text
stringlengths
428
70.7k
నాకు ఐదేళ్ల వయస్సులో మా ఉలవపాళ్ళలో, మామిడేళ్ల కిష్ట, అక్కిశెట్టి శేషగిరి మరియు మా వూరి పూజారి కొడుకైన స్వామి అనే ముగ్గురు స్నేహితులు వుండేవాళ్ళు. మా ఆటలు, పాటలు మరియు తిరుగుళ్ళు అన్నీ కలిసే ఉండేవి. వీటిల్తో పాటు మాకు ఇంకో ముఖ్యమైన రోజువారీ, లేక రోజుకు పలుమార్లు వుండే కార్యక్రమం ఉండేది. అదేమిటంటే తిన్నది అరిగాక, వూరికి వెనకాల వుండే చెరువు దగ్గరకో, లేక వూరికి ముందు వుండే వాగు దగ్గరకో వెళ్లి అరగక మిగిలినదాన్ని దించుకొని రావటం. మా నలుగురి మధ్య వుండే ఒప్పందమేమిటంటే, మాలో ఎవరికీ ఆ అవసరముంటే, మిగతా ముగ్గురుకి అవసరమున్న లేకున్నా చచ్చినట్టు తోడు రావాల్సిందే. అలా అవసరం లేకుండా తోడుగా వచ్చినప్పుడు, ఆ కూర్చొనుండే వాడిని, అయ్యిందా లేదా, లేక ఇంకా ఎంత సేపురా అంటూ విసిగిస్తూ, మధ్య మధ్యలో, మా వూరి రాజకీయాల గురుంచో లేక మా వూరి సమస్యలకి పరిషారాలేమున్నాయబ్బా అనే చర్చలతో కాలక్షేపం చేసే వాళ్ళము. నాకైతే ఎక్కువగా మా వాగువైపుకి వెళ్ళటమే ఇష్టం ఈ కార్యక్రమానికి, ఎందుకంటే అక్కడ ఎక్కువగా పిచ్చి తులసి మొక్కలు పెరిగేవి, వాటి వాసనల మధ్య మా సువాసనలు మర్చిపోవొచ్చు, ఎంతైనా మనం నీటు గాళ్ళమే మొదటనుండి. అబ్బా! స్నేహితుల మధ్య ఎన్నో మంచి జ్ఞాపకాలుంటే, ఈ హర్షా గాడేందిరా నాయనా, ఎంత సేపు ఇలాటి విషయాలే రాస్తాడు అని తిట్టుకుంటున్నారా, మంచి వాటికందరూ వస్తారు, ఇటువంటి వాటికి తోడు వచ్చేవారే అసలు స్నేహితులు అని చెప్పటం నా ఉద్దేశ్యం. మా యీ ఒప్పందం చాలా సౌలభ్యం గా ఉండేది మా ముగ్గురుకీ, ఒక్క స్వామి గాడితో తప్ప. ఎందుకంటే వాళ్ళ నాన్న గారు, మా వూరి మూడు గుళ్ళల్లో ఒక్కటైన మాలక్ష్మమ్మ గుడిని, ఆ వయస్సులోనే వాడికి రాసిచ్చేశారు, మిగతా రెండు గుళ్ళని, ఒకటి ఆయనకోసం మరియు ఇంకొకటి ఇంకా చేతికి అందిరాని స్వామీ గాడి తమ్ముడికోసం అట్టిపెట్టుకొని. ఈ మూడు గుళ్ళకి పూజ, పునస్కారాలు చూసుకుంటూనే ఆయన మా వూరికి దగ్గరలోని, చెక్ పోస్ట్ లో కూడా పని చేసేవారు. మా స్వామి సాయంత్రాలపూట మాలక్ష్మమ్మ గుడి తెరిచి, వాడి నోటికి తిరిగిన మంత్రాలు చదువుతూ దీపారాధన చేసి, వచ్చినోళ్లకు పెట్టీ పెట్టనట్టుగా కాస్త చక్కెర వాళ్ళ చేతులకు రాసి, కొంత సేపయ్యాక గుడి మూసి వచ్చేవాడు. ఇవే కాక మళ్ళీ మిగతా గుడులలో వాళ్ళ నాన్న దగ్గర అప్పుడప్పుడూ అప్రెంటిస్ గా కూడా పనిచేసేవాడు. ఈ కార్యక్రమాలతో తీరిక లేకా మాకు చాలా సార్లు అందుబాటులో ఉండేవాడు కాదు వాడు. మాకు వాడి మీద ఈ విషయం లోనే ఫిర్యాదు. మా పల్లెల్లో రెండు మూడు కుటుంబాలకు కలిపి ఉమ్మడి బావులుండేవి. ఈ కుటుంబాల చావిడీలు మధ్య వుండే గోడలు, ఈ బావుల దగ్గర మాత్రమే ఓపెన్ గా ఉండేవి. అటుపక్కనుండి ఆవల కుటుంబాలు, ఇటుపక్కనుండి ఈవల కుటుంబాలు, కావలసిన నీళ్లను తోడుకొనే వారు. ఒక్కోసారి ఆవల కుటుంబాలకి సన్నిహితమైన మరికొన్ని కుటుంబాలు, ఈవల కుటుంబాలకి సన్నిహితమైన కొని కుటుంబాలు కలిపి ఇటువంటి బావులని వాడుకొనే వారు. అలాగే ఒక వీధిలోంచి ఇంకో వీధిలోకి, వెళ్ళటం ప్రమాదకరమైనా, దగ్గరి దారి అవటం తో ఈ బావులని దాటి వెళ్లే వారు కొందరు. అలా మా స్వామీ గాడికి, వాళ్ళ చావిడీలో వుండే బావిని దాటి వెళ్ళటం, మాలక్ష్మమ్మ గుడికి చాలా దగ్గర దారి అవటం తో వాడు వాళ్ళ అమ్మగారు గమనించనప్పుడల్లా, బావిని దాటి వెళ్ళేవాడు. ఒకరోజు సాయంత్రం అలా వాడు దీపం పెట్టాలని, బావి దాటుతూ, కాలు జారి ఆ బావిలో పడిపోయాడు. బావి కూడా సగం నీళ్లతో అయినా లోతుగానే వుంది. పడ్డవాడు సాయం కోసం అరుస్తూనే వున్నాడు. చాలా సేపటికి వాడి అరుపులు విని అక్కడ జనం పోగయ్యారు. వెంటనే ఈత వచ్చిన వాళ్ళు బావిలో దిగి వాడికి తాడు కట్టి బయటకి లాగారు. బయటకొచ్చిన వాళ్ళు ఆశ్చర్యంగా అడిగారు వాడిని, అలా ఎలా ఒక ఈత వచ్చిన వాడిలా, బావి మధ్యలో చేతులాడిస్తూ తేలి వున్నావురా నువ్వు అని. దానికి మావాడు, నన్ను మాలక్షవ్వ కిందనుండి పైకి నెడుతూనే వుంది నేను బావిలో పడ్డప్పటి నుండి అని చెప్పాడు. అదే మాలక్షవ్వ అప్పటికి కొన్ని నెలల క్రితం, మా వెంటపడి చెరువుకి వచ్చి, మేము మా ఆటల్లో పడి, తనని గమనించుకోక పోవటం వలన, చనిపోయిన మా లక్ష్మిని ఎందుకు పైకి నెట్టలేదో.
ఆశించిన ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి,క్రమేపి ఆకు అంతా ఎర్ర బడి,చివరిగా ఆకులు ముడుచుకొని దోనేలలాగా కనిపిస్తాయి.వీటి నివారణకు మొనోక్రోటో ఫాస్ 1.6మి.లీ లేదా డైమిథొయేట్ 2.0 మి.లీలేదా మిధైల్ డేమెటాన్ 2మి.లీ లీటరు నీటికి కలిపి ఆకుల అడుగుభాగం బాగా తడిసేలా పిచికారి చేయాలి. తెల్ల దోమ ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారి మొక్కలు కూడా గిడసబారి ఎండిపోతాయి. వీటి నివారణకు ట్రైజోఫాస్ 2.5మి.లీ లేదా ఎసిఫేట్ 1గ్రా. లేదా మొనోక్రోటోఫాస్ 1.6మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తామర పురుగులు ఈ పంటను మొదటి దశ నుంచి ఆశిస్తాయి. పైరు బెట్టకు గురైనప్పుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది.ఇవి చాల చిన్న గా ఉండి పసుపు పచ్చ లేక గోధుమ రంగు లో ,చీలిన రెక్కలతో ఉంటాయి.పిల్ల,పెద్ద పురుగులు ఆకులను,పువ్వులను గోకి రసాన్ని పీలుస్తాయి.ముఖ్యంగా ఈ పురుగులు లేత భాగాల్ని ఆశ్రయించి పెరగటం వలన ఆకుల పెళుసుగా మారి మొక్క గిడసబారి పోతుంది.ఇవి ఆశించిన ఆకుల పై పొడ లాంటి మచ్చలు ఏర్పడి ఆకుల పాలిపోయిముడుచుకొని పోతాయి.పరోక్షంగా ఇది నేక్రొసిస్ వైరస్ తెగులును వ్యాప్తి చేసి తీరని నష్టాన్ని కలుగజేస్తుంది. వీటిని అదుపు చేసే నిమిత్తం మందులు పిచికారి చేయడం కంటె కిలో విత్తనానికి 5గ్రా.ఇమిడాక్లో ప్రిడ్ తో విత్తన శుద్ధి చేస్తే మంచిది. ఆకుల్ని తినే పురుగులు పొగాకు లద్దె పురుగు క్రిములు గుంపులుగా ఆకులపై పత్ర హరితాన్ని గీకి తింటాయి.దీని వలన ఆకులు జల్లెడాకులుగా మారుతాయి.వీటి నివారణకు విషపు ఎరను(10 కిలోల తవుడు,కిలో బెల్లం మరియు ఒక లీటరు మొనోక్రోటోపాస్ లేదా 1 కిలోల కార్బరిల్ 50శాతం పొడి మందును తగు నీటితో కలిపి ఉండలుగా తయారుచేసుకొని మొక్కల మొదళ్ళ దగ్గర సాయంత్రం సమయంలో వేసుకోవాలి. పచ్చ రబ్బరు ఈ పురుగులు పంట తొలిదశ లో ఎక్కువగా ఆశించి ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి.వీటి నివారణకు థయోడికార్బ్ 1.5గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. బీహారి గొంగళి పురుగు రెక్కల పురుగు శరీరం గోధుమ,ఎరువు రంగులో ఉండి నల్లటి మచ్చలను కల్గి గులాబి రంగులో ఉండి నల్లటి మచ్చలు ఉంటాయి.తల్లి పురుగు ఆకులపై గ్రుడ్లను గుంపులుగా పెడుతుంది.లార్వాల శరీరం లేత పసుపు రంగులో ఉండి ముదురు పసుపు రంగు వెంట్రుకలతో కప్పబడి వుంటుంది.ఈ లార్వాలు ఆకులను తిని తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.పురుగు ఉధృతంగా ఆశస్తే మొక్కలు మోడుబారి పోతాయి. గ్రుడ్లను తొలిదశ గొంగళి పురుగులు గుంపులుగా ఆకుల మీద ఉన్నప్పుడు ఏరి నాశనం చేయాలి.తొలి దశ గొంగళి పురుగులను నివారించేందుకు వేప గింజల ద్రావణాన్ని(5 శాతం) పిచికారి చేయాలి.పెద్ద లార్వాలు ఉన్నప్పుడు దళ ఎండోసల్ఫాన్ లేదా క్లోరిపైరిఫాస్ 2.0మి.లీ లేదా డైక్లోర్వాస్ 1.0మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తలను ఆశించే పురుగు(శనగ పచ్చ పురుగు) ప్రొద్దు తిరుగుడు పండించే అన్ని ప్రాంతంలో ఈ పురుగు ఆశిస్తుంది.దీని రెక్కల పురుగుల ముందు రెక్కల మసక గోధుమ రంగులో ఉంటాయి.లేత ఆకుల మీద,విచ్చుకునే పూవుల మీద గ్రుడ్ల పెడుతాయి.గ్రుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు లేక ఆకుపచ్చ రంగులో ,పెరిగిన క్రిములు ముదురు ఆకుపచ్చ రంగు నుండి,గోధుమ రంగు ,ఊదారంగు,లేదా నల్ల రంగులో ఉంటాయి.కోశస్థ దశ భూమి గడుపుతుంది.ఎకరాకు 4-5 లింగాకర్షకు బుట్టలు అమర్చి పురుగు ఉనికిని గమనించాలి.దీని క్రిములు పువ్వుల ,గింజల మధ్య చేరి గింజలను తింటూ అధిక నష్టాన్ని కలుగ చేస్తాయి. ఉధృతిని ఎక్కువగా ఉన్న ఎడల ఎండోసల్ఫాన్ లేదా క్వినాల్ఫాస్ లేదా క్లోరిపై 2.0మి.లీ లేదా మొనోక్రోటోఫాస్ 1.6మి.లీ లేదా సైపర్ మెత్రిన్ లేదా డెల్టామెత్రిన్ లేదా ఫెన్వల్ రేట్ 1.0 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.హెచ్.యస్.పి.వి అనే వైరస్ ను ఎకరాకు 200 ఎల్.ఇ పిచికారి చేసి కూడా ఈ పురుగును నివారించవచ్చు.
వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలొ ఇంజనీర్ ఉద్యొగాలకు యు.ప్.ఎస్.సి నిర్వహించే పరీక్ష ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష. ఈ పరీక్ష ద్వరా సివిల్ ఇంజనీరింగ్, మెకనికల్ ఇంజనీరింగ్, ఎలక్త్రికల్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికషన్ ఇంజనీరింగ్ కేటగిరీ లలో భర్తీ జరుగుతుంది. వయస్సు: అభ్యర్ఠుల వయస్సు– 21- 30 సం. మధ్య ఉండాలి. ఎస్.సి., ఎస్.టి., ఒ.బి.సి., అభ్యర్ధులకు ప్రభుత్వ నియమాలను అనుసరిచి సడలింపు ఉంటుంది. విద్యార్హతలు: గ్ర్తింపు పొందిన విశ్వ విద్యలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి సెక్షన్–ఎ,బి పరీక్షలలో ఉత్తీర్ణులయిన లేదా తత్సమాన్ పర్రీక్ష లో ఉత్తీర్ణులయిన వారు అర్హులు. పరీక్ష వివరాలు: నాలుగు విభాగాలకు వేరువేరుగా పరీక్ష జరుగుతుంది. రాత పరీక్ష లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో కూడా ఉత్తీర్ణులైన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. ఈ పరీక్ష ద్వారా ఏ ఏ ఉద్యొగాలలో నియమకాలు జరుగుతాయి ? 1. సివిల్ ఇంజనీరింగ్ ద్వారా : ఇండియన్ రైల్వే సర్వీసెస్ అఫ్ ఇంజనీర్స్ , ఇండియన్ రైల్వే స్టొర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, సర్వే ఆఫ్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీసెస్, అసిస్టెంట్ ఎగ్జికుటివ్ ఇంజనీర్ (సివిల్) సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (రోడ్స్), ఇండియన్ అర్డినెన్సె ఫ్యాక్టరీ సర్వీసెస్ గ్రూప్ –ఎ ఉద్యోగలకు నియమకాలు జరుగుతయి. 2. మెకనికల్ ఇంజనీరింగ్ ద్వారా: ఇండియన్ రైల్వే సర్వీసెస్ అఫ్ మెకనికల్ ఇంజనీర్స్, ఇండియన్ రైల్వే స్టొర్స్ సర్వీసెస్ (మెకానికల్ ), సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ , సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ , ఇండియన్ అర్డినెన్సె ఫ్యాక్టరీ సర్వీసెస్, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇండియన్ నేవెల్ ఆర్మమెంట్ సర్వీసెస్ మొదలైనవి. 3. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ద్వారా: ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఇండియన్ నేవెల్ ఆర్మమెంట్ సర్వీసెస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ , సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ , ఇండియన్ ఇనస్పెక్షన్ సర్వీసెస్, గ్రూప్–ఎ, బి మొదలైనవి. 4. ఎలక్ట్రానిక్స్ & టెలీ కమ్యూనికేషన్ ద్వారా: ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ ,ఇండియన్ టెలీ కమ్యూనికేషన్ సర్వీస్, ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ సరీసెస్,సర్వే ఆఫ్ ఇండియా సర్వీసెస్, గ్రూప్–ఎ సర్వీసెస్ మొదలైనవి.
భారత్ మరియు రష్యా సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి ఇది ప్రపంచంలోనే అత్యధిక వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీనికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కి చేరవేస్తున్న గూడచారిని అధికారులు అరెస్టు చేసారు. నాగ్ పూర్ లోని డీఆర్డీవోలో ఉన్న ‘బ్రహ్మోస్ క్షిపణి’ పరిశోధనా కేంద్రం లో నిశాంత్ అగర్వాల్ గత నాలుగు సంవత్సరాలుగా ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు ఈ నేపధ్యంలో బ్రహ్మోస్ క్షిపణికి సబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ తో పాటు మరికొన్ని దేశాలకు నిశాంత్ చేరవేసినట్లు భారత నిఘా వర్ఘాలు గుర్తించి నిశాంత్ అగర్వాల్ ను అదుపులోకి తీసుకున్నారు. భారత మిసైల్ సిస్టమ్ కు చెందిన కీలకమైన సాంకేతిక సమాచారాన్ని నిశాంత్ అగర్వాల్ సేకరించి ఐఎస్ఐకి లీక్ చేస్తున్నట్లు అదికారులు గుర్తించారు. దేశ రక్షణ వ్యవస్థలో కీలకంగా భావించే బ్రహ్మోస్ సాంకేతిక సమాచారాన్ని నిషాంత్ ఏమేరకు ఐఎస్ఐ కి చేరవేసాడనే దానిపై అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో మరో ఏజన్సీ పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. నిషాంత్ అగర్వాల్ పాకిస్థాన్ కు చెందిన కొందరు వ్యక్తులతో ఫేస్ బుక్ ద్వారా మాట్లాడుతున్నట్లు గుర్తించారు. నిందితుడిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అదికారులు పేర్కొన్నారు. రెండు నెలలక్రితం వివాహం చేసుకున్న నిశాంత్ వార్ధా రోడ్డులో అద్దె ఇంటిలో ఉంటున్నాడు. దీనిపై ఇంటి యజమాని మాట్లాడుతూ నిశాంత్ దాదాపు సంవత్సర కాలంగా ఇక్కడే అద్దెకు ఉంటున్నాడని, ఆధార్ కార్డుతో పాటు డీఆర్డీవో ఇచ్చిన కార్డు సంమర్పించాడన్నారు. క్షిపణి పనితీరు మామూలు క్షిపణుల కంటే ఇది మూడు రెట్ల అధిక వేగంతో గాలిలో ద్వనివేగం కంటే అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 290 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ద్వని వేగం కంటే మూడు రెట్ల వేగంతో కచ్చితమైన ఏక్యూరేసీతో లక్ష్యాన్ని చేదిస్తుంది. ప్రపంచంలోనే ఏకైక తొలి సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ దీనిని యుద్ద విమానం, నౌక, సబ్మేరైన్ నుంచి లేదా నేలపై నుంచి కూడా దీనిని ప్రయోగించవచ్చు. ఇది తక్కువ ఎత్తులో శత్రు క్షిపణులను చేదిస్తుంది కావున దీనిని శత్రు రాడార్ వ్యవస్థ పసిగట్టలేవు. బ్రహ్మోస్ క్షిపణి కొండ ప్రాంతాలలో ఉండే శత్రువుల బంకర్లను మరియు శత్రువుల క్షిపణులను కచ్చితత్వంతో చేదిస్తుంది.
Google pays birthday tributes to Otto Wichterle – గూగుల్ డూడుల్, దాని ప్రత్యేకమైన డిజైన్‌తో, ఒట్టో విచ్టెర్లే తన చేతివేళ్లపై ఒకే కాంటాక్ట్ లెన్స్‌ను పట్టుకున్నట్లు చూపిస్తుంది, అయితే కాంతి ప్రతిబింబించేలా గూగుల్ లోగోను బ్యాక్‌గ్రౌండ్‌లో చూపుతుంది. ఆధునిక సాఫ్ట్ కాంటాక్ట్ లెన్స్‌ను కనిపెట్టినట్లు ప్రసిద్ధి చెందిన చెక్ రసాయన శాస్త్రవేత్త ఒట్టో విచ్టెర్లేకు గూగుల్ బుధవారం ప్రత్యేకమైన డూడుల్‌తో నివాళులర్పించింది – ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 140 మిలియన్ల మంది ప్రజలు తమ కంటి చూపు అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ రోజు, అంటే అక్టోబర్ 27, విచ్టెర్లే యొక్క 108వ జన్మదినోత్సవాన్ని సూచిస్తుంది, ఈ సందర్భంగా Google ప్రకారం, నెటిజన్‌లు కాంటాక్ట్ లెన్స్ వినియోగదారులు అనే దానితో సంబంధం లేకుండా శాస్త్రవేత్తపై తాజా అంతర్దృష్టితో వారికి జ్ఞానోదయం కలిగించేలా డూడుల్ కోసం పిలుపునిచ్చారు. గూగుల్ డూడుల్, దాని ప్రత్యేకమైన డిజైన్‌తో, ఒట్టో విచ్టెర్లే తన వేలికొనలపై ఒక కాంటాక్ట్ లెన్స్‌ను పట్టుకున్నట్లు చూపిస్తుంది, అయితే కంటి చూపుకు ప్రతినిధిగా బ్యాక్‌గ్రౌండ్‌లో Google లోగోను రూపొందించడానికి కాంతి ప్రతిబింబిస్తుంది. ఒట్టో విచ్టెర్లే అక్టోబరు 27, 1913న చెక్ రిపబ్లిక్‌లోని ప్రోస్టేజోవ్‌లో (అప్పుడు, ఆస్ట్రియా-హంగేరీ) జన్మించాడు. తన యవ్వనం నుండి సైన్స్ ప్రేమికుడిగా, విచ్టెర్లే 1936లో ప్రాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ICT) నుండి ఆర్గానిక్ కెమిస్ట్రీలో డాక్టరేట్ సంపాదించాడు. కంటి ఇంప్లాంట్‌ల కోసం శోషక మరియు పారదర్శక జెల్‌ను అభివృద్ధి చేస్తున్నప్పుడు అతను 1950లలో తన అల్మా మేటర్‌లో ప్రొఫెసర్‌గా బోధించాడు. Google pays birthday tributes to Otto Wichterle 1961లో, స్వయంగా కళ్లద్దాలు ధరించిన విచ్టెర్లే, పిల్లల ఎరెక్టర్ సెట్, సైకిల్ లైట్ బ్యాటరీ, ఫోనోగ్రాఫ్ మోటార్ మరియు ఇంట్లో తయారుచేసిన గాజు గొట్టాలు మరియు అచ్చులతో తయారు చేసిన DIY ఉపకరణంతో మొట్టమొదటి సాఫ్ట్ కాంటాక్ట్ లెన్స్‌లను తయారు చేశాడు. ఇది ఇప్పుడు ఉపయోగించబడుతున్న ఆధునిక కాంటాక్ట్ లెన్స్‌ల యొక్క తొలి వెర్షన్. విచ్టెర్లే యొక్క మేధావి తన ఇంటి వద్ద కాంటాక్ట్ లెన్స్‌ను కనిపెట్టాడు, రాజకీయ గందరగోళం అతన్ని ICT నుండి బయటకు నెట్టివేయడంతో హైడ్రోజెల్ అభివృద్ధిని మెరుగుపరిచాడు. విచ్టెర్లే కాంటాక్ట్ లెన్స్‌ల సృష్టికర్తగా ప్రసిద్ధి చెందినప్పటికీ, అతని ఆవిష్కరణలు మానవ బంధన కణజాలాలను పునరుద్ధరించడానికి ఉపయోగించే “స్మార్ట్” బయోమెటీరియల్స్ మరియు బయో-గుర్తించదగిన అత్యాధునిక వైద్య సాంకేతికతలకు కూడా పునాది వేసింది. పాలిమర్‌లు, ఔషధ పరిపాలన కోసం కొత్త ప్రమాణాన్ని ప్రేరేపించాయి. లెక్కలేనన్ని పేటెంట్ల సృష్టికర్తగా మరియు జీవితకాల పరిశోధకుడిగా, విచ్టెర్లే 1993లో దేశం స్థాపన తర్వాత చెక్ రిపబ్లిక్ అకాడమీకి మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విచ్టెర్లే 108వ జన్మదినోత్సవం సందర్భంగా డూడుల్‌తో శుభాకాంక్షలు తెలుపుతూ, “పుట్టినరోజు శుభాకాంక్షలు, ఒట్టో విచ్టెర్లే-ప్రపంచాన్ని కంటికి రెప్పలా చూసేందుకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు!”
ఆంధ్రప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో "గౌడ ఉద్యోగుల ఆత్మీయ సమావేశము" ; ది. 1-11-2020 వ తేదీ ఆది వారం సాయంత్రం 4.00 గంటలకు AP రాష్ట్ర గౌడ సంఘ కార్యాలయం, చెన్నుపాటి కాం ప్లెక్స్, E-Zone ఆఫీస్, సిద్దార్థ ఆర్ట్ కాలేజ్ ప్రక్కన, మొఘల్ రాజపురం, విజయవాడ నందు ఘనంగా జరిగినది. ఈ గౌడ ఉద్యోగుల ఆత్మీయ సమావేశమునకు ముఖ్య అతిధులు గా శ్రీ సూరగాని రవిశంకర్ గౌడ్ గారు, గేవా రాష్ట్ర అధ్యక్ షులు., శ్రీ చలపాటి వెంకటేశ్వరరావు గౌడ్ గారు, గౌడ సంఘం రాష్ ట్ర అధ్యక్షులు.,శ్రీ జోగి నాగేశ్వరరావు గౌడ్ గారు, గేవా గౌరవ అధ్యక్షులు., శ్రీమతి చెన్ను విజయలక్ష్మ ి గారు, రాష్ట్ర గేవా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు., శ్రీ వీరంకి రంగారావు గారు, గుంటూరు జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు., శ్రీ బొర్రా శేషగిరిరావుగారు, గేవా విజయవాడ డివిజన్ అధ్యక్షుడు., శ్రీ పలగాని స ీతారామయ్య గారు, రైల్వే గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు., శ్రీ మోర్ల మహిదర్ గౌడ్ గారు, BC సంక్షేమ సంఘం మచిలీపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు., శ్రీ తాతా సాంబశివరావు గారు, ఎడిటర్ గౌడప్రభ, మరియు గ ౌడ ఉద్యోగ సంఘ నాయకులు, గౌడ సంఘ నాయకులు విచ్చేసినారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గౌడ ఉద్యోగు ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు "శ్రీ పౌంజుల నాగేంద్రప్రసాద్ గౌడ్ గారు" ఉద్యోగ పదవీ విరమణ సందర్భంగా వారికి ఆత్మీయ సన్మానము ఘనంగా ని ర్వహించి, వారికి అందరూ&nbs p; ఉద్యోగ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియచేసినారు.< /span> ఈ కార్యక్రమంలో శ్రీ పౌంజుల నాగేంద్రప్రస ాద్ గారు వారి ఉద్యోగ వివరాలు, ఉద్యోగం చేస్తూ గౌడ సంక్షేమ సంఘాలకు, గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘ ానికి చేసిన సేవల గురించి, జీవితంలో ఉన్నత చదువులు చదువుకోవడం వలన ఉద్యోగ ం, ఆర్ధికంగా ఎదగడం, అన్నిటికీ మించి సమాజంలో మంచి గుర్తింపును పొందవచ్చు అని తెలియచేస్తూ, గౌడ పేద విద్యార్థులకు చదువుల నిమిత్తం సహాయం చేయుటకు నేను ఎప్పుడూ ముందువుంటానని తెలిపినారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న గౌడ న ాలెడ్జ్ హబ్ కు (గౌడ హాస్టల్) తన వంతు సహాయంగా ఒక లక్షరూపాయలు, మరి యు గత 40 సంవత్సరాలుగా గౌడ సంగీయులకు సేవలందిస్తున్న గౌడప్రభ మాసపత ్రిక అభివృద్ది చెందాలని ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసినారు.&nb sp; గౌడప్రభ పత్రిక ప్రతి ఇంటికి చేరాలని, ప్రతి గౌడ సంఘీయుడు, ప్రతి ఒక్ క గౌడ ఉద్యోగి గౌడప్రభకు చందాదారులుగా చేరాలని సూచించారు.< /span> విజయవాడ సిటీలో గౌడ ఉద్యోగులకు రాష్ట్ర గ ేవా కార్యాలయమును ఉచితంగా ఇచ్చి, మరియు గౌడ సంఘీయులు, గౌడ ఉద్యోగులకు మరియు ఇతర సేవా కార్యక్రమాలు న ిర్వహించుటకు వేదికను ఉచితంగా ఇస్తున్న, గౌడ సంఘంలో నూతన వరవడి సృష్టించి , అతితక్కువ సమయంలో ఆంద్రప్రదేశ్ మొత్తం 13 జిల్లాలు తిరిగి, గౌడ సంఘ నాయ కులను ఒక వేదిక మీదకు తీసుకువస్చి గౌడ కార్పొరేషన్ ఏర్పాటు కొరకు నిరంతరక ృషి చేసిన శ్రీ చలపాటి వెంకటేశ్వరరావు గారికి అభినందనలు తెలుపుతూ వారికి చిరు సత్కారం చేసినారు, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస ్తూ చింతా చంద్రాగౌడ్ వందన సమర్పణ చేసి కార్యక్రమమును ముగించినారు.
