధన పట్ల ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున ట్విట్టర్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. #రిప్ ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాను హోరెత్తించారు. ఉద్యోగుల ఆందోళనతో ఈనెల 21 వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆఫీసులను షట్ డౌన్ చేసింది. ఈనెల 21 వరకు ఆఫీసులకు రావొద్దని ఈమెయిల్స్ పెట్టింది. అమెజాన్ కూడా.. అమెజాన్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టింది. సుమారు 10వేల మంది ఎంప్లాయిస్‍ను తొలగించనున్నట్టు అధికారికంగా ధ్రువీకరించింది. సిబ్బంది తొలగింపు వచ్చే ఏడాది వరకు కొనసాగుతోందని సీఈఓ ఆండీ జస్సీ పేర్కొన్నారు. ఇంత పెద్ద కంపెనీలు అసలు ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నాయి? అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి? వాటి వల్ల జరిగి నష్టాలు ఏంటో సూటిగా సుత్తి లేకుండా తెలుసుకుందాం. ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి? ఆర్థిక మాంద్యం అంటే ఒక దేశం ఆర్థిక వృద్ధిరేటు రోజురోజుకు కుచించుకుపోవడాన్ని ఆర్థిక మాంద్యంగా చెప్పవచ్చు. ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండు(2*3= 6 నెలలు) త్రైమాసికాలు వృద్ధిరేటు తగ్గిపోవడాన్ని ఆర్థిక మాంద్యం అంటారు. సామాన్య పరిభాషలో చెప్పాలంటే ప్రజలు ఏ వస్తువు కొనుగోలు చేయకుండా జాగ్రత్త వహించే పరిస్థితిని మాంద్యంగా చెప్పవచ్చు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఆర్థిక మాంద్యం ఎలా వస్తుంది? ఆర్థిక మాంద్యం ఎలా వస్తుందనేదానికి సరైన కారణాలు లేవు. కానీ దాని ఉనిఖిని మాత్రం గమనించవచ్చు. ఉదాహరణకు అమెరికాను తీసుకుందాం. ప్రస్తుతం అమెరికా ఆర్థిక మాంద్యంలో ఉంది. కోవిడ్ అనంతరం అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. అంటే వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రజలు ఖర్చు పెట్టే డబ్బు అధికంగా ఉండి... వస్తు ఉత్పత్తి తక్కువగా ఉండటం. ఇలా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి అమెరికా కేంద్రబ్యాంకు వడ్డీ రేట్లను ఇటీవల భారీగా పెంచింది. అమెరికాలాంటి నిర్మాణాత్మక ఆర్థికవ్యవస్థలో ఎక్కువమంది ప్రజలు బ్యాంకు లావదేవీలపై ఆధారపడుతుంటారు. ఇలా వడ్డీ రేట్లను ఒక్కసారిగా పెంచడం వల్ల ప్రజలు నెలవారిగా బ్యాంకులకు చెల్లించే EMI మొత్తం పెరుగుతుంది. ఫలితంగా ప్రజల వద్ద అందుబాటులో ఉండే డబ్బు తగ్గుతుంది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి ఎవరైనా ఆలోచిస్తారు. పొదుపుపై దృష్టి సారిస్తారు. ఈ పరిణామామే మాంద్యానికి తొలి మెట్టు వడ్డీ రేట్లను పెంచడం వల్ల ఆర్థిక మాంద్యం వస్తుందా? కేంద్రబ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం వల్ల ఆర్థిక మాంద్యం వస్తుందా అంటే... రాదు అని కచ్చితంగా చెప్పలేం. కానీ భారీగా వడ్డీ రేట్లను పెంచడం వల్ల డబ్బు ఖర్చు పెట్టడంపై వ్యక్తులు జాగ్రత్త వహిస్తారు. ఇది పొదుపు చేస్తే పర్వాలేదు కానీ అతి జాగ్రత్త వహిస్తే ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. ఎలాగంటే ఐటీ కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి వడ్డీరేట్లు పెంచకముందు బాగా ఖర్చు చేసేవాడు అనుకుందాం. వడ్డీ రేట్లు పెంచగానే నెలవారి EMI పెరగడంతో ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటాడు. దీంతో ఖర్చును తగ్గిస్తాడు. ఈ ప్రభావం ఇతర రంగాలపై కూడా పడుతుంది. ఎలా అంటే బాగా సంపాదించే సాప్ట్‌వేర్ ఉద్యోగులే ఖర్చును తగ్గిస్తే.. మనం కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి కదా అనే మానసిక ఆందోళన ఇతర ఉద్యోగుల్లోనూ ఉదయిస్తుంది. దీంతో వారు కూడా తమ ఖర్చులను తగ్గిస్తారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గి డిమాండ్ పడిపోతుంది. వస్తువుల డిమాండ్ పడిపోవడం వల్ల పరిశ్రమలు తమ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఉత్పత్తి తగ్గితే... కంపెనీల్లో పని తగ్గుతుంది. ఫలితంగా ఉద్యోగుల అవసరం తగ్గుతుంది. అంతిమంగా యాజమాన్యాలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ పరిణామం కొన్ని నెలల పాటు అలాగే కొనసాగితే... మొత్తంగా ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. ఎందుకంటే వస్తువులు- సేవల కొనుగోలు వల్లనే కదా ఆర్థిక వ్యవస్థ ముందుకు నడిచేది. ప్రజల కొనుగోళ్లు చేయడం వల్లనే కదా పన్నుల రూపంలో ప్రభుత్వాలకు రాబడి వచ్చేది. 1.ఆర్థిక మాంద్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ముందు ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు చేపట్టాలి. 2.ఉపాధిని పెంచే రంగాలపై ప్రభుత్వాలు పెట్టుబడులుగా పెట్టాలి. 3.భారత్ లాంటి దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కొంత మేర నిరుద్యోగితను తగ్గించవచ్చు. 4.వడ్డీ రేట్లను ఒకేసారి పెంచకుండా... ఆర్థికవ్యవస్థ గమనానికి అనుగుణంగా పెంచాలి ఆర్థిక మాంద్యాన్ని అరికట్టే చర్యలు? 5.క్రమంగా వడ్డీ రేట్లను తగ్గించాలి. ఫలితంగా బ్యాంకులకు కట్టే EMI డబ్బు తగ్గి చేతుల్లో డబ్బులు మిగులుతాయి. 6.ప్రభుత్వాలు ఆర్థిక ఉద్దీపన చర్యలు చేపట్టాలి. 7.బ్యాంకులకు ఆర్థిక ప్యాకేజీలు అందించి రుణాలు తక్కువ వడ్డీకి ఇచ్చేలా చూడాలి 8.ఎక్కువ మందికి ఉపాది కల్పించే చిన్న పరిశ్రమలకు ఉదారంగా రుణాలు ఇవ్వాలి. అప్పుడు పరిశ్రమలు రుణాలను పెట్టుబడిగా మార్చుకుని ఉత్పత్తి పెంచడానికి చర్యలు చేపడుతాయి. ఉత్పత్తిని పెంచేందుకు అదనపు ఉద్యోగుల అవసరం ఏర్పడుతుంది. దీంతో ఎంప్లాయిమెంట్ జనరేట్ అవుతుంది. ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు తీసుకునే తక్షణ చర్యలకు బదులు... ఆర్థిక వృద్ధికి అనుగుణంగా తీసుకునే దీర్ఘకాల నిర్ధిష్ట చర్యలు ప్రతి ఆర్థిక వ్యవస్థకు మంచిది.
thesakshi.com : టీఆర్ఎస్ నేత అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె తాటి మహాలక్ష్మి నిన్న ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహాలక్ష్మి తెల్లవారినా తన గది తలుపులు తీయకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తలుపులు పగులకొట్టి గదిలోకి వెళ్లారు.లోపల కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. మహాలక్ష్మీ గదిలో ఉరికి వేలాడుతూ కనిపించడంతో షాకయ్యారు. వెంటనే ఆమెను కిందికి దించి భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించగా.. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన తాటి వెంకటేశ్వర్లు వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు.కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ఆయనను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. తాటి మహాలక్ష్మీ ఎంబీబీఎస్ పూర్తయ్యింది. పీజీ అడ్మిషన్ కోసం ప్రిపేర్ అవుతోంది. కూతురు ఎందుకు చనిపోయిందో తెలియక కుటుంబం ఆవేదన చెందుతోంది. కూతురిని విగతజీవిగా చూడాల్సి రావడంపై మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా కలత చెందాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వైద్య ఆరోగ్య విశ్వాలయానికి ఎన్ టి ఆర్ పేరు తొలగించినందుకు మనస్తాపంతో రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్ష స్ధానం నుంచి వైఎల్ పి (డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్) వైదొలగడం ఒక సందేశంలా వుంది. ప్రభుత్వాన్ని నడుపుతున్న వారి అడ్డగోలుతనాన్ని వ్యతిరేకించే వారు రణమో శరణమో తేల్చుకోవాలని వైఎల్ పి పిలుపు ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఆరోగ్యమంటే ప్రజారోగ్యమని, వైద్య సేవలను కిందికి తీసుకువచ్చినపుడే ఇది సాధ్యమౌతుందని ఇందుకు వైద్యవిద్యలను విజ్ఞానాలను సమన్వయంగా క్రోడీకరించాలని ఎన్ టి ఆర్ తలపెట్టారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజిలు, నర్సింగ్ కాలేజిలు, ఇతర పారా మెడికల్ కాలేజీల అవి వున్న ప్రాంతపు యూనివర్సిటీల పరిధిలో వుండేవి. ఒకే రాష్ట్రంలో వున్న వైద్య విద్యా సంస్ధల కాలెండర్లలో తేడాలు పైచదువులకు వెళ్ళే సందర్భాల్లో విద్యార్థుల్ని అడ్డుపెట్టేవి. ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో వుండేవారు. ఈ రంగంలో వున్న పెద్దలు అకడమీషియన్లు సమస్యను వివరించినపుడు ఎన్ టి ఆర్ – రాష్ట్ర వ్యాప్తవ్యాప్తంగా అన్ని వైద్య, పారా వైద్య విద్యా సంస్ధల్నీ ఒకే పాలనా పర్యవేక్షణలో వుండేలా వైద్య విశ్వవిద్యాలయాన్ని స్ధాపించారు. యూనివర్సిటీకి అవసరమైన మెడికల్ కాలేజిని, టీచింగ్ హాస్పిటల్ నీ విజయవాడలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. తరువాత ఇదే నమూనాతో మరికొన్ని రాష్ట్రాలు కూడా రాష్ట్రమంతటికీ ఒకే హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పుకున్నాయి. ఇది వైద్యవిద్యల్లో దేశానికే ఒక దిక్సూచిగా నిలచిన డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ చరిత్ర. వై ఎస్ ఆర్ పేరు పెడుతున్న జగన్ తో సహా ఎవరైనా ఈ చరిత్రను మార్చగలరా? మూడు దశాబ్దాల్లో వేల వేల మంది డాక్టర్లుగా, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లుగా, డెంటల్ సర్జన్లుగా, ఫిజియో ధెరపిస్టులుగా నర్సులుగా, పారామెడికల్ టెక్నీషియన్లుగా ఈ యూనివర్సిటీ నుంచి డిగ్రీలు తీసుకున్నారు. యూనివర్సిటీ పేరు మారిపోవడంతో వారి పరిస్ధితి ఏమిటి? మాతృసంస్ధతో లింకు తెగిపోయిన ఇలాంటి మెడికల్ అనాథలు బహుశ మరేరాష్ట్రంలో మరే దేశంలో కూడా వుండరుగాక వుండరు. జగన్ లాంటి పాలకుల చేతిలో పడితే 1000 ఏళ్ళుగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విలసిల్లుతూ వుండేదా? తక్షశిల, నలందా విశ్వవిద్యాలయాల పేర్లు మనకు తెలిసేవా? బెనరస్ హిందూ విశ్వవిద్యాలయం, ఆలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ, రవీంద్రుడి విశ్వభారతి యూనివర్సిటీలు ఏమైపోయేవి? ఎవరైనా మంచి పనులు చేస్తే చరిత్రలో మిగిలిపోతారు. చరిత్ర పుస్తకానికి పేరు మార్చేద్దామనుకునే వారు, చిల్లర మనుషులుగా, వివేక వికాసాలు లేని తుంటరులుగా చరిత్రహీనులైపోతారు. ప్రభుత్వ దుందుడుకు, తుంటరి పనులకు ఎవరైనా స్పందించవలసిందే. వైఎల్ పి రియాక్షన్ ఒక సందేశంగా వుంది. ఎన్ టి ఆర్ కుటుంబీకులతో సహా ఆయన అభిమానులు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా రియాక్ట్ కావలసిందే! మరో విషయం కూడా గుర్తుకొస్తున్నది. ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రంలో వున్న బిజెపి ప్రభుత్వం బాహాటంగా ఉల్లంఘిస్తున్న సందర్భంలో కామినేని శ్రీనివాస్, ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇలా రియాక్ట్ అయివుంటే కథ మరోలా వుండేది. ఆ ఇద్దరూ, మరెందరో కూడా సందర్భానికి వచ్చినపుడు ప్రతిస్పందించలేదు. వైఎల్ పి రియాక్ట్ అయ్యారు. అదే ఆయనకు వాళ్ళకు తేడా! ఇంతకీ! డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని జగన్ ప్రభుత్వం వుంచుతుందా? కూల్చేస్తుందా?? #nrjy Posted on 17/08/2022 by Naveen నాకు MC ఒక రోల్ మోడల్ 17-8-2022 నెహ్రూ ఆలోచనా విధానానికి రిఫరెన్స్ బుక్ లాంటి MC – మానికొండ చలపతిరావు గారు నెలకొల్పిన వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ 65 వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నాకు సత్కారం జరిగింది. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో MC గారి ఫొటో సమక్షంలో జర్నలిస్టులు పౌరప్రముఖులు సత్కరించిన సీనియర్ జర్నలిస్టులలో నేను మొదటివాడిని. సన్మానాలు సత్కారాలకు నేను చాలా…అంటే చాలా దూరంగా వుంటాను. 40 ఏళ్ళ జర్నలిస్ట్ కెరీర్ లో నాకు బలవంతంగా / ఆకస్మికంగా చేసిన సన్మానాలు 6 మాత్రమే! మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధే విధానంగా పంచవర్షప్రణాళికలతో దేశాన్ని ప్రగతి పథం వైపు నెహ్రూ మళ్ళించారు. నేహ్రూ మోడల్ డెవలప్ మెంటు గా నెహ్రూ ఆలోచనా విధానంగా అది అది అభివృద్ధి సిద్ధాంతమైంది. అలాంటి వాతావరణంలో జర్నలిస్టుగా ఎదిగిన తరం మొదట్లో MC వున్నారు. చివరిలో నాలాంటి వాళ్ళం వున్నాము. ఆయన తెలుగువారు, అయినా ఇంగ్లీషులో నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ గా నెహ్రూ ఆలోచనా సరళిని దేశవ్యాప్తంగా స్ర్పెడ్ చేయడంలో విశేష ప్రభావం చూపించారు. నెహ్రూ గారి మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధను అర్ధం చేసుకున్న అవగాహనతో “మేము సమాజానికి కాపలాకుక్క” బాధ్యతను చేతనైనంత వరకూ నిర్వహించాము. మా తరానికి నెహ్రూ ఆదర్శవంతమైన సిద్ధాంత కర్త. ఆయన్ని ప్రజలముందుంచిన MC ఒక రోల్ మోడల్ జర్నలిస్ట్. హైదరాబాద్ వెళ్ళి ఆయన్ని కలుద్దాము అనుకున్నాను. కుదరలేదు. 1983 లోనో 84 లోనో ఆయన చనిపోయారు. MC జర్నలిస్టుల సంక్షేమం హక్కుల గురించి ఉద్యమించి వుండకపోతే ఆయన చరిత్ర “ప్రధానికి సన్నిహితంగా మెసిలిన పాత్రికేయుడు” అన్న వాక్యంతో ముగిసిపోయి వుండేది. వ్యక్తిగతంగా MC నాకు రోల్ మోడల్… ఆయన నెహ్రూ విధానాలను బాగా అర్ధం చేసుకుని ప్రజల్లోకి శక్తివంతంగా తీసుకువెళ్ళారు. నేను సరళీకృత ఆర్ధిక విధానాలను బాగా అర్ధం చేసుకుని వాటివల్ల భవిష్యత్తులో రాబోయే మంచి చెడులను 30 ఏళ్ళ క్రితమే రాయగలిగాను. ఈ టాపిక్స్ మీద రామోజీరావు గారు రెండు సార్లు నాతో చాలాసేపు చర్చించారు. జర్నలిస్టు సహచరుడు, సోషలిస్టు కీర్తిశేషులు బిసి నారాయణ గారు నేను లిబరలైజేషన్ పర్యవసానాలపై కథనాలు రాసిన కాలంలో ఒక సారి “ మిక్స్ డ్ ఎకానమీ మీద MC కూడా ఇంతే అధారిటేటివ్ గా రాసేవారు” అని చెప్పారు. ఇవాళ సమావేశం ముగిశాక “యూట్యూబ్ న్యూస్ వ్లోగర్” రామ్ నారాయణ్ “ గురూగారూ మీరు ముప్పైఏళ్ళ క్రితం రాసినవన్నీ ఇపుడు చూస్తున్నాము” అని ప్రస్తావించినపుడు నన్ను నేనే కౌగలించుకున్నట్టు అనిపించింది. ఒక్కసారి కూడని MC తో నేను బాగా కనెక్టయిన విషయం బిసి నారాయణ గారి వల్ల అపుడు తెలిసింది. రామ్ నారాయణ్ వల్ల ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. ఈ కార్యక్రమకర్త యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, సహచర జర్నలిస్టు శ్రీరామమూర్తి సందర్భం చెప్పి మీరు కొందరికి సన్మానంచేయాలి తప్పక రండి అని పొద్దున్న కూడా గుర్తు చేశారు. మెయిన్ స్ట్రీమ్ లో వున్న జర్నలిస్టులకు నా చేతులమీదుగా సన్మానం అనుకుని వెళ్ళాను. శ్రీరామమూర్తి కొంచెం ట్రిక్కిష్ గా పిలిచారు. సహచర జర్నలిస్టులు కృష్ణకుమార్, భూషన్ బాబు, గన్నికృష్ణ , పంతం కొండలరావు, కందుల దుర్గేష్, ఆదిరెడ్డి వాసు గార్లు పత్రికా రంగం పెడధోరణులు, పాత్రికేయుల ఆర్ధిక భారాల గురించి ఆవేదన వెలిబుచ్చారు. మిశ్రమ ఆర్ధిక వ్యవస్థలో జర్నలిస్టుగా పుట్టి, పెరిగిన నేను లిబరలైజేషన్ ని కూడా అర్ధం చేసుకుని నా బ్లాగులో రాయగలుగుతున్నాను. ఫేస్ బుక్ మొదలైన సోషల్ మీడియాలో దాన్ని కొద్దిమందిలో కైనా తీసుకువెళ్ళగలుగుతున్నాను. ఆర్ధిక విధానాల్లో మౌలిక మౌన మార్పువచ్చినా ఆ మూలాలను నేపధ్యంలోకి తీసుకోకుండా పనిచేయడమే జర్నలిస్టులు ప్రజలకు కనెక్ట్ కాలేకపోతున్నారేమో నని, అంటే ఆట స్థలం మారిపోయాక కూడా పాత ప్లేగ్రౌండ్ లోనే మేము ఆడేస్తున్నామేమో నని నా అనుమానం. సన్మాన సమావేశంలో నేను ఇదే చెప్పాను. ⁃ పెద్దాడ నవీన్ Posted on 14/08/2022 14/08/2022 by Naveen వీరవాసరం… వాయిదా! స్వాతంత్ర్య సమరయోధుడు నా తండ్రి కీర్తిశేషులు పెద్దాడ రామచంద్రరావు గారు పుట్టి పెరిగిన వీరవాసరంలో ఆయన ఒకప్పటి ఇల్లు, వీధులు, పొలాలు చూసి రావాలన్న కోరిక చాలా కాలంగా వుంది. వీరవాసరంలో మా ఇలవేలుపు వున్నట్టు ఒక పురోహితుని భాష్యంద్వారా నా భార్య కనిపెట్టింది. ఆమెకు నమస్కారం పెట్టి రావాలన్నది తన కోరిక. ఇందుకు పసుపు కుంకుమ గాజులు చీరె రెడీ చేసింది. వీరవాసరంంలో ఒక మిత్తుడిని ఫోన్ ద్వారా పట్టుకుని మా కార్యక్రమం చెప్పాను. ఆయన తప్ప నాతాతతండ్రుల ఊరిలో నేను తెలిసిన వారు ఎవరూ లేరు సరే రండి. ఆ యోధుడి వారసుడిగా మీకు మా మిత్రబృందం చిరుసత్కారం చేసుకుంటాము అన్నారు. జెండా పండుగ అయ్యాకే వీరవాసరం వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. మాకు సత్కారాలు వొద్దు. కాయలు అమ్ముకోడానికి “ఆ చెట్టు” మా ఇంటికే పరిమితం అనుకోవడం లేదు. నా తండ్రిగారికి ఆయన వ్యక్తిత్వం వల్ల రాజకీయాల్లో సమాజంలో గౌరవ మర్యాదలు వచ్చాయి. ప్రభుత్వ యంత్రాంగం నుంచి కొన్ని సార్లు అవమానాలూ జరిగాయి. మాతండ్రిగారి విషయంలో వారసుసమైన నేను, తమ్ముడు సుధీర్ తృప్తిగా వున్నాము. మమ్మల్ని సత్కరించాలని మిత్రుడు అనుకోవడమే మా నాన్నగారికి మరోసారి సన్మానం జరుగుతున్నట్టు గా భావిస్తున్నాను. వీరవాసరం తరువాత వెళ్తాము #nrjy Posted on 20/07/2019 24/07/2019 by Naveen కూల్చివేత…ప్రాధాన్యతా!ప్రతీకారమా! దృష్టిమళ్ళింపా! టైంపాసా! (శనివారం నవీనమ్) రాష్ట్ర ప్రభుత్వం “ప్రజావేదిక”ను కూల్చివేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వుంటున్న అక్రమ నిర్మాణ నివాసాన్ని కూల్చివేయడాన్ని కూడా తప్పుపట్టవలసిన పని లేదు… అయితే, రాష్ట్రవ్యాప్తంగా కరకట్టలను ఆక్రమించుకుని నివశిస్తున్న లక్షకు పైగా ఇళ్ళ మాటేమిటి? పోనీ విజయవాడలోనే కరకట్ట మీద వుంటున్న పదిహేను వేల నివాసాల మాటేమిటి? వాటిలో నివశిస్తున్న పేద కుటుంబాలకు పునరావాసం ఎలా అన్న ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం లేదు. Read more Posted on 17/07/2019 by Naveen పిల్లలలో అసంబంధాలు / Unattached Life పెద్దాడ నవీన్) 20-7-2018 ఇంటికే పరిమితమైన సామాజిక జీవనం…లివింగ్ రూమ్ కే పరిమితమైన కుటుంబ జీవనం…మమ్మీ, డాడీ – వాళ్ళ తోబుట్టువులను, వారి బాధ్యతలను వొదిలించుకోడానికి చూపించే లౌక్యం, పడే శ్రమ…పైమెట్టు మీద వున్నవారితో పరిచయాలు పెంచుకునే తాపత్రయాలు, సంబంధాలు, స్నేహాలు… వ్యక్తిత్వ వికాసానికి అమ్మ నాన్నల గైడెన్స్ అవసరమైన టీనేజిలో మనోభావాల్ని, సహజస్పందనల్ని చిదిమేసే బ్రాండ్ (నారాయణ చైతన్య)చదువులు…అవసరానికి మించి యిచ్చే పాకెట్ మనీ…ఏమి తాగాలో ఏమి తినాలో ఏమిచెయ్యాలో ఎలా వుండాలో నిర్ణయించే మార్కెట్…వీటి మధ్యే తిరుదుతున్న, పెరుగుతున్న పిల్లలకు ప్రేమంటే???? వీళ్ళకి పరిసరాలను, చుట్టు వున్న సమాజాన్ని, ప్రకృతిని, చుట్టూవున్న మనుషుల్ని, టీచర్లని, తోటి పిల్లల్ని, తాతయ్యల్ని, అమ్మమ్మల్ని, నానమ్మల్ని, చివరికి మమ్మీ, డాడీలని కూడా ప్రేమించడం తెలియదు. వియ్ లవ్ ఆల్ అని పెట్ యానిమల్స్ పేర్లను కలుపుకుని పెద్ద లిస్టే చదువుతారు…అందరినీ ప్రేమిస్తున్నామనే అనుకుంటారు…అసలు వీళ్ళకి ప్రేమంటే తెలియదు… వీళ్ళకి ప్రేమంటే- యవ్వనంలో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణను పరస్పరం వ్యక్తీకరించుకునే మోడ్…ఇష్టపడినది దక్కని స్ధితి ఎదురైతే ఆ షాక్ నుంచి బయటపడటానికి సమాజంలో సమాజంతో వీరికి బలమైన అనుబంధాలు లేవు…దేనికోసమో బతకాలి బతికితీరాలి అనుకోడానికి వీరికి ఏ విధమైన ఆలంబనా లేదు… పరిసరాల్ని ప్రేమించలేనివారు పౌరులు కాలేరు…ప్రతి ఒక్కరిలో స్వాభావికంగా వుండే భావనాత్మక సౌందర్యం ( ఈస్ధటిక్ సెన్స్) భౌతిక ప్రపంచాన్ని మించిన భావనా ప్రపంచాన్ని పిల్లల హృదయంలో, మనసులో, ఆలోచనలలో నిర్మిస్తుంది…అది లౌకికప్రపంచంలో కార్నర్ అయిపోయినప్పుడు మనుషులకు సేఫ్టీ నెట్ అవుతుంది…అది మనుషుల్ని అక్కున చేర్చుకుని కొత్తజీవితానికి, కొత్త అనుబంధాలకు ప్రేరణ ఇస్తుంది…విఫలమైన / భగ్నమైన ప్రేమ కొంత సమయం తీసుకుని తిరిగి హృదయానికి చేరుకుంటుంది… అసలు, సమస్యంతా పిల్లలకు భావనా ప్రపంచం లేకపోవడమే…మమ్మీ, డాడీ, కుటుంబం, నైబర్స్, స్నేహితులు, టీచర్లు, సమాజం, ప్రకృతి….దేనితోనూ అటాచ్ మెంటు లేకుండా పెరిగే పిల్లలకు మానసిక పర్యావరణం / ఎమోషనల్ ఎన్విరాన్ మెంటు ఎక్కడుంటుంది? 17.010653 81.801869 Posted on 29/08/2022 22/09/2022 by Naveen శాస్త్రాలు తెలుగులో రాస్తేనే అది విశ్వభాష అవుతుంది!! 29-8-2021 పండితుల పరిధిలో వున్న తెలుగు సాహిత్య / గ్రాంధికాన్ని పామరులు మాట్లాడుకునే వ్యవహారిక భాషగా సంస్కరించిన ఉద్యమ సారధి కీర్తిశేషులు గిడుగు వెంకట రామమూర్తి గారికి నమస్కరించుకుంటున్నాను. వ్యవహారిక భాష వినియోగం విస్తృతమయ్యేకొద్దీ సామాన్యుల నుంచి రచయితలు, కవులు పెరిగారు. సాహిత్యం మరింతగా జనాలకు చేరువ అయ్యింది. 80 వ దశకం నాటికే 4 లక్షల శీర్షికల ( టైటిల్స్) తెలుగు పుస్తకాల వుండటం భాషాసాహిత్య వికాసానికి ఒక ఆనవాలు అనవచ్చు. తెలుగు రాష్ట్రల్లోనే, తెలుగువారిమధ్యనే వుండిపోయి, కృశించిపోతున్న తెలుగు పరిధి అవధి విస్తరించాలంటే రచన అంశం శాస్త్రీయవిజ్ఞానం, పరిజ్ఞానాల వైపు మళ్ళాలి! తెలుగు భాషను ప్రమాణీకరించుకోవాలి. జర్మన్ పండితులు సంస్కృతాన్ని నేర్చుకున్నట్టు, ఉత్తరాది పండితులు కోనసీమ వచ్చి వేదాన్ని నేర్చుకున్నట్టు , ఏ భాష అయినా శాస్త్రీయ అంశాలను సుబోధకంగా వ్యక్తీకరించ గలిగేలా ఎదగాలి. తెలుగువారు చేస్తున్న మౌలికమైన పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న పురోగతీ తెలుగుభాషలో కూడా చెప్పగలగితే, రాయగలిగితే శాస్త్రీయ విషయాలు చెప్పగల భాషగా తెలుగు పటిష్టమౌతుంది. అంటే కథలు, కవిత్వాలు, వ్యాసాల సాహిత్యం నుంచి మేధస్సు, ఆలోచనల మౌలిక అంశాలు కూడా చెప్పగల స్ధాయికి తెలుగు విస్తరించాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లోని మౌలిక అంశాలపై విద్యార్థులకు పట్టు పెరగాలంటే మాతృభాషా మాధ్యమాలతోనే సాధ్యమని చైనా, జపాన్‌, ఐరోపా దేశాల అనుభవాలు నిరూపిస్తున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు అమ్మభాషల్లో బోధిస్తూ జ్ఞానాధారిత ఆర్థికరంగ వృద్ధితో ఆయా దేశాలు దూసుకుపోతున్నాయి. నవీన పరిశోధనల్లో, అత్యాధునిక ఆవిష్కరణల్లో కొత్త పుంతలు తొక్కుతున్న వాటికి భిన్నంగా ఆంగ్లాన్ని నెత్తికెత్తుకున్న ఇండియాలోని ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో అత్యధిక శాతానికి విషయ పరిజ్ఞానం అరకొరేనని అధ్యయనాలెన్నో నిగ్గుతేల్చాయి. పిల్లలకు చిరపరిచితమైన భాషలను తరగతి గదిలోకి అనుమతించని దురవస్థ తొలగిపోతేనే విద్యార్థిలోకంలో సృజన నైపుణ్యాలు వికసిస్తాయి. స్థానిక భాషల్లో వృత్తివిద్యా పదకోశాల నిర్మాణం, సంప్రదింపు గ్రంథాలతో సహా పాఠ్యపుస్తకాల సరళానువాదం, బోధన సిబ్బందికి తగిన శిక్షణలపై ప్రభుత్వాలు సత్వరం దృష్టి సారించాలి. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక పట్టాలు పొందినవారికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం కల్పించడం మరింత ముఖ్యం. ఆంగ్లం, హిందీలకే పరిమితమైన జాతీయ స్థాయి పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తేనే భిన్నత్వంలో ఏకత్వ భావన బలపడుతుంది. ‘విద్యావ్యాప్తి విస్తృతం కావాలంటే స్థానిక భాషల్లో బోధించాల్సిందే’నన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ మేలిమి సూచనకు ప్రభుత్వాలు గొడుగుపట్టాలి! యూనీకోడ్ ఫాంట్లు కంప్యూటర్ లో ప్రవేశించడం వల్లే ఇక్కడ ఇది నేను రాయగలిగాను. మీరు చదవగలుగుతున్నారు. తెలుగు స్పెల్,గ్రామర్ చెకర్ లు రూపొందించడానికి కేంద్రీయ విశ్వ విద్యాలయం గతంలో మొదలు పెట్టిన ప్రయత్నాలను పున:ప్రారంభించాలి. డిగ్రీదాకా తెలుగును నిర్బంధం చెయ్యాలి. భాషావికాసం, ఔన్నత్యాలకు తెలుగురాష్ట్రాల్లో కనుచూపుదూరంలో అవకాశమే లేదు. ముస్లిం పాలకుల ప్రభావం వల్ల తెలంగాణాలో ఉర్దూ, హిందీ యాసలు కలసిన తెలుగు, ఆంగ్లేయుల ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీషు పదాలు కలసిన తెలుగు వర్ధిల్లుతున్నాయి. తెలంగాణా నుడికారాన్ని కెసిఆర్ గారు అందిపుచ్చుకున్నారు. ఇతరులకంటే కాస్త లోతుగా జన హృదయాలలో చొరబడిపోడానికి అది వారికి దోహదమైంది. అయితే అది తెలంగాణా ప్రభుత్వ భాషా విధానంకాదు. ఉన్నత రాజకీయాధికారంలో వున్నవారిలోఎవరికీ తెలుగు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు లేవు…ఇందువల్ల తెలుగుని ఉద్ధరించేస్తామనే నాయకుల మాటలు మనకి వినబడవు…ఒక వేళ ఎవరైనా అలా చెబితే అవి దొంగమాటలే అని మరో ఆలోచనలేకుండా అనేసుకోవచ్చు * ప్రపంచంలో ఏమతమైనా తనను తాను ప్రచారం చేసుకోడానికి ప్రజల భాషను ఆశ్రయించింది. మన వైదీకం జనం భాషకు దూరమై రహస్యంగా వుండిపోయింది * సంస్కృతాన్ని పక్కన పెట్టి గౌతమబుద్ధుడు, మహావీరుడు ప్రజలభాష “పాళీ”లో చేసిన బోధనలు శరవేగంతో దేశాన్ని చుట్టుముట్టాయి * పండితుల సంస్కృత భారతాన్ని వందల ఏళ్ళతరువాతే నన్నయ తెలుగునేల మీదకు తీసుకురాగలిగారు * తెలుగుదేశాన్ని ఎవరుపాలించినా సంస్కృతమో, పారశీకమో, ఊర్దోనో, ఇంగ్లీషో పాలకుల భాషగావుండిపోయాయి * ఉద్యోగాలకోసం నైజాములో ఉర్దూ, ఆంధ్రాలో ఇంగ్లీషూ తెలుగుని టెలుగూ గా మార్చేశాయి * తెలుగుకోసం ఉద్యమాలు చేసి రాష్ట్రాలు సాధించిన తెలుగువాడు కూర్చున్న కొమ్మను తానే నరికేసుకుంటున్నాడు * ఇంగ్లీషువాళ్ళు , నిజాం స్కూళ్ళవరకూ తెలుగుని అనుమతించారు తెలుగువాడు తల్లఒడిలోనే మాతృభాషను తన్నేస్తున్నాడు * మెకాలే ఊహలోనే లేని ఉగ్గుపాల నుంచే ఎబిసిడిలను అడుగులు పడనపుడే ఐఐటి కోచింగ్ లను