కామ్రేడ్‌ మాకినేని బసవపున్నయ్య గారి శత జయంతి సందర్భంగా ఈరోజు సాంస్కృతిక, సామాజిక ఉద్యమాల గురించి మాట్లాడమని కోరారు. ఇంతకుముందు భాషా వికాసం గురించి మాట్లాడిన కొత్తపల్లి రవిబాబుగారు నాకో కరపత్రం ఇచ్చారు. మాతృభాష ప్రాధాన్యత గురించి ఛాయారాజ్‌గారు రాసిన మంచి కవిత్వం దానిలో ఉంది. అందులోని చివరి చరణాలు. ''అమ్మా నీ భాష కావాలి. నిప్పులు చెరగటానికి.. చెమటను జల్లెడ పట్టి సంపదలను తీయడానికి.. తెలుగు పౌరుషాగ్నిని రాజేయడానికి.. మాతృభాష కావాలి..'' అలాంటి తెలుగు పౌరుషాగ్నిని రాజేయడంలో దిట్ట కామ్రేడ్‌ మాకినేని బసవపున్నయ్య. ఎక్కడకు వెళ్లి ఏ అంశం మీద మాట్లాడినా ప్రజలను ఉర్రూతలూగించి, నిప్పులు కురిపించి, వారిని కదన రంగానికి కదిలించడంలో వీర సారథిలా పనిచేసేవారు బసవపున్నయ్య. ఆరోజుల్లో ఆయన ఉపన్యాసాలంటే చెవులు కోసుకునేవారు. ఒకసారి ఆయన ప్రసంగం విన్న తరువాత 'పోరాటంలో దుమికి తాడో పేడో తేల్చుకుందాం. ఈ దోపిడీ సమాజాన్ని తుత్తునియలు చేసేదాకా వదలకూడదు' అన్నంత పట్టుదల ఆయన ఉపన్యాసాలద్వారా కలిగేది. అదే భాషా పటుత్వమంటే. ఏ సామాజిక, సాంస్కృతిక ఉద్యమానికైనా ఓ లక్ష్యం ఉంటుంది. అది వ్యక్తి వికాసానికీ, సామాజిక వికాసానికీ తోడ్పడాలి. ఇక్కడో చర్చ నడుస్తోంది. వ్యక్తి వికాసం అంటే ఏమిటీ, సామాజిక వికాసం అంటే ఏమిటీ అని? 'వ్యక్తులు మారితే సమాజం మారుతుంది. ముందు నువ్వు మారు' అని చాలామంది చెబుతుంటారు. ఇంకొంతమంది 'సమాజం మారేదాకా వ్యక్తి మార్పును చూడలేము' అంటారు. వాస్తవం ఈ రెండింటి మధ్యా ఉంది. రెండూ పరస్పర సంబంధమూ, అనుబంధమూ కలిగినవి. వ్యక్తి దేనికి మారాలి? సమాజాన్ని మార్చడానికి మారాలి. సమాజ చోదకుడుగా మారాలి. ఆ వ్యక్తి తనను తాను మార్చుకొని సమాజాన్ని మార్చడానికి ఉద్యుక్తుడయితే మొత్తం సమాజం మారుతుంది. సమాజం మారితే సమాజంలోని వ్యక్తులూ మారతారు. అలా చొరవ చేసేవారూ, నడుంకట్టేవారూ ముందు తమను తాము తీర్చిదిద్దుకోవాలి. బసవపున్నయ్య, సుందరయ్య, రాజేశ్వరరావుగారలు ఎవరయినా ముందు తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకొని ఆ విధంగా సమాజాన్ని ప్రభావితం చేసి, ప్రజల్లో తిరుగుబాటు భావాలను రగిల్చి, అనేక ఉద్యమాలకు నాంది పలికారు. ఆ ప్రభావం సమాజంపై పడి అనేక మంది మారారు. ఈ రకమైన పరస్పర సంబంధం వ్యక్తి వికాసానికీ సామాజిక వికాసానికీ మధ్య ఉంది. నేడు సమాజంలో లంచగొండితనం ఉంది. ఈ వ్యవస్థలో ఒక భాగం అయ్యింది. సమాజం మారకుండా లంచగొండితనం పోదని కొందరి అభిప్రాయం. ఎవరు లంచమిచ్చినా, తీసుకున్నా చూస్తుండాలి. సమాజం మారిందాకా మనమేం చేయలేం అనుకుంటే మనకు తెలియకుండానే మనలో నిష్క్రియాపరత్వం ఏర్పడుతుంది. లంచగొండితనంతో సమాజం బాధపడుతున్నా మనకేం సంబంధం లేదు. లేదూ వ్యక్తి మారాలంటే లంచం ఇచ్చేవారినీ, తీసుకునేవారినీ నిర్మూలించాలని ఒక తహశీలుదారు ఆఫీసు గుమాస్తానో, గేటు దగ్గర ఉండే అటెండరో పదో పరకో తీసుకుంటేనో లేదా బస్సు కండెక్టరు చిల్లర ఇవ్వలేదనో అవినీతిపై పోరాడే పేరుతో వారిమీద తిరుగుబాటు చేస్తే అది గందరగోళమూ, అరాచకమూ అవుతుంది. అలా అని భూరికార్డులు తారుమారు చేసే అధికారులను చూస్తూ వదిలేయలేం. మరి ఈ రెంటికీ మధ్యన ఏమిటి? గుడినీ, గుడిలో లింగాన్నీ, దేశాన్నీ మింగేస్తున్న అవినీతిపరులపైనా, ప్రజల సంపదను మెక్కేస్తున్నవారిపైనా పోరాడాలి. అదే సందర్భంలో అవినితికి మూలమైన వ్యవస్థనూ మార్చడానికి కృషి చేయాలి. వ్యక్తికీ సమాజానికీ మధ్య సంబంధం లాంటిదే ఇది కూడా. అలా అయినప్పుడే మొత్తం సాంస్కృతిక, సామాజికోద్యమాలు, వ్యక్తి వికాసం ముందుకుపోతాయి. సంస్కృతి అనేది ప్రజల మధ్య భావ సమైక్యతను సృష్టిస్తుంది. అది భావాల్లోనూ, భాషలోను, ఆచార, సంప్రదాయాల్లోనూ కనిపిస్తుంది. పండుగలు, ఉత్సవాలు, పెండ్లిండ్లు, శవసంస్కారాలు-ఇలా సందర్భం ఏదైనా ప్రజలు ఒక వర్గంగానో, తరగతిగానో, జాతిగానో, తెగగానో భాగస్వాములవుతారు. ఇది ఒక ఉమ్మడి తత్వాన్ని తీసుకొస్తుంది. వివిధ చారిత్రక దశల్లో ఈ సంస్కృతి విభిన్నంగా పనిచేస్తుంది. అది నిరంతరం చలనంలో ఉంటుంది. మారుతుంటుంది. సంపర్కం చెందుతుంది. ప్రగతిశీలంగా ఉంటుంది. ప్రగతి నిరోధకంగానూ ఉంటుంది. నేడు మంచిగా ఉన్నదే రేపు చెడుగా మారుతుంది. చారిత్రక, తార్కిక దృష్టితో ఈ పరిణామాన్ని అర్థం చేసుకోవాలి. మన సౌలభ్యం కోసం నేను వీటిని మూడు భాగాలుగా చెప్పదలుచు కున్నాను. ఒకటి : స్వాతంత్య్రోద్యమ ప్రభావం. రెండోది : కమ్యూనిస్టుల ప్రభావం. మూడోది : ఈనాటి ప్రపంచీకరణ ప్రభావం. ప్రజలమీదా, సమాజం మీద ప్రగాఢముద్ర వేసిన ప్రభావాలివి. స్వాతంత్య్రోద్యమ కాలంలో చాలా ఉద్యమాలు నడిచాయి. బ్రిటీష్‌వారు దేశం నుంచి వెళ్లిపోవాలి, స్వతంత్రం కావాలీ అన్నది ప్రధానమైన అంశమే అయినా ప్రజలను కదిలించడానికీ, ప్రభావితం చేయడానికీ కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల నాయక్వంలో కావచ్చు, గాంధీ ప్రభావంతో కావచ్చు చాలా ఉద్యమాలు కొనసాగాయి. ప్రత్యేకించి అంటరానితనానికి వ్యతిరేకంగానూ నడిచాయి. దళితులనూ, మైనారిటీలను, ఇతర వెనుకబడిన తరగతులనూ భాగస్వాములను చేయడానికి ఉద్యమాలు నడిచాయి. మహిళల అక్షరాస్యత కోసమూ, మద్యపానానికి వ్యతిరేకంగానూ ఉద్యమాలు నడిచాయి. శ్రమదాన, సేవా కార్యక్రమాల కోసం ఉద్యమాలు నడిచాయి. కలరా వంటి అంటు వ్యాధులు వచ్చినప్పుడు వాటిని నిర్మూలించడానికి కార్యకర్తలే నేరుగా రంగంలో దిగేవారు. అందరూ భయపడి పారిపోయి ఊళ్ల నుంచే వారిని వెలివేసే పరిస్థితుల్లో వారి దగ్గరకు పోయి సేవ చేశారు. ఆఖరికి కుష్టు వ్యాధిగ్రస్తులను సైతం చేరదీసి మనుషుందరూ ఒకటే అనే నిరూపించడానికి ప్రయత్నించారు. ఇలాంటి అనేక ఉద్యమాలు స్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రభావితం చేశాయి. వాటిని చూసి ప్రభావితమైన అనేకమంది స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాములయ్యారు.. స్వాతంత్య్రోద్యమంలో ఖద్దరు ధరించడమే పెద్ద ఉద్యమంగా సాగింది . ఇది బ్రిటీషువారికి ప్రతిఘటన. ఖద్దరు వేసుకొని కాలేజీకి వెళ్లారంటే ప్రత్యక్షంగా తిరుగుబాటు జెండా ఎగురవేసినట్లే. ప్రిన్సిపాల్‌ వెంటనే ఆ విద్యార్థిని పిలిపించి కళాశాల నుంచి సస్పెండ్‌ చేసేవారు. అప్పుడు ఖద్దరు చొక్కా ధరించడమే తిరుగుబాటుకూ, ప్రతిఘటనకూ చిహ్నంగా మారింది. ఇది సామాజిక సాంస్కృతికోద్యమ ప్రభావమే. గాంధీ ఉప్పు మీద పన్ను వేసినం దుకు సత్యాగ్రహం నడిపారు. ఉప్పు మీద పన్ను ఇప్పుడూ మనం కడుతూనే ఉన్నాం. పన్నుల మీద పన్నులు పెంచేస్తున్నారు. నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో సర్వీసు టాక్స్‌ 14 శాతం పెంచారు. చివరికి శిరోముండనం చేయించుకోవాలన్నా టాక్స్‌ కట్టాల్సిందే. తిరుపతి వెళ్లి క్యూలో నుంచున్నా సర్వీసు టాక్స్‌ కట్టాల్సిందే. కాని ఆ రోజుల్లో ఉప్పు మీద పన్ను వేస్తే ప్రజలను కదిలించగలిగారు. దండి సత్యాగ్రహంలో మనుషుల తలలు పగులగొడుతున్నా ఖద్దరు ధరించి, సంచి తగిలించుకొని ముందుకు పోయారు. ఇదొక ఉద్యమ సంస్కృతి. ప్రతి ఒక్కరినీ కదిలించి తిరుగుబాటుకు పురికొల్పిన సంస్కృతి ఆరోజు సాతంత్య్రోద్యమంలో అంతర్భాగంగా నడిచింది. అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా గాంధీ, అంబేద్కర్‌ ఉద్యమాలు నడిపారు. కమ్యూనిస్టులు దానిలో అగ్రభాగాన ఉన్నారు. కమ్యూనిస్టులంటే మాలమాదిగల పార్టీ అనేవారు. సున్నితంగా చెప్పేవారయితే లేబరోళ్లనీ, లేబర్‌పార్టీ అనీ అనేవారు. అగ్రకులాల నుంచీ, ధనిక రైతు కుటుంబాలను నుంచీ వచ్చినవారు కూడా బసవపున్నయ్య, సుందరయ్య వంటి నాయకులతో కలిసి దళితవాడల్లో పడుకొని వారు పెట్టింది తిని, వారిని కదిలించడానికి చేసిన కృషి అసమాన్యం. ఈ మధ్య స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం చూస్తున్నాం. ఈ రోజు బడ్జెట్‌లో స్వచ్ఛ భారత్‌ తాము సాధించిన ఘనవిజయాల్లో గొప్పదని అరుణ్‌జైట్లీ చెప్పాడు. ఏమిటీ స్వచ్ఛ భారత్‌ అంటే? వీధుల్లోకి వెళ్లి చీపురు పట్టుకొని ఒక ఫొటో దిగడంతో స్వచ్ఛ భారత్‌ అయిపోతుంది. ఆ రోజుల్లో చూసుకోవడానికి ఏ ఫొటోలూ లేవు. అంటరానితనమే అతి పెద్ద సాంఘిక దురాచారం. అంటరానితనాన్ని నిర్మూలించ కుండా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడకుండా స్వచ్ఛ భారత్‌కు అర్థమేమిటి? నీ తోటివాడినే అంటరానివాడిగా చూస్తుంటే, వీధుల్లో నడవనివ్వకుండా, నీళ్లు తాగనివ్వ కుండా చేస్తుంటే దాన్ని పట్టించుకోకుండా నేను వీధులను శుభ్రం చేస్తాను, మరుగుదొడ్లు కడతాను అంటున్నారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు అశుద్ధం ఎత్తివేయడానికి కూడా సిద్ధపడ్డారు. సాంస్కృతిక సామాజికోద్యమాలకు స్వాతంత్య్రోద్యమం ఒక నమూనాగా నిలబడింది. అయితే స్వాతంత్య్రోద్యమంలో కాంగ్రెస్‌ అనుసరించిన రాజీ పద్ధతులు యువతరాన్ని స్ఫూర్తివంతంగా, ఉత్సాహంగా కదిలించలేకపోయాయి. భగత్‌సింగ్‌ వంటివారిని ఉరితీస్తున్నా మాట్లాడలేకపోవడం వంటి అనేక అంశాలు యువతరాన్ని ప్రభావితం చేశాయి. ఇది మార్గం కాదు, కమ్యూనిస్టు పార్టీ అయితేనే సమాజం మారుతుంది. కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని అనేకమంది కాంగ్రెస్‌ను వదిలేసి కమ్యూనిస్టుపార్టీలో చేరిపోయారు. 1940, 50, 60ల్లో మూడు దశాబ్దాలపాటు తెలుగు రాష్ట్రాలను అత్యంత ప్రభావితం చేసింది కమ్యూనిస్టు ఉద్యమం. వారు చెప్పిన భాషా వికాసం, జాతి వికాసం, సామాజిక న్యాయం, సామాజిక వికాసం. ఒక అంశం కాదు. అన్ని అంశాల్లోనూ కమ్యూనిస్టు పార్టీ ప్రభావం చూపింది. 1950 నాటి సినిమాలు చూడండి. అది ప్రేమ, క్రైం, పౌరాణిక సినిమా ఏదైనా కావచ్చు. అందులో ఒక అభ్యుదయ గీతం లేకుండా, అందులో కుల మతతత్వాలను చీల్చి చెండాడకుండా, అందులో అవినీతినీ, అన్యాయాలనూ, అక్రమాలనూ ప్రశ్నించకుండా ఏ సినిమా ఉండదు. అటువంటి ప్రభావం రచయితలమీదా, నిర్మాతల మీద ఉంది. ఈ మాటలు ఇలా చెబితేనే ప్రజలు స్వీకరిస్తారనే అంతటి తీవ్రమైన ప్రభావం ఉండేది. ప్రజానాట్యమండలి, అభ్యదయ రచయి తల సంఘం, ఆరోజు ప్రతిఒక్కరూ, కమ్యూనిస్టులనే కాదు భావావేశం ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యుదయ ఉద్యమాల వైపు చూశారు. ఆ రోజు అతి పెద్ద ఉద్యమం, కమ్యూనిస్టులు శాసించిన ఉద్యమం సామాజికోద్యమం. తెలుగువాళ్లంతా ఒకటిగా ఉండాలని, జాతినీ భాషనూ ఏకం చేసి విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం పోరాడాలనే నినాదానికి అక్షర రూపం ఇచ్చి, మద్రాసు రాష్ట్రంలో ఉన్నా, నైజాంలో ఉన్నా ఎక్కడున్నా తెలుగువాళ్లు ఒకటి కావాలని ఉద్యమానికి శ్రీకారం చుట్టి దాన్ని సాధించిన ఘనత కమ్యూనిస్టు పార్టీది. మిగతా అన్ని పార్టీలూ ఉండొచ్చు. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారు. కొంతమంది కాంగ్రెస్‌వారు కూడా పాల్గొన్నారు. కానీ దానికి ఊపిరిపోసి నడిపించింది మాత్రం కమ్యూనిస్టు పార్టీయే. అంతకుముందు ఎప్పట్నించో తెలుగువారు చీలిపోయారనే భావన ఉంది. అప్పటికే తెలుగు భాషా వికాసానికి తోడ్పడినవారున్నారు. ఛాంతసత్వంపై ఎదురుదాడి చేసినవారున్నారు. కాని వారి కృషంతా వ్యక్తులకు సంబంధించినదిగానే మిగిలిపోయింది. దానికి ఉద్యమ రూపం ఇచ్చినవారు లేరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉద్యమం మొత్తం దేశ భౌతిక స్వరూపాన్నే మార్చేసింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఎవరి భాషలో వారు చదువుకోవచ్చు. ఎవరి భాషలో వారు మాట్లాడుకోవచ్చు. ఎవరి భాషలో వారు చట్టాలు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రం ఏర్పడక ముందు ఢిల్లీ వెళితే అక్కడ తెలుగువారిని మదరాసీలనేవారు. తెలుగువారికి ఒక అస్థిత్వం కల్పించింది కమ్యూనిస్టు పార్టీ. ఇది అతి పెద్ద సామాజిక ఉద్యమం. సామాజికోద్యమాల్లో ముందుకొచ్చిన రెండో అతి పెద్ద ఉద్యమం దళితవాదం. 1980లో ఇది ఒక వాదం కింద పుట్టుకొచ్చింది. దళితులు మొత్తం ఒక ప్రజాస్వామ్య స్రవంతిలో 1940, 50ల్లో ఒక భాగంగా ఉన్నారు. దళితులంటే కమ్యూనిస్టులూ, కమ్యూనిస్టులంటే దళితులూ అన్న పద్ధతిలో ఆనాడు కలిసిపోయారు. వారికోసం కమ్యూనిస్టులు తప్ప మరెవరూ కృషి చేయలేదు. ఇది కమ్యూనిస్టు కార్యకర్తలకు ఒక గుర్తింపునిచ్చింది. అమెరికాలో, బ్రిటన్‌లో, రష్యాలో ఏం జరుగుతోందీ అన్నది, ప్రపంచంలోని విషయాలన్నీ కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు మాట్లాడేవారు అని ఊళ్లలోకి పోతే పెద్దవాళ్లు చెప్పేవారు. అసలు వీళ్లకీ జ్ఞానం ఎక్కణ్ణుంచి వచ్చింది అనే ప్రశ్న వచ్చింది. కమ్యూనిస్టులు కాబట్టే వచ్చింది. కమ్యూనిస్టులం అయితే మనం వికాసవంతులమవుతాం. ప్రశ్నించగలుగుతాం అనే భావాలు విస్తరించాయి. మామూలు వ్యవసాయ కూలి అమెరికా గురించో, రష్యా గురించో, రెండో ప్రపంచ యుద్ధం గురించో, సామ్రాజ్యవాదం గురించో మాట్లాడుతుంటే, వీళ్లకు ఇన్ని విషయాలెలా తెలుసు అని ఆ ఊళ్లో తలనెరిసిన మోతుబరి రైతులు నోళ్లు వెళ్లబెట్టుకొని వింటుండేవారు. అంటే విజ్ఞానంలో ఒక మామూలు మనిషిని, ఒక మట్టి మనిషి, రాతి మనిషినుకున్నవాణ్ణి కమ్యూనిస్టు పార్టీ ఒక చైతన్యవంతమైన ఆయుధం కింద మలిచింది. ఇదేం చిన్న విషయం కాదు. ఈ మధ్య విజ్ఞాన్‌ రత్తయ్యగారు రాసిన ఓ పుస్తకం చదివాను. మిగతా విషయలెలా ఉన్నా ఒక విషయం మాత్రం ఆయన స్పష్టంగా రాశారు. తెలుగునాట విద్యాభివృద్ధికి మొట్టమొదట పునాది వేసింది కమ్యూనిస్టులు అని. అది వాస్తవం. ఊళ్లో చదువు అనేది ఒక హక్కుగా ఉండేది. ఎందుకురా మట్టి పిసుక్కునేవాడికి చదువు? చదువుకొని ఊళ్లేలతారా? ఎందుకు బడికి పంపడం? అనుకునే రోజుల్లో చొరవ చేసి, పిల్లలను చదివించడానికి రాత్రిబడులు పెట్టి, లాంతర్ల కింద చదువు చెప్పిన ఘనత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలది. మహిళలకు చదువేంటనుకునేకునే రోజుల్లో చదువుకు ప్రోత్సహించి, వారిని విద్యాలయాలకు పంపిన ఘనత కమ్యూనిస్టు పార్టీది. కమ్యూనిస్టుపార్టి మహిళలను వీధుల్లోకి తీసుకొచ్చి పోరాటాల్లో భాగస్వాములను చేసింది. మోటూరు ఉదయం గారి నాయకత్వంలో ఒక బుర్రకథ దళం ఏర్పడింది. బహిరంగ ప్రదర్శనలివ్వడంపై భూస్వాములు అసహ్యంగా మాట్లాడేవారు. దాన్నెదుర్కొనే ధైర్యాన్నీ, తెగువనూ మహిళల్లో కల్పించింది కమ్యూనిస్టు పార్టీ. అందుకని భాషా వికాసంలో, జాతీయ వికాసంలో, సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటాల్లో కమ్యూనిస్టు పార్టీ అగ్రభాగాన ఉంది. రెండున్నర దశాబ్దాల పాటు తెలుగు ప్రజల చరిత్రను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసింది. అధికారంలోకి రాకపోవచ్చు. మామూలుగా అయితే భావాల గురించి చెప్పుకున్నప్పుడు ఎవరయితే అధికారంలో ఉంటారో వారి భావాలే ప్రజలందరినీ ప్రభావితం చేస్తాయని చెప్పుకుంటాం. స్థూలంగా అది సరైనది. కానీ అధికారంలో లేకుండానే కమ్యూనిస్టు పార్టీ తన భావాలతో ప్రజలందరినీ ప్రభావితం చేసింది. కాంగ్రెస్‌ వాళ్లు భూస్వామ్య వ్యవస్థను బలపరిస్తే, ఆ వ్యవస్థకు, దాని కుళ్లు సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులే. ఈ రోజు రాజకీయ సంస్కృతి గురించి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ వారు ఎలా ఉంటారు. ఓ రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడు. ఖరీదైన ఖద్దరు ధరించాలి. లెదర్‌ చెప్పులేసుకోవాలి. ఆధునికమైన కారు, హంగూఆర్భాటం, మందీ మార్బలం, గన్‌మెన్‌లు...అదో ప్రత్యేకమైన స్టయిల్‌ లేదా బ్రాండ్‌. ఒక రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉంటాడనే భావన ఉంది. అలా ఉంటేనే రాజకీయ నాయకుడి కింద లెక్క. కానీ మామూలుగా నిరాడంబరంగా ఉండి, చేతిలో సంచి పట్టుకుని, అందులో ఓ పేపరు పెట్టుకొని, ఎక్కడబడితే అక్కడ పేపరు పరుచుకొని పడుకోవడం వంటి ఒక నూతన రాజకీయ సంస్కృతిని 1950లో కమ్యూనిస్టుపార్టీ ప్రవేశపెట్టింది. దాని ప్రభావం కూడా ఇతర పార్టీల మీద ఉంది. కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉన్నచోట్ల ఆ ప్రభావం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉంది. కేరళలో కాంగ్రెస్‌ వాళ్లు కూడా కమ్యూనిస్టులు మాట్లాడే భాష మాట్లాడేవాళ్లు. కమ్యూనిస్టుల్లాగానే మేమూ ఉన్నాం అని చెప్పుకోవడానికీ, పోటీ పడటానికీ ప్రయత్నిస్తుండేవాళ్లు. ఇతర పార్టీలను కూడా ప్రభావితం చేయగలిగింది కమ్యూనిస్టు జీవన విధానం. అది నీతి, నిజాయితీ, నిరాడంబరత్వంతో కూడిన జీవన విధానం. అలాగే సంస్కరణోద్యమాలు కూడా. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు ఆ రోజు బాల్య వివాహాలను వ్యతిరేకించడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడం వంటి ఉద్యమాలు నడిపారు. వాటి ప్రభావం ప్రజల్లో ఒక భాగానికే పరిమితమయింది. దాన్ని సాధారణ ప్రజల్లోకి తెచ్చింది కమ్యూనిస్టుపార్టీ. వివాహ పద్ధతిలోనే ఒక ప్రత్యామ్నాయాన్ని చూపింది. అదర్శ వివాహం అంటే అది కమ్యూనిస్టు పార్టీ పెళ్లి అనీ, మీటింగుల పెళ్లనీ, దండలు మార్చుకుంటే పెళ్లయిపోయినట్లేననీ అనేవారు. ఇప్పుడంటే రిజిస్ట్రేషన్లు కావాలి. అప్పుడు రిజిస్ట్రేషన్లు అవసరం లేదు. దండలు మార్చుకుంటే పెళ్లియిపోయినట్లే అనే సాదాసీదా పద్ధతిలో ఖర్చు లేకుండా వివాహం జరిపించేవారు. ఆడపిల్లల పెళ్లంటే సగం ఆస్తి అమ్ముకోవాలనేటువంటి రోజుల్లో పెళ్ళంటే చాలా సులభంగా చేసే ప్రక్రియగా మార్చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీది. కొన్ని స్వఛ్చంద సంస్థలు, అభ్యుదయవాదులు కూడా హంగూఆర్భాటం లేని వివాహ వేడుకల్ని ప్రోత్సహించారు. కమ్యూనిస్టుపార్టి ఆ రోజు నుంచి ఈ రోజుదాకా ఒక ప్రత్యామ్నాయ వివాహ పద్ధతిని ప్రోత్సహిస్తున్నది. తన సొంత కుటుంబంలో కమ్యూనిస్టులు విభిన్నంగా వ్యవహరిస్తారు. ఒకళ్లకొకళ్లు తోడ్పడటం అందరూ చేయకపోవచ్చు. కానీ ఆ సంస్కృతిని మాత్రం ప్రవేశపెట్టింది కమ్యూనిస్టు పార్టీయే. వంటలో సహాయపడటం, పిల్లల పెంపకంలో సహాయం చేయడం వంటివి. వారిని ఎడ్యుకేట్‌ చేయడానికీ, వారు కూడా జెండా పట్టుకొని ఉద్యమాల్లోకి రావడానికీ, కుటుంబం కుటుంబాన్నే పిల్లలతోసహా వీధుల్లోకి తీసుకురావడానికీ తోడ్పడింది. బహుశా ఆనాడున్న ఫ్యూడల్‌ విశ్వాసాలు కూడా దీనికి దోహదపడి ఉండొచ్చు. అన్నిటికన్నా మించి స్వాతంత్య్రోద్యమం తరువాత అధికారంలోకి వచ్చి పదవీలాలస పెరిగిన రోజుల్లో సమాజం కోసం త్యాగం చేయాలి. ఈ ఆస్తులూ ఆదాయాలూ, సంపదా ఇవి కాదు. ఉద్యమమే ప్రధానం అని ఎవరికి వారు తెగించి ఇంట్లో ఉన్న తల్లులు, అక్కలు, అమ్మలు వాళ్లందరూ ఉమ్మడిగా అనుకొని సుందరయ్యను చూసో, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ను చూసో స్ఫూర్తి తెచ్చుకొని ఉద్యమాల కోసం త్యాగం చేయడం ఒక సంస్కృతిగా మారింది. ఆ రకమైన ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని సృష్టించడంలో 1950లలోనే కమ్యూనిస్టు పార్టీ చరిత్ర సృష్టించింది. దాని తరువాత మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా. ప్రజలకు హానిచేసే కొన్ని సంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడమూ, కేవలం శాస్త్రీయంగా ప్రచారం చేయడమే కాదు. శాస్త్రబద్ధంగా ఆలోచించడమూ, జీవించడమూ అనే విధానానికి నాంది పలికింది కమ్యూనిస్టుపార్టీ. మూఢనమ్మకాలకు వ్యతిరేకమంటే ప్రజలకు హానిచేసేవాటికి వ్యతిరేకం. ముఖ్యంగా మూఢనమ్మకాలకు బలయ్యింది సామాన్య పేద ప్రజలు, దళితులు, గిరిజనులు, మహిళలే. వీరే ఎక్కువ భాగం నష్టపోయారు. వాటిని ప్రశ్నించి నిరోధించేందుకు కమ్యూనిస్టు పార్టీ కృషి చేసింది. మానవ పరిణామం నుంచి అనేక శాస్త్రీయ గ్రంథాల వరకూ ప్రచురించి ప్రచారంలో పెట్టేందుకు కృషి చేసింది. సహపంక్తి భోజనాలు, కులాంతర వివాహాలు పెద్దఎత్తున చేపట్టబడ్డాయి. తద్వారా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా యువతరాన్ని ఆకర్షించింది. ఒక శక్తిగా ముందుకొచ్చింది. సమాజంలో ఫ్యూడలిజం బలంగా ఉన్న రోజుల్లో కూడా (కమ్యూనిటీ) ఉమ్మడితత్వం ఉండేది. 1950-60 కాలాల్లో పెళ్లి జరుగుతోందనుకోండి. పెళ్లి పందిళ్లు వేయడం, వంటలు చేయడం, ఇల్లిల్లూ తిరిగి పాలూ పెరుగూ తేవడం, ఒక విధంగా ఒకరింట్లో పెళ్లి అంటే ఊరు మొత్తం పెళ్లిలాగుండేది. ఎవరింట పెళ్లి జరిగినా ఇతర కులాల వాళ్లూ వెళ్లేవాళ్లు. కమ్యూనిస్టులు బలంగా ఉన్న గ్రామాల్లో సహపంక్తి భోజనాలు సాగేవి. భూస్వాములు బలంగా ఉన్న చోట దళితులకు విడిగా పెట్టేవారు. భోజనాల వడ్డింపులో అవమానాలు ఎదురయ్యేవి. అందుకే కమ్యూనిస్టులు విభ్నింగా కనిపించేవారు. 1960-70ల తరువాత కమ్యూనిస్టు ఉద్యమం బలహీన పడ్డాక సాంస్కృతిక, సామాజికోద్యమాల రూపురేఖల్లో మార్పులు వచ్చాయి. అక్కణ్నుంచి సాహిత్యంలో మూఢ నమ్మకాలకు పెద్దపీట వేయడం ప్రారంభమైంది. అభ్యుదయకరపాత్ర పోషించిన సినిమాలు, మీడియా స్వభావమే మారిపోయింది. కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడిన నేపథ్యంలో 1980 నాటికి కొన్ని కొత్త రకాల ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. అందులో దళితవాదం ఒకటి. ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితో అది పుట్టుకొచ్చింది. భూస్వాముల ఆధిపత్యాన్ని సవాల్‌ చేసి దళితల ఆత్మగౌరవాన్ని నిలబెడతామనే ఉద్దేశంతో పుట్టుకొచ్చిన ఉద్యమం అది. దాన్ని కమ్యూనిస్టు పార్టీ గుర్తించిందీ, గౌరవించింది. దానికి సంఘీభావమూ తెలిపింది. కానీ దళితవాదం మొత్తం ప్రజాస్వామిక ఉద్యమ స్రవంతి నుంచి వేరుపడి మేం వేరు, మిగతావాళ్లు వేరు, మిగతా సెక్షన్లతోనూ, మిగతా ప్రజలతో కలవం అనే అస్థిత్వవాదం వారిలో పుట్టుకొచ్చింది. అలాగే మహిళల్లో ఫెమినిజం పేరుతో ఒక అస్తిత్వ వాదం ముందుకొచ్చింది. ప్రాంతీయత కూడా ఒక అస్తిత్వవాదం. మా ప్రాంతం వేరు, మేం వేరు అనే వాదం దానిది. మా గురించి మాకు అర్థం అవుతుంది తప్ప ఇతరులు అర్ధం చేసుకోలేరు అనేది వివిధరకాల అస్థిత్వవాదాల సారాంశం. దళితవాదం భూస్వామ్య సంస్కృతితో పోరాడటానికి బదులుగా సమస్య నుండి తప్పించుకునే (ఎస్కేప్‌) దారులు వెతికింది. గుడిలోకి అందరినీ అనుమతించాలనేదాని కన్నా, నీళ్ల బావిలో తోడుకోడానికి అవకాశం ఇవ్వాలనే దాని కన్నా, ప్రభుత్వాల మద్దతుతో ప్రత్యేకంగా గుడులు కట్టించుకోవడం, బోర్లు వేయించుకోవడం, విడిగా స్కూళ్లు పెట్టించుకోవడం ద్వారా వివక్షను అధిగమించాలన్న ఆలోచనకు వచ్చారు. వ్యవసాయ దోపిడీ నుండి బయటపడటానికి సుదూర ప్రాంతాలకు వలసలు పోవడం ఆరంభమైంది. ఇలా భూస్వామ్య వ్యవస్థతో పోరాడటానికి బదులుగా దూరంగా పారిపోయే విధానాన్ని అనుసరించింది. అయినా మారిన సామాజిక పరిస్థితులలో దళితుల్లో వస్తున్న ప్రజాస్వామిక భావాలను సహించలేని భూస్వామ్యవర్గాలు దాడులకు తెగబడ్డాయి. కారంచేడు ఘటనతో దళిత ఉద్యమానికి కొత్త అస్థిత్వం వచ్చింది. అయితే ఈ అస్థిత్వవాదాల కారణంగా వర్గ ఐక్యత చెదిరిపోయింది. కమ్యూనిస్టుపార్టీ ప్రవేశపెట్టిన ఉమ్మడి సంస్కృతి దెబ్బతిన్నది. కులాలవారీ సాంస్కృతిక ఐక్యత ఏర్పడింది. అది ఉప కులాలకూ పాకింది. తద్వారా వర్గఐక్యతకు తూట్లు పడ్డాయి. అస్థిత్వవాదం ప్రారంభకాలంలో ముందుకొచ్చిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని గుర్తించి, దాన్ని అందిపుచ్చుకొని లీడ్‌ చేయడంలో కమ్యూనిస్టు పార్టీ వెనుకబడిపోయింది. 1980ల్లో దళిత ఉద్యమం ఒక అభ్యుదయకరమైన పాత్ర పోషించింది. 1990-2000 మధ్య ప్రపంచీకరణ కారణంగా దాని రూపురేఖలు మారిపోయాయి. ప్రపంచీకరణతో దళిత ఉద్యమాలు సమ్మిశ్రితం అయ్యే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ సహకారంతోనే సామాజికోద్యమాలు నడపాలి. ఏ ప్రభుత్వం అయితే సామాజిక వెనుకబాటుకు కారణమయ్యిందో, ఏ పాలకవర్గాలయితే భూస్వాములకు వత్తాసుగా నిలబడ్డారో వారి సహకారంతోనే సామాజికోద్యమాలు నడిపే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వారు తమ అస్థిత్వాన్ని వెదుక్కునే పనిలో పడ్డారు. ఇలాంటి స్థితిలో తిరిగి మరలా 2000 సంవత్సరం నుంచి సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకొచ్చి నాయకత్వం వహిస్తున్నది కమ్యూనిస్టు పార్టీయే. ఎక్కడ అన్యాయం, అక్రమాలు జరుగుతున్నా, వివక్ష పాటిస్తున్నా, అక్కడ వాలి తెగబడి పోరాడుతున్నది కమ్యూనిస్టు కార్యకర్తలే. 1980ల్లో వెనకబడినా, ఈ సంధి యుగంలో దాన్ని అందిపుచ్చుకొని నూతన అవగాహనతో కమ్యూనిస్టు పార్టీ ముందుకు తీసుకుపోతోంది. 1980ల్లో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఎన్‌టి రామారావు ముందుకొచ్చారు. దానికి మూలం కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యమే. వారి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అవమానించడం, తెలుగువారిని గుర్తించకపోవడం వల్ల అప్పుడా అస్థిత్వం ముందుకొచ్చింది. ఇందులో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి: కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించే రాజకీయ చైతన్యం ఉంది. రెండోది తెలుగువారి ఆత్మగౌరవాన్ని గుర్తించాలనే సాంస్కృతిక, సామాజిక వాంఛా ఇమిడి ఉంది. నాటి ప్రజాస్వామ్య ఉద్యమ స్ఫూర్తిలో వెంటనే కలవకపోయినా ఆ తరువాత భాగసామ్యం వహించింది కమ్యూనిస్టు పార్టీ. తెలుగువారిని కేంద్ర గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా కదిలించడంలో కమ్యూనిస్టుపార్టీ ముందుకొచ్చింది. అయితే తెలుగువారిని రెండు రాష్ట్రాలుగా విడగొట్టడంలో టిడిపి అవకాశవాద పాత్ర పోషించింది. తెలుగుదేశం ప్రారంభ దశలో ఎన్టీఆర్‌ మొదట అభివృద్ధికరమైన పాత్ర నిర్వహించినా ఆ తరువాత అది అభివృద్ధి నిరోధక పాత్రకు మారిపోయింది. ఎన్టీఆర్‌ చనిపోయాక అదే చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచబ్యాంక్‌కు తాకట్టుపెట్టాడు. మూడోది ప్రపంచీకరణ. సామాజిక, సాంస్కృతికోద్యమాలను పూర్తిగా తిరోగమింప చేయడం, ప్రతిదాన్నీ వాణిజ్యీకరించటం దీని లక్షణం. సాహిత్యం, కళలు, మీడియా, సినిమా, పెళ్లి, చావు, ఆఖరికి అవి నైతిక విలువలైనా, ప్రతిదాన్నీ వ్యాపారసరుకుగా మార్చింది. 'కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా కాదేదీ కవిత కనర్హం' అని శ్రీశ్రీ అన్నట్లుగా అమ్మడానికీ కొనడానికీ ఈ ప్రపంచీకరణలో అనర్హమైనదేమీలేదు. సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు చాలా మార్పులకు గురవుతున్నాయి. భాషా వికాసం చెందాలంటే ఆ జాతి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత పురోగమనం సాధిస్తుందో ఆ భాష అంత పురోభివృద్ధి సాధిస్తుంది. ఉదాహరణకు భాషా వికాసానికి 1980ల్లో ఈనాడు దినపత్రిక ముఖ్య పాత్ర నిర్వహించింది. జనం వాడుక భాషలో అది వార్తలనందించింది. ప్రత్యేకంగా స్థానిక వార్తలను ప్రవేశపెట్టింది. అంతకుముందు (1950-60ల్లో) అంతర్జాతీయ,జాతీయ వార్తల విషయంలో కమ్యూనిస్టులు మీడియాను ఎంతగానో ప్రభావితం చేశారు. అమెరికాలో ఏం జరుగుతోందో, రష్యాలో ఏంజరుగుతోందో మామూలు వ్యక్తి చెప్పగలిగాడంటే అది కమ్యూనిస్టు జర్నలిజం వల్లనే. వారి పత్రికల వల్లనే. కానీ ఈనాడు దినపత్రిక వార్తల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయి నుంచి వీధుల్లోకి తెచ్చింది. అది మంచి పనే. మన సమస్యలు, మన వీధి, మన ఇరుగు పొరుగు ఇలా. దాన్నే కమ్యూనిస్టు జర్నలిస్టులు కూడా అనుసరించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితేమిటి? ప్రతిదీ ప్రపంచీకరణ గురించే. ప్రపంచంలో జరిగే ప్రతి మార్పూ మనల్ని ప్రభావితం చేస్తోంది. ప్రపంచం గురించీ, దేశం గురించీ చెప్పకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ ఊరి గురించి నువ్వాలోచించుకో, దేశం గురించి నువ్వాలోచించొద్దు అంటే కళ్లున్న కబోదులమైపోవడమే. ఆరోజు ప్రగతిశీల పాత్ర నిర్వహించిన 'ఈనాడు' ఈ ప్రపంచీకరణ యుగంలో స్థానిక వార్తలకు ప్రాధాన్యతనిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వస్తున్న మార్పుల నుండి ప్రజలను దూరంగా ఉంచుతోంది. తద్వారా సామాజిక పురోగమనానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తోంది. సాధారణ భాషతో పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా భాషను ప్రజల దగ్గరకు తెచ్చిన ఈనాడు పాత్ర ఇప్పుడు ప్రతికూలంగా మారింది. ఈమధ్య కంప్యూటరును అంతర్జాలం అని రాస్తున్నారు. అంతర్జాలం అంటే అర్థమేమిటో తెలుసుకోవడానికి నిఘంటువును వెదకాలి. అంతర్జాలం అనే పదం సంస్కృతమా, పార్శీకమా, తమిళమా, మళయాలమా అని తెలుగువారు తెలుసుకోవడానికి చాలా కష్టపడాలి. అంతర్జాలం అనడం కన్నా కంప్యూటరు అంటే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. దీన్ని చాదస్తమందామా లేక వ్యవహారిక భాష అనాలా? గిడుగు రామ్మూర్తి పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు భాషా వికాసానికి ఎంతగానో పోరాడారు. వ్యవహారిక భాషా వ్యాప్తి కోసం వారు రాసిన పుస్తకాలు ఇప్పుడు చదివితే మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. కందుకూరి రాజశేఖర చరిత్ర నవల, గురజాడ కన్యాశుల్కం నాటకం చదివితే అప్పటికీ ఇప్పటికీ భాష చాలా మారిపోయిందని అర్థంమవుతుంది. కంప్యూటరును మనమే కనుక్కున్నామనుకోండి. దానికి అంతర్జాలం అని పేరు పెట్టామనుకోండి. దాన్ని ప్రపంచమంతా అంతర్జాలం అనే అంటుంది. మన భాష ప్రపంచ భాషగా మారిపోతుంది. అందుకే భాషా వికాసాభివృద్ధికీ, శాస్త్ర సాంకేతికాభివృద్ధికీ సంబంధం ఉంది. మనం శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందకుండా అన్నీ అమెరికా నుంచో, యూరోపు నుంచో దిగుమతి చేసుకుంటూ మన భాషలో వాటికి పేర్లు పెడితే మన పిల్లలు ఎలా అభివృద్ధి చెందుతారు? పిల్లలు అభివృద్ధి కావాలన్నా, మాతృభాషాభివృద్ధి కావాలన్నా కచ్ఛితంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అభివృద్ధి కావాలి. ఇప్పుడు 'మేకిన్‌ ఇండియా' అంటే మన డబ్బు పెట్టి అమెరికా నుంచి విడిభాగాలు కొని, వాటిని ఇక్కడ అసెంబ్లింగ్‌ చేయడమే. కారు పార్టులన్నీ అక్కడ కొంటాం. వాటిని ఇక్కడ కూర్పుచేసి కారును తయారు చేస్తాం. అది 'మేకిన్‌ ఇండియా' అయిపోతుంది. దానివల్ల శాస్త్ర సాంకేతికాభివృద్ధి రాదు. మనందరి దగ్గరా సెల్‌ ఫోన్లు ఉన్నాయి. దానిలో ఉండే చిన్న చిప్‌ను మనం ఇక్కడ తయారు చేసుకోలేం. ఒక వెబ్‌సైట్‌కు అవసరమైన సర్వర్లను నిర్వహించలేం. దీనికోసం అమెరికా మీదనో, యూరోపు మీదనో ఆధారపడాలి. మనం సర్వర్‌ అని అంటున్నాం. దానికేం పేరు పెట్టాలి? ఆ సర్వర్‌ అమెరికాలో ఉంటుంది. అదే సర్వర్‌ను మనం ఇక్కడ తయారు చేసుకుంటే ఒక తెలుగు పేరు పెట్టుకుంటే? మన తెలుగువాళ్లే ఇంజనీర్లు. తెలుగు ఇంజనీర్లయినా ఇంగ్లీషు పేరు పెట్టాల్సిందే. లేకపోతే వాళ్లకు అమెరికా జీతం రాల్చదు. అదే మన ప్రభుత్వం వాళ్లను ప్రోత్సహించి అవే సర్వర్లను, చిప్‌లను ఇక్కడ తయారు చేయించుకొని తెలుగు పేర్లు పెట్టుకుంటే అవి ప్రపంచవ్యాప్తం అవుతాయి. అప్పుడు తెలుగువారి కీర్తి ఖండఖండాంతరాలకూ వ్యాపిస్తుంది. ఈ రెంటి మధ్య సంబంధాన్ని విడదీయలేము. ఈ మధ్య హైదరాబాద్‌ వెళ్లినప్పుడు ఒక పాప టైం ఎంతయింది అని అడిగింది. పదయ్యిందని చెప్పా. అంటే ఎంతా అని అడిగింది. టెన్‌ అన్నా. ఓ అప్పుడే టెన్‌ ఓ క్లాక్‌ అయ్యిందా అన్నది. రాబోయే కాలంలో యువతరం తెలుగుభాష కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుందనీ, దాన్ని కమ్యూనిస్టులే లీడ్‌ చేస్తారనీ నాకనిపించింది. అలాంటి కొత్త పరిస్థితి ఈ రోజు తలెత్తుతోంది. ఇక భాషా వికాసంలోనూ ఛాందసత్వం ఉంది. కొన్ని సందర్భాల్లో కొత్త పదాలు పుట్టుకొని వస్తుంటాయి. ఉదాహరణకు జరీబు భూములంటున్నాం. ఇది ఉర్దూ పదం. మాగాణి అని అర్థం. ఉర్దూ పదాన్ని మన భాషలో భాగంగా చేసుకున్నాం. ఇటువంటివి వ్యవసాయ సంబంధమైన పదాలు ఉర్దూ నుండి తెలుగులోకి చాలానే వచ్చాయి. రెవెన్యూ పదజాలం కూడా ఎక్కువగా ఉర్దూలోనే ఉంటుంది. పహణీ వంటి పదాలు అందుకు ఉదాహరణ. ఇలా భాషా వికాసంలో వస్తున్న మార్పులను కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ప్రపంచీకరణలో వచ్చిన ముఖ్యమైన మార్పుల్లో జాతుల ప్రత్యేకతను గుర్తించకపోవడం ఒకటి. ఇంగ్లీషులో 'నేషనల్‌ స్టేట్‌' అంటారు. మన జాతీయోద్యమం కూడా దాని ఆధారంగానే నడిచింది. ఇప్పుడు సరిహద్దులు చెరిపేసి ప్రపంచం అంతా ఒకటే అంటున్నారు. ప్రపంచమంతా ఒకటి కావాలని కమ్యూనిస్టులు అందరికన్నా ముందు కోరుకున్నారు. కానీ కమ్యూనిస్టులు కోరుకున్నది వేరు, నేడు జరుగుతున్నది వేరు. ఇపుడు జరుగుతున్నది ప్రపంచ సరిహద్దులు చెరిపేసి అందరూ ఉమ్మడిగా ఒక ప్రపంచ రాజ్యాన్ని ఏలడం కాదు. అమెరికా ఆధిపత్యంలో ఉన్న సంపద్వంతమైన జాతులు కొన్ని ప్రపంచం మీద పెత్తనం చేస్తున్నాయి. వారు శాసిస్తారు. మనం అనుసరించాలి. ఆ రకంగా జాతుల నిర్మూలనకు దారితీసే ప్రమాదం కూడా ప్రపంచీకరణలో మనకు కనిపిస్తోంది. మతం పేరుతో