తెలుగువాడు మోహిస్తున్నాడు * ఉద్యోగాలు ఇస్తున్నపుడు, తల్లిదండ్రులే చదివించుకుంటున్నపుకు ఇంగ్లీషంటే నొప్పి ఎందుకని సుప్రీం కోర్టే ప్రశ్నిస్తోంది * భాషఅంటే అది మాట్లాడే ప్రజలూ, చరిత్రా, సంక్కృతీ – ఇవన్నీ ధ్వంసమయ్యాక భాష ఒక్కటే బతికి వుండటం సాధ్యం కాదు. * పక్కదారులనుంచి దేశంలో దూరిన బ్రిటీష్ వాడిని తరిమేసిన ఉద్యమ విలువలు అమెరికావాడికి ఎస్ బాస్ అనేలా తిరగబడ్డాక మాతృభాషకు చోటెక్కడ? * ఆత్మనే అమ్మకుకున్నాక అమ్మ భాష మీద మమకారముంటుందా? * మాతృభూమిని ప్రేమించకుండా మాతృభాషను కాపాడుకోవడం కుదురుతుందా? • కవిత్వానికీ, కాల్పనిక సాహిత్యానికీ పనికొచ్చే తెలుగు భాషను శాస్త్రవిజ్ఞానాలను వివరించే భాషగా వికసింపజేసే ప్రయత్నాలు జరగనంతవరకూ తెలుగుభాషా ఉత్సవాలంటే ఖాళీ వేళల్లో సాంస్కృతిక ఉద్వేగంతో ఊగిపోవడమే! గిడుగు జయంతినాడు భాషావేత్తలను సత్కరించి చేతులు దులిపేసుకోవడమే!! • తెలుగు మాయమైపోతూండటం విచారకరమే అయినా ఇదొక పరిణామక్రమంగా స్వీకరిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారికైతే తెలుగు భాషమీద ఎలాంటి ప్రేమా ఆసక్తీ లేవు! పైగా బతుకుదారి చూపించగలదన్న నమ్మకంతో ఇంగ్లీషును చిన్న బడి నుంచే నిర్భందం చేశారు. #nrjy #GodavariPost Posted on 15/08/2022 22/09/2022 by Naveen ఇవి అమృత ఘడియలు… డబ్బు ఇబ్బందులు వుంటాయి. ఆశలు సంతోషాలు వుంటాయి. కష్టాలు కన్నీళ్లు వుంటాయి. నిరాశలు నిస్పృహలు వుంటాయి. మనిషికైనా ఇంటికైనా వీధికైనా రాష్ట్రానికైనా దేశానికైనా ఇదే జీవితం..ఇందులో పండగలు ఒక హుషారు ఊపు తెస్తాయి. ఇంటికైతే జెండా కట్టుకోలేదు కాని నేను 75 ఏళ్ళ జెండా పండగలో వున్నాను. అంటే సంఘంలో ధోరణుల గురించి విలువల గురించి ధర్మాల గురించి ఆలోచనల్లో వున్నాను. ఆశనిరాశలు మధ్య ఊగుతున్నాను. అయినా నాకు ఆశ వైపే మొగ్గు వుందని నమ్ముతున్నాను. పాలకులు (కాంగ్రెస్ / బిజెపి / తెలుగుదేశం / వైఎస్ఆర్ కాంగ్రెస్ – ఎవరైనా సరే) నిజాన్ని పూర్తిగా చూడనివ్వరు కళ్ళకు గంతలు కట్టేస్తారు. తమకు నచ్చినదానినే బూతద్దాలతో చూపిస్తారు. ఇందులో మోదీ / జగన్ తక్కువా కాదు. ఎక్కువా కాదు. కొందరి ఓట్లకోసం అందరి డబ్బనీ పప్పూబెల్లాల్లా జగన్ పంచేస్తూండటం నచ్చడం లేదు. – ఇది అధర్మం నచ్చకపోతే పాకిస్థాన్ పో అనే దుర్మార్గుల్ని మోదీ ఖండించకపోవడం అసలే నచ్చడం లేదు – ఇది అమానుషం, అనాగరీకం మిగిలిందంతా ఒకే మీకు స్వతంత్ర భారత అమృతోత్సవ శుభాకాంక్షలు! —— ఎర్రకోటనుంచి ప్రధాని ప్రసంగాన్ని టివిలు వచ్చాక నేను ఎప్పుడూ మిస్ అవలేదు. రాత్రి హైఓల్టేజి వల్ల అడాప్టర్లు కాలిపోయాయి. రెండు టీవీలూ పనిచేయడంలేదు. (వేరేవాళ్ళ అడాప్టర్ తో చూస్తే రెండు టివీలూ పనిచేస్తున్నాయి) క్వాలిటీ కరెంటును సాధించుకోలేకపోయాము. ఇందువల్ల ప్రధాని ఎర్రకోట అమృతోత్సవ ఉపన్యాసాన్ని మిస్ అయిపోయాను – తరువాత చూడవచ్చు ఏదైనా రియల్ టైమ్ లో చూసిన హుషారే వేరు. Posted on 27/07/2019 22/09/2022 by Naveen రాంగ్ బటన్లు నొక్కుతున్న జగన్! (పెద్దాడ నవీన్ 27-7-2019) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత ఆర్ధిక వాతావరణంపై అంతర్జాతీయ ద్రవ్యసంస్ధలకు కేంద్రప్రభుత్వం వివరణ ఇచ్చుకోవలసిన పరిస్ధితిని ముందుకి నెడుతున్నారు. తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించాక కూడా చంద్రబాబు మీద పగా ద్వేషాలతో రగిలిపోతున్నట్టున్న జగన్ మాటలు – చేతలు పాత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడటానికి మాత్రమే పరిమితం కాలేదు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ మెట్రోరైలు నిర్మాణాలకు అప్పు ఇవ్వడానికి ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు రుణం ఇవ్వలేమని చెప్పేశాయి. ఆర్ధిక సంస్కరణలు, ఉదార విధానాలు భారత్ లో 29 ఏళ్ళక్రితం మొదలయ్యాయి. పెట్టుబడులను ప్రోత్సహించే ఈ పద్ధతిలో ప్రయివేటు రంగానికి అనేక రాయితీలు ఇవ్వవలసి వుంటుంది…ఇంకా చెప్పాలంటే గొంతెమ్మ కోర్కెలు అనిపించే ప్రయివేటు షరతులను ప్రభుత్వాలు ఆమోదించక తప్పదు. ఈ విధంగా విస్తరించే పరిశ్రమలు సర్వీసురంగం ప్రయోజనాలను రెండోదశలో వినియోగదారులకు అందేలా చూడవలసి వుంటుంది. భిన్న సంస్కృతులు, ఆర్ధిక స్ధితిగతులు, రాజకీయ వాతావరణాలు వున్న భారత దేశంలో సంస్కరణలు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే తీరుగా, ఒకే వేగంతో అమలు కావడం లేదు. అయితే సంస్కరణల తత్వాన్ని ముందుగా గ్రహించి వేగంగా అమలు పరచిన ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లోనే ఆర్ధిక, వాణిజ్య రంగాలలో అంతర్జాతీయ, జాతీయ వేదికల మీద (అవిభక్త) ఆంధ్రప్రదేశ్ ను ప్రముఖంగా నిలబెట్టారు. ఆ తొలిదశల్లో ఆయన సంక్షేమాన్ని పక్కన పెట్టి సంస్కరణల కు పెద్దపీటవేసి పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారని పేరుపడ్డారు. ఆతరువాత వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంస్కరణలకు సంక్షేమానికి మధ్య సమతూకం తెచ్చారు. “ఆరోగ్యశ్రీ” పధకం ఆయనకునప్రజానాయకుడిగా దేశంలోనే ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది. రెడ్ టేపిజాన్ని, పర్మిట్ల రాజ్యాన్ని తొలగించే సంస్కరణలతో పాటు లంచగొండితనం, బ్రోకర్ల సేవలు, “మీకు అది నాకు ఇది”, అనే ఒప్పందాలు, అవినీతి పెరిగిపోతాయి. ప్రపంచమంతటా ఇదే ధోరణి వుంది… ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు నాయుడు, ఓడరేవులు, సెజ్ ల నోటిఫికేషన్ల వంటి భూముల కేటాయింపులపై వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. అక్రమ ఆదాయాల కేసుల్లో అప్పటి ముఖ్యమంత్రి కొడుకుగా జగన్, అప్పటి మంత్రి, కొందరు అధికారులు జైలుకి వెళ్ళడం సంస్కరణల్లో అవినీతి పార్శ్వానికి పరాకాష్ట. జగన్ మీద కేసుల విచారణ సాగుతూనే వుంది. ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ విభజన, 13 జిల్లాల రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం, రాజధాని, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం వంటి నిర్మాణ, పునర్మిర్మాణ బాధ్యతల అమలు మొదలయ్యింది. ఈ దశలో జరిగిన ఎన్నకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా జగన్ తన ఎజెండాను అమలు చేయడం కంటే చంద్రబాబు మీద పెంచుకున్న ద్వేషాన్ని ప్రతీకారంగా మార్చుకోడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు అర్ధమౌతోంది. రాజరికంలో తప్ప ప్రజాస్వామ్యంలో ఇది నడవదు. విద్యుత్తు ఒప్పందాలను తిరగదోడటం , రివర్స్ టెండరింగ్ మొదలైన నిర్ణయాలు ప్రత్యక్షంగా రాష్ట్రాభివృద్ధిని కుంటుపరచేవిగా పరోక్షంగా జగన్ కాళ్ళ కిందికి నీళ్ళు తెచ్చేవిగా వున్నాయి. రాష్ట్రాల ప్రతిపాదనలు, కేంద్ర సంస్ధల, శాఖల ఆమోదాల తరువాతే ఆంతర్జాతీయ, జాతీయ ద్రవ్య సంస్ధల ఒప్పందాలు జరుగుతాయి… ప్రతీదశలోనూ పైనుంచి కిందికి ప్రశ్నలు అడగటం, కింద నుంచి వివరణలు ఇవ్వడం జరుగతుంది. ఒకసారి ఆమోదం కుదిరాక దానిని తిరగదోడటం అంటే ప్రాజెక్టు రద్దైపోవడమే! ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది ఇదే! ముందు చూపూ, పర్యావసానాలపై అంచనాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ఒక ముఖ్యమంత్రి చేయకూడని పని. ఆయనకు తెలియదు సరే ఆజేయ్ కల్లాం వంటి అనుభవజ్ఞులైన సలహాదారులు , ప్రభుత్వ యంత్రాంగం సలహా ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం… సలహా ఇచ్చినా జగన్ పట్టించుకోలేదంటే ఈ రాష్ట్రం దౌర్భాగ్యం! ఈ పరిస్ధితిని రాజకీయకోణం నుంచి చూసినా జగన్ కే నష్టం. మోదీ ప్రభుత్వం తాను నిర్దేశించుకున్న ఆర్ధిక విధానాలతోనే పాలన సాగిస్తుంది… అమిత్ షా సారధ్యంలోని బిజెపి తాను నిర్దేశించుకున్న మార్గంలోనే ప్రత్యర్ధులను తొక్తేస్తూ పార్టీని విస్తరించుకుంటూ పోతుంది…ఇందులో వ్యక్తిగత ప్రాబల్యాలకూ, ఎమోషన్లకూ, ఇగోలకూ చోటు వుండదు. నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ వంటి సామాజిక న్యాయం విధానాలపట్ల ద్రవ్య సంస్ధలకు అభ్యంతరం వుండదు. పరిశ్రమల్లో 75 శాతం స్ధానికులకు రిజర్వేషన్ విధానాలను ద్రవ్యసంస్ధలు అనుమతించవు. కాదూ కూడదని చట్టం చేస్తే రాష్ట్రంలో పరిశ్రమలకు అప్పు దొరకదు. సంస్కరణలకు వ్యతిరేక దశలో వున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఖరి అంతర్జాతీయ ద్రవ్యసంస్ధలకూ, కేంద్ర ప్రభుత్వానికీ నచ్చదు.. ‬ సంస్కరణలకు అనుకూలంగా చట్టాలను మార్చుకుంటూ వస్తున్న మోదీ ప్రభుత్వం జగన్ దుందుడుకు తనానికి గట్టిగానే చెవిమెలిపెట్టే వాతావరణం కనబడుతోంది. సామాజిక న్యాయం, సంకషేమాలతోపాటు సంస్కరణలను కూడా జగన్ భుజాన మోయకపోతే మోదీ ప్రభుత్వానికి ఎపి ప్రభుత్వానికి మధ్య ఆర్ధిక సూత్రబద్ధమైన వైరుధ్యంవారిని ప్రత్యర్ధులగా మార్చే అవకాశం వుంది. Posted on 23/07/2019 29/08/2022 by Naveen నిజమైన పుణ్యక్షేత్రం!! రాజహంసలు, గూడబాతులు, మంచు కొంగలు…పేరు ఏదైనా కాని సైబీరియా నుంచి వచ్చే పక్షులకు పుట్టింటి వారి వలె పురుడుపోసి తల్లీబడ్డల్ని అల్లుడినీ భద్రంగా సాగనంపే “పుణ్యక్షేత్రం” 5-8-2018 ఆదివారం నాడు మరోసారి దర్శనమైంది. ఆహారమైన క్రిమి కీటకాలవేటలో రాత్రంతా షికార్లు చేసి పగటిపూట తల్లకిందులుగా వేలాడుతూ నిద్రపోయే గబ్బిలాలకు గూడై నిల్చిన “రాధేయపాలెం” చెట్టుని ఆవెంటనే దర్శించుకున్నాము.  ఇదంతా రాజమండ్రికి 20 కిలోమీటర్లలోపు దూరంలోనే! గ్రేకలర్ ముక్కు, మచ్చలు వున్న తెల్లకొంగలు జంటలు జంటలుగా జూన్ జులై ఆగస్టునెలల్లో సైబీరియా నుంచివస్తాయి. పుల్లా, పుడకా ముక్కున కరచి, పదిలపరచుకుని, సురక్షితమైన స్ధావరాల్లో గూడుకట్టుకుంటాయి. గుడ్డుపెట్టిన కొంగ దాన్ని పొదిగి పిల్లను చేసే వరకూ మగకొంగ మేతను ఏరుకు వస్తుంది. పిల్లకు రెక్కలు బలపడి ఎగరడం నేర్చుకునే వరకూ తండ్రి కొంగ గూడులోనే వుండి పిల్లను కాపాడుకుంటుంది. తల్లికొంగ మేతను ఏరుకొచ్చి తండ్రీబిడ్డల కడుపునింపుతుంది. రెక్కలొచ్చిన బిడ్డలు, తల్లిదండ్రులూ డిసెంబర్ జనవరి నెలలలో వెళ్ళిపోతాయి. కుటుంబ బాధ్యతల్లో పనివిభజనకు ఇంతకంటే మరొక రోల్ మోడల్ వుండదు. చిన్నపాటి అలికిడికే బెదరిపోయే మూగజీవులు పుణ్యక్షేత్రం గ్రామం చెరువు చుట్టూ గట్టంతావున్న చెట్లనిండా సైబీరియానుంచి వచ్చే పక్షుల గూళ్ళు కట్టుకుంటున్నాయంటే ఈ ఊరి జనం మీద ఆ పక్షుల నమ్మకానికి భరోసాకి ఆశ్చర్యమనిపిస్తుంది. పక్షులను వేటాడే వారిని ఊరినుంచి పంపివేయడం పుణ్యక్షేత్రంలో తరతరాల సాంప్రదాయం. గుడ్లు పొదగడానికి సరైన శీతోష్ణాలు, పౌష్టికాహారాలు లభించడంతో పాటు వాటిని కాపాడుకునే ఊరి కట్టుబాటూ, పుణ్యక్షేత్రాన్ని సైబీరియా కొంగలకు పుట్టిల్లుగా మార్చేసింది. ఇదంతా పత్రికలలో, టివిలలో చాలాసార్లు వచ్చింది. నేనుకూడా స్యూస్ ఫీచర్ గా ఈనాడులో, ఈటివిలో, జెమినిటివిలో ప్రెజెంట్ చేశాను. మోతుబరి బొప్పన బ్రహ్మాజీరావుగారు, డాక్టర్ గన్నిభాస్కరరావుగారితో కలిసి లోకసంచారం చేస్తున్నపుడు, ఆ గ్రామంలో డాక్టర్ గారికి ఇదంతా వివరించాను. ఆయన స్వయంగా ఫొటోలు తీశారు. బ్రహ్మాజీ గారు గబ్బిలాల చెట్టుగురించి గురించి చెప్పగా చక్రద్వారబంధం రోడ్డులో వున్న రాధేయపాలెం దారిపట్టాము. ఊరికి ముందుగానే వున్న చెట్టుకి నల్లతోరణాలు వెలాడుతున్నట్టు నిద్రపోతున్న గబ్బిలాలు కనిపించాయి. ఈ రెండు సన్నివేశాలలో పుణ్యక్షేత్రం, రాధేయపాలెం గ్రామాల వారి భూతదయ, జీవకారుణ్యం కనిపిస్తున్నాయి. ఈ సంచారంలో – లోకమే శబ్ధసంగీతాల మయం అని నాకు అర్ధమైంది. దోమలు, తేనెటీగలు, వడ్రంగిపిట్టలు, చిలుకలు, పావురాలు, కాకులు, పక్షులు…నడిచే – పాకే – ఎగిరే క్రిమికీటకాలు, జీవుల పాటల్ని వినగలిగితే మన చెవులు, శరీరం, మనసూ ఆలకించగలదని అనుభవమైనట్టు కొన్ని క్షణాలు అనిపించింది. కీటకాల, పక్షుల, పిట్టల ప్రతీ కదలిక, ఆట, వేట, ఒరిపిడి, రోదన, సంతోషం, ఆనందాల్లో ఒక లయవుంటుందని, ఆ లయ నుంచే సంగీతం పుట్టుకొచ్చిందని అర్ధమైంది. జనంరొదలేని ప్రశాంతతలోనే లయ వినపడుతుంది. అది అబలలైన మూగజీవాలక ఆ లయే భరోసా ఇస్తుంది. ప్రకృతి తన సృష్టి ని తాను కాపాడుకోవడం ఇదే! రాధేయపాలెం, పుణ్యక్షేత్రాల మహిమ ఇదే!! – పెద్దాడ నవీన్ Posted on 23/07/2019 24/07/2019 by Naveen కేన్సర్ : ఏమిటి ఎందుకు ఎలా కేన్సర్ అంటే ఏంటి? అపారమూ, అసంఖ్యాకమైన కణాల సముదాయమే మానవ దేహం. శరీరం లోపలి భాగాల పెరుగుదల, వాటి పని సామర్ధ్యం కణాల చైతన్యం మీదే ఆధారపడి వుంటుంది. నిరంతర చైతన్య ప్రక్రియలో వున్న కణాలు నశిస్తాయి. కొత్త కణాలు పుడుతూ వుంటాయి కొన్ని ప్రత్యేక పరిస్ధితుల వల్ల, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల, అవసరానికి మించిన కణాలు పుట్టవచ్చు. అవి పూర్తిగా ఎదగకుండా మిగిలిపోయినపుడు “కంతి” గా స్థిరపడతాయి. వీటిని ట్యూమర్లు అంటాము. స్వభావాన్ని బట్టి వీటిని బినైన్ ట్యూమర్ అనీ, మెలిగ్నంట్ ట్యూమర్ అనీ పిలుస్తారు. మెలిగ్నంట్ ట్యూమరే కేన్సర్! ఈ కేన్సర్ కణం ఏ శరీరభాగం నుంచైనా, ఏ కణం నుంచైనా మొదలవ్వవచ్చు! ఇది రక్తనాళాల ద్వారా ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. చుట్టుపక్కల వున్న ఇతర కణాలను నాశనం చేస్తుంది. సాధారణ జీవకణాలు కేన్సర్ కణాలుగా ఎందుకు మారిపోతాయో ఖచ్చితంగా తెలియదు. జీన్స్ లో జరిగే కొన్ని మార్పులు ఇందుకు మూలం కావచ్చు. రోజురోజుకీ మారుతున్న లైఫ్ స్టయిల్, ఆహారపు అలవాట్లు, ఇతర అలవాట్లు ఇందుకు కారణం కావచ్చు! వయసు పెరిగే కొద్దీ కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువౌతున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కేన్సర్ కారకమైన “ కార్సినో జీన్స్ “ నుంచి రక్షణ పొందవచ్చు. కేన్సర్ అంటే… అంటు వ్యాధికాదు ఏ విధంగానైనా కూడా ఒకరి నుంచి మరొకరికి వచ్చేది కాదు. మొదటి దశల్లోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు పొగ తాగవద్దు ఊపిరి తిత్తుల కేన్సర్ వచ్చిన వారిలో 90 శాతం మందికి, ఇతర కేన్సర్లు వచ్చిన వారిలో 30 శాతం మందికి పొగతాగడమే కేన్సర్ కారణమని, అధ్యయనాలు చెబుతున్నాయి. కేన్సర్ వచ్చిన వారిలో 3 శాతం మందికి ఆల్కహాల్ అందుకు కారణం. ఇందువల్ల చుట్ట బీడి సిగరెట్, లిక్కర్, సారా, స్పిరిట్ తాగడం ఆపెయ్యాలి. పొగతాగే వారి పక్కన వుండే వారికి కూడా హాని జరుగుతుందని మరచిపోకూడదు. పండ్లు కూరల నుంచి రక్షణ కేబేజి, కాలిఫ్లవర్ లాంటి కూరగాయల్లో కేన్సర్ నుంచి రక్షించే గుణాలు వున్నాయి. పీచు పదార్థాలు ఎక్కువగా వున్న ఆహారం పెద్దపేగుల్లో కేన్సర్ ను కొంతవరకూ నివారిస్తుంది. “ఎ”, “సి” విటమిన్లు అధికంగా వున్న ఆహారపదార్ధాలు కేన్సర్ ను నివారించడానికి ఉపయోగపడతాయి. తాజాపళ్ళు, తాజా కూరగాయలు ఉన్న ఆహారం అన్ని విధాలా మంచిది. బరువు తగ్గాలి శరీర అవసరానికి మించిన బరువు కొన్ని రకాల కేన్సర్ కి దారితీస్తుంది. మితిమీరి తినడం మానుకోవాలి. వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు బరువుని తగ్గిస్తాయి. డాక్టర్ సలహాతో వీటిని అమలు చేయడం మంచిది. కొవ్వు, మసాలాలు వద్దు! వేపుళ్ళు, కారం, మసాలాలు ఎక్కువగావున్న ఆహారం వల్ల జీర్ణాశయం, ఆహారనాళాలకు కేన్సర్ సోకే అవకాశం వుంది. చేప, చర్మం తీసిన చికెన్, మీగడలేని పాలు తీసుకోవడం మంచిది. కొవ్వుపదార్థాలు తక్కువగావుండే ఆహారం మంచిది. వెస్ట్రన్ దేశాల్లో పెద్దపేగుల కేన్సర్ ఎక్కువ. వారు ప్రొటీన్లు ఎక్కువ, ఫైబర్లు తక్కువ వున్న ఆహారం తినడమే అందుకు కారణం. మహిళలు – కేన్సర్ మనదేశంలో మహిళల కేన్సర్ అంటే అది గర్భాశయ కేన్సర్ లేదా రొమ్ము కేన్సర్ అయివుంటుంది. లక్షణాలు తెల్లబట్ట కావడం దీన్నే వైట్ డిశ్చార్జ్ అంటున్నాము. బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం బహిష్టు కాని సమయంలో రక్తస్రావం లైంగికచర్య తరువాత రక్త స్రావం ఎలాంటి స్త్రీలలో గర్భాశయ కేన్సర్ లేదా సెర్వికల్ కేన్సర్ కు అవకాశాలు ఎక్కువ? చిన్నవయసులో పెళ్ళిజరిగినవారికి, చిన్నవయసులో పిల్లలుపుట్టినవారికి, హెచ్చుమంది పిల్లల్ని కన్నవారికి, అల్పాదాయ వర్గాలవారికి, గర్భాశయ కేన్సర్ లేదా సెర్వికల్ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ కేన్సర్ ను ప్రారంభదశకుముందు లేదా తొలిదశలో నిర్ధారించే అవకాశాలు వున్నాయి. గర్భాశయం లోపలిగోడలను సూక్ష్మంగా పరిశీలించే సెర్వికల్ పాప్స్మియర్ టెస్టు ద్వారా కేన్సర్ రాగల అవకాశాలను కొన్నేళ్ళు ముందుగానే గుర్తించవచ్చు. అసాధారణమైన కణాలు ఈ పరీక్షలో కనబడినట్టయితే భవిష్యత్తులో కేన్సర్ రాగల అవకాశం తెలుస్తుంది. నివారణచర్యల ద్వారా వ్యాధిని నిరోధించవచ్చు. రొమ్ముకేన్సర్ 50 ఏళ్ళుపైబడిన స్త్రీలలో, పిల్లలు పుట్టనిస్త్రీలలో, 12 ఏళ్ళ వయసుకిముందే మెనుస్ట్రేషన్ ప్రారంభమైనవారిలో, 35ఏళ్ళ వయసుదాటాక మొదటిబిడ్డ పుట్టిన స్త్రీలలో, అధికబరువు వున్నస్త్రీలలో, రక్తసంబంధీకులలో ఎవరికైనా