పెద్ద అలజడి సృష్టిస్తున్నారు. మతాన్ని విషగుళికలుగా మార్చి, దానికి భక్తి అనే తీపి ముసుగు తొడిగి సమాజంపై చల్లారు. జనానికి మత్తెక్కించి చీలగొట్టారు. వారిలో వారికి తగాదాలు పెట్టారు. పెత్తందారీ వర్గాలను అందలమెక్కించారు. బలపరచారు. దేవుడు ఉద్యమాలకు కానీ, సమాజాభివృద్ధికిగానీ ఎప్పుడూ అడ్డం రాలేదు. దేవుని పేరు చెప్పుకునే మనుషులు అడ్డం వచ్చారు. లాటిన్‌ అమెరికాలోని పరిణామాలు చూస్తే, వారి సహజ సంపదను అమెరికా వాళ్లు దోచుకుపోతుంటే, వాళ్లను అణిచిపెట్టి బికారులను చేస్తుంటే దానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రజలతోపాటు క్యాథలిక్కులు, క్రిష్టియన్లు, థియాలజిస్టులు కూడా కలిసి వచ్చారు. మత పెద్దలు కలిసి వచ్చారు. ఈ రోజు వాటికన్‌ సిటీకి పోప్‌ ప్రాన్సిస్‌ అధినేతగా ఉన్నాడు. ఆయనీరోజు పేదల గురించి మాట్లాడుతున్న పాపానికి 'మార్క్సిస్ట్‌ పోప్‌' అంటున్నారు. ప్రజల ఒత్తిడి వల్ల కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితుల వల్ల కావచ్చు, ఈనాడు మతం అక్కడ సానుకూల పాత్ర పోషిస్తోంది. కానీ ఈరోజు మన దేశంలో మతం ప్రతికూల పాత్ర పోషిస్తోంది. మతం పేరుతో మతో న్మాదాన్ని ప్రేరేపిస్తున్నారు. భారతీయులు అంటే హిందువులు మాత్రమే అంటున్నారు. మన పురాణాల్లో, రామాయణ, భారతాల్లో హిందూ అనే పదం ఎక్కడా కనపడదు. భరత వర్షే, భరత ఖండే అన్నారు తప్ప హిందూ దేశే, హిందూ ఖండే, హిందూ వర్షే అని ఎక్కడా అనలేదు . హిందూ అన్నది విదేశీయులు పెట్టిన పేరు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌, హిందువులు ప్రార్థన చేయడం ముస్లింలు వచ్చాకే నేర్చుకున్నారని చెబుతున్నాడు. ఇన్నాళ్లకు ఆయనకు రియలైజేషన్‌ వచ్చింది. దీనర్థం ప్రార్థన చేయడం అన్నదే మనకు తెలియదని అంగీకరించడమేగా కదా! కనీసం ముస్లింల నుంచి హిందువులు నేర్చుకున్నారనే సత్యాన్నయినా గ్రహించాడు. మోడీ కుర్తా, పైజామా, కోటు ధరిస్తున్నాడు. అది హిందువుల డ్రస్సా? పురాణాల్లో ఉందా? మొఘలాయిలు తెచ్చిన డ్రస్సు అది. మోడీ ఎలా ధరిస్తున్నాడు? దళితుల అంటరానితనాన్ని ముస్లింలు తీసుకువచ్చారట. అంతకుముందు అంటరానితనం లేదట. ఎవరైనా నవ్వుతారు. అంటే మొత్తం చరిత్రను వక్రీకరించి, చెడును ముస్లింలకు ఆపాదించి దళితులకూ, ముస్లింలకూ తగాదాలు పెడుతున్నారు. డిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో చాలా చోట్ల జరుగుతున్న మతఘర్షణలు మనం చూస్తున్నాం. ఈరోజు మత ఘర్షణలన్నింటిలో దళితులను ముస్లింల మీదకు మళ్లిస్తున్నారు. గుడి దగ్గరో, గోపురం దగ్గరో, ప్రేమ దగ్గరో, పెళ్లి దగ్గరో తగాదా సృష్టించి ముస్లింల మీదకు రెచ్చగొడుతున్నారు. ఆ రకంగా వారిని బలిపశువులను చేస్తున్నారు. మనవారి మధ్య తగాదా పెట్టి, ఒకగౄపును ఆయుధంగా మార్చి మనవారిమీదే ప్రయోగిస్తున్నారు. ఇదే గుజరాత్‌ నమూనా. అనేక రకాల పండుగలు జరుగుతున్నాయి. ఈ పండుగల్లో కూడా జాతీయమైనవీ, మత సంబంధమైనవీ, స్థానికంగా ఉండేవీ, ప్రకృతి పరమైనవీ, పంటలు చేతికొచ్చే కాలంలో వచ్చేవీ ఉన్నాయి. పండుగలన్నీ మూడనమ్మకాలని, పనికిరానివీ అని ఒకే గాటన కట్టలేం. ఒకప్పుడు 1950ల్లో పండగొస్తే కమ్యూనిస్టులు ప్రభలు కట్టి అభ్యుదయ పాటలు పాడుకుంటూ తిరుణాళ్లు, జాతర్లలో పాల్గొనేవారు. ఆరోజు అభ్యుదయ గీతాలు కూడా పండుగల్లో భాగమై పోయాయి. సంక్రాంతి వస్తే ఆటలపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. ఊరుఊరంతా పండుగ వాతావరణం వచ్చేది. అలాంటి ఒక ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని పండుగలతో మమేకం చేసి నిర్మించింది కమ్యూనిస్టు ఉద్యమం. మరలా అలాంటి సాంస్కృతికోద్యమాన్ని బీజం తొడిగి నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేడే ఉంది. అది కార్మికుల పండుగ. జెండా ఎగురవేసి డప్పుకొట్టి నినాదాలిస్తేనే పండుగకాదు. ప్రతి ఇంట్లో దీపం వెలిగించవచ్చు. జెండా ఎగురవేయవచ్చు. అదొక ఉమ్మడి పోరాట ప్రతిజ్ఞాదినం. ప్రజా పండుగ. కార్మికుల పర్వదినం. ఓ ప్రమాణం స్వీకరించే దినంగా భావించాలనుకుంటే అప్పుడు కొత్త వెల్లువ, కొత్త సంస్కృతి వచ్చేస్తుంది. ఈ రోజు ప్రపంచీకరణ వాణిజ్యీకరణగా మారింది. సాంస్కృతిక రంగంలో ప్రజలకుండే జాగా క్రమంగా తగ్గిపోతోంది. ఇంతకుముందు పిల్లలను పార్కులకు తీసుకొని వెళ్లి అలా తిప్పి తీసుకువచ్చేవాళ్లు. పార్కుల్లోకి పోవాలంటే అప్పుడు ఉచితం. కానీ ఇప్పుడు పార్కులకు పోవాలంటే ఫీజు కట్టాలి. ఫీజు కన్నా మించిన పెద్ద ఖర్చుంది. పార్కు మొత్తం ఇప్పుడో కమ్మర్షియల్‌ మాల్‌ అయిపోయింది. అన్నీ రకాల షాపులు ఉంటాయి. అక్కడ రకరకాల వస్తువులు అమ్ముతారు. అయితే పిల్లలను తీసుకుపోయినప్పుడు వెంట ఒక ఆటం బాంబును పట్టుకుపోయినట్లే. వెయ్యో, రెండు వేలో తీసుకుపోతేనే పిల్లలను సంతృప్తిపరచగలం. లేకుంటే లేదు. అటువంటి చోటకు పోయి ఏం చేస్తాం? కాబట్టి పార్కులకు పోయే సమస్య లేదు. మరి ఓ ఉయ్యాల లేకుండా, ఓ జారుడు బండ లేకుండా పిల్లల వికాసం ఏమిటి? గ్రామాల్లో కూడా కోతికొమ్మచ్చాటలు, బిళ్లంగోడులు కనిపించడం లేదు. వినోదాల కోసం పట్నాలకు పోతున్నారు. స్కూలు బస్సే పిల్లలకు ఆటస్థలంగా మారిపోయింది. 24 గంటలూ తోమి వారిని మర మనుషులుగా మార్చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది? అప్పుడు ఆ జాతి ఎలా ఉంటుంది? ఒక భౌతికపరమైన, మానసికపరమైన వికాసంలేని జాతి రాబోయే కాలంలో ఎలా ఉంటుంది? సాంస్కృతిక శూన్యం ఏర్పడుతుంది. ఇది భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమానికి పెద్ద సవాల్‌గా మారుతుంది. టర్కీలో పార్కుల కోసం పెద్ద ఉద్యమం నడిచింది. కమ్యూనిటీ హాలు కోసం కేటాయించిన స్థలంలో పెద్ద మాల్‌ కట్టబోతుంటే మాకు ఈమాల్‌ వద్దని ప్రజలు తిరుగుబాటుచేశారు. అది ప్రభుత్వాన్ని గడగడలాడించిన పెద్ద ఉద్యమంగా మారింది. ఇటువంటి ఉద్యమాలు ప్రపంచమంతా నడుస్తున్నాయి. మన దేశంలోనూ ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, బొంబాయిల్లో ఇలాంటి ఉద్యమాలు నడుస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఇటువంటివి అనేకమైనవి ప్రతిదీ డబ్బుతో ముడిపడిపోతాయి. పార్కుకు పోయినా డబ్బు. సినిమాకు పోయినా డబ్బే. కానీ సినిమాకు పోయినట్లు ఉండదు. మాల్‌కు పోయినట్లు ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లినా, రైల్వే స్టేషన్‌కు పోయినా కమ్మర్షియల్‌ మాల్స్‌కు పోయినట్లుంటుంది. దానికి డబ్బు కావాలి. అందుకే మోడీ ధన్‌జన్‌ యోజన ప్రవేశపెట్టాడు. జన్‌ధన్‌ యోజన కింద ఐదు వేల రూపాయలు ఓవర్‌డ్రాప్ట్‌ ఇస్తాడట. అంటే అప్పు తీసుకో. అనుభవించి, దివాళా ఎత్తు. ఎవరైనా ప్రజల ఆదాయాలు పెంచడానికి ప్రభుత్వం మార్గాలు చూపాలి. పథకాలు పెట్టాలి. కానీ జన్‌ధన్‌ యోజన ప్రజలను అప్పులపాలు చేసే పథకం. ఈ పథకాన్నిపెట్టి నాది ఘన విజయం అని చెబితే ఉపయోగమేమిటి? ఈ ఐదు వేలు దేనికి పనికి వస్తాయి? ఏమైనా ఒక వ్యాపారం పెట్టుకోవడానికి పనికి వస్తుందా? ఏదో ఒకటి కొనుక్కోవడానికి మాత్రమే పనికి వస్తుంది. కొనుకున్న తరువాత మళ్లీ ఎలా తీర్చాలి? వారు కట్టలేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే పెద్ద వాళ్లు లక్షల కోట్లు ఎగవేశాక వీరి ఐదువేలు పోతే పోయిందిలే మాఫీ చేస్తామంటారు. ఎందుకంటే జనాన్ని అవినీతిపరుల్ని చేస్తేనే కదా వారి అవినీతి కూడా మూడుపువ్వులు,ఆరుకాయలుగా వర్ధిల్లేది. కాబట్టి ఈ రకమైన సాంస్కృతిక శూన్యత రాబోయే రోజుల్లో పెరగబోతున్నది. ఇప్పుడు భాష గురించి చెప్పుకున్నాం. భాషల్లో చాలా భాషల గురించి చెప్పారు రవిబాబుగారు. ఓ కొత్త భాష వచ్చింది. అది రాజకీయ భాష. రాజకీయ సంస్కృతి మాదిరిగానే రాజకీయ భాష కూడా. ఈ రాజకీయ భాష ప్రత్యేకత ఏమిటంటే వారుచెప్పేది జనానికి అర్థమయినట్లే ఉంటుంది కానీ అర్థం కాదు. అంటే అస్పష్టంగా ఉంటుంది. ఇచ్చినట్లే ఉంటుంది. నేను చెప్పానా ఆమాట అంటాడు. అప్పులు రద్దు చేస్తానంటాడు. రూ.పదివేలు కూడా రద్దు కాలేదు అని రైతులు అడిగితే అప్పులన్నీ రద్దు చేస్తానని చెప్పానా అంటాడు. అదన్నమాట రాజకీయ భాష అంటే. తిమ్మిని బమ్మిని చేసి, బమ్మిని తిమ్మిని చేసి నెత్తిమీద పదిపైసలు పెట్టి నిన్ను పావలాకు అమ్మేస్తామని చెప్పే మాటలు ఇక్కడున్న భాషా పండితులు, సాహితీవేత్తలు రాజకీయ నాయకుల వద్ద, మోడీ దగ్గర, చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలి. ప్రజలను మోసం చేసి, వంచన చేసే నయవంచక భాష ఒకటి రాజకీయ రంగంలో ప్రవేశపెట్టారు. సాహిత్య రంగంలో దీన్ని కూడా చీల్చి చెండాడాలి. ఒక కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతి రావాల్సి ఉంది. కేజ్రీవాల్‌ కూడా అదే చెబుతున్నారు. విఐపి కల్చర్‌ వద్దు. అవినీతి లేని రాజ్యం రావాలి. గుడ్‌గవర్నెస్‌- అంటే మంచి పాలన కావాలి. అంటే కష్టం లేకుండా పైసా ఖర్చు లేకుండా ప్రజలకు సర్టిఫికెట్లు వచ్చేయాలి. ఆసుపత్రికి పోతే వెంటనే పనికావాలి. స్కూల్లో వెంటనే సీటు కావాలి. ఇవన్నీ మంచి ఆశయాలే. కమ్యూనిస్టులు కోరుకునేవి కూడా ఇవే. వామపక్షాలు అధికారంలో ఉన్నచోట ఎవరికన్నా బాగా వీటిని అమలు చేస్తున్నారు. కానీ ఒకటే తేడా. ఈ వ్యవస్థను ఇలా ఉంచి దీనినే సంస్కరించి అన్నీ సమృద్ధిగా సమకూర్చి పెడతానని కేజ్రీవాల్‌ అంటున్నారు. ఈ వ్యవస్థను ఇలాగే ఉంచి అన్నీ సమకూర్చాలంటే అసాధ్యం. అన్ని సౌకర్యాలూ సమకూరాలంటే వ్యవస్థను సమూలంగా పునర్నిర్మించి కొత్త వ్యవస్థను నిర్మిస్తేనే సాధ్యమవుతుందని కమ్యూనిస్టులు చెబుతున్నారు. తక్షణం భారాలకు వ్యతిరేకంగానో, కాలేజీల్లో ఫీజుల పెంపుకు వ్యతిరేకంగానో, ఆసుపత్రిల్లో వైద్యం కోసమో, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు కల్పించాలనో, సబ్సిడీల కోసమో పోరాడుతూనే ప్రజలను కదిలించి, సమూల మార్పుల కోసం పెద్ద ఉద్యమాలు నిర్మిస్తే, దానికో రాజకీయ రూపమిస్తే అప్పుడు ఈ సమాజాన్ని మార్చొచ్చు. ఈ మధ్య హైదరాబాద్‌లో పార్టీ ఇంటింటికీ వెళ్లి ఓ సర్వే నిర్వహించినప్పుడు 30 ఏళ్లలోపు యువకుల్లోలో ఒక ధోరణి కనిపించింది. అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీ గురించి వారికి తెలియదు. అందులో రాజకీయాలు మాకనవసరం. అన్ని పార్టీలూ ఒకటే. కమ్యూనిస్టు పార్టీ కూడా అందులో ఒకటి. 40, 50 ఏళ్ల వాళ్లలో కమ్యూనిస్టు వ్యతిరేకత ఉంది. (సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన దాని ప్రభావం వారి మీద ఉంటుంది ). అందుకని కమ్యూనిస్టులంటే కొంత ద్వేషం ఉంటుంది. కానీ యువకుల్లో కమ్యూనిస్టులంటే ద్వేషం లేదు. రాజకీయాలంటేనే వ్యతిరేకం. రాజకీయాలకు వ్యతిరేకమంటే కమ్యూనిస్టు పార్టీ కూడా రాజకీయ పార్టీ కాబట్టి ఆ వ్యతిరేకత వచ్చింది. మీరేదన్నా మాకోసం పని చేయండి. నచ్చితే నిధులిస్తాం అన్నవాళ్లున్నారు. రాజకీయాలంటే తెలియకపోయినా, రాజకీయాలంటే వ్యతిరేకత ఉన్నా, కమ్యూనిస్టు పార్టీ ఈ కొత్త తరంలో పనిచేస్తే అభివృద్ధి అయితీరుతుంది. ఈ తరంలో కమ్యూనిస్టు వ్యతిరేకత లేదు. అలాగని సానుకూలత వుందని కాదు. దాన్ని సృష్టించుకోవాలి. రాబోయే కాలంలో నిరుద్యోగం విపరీతంగా పెరగబోతోంది. కంప్యూటర్‌ ఉద్యోగాలు వస్తాయి అని యువ ఇంజనీర్లు ఆశగా ఎదురు చూస్తుంటే నాస్‌కాం 16 శాతం ఉద్యోగాలు పడిపోతాయని ప్రకటించింది. ఇప్పటికే చాల కంపెనీల్లో రిట్రెంచ్‌మెంట్లు చేసేస్తున్నారు. 25 వేల ఉద్యోగులను తొలగించి 5 వేల కొత్త ఉద్యోగాలు మాత్రమే ఇస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగంవల్ల యువకుల్లో నిస్పృహ వస్తుంది. దానికి నమూనానే మోడీ వేవ్‌, డిల్లీలో కేజ్రీవాల్‌ వేవ్‌ వచ్చాయి. ఇది శాశ్వతం అనుకుంటే పొరబాటు. ఈ తరంలో ఉన్న ముఖ్యమైన లక్షణం ఏమిటంటే తక్షణ ఫలితాలను కోరుతున్నారు. వెంటనే మాకు ఫలితం కావాలి. ఎక్కడకు పోయినా అంతేకదా. ఇంతకుముందు కేథలాబ్‌కు వెళ్లి బ్లడ్‌ ఇచ్చి వచ్చేవాళ్లమనుకోండి. మూడు రోజుల తరువాత రమ్మంటారు. ఈ రోజుల్లో కంప్యూటర్‌ ద్వారా గంటలో అయిపోతోంది. ఆ ప్రభావం యువకులపైన కూడా ఉంటుంది. అందుకని ఏడాదిలో రెండేళ్లలో వారు అనుకున్నది నెరవేర్చకపోతే, మోడీనీ, క్రేజీవాల్‌ను ఎంత ఎత్తుకు లేపారో అంత ఎత్తునుంచీ పడేస్తారు. అప్పుడు ప్రజలకు ఒక రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం అవుతుంది. కేజ్రీవాల్‌ కొత్త ట్రెండ్‌ను సృష్టించాడు. క్షేత్రస్థాయిలో ప్రజలను కదిలించి వారిలో పనిచేశాడు. అవినీతిలేని రాజ్యాన్ని అందిస్తానన్నాడు. ఆశయం మంచిదే. అతడు నిజాయితీపరుడే. కానీ ప్రభుత్వ అధికారాలు చాలా తక్కువగా ఉన్న ఢిల్లీ వంటి చోట అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందా? సాధ్యం కానప్పుడు యువకులు ఎలా ఆలోచిస్తారు? ఆయనను ప్రశ్నిస్తే సమాధానం ఏమని చెబుతారు? రాబోయే కాలంలో ఇలాంటి ప్రశ్నలకు మోడీ అయినా, కేజ్రీవాల్‌ అయినా సమాధానాలు చెప్పాలి. రాబోయే కాలంలో ఓ రాజకీయ శూన్యత కూడా ఏర్పడబోతోంది. దీన్ని భర్తీ చేయడంపైనే భారతదేశ, ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కొత్త రాజకీయ సంస్కృతిని కమ్యూనిస్టు పార్టీ ప్రజల ముందుకు తీసుకువచ్చి జాతి వికాసం కోసం, భాషా వికాసం కోసం, సామాజిక న్యాయం కోసం, సామాజిక వికాసం కోసం, సామాజిక మార్పు కోసం పోరాడేందుకు ఈ తరాన్ని ముందుకు నడిపించాలి. 1950ల్లో ఏ చరిత్రనయితే సృష్టించి మొత్తం ఆంధ్రదేశాన్ని ప్రభావితం చేసి, అధికారంలో లేకపోయినా ఒక ట్రెండ్‌ను సృష్టించిందో ఆ విధంగానే రాబోయే కాలంలో కూడా మరలా ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టించడానికి కమ్యూనిస్టు ఉద్యమం పూనుకోవాలి.
Google Doodle Honours Ludwig Guttmann : లుడ్విగ్ గుట్మాన్, గూగుల్ డూడుల్: 1948 లో, అతను వీల్ చైర్ వినియోగదారుల కోసం ఒక విలువిద్య పోటీని నిర్వహించాడు, తరువాత దీనిని “స్టోక్ మాండెవిల్లే గేమ్స్” అని పిలుస్తారు, అది పారాలింపిక్ క్రీడలుగా ఉద్భవించింది. పారాలింపిక్ ఉద్యమాన్ని స్థాపించిన సర్ లుడ్విగ్ గుట్మాన్ ను గూగుల్ తన 122 వ జయంతి సందర్భంగా శనివారం డూడుల్ తో సత్కరించింది. బాల్టిమోర్‌కు చెందిన అతిథి కళాకారుడు అశాంతి ఫోర్ట్‌సన్ ఈ దృష్టాంతాన్ని రూపొందించారు. పారాలింపిక్ ఉద్యమ వ్యవస్థాపకుడు యూదు, జర్మన్-జన్మించిన బ్రిటిష్ న్యూరాలజిస్ట్ ప్రొఫెసర్ సర్ లుడ్విగ్ “పోప్పా” గుట్మాన్ 122 వ పుట్టినరోజును ఈ డూడుల్ జరుపుకుంటుంది “అని గూగుల్ డూడుల్ వెబ్‌సైట్ తెలిపింది. గుట్మాన్ జూలై 3, 1899 న జర్మనీలోని టోస్ట్లో జన్మించాడు, ఇది ఇప్పుడు పోలాండ్ క్రిందకు వచ్చింది. నాజీ పాలనలో యూదులపై పెరుగుతున్న హింసల నేపథ్యంలో అతను జర్మనీని విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో జర్మనీలో అగ్రశ్రేణి న్యూరో సర్జన్లలో ఒకరైన గుట్మాన్ తన కుటుంబంతో కలిసి 1939 లో ఇంగ్లాండ్ పారిపోయాడు. Google Honours Ludwig Guttmann : 1948 లో స్టోక్ మాండెవిల్లే హాస్పిటల్‌లో వెన్నెముక గాయాల విభాగానికి అధిపతిగా, వీల్‌చైర్ వినియోగదారుల కోసం విలువిద్య పోటీని నిర్వహించారు, తరువాత దీనిని “స్టోక్ మాండెవిల్లే గేమ్స్” అని పిలుస్తారు, క్రీడలకు వైకల్యం యొక్క అడ్డంకులను విచ్ఛిన్నం చేసింది. ఇది తరువాత పారాలింపిక్ క్రీడలుగా పరిణామం చెందింది. ప్రపంచ దృష్టితో, స్టోక్ మాండెవిల్లే గేమ్స్ 1960 లో అంతర్జాతీయంగా వెళ్ళింది మరియు ప్రపంచవ్యాప్తంగా 400 మంది వికలాంగులు పాల్గొన్నారు.
గేమ్‌ ఆడరాని వాళ్లు కూడా ఇలా నా గురించి మాట్లాడుతుంటే కామెడీగా ఉందని రెచ్చగొట్టేలా మాట్లాడారు జక్కన్న. ఇది విన్న చంటి, రాజశేఖర్‌ ఫైర్‌ అయ్యాడు. Aithagoni Raju First Published Sep 29, 2022, 11:41 PM IST బిగ్‌ బాస్‌ తెలుగు 6లో 25వ రోజు కెప్టెన్సీ టాస్క్ పూర్తయ్యింది. `హోటల్ వర్సెస్ హోటల్` టాస్క్ లో విన్నర్‌గా నిలిచి కెప్టెన్సీ పోటీలో ఉన్న వారి మధ్య మరో టాస్క్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. కెప్టెన్సీ టాస్క్ లో ఉన్న వారి ఫోటోలను గార్డెన్ ఏరియాలో బోర్డ్ లకు పెట్టారు. మధ్యలో టేబుల్‌పై బాక్సింగ్‌ బ్లౌజ్‌ ఉంటుంది. బిగ్‌ బాస్‌ బజర్‌ మోగగానే అందరు పరిగెత్తి ముందుగా ఆ బ్లౌజ్‌ని పట్టుకుంటే వారు.. బోర్డ్ లపై ఉన్నవారిలో ఒకరిని ఎలిమినేట్‌ చేయొచ్చు. వారు కెప్టెన్సీకి అర్హుల కాకుండా పోతారు. అయితే తగిన కారణంగా ఆ ఫోటోని బ్రేక్‌ చేయాల్సి ఉంటుంది. మొదట రేవంత్‌ బ్లౌజ్‌ అందుకుని రాజ్‌ ఫోటోని బ్రేక్‌ చేశాడు. ఆ తర్వాత సూర్య దాన్ని సాధించి వసంతి ఫోటోని బ్రేక్‌ చేశాడు. ఆది రెడ్డి సాధించి అర్జున్‌ని బ్రేక్‌ చేశాడు. బాలాదిత.. ఫైమాని, చంటి.. గీతూని బ్రేక్‌ చేసింది. ఇక్కడే గేమ్‌ హీటెక్కింది. చంటి తన ఫోటోని బ్రేక్‌ చేయడంతో మండిపోయిన గీతూ ఫైర్‌ అవుతూ హాట్‌ కామెంట్‌ చేసింది. గేమ్‌ ఆడరాని వాళ్లు కూడా ఇలా నా గురించి మాట్లాడుతుంటే కామెడీగా ఉందని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఆమె బాత్‌ రూమ్‌లోకి వెళ్లిపోయింది. ఇది విన్న చంటి ఫైర్‌ అయ్యాడు. గేమ్ ఆడరాదా? ఏ గేమ్ అంటూ మండి పడ్డాడు. బిగ్‌ బాగ్‌ ఇచ్చేవే గేమ్‌లు అనుకుంటున్నావని, నీకు తెలిసింది షెటాక్‌, దాన్నే ఎంతో పెద్దగా అనుకుంటున్నావ్‌ అని గట్టిగా కౌంటర్‌ ఇచ్చాడు. దీన్నే ప్రోవోకింగ్‌(రెచ్చగొట్టడం) అంటూ, దా కొట్టుకుందాం, చాలా రోజులవుతుంది కొట్టుకోకా అంటూ తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయాడు చంటి. దీంతో ఇద్దరి మధ్య హాట్‌ హాట్‌ గా వాగ్వాదం జరిగింది. ఇదే ఈ ఎపిసోడ్‌కి హైలైట్‌గా నిలిచింది. అంతకు ముందు ఆదిరెడ్డి.. గీతూకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నానని, అందుకే తాను తనని బ్రేక్ చేయడం లేదని తెలిపాడు. అనంతరం గార్డెన్‌లో కూర్చొని ముచ్చటిస్తుండగా, పక్కకు వచ్చిన గీతూ.. ఆది రెడ్డి చెవి వద్ద వాగుతా ఉంటుంది. దీంతో మండిపోయిన ఆదిరెడ్డి ఒక్కసారిగా ఫైర్‌ అయ్యాడు. తప్పు చేశా బిగ్‌ బాస్. మరో ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్‌ గీత గువ్వ పగలగొడతాను. పక్కని చేసి ఓవాగుతా ఉందని వాపోయాడు. ఇది నవ్వులు పూయించింది. దీనికంటే ముందు సింగర్‌ రేవంత్‌ భార్య సీమంతం జరిగిన వీడియోని చూపించారు బిగ్‌బాస్‌. రేవంత్‌కి ప్రత్యేకంగా ఈ వీడియోని చూపించాడు. సీమంతం జరుగుతున్న వీడియోనిచూసి రేవంత్ భావోద్వేగానికి గురయ్యాడు. భార్యతో లేనందుకు బాధపడ్డాడు. తాను కష్టపడి ఆడి కప్‌ గెలుచుకుని డెలివరి అయ్యాక ఈ గిఫ్ట్ ఇస్తానని తెలిపాడు. సీమంతం సదర్భంగా తాను కూడా కొన్ని పళ్లు ప్యాక్‌ చేసి భార్యకి పంపించాడు రేవంత్‌.
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. తెలుగులో ఈ సినిమా “బ్రహ్మస్త్రం” పేరుతో రిలీజ్ కానుంది. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. 09.09.2022న రిలీజ్ కానున్న తరుణంలో అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర గురించి తెలిపిన వివ‌రాలు బ్రహ్మస్త్ర సినిమాతో మీరు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు.? బ్రహ్మస్త్ర సినిమా ద్వారా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక ఫాంటసీ ఫిలిం చెయ్యాలనుకున్నపుడు నన్ను చాలా విషయాలు ఇన్స్పైర్ చేసాయి. మనదేశంలో ఉన్న సంస్కృతి , పురాణాలు , గొప్ప కథలను డైరెక్ట్ గా చెప్పకుండా నా పద్ధతిలో చూపించాను. మీరు ఈ సినిమాను చూస్తున్నప్పుడు మన భారతదేశం యొక్క సోల్ , అలానే ఆధ్యాత్మికతను కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. బ్రహ్మస్త్రలో అమితాబ్ బచ్చన్ , అలియా భట్ , నాగార్జున లాంటి నటులు మీ సెలెక్షనా.? నిజంగా చెప్పాలంటే కథను రాసుకున్నప్పుడే ఈ పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ , ఈ పాత్ర కోసం అలియా, అలానే ఈ పాత్ర కోసం నాగార్జున గారు కావాలి అనుకున్నాము. ఆయనకు కథను చెప్పాము, ఆయనకు బాగా నచ్చింది.ఈ పాత్రకు నాగార్జున గారు పర్ఫెక్ట్ అనిపించింది. బ్రహ్మాస్త్ర చూస్తున్నప్పుడు ఇది మన సినిమా అనే అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాను మీరు మోడ్రన్ మైథాలజీ అని ఎలా చెప్తారు.? ఈ సినిమా మోడ్రన్ ఇండియా 2022 లో జరుగుతుంది. అంటే ఇది ప్రస్తుత సినిమానే , బ్రహ్మాస్త్ర అనే టైటిల్ వినగానే కొంతమంది ఇది పీరియాడిక్ ఫిలిం అనుకుంటారు. కానీ కథ మాత్రం మోడరన్ ఫిలిం, ఈ సినిమాకి ఇన్స్పెరేషన్ ఇండియన్ మైథాలజీ. అందుకే దీనిని మోడరన్ మైథలాజి అని చెప్పాను. మూడు భాగాలుగా రానున్న బ్రహ్మాస్త్ర లో ఫస్ట్ పార్ట్ గా శివ తీసుకోవడానికి కారణం.? వాస్తవంగా చెప్పాలంటే నిజంగా కనెక్షన్ అంటూ ఏమి లేదు. లార్డ్ శివ కి దేనినైనా సృష్టించడమే కాదు. తన మూడవ కన్నును తెరిస్తే దేనినైనా నాశనం చేసే శక్తీ కూడా ఉంది. ఈ కాన్సెప్ట్ లో బ్రహ్మాస్త్ర పవర్ ను ఎవరు కంట్రోల్ చెయ్యలేరు. మన పురాణాల్లో చాలామంది సూపర్ హీరోస్ ఉన్నారు, మీరు ముందుగా భారతీయ సినిమాకు వాళ్ళను పరిచయం చేస్తున్నారు. కానీ ఎందుకు ఇంత లేట్ అయింది.? నాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు చాలా త్వరగా చేసేయాలి అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు 10, 20 సంవత్సరాల క్రితం రాసిన కామిక్ బుక్స్ ఆధారంగా తీసినవే. వాటితోనే అంత కంటెంట్ క్రియేట్ చేసి ఆదరణ పొందినప్పుడు. ఎన్నో గొప్ప గొప్ప కథలు, పురాణ ఇతిహాసాలు ఉన్న మన భారతీయ చరిత్రను యధార్ధంగా ఎందుకు చూపించలేము అనిపించింది. 2011 లో నాకు ఈ ఆలోచన వచ్చింది అలానే అప్పటినుండి ఇప్పటివరకు టెక్నాలిజీ కూడా బాగా డెవలప్ అయింది. అది కూడా కొంతవరకు కలిసొచ్చింది. అని చెప్తూ పలు ఆసక్తకరవిషయాలను ముచ్చటించారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని 09.09.2022న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
వైసీపీ మ‌హిళా నేత‌, అర‌కు పార్ల‌మెంటు స‌భ్యురాలు గొడ్డేటి మాధ‌వి త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో 'గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం' కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో కారు వెళ్ల‌లేని గ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ గ్రామాల‌కు కూడా చేరుకుంటున్న ఆమె జ‌నంతో మ‌మేక‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో సాధ్యమైనంత దూరం కారులోనే వెళుతున్న ఆమె... కారు వెళ్ల‌లేని ప్రాంతాల‌కు ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో చేరుకుంటున్నారు. కొండ‌లు, గు‌ట్ట‌లు ఉన్న ప్రాంతాల్లో స్కూటీపై వెళుతున్నారు. స్కూటీ కూడా వెళ్ల‌ని చోట్ల‌కు న‌డుచుకుంటూ వెళుతున్నారు. ఈ మేర‌కు అర‌కు నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని డుంబ్రిగూడ మండలం కించుమండ గ్రామపంచాయతీని సంద‌ర్శించిన సంద‌ర్భంగా ఆమె కొంత దూరం కారులో వ‌చ్చి... అక్క‌డి నుంచి స్కూటీని న‌డుపుకుంటూ మ‌రికొంత దూరం వెళ్లి... ఆపై న‌డుచుకుంటూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. YSRCP Araku MP Madhavi Goddeti Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?..... We are here for YOU: Team ap7am.com
నాజీవనయానంలో పలువురు ప్రముఖులను కలుసుకున్నాను. విద్వజ్ఞులు, సాహితీవేత్తలు, కళాభిజ్ఞులు, క్రీడాకారులు, వైజ్ఞానికులు, వ్యవస్థా నిర్మాణ దక్షులు, రాజకీయ నాయకులు, ప్రజాహిత క్రియాశీలురుగా.. అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 నాజీవనయానంలో పలువురు ప్రముఖులను కలుసుకున్నాను. విద్వజ్ఞులు, సాహితీవేత్తలు, కళాభిజ్ఞులు, క్రీడాకారులు, వైజ్ఞానికులు, వ్యవస్థా నిర్మాణ దక్షులు, రాజకీయ నాయకులు, ప్రజాహిత క్రియాశీలురుగా తమను తాము ప్రసిద్ధపరచుకున్న వారెందరో నాకు సుపరిచితులు. తమకొక విశిష్ట ప్రాధాన్యమున్నదని విశ్వసించని వ్యక్తి వారిలో ఒక్కరూ లేరు. జీవితంలో తమ పురోగతి గురించి వారిలో కొంతమంది చాలా గొప్పగా చెప్పుకోవడం కద్దు. మరికొంత మంది వినయంగానే ప్రగల్భాలకు పోతారు లేదా ఇతరులను తక్కువ చేసి మాట్లాడతారు. మీరు కలిసిన తొలిసారే తమ స్వీయ ప్రాముఖ్యతను చాటుకోవడం వారిలో ప్రతి ఒక్కరికీ అలవాటు. నాకు తెలిసిన వందలాది విఖ్యాతులలో ఇద్దరు మాత్రమే అందుకు మినహాయింపు. వారిలో ఒకరు క్రికెటర్ జి.ఆర్. విశ్వనాథ్ కాగా మరొకరు గత నెల 28న కీర్తిశేషుడైన బ్రిటిష్ జర్నలిస్ట్ ఇయాన్ జాక్. విశ్వనాథ్ వలే అద్భుతమైన వృత్తి నైపుణ్యాన్ని వ్యక్తిగత సౌశీల్యంతో మేళవించిన వ్యక్తి ఇయాన్. తన తరంలో గొప్ప కాలమిస్ట్, విశిష్ట సాహితీ సంపాదకుడు అయిన ఇయాన్ మంచి స్నేహశీలి, దయా గుణ సంపన్నుడు. ఇయాన్ జాక్‌ను చదవడం ఒక అపరిమిత ఆహ్లాదకర అనుభవం; ఆయన తెలిసి ఉండడం ఒక ఆనందప్రదమైన విషయమూ అంతకు మించి ఒక గౌరవమూ; కుటుంబ నేపథ్యంతో స్కాటిష్ జాతీయుడూ స్వభావ రీత్యా బ్రిటిష్ బుద్ధిజీవి. భారత్‌తో ఆయనకొక విలక్షణ అనుబంధం ఉన్నది. భారతీయ సంస్కృతిలో ఇయాన్ శ్రద్ధాసక్తులు ప్రత్యేకమైనవీ విస్తృతమైనవీనూ. 1970లలో ‘సండే టైమ్స్’ విలేఖరిగా ఇయాన్ తొలిసారి ఈ దేశానికి వచ్చారు. తదాది ఆయన మళ్లీ మళ్లీ ఇక్కడకు వచ్చారు. ఇయాన్ సన్నిహిత స్నేహితులలో ఇరువురు భారతీయులు ఉన్నారు. ఒకరు– ఫెమినిస్ట్ పబ్లిషర్ ఊర్వశీ భూటాలియా కాగా మరొకరు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ నస్రీన్ మున్నీ కబీర్. బెంగాల్ అన్నా, బెంగాలీలు అన్నా ఆయనకు ఎంతో అపేక్ష. భారతీయ రైళ్లలో ప్రయాణించేందుకు ఇయాన్ ఉత్సాహపడేవారు. పలు భారతీయ పట్టణాలను ఆయన సందర్శించారు. అయినప్పటికీ కలకత్తా అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. గత శతాబ్ది తుది సంవత్సరాలలో మున్నీ కబీర్ తొలిసారి నన్ను, ఇయాన్ జాక్, ఆయన భార్య లిండీ షర్పేకు పరిచయం చేసింది. ఆ తరువాత లండన్, బెంగలూరులలో మేము చాలాసార్లు కలుసుకున్నాము. తరచు ఉత్తరప్రత్యుత్తరాలు రాసుకునే వాళ్లం. 2014 అక్టోబర్‌లో గాంధీ జీవిత చరిత్ర రచనలో ఉన్న తరుణంలో ఆయనకు ఒక లేఖ రాశాను: ‘గాంధీ 1921లో తన తొలి సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించినప్పుడు బ్రిటిష్ పత్రికలు ఆ ఉద్యమ లక్ష్యాలను సంశయించాయి. గాంధీని నానా దుర్భాషలాడాయి. ఒక్క ‘గ్లాస్గో హెరాల్డ్’లో మాత్రమే గాంధీ ఉద్యమం పట్ల సదవగాహనతో కూడిన వార్తలు, వ్యాఖ్యానాలు వచ్చాయి. గ్లాస్గో హెరాల్డ్ ఉదారవాద పత్రికా లేక వామపక్ష భావజాల పత్రికా?’ నా ప్రశ్నకు ప్రతిస్పందనగా ఇయాన్ ఒక సుదీర్ఘ, ఆలోచనాత్మక ప్రత్యుత్తరం రాశారు. తాను 1965లో గ్లాస్గో హెరాల్డ్‌లో చేరినప్పుడు అది మితవాద పత్రికగా ఉండేదని ఆయన అన్నారు. వ్యాపార వర్గాలకు అనుకూలవైఖరి వహించేదని, గ్లాస్గో పారిశ్రామిక గతాన్ని గర్వకారణంగా భావించేదని ఇయాన్ తెలిపారు. ఆ నగరంలోని నౌకా నిర్మాణ పరిశ్రమ వార్తల నివేదనకు ఇద్దరు కరస్పాండెంట్లు ఉండేవారని ఆయన పేర్కొన్నారు. ఆ కాలంలో కార్మిక సంఘాల పట్ల గ్లాస్గో హెరాల్డ్ సానుకూలంగా ఉండేదికాదని తెలుపుతూ పత్రిక సంపాదకీయ రచయితలలో ఒకరు కన్జర్వేటివ్ పార్టీ తరపున పార్లమెంటుకు ఎన్నికయ్యాడని పేర్కొన్నారు. డిప్యూటీ ఎడిటర్ జార్జి మాక్ డోనాల్డ్ ఫేజెర్ నవలా రచనలో కీర్తి కనకాలను ఆర్జించిన ప్రముఖుడని ఇయాన్ తెలిపారు. అయితే 1921లో గ్లాస్గో హెరాల్డ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉండేవని, నాటి ఎడిటర్ సర్ రాబర్ట్ బ్రూస్, లిబరల్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి డేవిడ్ లాయడ్ జార్జికి స్నేహితుడని ఇయాన్ తెలిపారు. లాయడ్ జార్జి కారణంగానే బ్రూస్‌కు నైట్ హుడ్ లభించిందని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్ అంతర్గత రాజకీయాల మీద మాత్రమే బ్రూస్‌కు ఆసక్తి ఉండేదని, విశాల ప్రపంచంలో పరిణామాలపై వార్తల నివేదన, వ్యాఖ్యానాలు చేసే బాధ్యతను ఇతరులకు వదిలివేశాడని తెలుపుతూ అలా స్వేచ్ఛ పొందిన సంపాదక వర్గ సభ్యులలో ఒకరు గాంధీ గురించి విశాల దృక్పథంతో రాసి ఉంటారని ఇయాన్ తెలిపాడు. అయితే నాటి గ్లాస్గో హెరాల్డ్ విధానాలు సాధారణంగా వలస రాజ్యాలలో స్వాతంత్రోద్యమాల పట్ల సానుభూతి చూపేవి కావని ఇయాన్ జాక్ వివరించారు. ఈ వ్యక్తిగత లేఖలో, ఇయాన్ జాక్ పత్రికా రచన వ్యాసంగ విశిష్టతలు– సామాజిక, రాజకీయ చరిత్రను మిళితం చేసే నేర్పు, సాంకేతికతల పట్ల అవగాహనతో కూడిన ఆకర్షణ, మానవ వ్యక్తిత్వంలోని విపరీత ధోరణుల పట్ల ఆసక్తి, విశాల ప్రపంచంతో బ్రిటన్ జటిల సంబంధాల విశ్లేషణ – అన్నీ ప్రస్ఫుటమయ్యాయి. ‘సమకాలీన సోక్రటిక్ సంవాదాన్ని తీర్చిదిద్దిన పాత్రికేయుడుగా ఇయాన్ జాక్ సదా దయా భావంతో పరిశీలిస్తూ, అదే సమయంలో ‘‘మరి దానిగురించి ఏమిటి?’’ అని ప్రతి అంశాన్ని లోతుగా పరిశోధించడం ద్వారా గంభీర సత్యాలను వెల్లడించి కొత్త ఆలోచనలను పురికొల్పేవాడు’ అని ఆయన సన్నిహిత సమకాలీన పాత్రికేయుడు జాన్ లాయడ్ నివాళి అర్పించారు. ‘గార్డియన్’లో వెలువడిన లాయడ్ నివాళి వ్యాసానికి పలువురు పాఠకులు ప్రతిస్పందిస్తూ ఆ ప్రముఖ పత్రిక శనివారం సంచికలో తొలుత తాము ఇయాన్ జాక్ కాలమ్ చదివిన తరువాతనే ఇతర వ్యాసాలు, వార్తలు చదువుతామని విస్పష్టంగా పేర్కొన్నారు. ఆయన వ్యాసాలు ‘ఏ కంట్రీ ఫార్మర్లీ నేమ్డ్ గ్రేట్ బ్రిటన్’, ‘మఫ్యుసిల్ జంక్షన్’గా సంకలితమయ్యాయి. ఒక అంశం పై పుస్తకం రాయడానికి ఆయన చాలా కాలం విముఖత చూపారు. అయితే రైల్వే ప్రయాణాల (ఇది ఆయనకు మొదటినుంచీ ఎంతో అభిమాన విషయం)పై పుస్తకం రాయమని ప్రచురణకర్తలు, స్కాట్‌లాండ్‌లో తన బాల్యం, తొలి యవ్వనం గురించిన జ్ఞాపకాలు రాయమని స్నేహితులు అడుగుతూ వచ్చారు. చివరకు తన తుది సంవత్సరాలలో క్లైడె నది, దాని పరిసర ప్రాంతాల సామాజిక చరిత్ర రాయడానికి ఆయన పూనుకున్నారు. దానిలోని రెండు అధ్యాయాలను చదివే అవకాశం నాకు లభించింది. వ్యక్తిగత జ్ఞాపకాలను చారిత్రక, సాంకేతికతల వివరాలతో మిళితం చేయడంలో ఆయన ప్రతిభ ఆ అధ్యాయాలలో నిండుగా వ్యక్తమయింది (పారిశ్రామిక విప్లవ నిర్మాతలలో ఒకరైన జేమ్స్ వాట్ గురించిన ప్రశస్త పదచిత్రం ఆ అధ్యాయాలలో ఉన్నది). ఇయాన్ జాక్ నాకు రాసిన లేఖల నుంచి కొన్ని ఉటంకింపులతో ఈ నివాళిని ముగించాలని నేను అభిలషిస్తున్నాను. సహ స్కాటిష్ జాతీయుడు గార్డన్ బ్రౌన్ బ్రిటన్ ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన గురించి మీ అభిప్రాయమేమిటో తెలపాలని కోరాను. ఇయాన్ ఇలా సమాధానమిచ్చాడు: ‘గార్డన్ బ్రౌన్ ఎల్ల వేళలా తనకు తెలిసిన సమాచారమంతటినీ వెల్లడిస్తూనే ఉంటాడు. ఇది ఆయన ముఖ్య లక్షణం. ఒక ప్రధానమంత్రికి ఉండవల్సిన సద్గుణాలలో ఇది కూడా ఒకటా అనేది వేరే ప్రశ్న. అయితే చిరాకు కలిగించే సర్కోజీ (నాటి ఫ్రెంచ్ అధ్యక్షుడు) కంటే గార్డన్ బ్రౌన్ చాలా మెరుగు’. నోబెల్ సాహిత్య పురస్కారం పొందిన రచయితల రచనా పాటవం ఆ తరువాత వేగంగా క్షీణించిపోతుందని వాదిస్తూ 2008లో నేను రాసిన ఒక కాలమ్‌ను ఇయాన్‌కు పంపాను. ‘1913 తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రశస్త రచనలు చేశాడా? మీరు ఇటువంటి ప్రశ్న మీ మెయిల్ బ్యాగ్‌ను నింపివేస్తుందని ప్రతిస్పందిస్తూ ఇయాన్ తన అభిప్రాయాలను ఇలా వివరించాడు: ఒక రచయిత తనరచనా వ్యాసంగాన్ని నిలిపివేయవలసిన సమయం వస్తుందని విఎస్ నైపాల్ నిరూపించాడు. ఫిలిప్‌రాత్ ఇందుకొక మినహాయింపు. బహుశా సాల్‌బెల్లో కూడా కావచ్చు. రచయితలు, ముఖ్యంగా నవలాకర్తలు చెప్పడానికి ఏమీ లేని స్థితికి వస్తారు. రచనా జీవితపు ప్రముఖ లక్షణమేమిటంటే డబ్బు కోసం, ఆత్మ గౌరవం కోసం రాస్తూ ఉండాల్సిన అవసరం. నోబెల్ పురస్కారాన్ని పొందిన సాహితీవేత్తలలో రచనోత్సాహం క్షీణించడమనేది బహుశా వయస్సుపరమైన విషయంకావచ్చు. అయితే ఆ అవార్డు ప్రభావమూ తప్పక ఉంటుంది. ఆ ప్రతిష్ఠాత్మక అవార్డును పొందినప్పుడు రచయితలు సాధారణంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తారు. ఒర్హాన్ పాముక్ చిన్న వయస్సులో ఆ పురస్కారాన్ని పొందినందున ఆయన్ని రచనా వ్యాసంగం ఎలా సాగుతుందనేది గమనించాల్సి ఉన్నది’. సృజనాత్మక రచయితల తీరే పాత్రికేయులది కూడా. అటు బ్రిటన్‌లోనూ, ఇటు భారత్‌లోనూ కాలమిస్ట్‌ల వయస్సు పైబడుతున్న కొద్దీ పదాడంబరాన్ని ప్రదర్శిస్తుండడం కద్దు. అంతేకాకుండా వారు చెప్పేదానిని పాఠకులు ముందుగానే ఊహించే విధంగా ఉండడం పరిపాటి. అయితే ఇయాన్ జాక్ ఇందుకొక మినహాయింపు. ఆయన తన 30లలో ఎలా నవ నవంగా, విశదంగా రాశారో తన 70లలో కూడా అంతే వినూత్నంగా, స్ఫుటంగా రాశారు. క్లైబె నదిపై సంకల్పించిన పుస్తకాన్ని ఆయన పూర్తి చేయనేలేదు. అయితే సంపుటీకరించవలసిన ఆయన వ్యాసాలు అనేకమున్నాయి. బహుశా, ఎంపిక చేసిన ఆయన ఉత్తరాల సంకలనం నొకదాన్ని కూడా ప్రచురించవలసిన అవసరమున్నది.
పంజాబ్‌కు చెందిన మూగ బధిర చెస్‌ క్రీడాకారిణి మాలిక హండకు మంత్రి కే. తారకరామారావు ఆర్థిక సహాయం అందించారు. మాలిక తన అద్భుతమైన చెస్‌ నైపుణ్యంతో జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో అనేక పతకాలు గెలిచినా, తనకు ఎలాంటి సహకారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో పొస్ట్‌ చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన వైకల్యాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిన మాలికకు సహకారం అందించేందుకు మంత్రి కేటీఆర్‌ ముందుకు వచ్చారు. ఈ మేరకు పంజాబ్‌లోని జలంధర్‌ నుంచి హైదరాబాద్‌ పిలిపించి ఆమెకు ఆర్థిక సహాయం చేశారు. తాను తన వ్యక్తిగత స్థాయిలో సహాయం చేస్తున్నట్లు తెలిపిన మంత్రి కేటీఆర్‌, ఇంత అద్భుతమైన నైపుణ్యం ఉన్నప్పటికీ మాలికకు తగిన ప్రోత్సాహం దక్కకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్‌ అమెకు 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. దీంతోపాటు ఒక లాప్‌టాప్‌ను అందించి, ఆమెని సన్మానించారు. మూగ, చెవిటి భాషా అనువాదకురాలి సహాయంతో మంత్రి కెటిఆర్‌ మాలికతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాలికకు అభినందనలు తెలిపారు. ఇప్పటికే తన వైకల్యాన్ని జయించి ప్రపంచాన్ని గెలిచావన్నారు. మాలిక సాధించిన విజయాలతో ఈ సమాజం గర్వపడుతోందని, ఆమె మరింత సహాయం, ప్రసంశలకు అర్హులన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం వైకల్యం కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే పాలసీని తయారు చేస్తున్నదని, దేశంలోనే అత్యుత్తమ పాలసీతో ముందుకు వచ్చేందుకు తనకెదురైన అనుభవాల నుంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. మాలికకు మరింత సహాయం అందించాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కు మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సుదూరాన ఉన్న పంజాబ్‌కి చెందిన తన ఆవేదనను చూసి అండగా ఉండేలా సహాయం చేసిన మంత్రి కేటీఆర్‌కి ఈ సందర్భంగా మాలిక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఇచ్చిన ప్రోత్సాహంతో మరిన్ని విజయాలు సాధిస్తానన్న విశ్వాసాన్ని అమె వ్యక్తం చేశారు. కేటీఆర్‌ మానవీయ స్పందన పట్ల మాలిక కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. Post Tags: #chess#deaf and dumb champion#kcr#ktr#malika handa#ministry of sport and culture#punjab#Telangana
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ The New Jerusalem Bible Prev Next 1. అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదుదేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. 1. The Israelites then all turned out and, as one man, the entire community from Dan to Beersheba, including Gilead, assembled in Yahweh's presence at Mizpah. 2. దేవుని జన సమాజమునకు చేరినవారు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికి పెద్దలుగా నున్నవారై కత్తిదూయు నాలుగు లక్షల కాలుబలము కూడుకొనిరి. 2. The leaders of the entire people, of all the tribes of Israel, were present at this assembly of God's people, four hundred thousand trained infantry. 3. ఇశ్రాయేలీయులు మిస్పాకు వచ్చియున్నారని బెన్యా మీనీయులు వినిరి. ఇశ్రాయేలీయులుఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని యడుగగా 3. The Benjaminites heard that the Israelites had gone up to Mizpah. The Israelites then said, 'Tell us how this crime was committed.' 4. చంప బడిన స్త్రీ పెనిమిటి యైన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమ నగాబెన్యామీనీయుల గిబియాలో రాత్రి బసచేయు టకై నేనును నా ఉపపత్నియు వచ్చియుండగా 4. The Levite, husband of the murdered woman, spoke in reply and said, 5. గిబియావారు నా మీ దికి లేచి రాత్రి నేనున్న యిల్లు చుట్టుకొని నన్ను చంపతలచి 5. 'The men of Gibeah ganged up against me and, during the night, surrounded the house where I was lodging. They intended to murder me. They raped my concubine to death. 6. నా ఉపపత్నిని బల వంతముచేయగా ఆమె చనిపోయెను. వారు ఇశ్రా యేలీయులలో దుష్కార్య మును వెఱ్ఱిపనిని చేసిరని నేను తెలిసికొని, నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని. 6. I then took my concubine, cut her up and sent her throughout the entire territory of the heritage of Israel, since these men had committed a shameful act, an infamy, in Israel. 7. ఇదిగో ఇశ్రాయేలీయులారా, యిక్కడనే మీరందరు కూడియున్నారు, ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను. 7. Now, all you Israelites, discuss the matter and give your decision here and now.' 8. అప్పుడు జనులందరు ఏకీభవించి లేచిమనలో ఎవడును తన గుడారమునకు వెళ్లడు, ఎవడును ఇంటికి వెళ్లడు, 8. The whole people stood up as one man and said, 'None of us will go home, none of us will go back to his house! 9. మనము గిబియా యెడల జరిగింపవలసినదానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి 9. And this is what we are now going to do to Gibeah. We shall draw lots 10. ఇశ్రాయేలీయులలో జరిగిన వెఱ్ఱితనము విషయమై పగతీర్చుకొనుటకు వెళ్లువారికొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నూటికి పదిమంది మనుష్యులను, వెయ్యింటికి నూరుమందిని, పదివేలకు వెయ్యిమందిని ఏర్పరచుకొందము రండని చెప్పు కొనిరి. 10. and, throughout the tribes of Israel, select ten men out of a hundred, a hundred out of a thousand and a thousand out of ten thousand to collect food for the people, so that, on their arrival, the latter may treat Gibeah in Benjamin as this infamy perpetrated in Israel deserves.' 11. కాబట్టి ఇశ్రాయేలీయులందరు ఒక్క మనుష్యు డైనట్టుగా ఏకీభవించి ఆ ఊరివారితో యుద్ధముచేయు టకు కూడిరి. 11. Thus, as one man, all the men of Israel mustered against the town. 12. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరియొద్దకు మను ష్యులను పంపి--మీలో జరిగిన యీ చెడుతనమేమిటి? 12. The tribes of Israel sent messengers throughout the tribe of Benjamin to say, 'What is this crime which has been committed in your territory? 13. గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి; వారిని చంపి ఇశ్రాయేలీయులలోనుండి దోషమును పరిహరింప చేయుద మని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులగు ఇశ్రాయేలీయుల మాట విననొల్లక 13. Now, give up these men, these scoundrels, living in Gibeah, so that we can put them to death and wipe out this evil from Israel.' The Benjaminites, however, would not listen to their brother Israelites. 14. యుద్ధమునకు బయలు దేరవలెనని తమ పట్టణములలోనుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. 14. The Benjaminites left their towns and mustered at Gibeah to fight the Israelites. 15. ఆ దినమున బెన్యామీనీయులు తమ జన సంఖ్యను మొత్తముచేయగా ఏడువందల మందియైన గిబియా నివాసులుగాక కత్తిదూయ సమర్థులై పట్టణమునుండి వచ్చినవారు ఇరువదియారు వేలమందియైరి. 15. At the time, a count was made of the Benjaminites from the various towns: there were twenty-six thousand swordsmen; and the count excluded the inhabitants of Gibeah. 16. ఆ సమస్త జనములో నేర్పరచబడిన ఏడువందలమంది యెడమచేతి వాటముగలవారు. వీరిలో ప్రతివాడును గురిగా నుంచ బడిన తలవెండ్రుక మీదికి వడిసెలరాయి తప్పక విసరగలవాడు. 16. In this great army there were seven hundred first-rate left-handers, every man of whom could sling a stone at a hair and not miss it. 17. బెన్యామీనీయులు గాక ఇశ్రాయేలీయులలో ఖడ్గము దూయు నాలుగులక్షలమంది లెక్కింపబడిరి; వీరందరు యోధులు. 17. A count was also held of the men of Israel, excluding Benjamin: there were four hundred thousand men, all experienced swordsmen. 18. వీరు లేచి బేతేలుకు పోయిఇశ్రాయేలీ యులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవలెనని దేవునియొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్లవలెనని సెలవిచ్చెను. 18. They moved off, up to Bethel, to consult God. The Israelites put the question, 'Which of us is to go first into battle against the Benjaminites?' And Yahweh replied, 'Judah is to go first.' 19. కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. 19. In the morning, the Israelites moved off and pitched their camp over against Gibeah. 20. ఇశ్రా యేలీయులు బెన్యామీనీయులతో యుద్ధముచేయ బయలు దేరి నప్పుడు ఇశ్రాయేలీయులు గిబియామీద పడుటకు యుద్ధపంక్తులు తీర్చగా 20. The men of Israel advanced to do battle with Benjamin; they drew up their battle line in front of Gibeah. 21. బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికివచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో ఇరు వదిరెండు వేలమందిని నేల గూల్చిరి. 21. But the Benjaminites sallied out from Gibeah and that day massacred twenty-two thousand Israelites. 22. అయితే ఇశ్రా యేలీయులు ధైర్యము తెచ్చుకొని, తాము మొదట ఎక్కడ యుద్ధపంక్తి తీర్చిరో ఆ చోటనే మరల యుద్ధము జరుగ వలెనని తమ్మును తాము యుద్ధపంక్తులుగా తీర్చుకొనిరి. 22. The army of the men of Israel then took fresh heart and again drew up their battle line in the same place as the day before. 23. మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలమువరకు యెహోవా ఎదుట ఏడ్చుచుమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను. 23. The Israelites went and wept before Yahweh until evening; they then consulted Yahweh; they asked, 'Shall we join battle again with the sons of our brother Benjamin?' Yahweh replied, 'March against him!' 24. కాబట్టి ఇశ్రాయేలీయులు రెండవ దినమున బెన్యా మీనీయులతో యుద్ధము చేయరాగా, ఆ రెండవ దిన మున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు 24. This second day, the Israelites advanced against the Benjaminites, 25. గిబి యాలోనుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో పదు నెనిమిది వేలమందిని నేలగూల్చి సంహరించిరి. 25. and, this second day, Benjamin sallied out from Gibeah to meet them and massacred another eighteen thousand Israelites, all experienced swordsmen. 26. వీరందరు కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరును జనులందరును పోయి, బేతేలును ప్రవేశించి యేడ్చుచు సాయంకాలమువరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహనబలులను సమాధాన బలులను యెహో వా సన్నిధిని అర్పించిరి. 26. Then all the Israelites and the whole people went off to Bethel; they wept and sat in Yahweh's presence; they fasted all day till the evening and presented burnt offerings and communion sacrifices before Yahweh. 27. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే యుండెను. 27. The Israelites then consulted Yahweh. In those days, the ark of the covenant of God was there, 28. అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దానియెదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధమునకు పోదుమా,మానుదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వెళ్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను. 28. and Phinehas son of Eleazer, son of Aaron was its minister at the time. They said, 'Ought I to go into battle against the sons of my brother Benjamin again, or should I stop?' Yahweh replied, 'March! For tomorrow I shall deliver him into your hands.' 29. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టు మాటు గాండ్రను పెట్టిరి. 29. Israel then positioned troops in ambush all round Gibeah. 30. మూడవ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయు లతో యుద్ధమునకు పోయిమునుపటివలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా 30. On the third day the Israelites marched against the Benjaminites and, as before, drew up their line in front of Gibeah. 31. బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములోనుండి తొలగివచ్చిమునుపటివలె ఇశ్రాయేలీయులలో గాయ పరచబడినవారిని ఇంచుమించు ముప్పదిమంది మనుష్యు లను రాజమార్గములలో చంపుచువచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి. 31. The Benjaminites sallied out to engage the people and let themselves be drawn away from the town. As before, they began by killing those of the people who were on the roads, one of which runs up to Bethel, and the other to Gibeah through open country: some thirty men of Israel. 32. బెన్యామీనీయులు మునుపటివలె వారు మనయెదుట నిలువలేక కొట్టబడియున్నారని అనుకొనిరి గాని ఇశ్రాయేలీయులుమనము పారిపోయి వారిని పట్ట ణములోనుండి రాజమార్గములలోనికి రాజేయుదము రండని చెప్పుకొనియుండిరి. 32. The Benjaminites thought, 'We have beaten them, as we did the first time,' but the Israelites had decided, 'We shall run away and draw them away from the town along the roads.' 33. ఇశ్రాయేలీయులందరు తమ చోట నుండి లేచి బయల్తామారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనులోగా ఇశ్రాయేలీయుల మాటుగాండ్రును తమ చోటనుండి గిబియా బట్టబయటి మార్గమునకు త్వరగా వచ్చిరి. 33. All the Israelites then retreated and reformed at Baal-Tamar, while the Israelite troops in ambush surged from their positions to the west of Gibeah. 34. అప్పుడు ఇశ్రాయేలీయులందరిలోనుండి ఏర్ప రచబడిన పదివేలమంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠినయుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు. 34. Ten thousand picked men, chosen from the whole of Israel, launched their attack on Gibeah. The battle was fierce; and the others knew nothing of the disaster impending. 35. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులచేత బెన్యా మీనీయులను హతముచేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో ఇరువది యయిదు వేల నూరుమంది మనుష్యులను చంపిరి. వీరందరు కత్తి దూయువారు. 35. Yahweh defeated Benjamin before Israel and that day the Israelites killed twenty-five thousand one hundred men of Benjamin, all of them trained swordsmen. 36. బెన్యామీనీయులు జరుగుదాని చూచి తమకు అప జయము కలిగినదని తెలిసికొనిరి. ఇశ్రాయేలీయులు తాము గిబియామీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యా మీనీయులకు స్థలమిచ్చిరి. 36. The Benjaminites saw that they were beaten. The Israelites had given ground to Benjamin, since they were relying on the ambush which they had positioned close to Gibeah. 37. మాటుననున్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణములోనివారి నందరిని హతముచేసిరి. 37. The troops in ambush threw themselves against Gibeah at top speed; fanning out, they put the whole town to the sword. 38. ఇశ్రాయేలీయులకును మాటు గాండ్రకును నిర్ణయమైన సంకేతమొకటి యుండెను; అదే దనగా వారు పట్టణములోనుండి పొగ గొప్ప మేఘమువలె లేచునట్లు చేయుటయే. 38. Now it had been agreed between the Israelites and those of the ambush that the latter should raise a smoke signal from the town, 39. ఇశ్రాయేలీయులు యుద్ధము నుండి వెనుకతీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులువీరు మొదటి యుద్ధములో అపజయమొందినట్లు మనచేత ఓడి పోవుదురుగదా అనుకొని, చంపనారంభించి, ఇశ్రాయేలీ యులలో ఇంచుమించు ముప్పదిమంది మనుష్యులను హతము చేసిరి. 39. whereupon the Israelites in the thick of the battle would turn about. Benjamin began by killing some of the Israelites, about thirty men, and thought, 'We have certainly beaten them, as we did in the first battle.' 40. అయితే పట్టణమునుండి ఆకాశముతట్టు స్తంభ రూపముగా పొగ పైకిలేవ నారంభింపగా బెన్యామీనీ యులు వెనుకతట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణ మంతయు ధూమమయమై ఆకాశమునకెక్కుచుండెను. 40. But the signal, a column of smoke, began to rise from the town, and the Benjaminites looking back saw the whole town going up in flames to the sky. 41. ఇశ్రాయేలీయులు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయము కలిగినదని తెలిసికొని విభ్రాంతినొంది 41. The Israelites then turned about, and the Benjaminites were seized with terror, for they saw that disaster had struck them. 42. యెడారి మార్గముతట్టు వెళ్లుదమని ఇశ్రాయేలీయుల యెదుట వెనుకకు తిరిగిరిగాని, యుద్ధమున తరుమబడగా పట్టణము లలోనుండి వచ్చినవారు మధ్య మార్గమందే వారిని చంపిరి. 42. They broke before the Israelite onslaught and made for the desert, but the fighters pressed them hard, while the others coming out of the town took and slaughtered them from the rear. 43. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుకొని తరిమి తూర్పుదిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి. 43. They hemmed in the Benjaminites, pursued them relentlessly, crushing them opposite Gibeah on the east. 44. అప్పుడు బెన్యామీనీయులలో పదునెనిమిది వేలమంది మనుష్యులు పడిపోయిరి. వీరందరు పరాక్రమవంతులు. 44. Of Benjamin, eighteen thousand men fell, all of them brave men. 45. అప్పుడు మిగిలినవారు తిరిగి యెడా రిలో నున్న రిమ్మోనుబండకు పారిపోగా, వారు రాజ మార్గములలో చెదిరియున్న అయిదువేలమంది మనుష్యులను చీలదీసి గిదోమువరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేలమందిని చంపిరి. 45. They then turned tail and fled into the desert, towards the Rock of Rimmon. Five thousand of them were picked off on the roads, and the rest were relentlessly pursued as far as Gideon, two thousand of them being killed. 46. ఆ దినమున బెన్యామీనీయు లలో పడిపోయినవారందరు కత్తిదూయు ఇరువదియయిదు వేలమంది, వీరందరు పరాక్రమవంతులు. 46. The total number of Benjaminites who fell that day was twenty-five thousand swordsmen, all of them brave men. 47. ఆరువందలమంది తిరిగి యెడారి లోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండమీద నాలుగు నెలలు నివసించిరి. 47. Six hundred men, however, turned tail and escaped into the desert, to the Rock of Rimmon, and there they stayed for four months. 48. మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులమీదికి తిరిగి వచ్చి పట్టణనివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతముచేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటిని అగ్నిచేత కాల్చివేసిరి. 48. The men of Israel then went back to the Benjaminites, and put them to the sword-people, livestock and everything else that came their way in the town. And they fired all the towns involved. Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
ప్రత్యేకమైన రచన స్వరం మంచి రచన యొక్క లక్షణం. మీ స్వంత ప్రత్యేకమైన స్వరాన్ని కనుగొని అభివృద్ధి చేయడానికి మీరు కొన్ని దశలు తీసుకోవచ్చు. మా అత్యంత ప్రాచుర్యం ఉత్తమ నుండి నేర్చుకోండి 100 కంటే ఎక్కువ తరగతులతో, మీరు కొత్త నైపుణ్యాలను పొందవచ్చు మరియు మీ సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయవచ్చు. గోర్డాన్ రామ్సేవంట నేను అన్నీ లీబోవిట్జ్ఫోటోగ్రఫి ఆరోన్ సోర్కిన్స్క్రీన్ రైటింగ్ అన్నా వింటౌర్సృజనాత్మకత మరియు నాయకత్వం deadmau5ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడక్షన్ బొబ్బి బ్రౌన్మేకప్ హన్స్ జిమ్మెర్ఫిల్మ్ స్కోరింగ్ నీల్ గైమాన్కథ యొక్క కథ డేనియల్ నెగ్రేనుపోకర్ ఆరోన్ ఫ్రాంక్లిన్టెక్సాస్ స్టైల్ Bbq మిస్టి కోప్లాండ్సాంకేతిక బ్యాలెట్ థామస్ కెల్లర్వంట పద్ధతులు I: కూరగాయలు, పాస్తా మరియు గుడ్లుప్రారంభించడానికి విభాగానికి వెళ్లండి మీ రచయిత స్వరాన్ని కనుగొనడానికి 5 దశలు రాయడం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? జేమ్స్ ప్యాటర్సన్ రాయడం నేర్పిస్తాడు జేమ్స్ ప్యాటర్సన్ రాయడం నేర్పుతాడు అక్షరాలను ఎలా సృష్టించాలో, సంభాషణలను వ్రాయాలని మరియు పాఠకులను పేజీని తిప్పికొట్టాలని జేమ్స్ మీకు బోధిస్తాడు. ఇంకా నేర్చుకో కొంతమంది రచయితలకు నకిలీ చేయలేని స్వరం ఉంది. బెస్ట్ సెల్లర్లు, స్టీఫెన్ కింగ్, టోని మొర్రిసన్ మరియు ఎర్నెస్ట్ హెమింగ్‌వే రచనల వలె, తరచూ ఒక ప్రత్యేకమైన రచనా విధానాన్ని కలిగి ఉంటారు-కథనం మరియు పాత్ర స్వరం పరంగా. సాహిత్యం యొక్క గొప్ప రచనలను చదవాలనే విజ్ఞప్తిలో భాగం రచయిత యొక్క ప్రత్యేకమైన, అసమానమైన స్వరాన్ని అనుభవిస్తోంది. మీ రచయిత స్వరాన్ని కనుగొనడానికి 5 దశలు సాహిత్యంలో, వాయిస్ అనే పదం పదజాలం, స్వరం, దృక్కోణం మరియు వాక్యనిర్మాణం యొక్క అలంకారిక మిశ్రమాన్ని సూచిస్తుంది, ఇది మీ పదబంధాలు, వాక్యాలు మరియు పేరాలు ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవహించేలా చేస్తుంది. నవలలు బహుళ స్వరాలను సూచిస్తాయి: కథకుడు మరియు వ్యక్తిగత పాత్రల. మీ స్వంత రచనా స్వరాన్ని కనుగొనడంలో మీకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని వ్రాత చిట్కాలు ఉన్నాయి: మీ దృక్కోణాన్ని నిర్ణయించండి . క్రొత్త సృజనాత్మక రచన ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందు, మీరు మీరే ఇలా ప్రశ్నించుకోవాలి: నేను కల్పన (లేదా నాన్-ఫిక్షన్) ను ఎందుకు మొదటి స్థానంలో వ్రాస్తున్నాను? మీ స్వంత పనిలో వ్యక్తీకరించడానికి మీరు కోరుకుంటున్న ప్రపంచం గురించి ఒక థీమ్ లేదా అభిప్రాయం ఉందా? నిజ జీవితంలో మీరు గమనించినది ఏదైనా ఉందా లేదా మీరు ఒక మంచి స్నేహితుడితో లేదా ప్రియమైన వ్యక్తితో అనుభవించిన అనుభవమేనా- మీరు పేజీకి కట్టుబడి ఉండాలనుకుంటున్నారా? లేదా పాఠకుడిని నవ్వించేటప్పుడు మంచి కథ చెప్పడానికి మీకు ఆసక్తి ఉందా? ప్రజలు వేర్వేరు కారణాల వల్ల వ్రాసే నైపుణ్యాన్ని అనుసరిస్తారు మరియు మీ స్వంత ఉద్దేశాలను అర్థం చేసుకోవడం మీకు బలమైన స్వరాన్ని మరియు మీ స్వంత శైలిని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. మీ కథకుల కోసం స్థిరమైన స్వరాన్ని ఎంచుకోండి . కొంతమంది రచయితలు ఫస్ట్-పర్సన్ కథనానికి ప్రసిద్ది చెందారు, మరికొందరు ప్రత్యేకంగా మూడవ వ్యక్తి దృష్టికోణం నుండి వివరిస్తారు. (స్థిరమైన రెండవ-వ్యక్తి కథనం మొత్తం రచన అంతటా కొనసాగించడం చాలా కష్టం మరియు ఇది చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది.) ప్రసిద్ధ కల్పిత రచయితలు పుష్కలంగా మొదటి-వ్యక్తి మరియు మూడవ వ్యక్తి కథన స్వరం మధ్య టోగుల్ చేస్తున్నప్పుడు, మీరు మీ స్వంత రచనా స్వరాన్ని స్థాపించడంలో సహాయపడగలరు ఒక శైలిని ఎంచుకొని దానికి అంటుకోవడం ద్వారా. వాక్య నిర్మాణం మరియు పద ఎంపిక గురించి ఆలోచించండి . ఒక నవల వివరించేటప్పుడు, మీరు వ్యాకరణపరంగా పరిపూర్ణమైన ఇంగ్లీషును ఉపయోగిస్తారా? లేదా మీరు ప్రాంతీయ పదబంధాలను ఉపయోగిస్తారా మరియు సంభాషణలు ? మీరు శపిస్తారా? మీరు మీ ప్రధాన పాత్ర యొక్క స్వరంలోకి మరియు బయటికి వెళ్తారా? అంతర్గత మోనోలాగ్లు ? చిన్న లేదా పొడవైన వాక్యాలను ఉపయోగించడం వంటి మౌళికమైనవి కూడా రచయిత స్వరం యొక్క స్వరాన్ని మరియు అనుభూతిని పూర్తిగా మార్చగలవు. పద ఎంపిక మరియు వాక్య నిర్మాణం గురించి నిర్దిష్ట విధానాలను అనుసరించడం రచయితగా మీ స్వంత స్వరాన్ని మరింతగా స్థాపించింది. వివరణ మరియు సంభాషణల మధ్య సమతుల్యాన్ని కనుగొనండి . కొంతమంది రచయితలు వారి నవలలను వర్ణన యొక్క సుదీర్ఘ భాగాలతో పొరలుగా వేస్తారు - వారు కథనం యొక్క స్వరం ద్వారా చర్యలు మరియు భావోద్వేగ ప్రతిస్పందనలను వివరిస్తారు మరియు కథనాన్ని బలోపేతం చేయడానికి సంభాషణను ఉపయోగిస్తారు. దీనికి విరుద్ధంగా, ఇతర రచయితలు సంభాషణను వారి కథనాన్ని నడిపించటానికి అనుమతిస్తారు మరియు సంభాషణ సరిపోనప్పుడు మాత్రమే కథనాన్ని అడ్డుకుంటుంది. ఈ శైలులలో ఒకదాన్ని ఎంచుకోవడం మరియు దానికి పాల్పడటం అనేది ఒక నిర్దిష్ట మరియు ప్రత్యేకమైన స్వరాన్ని స్థాపించడానికి మరొక మార్గం. అన్ని సమయం రాయండి . మీ వాయిస్‌ను కనుగొనడానికి సమయం పడుతుంది. విభిన్న స్వరాలు మరియు రచనా శైలులతో ప్రయోగం. మీరు శృంగార నవలలు రాయడం చాలా సౌకర్యంగా ఉంటే, థ్రిల్లర్‌ల వద్ద మీ చేతితో ప్రయత్నించండి. మీరు నవలలు రాయడం అలవాటు చేసుకుంటే, చిన్న కథను ప్రయత్నించండి. మీ రచనా నైపుణ్యాలను మెరుగుపర్చడానికి మరియు విభిన్న శైలులు మరియు స్వర ఉదాహరణలకు మిమ్మల్ని మీరు బహిర్గతం చేయడానికి ఇతర iring త్సాహిక రచయితలతో వ్రాసే కోర్సు తీసుకోండి. మీరు రచయిత యొక్క బ్లాక్‌ను ఎదుర్కొంటుంటే , బ్లాగింగ్ లేదా ఫ్రీరైటింగ్ ప్రయత్నించండి. కొన్నిసార్లు, మీ మనస్సును సంచరించడం మరియు రాయడం కోసమే రాయడం ఒక శక్తివంతమైన సాధనం, ఇది మీ మనస్సు దాదాపు అపస్మారక రచన శైలిని వెలికి తీయడానికి అనుమతిస్తుంది. రచయిత యొక్క నిజమైన స్వరం వెలువడటానికి చాలా సంవత్సరాలు మరియు వేల పేజీలు పడుతుంది, కాబట్టి మీతో ఓపికపట్టండి. మంచి రచనకు సమయం పడుతుంది, మరియు రచయిత యొక్క స్వరాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. జేమ్స్ ప్యాటర్సన్ రాయడం నేర్పిస్తాడు ఆరోన్ సోర్కిన్ స్క్రీన్ రైటింగ్ నేర్పిస్తాడు షోండా రైమ్స్ టెలివిజన్ కోసం రాయడం నేర్పిస్తాడు డేవిడ్ మామేట్ నాటకీయ రచనను బోధిస్తాడు రాయడం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? మాస్టర్ క్లాస్ వార్షిక సభ్యత్వంతో మంచి రచయిత అవ్వండి. నీల్ గైమాన్, డేవిడ్ బాల్డాచి, జాయిస్ కరోల్ ఓట్స్, డాన్ బ్రౌన్, మార్గరెట్ అట్వుడ్, డేవిడ్ సెడారిస్ మరియు మరెన్నో సహా సాహిత్య మాస్టర్స్ బోధించిన ప్రత్యేకమైన వీడియో పాఠాలకు ప్రాప్యత పొందండి.
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన భారీ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ 3డి. ఓంరౌత్ దర్శకుడు. కృతి సనోన్ కథానాయిక. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తొలి టీజర్ పై చిన్నపాటి విమర్శలు వెల్లువెత్తాయి. యానిమేటెడ్ పాన్ ఇండియా మూవీ అంటూ కొందరు కామెంట్లు చేయడం సోషల్ మీడియాల్లో కనిపించింది. ఇందులో శ్రీరాముడి పాత్ర లంకేష్ పాత్ర ప్రతిదీ వీ.ఎఫ్.ఎక్స్ లో ప్రెజెంట్ చేసిన తీరుపై కొన్ని విమర్శలొచ్చాయి. దీనిపై టాలీవుడ్ అగ్ర నిర్మాత పంపిణీదారుడు దిల్ రాజు తాజా ప్రమోషనల్ ఈవెంట్లో మాట్లాడుతూ-ఆదిపురుష్ పై వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చూసారు. బాహుబలి రిలీజ్ సమయంలోనూ విమర్శలొచ్చాయి. శివలింగాన్ని భుజంపైకి ఎత్తి నడిచే సన్నివేశంపై క్రిటిసైజ్ చేసారు. కానీ నేను ఆ మూవీ చూసి ప్రభాస్ కి చెప్పాను. ఇది బంపర్ హిట్ అని .. ! ఇప్పుడు కూడా ఆదిపురుష్ టీజర్ చూసాను. విమర్శలొచ్చాయని అన్నారు. ఇందులో రామాయణం కథను పాత్రలను తీసుకుని మోడ్రనైజ్డ్ కంటెంట్ తో అందిస్తున్నారు. సెల్ ఫోన్ లో చూసినవి సరికాదు. నేను ఇంట్లో పెద్ద టీవీ స్క్రీన్ పై చూసాను. ఇప్పుడు థియేటర్లలోనూ చూసాను. 3డిలో చూసాను. ఎంతో నచ్చింది... అని ప్రభాస్ అన్నారు. తానాజీ లాంటి అద్భుత సినిమా తీసిన ఓంరౌత్ తో ప్రభాస్ సినిమా చేయడం బిగ్ సక్సెస్ అని కూడా అన్నారు. ఆదిపురుష్ పాత్రధారి.. డార్లింగ్ ప్రభాస్ మాట్లాడుతూ-``మొదటిసారి 3డి చూసినప్పుడు నేనైతే చిన్న పల్లాడిని అయిపోయాను. రేపు అభిమానుల కోసం 60 థియేటర్లలో 3డిలో వేస్తున్నాం. అభిమానులే మాకు అండ. వాళ్లే మొదట చూడాలి. మొదట అభిమానులకు నచ్చాలి. ఈ టెక్నాలజీ ఇండియాలో మొదటిసారి. 3డిలో బిగ్ స్క్రీన్ పై మొదటిసారి నేను నటించిన 3డి సినిమా వస్తోంది. టీజర్ తో పాటు కొన్ని వారాల్లోనే ఇంకా మంచి కంటెంట్ తో మళ్లీ వస్తాం. అభిమానులంతా థియేటర్లలో 3డి విజువల్స్ చూసి ఆస్వాధిస్తాని అనుకుంటున్నాం. మీ రివ్యూ కూడా ఇవ్వండి`` అని అన్నారు. ఈ వేదికపై టీసిరీస్ అధినేతలు సహా ఆదిపురుష్ చిత్రానికి పని చేసిన నిర్మాతలు టెక్నీషియన్లు పాల్గొన్నారు. చెడుపై మంచి గెలుపును సెలబ్రేట్ చేసుకోవడమే ఆదిపురుష్. ఇందులో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు-హిందీ-తమిళం-మలయాళం-కన్నడంలో అత్యంత భారీగా విడుదల చేయనున్నారు. 2023 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహకాల్లో ఉన్నారు. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
కరోనా వైరస్.. ఇప్పుడు దీని పేరు చెబితే చాలు అగ్రరాజ్యాలు సైతం గజగజవణికిపోతున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్.. దాదాపు 70కి పైగా దేశాలను తాకింది. ఇప్పటికే దాదాపు మూడు వేల మందికి పైగా మృతిచెందగా.. లక్షల మంది వైరస్ బారిన పడి.. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గత వారంలో ఇది మన భారతదేశానికి కూడా తాకింది. ఇప్పటికే 30 పాజిటివ్ కేసులు తేలడంతో.. వారికి ప్రభుత్వం ప్రత్యేంకంగా చికిత్సఅందిస్తుంది. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ […] TV9 Telugu Digital Desk | Edited By: Mar 06, 2020 | 2:06 PM కరోనా వైరస్.. ఇప్పుడు దీని పేరు చెబితే చాలు అగ్రరాజ్యాలు సైతం గజగజవణికిపోతున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్.. దాదాపు 70కి పైగా దేశాలను తాకింది. ఇప్పటికే దాదాపు మూడు వేల మందికి పైగా మృతిచెందగా.. లక్షల మంది వైరస్ బారిన పడి.. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గత వారంలో ఇది మన భారతదేశానికి కూడా తాకింది. ఇప్పటికే 30 పాజిటివ్ కేసులు తేలడంతో.. వారికి ప్రభుత్వం ప్రత్యేంకంగా చికిత్సఅందిస్తుంది. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ మన ప్రాంతంలో వచ్చిందంటూ.. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింపజేస్తున్నారు. దీంతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ వదందులపై ఏపీ డీజేపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. కరోనా వైరస్‌ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో కరోనా వైరస్‌పై లేనిపోని అపోహలను సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వదంతులు సృష్టించే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని.. వారిపై కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ పోస్టులను పెడుతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారిపై కేసులు నమోదు చేయాలని అన్ని జిల్లా పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశాలిచ్చారు. కాగా.. ఇప్పటికే వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదని డీజీపీ తెలిపారు. ప్రతి రోజూ రాష్ట్ర వైద్యాధికారులతో పాటు.. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనాపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేస్తున్నారని గుర్తుచేశారు.
సంక్షేమాభివృద్ధికి పార్టీ బలం తోడైతే గెలుపు సులువే.. బాబూ.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేస్తావా..? ఆక్వా రైతులను ఆదుకోండి పార్టీ నేతల సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కీలక ప్రకటన నిషేధిత ప్లాస్టిక్ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత శ్రీ‌నాథ్‌రెడ్డి పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్ సమావేశం ప్రారంభం కాసేపట్లో పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం బడుగు, బలహీనవర్గాలకు వెన్నుపోటే బాబు డీఎన్ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు You are here హోం » CM YS Jagan » కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం జగన్‌ కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం జగన్‌ 24 Aug 2022 2:57 PM తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ చిత్రావ‌తి బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బోటింగ్ - ఫొటో గ్యాల‌రీ సంబంధిత ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2
అద్భుత కథలు నిజానికి జరగని సాధారణ కథలు, పురాతన కాలంలో జరిగిన వింత సంఘటనలు మరియు వినోదం మరియు నైతిక బోధనలను తెలియజేస్తాయి. తల్లిదండ్రులుగా, మీరు మీ బిడ్డను బాగా చదివించాలి, తద్వారా అతను మంచి పిల్లవాడు అవుతాడు. పిల్లలకు చదువు చెప్పడానికి ఒక మార్గం ఏమిటంటే, నిద్రపోయే ముందు పిల్లలకు పాఠంగా ఉండేలా నైతిక సందేశంతో కథ చెప్పడం. పిల్లలకు చెప్పగలిగే కథలలో ఒకటి అద్భుత కథలు. అద్భుత కథలు పాత సాహిత్య రచనలలో వ్యక్తి నుండి వ్యక్తికి మౌఖిక రూపంలో లేదా వ్రాతపూర్వకంగా నమోదు చేయబడ్డాయి. అద్భుత కథలు సాధారణంగా కల్పిత లేదా ఊహాత్మక సంఘటనలను తెలియజేస్తాయి. అద్భుత కథలలోని పాత్రలు జంతువులు లేదా ఇతర కల్పిత జీవులు కూడా కావచ్చు. అందువల్ల, అద్భుత కథలకు తరచుగా పిల్లలు డిమాండ్ చేస్తారు, ఎందుకంటే వారి వయస్సులో పిల్లలు ఉత్తేజకరమైన మరియు మాయా విషయాల గురించి అద్భుతంగా ఇష్టపడతారు. అద్భుత కథలు కల్పనలో చేర్చబడినప్పటికీ, అద్భుత కథలు కథలో నైతిక సందేశాన్ని కలిగి ఉంటాయి. కథలో ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి మరియు వినోదాత్మక సంఘటనలతో చుట్టబడ్డాయి. అదనంగా, అద్భుత కథలు తేలికపాటి చర్చలతో కూడిన కథలను కూడా కలిగి ఉంటాయి లేదా ప్రజలందరికీ సులభంగా అర్థం చేసుకోవచ్చు. వ్రాత ప్రవాహం కూడా చాలా తక్కువగా ఉంటుంది, తద్వారా అద్భుత కథను ఒక పఠనంలో పూర్తి చేయవచ్చు. కాబట్టి, పిల్లవాడిని నిద్రించడానికి అద్భుత కథలను పఠన సామగ్రిగా ఉపయోగించవచ్చు. వివిధ ప్రాంతాలలో అనేక రకాల అద్భుత కథలు ఉన్నాయి. ప్రజలు తరచుగా చెప్పే కొన్ని అద్భుత కథలు ఇక్కడ ఉన్నాయి: అద్భుత కథ: అహంకార తాబేలు అక్కడ ఒక తాబేలు అహంకారంతో, నీటిలో ఈత కొట్టడం కంటే ఎగరడానికి అర్హుడని భావించింది. అతని శరీరం బరువుగా అనిపించేలా గట్టి షెల్ ఉండడం వల్ల అతను చిరాకుపడ్డాడు. తన స్నేహితులు ఈత కొట్టి సంతృప్తి చెందడం చూసి చిరాకు పడ్డాడు. ఆకాశంలో స్వేచ్చగా ఎగురుతున్న పక్షులను చూడగానే అతనికి చిరాకు మరింత పెరిగింది. ఒక రోజు, తాబేలు ఎగరడానికి సహాయం చేయమని ఒక గూస్‌ని బలవంతం చేసింది. గూస్ అంగీకరించింది. తాబేలు తాను ఎత్తబోయే కర్రను పట్టుకోమని సూచించాడు. తాబేలు చేయి కాస్త బలహీనంగా ఉండడంతో దాని బలమైన నోటిని ఉపయోగించింది. అతను చివరకు ఎగరగలిగాడు మరియు గర్వంగా భావించాడు. ఈత కొడుతున్న స్నేహితులను చూసి పొగడాలనిపించింది. చెక్క కొరకడానికి నోరు తప్పదన్న సంగతి మరిచిపోయాడు. అతను కూడా బలంగా పడిపోయాడు. అదృష్టవశాత్తూ, అతను ఒకప్పుడు అసహ్యించుకున్న షెల్ కారణంగా అతను బయటపడ్డాడు. అద్భుత కథ: గుడ్లగూబ మరియు గొల్లభామ ఒకప్పుడు, ఒక పాత చెట్టు ఉంది, అందులో కోపంగా మరియు భయంకరమైన గుడ్లగూబ నివసించేది. ముఖ్యంగా పగటిపూట ఎవరైనా నిద్రకు భంగం కలిగిస్తే. మరియు రాత్రిపూట, వారు తినడానికి కీటకాలు, కప్పలు, ఎలుకలు మరియు బీటిల్స్ కోసం తమ గొంతులతో మేల్కొంటారు. వేసవి మధ్యాహ్నాల్లో, గుడ్లగూబలు చెట్ల గుంతల్లో హాయిగా నిద్రపోతాయి. అయితే, అకస్మాత్తుగా ఒక గొల్లభామ పాడింది. దీంతో గుడ్లగూబ కలవరపడి మిడతను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరింది. “హే, మిడత వైపు నుండి దూరంగా ఉండండి! ముసలివాడి నిద్రను చెడగొట్టే మర్యాద నీకు లేదా?" అయితే ఆ చెట్టుపై తనకు కూడా హక్కు ఉందని మిడత తీవ్ర స్వరంతో సమాధానం ఇచ్చింది. నిజానికి, అతను బిగ్గరగా పాడతాడు. వాదించడం కూడా అర్థరహితమని గుడ్లగూబ గ్రహించింది. పగటిపూట అతని కళ్ళు ఇప్పటికీ మయోపిక్‌గా ఉన్నాయి కాబట్టి అతను గొల్లభామను శిక్షించలేకపోయాడు. చివరగా, గుడ్లగూబ మిడతను శిక్షించే మార్గాన్ని ఆలోచించింది. చెట్టు గుంతలోకి తల తిప్పి చాలా ఆప్యాయంగా చెప్పాడు. “హే గొల్లభామ, నేను మేల్కొని ఉంటే నేను ఖచ్చితంగా మీరు పాడటం వింటాను. తెలియదు, ఇక్కడ వైన్ ఉంది. కావాలంటే ఇక్కడికి రండి. ఈ ద్రాక్షను తినడం ద్వారా, మీ వాయిస్ అపోలో లాగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఒలింపస్ నుండి వచ్చిన సరుకు. చివరగా, గొల్లభామ గుడ్లగూబ యొక్క సమ్మోహన మరియు ప్రశంసల ద్వారా దూరంగా జరిగింది. చివరగా అతను గూడులోకి దూకాడు మరియు గుడ్లగూబ వెంటనే గొల్లభామను తన కళ్లతో చూడగలిగినందున, గొల్లభామ వెంటనే గుడ్లగూబపైకి దూకి తినేసింది. ట్రీ ఆఫ్ లైఫ్ నలుగురు పిల్లలతో ఒక వృద్ధుడు నివసించాడు. తన పిల్లలు చాలా త్వరగా తీర్పు చెప్పే మనుషులుగా ఉండకూడదని అతను కోరుకుంటాడు. అందుకోసం వాళ్ళ ఇంటికి దూరంగా ఉన్న పియర్ చెట్టుని చూడమని పంపించాడు. ప్రతి పిల్లవాడు శీతాకాలం, వసంతం, వేసవి మరియు శరదృతువు అనే విభిన్న సీజన్‌లో వెళ్లమని అడిగారు. నలుగురూ తిరిగొచ్చాక, ఏం చూశావని అడిగాడు తండ్రి. చెట్టు వికారంగా, బేర్ గా మరియు గాలికి వంగి ఉందని మొదటి బిడ్డ చెప్పాడు. మరోవైపు, చెట్టు మొగ్గలతో నిండి ఉందని, ఆశాజనకంగా ఉందని రెండవ బిడ్డ చెప్పాడు. అప్పుడు, మూడవ పిల్లవాడు చెట్టు సువాసనగల పువ్వులతో నిండి ఉందని చెప్పాడు. చివరగా, నాల్గవ పిల్లవాడు చెట్టులో చాలా రుచికరమైన పండ్లు ఉన్నాయని చెప్పాడు. తాము చూసినదంతా నిజమేనని తండ్రి వివరించాడు. వాటిలో ప్రతి ఒక్కరు ఒక సీజన్‌లో మాత్రమే చెట్టును చూశారు. అప్పుడు అతను చెప్పాడు, వారు చెట్లను అంచనా వేయకూడదు, మనుషులను మాత్రమే కాకుండా, ఒక వైపు నుండి మాత్రమే. మౌస్-డీర్ మరియు మొసలి ఒక రోజు, ఒక జింక అక్కడ చెట్టుకింద విశ్రాంతిగా కూర్చుని ఉంది. అతను తన మధ్యాహ్నం అందమైన మరియు చల్లని వర్షపు వాతావరణాన్ని ఆస్వాదించాలనుకున్నాడు. కొంతసేపటికి అతని కడుపు గర్జించింది. అవును, స్మార్ట్ అని చెప్పుకునే జింక ఆకలితో ఉంది. అతను నదికి అవతలి వైపు ఉన్న దోసకాయను పొందాలని ఆలోచిస్తున్నాడు. అకస్మాత్తుగా నది నుండి పెద్ద శబ్దం వచ్చింది. అది మొసలి అని తేలింది. తెలివైన ఎలుక జింక తన ఆకలిని వదిలించుకోవడానికి ఒక ఖచ్చితమైన ఆలోచనను కలిగి ఉంది. అతను తన సీటు నుండి లేచి, మొసలిని కలవడానికి నది వైపు వేగంగా నడిచాడు. "గుడ్ మధ్యాహ్నం మొసలి, నువ్వు తిన్నావా?" జింకను నటిస్తూ అడగండి. కానీ మొసలి మాత్రం జింక ప్రశ్నకు సమాధానం చెప్పకుండా గాఢనిద్రలో ఉన్నట్లు అనిపించి మౌనంగా ఉండిపోయింది. జింక సమీపించింది. ఇప్పుడు మొసలికి దూరం ఒక్క మీటరు మాత్రమే.“అరే బ్బయ్యా, నా దగ్గర చాలా తాజా మాంసం ఉంది. మీ మద్యాహ్న భోజనం పూర్తయిందా?" పెద్ద స్వరంతో మౌస్ జింకను అడగండి. మొసలి అకస్మాత్తుగా నీటిలో తోకను ఊపింది, అది నిద్ర నుండి మేల్కొంది. "అది ఏమిటి? నువ్వు నా నిద్రకు భంగం కలిగిస్తున్నావు" అని మొసలి కాస్త కోపంగా బదులిచ్చింది. “నేను మీకు చెప్పాను, నా దగ్గర తాజా మాంసం పుష్కలంగా ఉంది. కానీ నేను తినడానికి చాలా బద్ధకంగా ఉన్నాను. నాకు మాంసం అంటే ఇష్టం లేదని నీకు తెలియదా? కాబట్టి తాజా మాంసాన్ని మీకు మరియు మీ స్నేహితులకు ఇవ్వాలని నేను భావిస్తున్నాను” జింక అమాయకంగా సమాధానం ఇచ్చింది. "అది నిజమా? నేను మరియు నా స్నేహితులు కొందరు ఇంకా భోజనం చేయలేదు. ఈరోజు చేపలకు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు కాబట్టి మాకు తిండి దొరకడం లేదు” సంతోషంగా సమాధానం చెప్పింది మొసలి. “ఏం యాదృచ్ఛికం, మొసలి ఆకలి గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. నీకు నాలాంటి మంచి స్నేహితుడు ఉన్నంత వరకు. సరియైనదా? హేహెహే” అంటూ జింక కోణాల పళ్ల వరుసను చూపిస్తూ అంది. "ధన్యవాదాలు జింక, మీ హృదయం చాలా గొప్పదని తేలింది. అక్కడ స్నేహితులు చెప్పే దానికి చాలా భిన్నంగా ఉంటుంది. మీరు చాకచక్యంగా ఉన్నారని మరియు మీ ఆశయాలన్నింటినీ నెరవేర్చడానికి మీ స్నేహితుడి అమాయకత్వాన్ని ఉపయోగించుకోవాలని వారు అంటున్నారు, ”అని అమాయక మొసలి సంకోచం లేకుండా సమాధానం ఇచ్చింది. అది విని జింకకు నిజానికి కాస్త చిరాకు కలిగింది. అయినప్పటికీ, నదిలో చాలా దోసకాయలు పొందడానికి అతను ఇంకా అందంగా కనిపించాలి "నేను అంత చెడ్డవాడిని కాదు. అలా ఉండనివ్వండి. వారు నాకు ఇంకా తెలియదు, ఎందుకంటే నేను ఇంతకాలం చాలా ఉదాసీనంగా ఉన్నాను మరియు అలాంటి బుల్‌షిట్‌లను పట్టించుకోను. ఇప్పుడు మీ స్నేహితులను పిలవండి" అని జింక చెప్పింది. మొసలి రిలీఫ్‌గా నవ్వింది, చివరికి ఈరోజు లంచ్ ఉంది. "అబ్బాయిలు, బయటకు రండి. మేము తాజా మాంసంతో చాలా ఉత్సాహం కలిగించే భోజనం చేస్తాము. నీకు నిజంగా ఆకలిగా ఉంది కదా?” మొసలి తన స్నేహితులు త్వరగా బయటకు రావడానికి ఉద్దేశపూర్వకంగా బిగ్గరగా ఉన్న స్వరంలో గట్టిగా అరిచింది. కొద్దిసేపటికే, అదే సమయంలో మరో 8 మొసళ్లు బయటకు వచ్చాయి. మొసలి రాకను చూసి మూషిక జింక “నీట్‌గా లైను వేద్దాం. మీ కోసం నా దగ్గర తాజా మాంసం పుష్కలంగా ఉంది. అది విని 9 మొసళ్ళు నదిలో చక్కగా వరసగా వున్నాయి. "సరే, నేను మీ సంఖ్యను లెక్కిస్తాను, తద్వారా నేను పంచుకునే మాంసం సమానంగా మరియు న్యాయంగా ఉంటుంది" అని జింక మోసగించింది. ఎలుక జింక "ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది మరియు తొమ్మిది" అని చెబుతూనే 9 మొసళ్లను దాటి ఆనందంగా దూకింది. 9 మొసళ్ళు "మా భోజనం కోసం తాజా మాంసం ఎక్కడ ఉంది?". మౌస్ డీర్ నవ్వుతూ, "మీరు ఎంత తెలివితక్కువవారు, నా చేతిలో తాజా మాంసం ముక్క లేదా? అంటే మీ మధ్యాహ్న భోజనం కోసం నా దగ్గర తాజా మాంసం ఏమీ లేదు. ఇది చాలా రుచికరమైనది, ఎటువంటి ప్రయత్నం లేకుండా మీరు ఎలా తినగలరు?". 9 మొసళ్లు కూడా మోసపోయాయని భావించాయి, వాటిలో ఒకటి "మీ చర్యలన్నింటికీ తిరిగి చెల్లిస్తాను" అని చెప్పింది. "ధన్యవాదాలు తెలివితక్కువ మొసలి, నేను చాలా దోసకాయలను వెతకడానికి బయలుదేరుతున్నాను" అని చెబుతుండగా ఎలుక జింక వెళ్ళిపోయింది. నాకు బాగా ఆకలిగా ఉంది". జింక మరియు పులి ఒకరోజు అడవి మధ్యలో ఎలుక ఆడుకుంటోంది. ఎలుకలు ఆనందంగా పాడుతున్నప్పుడు చుట్టూ తిరుగుతాయి. అయినప్పటికీ, అతను చాలా బిజీగా ఉన్నందున, అతను తన ఇంటి నుండి చాలా దూరం నడుస్తున్నట్లు గుర్తించలేదు. చివరగా, అతను తన ఇంటికి చాలా దూరంగా ఆడుతున్నాడని ఎలుక గ్రహించింది. ఎలుక వెంటనే ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే, అతను చాలా దూరం అడవిలోకి ప్రవేశించినందున, అతను తప్పిపోయాడు. అయితే, ఎలుక ఇంటికి మార్గం కోసం చూస్తున్నప్పుడు. అతను ఒక మార్గం కనుగొన్నాడు అని కాదు. లాస్ట్ డి ది స్లీపింగ్ టైగర్స్ నెస్ట్ కూడా. నిద్రపోతున్న పులిని చూసి ఎలుక చాలా భయపడింది. అతను వెంటనే ఒక మార్గాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. అయినప్పటికీ, భయం మరియు భయాందోళన కారణంగా అతను పులి ముక్కును కూడా పరిగెత్తాడు. పులి నిద్రలేచి చాలా కోపంగా ఉంది, ఎందుకంటే అతని విశ్రాంతి సమయం చెదిరిపోయింది. చాలా కోపంతో, పులి పేద ఎలుకను పట్టుకుని దాని పదునైన గోళ్ళతో పట్టుకుంది. అదే సమయంలో, ఎలుక ఉన్న ప్రాంతానికి దూరంగా ఉన్న నదిలో మౌస్ డీర్ తాగుతోంది. మౌస్ డీర్ భయం యొక్క అరుపులను వింటుంది. అతను వెంటనే వాయిస్ ఎక్కడ ఉందో చూసాడు, అతను చాలా ఆశ్చర్యపోయాడు, చాలా పెద్ద పులి తినడానికి సిద్ధంగా ఉన్న ఎలుకను చూశాడు. మౌస్ డీర్ చాలా పెద్ద పులిని చూడటానికి చాలా భయపడింది. అయితే, అతని హృదయం ఎలుకకు సహాయం చేయాలని కోరుకుంది. చివరగా, మౌస్ డీర్ వాటిని చేరుకోవడానికి ధైర్యం చేస్తుంది. ఎలుకలు మరియు పులులను సమీపిస్తున్న మౌస్ డీర్. మౌస్ డీర్ రావడం చూసి ఎలుక చాలా సంతోషించింది, నిజంగా ఎలుక జింక తనకు సహాయం చేయగలదని అతను ఆశించాడు. మౌస్ డీర్ చాలా వైజ్ స్టైల్‌తో వస్తుంది. అయినా ఏం జరుగుతుందో తెలియనట్లు నటించాడు. మౌస్ డీర్ నేరుగా రెండు జంతువులను పలకరించింది. ''ఏం చేస్తున్నారు అబ్బాయిలు? ఆడుకుంటున్నట్లుంది, కలిసి ఆడుకోవచ్చా?'' అని అడిగింది ఎలుక జింక. ఎలుక జింకను చూసి, పులి చాలా ఆశ్చర్యపోయింది. “హహ, నీకు ఎంత ధైర్యం వచ్చింది ఇక్కడికి? నాకు చాలా ఆకలిగా ఉంది." అన్నాడు టైగర్ చాలా దృఢంగా. “హహ, నేను ఎందుకు భయపడాలి హే యు టైగర్. నేను నీ గురించి భయపడుతున్నానా? హహా, నేను ఇక్కడ అన్ని జంతువులను ఓడించగలను. ఈ అడవిలో నేనే రాజుని.’’ అని ఎలుక జింక సమాధానం చెప్పింది. ఎలుక జింక చెప్పింది విని పులి చాలా ఆశ్చర్యపోయింది. అయితే, అతను ఆసక్తిగా ఉన్నాడు. “నువ్వు చెప్పింది నిజమేనా?” అడిగింది పులి. ''మీరు నన్ను నమ్మట్లేదా? అప్పటికీ నమ్మకపోతే నేరుగా నా సలహాదారుని అడగవచ్చు.'' అని మౌస్ జింక మళ్లీ సమాధానం ఇచ్చింది. “సలహాదారుడా? హహ, నేను మీ సలహాదారుని ఎక్కడ కలవగలను?'' అని కుతూహలంగా అడిగింది పులి. “హే టైగర్, నా సలహాదారు ఎవరో మీకు తెలియనట్లు నటిస్తున్నారా? మీరు ఇప్పుడు కలిగి ఉన్న వ్యక్తి, అతను నా విశ్వసనీయ సలహాదారు, ఇక్కడ అతను చాలా గౌరవించబడ్డాడు. అతనికి ఏమైనా జరిగితే నేను నిన్ను క్షమించను పులి!'' దృఢమైన వైఖరితో బదులిచ్చింది ఎలుక జింక. మౌస్ డీర్ కథ ద్వారా టైగర్ ప్రభావితం కావడం ప్రారంభమవుతుంది. పులి ఈ అడవిలో కొత్త నివాసి, కాబట్టి అతనికి ఈ అడవిలోని అన్ని విషయాల గురించి నిజంగా తెలియదు. ఫారెస్ట్ రాజు ఎవరు అనే దానితో సహా. '' హే ఎలుక, మౌస్ డీర్ చెప్పింది నిజమేనా? అతనే ఈ అడవికి రాజు?” అని పులి ఎలుకను అడిగింది. ఎలుక జింక తనకు సహాయం చేయడానికి అబద్ధం చెబుతోందని గ్రహించిన ఎలుక, అతను కూడా మౌస్ డీర్ చేసిన కథాంశాన్ని అనుసరించాడు. ''అవును, ఈ అడవిలో ఎలుక జింక రాజు. మరియు నేను అడవి రాజుకు కాన్ఫిడెంట్‌ని. ఈ అడవిలో మౌస్ డీర్ అన్ని జంతువులచే చాలా భయపడుతుంది మరియు గౌరవించబడుతుంది. మీరు ఇప్పటికీ నమ్మకపోతే. మీరు నేరుగా ఇతర జంతువులను అడగవచ్చు.'' అని ఎలుక బదులిచ్చింది. మౌస్ నుండి సమాధానం విని, అతనికి భయం మొదలైంది. అయితే, అతను తన భయాన్ని చూపించలేదు, ఎందుకంటే పులి భయపడాల్సిన జంతువు, అతను ఎలుక జింక వంటి చిన్న జంతువు చేతిలో ఓడిపోవాలనుకోలేదు. “హహ, నేను మీ ఇద్దరి బుల్‌షిట్‌ను నమ్మలేకపోతున్నాను! నువ్వు చెప్పేది నిజమైతే రుజువు ఎక్కడుంది.'' అని అడిగింది పులి. మౌస్ డీర్ అయోమయంలో ఉంది, అతను తన అబద్ధాన్ని ఎలా నిరూపించగలడు. అయితే, అతని చాతుర్యం కారణంగా. అతను నిజంగా భయపడుతున్నప్పటికీ, అతను పులి ముందు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ''నువ్వు ఇంకా నమ్మలేదా? రుజువు? సరే, కొన్ని రోజులు మంచివి. నేను మీలాంటి పెద్ద పులులను ఓడించాను. పులి చాలా దుర్మార్గంగా ఉంది, నేను ఇప్పటికీ దాని తలను నది పక్కనే ఉంచుతాను, ఎందుకంటే ఈ అడవిలో అసభ్యంగా ప్రవర్తించవద్దని ఇతర జంతువులకు ఇది హెచ్చరిక. మీకు రుజువు కావాలంటే, నేను వెంటనే చూపిస్తాను. అయితే, నేను మీకు చూపించిన తర్వాత, మీరు చింతించలేరు." మౌస్ డీర్ అన్నారు. పులి భయంగా అనిపిస్తుంది. అయితే, అతను తన భయాన్ని చూపించవద్దని బలవంతం చేశాడు. “సరే, పేద పులిని ఎక్కడ చూపించబోతున్నావు. అయినా నన్ను మోసం చేస్తే మీరిద్దరూ నా భోజనం అయిపోతారు!'' అంది పులి. పులి అరుపు విని ఎలుక చాలా భయపడిపోయింది. అయితే, అతను ఎలుక జింక యొక్క చాతుర్యాన్ని నమ్మాడు, ఎలుక జింక ఎలుకను చూసి కన్ను కొట్టింది. మౌస్ డీర్ నేరుగా పులులను అడవిలోని నదీతీరానికి తీసుకువస్తుంది. వారు నది ఒడ్డున ఉన్న బావి వద్దకు వెళ్లారు. బావి చాలా చీకటిగా మరియు లోతుగా ఉంది. అయితే, సూర్యుని కాంతి ప్రతిబింబం వల్ల స్పష్టమైన నీరు అద్దంలా మెరుస్తుంది. “మేము వెల్ వద్దకు వచ్చాము నా ఉద్దేశ్యం. ఇప్పుడు నువ్వే నిరూపించుకో, బావి దగ్గర నీవే చూసుకో.’’ అంది ఎలుక జింక. టైగర్ చాలా క్యూరియస్ గా అనిపిస్తుంది. అయితే, అతని హృదయం చాలా భయపడింది, అతను బావిలోకి చూడటానికి కూడా ధైర్యం చేశాడు. భయంతో అతను కేవలం పీకి చూశాడు. అయితే, అతను కళ్ళు తెరిచి చూసేసరికి పులి తల నిజంగానే ఉంది అని చాలా ఆశ్చర్యపోయాడు. కాన్సిల్ చెప్పింది నిజమేనని తేలింది. అతను నిజంగా అడవికి రాజు. భయంతో వెంటనే పారిపోయాడు. అతను ఎలుక జింకను తినే భయంతో వెంటనే పరుగెత్తాడు. చూడండి, పులి చాలా వేగంగా నడుస్తుంది. ఎలుక జింక మరియు ఎలుక సంతృప్తితో నవ్వాయి, వారు గర్విష్ట పులిని మోసగించగలిగారు. నిజానికి, బావిలో గాజులాగా చాలా స్పష్టంగా ఉండే నీరు తప్ప మరేమీ లేదు. పులి మూర్ఖత్వం కారణంగా, బావిలో ఉన్న పులి తల తన నీడ అని అతనికి తెలియదు. మళ్ళీ, మౌస్ డీర్ తన స్నేహితుడి ఎలుకను రక్షించడానికి మోసగించడంలో విజయం సాధించింది. ది ఆరిజిన్ ఆఫ్ మెర్మైడ్స్ ఒకప్పుడు, భార్యాభర్తలు మరియు వారి ముగ్గురు చిన్న పిల్లలు నివసించారు. ఒకరోజు ఉదయం అన్నం, చేపలు తిన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో వాటా వస్తుంది. మిగిలిపోయిన చేపలు తినలేదని, భార్యకు ఈ మధ్యాహ్నం ఆహారం కోసం మిగిలిన చేపలను సిద్ధం చేయండి అని భర్త భార్యకు సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె కూడా తన భర్త సందేశంతో ఏకీభవించింది. అయితే, మధ్యాహ్న భోజన సమయంలో, చిన్నవాడు అకస్మాత్తుగా కన్నీళ్లు పెట్టుకున్నాడు మరియు మధ్యాహ్నం భోజనం కోసం చేపలను రక్షించమని కోరాడు. ఆమె భర్త తోటలోనే ఉండగా. ఆ చేప మధ్యాహ్నం తర్వాత తండ్రికి తిండికి అని పిల్లవాడికి ఒక అవగాహన కూడా ఇచ్చాడు. అయితే, చిన్నవాడు నిజానికి చాలా గట్టిగా ఏడ్చాడు. చివరగా, మిగిలిన చేపలను చిన్నవాడికి ఇచ్చాడు మరియు ఏడుపు ఆగిపోయింది. అయితే రోజంతా తోటలో పని చేసి అలసిపోయి ఆకలితో భర్త ఇంటికి వచ్చాడు. చేపలతో విందు చేస్తానని ఊహించాడు. చాలా త్వరగా, భార్య తండ్రికి భోజనం వడ్డించింది. అయితే ఈ ఉదయం తండ్రికి మిగిలిన చేపలు కనిపించలేదు. అతను కూడా తన ముఖాన్ని పుల్లగా మార్చుకున్నాడు. "నా భార్య, ఈ రోజు ఉదయం వదిలివేసిన చేప ఎక్కడ ఉంది?" అని అడిగాడు. భార్య "క్షమించండి నా భర్త, భోజనంలో, మా చిన్న పిల్లవాడు చేపలు తినమని ఏడుస్తూ అడుక్కుంటున్నాడు" అని సమాధానం ఇచ్చింది. కొడుకు క్యారెక్టర్‌ని అర్థం చేసుకునే బదులు భర్త ఆగ్రహానికి గురయ్యాడు. అప్పటి నుండి, భార్య సముద్రంలో చేపలు పట్టవలసి వచ్చింది. భర్త కనికరం లేకుండా, "మీరు తిన్న చేపలకు బదులుగా చాలా చేపలు వచ్చే వరకు మీరు ఇంటికి వెళ్లకూడదు." ఇవి కూడా చదవండి: పన్ను విధులు: విధులు మరియు రకాలు [పూర్తి] చివరకు, భార్య చాలా బాధపడి, భర్తను బాధించింది. తన ముగ్గురు పిల్లలను విడిచిపెట్టడం ఆమెకు చాలా కష్టంగా ఉంది, ముఖ్యంగా తల్లిపాలు తాగుతున్న చిన్నపిల్ల. చాలా సేపటికి అతని తల్లి ఇంటికి రాకపోవడంతో అతని ముగ్గురు పిల్లలు చాలా మిస్ అయ్యారు. చివరకు సముద్రం వైపు అతని తల్లి కోసం వెతికారు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో తల్లి ఆచూకీ లభించలేదు. అయితే, అకస్మాత్తుగా ఆమె తల్లి వచ్చి తన చిన్న బిడ్డకు పాలిచ్చింది. అతను తన ముగ్గురు పిల్లలను ఇంటికి వెళ్ళమని ఆదేశించాడు మరియు అతను త్వరలో తిరిగి వస్తానని హామీ ఇచ్చాడు. అయినా తల్లి తిరిగి రాకపోవడంతో సముద్రం వైపు వెతికారు. చివరగా సగం స్కేల్స్‌తో ఉన్న ఒక మహిళ యొక్క బొమ్మను కలుసుకున్నారు, అప్పుడు అతను చిన్నవాడికి పాలు పట్టాడు. అయితే హఠాత్తుగా వాళ్ల అమ్మలో మార్పు కనిపిస్తోంది. అతని శరీరంలో సగం వైపులా ఉన్నాయి. వాళ్ళు కూడా “నువ్వు నా తల్లివి కావు” అన్నారు. అతను వివరించినప్పటికీ, వారు ఇప్పటికీ వారిని తల్లులుగా గుర్తించలేదు. మరియు వారు ఆమె తల్లి పేరును పిలిచినప్పుడు, కనిపించింది అదే స్త్రీ సగం ప్రమాణాలతో. చివరకు వారు తమ తల్లిని ఎన్నడూ కనుగొనలేదని భావించినందున వారు సముద్రాన్ని విడిచిపెట్టారు. మేజిక్ అద్దం ఒకప్పుడు గ్రెనడా అనే రాజు భార్య కోసం వెతుకుతున్నాడు. పోటీ కూడా నిర్వహించాడు. తన భార్య కావాలనుకునే వ్యక్తి జీవితంలో మంచి చెడులను చూపించగల అద్భుత అద్దంలోకి చూడాలి. వాస్తవానికి రాణి కావాలని ఉత్సాహంగా ఉన్న మహిళలు వెంటనే అవసరాలను చూసి నిరుత్సాహపడ్డారు. ప్రతి ఒక్కరూ తమ అల్సర్ల గురించి తెలుసుకుంటారని వారు ఆందోళన మరియు ఇబ్బంది పడుతున్నారు. స్వచ్ఛందంగా ముందుకు రావడానికి ధైర్యం చేసిన మహిళ ఒక్కరే. అతను దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన గొర్రెల కాపరి. అతను ఎప్పుడూ పాపం చేయలేదని భావించాడు కాబట్టి కాదు. కానీ అతని ప్రకారం, ప్రతి ఒక్కరూ తప్పులు చేసి ఉండాలి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలనుకున్నంత కాలం, ప్రతిదీ క్షమించబడవచ్చు. సంకోచం, భయం లేకుండా అద్దంలోకి చూసుకున్నాడు. ఆ తరువాత, రాజు అద్దం నిజానికి ఒక సాధారణ అద్దం అని చెప్పాడు. అక్కడ ఉన్న మహిళల విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నాడు. ఆఖరికి పెళ్లి చేసుకొని ఆనందంగా జీవించారు. ది స్ట్రిప్డ్, ది బాల్డ్ అండ్ ది బ్లైండ్ ఇజ్రాయెల్ పిల్లల నుండి మూడు బొమ్మలు ఉన్నాయి, అవి చారలు, బట్టతల మరియు అంధులు. ఒకరోజు అల్లా ముగ్గురినీ పరీక్షిస్తాడు. అతను గీత వద్దకు దేవదూతను కూడా పంపాడు. చివరగా దేవదూత "నీకు జీవితంలో నిజంగా ఏమి కావాలి?" "నా రోగం నయమై చివరకు అందమైన చర్మాన్ని కలిగి ఉన్నాను, నన్ను చూస్తే ఎవరూ అసహ్యించుకోలేరు" అని గీత సమాధానం ఇచ్చింది. చివరగా దేవదూత గీతను రుద్దాడు మరియు లోపం వెంటనే పోయింది, మెరుస్తూ మరియు శుభ్రంగా ఉంది. అప్పుడు, దేవదూత మళ్లీ అడిగాడు, "ఏ రకమైన జంతువు మిమ్మల్ని ఎక్కువగా సంతోషపెట్టగలదు?" గీత కూడా "ఒంటె" అని సమాధానం ఇచ్చింది. అప్పుడు దేవదూత గర్భవతి అయిన ఒంటెను ఇచ్చి "అల్లాహ్ నీకు ఉన్నదానికి అనుగ్రహించుగాక" అన్నాడు. ఆ తర్వాత, దేవదూత బట్టతల వ్యక్తి వద్దకు వచ్చి, "మీకు ఎక్కువగా ఏమి కావాలి?" అని అదే ప్రశ్న అడిగాడు. బట్టతల మనిషి "అందమైన జుట్టు" అని బదులిచ్చాడు. అప్పుడు, దేవదూత బట్టతల తలని రుద్దాడు మరియు అకస్మాత్తుగా అతని తల చాలా అందమైన జుట్టు పెరిగింది. అప్పుడు దేవదూత మళ్ళీ అడిగాడు, "ఏ జంతువు మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది?". అతను "ఆవు" అని సమాధానం ఇచ్చాడు. చివరగా, దేవదూత గర్భవతిగా ఉన్నప్పుడు ఒకదాన్ని ఇచ్చి, "అల్లా మీకు ఉన్న సంపదను ఆశీర్వదిస్తాడు" అని చెప్పాడు. చివరకు, దేవదూత అంధుడి వద్దకు వచ్చి, "మీకు ఎక్కువగా ఏమి కావాలి?" అని అడిగాడు. అంధుడు, "నేను మళ్ళీ చూడగలగాలి కాబట్టి నేను ప్రజలను చూడగలను" అని సమాధానమిచ్చాడు. దేవదూత చివరకు తన కళ్ళు తుడుచుకున్నాడు మరియు వెంటనే అతను మళ్లీ చూడగలిగాడు. దేవదూత కొనసాగించాడు, “ఏ జంతువు మిమ్మల్ని సంతోషపరుస్తుంది?”. గుడ్డివాడు, "మేక" అని జవాబిచ్చాడు. దేవదూత గర్భవతి అయిన మేకను ఇచ్చి గుడ్డివాడికి వీడ్కోలు చెప్పాడు. కాలక్రమేణా, వారు అభివృద్ధి చేసిన జంతువులు చాలా త్వరగా పునరుత్పత్తి మరియు ఆరోగ్యంగా ఉన్నాయి. అతనికి చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. అప్పుడు, అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం వారిని వివిధ రూపాల్లో పరీక్షించడానికి దేవదూతలు తిరిగి వారి వద్దకు వచ్చారు. దేవదూత గీత వద్దకు వచ్చి, “నేను పేదవాడిని. నా ట్రిప్‌కి కావలసిన సామాగ్రి అయిపోయింది. మరియు మీరు మరియు అల్లాహ్ తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. అప్పుడు నాకు సహాయం చెయ్యి." గీత, "నా వ్యాపారం చాలా ఎక్కువ మరియు నేను మీకు ఏమీ ఇవ్వలేను" అని సమాధానం ఇచ్చింది. దేవదూత ఇలా జవాబిచ్చాడు, “నాకు నువ్వు తెలుసునని అనిపిస్తోంది. ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకునే గీత వ్యాధిని మీరు కలిగి ఉన్నారు. నువ్వు అల్లా సహాయం పొందిన పేదవాడివి” "లేదు, నేను పేదవాడిని కాదు, నా పూర్వీకుల ఆస్తిని నేను వారసత్వంగా పొందాను" అని బేలాంగ్ చెప్పారు. దేవదూత ఇలా జవాబిచ్చాడు, "నువ్వు అబద్ధం చెబితే, అల్లా నిన్ను మునుపటిలా తిరిగి వచ్చేలా చేస్తాడు". అప్పుడు దేవదూత బట్టతల మనిషి వద్దకు వచ్చి, చారల మనిషికి సహాయం చేయమని అడిగాడు. అయితే బట్టతల కూడా ఇదే సమాధానం చెప్పగా ఏంజెల్ కూడా అదే స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ తరువాత, దేవదూత చివరి వ్యక్తి వద్దకు వచ్చాడు, అవి అంధుడు. అతను ఇలాంటి సహాయాన్ని అందిస్తాడు. మరియు అంధులు చాలా నిజాయితీగా సమాధానం ఇచ్చారు, “నిజానికి నేను గుడ్డివాడిని. అప్పుడు అల్లా నాకు మళ్లీ చూపు ప్రసాదించాడు. కాబట్టి మీకు నచ్చినవి తీసుకోండి మరియు మీకు నచ్చని వాటిని వదిలివేయండి. ఎందుకంటే ఇదంతా దేవుడిచ్చిన డిపాజిట్ మాత్రమే" చివరగా, దేవదూత నవ్వి, "నేను నిన్ను పరీక్షించాలనుకుంటున్న దేవదూతను. అల్లా మీ పట్ల చాలా సంతోషిస్తున్నాడు మరియు మీ ఇద్దరు స్నేహితుల పట్ల చాలా కోపంగా ఉన్నాడు." బంగారు గుడ్డు ఒకప్పుడు, రోజూ బంగారు గుడ్డు పెట్టగల ఒక గూస్ ఉండేది. గూస్ ఒక రైతు మరియు అతని భార్య స్వంతం. ఈ గుడ్ల వల్ల వారు హాయిగా మరియు బాగా జీవించగలరు. ఈ సౌకర్యం చాలా కాలం ఉంటుంది. అయితే ఒకరోజు హఠాత్తుగా ఆ రైతు మదిలో ఓ ఆలోచన మెదిలింది. “నేను రోజుకు ఒక గుడ్డు ఎందుకు తీసుకోవాలి? ఒక్కసారిగా నేనెందుకు ధనవంతుడవుతాను?" అనుకున్నాడు. అతని భార్య ఈ ఆలోచనతో అంగీకరించినట్లు తెలుస్తోంది. వారు గూస్‌ను కూడా వధించి దాని కడుపుని చీల్చారు. కడుపులో మాంసాహారం, రక్తం మాత్రమే ఉండడం చూసి వారు ఎంత ఆశ్చర్యపోయారు. గుడ్లు అస్సలు ఉండవు, బంగారం మాత్రమే. వారు విపరీతంగా ఏడ్చారు. వారు ఇకపై ఆధారపడే స్థిరమైన ఆదాయ వనరు లేదు. రేపటికి బతకాలంటే కష్టపడాలి. హంగ్రీ బేర్ ఒకరోజు నది ఒడ్డున ఒక ఎలుగుబంటి చాలా పెద్ద శరీరాన్ని కలిగి ఉంది. అతను తినడానికి చేపల కోసం వెతుకుతున్నాడు. ఆ సమయంలో, చేపలు ఇంకా సీజన్‌లో లేవు. అందువల్ల, నది ఒడ్డున దూకిన చేపను పొందడానికి ఎలుగుబంటి కాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఉదయం నుంచి ఎలుగుబంటి బయటకు దూకిన చేపను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ అతనికి ఒక్క చేప కూడా లభించలేదు. కానీ చాలాసేపు వేచి ఉన్న తర్వాత, అతను ఒక చిన్న చేపను పట్టుకోగలిగాడు. ఎలుగుబంటికి చిక్కిన తరువాత, చేప చివరకు నొప్పితో అరిచింది. అతను పెద్ద ఎలుగుబంట్లకు కూడా భయపడతాడు. అప్పుడు, చిన్న చేప ఎలుగుబంటి వైపు చూసి "ఓ ఎలుగుబంటి, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి" అని చెప్పింది. ఎలుగుబంటి బదులిచ్చింది "నేను నిన్ను ఎందుకు వెళ్ళనివ్వాలి? నీ కారణం ఏమిటి?" "నేను చాలా చిన్నవాడిని అని మీరు చూడలేదా. నేను మీ దంతాల ఖాళీని అధిగమించగలను. చెప్పండి, ముందు నన్ను నదికి వెళ్ళనివ్వండి. అప్పుడు నేను కొన్ని నెలల్లో పెద్ద చేపగా పెరుగుతాను. ఆ సమయంలో నీ ఆకలి తీర్చుకోవడానికి నన్ను పట్టుకుని తినవచ్చు’’ అంది చేప. అప్పుడు, ఎలుగుబంటి "ఓ చిన్న చేప, నేను ఎందుకు చాలా పెద్ద ఎలుగుబంటిని అవుతానో తెలుసా?" "ఎందుకు ఎలుగుబంటి?" అని తల ఊపుతూ సమాధానం చెప్పింది చేప. "అందుకు కారణం నేను ఎప్పుడూ కొంచెం కూడా వదులుకోలేదు. చిన్నదయినా నా చేతిలో ఉన్న అదృష్టాన్ని నేనెప్పుడూ వదులుకుంటానని నమ్ముతాను కాబట్టి, ఎలుగుబంటి పెద్దగా నవ్వుతూ బదులిచ్చింది. “ఆప్!” అని అరిచింది చేప. ది స్టోరీ ఆఫ్ ది కింగ్ అండ్ ది ఇంజీనియస్ సోత్సేయర్ ఒక రాత్రి, ఒక రాజు ఆశ్చర్యపోయాడు మరియు నిద్ర నుండి మేల్కొన్నాడు. అతనికి చెడ్డ కల వచ్చింది. ఊపిరి పీల్చుకుంటూ, అతను రాజ్యంలోని ఈకలను కూడా పిలిచాడు. వెంటనే రాజభవనం జాతకాన్ని పిలవమని ఈకలను కోరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాజభవన అదృష్టవంతుడు వచ్చి రాజును నేరుగా ఎదుర్కొన్నాడు. అప్పుడు రాజు తనకు వచ్చిన కలను చెప్పాడు. “నాకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఒక కలలో, నా దంతాలన్నీ పడిపోవడం చూశాను. జాతకుడు అంటే ఏమిటో తెలుసా?" "సార్, నేను క్షమాపణలు కోరుతున్నాను. ఇప్పటివరకు నాకు తెలిసిన దాని ప్రకారం, ఈ వింత కల అంటే దురదృష్టం మీ మహారాజును తాకుతుందని అర్థం. నా అభిప్రాయం ప్రకారం, రాలిన ప్రతి పంటి అంటే కుటుంబంలోని ఒక సభ్యుడు చనిపోతాడని అర్థం. మరియు దంతాలన్నీ రాలిపోతే, మీ మెజెస్టి గొప్ప విపత్తును అనుభవించారని అర్థం, అంటే మీ కుటుంబ సభ్యులందరూ చనిపోతారు. జాతకుడు చెప్పిన చెడు శకునం రాజుకు కోపం తెప్పించింది. మరియు దాని కారణంగా, ఆ జాతకుడు చివరకు శిక్షించబడ్డాడు. అప్పుడు రాజు బులుబలాంగ్‌ని మరొక జాతకుడు వెతకమని అడిగాడు. ఆ తర్వాత కొత్త జాతకుడు వచ్చాడు. రాజుగారి కథ విన్న తర్వాత కొత్త జాతకుడు నవ్వాడు. "సార్, నాకు తెలిసిన దాని ప్రకారం, మీ కల అంటే మీరు చాలా అదృష్టవంతులు అవుతారని అర్థం, ఎందుకంటే మీరు మీ కుటుంబ సభ్యులందరితో ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం జీవిస్తారు" అని జాతకుడు చెప్పాడు. రెండవ జ్యోతిష్యుడు చెప్పినది విన్న రాజు మొహంలో చిరునవ్వు వికసించాడు. ఆ జాతకుడు చూసి రాజు చాలా సంతోషించాడు. "మీరు నిజంగా చాలా తెలివైన మరియు తెలివైన అదృష్టవంతులు. నీ పరాక్రమానికి ప్రతిఫలంగా నీ కోసం ప్రత్యేకంగా ఐదు బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను’’ అన్నాడు రాజు. చివరగా, తెలివైన మరియు తెలివైన రెండవ పెరవాక్ ఒంటరిగా పాట నుండి బహుమతిని అందుకున్నాడు మరియు అతను చాలా సంతోషించాడు. చిక్కుకుపోయింది ఒక రోజు, ఒక వ్యక్తి ఓడ ప్రమాదంలో చిక్కుకుని జనావాసాలు లేని ద్వీపంలో చిక్కుకుపోతాడు. భగవంతుడు తనను రక్షించాలని ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజూ అతను సహాయం కోసం వేచి ఉన్న సముద్రాన్ని చూసాడు. రోజు గడిచిపోయింది, అతను ఆశించినది రాలేదు. బతకడం కోసం, అతను అడవిలో ఆహారం కోసం వెతుకుతాడు మరియు తాత్కాలిక గుడిసెను నిర్మించడానికి ప్రయత్నిస్తాడు. గుడిసె పూర్తయిన కొద్దిసేపటికే, మనిషి ఆహారం కోసం వెళ్ళాడు. అతను తిరిగి వచ్చినప్పుడు అతను ఎంత ఆశ్చర్యపోయాడు, ఏమీ మిగిలిపోయేంత వరకు మంటలు గుడిసెను చుట్టుముట్టాయి. అతను నిరాశ మరియు నిరుత్సాహానికి గురయ్యాడు. దేవుడు తన గురించి ఇక పట్టించుకోడు అని అతను కోపంగా ఉన్నాడు. ఏడుస్తూ అలసిపోయి ఇసుక మీద నిద్రపోయాడు. మరుసటి రోజు, ఓడ సమీపిస్తున్న శబ్దానికి అతను మేల్కొన్నాడు. ఇంతమంది తనను ఎలా కనిపెట్టగలిగారనే ఆశ్చర్యంతో అతను ఉపశమనం పొందాడు. సాయం వస్తుందని ఎదురుచూడక చాలా కాలంగా వదులుకున్నా. అది ముగిసినప్పుడు, ఆ ప్రజలు నిన్న కాలిపోయిన గుడిసె నుండి పొగను చూశారు. అతను విపత్తుగా భావించినది వాస్తవానికి దేవుని నుండి వచ్చిన ఆశీర్వాదమని ఆ వ్యక్తి గ్రహించాడు. ది ఫూల్ అండ్ ది డాంకీ ఒకరోజు, ఒక తండ్రీ కొడుకులు తమ గాడిదను బజారుకు తీసుకెళ్తుండగా నడుచుకుంటూ వెళ్తున్నారు. "మూర్ఖుడు, గాడిద ఉంది, ఎందుకు నడుస్తున్నావు?" అని ఒక వ్యక్తిని వారు దాటవేశారు. కాబట్టి తండ్రి తన కొడుకును గాడిదను ఎక్కించమని అడిగాడు. వారు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. కొద్దిసేపటికే, వారు మళ్లీ మరొక వ్యక్తిని కలిశారు. ఈసారి ఆ వ్యక్తి ఇలా వ్యాఖ్యానించాడు, “మీరు సోమరితనం. తన తండ్రిని కాలినడకన వదిలేసినప్పుడు అతను గాడిద స్వారీ చేయడం ఎందుకు ఆనందిస్తాడు? ” చివరగా, తండ్రి తన కొడుకును క్రిందికి రమ్మని అడిగాడు. కొడుకు నడుచుకుంటూ వెళుతుండగా గాడిద ఎక్కడం అతని వంతు. కొద్దిదూరంలో, వారు ఒకరితో ఒకరు గుసగుసలాడుతున్న స్త్రీల గుంపులోకి పరిగెత్తారు, “ఏం పాపం ఆ పిల్లవాడికి. అతను నడవాల్సి ఉండగా అతని తండ్రి గాడిద ఎక్కాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, చివరికి తండ్రి తన పెంపుడు జంతువును తొక్కడానికి రమ్మని తన కొడుకును ఆహ్వానిస్తాడు. మళ్ళీ, వారు స్థానికులను కలుసుకున్నారు, "ఆ పేద గాడిదను మీ పెద్ద శరీరాలను భరించడానికి మీ ఇద్దరికీ సిగ్గు లేదా?" తండ్రీ కొడుకులు దిగి వచ్చారు. చాలా ఆలోచించి చివరకు గాడిద కాళ్లను స్తంభానికి కట్టేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ స్తంభాన్ని, గాడిదను ఎత్తుకుని ప్రయాణం కొనసాగించారు. ఒకరినొకరు దాటిన జనం వారి మూర్ఖత్వానికి నవ్వుకున్నారు. ఒక వంతెన వద్దకు చేరుకోగానే గాడిద కాలు పట్టీ ఒకటి విప్పి తిరుగుబాటు చేసేలా చేసింది. దురదృష్టవశాత్తు, గాడిద నదిలో పడిపోయింది మరియు చివరికి మునిగిపోయింది. తండ్రి కొడుకులు తమ గాడిదను శాశ్వతంగా కోల్పోయారు. మంకీ కింగ్ ఆఫ్ ది జంగిల్ ఒకప్పుడు అడవి మధ్యలో అడవికి రాజుగా మారిన సింహం గొంతు వినిపించింది. అటవీ వేటగాళ్లలో ఒకరు కాల్చి చంపినందుకు సింహం నొప్పితో మూలుగుతూ ఉంది. ఈ సంఘటన విని, అరణ్యవాసులందరూ తమకు రాజు లేనందున కలత చెందారు. వారి వద్ద ఉన్న ఏకైక రాజును వేటగాడు కాల్చి చంపాడు. అడవి వాసులు చివరకు అడవి రాజు ఎన్నిక కోసం సమావేశమయ్యారు. అడవికి కొత్త రాజును కనుగొనడానికి వారు చర్చలు కూడా జరిపారు. ముందుగా ఎంపికైంది చిరుతపులి. అయితే, మనుషులు ఒంటరిగా భయపడి పరిగెత్తడం చూసి అతను నిరాకరించాడు. మరో జంతువు ఇలా చెప్పింది, "చిరుతపులి ఇష్టం లేకపోతే ఖడ్గమృగం చాలా బలంగా ఉంది" కానీ ఖడ్గమృగం కూడా నిరాకరించింది "నాకు కంటిచూపు సరిగా లేదు కాబట్టి నేను తరచూ చెట్లను కొడతాను" అప్పుడు ఇతర జంతువు "ఏనుగు శరీరం అతిపెద్దది కనుక ఏనుగులో ఏది తగినది" అని చెప్పింది. "నా శరీరానికి చాలా నెమ్మదిగా కదలికలు ఉన్నాయి మరియు పోరాడలేవు" అని ఏనుగు సమాధానం ఇచ్చింది. అతను కూడా కొనసాగించాడు "బహుశా ఈరోజుకి అది మొదట సరిపోతుంది మరియు రేపు కొనసాగించవచ్చు" అయితే, అందరూ చెదరగొట్టే సమయంలో, కోతి "మనుష్యులను రాజుగా చేస్తే, అతను సింహాన్ని కాల్చివేసాడు" అని అరిచింది. "కాదు" అని ఉడుత సమాధానం ఇచ్చింది. "నాపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి, నేను మనుషులతో సమానంగా లేనా? అప్పుడు నీకు రాజు కావడానికి నేనే సరైన జంతువును’’ అంది కోతి. చర్చల తర్వాత, చివరకు అడవికి రాజుగా సింహం స్థానంలో కోతి ఉందని అక్కడ ఉన్న వారందరూ అంగీకరించారు. అతను అడవికి కొత్త రాజు అయ్యాడు. అయితే, అతను రాజు అయ్యాక, కోతి రాజుగా ఉండటానికి అర్హత లేని వైఖరిని కలిగి ఉంది. ఇది కేవలం సోమరి జీవితం. చివరకు జంతువులన్నీ అతనిపై కోపంగా ఉన్నాయి. చివరగా తోడేళ్ళు ఒకరోజు కోతిని ఆహారం తినే ప్రదేశానికి తీసుకెళ్లాయి. మరియు కోతి అంగీకరించింది. చివరగా, కోతి అక్కడ ఉన్న వివిధ వంటకాలను తినేసింది. చివరగా, కోతి మానవుల ఉచ్చులో చిక్కుకుంది మరియు అది భూమిలోని రంధ్రంలో పడిపోయేలా చేసింది. అతను సహాయం కోరినప్పుడు ఎవరూ అతనికి సహాయం చేయలేదు ఎందుకంటే అతను తెలివితక్కువ రాజు మరియు తన ప్రజలను రక్షించలేడు. చివరకు, అతను రంధ్రంలో వదిలివేయబడ్డాడు. ఇనుము తినే ఎలుక ఒకప్పుడు జ్వీర్నాధనుడు అనే సంపన్న వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు అతని గ్రామం ఆకస్మిక వరదల బారిన పడింది, దాని వలన అతను దాదాపు తన ఆస్తులన్నీ కోల్పోయాడు. జ్వీర్నాధనా తన అదృష్టాన్ని మరెక్కడా పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. తన పూర్వీకుల నుంచి సంక్రమించిన పెద్ద ఇనుప కడ్డీని మినహాయించి అప్పులు తీర్చేందుకు తన మిగిలిన ఆస్తులన్నింటినీ అమ్మేశాడు. ఆమెను కదిలించలేక జ్వీర్నాధన తన ప్రాణ స్నేహితుడైన జనక్‌కి ఇనుమును అప్పగించింది. తన వ్యాపారం సక్సెస్ అయ్యాక ఒక రోజు తీసుకుంటానని చెప్పాడు. చాలా సంవత్సరాల తరువాత, జ్వీర్నాధన వ్యాపారం విజయవంతమైంది. అతను తన గ్రామానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు మరియు జనక్ వద్దకు వెళ్ళాడు. కానీ జ్వీర్నాధనా ఐరన్ బ్యాక్ అడిగినప్పుడు, ఆమె స్నేహితురాలు ఇనుమును ఎలుకలు తినేశాయని కూడా చెప్పింది. జనక్ నిజానికి ఇనుమును కలిగి ఉండాలని కోరుకున్నాడు, ఎందుకంటే దానిని విక్రయించడం చాలా ఖరీదైనదని అతనికి తెలుసు. ఎలుకలు ఇనుమును తింటాయనే నమ్మకం లేనప్పటికీ, జ్వీర్నాధనా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. అతను వీడ్కోలు చెప్పాడు మరియు సమస్యను మరచిపోమని జానక్‌ని కోరాడు. జ్వీర్నాధనుడు జనకుని కొడుకు రాముడిని కూడా తనతో రమ్మని అడుగుతాడు. జానక్ కోసం తన దగ్గర ఒక బహుమతి ఉందని, దానిని రాముడికి వదిలివేస్తానని చెప్పాడు. ఇంటికి వచ్చిన జ్వీర్నాధన రాముని బదులుగా ఒక గదిలో బంధిస్తుంది. కొడుకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన జనక్ జీవీనాధనా ఇంటికి వెళ్లాడు. జ్వీర్నాధనా తన కొడుకును కాకి తీసుకువెళ్లిందని చెప్పినప్పుడు అతను ఎంత ఆశ్చర్యపోయాడు. నమ్మశక్యం కాని వారి మధ్య పెద్ద గొడవ జరిగింది. చివరకు కేసు కోర్టుకు వచ్చింది. జడ్జి ముందు జ్వీర్నాధనుడు, "నా ఇనుమును ఎలుక తినగలిగితే, కాకి జనకుని కొడుకును ఎందుకు తీసుకోదు?" ఇవి కూడా చదవండి: వివాహితులు మరియు నూతన వధూవరుల కోసం ప్రార్థనల సేకరణ [పూర్తి] అది విన్న జనక్ తేరుకొని క్షమాపణలు కోరతాడు. జడ్జి జ్వీర్నాధనా యొక్క ఇనుమును తిరిగి ఇవ్వమని మరియు ఆమె కొడుకును తిరిగి పొందమని జనక్‌ని అడుగుతాడు. మౌస్ డీర్ మరియు నత్త దిగువ కథ నత్తకు నెమ్మదిగా నడిచే అలవాటు ఉన్నందున నత్తను రేసులో పరుగెత్తడానికి ఆహ్వానించిన గర్విష్ట జింక గురించి చెబుతుంది. పూర్తి కథనం ఇక్కడ ఉంది. ఒకానొకప్పుడు అడవిలో ఒక జింక పరిగెడుతూ ఉండేది. అప్పుడు అనుకోకుండా నది ఒడ్డున ఒక నత్తను కలిశాడు. చాలా గర్వంగా ఉన్న ఎలుక జింక ఎలుకను ఎగతాళి చేసింది, ఎందుకంటే నత్త నెమ్మదిగా నడవగలిగింది, ఎలుక జింక తన ఇష్టం వచ్చినట్లు పరిగెత్తగలదు. చాలా గర్వంగా, చివరకు ఎలుక జింక నత్తతో ఇలా చెప్పింది. "ఏయ్ నత్త, నాతో రేసులో పాల్గొనడానికి నీకు ధైర్యం ఉందా?" జింక అహంకార స్వరంతో చెప్పింది మరియు జింకపై గెలవడం ఎప్పటికీ సాధ్యం కాదని నత్త ఖచ్చితంగా నిరాకరిస్తుంది అని అతనికి తెలుసు. అయితే జరిగింది ఊహించనిది, జింక సవాలును నత్త స్వీకరించినట్లు తేలింది. చివరగా, వారిద్దరూ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు మరియు వారి మ్యాచ్ రోజును రేసు పరుగుగా నిర్ణయించారు. చివరగా, అందరూ అంగీకరించారు మరియు పోటీ జరిగిన D రోజు కోసం ఎలుక జింక వేచి ఉండలేకపోయింది. రేసు రోజు కోసం ఎదురుచూస్తూనే ఎట్టకేలకు నత్త వ్యూహం రచించింది. అహంకారంగా మరియు అహంకారంతో పరుగెత్తడానికి రేసును ఆహ్వానించే జింక యొక్క సవాళ్లను సేకరించి చెప్పడానికి నత్త ఇతర తోటి నత్తలను ఆహ్వానిస్తుంది. చివరకు మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఏదో ఒక అంశంపై చర్చించుకున్నారు. వ్యూహం ఏమిటంటే, నది ఒడ్డున, నత్తలు చక్కగా వరుసలో ఉండాలి మరియు జింక పిలిచినప్పుడు, ఒడ్డున ఉన్నవారు జింకకు సమాధానం ఇవ్వాలి. అందువలన ముగింపు రేఖ వరకు. చివరగా, చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చింది. దాదాపు అన్ని అటవీ నివాసులు ఎలుక జింక మరియు నత్త మధ్య రేసును చూడటానికి వస్తారు. ఇద్దరూ కలిసి స్టార్టింగ్ లైన్‌లో నిలబడేందుకు సిద్ధమై రేసు ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. రన్ అండ్ రన్ నాయకుడు వారిద్దరినీ "మీరు సిద్ధంగా ఉన్నారా?" . ఇద్దరూ "రెడీ" అని సమాధానం ఇచ్చారు. కాబట్టి రేసు నాయకుడు "ప్రారంభించు!". ఇద్దరూ స్పాంటేనియస్ గా పరుగులు తీశారు. మరియు జింక వెంటనే తన పూర్తి శక్తిని ఉపయోగించి పరిగెత్తింది. మరియు కొంత దూరం పరిగెత్తిన తర్వాత, జింక అలసిపోయినట్లు అనిపించింది. అతని శ్వాస అస్తవ్యస్తంగా మారడం మరియు గాలి కోసం ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది. నత్తిని పిలుస్తూ రోడ్డుపై ఒక్క క్షణం ఆగాడు. "నత్తలు పెట్టు" అంది జింక. "అవును నేను ఇక్కడ ఉన్నాను" జింక ముందు నెమ్మదిగా నడుస్తూ నత్త సమాధానం ఇచ్చింది. నత్త తన ఎదురుగా ఉన్నందున ఎలుక జింక ఆశ్చర్యపోయింది. అతను విశ్రమించలేదు మరియు వెంటనే వీలైనంత గట్టిగా పరుగెత్తడానికి పరుగెత్తాడు. అతనికి కూడా బాగా అలసటగా అనిపించి దాహం వేయడం ప్రారంభించింది. ఊపిరి పీల్చుకుని గాలి పీల్చుకుంటున్నట్లు అనిపించింది. ఆ సమయంలో, అతను మళ్ళీ నత్తను పిలిచాడు. ఆ సమయంలో, జింక తన వెనుక నత్త ఇంకా ఉందని భావించింది. అప్పటికే నత్త తన ముందున్నట్లు తేలింది కూడా. గతంలో ఏర్పాటు చేసిన వ్యూహం ప్రకారం నత్త పుహ్ సమాధానం ఇచ్చింది. ఇది చూసి ఆఖరికి జింక మళ్లీ పరుగెత్తింది. చివరి వరకు అతను చాలా అలసటతో ఉన్నాడు మరియు ఇకపై బలంగా లేడు. ఫలితంగా, అతను నత్తపై వదులుకున్నాడు. జింక నత్తకు లొంగిపోగలదని అటవీ నివాసులందరూ ఆశ్చర్యపోయారు. షెపర్డ్ బాయ్ మరియు వోల్ఫ్ ఒకప్పుడు ఒక ఊరిలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. ప్రతిరోజూ అడవి దగ్గర తన యజమాని గొర్రెలను మేపడం అతనికి పని. అతను అదే కార్యకలాపాలను చేస్తూనే ఉన్నందున, అతను విసుగు చెందాడు. ఒకరోజు, వినోదంగా గ్రామస్తులను చిలిపి చేయాలనే ఆలోచన అతనికి వచ్చింది. అతను భయంతో కేకలు వేస్తూ గ్రామం వైపు పరుగెత్తాడు, “ఒక తోడేలు ఉంది! తోడేలు ఉంది!" ఊహించినట్లుగానే తోడేలును తరిమికొట్టేందుకు స్థానికులు అడవి అంచులకు పరుగులు తీశారు. కానీ అక్కడికి వచ్చేసరికి అక్కడ తోడేళ్లు లేవు. పెద్దగా నవ్వుతున్న గొర్రెల కాపరి బొమ్మ కూడా కనిపించింది. తాము మోసపోయామని గ్రహించండి. కొన్ని రోజుల తరువాత, పిల్లవాడు సహాయం కోసం అరుస్తూ తిరిగి వచ్చాడు. మళ్లీ గ్రామస్థులు అడవి అంచుకు పరుగులు తీశారు. అయితే వారు రెండోసారి మోసపోయినట్లు తేలింది. మూలుగుతూ ఇంటికి వెళ్లిపోయారు. ఒక రోజు మధ్యాహ్నం, అకస్మాత్తుగా అడవి నుండి నిజమైన తోడేలు కనిపించింది. చిన్నారి భయంతో సహాయం కోసం కేకలు వేసింది. అయితే ఈసారి గ్రామస్తులు అతడిని నమ్మడానికి ఇష్టపడలేదు. తోడేలు అక్కడ ఉన్న గొర్రెలను చంపి తినడానికి స్వేచ్ఛగా ఉంది. ఇంతలో బాలుడు దూరం నుండి మాత్రమే చూడగలిగాడు మరియు అతను తన యజమానికి ఏమి చెప్పాలో తెలియక తికమకపడ్డాడు. ది అరోగెంట్ స్క్విరెల్ అడవిలో, స్క్విరెల్ దాని అహంకారానికి చాలా ప్రసిద్ధి చెందిన జంతువు. అతను ఎప్పుడూ దూకేటప్పుడు తన చురుకుదనాన్ని ప్రదర్శిస్తాడు. అతను ఇతర జంతువులను కలిసిన ప్రతిసారీ వాటిని ఎగతాళి చేసేవాడు. "హే యు అబ్బాయిలు, ఈ వాతావరణంలో మీరు చుట్టూ తిరగడం నాకు చాలా ఇష్టం." స్క్విరెల్ నవ్వుతూ చెప్పింది. ఒకరోజు తాబేలు, ఎలుక జింకలు బంతిని పట్టుకుంటూ ఆడుకుంటున్నాయి. మౌస్ డీర్ చాలా ఉత్సాహంగా ఉన్నందున, అతను విసిరిన బంతి వారి పక్కన ఉన్న చెట్టు ఆకులలో చిక్కుకుంది. అయితే బంతిని ఎలా తీసుకోవాలో తెలియక ఇద్దరూ తికమకపడ్డారు. ''హహ, నేను నిన్ను క్షమించాను!'' అంది ఉడుత అకస్మాత్తుగా చెట్టు వెనుక నుండి ఉడుత బయటకు వచ్చి ఆనందంగా ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు దూకింది. ఆకుల్లో ఇరుక్కున్న బంతిని కూడా తీసుకున్నాడు. "స్క్విరెల్, మా బంతిని త్వరగా విసిరేయండి." తాబేలు అరిచింది. “హహ, లేదు! అది తిను, నడవడం, చెట్టు ఎక్కడం నేర్చుకోడం, నాలాగే అక్కడక్కడ దూకడం నేర్చుకునే జంతువు కాదా!’’ అన్నాడు ఉడుత గర్వంగా. మౌస్ డీర్ మరియు తాబేలు అటూ ఇటూ దూకుతున్న ఉడుత వైపు చూస్తూ ఉండిపోయాయి. ఉడుత తన ఎదురుగా ఉన్న చెట్టు వైపు బంతిని విసిరింది. కాబట్టి, బంతి అతని వైపుకు తిరిగి వస్తుంది. అదనంగా, ఉడుత దానిని మళ్లీ పట్టుకోగలదు. పదే పదే అతను బంతిపై చాలాసార్లు అదే పని చేశాడు. ''తాబేలు పర్వాలేదు, ఇద్దరం ఇంటికి వెళ్ళాలి. అతను బంతితో ఒంటరిగా ఆడుతూ ఆనందించనివ్వు.'' అన్నాడు మౌస్ డీర్. చివరగా, కాన్సిల్ ఆహ్వానానికి తాబేలు అంగీకరించింది. “అలాగే ఉడుత, నీకు మా బంతి నచ్చినట్లుంది. ఇప్పుడు మీరు దానిని కలిగి ఉండవచ్చు. ఇంటికి వెళుతున్నాం, రోజంతా ఆడుకుని అలసిపోయాం.'' అని మౌస్ డీర్ ఆక్రోశించింది. కాగా కాన్సిల్ అరుపు విని ఉడుత ఆశ్చర్యపోయి ఏకాగ్రత కోల్పోయింది. కాబట్టి అతను పడిపోయే వరకు చెట్టు కాండం మీద జారిపోయాడు, పాపం అతను నిన్న రాత్రి వర్షం నుండి బురద గుంటలో పడిపోయాడు. "బైయ్యూర్!" చివరగా, ఉడుత నీటి కుంటలో పడింది మరియు అతను పట్టుకున్న బంతిని తాబేలు మరియు ఎలుక జింక తీసుకుంది. ఇంతలో, తాబేలు మరియు ఎలుక జింకలు బురదతో నిండిన ఉడుత శరీరాన్ని చూసి నవ్వడం ఆపుకోలేకపోయాయి. '' హాహా, నేను మీ కోసం చాలా క్షమించండి ఉడుత. నీ ప్రవర్తన చూసి నవ్వుకున్నాం. దూకగల సామర్థ్యం ఉన్నందున మీరు చాలా గర్వపడుతున్నారు, కానీ ఇప్పుడు మీరు కూడా పడిపోయారు.'' అని మౌస్ డీర్ నవ్వింది. "ఎల్లప్పుడూ ప్రగల్భాలు పలికే వ్యక్తులకు ఇది సిల్ యొక్క పరిణామాలు. ఈ సంఘటనను అనుభవించినందుకు ఉడుత ఖచ్చితంగా ఇబ్బందిపడుతుంది.'' అని తాబేలు చెప్పింది. మౌస్ డీర్ మరియు తాబేలు నుండి వెక్కిరింపులు విని, స్క్విరెల్ చాలా కోపంగా ఉంది. అయితే, వారు చెప్పింది నిజమే. మరోసారి అహంకారంతో వ్యవహరించబోనని హామీ ఇచ్చారు. చివరగా, ఉడుత తన అవమానాన్ని పట్టుకొని ఇంటికి తిరిగి వచ్చింది. అతను ఇకపై తన గురించి గర్వపడలేదు. నిజానికి, అతను తన ఇంటిని విడిచిపెట్టడానికి సిగ్గుపడ్డాడు. తన అహంకారం తనకు హాని చేసిందని మరియు ఇతర జంతువులచే ఇష్టపడనిదిగా ఉందని అతను గ్రహించాడు. ఖడ్గమృగం, పురుగు మరియు కప్ప సుదీర్ఘ ఎండాకాలం వచ్చి నెలలు గడిచాయి. ఇంతలో వర్షం తగ్గే సూచనలు కనిపించలేదు. ఎవరైనా బాధపడతారు. ముఖ్యంగా చిత్తడి ప్రజలు. కోడి కప్ప జంప్ మామూలుగా చురుగ్గా లేదు. సికా వార్మ్ కూడా భూమిని తవ్వి సగం చచ్చిపోయింది. అందరూ నిదానంగా ఉన్నారు, మరియు అత్యంత హింసించబడినది బిడి ఖడ్గమృగం! ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత వేడెక్కకుండా ఉండాలంటే మందపాటి చర్మాన్ని నీటిలో నానబెట్టాలి. అయినప్పటికీ, వారు ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు. అందరూ అర్థం చేసుకున్నందున, ఇతరులను సమానంగా హింసించాలి. చిత్తడి నేలలో నాయకుడిగా బిడి బదక్ తన స్నేహితుల గతి గురించి ఆందోళన చెందుతాడు. అందుకే కొత్త చెరువు దొరక్క బిడి బడాక్‌కి ఆందోళన మొదలైంది. ఇతర చిత్తడి నివాసితులకు తెలియకుండా, అతను చిత్తడి నేలకి దూరంగా అడవి అంచున నడిచాడు. “ఏయ్, బీడీ ఎక్కడుందో తెలుసా? ఈ రోజు నా షెడ్యూల్ చర్మాన్ని శుభ్రపరిచేటప్పుడు పేను తినడం. ” బీడీ చెరువుకు దూరంగా నివసించే సికా కేసింగ్ మరియు కోడి ఫ్రాగ్‌ని రెన్ అడిగాడు. "క్వూక్! నాకు తెలీదు’’ అని కోడి కప్ప బదులిచ్చింది.‘‘పొద్దున నుంచి బీడీ చెరువులో లేదు. "హా? తెల్లవారుజాము నుండి? మీరు ఎక్కడ అనుకుంటున్నారు?" "నాకు తెలియదు, కానీ మీరు దగ్గరగా చూస్తే, అతను ఈ మధ్య విరామం లేకుండా ఉన్నాడు." సమాధానం Cica Cacing. “బహుశా చిత్తడి నీరు తగ్గడం ప్రారంభించడం వల్ల కావచ్చు. బీడీ సగం మోకాలి కూడా కాదు!” "వావ్, బహుశా అతను కొత్త చిత్తడి కోసం వెతుకుతున్నాడు మరియు మమ్మల్ని విడిచిపెట్టాడు!" “ఇష్ష్.. బీడీ బాధ్యతగల నాయకుడు, తెలుసా! అతను మమ్మల్ని అలా వదిలేయలేడు." “Bidiiiiii!!!! ఎక్కడున్నావు?" చిత్తడి నివాసులందరూ అతని కోసం వెతకడం ప్రారంభించారు. సాయంత్రానికి చెరువులో మళ్లీ బీడీ కనిపించింది. వెంటనే అతని స్నేహితులందరూ అడిగారు. "మీ అందరినీ చింతిస్తున్నందుకు క్షమించండి, నేను ఎక్కువ నీరు ఉన్న చిత్తడి కోసం వెతుకుతున్నాను" అని బిడి చెప్పారు. "క్వూక్క్.. మమ్మల్ని కొత్త ప్రదేశానికి వదిలిపెట్టరు, బిడీ?" కోడో ఫ్రాగ్ కంగారుగా అడిగింది. "లేదు, నిజంగా, నేను మా అందరి కోసం బోలెడంత నీరు ఉన్న చిత్తడి కోసం వెతుకుతున్నాను. కానీ మనం ఉన్న ప్రదేశం కంటే ఎక్కువ సౌకర్యవంతమైన చిత్తడి ఉందని నేను అనుకోను. “సిప్ప్..సిప్ప్..అదే! అయ్యో, మీరు మమ్మల్ని విడిచిపెడతారని మేము అనుకున్నాము..." “గీజ్, నేను నిజంగా మీ గురించి ఆందోళన చెందాను! కోడి ఎగరడం, ఈత కొట్టడం చూసి చాలా రోజులైంది, సికా కేసింగ్ కూడా నేలను తవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది, కాదా?” "అయ్యో, నువ్వు మా గురించి ఆలోచించడం చాలా దయగా ఉంది. కానీ, నీ చర్మానికి కూడా నీరు అవసరమని మేము నమ్ముతున్నాము, అవునా? " అడిగాడు మరో స్నేహితుడు. బిడి తన లావు పళ్లను చూపిస్తూ విశాలంగా నవ్వింది. "ఈసారి కరువు చాలా ఘోరంగా ఉంది మిత్రులారా.." ఒక్కసారిగా పొదల వెనుక నుండి గాలాగజ కనిపించింది. "ఈ నెల మధ్యలో వర్షాలు పడాలి" "ఓహ్, మనం ఈ చిత్తడి నీటిని ఎలా కలుపుతాము?" బిడి యొక్క సూచన ఆకస్మికమైనది. “ఇంతకుముందు నడిచేటప్పుడు, కొండ దిగువన నది నీటిని దాటడానికి నాకు సమయం దొరికింది. అక్కడ నీరు ఎప్పటిలాగే వేగంగా ప్రవహిస్తూనే ఉంది. "మీ ఆలోచన కూడా ఉంటుంది! కానీ, నీటిని ఎలా తీసుకువెళ్లాలి, అవునా? కాకా కేసింగ్ దూరాన్ని ఊహించాడు. “ఓహ్, గాలా... నీకు పొడవాటి ట్రంక్ ఉంది. నీటిని నిల్వ చేసుకోవచ్చు. "అయ్యో కానీ గాలా నీళ్ళు తెస్తే ఎప్పుడు నిండుతుంది?" అన్నాడు కోడి కప్ప. "అవును, లేదు! మనం కలిసి పని చేయాలి! ” మళ్ళీ Cica Cacing అన్నారు. "అయితే, నా శరీరం చిన్నది, నేను చాలా నీరు ఎలా మోయగలను?" కోడి మళ్ళీ అడిగాడు. “మిస్టర్ బేయు ఇంటికి వెళ్దాం! వడ్రంగి బీవర్! అతను ఉపయోగించిన సాధనాలను ఉంచడానికి ఇష్టపడతాడు! అతని వద్ద కుండ, బకెట్ లేదా నీటిని పట్టుకోగలిగే మరేదైనా ఉందో ఎవరికి తెలుసు." అకస్మాత్తుగా జోలీ గెలాటిక్ అని అరిచింది.ఆమె స్నేహితులు అంగీకరించారు. పాక్ బేయు ఇంటి నుండి, వారికి పాచ్ చేసిన అనేక ఉపయోగించిన కుండలు మరియు నీటిని పట్టుకోవడానికి తగినంత పెద్ద బకెట్ అందించబడ్డాయి. వావ్, పరికరాలను రిపేర్ చేయడంలో పాక్ బేయు నిజంగా మంచివాడు. కొండ దిగువన ఉన్న నదికి చిత్తడి నివాసితుల సమూహం తరలి వచ్చింది. జోలీ మరియు ఆమె స్నేహితులు కొందరు ఆకులతో కూడిన బకెట్‌లో నీటిని తీసివేసారు. నెమ్మదిగా కానీ ఖచ్చితంగా, బకెట్లు మరియు కుండలు నీటితో నింపడం ప్రారంభించాయి. గాలా తనకు వీలైనంత ఎక్కువ నీటిని పీల్చుకున్నాడు, ఆపై అతను నీటితో నిండిన కుండను తీసుకువెళ్లాడు. బీడీ వీపు మీద ఉన్న బకెట్ మెల్లగా నిండడం ప్రారంభించింది. చాలా సార్లు వారు కలిసి కొంత సమయం వరకు నీరు వచ్చే వరకు నదులు మరియు చిత్తడి నేలల మధ్య నీటిని రవాణా చేశారు. పూర్తి రోజు చిత్తడిని నింపిన తరువాత, బిడి మరియు అతని స్నేహితులు విశ్రాంతి తీసుకున్నారు మరియు వారి సహకార ఫలాలను ఆస్వాదించారు. కోడి దూకి చాలా ఉల్లాసంగా ఈదుతుంది. సికా మట్టిని మరింత సులభంగా తవ్వడం ప్రారంభించింది. బీడీ చర్మంపై ఉన్న పేలులను నిశ్శబ్దంగా తినగలిగినందున జోలి ఆనందంగా పాడగలిగినప్పుడు బీడీ విశ్రాంతిగా స్నానం చేసింది. అందరూ సంతోషించారు, చిత్తడి నీటి సమస్యను కలిసి పరిష్కరించగలిగారు మరియు చిత్తడి నివాసితులు ఎండా కాలాన్ని సంతోషంగా గడపవచ్చు. చిత్తడి మైకము ఎండంగ్ సావిత్రి అనే మహిళ గర్భవతిగా ఉండి డ్రాగన్‌కు జన్మనివ్వడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. ఆశ్చర్యకరంగా, తర్వాత బారు క్లింటింగ్ అనే పేరు పెట్టబడిన డ్రాగన్ మనిషిలా మాట్లాడగలదు. యుక్తవయసులో, బారు క్లింటింగ్ తన తండ్రి ఎక్కడ ఉన్నాడని అడగడం ప్రారంభించాడు. అతను నిజానికి ఒక గుహలో బంధించబడిన కి హజర్ సలోకాంతర కుమారుడని తల్లి కూడా చెప్పింది. ఎండాంగ్ కూడా తన తండ్రిని కలవమని కోరాడు. అతను బారు క్లింటింగ్‌కు సాలోకంతర నుండి వారసత్వంగా వచ్చిన క్లింటింగన్ (ఒక రకమైన గంట)ని అందించాడు, వారు నిజంగా తండ్రీ కొడుకులు అని రుజువుగా చెప్పవచ్చు. అక్కడికి చేరుకున్న సలోకాంతర సాక్ష్యంగా మరో ఆవశ్యకతను ముందుకు తెచ్చారు. అవి బారు క్లింటింగ్ టెలోమోయో పర్వతం చుట్టూ ఎగురుతాయి. బారు క్లింటింగ్ తన పనిని చేయడంలో విజయం సాధించాడు. సాలోకాంతర కూడా తన రక్తమాంసాలు అని ఒప్పుకున్నాడు. అప్పుడు, సలోకంతర బారు క్లింటింగ్‌ని అడవిలో ధ్యానం చేయమని ఆదేశించింది. అదే సమయంలో, అడవి చుట్టూ ఉన్న పాథోక్ గ్రామస్థులు భూమికి భిక్ష కోసం జంతువులను వేటాడుతున్నారు. ఒక్క జంతువు కూడా దొరక్కపోవడంతో చివరకు బారు క్లింటింగ్ మృతదేహాన్ని చంపి ముక్కలు చేశారు. పార్టీ సమయంలో, ఒక మురికి మరియు గాయపడిన చిన్న పిల్లవాడు కనిపించాడు, అతను నిజానికి బారు క్లింటింగ్ అవతారం. తనకు ఆకలిగా ఉందని, స్థానికుల చేత భోజనం పెట్టాలని వేడుకున్నాడు. దురదృష్టవశాత్తు, వారు కూడా పట్టించుకోలేదు మరియు అతనిని హింసాత్మకంగా తరిమికొట్టారు. గాయపడిన బారు క్లింటింగ్, ఒక వృద్ధ వితంతువు ఇంటికి వెళ్ళాడు, అతను అతనికి మంచిగా ప్రవర్తించాలని కోరుకున్నాడు, అతనికి ఆహారం కూడా ఇచ్చాడు. తిన్న తరువాత, అతను ఒక మోర్టార్ సిద్ధం చేసి, రొమ్ము శబ్దం వస్తే దానిని ఎక్కమని ఆ స్త్రీని ఆదేశించాడు. జస్ట్ క్లింటింగ్ పార్టీకి తిరిగి వచ్చాడు. అతను ఒక పోటీని నిర్వహించాడు మరియు అతను నేలకి అంటుకున్న కర్రలను బయటకు తీయమని నివాసితులకు సవాలు చేశాడు. తక్కువ అంచనా వేసినట్లయితే, దీన్ని నిర్వహించే ఒక్క నివాసి కూడా లేడని తేలింది. అందరూ వదులుకున్న తర్వాత, బారు క్లింటింగ్ సులభంగా కర్రను బయటకు తీశాడు. ఇది ముగిసినప్పుడు, కర్రను అంటుకున్న మొదటి నుండి, నీరు కనిపించింది, ఇది మరింత వేగంగా పెరుగుతోంది. గ్రామస్థులు ఇప్పుడు రావా పెనింగ్‌లో మునిగిపోయారు. బారు క్లింటింగ్‌ పట్ల దయతో ఉన్న వృద్ధ వితంతువు మాత్రమే జీవించి ఉన్నారు. గేదె మరియు ఆవు ఒకప్పుడు గేదె, ఆవు స్నేహితులుగా ఉండేవారు. ఆవులు గోధుమరంగు నల్లగా ఉంటాయి, గేదెలు తెల్లగా ఉంటాయి. ఒక రోజు, ఒక పచ్చికభూమికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, అతను కోణాల కొమ్ములతో ఉన్న ఎద్దు. అతను చాలా డాషింగ్‌గా కనిపిస్తాడు మరియు చక్కని ఆడవారు అతనిని మెచ్చుకునేలా చేస్తాడు. వీర ఎద్దు గురించిన వార్త చాలా త్వరగా వ్యాపించింది. అతను ప్రైమా డోనా కూడా అయ్యాడు. నలుపు-గోధుమ రంగు ఎద్దులు నిజంగా పట్టించుకోవు. అయితే, కర్బౌ నిజానికి ఎద్దు పట్ల అసూయ మరియు అసూయగా భావించాడు. అతను చెప్పాడు, “అతని గురించి అంత గొప్పది ఏమిటి? నాకు పెద్ద, కోణాల కొమ్ములు కూడా ఉన్నాయి. శరీరం కూడా బలంగా ఉంటుంది. చర్మం రంగు మాత్రమే భిన్నంగా ఉంటుంది. నా చర్మం నల్లగా ఉంటే నేను ఎద్దు కంటే ఎక్కువ పౌరుషంగా ఉంటాను. తన చర్మం రంగు మార్చుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. నదిలో తడిసి ముద్దవుతున్న ఆవు దగ్గరకు కూడా వచ్చాడు. అతను చర్మాలను మార్చుకోవడానికి ఆవును కూడా మోహించాడు. అయితే, ఆవు దేవుని దయకు కృతజ్ఞతతో విముఖంగానే ఉండిపోయింది. గేదె ఇప్పటికీ ఆవును ఒప్పించి స్నేహం పేరుతో వేడుకుంది. ఆవు చివరకు క్షమించండి మరియు చర్మం యొక్క రంగును మార్చడానికి సిద్ధంగా ఉంది. అయితే, మార్పిడి తర్వాత, గేదె తన వద్ద ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండాలని ఆవు షరతు పెడుతుంది. ఏ మాత్రం ఆలోచించకుండా గేదె చివరికి ఒప్పుకుంది. చివరికి వారు చర్మాలను మార్చుకున్నారు, కానీ ఆవు చర్మం చాలా చిన్నదిగా మరియు పెద్ద గేదెకు ఇరుకైనదని తేలింది. కాబట్టి బట్టలు బిగుతుగా అనిపిస్తాయి. కాగా ఆవులు ధరించే గేదె చర్మం పెద్ద పరిమాణంలో ఉంటుంది. వారు చర్మంతో అసౌకర్యంగా ఉన్నందున, గేదె మళ్లీ ఆవును మార్పిడికి ఆహ్వానిస్తుంది. అయితే, ఆవు అలా చేయలేదు. చివరగా, గేదె ఆవులను ఎక్కడ కలిసినా చర్మాన్ని మార్చుకోమని కోరింది. అయినప్పటికీ, ఆవులు ఇప్పటికీ మార్పిడిని కోరుకోవడం లేదు. చివరగా, గేదె తన ప్రభువు నుండి పొందినదానికి కృతజ్ఞతతో లేనందుకు చింతించింది. కానీ అది అతనికి ఉత్తమమైనది.
‘అ.. శుభం’ అంటూ ‘ప్రజావేదిక’ కూల్చివేతతో పరిపాలన మొదలుపెట్టిన వైఎస్‌ జగన్‌ సర్కారుకు నేటికి మూడేళ్లు! మూడేళ్లలో ఏం సాధించారు? అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 ప్రజావేదిక కూల్చివేతతో మొదలు.. రివర్స్‌ నిర్ణయాలతో రాష్ట్రం వెనక్కి అప్పులు చేస్తే తప్ప బండి నడవదు.. దిశ దశా లేని మూడేళ్ల పాలన ‘అ.. శుభం’ అంటూ ‘ప్రజావేదిక’ కూల్చివేతతో పరిపాలన మొదలుపెట్టిన వైఎస్‌ జగన్‌ సర్కారుకు నేటికి మూడేళ్లు! మూడేళ్లలో ఏం సాధించారు? అని ప్రశ్నిస్తే... ‘ఇల్లు కూల్చి పరిహారం ఇచ్చినట్లు... భవిష్యత్తును కూల్చినందుకు పరిహారంగా ఇప్పుడు డబ్బులు పంచి పెడుతున్నారు’ అనే సమాధానమే వస్తుంది. ఒక దిశ లేదు. దశా లేదు. ఎంతో ‘ముందు చూపు’తో... విపక్షంలో ఉండగానే ఖరారు చేసుకున్న అజెండాను మాత్రం ఎంచక్కా అమలు చేస్తున్నారు. (అమరావతి - ఆంధ్రజ్యోతి) జగన్‌ అధికారంలోకి రాగానే... సొంత మీడియాలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వ సలహాదారులుగా, పీఆర్వోలుగా కొలువులు ఇచ్చి, ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించడమనే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. ప్రతిఏటా లేదా క్రమం తప్పకుండా అమలయ్యే పథకాలకు సైతం ముఖ్యమంత్రి ‘బటన్‌ నొక్కడం’... ఆ పేరుతో సొంత మీడియాకు ప్రకటనలు జారీ చేసి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టడమనే సరికొత్త ‘స్కీమ్‌’ కనిపెట్టారు. రివర్స్‌ టెండరింగ్‌ అనే కొత్త విధానంతో అప్పటికే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను మార్చి... కొత్త వాళ్లను, తమకు ‘అనుకూలమైన’ విధానాల్లో తెచ్చుకున్నారు. మరే ఇతర ఉద్యోగాలూ ఇవ్వకుండా... మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బాటలు వేసే ‘వలంటీర్ల’ను మాత్రం లక్షల్లో నియమించుకున్నారు. జరుగుతున్న మాయలు, మతలబులను సామాన్య ప్రజలు గుర్తించకుండా... వారి కళ్లకు ‘సంక్షేమ’ గంతలు కడుతున్నారు. పాత పథకాల పేర్లు, అమలు విధానం మార్చి... సంక్షేమానికి తామే ఆద్యులమన్నట్లుగా గొప్పలు చెబుతున్నారు. అప్పుల్లో అగ్రగామి... చేస్తున్న అభివృద్ధి పనుల్లేవ్‌. పూర్తయిన ప్రాజెక్టుల్లేవ్‌. రోడ్లకు మరమ్మతుల్లేవ్‌. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాల్లేవ్‌. అయినా సరే... ఖజానాలో డబ్బుల్లేవ్‌! నెలకు సగటున రూ.6వేల కోట్ల అప్పు చేస్తేగానీ బండి నడవని పరిస్థితి. వారం వారం ఆర్బీఐ తలుపు తట్టాల్సిందే! అప్పు తేవాల్సిందే. లేకుంటే... బండి నడవదు. మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ రుణభారం... ఎనిమిది లక్షల కోట్లకు చేరుకుంది. ఆదాయ మార్గాలను పెంచుకోకుండా, సంపద సృష్టించకుండా అప్పులపైనే ఆధారపడ్డారు. దీంతో అభివృద్ధి పనుల సంగతి పక్కనపెడితే... జీతాలు, సంక్షేమ పథకాలకూ అప్పులే గతి అయ్యాయి. అంతా నిరాశాజనకం... సన్‌రైజ్‌ స్టేట్‌గా దేశ విదేశాల్లో ప్రచారం... అమరావతి నగర నిర్మాణం నింపిన జోష్‌... పోలవరం పరుగులు... ఐటీ-ఫిన్‌టెక్‌ హబ్‌గా మారుతున్న విశాఖనగరం... ఎలకా్ట్రనిక్‌ హబ్‌గా తిరుపతి... కియతోపాటు దాని అనుబంధ పరిశ్రమల కళతో అనంతపురం... విత్తన, సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంగా కర్నూలు... టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక విధమైన సందడి వాతావరణం! దేశ విదేశాల నుంచి వచ్చీపోయే ప్రతినిధులతో విజయవాడ, విశాఖలో కళకళ! హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన సీమాంధ్ర వ్యాపారులు మళ్లీ సొంత గడ్డపైకి వచ్చి వ్యాపారాలు మొదలుపెట్టారు. అమరావతి ప్రభావంతో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో రియల్‌ ఎస్టేట్‌ జోష్‌ కనిపించింది. జగన్‌ అధికారంలోకి రాగానే... అంతా మాయం! సొంత గడ్డపై స్థిరపడదామని గంపెడాశతో వచ్చిన అనేక మంది, ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారులు మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఎప్పట్లాగానే... ఏపీ యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైకి వెళ్తున్నారు. బహుశా... వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే... మూడేళ్లలో రాష్ట్రానికి కొత్తగా వచ్చిన పరిశ్రమల్లేవు. భారీ పెట్టుబడులూ లేవు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలూ లేవు. జగన్‌ సర్కారు ‘రివర్స్‌’ నిర్ణయాలతో గతంలో వచ్చిన పరిశ్రమలూ పెట్టేబేడా సర్దుకుని వెళ్లిపోయాయి. అమరావతిని అటకెక్కించి, పీపీఏల రద్దు చేసి దేశ, విదేశాల్లోని పెట్టుబడిదారులు ఏపీ పేరు చెబితేనే ‘అమ్మో’ అనే పరిస్థితి కల్పించారు. బాదుడే బాదుడు జగన్‌ విపక్షంలో ఉండగా... ‘బాదుడే బాదుడు’ అంటూ మైకు పట్టుకుని ఊరూరా దీర్ఘాలు తీశారు. అధికారంలోకి రాగానే ‘వీర బాదుడు’ మొదలుపెట్టారు. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించలేదు. పదేపదే కరెంటు చార్జీల బాదుడు, ఆస్తి పన్ను బాదుడు, రిజిస్ట్రేషన్‌ చార్జీల బాదుడు, ఆర్టీసీ చార్జీల బాదుడు, చెత్త పన్ను బాదుడు! ‘కరోనా ఉన్నప్పటికీ సంక్షేమం ఆపలేదు’ అని గొప్పలు చెప్పారు తప్ప... కరోనా కాలంలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలను ఇంతగా బాధలు పెట్టిన సంగతి మాత్రం చెప్పరు. అన్నీ పక్కన పెట్టేసి... మూడేళ్లలో ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించినట్లుగా ‘గడపగడప’ కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికీ పంచుతున్న కరపత్రాలలోనూ అబద్ధాలే! పగపట్టిన పాలన... విపక్ష నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, కదిలితే కేసులు పెట్టడం, కుదిరితే అరెస్టు చేసి రిమాండుకు పంపడం.... మూడేళ్లుగా ఇదే తీరు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టడం సర్వ సాధారణంగా మారింది. ప్రశ్నిస్తే సహించేదే లేదు. అప్పట్లో డాక్టర్‌ సుధాకర్‌ నుంచి ఇటీవల వెంకాయమ్మ దాకా... దళితులపై జరిగిన దాడులకు లెక్కేలేదు.
సూర్య `ఇ టీ` ట్రైలర్‌ విడుదల: బహుముఖ నటుడు సూర్య తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘ET’. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10, 2022న ఒకేసారి విడుదల కానుంది. ఇటీవలే హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ET టీజర్ను విడుదల చేశారు. నేడు పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు పంపారు. `ఇ.టి. తెలుగు ట్రైలర్ను ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా వుంది. రాక్ సాలిడ్గా లుక్ కనిపిస్తోంది. నాకు ఇష్టమైన హీరో సూర్యకు `ఎవరికి తలవంచడు`చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని విజయ్ పోస్ట్ చేశాడు. ఇతరుల ఆనందంలో ఆనందాన్ని చూడాలనుకునే సామాజిక పోరాట యోధుడిగా సూర్య నటించారు. అతని గాల్ ఫ్రెండ్ గా ప్రియాంక అరుల్ మోహన్ బబ్లీ గా ఉండే పాత్ర పోషించింది. సామరస్యంగా వున్న ఓ గ్రామాన్ని ఒక నేరస్థుడు అతని ముఠా గ్రామంలోని మహిళలను లక్ష్యంగా చేసుకోవడంతో గ్రామంలో సామరస్యం దెబ్బతింటుంది. సామరస్యాన్ని తిరిగి తీసుకురావడానికి కథానాయకుడు ఎటువంటి చర్య తీసుకున్నాడనేది కథ ప్రధాన ఇతివృత్తంగా రూపొందింది. సూర్య ఇంటెన్సివ్, పవర్-ప్యాక్డ్ పాత్రను పోషించాడు. అతను కొన్ని సమయాల్లో ఫన్నీగా ఉంటాడు. అలాగే ప్రజలను రక్షించే విషయంలో దూకుడుగా ఉంటాడు. ప్రియాంక అరుల్ మోహన్ చాలా అందంగా కనిపించగా వినయ్ రాయ్ విలన్గా నటించాడు. పాండిరాజ్ తన రచన, దర్శకత్వం కోసం బర్నింగ్ ఇష్యూను ఎంచుకున్నాడు. డి ఇమ్మాన్ అందించిన నేపథ్య సంగీతం అన్ని అంశాలను ఎలివేషన్లను చేస్తుండగా, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ ఫస్ట్ క్లాస్ లో ఆకట్టుకుంటుంది. సత్యరాజ్, రాజ్కిరణ్, శరణ్య పొన్వణ్ణన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. (Story: సూర్య `ఇ టీ` ట్రైలర్‌ విడుదల)
పవన్‌కు దమ్ముంటే 175 స్థానాల్లో అభ్యర్థులను దింపాలి ‘వైయ‌స్ఆర్‌సీపీ కంచుకోటను ఇంచుకూడా కదపలేరు’ వైయ‌స్ జగన్‌ గారిపై విషం చిమ్మడమే పవన్‌ కళ్యాణ్‌ లక్ష్యం వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ పుట్టిన బిడ్డ ద‌గ్గ‌ర నుంచి పండు ముస‌లి వ‌ర‌కూ ప్రతి ఒక్కరికి ప్ర‌భుత్వం తోడు వెన్నుపోటుతో పీఠం ఎక్కడమే రాజ్యాంగ పరిరక్షణా..? ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందనలు వైయ‌స్ఆర్‌సీపీ బీసీల పార్టీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణె You are here హోం » ప్రజా సంకల్పయాత్ర » కొబ్బరిచెట్లపేట నుంచి 325వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం కొబ్బరిచెట్లపేట నుంచి 325వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం 19 Dec 2018 9:36 AM శ్రీకాకుళం: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 325వ రోజు బుధవారం ఉదయం టెక్కలి నియోజకవర్గంలోని కొబ్బరిచెట్లపేట నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి జార్జంగి, కొత్తపేట, కోటబొమ్మళి, సీతన్నపేట మీదుగా దుర్గమ్మపేట వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. వైయ‌స్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారి పొడువునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. జననేతను చూసేందుకు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపిస్తున్నారు. వైయ‌స్‌ జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు యువతీ, యువకులు పోటీపడుతున్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 కదిరి సీఐని, పోలీసులను వెంటనే అరెస్టు చేయాలి పోలీసు శాఖకు ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ఆదేశం కదిరి, అక్టోబరు 7: కులాంతర వివాహం కేసులో నిందితుడి పట్ల కదిరి సీఐ తమ్మిశెట్టి మధు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని, ఆయన పోలీసో లేక రౌడీనో అర్థం కావడం లేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశించినా సీఐని ఎందుకు అరెస్టు చేయలేదని పోలీస శాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులైన సిద్దిపేట సీఐ శ్రీనివాసు, మరో తొమ్మిది మంది పోలీసులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసు శాఖను ఆయన ఆదేశించారు. శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీతోపాటు డీఐజీ, డీజీపీకి ఈ కేసు విషయమై లేఖ రాస్తానని శుక్రవారం మీడియాకు తెలిపారు. 2021లో జరిగిన కులాంతర వివాహం కేసులో విచారణ జరిపేందుకు శుక్రవారం ఆయన కదిరికి వచ్చి బాధితులతో మాట్లాడారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. కదిరి మండలం ఎర్రదొడ్డికి చెందిన ఉదయ్‌కుమార్‌, తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన యువతిని 2021 జూన్‌ 4న ప్రేమ వివాహం చేసుకున్నాడు. జూన్‌ 9న ఆ అమ్మాయి మైనర్‌ అంటూ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట సీఐ శ్రీనివాస్‌.. నాటి కదిరి రూరల్‌ సీఐ మధు, సిబ్బంది కలిసి కదిరిలోని ఉదయ్‌కుమార్‌ తండ్రి ఇంటికెళ్లి నానా బీభత్సం చేశారు. ఇంట్లోని వస్తువులన్నింటినీ చిందరవదరగా పడేశారు. తేరు బజారులోని ఉదయ్‌కుమార్‌ ఇంటికెళ్లి, అతన్ని చితకబాదారు. అతడితోపాటు ఉన్న యువతిని సిద్దిపేట సీఐ వెంట తీసుకెళ్లిపోయారు. ఉదయ్‌కుమార్‌ను నాలుగు రోజులపాటు చిత్రహింసలు పెట్టారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. జూన్‌ 13న సిద్దిపేట కోర్టులో హాజరుపరిచారు. 54 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలై వచ్చిన ఉదయ్‌కుమార్‌.. సీఐ బెదిరింపులకు తట్టుకోలేక ఏడాదిగా కనిపించకుండా పోయాడు. దీంతో ఉదయ్‌కుమార్‌ తండ్రి తమకు ప్రాణహాని ఉందని ఎస్సీ, ఎస్టీ కోర్డులో కేసు వేశారు. ఇద్దరు సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిపై కేసు నమోదుచేసి, అరెస్టు చేయాలని ఈ ఏడాది ఆగస్టు 29న కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయినా ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఈ నేపథ్యంలోనే వారు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ నిమిత్తం శుక్రవారం కదిరికి వచ్చిన చైర్మన్‌.. కనిపించకుండా పోయిన ఉదయ్‌కుమార్‌ ఎక్కడున్నాడో కనిపెట్టి తీసుకురావాలని, అసలు ఉన్నాడో లేదో తేల్చాలన్నారు. సీఐ తమ్మిశెట్టి మధుపై చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు వ్యవహారంలో అతిగా ప్రవర్తించారని చీవాట్లు పెట్టారు.
హైదరాబాద్‌ : ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే రాబోయేరోజుల్లో తెలంగాణా గడ్డపై తెలుగుదేశం పార్టీకి గతవైభవం రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. టి.టిడిపి అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన కాసాని జ్జానేశ్వర్‌ ప్రమాణస్వీకారోత్సవం గురువారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లోని ఎన్టీఆర్‌ భవన్‌ లో అంగరంగ వైభవంగా సాగింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్‌ తో తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి బడుగు, బలహీనవర్గాలే వెన్నెముక..ఏపిలో, తెలంగాణలో అధ్యక్షులుగా బీసి నాయకులే ఉండటమే అందుకు నిదర్శనమని అన్నారు. తెలంగాణాలో కాసాని జ్జానేశ్వర్‌ నేతృత్వంలో పార్టీ అభివృద్ధి చెందగలదన్న నమ్మకంతోనే ఆయనను టి.టిడిపి అధ్యక్షుడిగా నియమించామని తెలిపారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా పనిచేసిన బక్కని నర్సింహులు పార్టీని సమర్థవంతంగా నడిపించారని కొనియాడారు. తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగుదేశం తెలుగువారి ఆత్మగౌరం కోసం పుట్టిన పార్టీ తెలు గుదేశం అని చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగు జాతి గుండెచప్పుడు అన్న ఎన్టీఆర్‌ చేతుల మీదుగా తెలుగుదేశంపార్టీ పుట్టింది తెలంగాణా గడ్డపైనే… రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై టీడీపీ గత వైభవం సంతరించుకునేందుకు ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం, ఈ లక్ష్యసాధన కోసం కృషిచేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో టిడిపిదే కీలకపాత్ర, దేశ రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశమని అన్నారు. తెలంగాణలో ప్రతిష్టాత్మక ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ఎన్టీఆర్‌ నాందిపలికారు, హైద రాబాద్‌లో టెక్నాలజీ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన కృషే కారణమని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని స్పష్టం చేశారు. ఎపిలో జగన్‌రెడ్డి విధ్వంసక పాలనతో అక్కడి ప్రజలు తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నారు… అందువల్లే అక్కడ ఫోకస్‌ చేస్తున్నాం…ఇక్కడ ఎక్కువ సమయం కేటాయించకపోవడం పార్టీపై అభిమానం లేక కాదన్నారు. కాసాని జ్జానేశ్వర్‌ నేను సీఎంగా ఉన్న ప్పుడు రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పని చేశారు, నీతి, నిజాయితీగా పదవికి న్యాయం చేసిన వ్యక్తి కాసాని, ఏ పదవిలో ఉన్నా పదవికే వన్నె తెచ్చే వ్యక్తి కాసాని అని కొనియాడారు. తెలంగాణాలో చాలా మంది నేతలకు టీడీపీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ ఇప్పుడు ఎపి కంటే అభివృద్ధి లో ముందంజలో ఉందంటే టీడీపీ హయాంలో చేసిన నిర్మాణాత్మక కృషే కారణమని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సంబంధితవార్తలు హత్యలు చేసేది మీరు.. కేసులు మాపైనా? జె-గ్యాంగ్‌ ధనదాహం వల్లే ఆక్వారంగంలో సంక్షోభం రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం జగన్‌రెడ్డి మనవల్లే హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతి ఐటితోనే యువతకు భవిత అని ముందే గ్రహించి తెలంగాణలో వందలాది ఇంజనీరింగ్‌ కళాశాలు నెల కొల్పి, సైబరాబాద్‌ను, హైటెక్‌ సిటీని అభివృద్ధి చేశాం, ఐటిలో ఆరోజు మనం నాటిన మొక్క, ఈరోజు మహా వృక్షంగా ఎదిగింది. ఆరంకెల జీతాలతో లక్షలాది యువత గొప్ప ఐటి నిపుణులుగా పనిచేస్తున్నారంటే ఆనాడు జరిగిన అభివృద్దే కారణం. ట్రిపుల్‌ ఐటి, ఉర్దూ యూనివర్సిటి, నల్సార్‌ వంటి ప్రతిష్టాత్మక సం స్థలను ఇక్కడ నెలకొల్పాం. 25 ఇంజనీరింగ్‌ కాలే జీలను 250కు పెంచాం. ప్రతి కిమీకు ఒక పాఠశాల, ప్రతి 3కిమీ ఒక హైస్కూల్‌, మండలానికో జూనియర్‌ కళాశాల, డివిజన్‌కో ఇంజనీరింగ్‌ కాలేజి, జిల్లాకొక మెడికల్‌ కాలేజి, అన్నింటినీ ఒక విజన్‌ ప్రకారం చేశాం. రూరల్‌లో స్కూళ్లను నెలకొల్పి విద్యా రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేశాం. కరోనా వ్యాక్సిన్‌ తయారీ నగరంగా హైదరాబాద్‌ రూపొందిందంటే ఆనాడు అభివృద్ది చేసిన జినోమ్‌ వల్లే సాధ్యమైంది. జినోమ వ్యాలీలో నెలకొల్పిన భారత్‌ బయోటెక్‌ కరో నా వ్యాక్సిన్‌ తయారీకి వేదికైంది. దేశంలో ఈరోజు తెలంగాణ నెంబర్‌వన్‌ కాగలిగిందంటే దానికి పునాది వేసింది టిడిపినే. తాను చేసిన అభివృద్దిని తర్వాత సంస్కరణలకు నాందిపలికిన ఎన్టీఆర్‌ గొప్ప సంస్కరణవాది ఎన్టీఆర్‌.. పేదవాడికి కడుపు నిండా తిండి, కట్టుకోడానికి బట్ట, నివాసానికి ఇల్లు ఉండాలన్న ఆశయంతో అనేక సంస్కరణలు తెచ్చి అమలు చేసిన ఘనత ఎన్టీఆర్‌ దే. ఎన్టీఆర్‌ పెట్టిన రూ 2బియ్యం ఈరోజు దేశంలో ఆహార భద్రతా చట్టానికి నాంది అయ్యింది. ఆడబిడ్డలకు ఆయనిచ్చిన ఆస్తిహక్కు ఈ రోజు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. విద్యార్ధులకు ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం ఇప్పుడు దేశవ్యాప్తమైంది. మాండలిక వ్యవస్థ తెచ్చి పరిపాలన పేదవాడి ముంగిటకు తెచ్చిన మహోన్నతుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. పేదరికం, ఆర్ధిక అసమానతలు లేని సమాజం ఏర్పడాలన్నదే ఎన్టీఆర్‌ ఆశయం.. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం… అధికారం కోసమో, పదవుల కోసమో పెట్టిన పార్టీ కాదని అన్నారు. సమాజంలో సంపద సృష్టించి…ఆ సంపదను పేదలకు పంచిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. ముఖ్యమంత్రులు కొనసాగించడం వల్లే హైదరా బాద్‌ త్వరితగతిన అభివృద్ధి చెందింది. ప్రస్తుత ఎపి సిఎం జగన్‌ మాదిరి ఆ రోజు చంద్రబాబు కట్టాడు కాబట్టి హైటెక్‌ సిటీని కూల్చివుంటే ఈరోజు ఐటి అభివృద్ధి చెంది ఉండేదా అని ప్రశ్నించారు. ఏపిలో ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసంపై చంద్రబాబు ఆవేదన చెందారు. సూర్యచంద్రులున్నంత కాలం టిడిపి ఉంటుంది: కాసాని రాష్ట్రపార్టీ నూతన అధ్యక్షులు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్‌ నడిబొడ్డున పుట్టిన పార్టీ తెలుగుదేశం. తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఎన్టీఆర్‌, చంద్ర బాబులకే దక్కుతుందన్నారు. సమాజాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో పథకాలకు నాంది పలికిం ది టిడిపినే.. మంచి చెప్పే పార్టీ, మంచి చేసే పార్టీ టిడిపి.. బీదవర్గాలు, బడుగు బలహీన వర్గాలవారు గుండెల్లో పెట్టుకుని అభిమానించారు. సూర్యచంద్రు లున్నంత కాలం తెలుగుదేశం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో టిడిపి విజయం సాధించబోతోందని పేర్కొన్నారు. పోలిట్‌ బ్యూరో నూతన సభ్యులు శ్రీ బక్కని నర్సిం హులు మాట్లాడుతూ ఎన్టీఆర్‌, చంద్రబాబు ఆశీస్సుల వల్లే గ్రామ కమిటీ నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా, పొలిట్‌ బ్యూరో స్థాయికి ఎదిగానన్నారు. జీవితాంతం పార్టీకి సేవలందించడమే తన విద్యుక్తధర్మమని అన్నా రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో కొన్ని దశా బ్దాలుగా గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన లక్షా 25 వేల ఫైళ్లనుపరిష్కరించిన ఘనత చంద్రబాబుదే అన్నా రు. అప్పట్లో పెండిరగ్‌ ఫైళ్ల పరిష్కారాన్ని ఒక యజ్ఞం గా చేపట్టిన విషయం గుర్తుచేశారు. సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్నిరంగాల్లో గణనీ యంగా అభివృద్ధి చెందిందన్నారు. చంద్రబాబు సూచ నల మేరకే వాజ్‌పేయి హయాంలో గోల్డెన్‌ క్వాడ్రిలేట రల్‌ రోడ్లు వచ్చాయని, మైక్రో ఇరిగేషన్‌ రైతులకు చేరువైందని గుర్తుచేశారు. తెదేపా జాతీయ అధికార ప్రతినిధి శ్రీ నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ గడీల రాజ్యాన్ని అంతం చేసి గరీబోళ్ల రాజ్యం తెచ్చిన చరిత్ర తెలుగుదేశందేనని అన్నారు. పసుపు జెండాలో రైతు నాగలి, పేదల గుడి సె,కార్మికుడి చక్రమే అందుకు నిదర్శనమని అన్నారు. తెలంగాణ గడ్డ, తెలుగుదేశం అడ్డాగా చేసేందుకు అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలిట్‌ బ్యూరో సభ్యులు అరవింద్‌కు మార్‌ గౌడ్‌, తెలంగాణపార్టీ వ్యవహారాల సమన్వయ కర్త శ్రీ కంభంపాటి రామమోహన్‌రావు, జాతీయపార్టీ ఉపాధ్యక్షులు శ్రీ చిలువేరి కాశీనాథ్‌,క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, జాతీయ పార్టీ అధికార ప్రతినిధి, తిరునగరి జ్యోత్స్న, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరామ్‌, మాజీ ఎమ్మెల్యే కాట్ర గడ్డ ప్రసూన, రాష్ట్రపార్టీ ఉపాధ్యక్షులు నందమూరి సుహాసిని, సామ భూపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఫణీశ్వరమ్మ, డా సిహెచ్‌ పవన్‌ కుమార్‌, టిఆర్‌ ఎస్‌ నాయకులు పెద్దపల్లి సత్యనారా యణ, అక్కపాక తిరుపతి, రాజ్‌కుమార్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు వాసాల సంపత్‌, మాజీ ఎంపిపి రమణ రావు, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఎఎస్‌ రావు, ఎం.శ్యాంసుందర్‌, మందూరి సాంబశివ రావు, ఎల్‌ఆర్‌ వెంకన్న, ముప్పిడి గోపాల్‌, సాయిబా బా, అక్కపాక తిరుపతి,వాసాల సంపత్‌,పెద్దపల్లి సత్య నారాయణ,జి.రమేశ్‌, కరిడె తిరుపతి,లక్ష్మీనారాయణ, సదానంద్‌ గైడ్‌,హనుమంత్‌, వెంకటరమణ, పొట్టిరా జు,సాయిబాబా, నందిగామ సత్యనారాయణ తదితరు లు తెలుగుదేశంపార్టీలో చేరారు. పసుపు కండువాలు కప్పి చంద్రబాబువారిని పార్టీలోకి ఆహ్వానించారు. Tags: అంతర్జాతీయ ఖ్యాతిఎన్టీఆర్కాసాని జ్జానేశ్వర్‌చంద్రబాబునాయుడుజ్జానేశ్వర్‌ ప్రమాణస్వీకారంతెలుగుదేశం పార్టీప్రమాణ స్వీకారోత్సవంబక్కని నర్సిహుంలుబంజారాహిల్స్‌బిసివెన్నెముకసంస్కరణలుసూర్యచంద్రులుహైదరాబాద్
కరోనా మహమ్మారి వల్ల చాలా మంది ఎంతగానో సతమతమవుతున్నారు. మొదటి రెండు వేవ్స్ వచ్చినప్పుడు కూడా చాలా మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కరోనా మహమ్మారి వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిందంటే 7 నుంచి 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. అయితే లక్షణాలు యొక్క తీవ్రతను బట్టి హోమ్ క్వారంటైన్ లో ఉంటే మంచిది. అయితే చాలా మంది కరోనా బారిన పడి హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. ఇలా ఐసోలేషన్ లో ఉండడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇంట్లో ఐసోలేషన్ లో ఉండడం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకనే కచ్చితంగా ఈ చిట్కాలను పాటించాలి. వీటిని కనుక ఫాలో అయితే మానసిక సమస్యలు రావు. దీనితో ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. రెగ్యులర్ గా వ్యాయామం చెయ్యండి: రెగ్యులర్ గా వ్యాయామం చెయ్యడం వలన శారీరిక సమస్యలు, మానసిక సమస్యలు వుండవు. కనుక ఐసోలేషన్ లో వుండే వాళ్ళు కచ్చితంగా రెగ్యులర్ గా వ్యాయామం చెయ్యాలి. కనుక ఐసోలేషన్ లో వుండే వాళ్ళు తప్పక రెగ్యులర్ గా వ్యాయామం చెయ్యాలి. మ్యూజిక్ వినండి: మ్యూజిక్ వినడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆనందంగా ఉండడానికి మ్యూజిక్ సహాయపడుతుంది. పైసా ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు మ్యూజిక్ వింటే మంచిది. దీనితో మానసిక ఇబ్బందులు, ఒత్తిడి ఉండవు. అందరితో మాట్లాడండి: కమ్యూనికేషన్ వల్ల బంధాలు బాగుంటాయి. అలాగే మనకి మానసిక సమస్యలు కూడా ఉండవు. కాబట్టి టెలిఫోన్, సోషల్ మీడియాలో స్నేహితులతో కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యి ఉండండి. ఇలా మానసిక సమస్యలు లేకుండా ఉండచ్చు.
కొత్త ద‌ర్శ‌కుడు ఏఆర్ మోహ‌న్ తెర‌కెక్కించిన చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం. ఈ చిత్రంలో హీరోగా అల్లరి నరేష్ న‌టించాడు..మ‌రి ఈ మూవీ న‌రేష్ కి విజ‌యాన్ని అందించిందా లేదా ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. - Advertisement - కథ ఏంటంటే.. శ్రీనివాస్ (అల్లరి నరేష్) ఒక ప్రభుత్వ పాఠశాలతో తెలుగు ఉపాధ్యాయుడు. ఎవరైనా కష్టంలో ఉంటే కదిలిపోయి సాయం చేసే మనస్తత్వం అతడిది. శ్రీనివాస్ ఎన్నికల విధుల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతం అయిన మారేడుమిల్లికి వెళ్లాల్సి వస్తుంది. ఐతే దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రయాణించి తాను ఎన్నికలు జరిపించాల్సిన ప్రాంతానికి వెళ్లడానికి శ్రీనివాస్ చాలా కష్టపడాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లాక విద్య.. వైద్య.. రవాణా సౌకర్యాలు లేక ఆ ప్రాంత జనం పడుతున్న కష్టం శ్రీనివాస్ కు అర్థం అవుతుంది. ప్రజా ప్రతినిధులకు.. ప్రభుత్వ అధికారులకు తమ గోడు పట్టని నేపథ్యంలో తాము ఎన్నికల్లో ఓటు వేయమని అక్కడి జనాలు భీష్మించుకుని కూర్చుంటారు. అక్కడి జనాలను మార్చి వారు ఎన్నికల్లో పాల్గొనేలా చేస్తాడు శ్రీనివాస్. అతి కష్టం మీద ఎన్నికలు కూడా పూర్తి చేశాక శ్రీనివాస్.. అతడి సహచర ఉద్యోగిని మారేడుమిల్లి జనం కిడ్నాప్ చేస్తారు.. వాళ్లు అలా ఎందుకు చేశారు.. దీని వెనుక సూత్రధారి ఎవరు.. కిడ్నాప్ ద్వారా వాళ్లు అనుకున్నది సాధించారా.. శ్రీనివాస్ అక్కడి నుంచి క్షేమంగా బయటపడ్డాడా అనేదే క‌థ‌. విశ్లేషణ.. ఫిలిం మేకర్స్ ట్రెండుకు తగ్గట్లే సినిమాలు తీస్తుంటారు కాబట్టి.. సినిమాల ద్వారా ప్రపంచానికి తెలియాల్సిన ఎన్నో విషయాలు మరుగున పడిపోతున్నాయి. అనేక కోణాలు వెలుగు చూడట్లేదు. ఇలాంటి టైంలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’తో దర్శకుడిగా పరిచయం అయిన ఏఆర్ మోహన్ పెద్ద సాహసమే చేశాడు. అభివృద్ధికి చాలా దూరంగా ఓ మారు మూల అటవీ ప్రాంతంలో ఉండే జనాలు.. తమ సమస్యల పోరాటం కోసం ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి అండతో చేసే పోరాటం నేపథ్యంలో సినిమా తీశాడు. ఈ ప్లాట్ లైన్ చదవగానే ఇలాంటి సినిమాలు ఏం చూస్తాం.. ఈ రోజుల్లో ఇవేం నడుస్తాయి అనిపించొచ్చు. కానీ ఒక కాజ్ నేపథ్యంలో సాగే సినిమానే అయినా.. ఎన్నో పరిమితులు ఉన్నా.. కథనాన్ని వీలైనంత ఆసక్తికరంగా నడిపిస్తూ.. అక్కడక్కడా వినోదాన్ని కూడా జోడిస్తూ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రాన్ని జనరంజకంగానే తీర్చిదిద్దాడు దర్శకుడు. ప్రేక్షకులను ఈ చిత్రం సర్ప్రైజ్ చేయకపోవచ్చు కానీ.. రెండున్నర గంటల పాటు కుదురుగా కూర్చోబెట్టడంలో.. అక్కడక్కడా ఎంటర్టైన్ చేయడంలో.. ఎమోషనల్ గా కదిలించడంలో.. అన్నింటికీ మించి ఒక ఆలోచన రేకెత్తించడంలో విజయవంతం అయింది. నటీనటులు.. గతంలో వరుసగా కామెడీ సినిమాలే చేసినప్పుడు కూడా.. వాటిలో సీరియస్-ఎమోషనల్ టచ్ ఉన్న సీన్లు పడితే వాటినీ బాగానే పండించేవాడు నరేష్. కాబట్టి అతను సీరియస్ పాత్రల్లోనూ చక్కగా నటిస్తుంటే ఆశ్చర్యమేమీ కలగదు. ‘నాంది’ లాంటి హార్డ్ హిట్టింగ్ మూవీలో ఎలా తన పాత్రను పండించాడో.. ఇందులో ఒక కాజ్ కోసం పని చేసే ప్రభుత్వ ఉపాధ్యాయుడి పాత్రలోనూ అంతే సిన్సియర్ గా నటించి మెప్పించాడు. పాత్ర తాలూకు సిన్సియారిటీ.. ఇంటెన్సిటీ ఆద్యంతం కనిపించేలా నరేష్ ఆ పాత్రను పోషించిన విధానం ఆకట్టుకుంటుంది. లుక్ పరంగానూ నరేష్ ఆకట్టుకున్నాడు. అవసరమైన చోట కథకు.. మిగతా పాత్రలకు అవకాశం ఇచ్చి అతను తగ్గడం అభినందనీయం. వెన్నెల కిషోర్ ఈ సీరియస్ మూవీలో అక్కడక్కడా మంచి పంచులేస్తూ రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రవీణ్ అతడికి సహకరించాడు. కాసేపు రఘుబాబు కూడా బాగానే ఎంటర్టైన్ చేశాడు. కలెక్టర్ పాత్రలో సంపత్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. హీరోయిన్ ఆనంది కాస్త చదువుకున్న అటవీ ప్రాంత అమ్మాయిని మెప్పించింది. ఇలాంటి పాత్రలకు అందరూ సూట్ కారు. ఆనంది లుక్స్.. తన నటన ఆ పాత్రకు చక్కగా సరిపోయాయి. హీరోయిన్ లాగా కాకుండా ఒక మామూలు అమ్మాయిలా ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. అడవి బిడ్డలుగా శ్రీతేజ్.. కుమనన్ సేతురామన్.. మిగతా నటీనటులందరూ కూడా బాగా చేశారు. టెక్నిక‌ల్.. సినిమా శైలికి తగ్గట్లు సాంకేతిక హంగులన్నీ బాగానే కుదిరాయి. శ్రీ చరణ్ పాకాల పాటలు.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. ఉన్న రెండు మూడు పాటలు సినిమాలో ఫ్లోలో బాగానే నడిచిపోయాయి. నేపథ్య సంగీతం కూడా హృద్యంగా సాగింది. రామ్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. ఎన్నో పరిమితుల మధ్య అడవిలో చిత్రీకరణ కోసం ఛాయాగ్రాహకుడు.. ఆర్ట్ డైరెక్టర్ ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వారి కష్టానికి ఫలితం తెరపై కనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలాంటి కథకు సపోర్ట్ చేసిన నిర్మాతలను కూడా అభినందించాలి. అబ్బూరి రవి ‘మంచి’ మాటలు చాలానే రాశారు. ”అన్యాయంగా బెదిరించే వాడి కంటే న్యాయంగా ఎదిరించే వాడే నిజమైన బలవంతుడు” తరహా మాటలు థియేటర్లో బాగా పేలాయి. కథా రచయిత.. దర్శకుడు ఏఆర్ మోహన్ ప్రతిభ చాటుకున్నాడు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా చేయాలనుకోవడం సాహసమే. అలాగే హీరో నిర్మాతలను ఒప్పించగలగడం విశేషమే. ఎక్కడా రాజీ పడకుండా ఓ మంచి కథను సిన్సియర్ గా తెరపై ప్రెజెంట్ చేశాడతను. ఉన్న పరిమితుల్లో వినోదం కూడా బాగానే ఉంది.కాగా ఈ సినిమాకి పాజిటీవ్ టాకే వ‌స్తుంది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది హీరోయిన్ సమంత. గడిచిన కొన్ని నెలల నుంచి సమంత నాగచైతన్య వ్యవహారం పైన పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రెండు రోజుల క్రితం సమంత ఆరోగ్యం సరిగ్గా లేదని విషయాన్ని తెలియజేసింది.దీంతో మరొకసారి సమంత ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడంతో అప్పటినుంచి వీరిద్దరి పైన పలు కామెంట్లు తో పాటు విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీరిద్దరూ విడిపోవడానికి ముఖ్య కారణం ఏంటి అనే విషయం మాత్రం ఇంకా సందిగ్ధంగానే ఉందని చెప్పవచ్చు. మొదట ఏం మాయ చేసావే సినిమాతో పరిచయమైన ఈ జంట ఆ తర్వాత ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సమంత స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. దీంతో తనకంటూ ఒక గుర్తింపు రావడంతో నాగచైతన్య ప్రేమ గురించి బయట పెట్టింది. ఇక తర్వాత ఇరువురు కుటుంబాల కలయికత విరి వివాహం జరిగింది. వివాహమైన తర్వాత కూడా సమంత ఒకవైపు సినిమాలలో మరొకవైపు యాడ్స్, బిజినెస్ వంటివి ప్రారంభించింది. ఎంతోమంది స్టార్ నటీనటులు విడిపోయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ జంట విడిపోవడం అనేది జీర్ణించుకోలేకపోయారు. ఎంతోమంది వీరిద్దరిని కలుసుకోండి అంటూ పలు రకాలుగా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. సమంత, నాగచైతన్య ప్రస్తుతం ఎవరు లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సమంతకు అరుదైన వ్యాధి రావడంతో సమంత పై సినీ ప్రముఖులు సింపతి చూపిస్తూ ఉన్నారు. ఇక అభిమానులు సినీ ప్రముఖుల సైతం త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే సమంత నాగచైతన్యాను మరో పెళ్లి చేసుకోమని కోరిందని వార్తలు వినిపిస్తున్నాయి. సమంత ఆరోగ్యం అలా ఉన్నందువల్లే నాగచైతన్యకు సమంత అలాంటి సలహా ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇందులో నిజం ఎంతుందో మాత్రం తెలియాల్సి ఉంది. Tags hilight naga chaitanya Samantha Previous articleభ‌ర్త చేసే టార్చర్‌ను బ‌య‌ట‌పెట్టిన న‌టి.. ఛీ.. ఛీ.. సుష్మితా సోద‌రుడు రాజీవ్ అంత దుర్మార్గుడా?
(pooja hegde about allu arjun Ala Vaikunthapurramloo) ‘త్రివిక్రమ్ గారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు. ఆయన నుంచి నేను ఓర్పుగా ఉండటం నేర్చుకున్నా. ఏ సీన్ అయినా చాలా వివరంగా చెప్తారు. ఆఖరుకు పాటలో ప్రతి లైన్ అర్థాన్నీ చెప్తారు. ఆయన్లోని గొప్ప గుణం ఈగో లేకపోవడం’ అని చెప్పారు పూజా హెగ్డే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుండు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో ఆమె కథానాయికగా అమూల్య పాత్రలో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో మంగళవారం మీడియా ప్రతినిధులతో పూజా హెగ్డే సంభాషించారు. ఆ విశేషాలు… ‘ఆలా వైకుంఠపురములో..’ ని మీ క్యారెక్టర్ కు మీరే డబ్బింగ్ చెప్పుకోవడం ఎలా అనిపిస్తోంది? చాలా కష్టం. ఎందుకంటే తెలుగు నా ఫస్ట్ లాంగ్వేజ్ కాదు. ఇంగ్లీష్ పదాల్ని తెలుగులో చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఏదేమైనా నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవడం నా పర్ఫార్మెన్స్ మరింత ఎలివేట్ కావడానికి ఉపయోగపడుతోంది. డబ్బింగ్ కు సమస్య కాకుండా సీన్స్ తీసేటప్పుడు డైలాగ్ ఎలా చెప్పాలో నేర్చుకున్నా. ‘అల..వైకుంఠపురములో’ ని అమూల్య పాత్ర తో నేను మరింతగా తెలుగమ్మాయిని అయిపోయాను. బాలీవుడ్ జనాలు నన్ను హైదరాబాద్ అమ్మాయిననే అనుకుంటున్నారు. ‘అరవింద సమేత’కు కూడా మీరే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా? అప్పటికీ ఇప్పటికీ మీ డబ్బింగ్ లో వచ్చిన మార్పేమిటి? తెలుగు లైన్స్ ను అర్థం చేసుకొని వాటిని ఎలా చెప్పాలో తెలుసుకుంటున్నా. ఓవర్ యాక్టింగ్ చెయ్యడం నాకిష్టం ఉండదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పడం వల్ల ఒక్కోసారి మనం ఓవర్ యాక్టింగ్ చేసినట్లు అనిపిస్తుంది. నేను పర్ఫార్మ్ చేసిన దానికి ఆ డబ్బింగ్ డిఫరెంట్ గా ఉన్నట్లు ఫీలవుతాను. కొంతమంది మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్స్ మన పర్ఫార్మెన్స్ ను తమ డబ్బింగ్ తో మరింత ఎలివేట్ చేస్తారు. వాళ్లను నేను గౌరవిస్తాను. ‘అరవింద సమేత’ రిలీజయ్యాక ఒకరు ‘ఈ సినిమాకు మీకెవరు డబ్బింగ్ చెప్పారు? నేను కూడా చెప్పించుకుందామని అనుకుంటున్నా’ అని మెసేజ్ పెట్టారు. అది నా డబ్బింగ్ కు లభించిన పెద్ద కాంప్లిమెంటుగా భావిస్తాను. అంటే ఒక తెలుగు అమ్మాయిలా అందులో మాట్లాడగలిగానని సంతోషం వేసింది. తెలుగు నేర్చుకోవడానికి ట్యూటర్ ని ఎవరినైనా పెట్టుకున్నారా? లేదు. నా మేనేజర్ తో, నా స్టాఫ్ తో నేను తెలుగులోనే మాట్లాడుతాను. కోచింగ్ కు ఎవర్నీ పెట్టుకోలేదు. ఇలాంటి ఇంటర్వ్యూల్లో తెలుగులో మాట్లాడాలంటేనే నాకు కొంచెం భయం వేస్తుంటుంది. మూడోసారి కూడా మిమ్మల్ని రిపీట్ చెయ్యాలనిపిస్తోందని అల్లు అర్జున్ చెప్పిన దానికి మీ స్పందన? మేం ఇప్పటి దాకా రెండు సినిమాలు కలిసి చేశాం. దాంతో మామధ్య సెట్స్ పై కంఫర్ట్ లెవల్ పెరిగింది. అది తెరపై కెమిస్ట్రీ రూపంలో కనిపించింది. అందుకే మామధ్య కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు. అందువల్లే అల్లు అర్జున్ ఆ మాట అన్నారు. ఆయన అన్నట్లుగానే ఇద్దరం కలిసి మరో సినిమా చెయ్యాలని ఆశిస్తున్నా. అమూల్య క్యారెక్టర్ చెయ్యడానికి మిమ్మల్ని ప్రేరేపించిన విషయం ఏమిటి? బేసికల్లీ ఐ లవ్ ద స్ర్కిప్ట్. త్రివిక్రమ్ గారు కథ చెప్తుంటే పడిపడి నవ్వాను. పాప్ కార్న్ తింటూ హాయిగా ఎంజాయ్ చేసే సినిమా అవుతుందని అనిపించింది. అదివరకు త్రివిక్రమ్ గారితో చేసిన ‘అరవింద సమేత’ సీరియస్ సబ్జెక్ట్. అలాగీ దీనికి ముందు బన్నీ చేసిన ‘నా పేరు సూర్య’ కూడా సీరియస్ సబ్జెక్ట్. అందువల్ల ఫన్నీగా ఉండే ఈ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుందని అనిపించింది. ఈ సినిమాలో నాది స్ట్రాంగ్ క్యారెక్టర్ అనీ, అల్లు అర్జున్ కు బాస్ గా కనిపిస్తావనీ త్రివిక్రమ్ గారన్నారు. స్క్రిప్ట్ బాగా నచ్చడం, నాది బలమైన క్యారెక్టర్ అని ఆయన చెప్పడం వల్ల మరో ఆలోచన లేకుండా చెయ్యడానికి ఒప్పుకున్నా. అది స్ట్రాంగ్ క్యారెక్టర్ అని నేను నమ్ముతున్నా. బన్నీ క్యారెక్టర్ ఆలోచనాధోరణిని మార్చే క్యారెక్టర్. అలాగే ‘సామజవరగమన’ పాటను ఎంతో పొయెటిక్ గా తీశారు. హీరో పదే పదే నా కాళ్లను చూస్తుంటే, ఒకసారి పైకి చూడమని చెప్తాను. అప్పుడతను నా కాళ్ల మీద నుంచి దృష్టిని మరల్చి నా కళ్లవంక చూస్తాడు. అప్పుడు తన కొలీగ్స్ తో ‘ఫస్ట్ టైం మేడమ్ కళ్లు చూశాను. మేడమ్ సార్.. మేడమ్ అంతే’ అని చెప్పే డైలాగ్ నాకు బాగా నచ్చింది. ఐ థింక్ దట్ ఇట్ వాజ్ జస్టిఫైడ్. లంగా, చోళీలు వేసుకున్నప్పుడు నడుము చూపిస్తుంటారు కదా. అది ఓకేనా! - Advertisement - త్రివిక్రమ్ గారిని గురూజీగా మీరు సంబోధించారు. ఎందుకని? నేను వర్క్ చేసిన డైరెక్టర్లలో త్రివిక్రమ్ గారు చాలా కామ్ డైరెక్టర్. డైరెక్టర్ ఎనర్జీయే సెట్లో కనిపిస్తుంది. ఏ డైరెక్టర్ అయినా గట్టి గట్టిగా అరుస్తుంటే నేను భయపడతాను. ఎవరి వత్తిళ్లు వాళ్లకుంటాయి. సెట్లో డైరెక్టర్ నవ్వుతూ, ప్రశాంతంగా కనిపిస్తే, మన స్ట్రెస్ తగ్గిపోతుంది. తాను పెద్ద సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ని అని తెలిసినా, దాన్ని ఆయన బయట ప్రదర్శించరు. అల్లు అర్జున్ గారితో డాన్స్ చెయ్యడం కష్టమనిపించేదా? ఈ మూవీలో నాకు డ్యాన్సింగ్ ఎక్కువ లేదు. అన్నీ సింపుల్ స్టెప్సే. రిహార్సల్స్ కూడా చెయ్యలేదు. కాబట్టి బన్నీతో మ్యాచ్ కావడానికి నేను కష్టపడలేదు. నేను కెరీర్ మొదట్లోనే హృతిక్ రోషన్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి గ్రేట్ డాన్సర్స్ తో చేశాను. ఇప్పుడు మళ్లీ హిందీలో హృతిక్ రోషన్ తో చేస్తున్నా. వాళ్లందరితో నేను డాన్సుల్లో మ్యాచ్ అయ్యానని అనుకుంటున్నా. సినిమాలో మీ ఫేవరేట్ సీన్ ఏమిటి? నిజానికి సినిమాలో ‘బుట్టబొమ్మ’ సాంగ్ లీడ్ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే బోర్డ్ రూమ్ సీన్ కూడా ఇష్టం. ఆ రెండూ చాలా ఫన్నీగా ఉంటాయి. చాలామంది హీరోలతో పనిచేసినా బన్నీకి ఫ్యాన్ అని చెప్పారు. ఎందుకని? నేను అతని వర్క్ కు అభిమానిని. అతనితో కలిసి పనిచెయ్యడాన్ని ఎంజాయ్ చేస్తాను. అలాగే ప్రభాస్ తో పనిచెయ్యడాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నా. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తుంటే, కష్టమనిపించడం లేదా? నాలుగు సినిమాలు ఒకేసారి చెయ్యగల కెపాసిటీ నాకుంది. ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఇంకో రెండు సినిమాలు హిందీలో చెయ్యగలను. ఇండియన్ స్టార్ కావడం నా లక్ష్యం. ఏదో ఒక భాషకే పరిమితం కావాలని నేననుకోవట్లేదు. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తే, అక్కడ సినిమాలు చెయ్యాలనుకుంటున్నా. తెలుగులో మీరు దాదాపు టాప్ హీరోయిన్. హిందీలో సెకండ్ హీరోయిన్ తరహా పాత్రలు చేస్తున్నారెందుకని? ‘హౌస్ ఫుల్ 4’లో నేను చేసింది సెకండ్ హీరోయిన్ రోల్ కాదు. సగం అక్షయ్ కుమార్ తోటీ, సగం రితేశ్ దేశ్ ముఖ్ తోటీ చేశాను. నేను అప్పటి దాకా స్లాప్ స్టిక్ కామెడీ చెయ్యలేదు. అందువల్ల ఆ సినిమా చెయ్యడం గొప్ప అనుభవం. ఆ అనుభవం నాకు ‘అల వైకుంఠపురములో’ మూవీకి ఉపయోగపడింది. సీన్లో పది మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఎలా మనం మన పాత్రను రక్తి కట్టించాలనేది ఆ సినిమాతో నేర్చుకున్నా. మీ లెక్కల ప్రకారం ఇప్పుడు నేను చేస్తున్నవేవీ సెకండ్ హీరోయిన్ రోల్స్ కావు. 2019లో నేను చేసిన పాత్రల్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. అవన్నీ ఒకదానికొకటి భిన్నమైన పాత్రలు. ‘గద్దలకొండ గణేశ్’లో నన్ను శ్రీదేవిలాగా అంగీకరించారు. ‘మహర్షి’లో కాలేజ్ స్టూడేంట్ గా, కార్పొరేట్ గాళ్ గా ఆదరించారు. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ బన్నీ బాస్ రోల్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ రోల్స్ లో ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చెయ్యడం హ్యాపీ. వర్సటాలిటీ నా బలమని నమ్ముతాను. విమెన్ సెంట్రిక్ రోల్స్ ఏమైనా వచ్చాయా? తెలుగులో విమెన్ సెంట్రిక్ రోల్స్ తక్కువగానే ఉన్నాయి. ఒకటి అలాంటి స్క్రిప్ట్ వచ్చింది కానీ నేను సంతకం చెయ్యలేదు. ఏదైనా నాకు నచ్చి, నేను చెయ్యగలననిపిస్తే చెయ్యడానికి సిద్ధమే. ఒక నటిగా నన్ను మరో కోణంలో అది చూపిస్తుంది.
కమెడియన్ సుహాస్ హీరోగా తెరకెక్కిన కలర్ ఫొటో సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా హక్కుల కోసం కొందరు పెద్ద నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. August 20, 2020 at 8:21 AM in Tollywood Share on FacebookShare on TwitterShare on WhatsApp అప్ కమింగ్ కమెడియన్ సుహాస్ హీరోగా రెడీ అవుతున్న సినిమా ‘కలర్ ఫోటో’. ఈ సినిమాను సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. గతం లో సాయి రాజేష్ నుంచి కొబ్బరి మట్ట, హృదయ కాలేయం అనే సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కలర్ ఫోటో కూడా ఓ స్పూఫ్ సినిమా అవుతుంది అని సినీ జనాలు అనుకున్నారు. ఐతే ఈసారి సాయి రాజేష్ అండ్ టీం తమ ప్లాన్ మార్చేశారు. కలర్ ఫోటో పై ఎక్కడా కూడా కొబ్బరి మట్ట, హృదయ కాలేయం వంటి తమ స్పూఫ్ కామెడీలు పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా సమాచారం. ఇటీవలే రిలీజ్ చేసిన కలర్ ఫోటో టీజర్ కి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ లో ఉన్న పలువురు అగ్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు అని టాక్. ముందు వీరంతా ఈ సినిమాను చిన్న చూపు చూసిన వారే కావడం గమనార్హం. ఐతే ఈ సినిమా నిర్మాత సాయి రాజేష్ కి గీత ఆర్ట్స్ వరకు ఎప్పటి నుంచో మంచి రిలేషన్ ఉంది. సాయి రాజేష్ గత సినిమాలు కొబ్బరి మట్ట, హృదయ కాలేయం కి గీత వారే ఫైనాన్స్ ఇప్పించారు. దీంతో బయట నుంచి కలర్ ఫోటో కోసం క్రేజీ ఆఫర్స్ వస్తున్నా సాయి రాజేష్ మాత్రం గీత లోనే ఈ సినిమాను పెట్టాలి అనే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడమో లేక గీత వారు మైంటైన్ చేస్తున్న ఆహా యాప్ లో ఈ సినిమాను డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేసే ప్లాన్ లో సాయి రాజేష్, దర్సకుడు సందీప్ ఉన్నట్లు తెల్సింది.
సినిమా స్క్రిప్ట్ & రివ్యూ : 01/08/19 .Header h1 { font: normal normal 90px Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; color: #ffff00; } .Header h1 a { color: #ffff00; } .Header .description { font-size: 130%; } /* Tabs ----------------------------------------------- */ .tabs-inner { margin: 1em 0 0; padding: 0; } .tabs-inner .section { margin: 0; } .tabs-inner .widget ul { padding: 0; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; } .tabs-inner .widget li { border: none; } .tabs-inner .widget li a { display: inline-block; padding: 1em 1.5em; color: #ffffff; font: normal bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; } .tabs-inner .widget li.selected a, .tabs-inner .widget li a:hover { position: relative; z-index: 1; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } /* Headings ----------------------------------------------- */ h2 { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #00ffff; } .main-inner h2.date-header { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #0f0e0c; } .footer-inner .widget h2, .sidebar .widget h2 { padding-bottom: .5em; } /* Main ----------------------------------------------- */ .main-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner .section { margin: 0 20px; } .main-inner .column-right-inner { margin-left: 20px; } .main-inner .fauxcolumn-right-outer .fauxcolumn-inner { margin-left: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner { margin-right: 20px; } .main-inner .fauxcolumn-left-outer .fauxcolumn-inner { margin-right: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner, .main-inner .column-right-inner { padding: 15px 0; } /* Posts ----------------------------------------------- */ h3.post-title { margin-top: 20px; } h3.post-title a { font: italic bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #b02ef1; } h3.post-title a:hover { text-decoration: underline; } .main-inner .column-center-outer { background: #ffffff none repeat scroll top left; _background-image: none; } .post-body { line-height: 1.4; position: relative; } .post-header { margin: 0 0 1em; line-height: 1.6; } .post-footer { margin: .5em 0; line-height: 1.6; } #blog-pager { font-size: 140%; } #comments { background: #cccccc none repeat scroll top center; padding: 15px; } #comments .comment-author { padding-top: 1.5em; } #comments h4, #comments .comment-author a, #comments .comment-timestamp a { color: #b02ef1; } #comments .comment-author:first-child { padding-top: 0; border-top: none; } .avatar-image-container { margin: .2em 0 0; } /* Comments ----------------------------------------------- */ #comments a { color: #b02ef1; } .comments .comments-content .icon.blog-author { background-repeat: no-repeat; background-image: url(); } .comments .comments-content .loadmore a { border-top: 1px solid #b02ef1; border-bottom: 1px solid #b02ef1; } .comments .comment-thread.inline-thread { background: #ffffff; } .comments .continue { border-top: 2px solid #b02ef1; } /* Widgets ----------------------------------------------- */ .sidebar .widget { border-bottom: 2px solid #f1d08f; padding-bottom: 10px; margin: 10px 0; } .sidebar .widget:first-child { margin-top: 0; } .sidebar .widget:last-child { border-bottom: none; margin-bottom: 0; padding-bottom: 0; } .footer-inner .widget, .sidebar .widget { font: normal normal 14px Georgia, Utopia, 'Palatino Linotype', Palatino, serif; color: #ffe599; } .sidebar .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .sidebar .widget a:visited { color: #6ef12e; } .sidebar .widget a:hover { color: #c1c1c1; text-decoration: underline; } .footer-inner .widget a:link { color: #3630f4; text-decoration: none; } .footer-inner .widget a:visited { color: #000000; } .footer-inner .widget a:hover { color: #3630f4; text-decoration: underline; } .widget .zippy { color: #ffffff; } .footer-inner { background: transparent none repeat scroll top center; } /* Mobile ----------------------------------------------- */ body.mobile { background-size: 100% auto; } body.mobile .AdSense { margin: 0 -10px; } .mobile .body-fauxcolumn-outer { background: transparent none repeat scroll top left; } .mobile .footer-inner .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .mobile .footer-inner .widget a:visited { color: #6ef12e; } .mobile-post-outer a { color: #b02ef1; } .mobile-link-button { background-color: #3630f4; } .mobile-link-button a:link, .mobile-link-button a:visited { color: #ffffff; } .mobile-index-contents { color: #444444; } .mobile .tabs-inner .PageList .widget-content { background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } .mobile .tabs-inner .PageList .widget-content .pagelist-arrow { border-left: 1px solid #ffffff; } sikander777 --> సినిమా స్క్రిప్ట్ & రివ్యూ రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు... టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం! Tuesday, January 8, 2019 724 : విస్మృత సినిమాలు - 'పాలపిట్ట' ఆర్టికల్ తెలుగు ప్రేక్షకుల సినిమాభిరుచి అప్పుడూ ఇప్పుడూ ఒకే తరహాలో తీర్చిదిద్దుకు న్నట్టుంది. సినిమాలు పక్కా వినోదాత్మకంగా వుండాలన్నదే మెజారిటీ వర్గం ప్రేక్షకులు శిలాశాసనం రాసుకున్న ఏకైక అభిరుచేమో. స్టాంపు వేసిన ఈ అభిరుచి ప్రకారం సినిమాలు వుండకపోతే విషయం లేని సినిమాల కింద మరణశాసనం రాసేస్తారు. బలమైన కథ వుందంటే, ఇక విషయం లేనట్టేనని తీర్పు ఇచ్చేస్తారు. ఈ వర్గం ప్రేక్షకులు కాలగర్భంలో కలిపేసిన సినిమాలన్నీ విస్మృత సినిమాలు కావు. తగిన కథాబలమూ, కథా ప్రయోజనమూ వుండి, వాళ్ళ అభిరుచికి దూరంగా వుండిపోయినవే విస్మృత సినిమాలన్పించుకుంటాయి. వాళ్ళ దృష్టిలో వీటికి వినోదాత్మక విలువ వుండదు. వినోదాత్మక విలువలు లేని సినిమాలు ఇతర భాషల్లో హిట్టయి చరిత్రలో నిల్చిపోతే, అవే తెలుగులో పునర్నిర్మించినప్పుడు ఫ్లాపయి పౌరసత్వాన్ని కోల్పోతాయి. ఇలాటిదే ఇంకో విస్మృత సినిమా ‘మనసే మందిరం’. ఇది తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో హిట్టయి, విచిత్రంగా తెలుగులో టైటిల్ మాత్రమే పాపులరైంది. తమిళ మాతృక నుంచి ఈ రీమేకులన్నీ జరిగాయి. వినోదాత్మక విలువలు లేని, పూర్తి శోక రసమయమైన ఈ మాతృకని, ఎలా ఇన్ని భాషల్లో రీమేక్ చేయడానికి సాహసించారనేది జవాబు దొరకని ప్రశ్న. బహుశా కథని నమ్మడం వల్ల, కథకిచ్చిన ముగింపుకి దాసోహమై పోవడం వల్ల. ఇంతకంటే కారణాలు కన్పించవు. అదింకా 1960 ల నాటి కాలం. ట్రాజడీలని ఆదరిస్తున్న ట్రెండ్. ఈ ట్రెండ్ లో సి.వి. శ్రీధర్ అనే నిర్మాత, దర్శకుడు, రచయిత ‘నెంజిల్ ఒరు ఆలయం’ అనే విషాదాంత ప్రేమాయణం తీశాడు. సి.వి. శ్రీధర్ ( చిత్తమూర్ విజయ రాఘవులు రెడ్డియార్ శ్రీధర్, 1933 – 2008) తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంచి పేరున్నదర్శకుడు.1954 లో 21 వ యేట దర్శకుడైన శ్రీధర్, 1991 వరకూ 37 ఏళ్ల సుదీర్ఘ వృత్తి జీవితంలో 66 సినిమాలు తీశాడు. వీటిలో 47 తమిళం, 10 తెలుగు, 9 హిందీ వున్నాయి. ఎమ్జీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్, రాజ్ కపూర్, రాజేంద్రకుమార్, రాజ్ కుమార్, అశోక్ కుమార్, కిషోర్ కుమార్, శశికపూర్, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, శత్రుఘ్న సిన్హా, అక్కినేని నాగేశ్వరరావు, మీనాకుమారి, వైజయంతీ మాలా, రాజశ్రీ, హేమమాలిని, ముంతాజ్, సావిత్రి, కృష్ణకుమారి, బి. సరోజా దేవి, దేవిక...ఇలా కనువిందు చేసే అగ్ర తారాతోరణంతో ఆయన సినిమాలు కళకళ లాడేయి. ఐతే 1962 లో రాసి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘మనసే మందిరం’ మాతృక ‘నెంజిల్ ఒరు ఆలయం’ మహోజ్వల చిత్రరాజం నాటికి అతడేమీ వయసుమీరిన అనుభవశాలి కాదు. అప్పటికింకా 29 ఏళ్ళే! దీనికి పాపులర్ హీరోని తీసుకోక కన్నడ, తమిళ హీరో కళ్యాణ్ కుమార్ ని తీసుకున్నాడు. దేవిక కథానాయిక. ఆర్. ముత్తు రామన్ సహాయపాత్ర. ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతం, ఏ. విన్సెంట్ ఛాయాగ్రహణం. విలువలు గుర్తించిన మనుషులు స్వార్ధానికి పోరనీ, విలువల కోసం త్యాగాలు చేస్తారనీ, ప్రాణత్యాగానికి సైతం వెరవరనీ నీతిని ప్రకటిస్తూ ఇది సంచలన విజయం సాధించడమే గాక, ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు కూడా పొందింది. వెంటనే 1963 లో హిందీలో రీమేక్ చేశాడు. అప్పుడు బొటాబొటీ ముప్ఫై ఏళ్ళే! రాజేంద్ర కుమార్, మీనా కుమారి, రాజ్ కుమార్ లాంటి ఉద్దండులతో ‘దిల్ యేక్ మందిర్’. తీశాడు. శంకర్ – జైకిషన్ సంగీతం, ఏ. విన్సెంట్ ఛాయాగ్రహణం. ఇది 175 రోజులు ఆడి భారీ విజయం సాధించింది (అప్పట్లో కోటీ పది లక్షలు). ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. రాజ్ కుమార్ కి ఫిలిం ఫేర్ సహాయ పాత్రధారి అవార్డు లభించింది. 1966 లో తెలుగులో ‘మనసే మందిరం’ గా ఇంకో రీమేక్ చేశాడు. అప్పుడు 33 ఏళ్ళు! అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య నటీనటులు. ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతం, బాలు ఛాయాగ్రహణం. 1976 లో మలయాళంలో ‘హృదయం ఒరు క్షేత్రం’ గా, 1977 లో కన్నడలో ‘కుంకుమ రక్షే’ గా అక్కడి నిర్మాతలు, దర్శకులు రీమేక్స్ చేశారు. ఇలా మాతృకతో కలుపుకుని మొత్తం ఐదు సినిమాలయ్యాయి. తెలుగులో తప్ప అన్నీ హిట్టయ్యాయి. ఒక్క శ్రీధర్ తీసిన తమిళ, హిందీ, తెలుగు రీమేకులు తెలుపు – నలుపులో అయితే; మలయాళ, కన్నడ రీమేకులు రంగుల్లో తీశారు. హాలీవుడ్ నుంచి జగ్ ముంద్రా దీన్ని ఇంగ్లీషులో రీమేక్ చేయాలనీ కూడా విఫలయత్నం చేశాడు. జరిగేదంతా లోపలే ‘మనసేమందిరం’ తెలుగు రీమేక్ లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్యలతో బాటు, గుమ్మడి, నాగభూషణం, రేలంగి, చలం, శాంతా కుమారిలు నటించారు. సంభాషణలు, పాటలు ఆచార్య ఆత్రేయ రాశారు. ఒక పాట కార్తీక్ రాశారు. ఘంటసాల, పి. సుశీల, ఎల్లారీశ్వరి, పిబి శ్రీనివాస్ లు గానం చేశారు. ‘అల్లారు ముద్దు కదే అపరంజి ముద్ద కదే’ (పి. సుశీల), ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు’ (పిబి శ్రీనివాస్) పాటలు రెండూ ఇప్పటికీ హిట్టేనని తెలిసిందే. మాతృకతో బాటు రీమేకులన్నీ పూర్తిగా హాస్పిటల్లో తీసినవే. ఒక ప్రేమ సన్నివేశం, హిందీలో ఒక పాట తప్ప, హాస్పిటల్ దాటి బయటికి రాని ఇండోర్ కథా కథనాలతో తీశారు. మొదటి సీనుతో హస్పిటల్లోకి వెళ్ళే కెమెరా, చివరి సీనులో మాత్రమే హాస్పిటల్ దాటి బయటి దృశ్యాని కొస్తుంది. ఈ రెండున్నర గంటల ఇండోర్ డ్రామా 30 రోజుల్లో తీశారు. తెలుగులో సారధి స్టూడియోలో తీశారు. పాటల విషయాని కొస్తే, హిందీలో ఎక్కువ హిట్టయిన వెంటాడే పాటలున్నాయి : ‘యహా కోయీ నహీ తేరే మేరే సివా’ (రఫీ), ‘హమ్ తేరే ప్యార్ మే సారా ఆలమ్’ (లత), ‘యాద్ న జాయే భీతే దినోకీ (రఫీ), రుక్ జా రాత్ ఠెహర్ జారే చందా’ (లత), ‘దిల్ యేక్ మందిర్ హై’ (రఫీ, సుమన్ కళ్యాణ్ పూర్). రెండు వారాల కథ 10 వ తేదీన క్యాలెండర్లో కాగితం చినగడంతో ప్రారంభమయ్యే కథ, క్యాలెండర్లో 24 వ తేదీతో ముగుస్తుంది. ఇది టైం లాక్ కథా సంవిధానం. డాక్టర్ రఘు (అక్కినేని నాగేశ్వర రావు) ఆపరేషన్ కి ప్రకటించే రెండు వారాల గడువులోపల జరిగే సంఘటనల సమాహారమే ఈ కథ. ఈ టైంలాక్ చేయడంవల్ల, డెడ్ లైన్ సమీపిస్తున్న కొద్దీ ఏం జరగబోతోందన్న సస్పెన్స్ వెంటాడుతూంటుంది. డాక్టర్ రఘు చేతిలో ఆపరేషన్ సక్సెస్సా, ఫెయిలా? ఉత్కంఠ రేపే ఈ సస్పెన్స్ తో కూడిన కథనం ప్రతీదృశ్యాన్నీ విడువకుండా చూసేలా చేస్తుంది. క్యాలెండర్లో లెక్కపెట్టి ఒక్కో తేదీ మారుతూంటే, ఆపరేషన్ ఫెయిలయ్యే ముందస్తు సూచనలే, పరిణామాలే (కుక్క ఏడ్పు, బాలిక మరణం లాంటివి) ఆందోళన పరుస్తూంటాయి. ఆపరేషన్ ఫెయిలయితే డాక్టర్ రఘు తీవ్ర ప్రమాదంలో పడిపోయే గండం పొంచి వుంటుంది. అప్పుడతను జీవించినా మరణించినట్టే లెక్క. ‘ఉత్తమురాలైన తల్లికి పుట్టిన కొడుకు’ గా విశ్వసనీయత కోల్పోయి పతనమై పోతాడు. అయినా ఈ భారీ మూల్యం చెల్లించుకునే రిస్కుకే సిద్ధపడతాడు. ఇలా కథలో ఒక పాత్రగా క్యాలెండర్ అనే ప్లాట్ డివైస్, కథనంలో సస్పెన్స్ అనే ఎలిమెంట్, క్యారెక్టర్ కి అధిక రిస్కుతో కూడిన గోల్ – ఈ మూడూ బలమైన ప్రధాన పనిముట్లుగా కుదిరి, ఈ ప్రేమకథ స్క్రీన్ ప్లేతో ఎప్పుడో అరవై ఏళ్ల నాడే, నూతన దృక్పథంతో అత్యత్భుత కథన చాతుర్యాన్ని కనబర్చాడు యంగ్ శ్రీధర్. ఇందుకే జగ్ ముంద్రా ఇంగ్లీషులో రీమేక్ చేయాలనుకుని వుంటాడు. హాస్పిటల్లో నవంబర్ తొమ్మిదవ తేదీ క్యాలెండర్ కాగితం చించి రోజు ప్రారంభిస్తాడు డాక్టర్ రఘు (ఏఎన్నార్). తల్లి (శాంత కుమారి) వచ్చి, ఇంటికి రాకుండా హాస్పిటల్లోనే వుండిపోతున్నావు, ఒకసారి ఇంటికి రమ్మని ప్రాధేయపడుతుంది. తనకి హస్పిటలే జీవితమంటాడు. హాస్పిటల్ కి సీత (సావిత్రి) వస్తుంది. ఆమెని చూసి ఖిన్నుడవుతాడు రఘు. ఆమె కూడా అతణ్ణి చూసి కంగారు పడుతుంది. ఇద్దరూ గతంలో ప్రేమికులు. ఆమె కూడా భర్త వుంటాడు. అతడి ముందు బయటపడకుండా జాగ్రత్తపడతారు. భర్త రాము (జగ్గయ్య) కి క్యాన్సర్ వుందనీ, చికిత్స కోసం తీసుకు వచ్చాననీ అంటుంది. డాక్టర్ రఘు వైద్య విద్య కోసం విదేశాల కెళ్ళినప్పుడు, తను ప్రేమిస్తున్న సీతకి ధనికుడైన రాముతో బలవంతపు పెళ్లి చేసేస్తాడు ఆమె తండ్రి. ఇది తెలుసుకున్న రఘు మానసికంగా దెబ్బతిని, ఇక పెళ్ళే చేసుకోనని, హాస్పిటల్ కి అంకితమై పోతాడు. ఇప్పుడామె భర్తకి క్యాన్సర్. ఆమె సందిగ్ధంలో పడుతుంది. ఈ హాస్పిటల్ రఘుదని తెలీక వచ్చేసింది. ఇప్పుడు భర్తని ఇతడి చేతిలో పెడితే నయం చేస్తాడా, కక్ష తీర్చుకుంటాడా? రెండు వారాల్లో ఆపరేషన్ చేయకపోతే బతకడని రఘు అనేస్తాడు. ఆమె భర్తని కాపాడాలనే తప్ప అతడి మనసులో ఇంకే ఉద్దేశాలూ వుండవు. రాముకి వీళ్ళిద్దరి ప్రేమ గురించి తెలిసిపోతుంది. అతను అర్ధం జేసుకుని, ఆపరేషన్ లో తను మరణిస్తే, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని తీర్మానిస్తాడు. సీతకి ఇది జీర్ణంకాక రామూని బతికించుకోవాలని తీవ్ర సంఘర్షణ ప్రారంభిస్తుంది. రాము మాటలతో రఘు ధైర్యం కోల్పోతాడు. ఆపరేషన్ ఏ మాత్రం విఫలమైనా అది సీత తన సొంతమవుతుందన్న ఆశతోనే చేశాడని అందరూ అనుకుంటారు. ఇది భరించలేడు. దీంతో ఆపరేషన్ మీది బెంగతో నిద్రాహారాలు మాని, సర్జరీ శాస్త్రాలన్నీ తిరగేస్తూ పిచ్చివాడై పోతాడు. చివరికి ఆపరేషన్ రోజు రానే వస్తుంది. ఆపరేషన్ సక్సెస్ చేసి కుప్పకూలి మరణిస్తాడు డాక్టర్ రఘు. విశిష్ట కథనం, పాత్రచిత్రణలు పైన చెప్పుకున్నట్టు ఈ కథనానికి సస్పెన్స్ ప్రాణమై నిల్చింది. ఇప్పటి తెలుగు సినిమా ప్రేమ కథల్లో, కుటుంబ కథల్