రొమ్ముకేన్సర్ వున్న స్త్రీలలో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశంవుంది. తొలిదశలోనే నిర్ధారించే పద్ధతులు తమనుతామే పరిశీలించుకోవడం, డాక్టర్ వద్దకువెళ్ళి పరీక్ష చేయించకోవడం, మమ్మోగ్రఫీ ద్వారా పరీక్ష చేయించుకోవడం ద్వారా రొమ్ము కేన్సర్ ను మొదటిదశలోనే గుర్తించవచ్చు. రొమ్ముకేన్సర్ ను మొదటేలోనే గుర్తిస్తే పూర్తిగా నయంచేసుకునే అవకాశం వుంది. రొమ్మును తొలగించే అవసరంరాదు. స్వియ పరీక్ష స్నానంచేసేటప్పుడు, శరీరం తడిగావున్మప్పుడు కుడి రొమ్మును ఎడమచేత్తో, ఎడమరొమ్మును కుడిచేత్తో క్రమపద్ధతిలో తడిమిచూసుకోవాలి. మెన్సెస్ అయిన తరువాత వారంలోపులో ఈపరిశీలన చేసుకోవాలి. మెనుస్ట్రేషన్ ఆగిపోయినవారు నెలలో ఏదో ఒకతేదీ నిర్ణయించుకుని క్రమంతప్పకుండా ఇలా పరీక్షించుకోవాలి. వక్షంలో కంతులు, వుండలు చేతికితగులుతాయి. ఇవన్నీ కేన్సర్ కారకాలు కావు. అయితే, క్రమంతప్పని పరిశీలనల్లో కంతులు వుండల లో పెద్దపెద్ద మార్పులు గమనిస్తే అపుడు డాక్టర్ వద్దకు వెళ్ళాలి అద్దంముందు నిలబడికూడా పరిశీలించుకోవచ్చు! అద్దంఎదురుగా నిటారుగా, రిలాక్స్ డ్ గా నిలబడి భుజాలు దించి, చేతులు పైకెత్తివుంచి వక్షోజాల అరారంలో సైజులో మార్పులు వున్నాయో లేదో గమనించాలి. రొమ్ముల మీద ముడుతలు, సొట్టలవంటి మార్పులు వచ్చాయేమో చూసుకోవాలి. వేళ్ళతో పరీక్ష బొటనవేలు, చూపుడువేళ్ళతో చనుమొనలను నొక్కి ఏదైనాద్రవం వస్తూందా అని గమనించాలి! బిడ్డకు పాలు ఇస్తున్న తల్లికి ఈలక్షణం వుంటే ఫరవాలేదు. చనుపాలు ఇవ్వని స్త్రీలలో ఈలక్షణం వుంటే డాక్టర్ ను సంప్రదించాలి. జీర్ణాశయ కేన్సర్ కారకాలు పొగతాగే అలవాటు, వేపుడుఆహారం, ఊరగాయపచ్చళ్ళు, కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు జీర్ణాశయ కేన్సర్ లక్షణాలు ఆకలితగ్గడం, బరువుతగ్గడం, పొట్టలోనొప్పి, పొట్టనిండినట్టు, పొట్టబరువుగావున్నట్టు అనిపించడం, తేనుపులు, అజీర్ణం, వాంతులు…ఇవన్నీ జీర్ణాశయ కేన్సర్ లక్షణాలు. పరీక్షా పద్ధతులు ఎండోస్కోపీ ద్వారా జీర్ణాశయంలో కంతులు, పుండ్లను గుర్తించవచ్చు. బయాప్సీ అంటే చిన్నభాగాన్ని కోతపెట్టి పరీక్షకు పంపి నిర్ధారణ చేసుకోవచ్చు. రేడియేషన్ ద్వారా, మందులద్వారా, సర్జరీద్వారా జీర్ణాశయ కేన్సర్ ని నయంచేయవచ్చు. నోరు మరియు గొంతు కేన్సర్ పొగాకు వాడకం, సిగరెట్, చుట్ట, బీడి, గుట్కా, ఖైని, పాన్, ముక్కపొడుం, లిక్కర్, ఆల్కహాల్, చుట్టను కాలుతున్న వైపు నోట్లో పెట్టికుని పొగపీల్టే అడ్డచుట్ట మొదలైనవాటివల్ల నోటికేన్సర్, గొంతుకేన్సర్ రావచ్చు. లక్షణాలు నోట్లో తగ్గనివాపు మాననిపుండు కంతి, ఎర్రని లేదా తెల్లనిమచ్చలు, మెడవద్ద బిళ్లలు, కంతులు, తగ్గనిగొంతుమంట, నోటిదుర్వాసన, గొంతుబొంగురుపోవడం, తరచుముక్కుదిబ్బడ, ముక్కునుంచి రక్తంకారడం, తినేటప్పుడు గొంతునొప్పి మొదలైన లక్షణాలు వుంటే అది గొంతుకేన్సర్ లేదా నోటికేన్సర్ అని అనుమానించవచ్చు. (సంకలనం : పెద్దాడ నవీన్) 17.067715 81.883618 Posted on 22/07/2019 23/07/2019 by Naveen జాతరలు…ఒక మతాతీత విశ్వాసం (పెద్దాడ నవీన్) జంగారెడ్డిగూడెం గంగానమ్మ జాతర, తాడువాయి వీరభద్రుడి తిరనాళ్ళ, నిడదవోలులో కొటసత్తెమ్మ మొక్కు, గోదావరి కుడి గట్టున గుబ్బలమంగమ్మ గుడి, రాజమండ్రిలో సోమాలమ్మ కాపలా, లోవలో తలుపులమ్మ తల్లిదయ…మతంతో నిమిత్తంలేని ఇన్ని జాతర్లు, మరెన్ని సంబరాలు నమ్మకానికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే / మొక్కుతీర్చుకునే మనిషి నిబద్ధతకీ ఆనవాళ్ళు…అన్నిమతాలవారూ తీర్చుకునే మొక్కబళ్ళు… ఇవాళ 14-2-2016 సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళినీ, మొన్న హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లినీ చూశాము. జీవితాన్ని కలుషితం చేసుకున్న మనం…నైతికతను కోల్పోయిన మనుషులం…అసంతృప్తులను చల్లబరచుకోడానికో శూన్యాల్ని పూడ్చుకోడానికో మతాన్ని కౌగలించుకున్నాం…మనిషి ఉనికిని ఆధ్యాత్మికత ద్వారా సిద్ధాంతీకరించే ప్రయత్నం చేసే మతం మీద నాకు తృణీకారమైతే లేదుగాని, మతం మీదకంటే గ్రామ దేవతలంటేనే ప్రేమ గౌరవాలు వున్నాయి. పెద్దపెద్ద కళ్ళతో పసుపు పచ్చ శోభతో మూడడుగులు కూడా ఎత్తులేని మహంకాళి తల్లి (చాలా మంది గ్రామదేవతలు రెండు, మూడు అడుగులకి ఎత్తుకి మించి వుండరు) ప్రజల నమ్మకాల్లో ఎవరెస్టుకి మించిన ఎత్తులో వున్నారు. జీవనవిధానంలో ఒకవిధమైన ప్రాకృతిక ధర్మాన్ని, నిరాడంబరతనీ, సొంత నైతికతనీ పాటించే మనిషి సాంఘిక స్వయంభువత్వమే మతాతీత విశ్వాసం. అక్కడ అన్నంలో బిరుసైన మొరటుతనం వున్నా, బలి ఇచ్చే కోడీ మేకా దున్నల చావు వాసన ఆవరించివున్నా ఏదో పవిత్రత అనుభూతిలోకి వస్తూనే వుంటుంది. జంగారెడ్డిగూడెం గంగానమ్మ జాతర, తాడువాయి వీరభద్రుడి తిరనాళ్ళ, నిడదవోలులో కొటసత్తెమ్మ మొక్కు, గోదావరి కుడి గట్టున గుబ్బలమంగమ్మ గుడి, రాజమండ్రిలో సోమాలమ్మ కాపలా, లోవలో తలుపులమ్మ తల్లిదయ…కోరుకొండ, వాడపల్లి…ఇలా ఎన్నెన్నో తీర్థాలు, తిరణాళ్ళు…సంబరాలు…ఇవన్నీ మతంతో నిమిత్తంలేనివి… ఇవన్నీ నమ్మకానికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే / మొక్కుతీర్చుకునే మనిషి నిబద్ధతకీ ఆనవాళ్ళు…అన్నిమతాలవారూ తీర్చుకునే మొక్కబళ్ళు రాజమండి ఇస్కాన్ టెంపుల్ లో పరిమళాలు బాగుంటాయి. పాతసోమాలమ్మ గుడిలో కూర్చుంటే ఇది నాది అనిపిస్తుంది. కంచిమఠం లో గంభీర ప్రశాంతత కంటే అర్ధంకాని మంత్రాలు అతి తక్కువగా వుండే హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో, సికిందరాబాద్ మహంకాళి గుడిలో…అసలు ఏగ్రామదేవతల గుడిలో అయినా మనుషుల అలికిడి అలజళ్ళే నచ్చుతాయి. మామూలు మనిషిని కాస్తదూరంగా వుంచే మతంకంటే, కష్టమొచ్చినపుడు చేయి పట్టుకున్నట్టు భరోసా ఇచ్చే మతాతీతమైన విశ్వాసమే నాకు ఇష్టంగా వుంటుంది. మొక్కుకోవడానికి ఒకసారి, మొక్కు చెల్లించుకోడానికి మరోసారి జనులు తరలి వచ్చే యాత్రలో ఖర్చయ్యే ప్రతి రూపాయీ మన చుట్టూ వున్న ఎకనామిక్స్ ఎలా, ఎంతగా స్టిమ్యులేట్ చేస్తూందో గుడి చుట్టూ వున్న దుకాణాల్ని కాసేపు గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. Posted on 20/07/2019 24/07/2019 by Naveen నోస్టాల్జియా ఒక తియ్యని గాయం! (గోదావరి జనం యాస, జీవితం ఆత్రేయపురం పరిసరాల లొకేషన్లు ఇందులో హైలైట్ మిగిలిందంతా హ్యూమన్ ఎమోషన్లే!) దట్టించి, కిక్కిరిసి జీవితాన్ని కమ్ముకున్న కాలం తిరుగుతున్నట్టు కాక కాలిపోతున్నట్టు వుంది. తాతలు తండ్రులు పిల్లలకు బతుకు ఇచ్చిన ఊరిలాగ, ఊరి చెరువులాగ, పంటచేను లాగ, ఎడ్లబండిలాగ, మనుషుల మూలాలు, జీవితాల వేర్లు దగ్ధమైపోతున్నట్టు వుంది. నేలమీద కాలిజాడలనే పడనివ్వని పరుగులో ఎన్ని సహజమైన ఆందాలను, అయినవారి మధ్య బంధాలను కోల్పోతున్నామో అనుకున్నపుడు నిట్టూర్పే మిగులుతుంది. ఏది పోయిందో ఏది పోబోతోందో తెలియనివ్వని ఆధునిక మాయలో కొట్టుకుపోతున్న తరాలను చూస్తూ మనిషిలో గూడుకట్టుకున్న బెంగ కూడా ఒక తియ్యని గాయమే అవుతుందని ”శతమానం భవతి” చూశాక అనుభవమౌతుంది. గతించిన కాలం మిగిల్చిన దుఖం కూడా ఒక ఉద్వేగభరితమైన ఆనందాన్ని ఇస్తుందని ”శతమానం భవతి” చూశాక అనుభవంలోకి వస్తుంది. కుదిరితే మీరు కూడా #ZEEసినిమాలు లో వస్తున్న ఈ సినిమా చూడండి! బాగుంటుంది. Post navigation Older posts 1 of 29 Create a free website or blog at WordPress.com. Full Story కథనం Create a free website or blog at WordPress.com. Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
అవకాశాలు రావడం లేదు అన్నది కరెక్ట్‌ కాదు… కానీ అసలు కారణం మాత్రం వేరు.. – TV9 Telugu | Anu Emmanuel Interesting Comments About Her Movies And Urvashivo Rakshasivo Au24 అనూ ఇమ్మాన్యుయేల్‌ తాజాగా నటించిన సినిమా ఊర్వశివో.. రాక్షసివో ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్‌ అను ఇమ్మాన్యూయేల్‌ మీడియా సమావేశంలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్‌ బిగినింగ్‌లోనే నేను పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌, నాగచైతన్య వంటి స్టార్‌ల సరసన యాక్ట్‌ చేశా. నాకు అవకాశాలు రావడం లేదు అన్నది కరెక్ట్‌ కాదు. కాకపోతే వరుసగా సినిమాలు చేయడం లేదు. నేను చేసిన సినిమాలు ఆడలేదేమో కానీ నటిగా నేను ఫెయిల్‌ అనే మాట ఎక్కడా వినిపించలేదు. అనూ కళ్లతో అభినయించగలదు అనే మార్క్‌ సంపాదించుకున్నా.
హిందూమతం, జైనమతం మరియు బౌద్ధమతంలో రావి చెట్టు (‘బోధి చెట్టు’ అని ప్రసిద్ది చెందింది) పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భారతదేశంలోని ఈ స్థానిక ఆకురాల్చే చెట్టు క్రింద గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు. ఈ చెట్టు విశ్వం యొక్క అంతులేని విస్తీర్ణానికి చిహ్నం – నిజానికి, ఇది భారత ఉపఖండం అంతటా, ముఖ్యంగా హిందువులు, జైనులు మరియు బౌద్ధులలో జీవన వృక్షంగా గౌరవించబడుతుంది. శాస్త్రీయ కోణంలో కూడా రావి నిజమైన ‘ట్రీ ఆఫ్ లైఫ్’. ఇతర చెట్లలా కాకుండా, … Read more ఈ ఆకు రహస్యం తెలిస్తే అబ్బాయిలు అసలు వదలరు Categories ఆరోగ్యం Tags bodhi tree, Peepal Leaves Medicinal Values, raavi aaku Leave a comment రావి చెట్టులో రహాస్యం…… తెలిస్తే ఆశ్చర్యపోతారు. October 23, 2020 October 23, 2020 by BestHealthInfo హిందూ సంప్రదాయం లో రావి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బుద్ధుడికి ఈ చెట్టు కింద జ్ఞానోదయమైనందువల్ల బౌద్ధ మతస్తులు కూడా రావి చెట్టును పవిత్రంగా చూస్తారు. బోధి వృక్షం కేవలం దైవ స్వరూపంగానే కాదు అద్భుతమైన ఔషధ గుణాలు కూడా కలిగి ఉంది. అవి ఆరోగ్య సమస్యలను ఆమడ దూరం తరిమేస్తాయి. ఇంతకు రావి చెట్టులో ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటో చూద్దామా?? ఆకలి పెరగడానికి విత్తనంబు మర్రి వృక్షంబు అని చిన్ననాడు పద్యాలు చెప్పుకున్నాం. … Read more రావి చెట్టులో రహాస్యం…… తెలిస్తే ఆశ్చర్యపోతారు. Categories ఆరోగ్యం Tags banyan tree, bodhi tree, peepal tree, బోధి వృక్షం, రావి చెట్టు Leave a comment
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 స్పోర్ట్స్‌ డ్రామా... సినిమాకు ఇదో ముడి సరుకు. హీరోయిజం, దేశభక్తి, వాణిజ్య అంశాలు, భావోద్వేగాలూ... ఇందులో లేనిదంటూ ఏదీ లేదు. అన్నీ కలిపిన కంప్లీట్‌ ప్యాకేజీ. అందుకే స్పోర్ట్స్‌ డ్రామాలు వెల్లివిరుస్తున్నాయి. వాటిలో విజయాల శాతం కూడా ఎక్కువగానే ఉండడంతో.. వెండి తెరపై ఆటలు సాగాయి. ఇప్పటికీ ఏదో ఓ చిత్రసీమలో స్పోర్ట్స్‌ డ్రామా తయారవుతూనే ఉంది. అయితే గత కొంతకాలంగా గమనిస్తే... ఈ జోనర్‌లో విజయాల శాతం తగ్గుతూ వస్తోంది. బడా స్టార్లు చేసిన క్రీడా నేపథ్య చిత్రాలు బాక్సాఫీసు దగ్గర ఘోరంగా బోల్తా కొడుతున్నాయి. అంటే.. స్పోర్ట్స్‌ డ్రామాలపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గుతున్నట్టా..? లేదంటే మనవాళ్లకే ఈ జోనర్‌ తీయడం రావడం లేదా..? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. హీరో ఓ అనామకుడు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఓ ఆటపై దృష్టి పెడతాడు. ప్రావీణ్యం సంపాదిస్తాడు. తనకు ఓ మంచి కోచ్‌ దొరుకుతాడు. ఆ కోచ్‌.. హీరోలోని ప్రతిభని సానబెడతాడు. ఆ తరవాత... ఆ హీరో ఒకొక్క దశను దాటి.. ఇంటర్నేషనల్‌ స్టార్‌ అయిపోతాడు. అంతే కథ. ఏ స్పోర్ట్స్‌ డ్రామా తీసుకొన్నా అచ్చం ఇలానో, దీనికి కాస్త అటూ ఇటుగానో ఉంటుంది. ఆటలు మారినా ఎమోషన్‌ మాత్రం ఇదే. ఈమధ్య వచ్చిన ‘లైగర్‌’లోనూ ఇదే స్టోరీ. ఒకప్పుడు ఇవే కథలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇప్పుడు తీస్తే జనాలు తిరస్కరిస్తున్నారు. చూసిన కథ చూడ్డానికి ఎవ్వరూ ఒప్పుకోరు. వాళ్లకేదో కొత్త తరహా ఎమోషన్‌ కావాలి. అది పట్టుకొంటే తప్ప సక్సెస్‌ కొట్టలేం. షారుఖ్‌ఖాన్‌ ‘చెక్‌ దే ఇండియా’లో కొత్తరకమైన ఎమోషన్‌ పట్టాడు దర్శకుడు. అందులో హీరో కోచ్‌. అమ్మాయిలతో హాకీ ఆడిస్తాడు. అండర్‌ డాగ్‌ లాంటి టీమ్‌ని... ప్రపంచ కప్‌ విజేతగా మారుస్తాడు. ఈ కథలో కావల్సినంత హీరోయిజం ఉంది. ఎమోషన్‌ ఉంది. షారుఖ్‌ని కొత్తగా చూసే అవకాశం దక్కింది. అన్నింటికంటే ముఖ్యంగా హాకీ టీమ్‌లో ప్రతీ అమ్మాయికీ ఈకథలో ప్రాధాన్యం ఉంది. అందుకే ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. ‘దంగల్‌’ సక్సెస్‌ సీక్రెట్‌ కూడా అదే. అందులో అమీర్‌ ఖాన్‌ ఓ సాధారమైన తండ్రిగా కనిపిస్తాడు. కుమార్తెలను విజేతలుగా చూడ్డానికి ఓ తండ్రి పడే కష్టం తెరపై కనిపిస్తుంది. అందుకే మనకేమాత్రం టచ్‌లో లేని కుస్తీ ఆటతో సినిమా తీసి, ఇండియా మొత్తం గర్వంచే ఓ సూపర్‌ హిట్‌ కొట్టాడు అమీర్‌ఖాన్‌. ఈ దేశంలో క్రికెట్‌ అంటే ఇష్టపడనివాళ్లు ఎవరుంటారు? క్రికెట్‌ నేపథ్యంలో కథ అల్లుకొంటే హిట్టే అని నమ్మేవారంతా. కానీ ‘83’ ఏమైంది..? భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టాన్ని ‘83’ పేరుతో సినిమాగా తీస్తే.. డిజాస్టర్‌గా మారిపోయింది. అందులో స్టార్లు లేరా అంటే.. బోలెడంతమంది ఉన్నారు. భారీగా ఖర్చు పెట్టారు. కనీ వినీ ఎరుగని ప్రమోషన్‌ చేశారు. కానీ ఏం లాభం..? ఎమోషన్లని సరిగా పట్టుకోకపోవడంతో.. సినిమా బోల్తా కొట్టింది. ‘శభాష్‌ మిథాలీ’, ‘కౌశల్య కృష్ణమూర్తి’ సినిమా విషయాల్లోనూ ఇదే జరిగింది. ఆ తరవాత అందరి దృష్టీ బాక్సింగ్‌పై సాగింది. బాక్సింగ్‌ నేపథ్యంలో వచ్చినన్ని కథలు మరో ఆటలో రాలేదేమో..? అందులోనూ విజయాల శాతం చాలా తక్కువ. ఒకట్రెండు హిట్లు తప్ప.. బాక్సింగ్‌ రింగ్‌లో మనం సాధించిందేం లేదు. తెలుగులో వచ్చిన ‘గని’, ‘లైగర్‌’ కూడా బాక్సింగ్‌ కథలే. అవి పేలవమైన స్ర్కిప్టులుగా మిగిలిపోయాయి. ఓరకంగా ‘తమ్ముడు’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ కూడా ఈ తరహా కథలే. అయితే వాటిలో ఆటనీ, ఎమోషన్‌నీ సరిగ్గా మిక్స్‌ చేశారు. ‘తమ్ముడు’ సినిమా చూడండి. ఆట కేవలం ఎప్పుడు అవసరమైతే అప్పుడే వచ్చింది. మిగిలిన సినిమా అంతా.. పవన్‌ శైలిలోనే సరదాగా సాగిపోతుంది. ‘అమ్మా..నాన్న..’ కూడా అంతే. అందులో తల్లీ కొడుకుల ఎమోషన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. హీరో గెలవాలి అనుకొన్నప్పుడే.. బాక్సింగ్‌ రింగ్‌లోకి దింపారు. అందుకే ఈ రెండు సినిమాలూ హిట్లు కొట్టాయి.‘ఒక్కడు’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘జెర్సీ’ ఇవన్నీ ఆటనీ, ఎమోషన్‌నీ పర్‌ఫెక్ట్‌గా మిక్స్‌ చేసిన సినిమాలే. అప్పుడెప్పుడో వచ్చిన ‘విజేత’ కూడా స్పోర్ట్స్‌ డ్రామాగానే చెప్పుకోవాలేమో..? హీరో (చిరంజీవి)కి ఫుట్‌ బాల్‌ అంటే ఇష్టం. ఆ ఆటలో ఛాంపియన్‌ కావాలనుకుంటాడు. కానీ... కుటుంబం కోసం తన ఆటని త్యాగం చేస్తాడు. కాకపోతే.. సెంటిమెంట్‌ డోసు ఎక్కువ అవ్వడంతో.. ఆట పక్కకు వెళ్లిపోయింది. స్పోర్ట్స్‌ డ్రామాలంటే హీరోలంతా ఆసక్తి చూపించడానికి ఓ బలమైన కారణం ఉంది. అది.. మేకొవర్‌. ఆ పాత్రకు తగ్గట్టుగా బాడీని మార్చుకొంటారు. సిక్స్‌ ప్యాకో, ఎయిట్‌ ప్యాకో చూపిస్తారు. తెరమీద తమ కండల్ని చూపించడానికి ఓ ఛాన్స్‌ దొరుకుతుంది. కొత్త తరహా స్టైలింగ్‌ కి ఆస్కారం కుదురుతుంది. ‘లక్ష్య’లో నాగశౌర్య మేకొవర్‌ అదిరిపోతుంది. తన బాడీ చూసి అంతా షాక్‌ తిన్నారు. కానీ ఏం లాభం..? ఆ సినిమా సరిగా ఆడలేదు. ఈ తరహా కథలకు మరో ప్రధానమైన అడ్డంకి.. బడ్జెట్‌. టెక్నికల్‌గా బాగా ఖర్చు పెట్టొచ్చు అనుకున్నప్పుడే క్రీడా నేపథ్యాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే... లైటింగ్‌, కెమెరా వర్క్‌ విషయాల్లో కచ్చితంగా క్వాలిటీ చూపించాలి. లేదంటే ఆ సన్నివేశాలు తేలిపోతాయి. కంటెంట్‌ బాగున్నా, సరైన క్వాలిటీ లేకపోవడంతో దెబ్బకొట్టిన సినిమాలున్నాయి. పైగా ఓటీటీలు అందుబాటులో రావడంతో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్‌ డ్రామా సినిమాల్ని చూసేశారు జనాలు. మన కథలు, మన సాంకేతికత వాళ్ల కళ్లకు ఆనడం లేదు. ప్రేక్షకులకు పరిచయం లేని ఆటల్ని ఎంచుకొని.. కథలుగా మలచడం కూడా రిస్కే. జనబాహుళ్యంలో ఉన్న ఆటలకు ఉన్న క్రేజ్‌.. మిగిలినవాటికి ఉండదన్న విషయం రూపకర్తలు గుర్తుంచుకోవాలి. కథలో వైవిధ్యం, బలమైన ఎమోషన్‌ లేకపోతే.. ఎంత పెద్ద స్పోర్ట్స్‌డ్రామా సినిమా అయినా ప్రేక్షకులు తిరస్కరిస్తారు. అందుకు ‘లైగర్‌’ ఓ తాజా ఉదాహరణ.
తిరుపతి, 2010 జూన్‌ 22: తిరుమల తిరుపతి దేవస్థానముల ముద్రణాలయ నూతన భవన ప్రారంభోత్సవము ఈనెల 24వ తేది ఉదయం 7-52 గంటలకు ఘనంగా జరుగుతుంది. తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ డి.కె. ఆదికేశవులు ఈ నూతన ముద్రణాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. దేవస్థానం మహంతుల పరిపాలన నుంచి ధర్మకర్తల మండలి ఆధీనానికి వచ్చిన తరువాత శ్రీవేంకటేశ్వరా ఓరియంటర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నెలకొల్పబడింది. ఇందులో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి, మానవల్లి రామకృష్ణ శాస్త్రి, కొరాడ రామకృష్ణయ్య, పంగనామాల బాలకృష్ణమూర్తి, కోళియాలం మొదలైన పండితులు తితిదే ప్రచురణలకు నాంది పలికారు. తితిదే ముద్రణాలయం రామాయణ, మహాభారతం, భాగవతం, భగవద్గీత వంటి ఇతిహాసాలతో పాటు వేలకొలది గ్రంధాలను ప్రచురించినది. వాటిలో సాహిత్య విలువలు కలిగిన గ్రంధాలు చాలావున్నాయి. 1949వ సంవత్సరంలో దేవస్థానం బులిటన్‌ ప్రారంభించినది. తిరుమల శ్రీనివాసుని దర్శించు కొనేందుకు వచ్చే వేలాది యాత్రికులకు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న సౌకర్యాల వివరాలను భక్తులకు తెలియజేసే ఒక ప్రాచార సాధనంగా బులిటెన్‌ ఉపయోగపడింది. అప్పటి నుండి నిర్విరామంగా వెలువడుతున్న బులిటెన్‌కు ‘సప్తగిరి’ అని నామకరణం చేసారు. ప్రస్తుతం తితిదే ప్రచురిస్తున్న పంచాంగాలు, డైరీలు,క్యాలండర్లు మంచి ప్రజాదరణ పొందాయి. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది. « జూలై 17న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అణివార ఆస్థానం » జూలై 13న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం
తిరుపతి, జూన్‌-28, 2008: తిరుమల తిరుపతి దేవస్థానముల అమృతోత్సవాల కార్యక్రమంలో భాగంగా జూన్‌ 30వ తేదిన సోమవారం ఉదయం 6-30గంటలకు మెట్లోత్సవం నిర్వహిస్తారు. అలిపిరి వద్దగల పాదాల మండపం నుండి ఉదయం 6-30 గంటలకు ప్రారంభమయ్యేఈ మెట్లోత్సవం 11 గంటలకు తిరుమల చేరుకుంటుంది. పిదప తిరుమల ఆస్థానమండపమునందు భక్తులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం నడచి వెళ్ళిన భక్తులందరిని ఉచితంగా స్వామివారి దర్శనానికి అనుమతించి ప్రసాదాలు ఇస్తారు. ఈ మెట్లోత్సవంలో తితిదే పాలక మండలి చైర్మన్‌, సభ్యులు, కార్యనిర్వహణాధికారి, ఇతర అధికారులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చే భజన సంఘాలు, దాససాహిత్య, అన్నమాచార్య శరణాగతి మండలులు పాల్గొంటారు. కనుక తితిదే ఉద్యోగులు, పురప్రజలు, కళాకారులు, స్వచ్చంద సేవా సంస్థలు, ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థులు, భక్తులు యావన్మంది పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరడమైనది. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది. « DONATION_ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.20 ల‌క్ష‌లు విరాళం » VARUNA JAPAM ON JULY 4_ జూలై 4వ తేది నుండి 9వ తేది వరకు తిరుమలలో వరుణ జపము
Build up reserves of Calcium and strengthen your bones, particularly before you are 35 years old. Rich sources of Calcium include milk and milk products like cheese, paneer, dahi, lassi (buttermilk), raita, kheer and kulfi. Build up reserves of Calcium and strengthen your bones, particularly before you are 35 years old. Rich sources of Calcium include milk and milk products like cheese, paneer, dahi, lassi (buttermilk), raita, kheer and kulfi. Build up reserves of Calcium and strengthen your bones, particularly before you are 35 years old. Rich sources of Calcium include milk and milk products like cheese, paneer, dahi, lassi (buttermilk), raita, kheer and kulfi. Build up reserves of Calcium and strengthen your bones, particularly before you are 35 years old. Rich sources of Calcium include milk and milk products like cheese, paneer, dahi, lassi (buttermilk), raita, kheer and kulfi. Search for: Recent Posts Discussion దీర్ఘజీవనానికి అధ్యాత్మ నీతి సమస్త జీవరాశుల్లో పశుపక్ష్యాదులు శ్రేష్ఠమైనవి. వాటి లో బుద్ధిజీవులు గొప్పవి. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠమైనవారు అని శాస్త్రం చెబుతున్నది. అందుకనే ‘వాగ్భటం’లో ఉత్కృష్టః చతురశీతి లక్ష యోనిషు మానుషః దేహః సర్వార్థకృత్‌ తస్మాత్‌ రక్షణీయో విచక్షణైః అని చెప్పారు. అంటే ‘‘84లక్షల జీవరాశుల్లో మానవుడు చాలా గొప్పవాడు. ఈ మానవ దేహం అన్ని విధాలైన ప్రయోజనాలనూ సాధించగలిగినది. ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి’’ అని అర్థం. ఇలా ఆరోగ్యవంతంగా ఉండటానికి మితాహారం, తగినంత నిద్ర, ఇంద్రియ నిగ్రహం అవసరం అని వాగ్భటంలోనే చెప్పారు. వాటితోపాటు కొన్ని గుణాలు అలవడకుండా చూసుకోవాలి అని కూడా ధర్మశాస్త్రం, ఆయుర్వేదం చెబుతున్నాయి. అవేంటంటే.. క్రోధం, రోషం, ఇతరుల వస్తువుల కోసం ఆశపడటం, మోహాన్ని పెంచుకోవడం, అతిశయోక్తులు చెప్పుకోవడం, ఇతరులకు ద్రోహం చెయ్యడం, ఉపయోగం లేని పనులు చెయ్యడం, అత్యాశ, ఇతరుల గురించి అపవాదులు పలకడం, ఇతరులపట్ల అసూయ, కామదృష్టి, అకారణ కోపం. ఇవన్నీ ఆయుర్దాయాన్ని తగ్గించే గుణాలని, వీటిని విడిచిపెట్టాలని పెద్దలు చెప్పారు. అందుకే.. వైద్యులు శరీరానికి చికిత్స చేయటానికి ముందు రోగికి పై గుణాలేవైనా ఉంటే వాటిని నివారించే ఉపాయాలు చూడాలట. తేషాం యోగమూలో నిర్ఘాతః ..అని శాస్త్రం చెబుతోంది. అంటే యోగాభ్యాసం ద్వారా ఈ అవలక్షణాలను తగ్గించవచ్చునట. ప్రతివైద్యుడూ పరిశీలించాల్సిన విషయాలివి అని ఆపస్తంబ ధర్మశాస్త్ర వచనం. వీటితోపాటు త్యాగబుద్ధి, ఋజుమార్గంలో నడవటం, మృదుస్వభావం కలిగి ఉండటం, మనో నిగ్రహం, సమస్త జీవుల పట్ల ప్రేమ, యోగజీవనం, ఉన్నదానితో సంతృప్తి చెందటం అనే గుణాలు అవసరమట. అలాగే మరి ఎనిమిది ప్రధాన గుణాలు కూడా కావాలి. అన్ని జీవులపట్లా దయ కలిగి ఉండటం, ఎవరు ఎంత బాధించినా, హింసించినా బాధను వ్యక్తంచేయకుండా ఓర్చుకోవడం, పక్కవారి ధార్మిక బుద్ధిని, అర్థవృద్ధిని చూసి అసూయ చెందక పోవడం, అక్రమంగా సంపాదించక పోవడం, మనస్సులో కల్మషం లేకుండా ఉండటం, వాక్కులో మంచి, భౌతికంగా శరీరంతో ఏ తప్పూ జరగకుండా చూడటం, తన శరీరానికి బాధను కలిగించే ధర్మాన్ని ఆచరించకపోవడం, అందరికీ హితవు కలిగే పనులు చేయడం, బాధించే పనులు చేయకుండటం. ఇవన్నీ మనిషిగా బతకటానికి అవసరమైనవే. ఈ గుణాలకు అధ్యాత్మనీతి అని పేరు. వీటిని కలిగి ఉండి అహంకారం, లోలత్వం, దర్పం లేకుండా, ఇతరుల మెప్పును ఆశించకుండా ఎవరు జీవిస్తారో వారు శిష్టులని బోధాయన ధర్మశాస్త్రం బోధిస్తోంది. ఇదీ మనిషిగా జీవించటం అంటే. ఇవీ మానవుల గుణాలు. ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే….. వాస్తు శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వారు సూత్రాలను అవలంబిస్తారు. వారు పాటించని వారి కంటే ముందంజలో ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆందోళనలు కలుగుతాయి. కొందరి జాతకంలో ఎలాంటి లోపాలు లేకున్నా ఇంటి వాస్తు బాగా లేనందున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక రుగ్మత, ఒత్తిడి, కుటుంబంలో కలహాలు వంటివి ఇంటికి వాస్తులేదని సూచిస్తాయి. వాస్తు దోషం కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భూమి కొనుగోలు చేసే ముందు అన్నీ చూయించుకోవాలి. నేల అడుగున గుళ్లు. శ్మశానాలు ఉండే ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకోవడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారాన్ని యజమాని పేరును, ఆయన నక్షత్రాన్ని బట్టీ, ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అయితే ఒక్కోసారి ఇళ్లంతా వాస్తు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది. అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు. మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు వస్తే కూడా దోషం ఉన్నట్లే లెక్క. ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు… శ్లోకం అర్థమేంటి? ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః మనమందరం కూడా నిత్యమూ ఏదో ఒక సందర్బంలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తుంటాము. కానీ దాని అర్థం మనం తెలుసుకోకుండానే వల్లిస్తుంటాము. మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారంగా భావించాలి. అందుకే ఈ మంత్రాన్ని ఎన్నో సంస్థలు ప్రత్యేకించి విధి నిర్వహణలో పఠించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ శాంతి మంత్రాన్ని అంతటా అమలుపరచినట్లయితే సర్వత్రా శాంతిసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పై శ్లోకం తెలియచేస్తుంది. ఈ శ్లోకం అర్థమేమనగా.. సహనావవతు…. మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం. పరస్పరం కలసిమెలసి రక్షించుకుందాం. మన రాష్ట్రాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకుందాం. ముఖ్యంగా ఇది ఐక్యతా సూత్రం వంటిది. సహనౌభువన్తు…. ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరం కలసి అనుభవిద్దాం. అలాంటి ధన సంపాదనకుగాను దోహదం చేసే శక్తి గల విద్యనే మనం సంపాదించుకుందాం. విలువలు లేని విద్యలు మనకొద్దు. అలాంటి వాటిని తక్షణమే వదిలేద్దాం. సహవీర్యం కరవావహై… మనం కలసిమెలసి పరాక్రమిద్దాం. మానసిక వికాసాన్ని కలిగించే సాహస కార్యాలను చేయగలిగే చైతన్యాన్ని కలిగించే ప్రభోదించే విద్యను మనం సాదిద్దాం. తేజస్వినావధీతమస్తు… మనల్ని తేజోవంతులుగా, వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని, విద్యను పొందుదాం. మనలో ఆత్మాభిమానం, స్వజాతి అభిమానం కల్గి ఉండేలా నడుచుకుందాం. అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా కార్య తేజస్సుతో కొత్తకొత్త పరిశోధనలు గావిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం. మావిద్విషావహై….. మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం. అహింసా పరమోధర్మః అనే సూక్తిని పాటిద్దాం. ఇదే విశ్వశాంతికి దోహదకారి కాబట్టి ప్రగతిపధం వైపు పయనిస్తూ పురోభివృద్దిని సాధిద్దాం. కాబట్టి పైన తెల్పిన విధంగా నమమందరం కూడా శాంతిమమంత్రాన్నని తప్పక పఠిస్తూ ఆచరణలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ఉండేందుకు ప్రయత్నిద్దాం. ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుందాం.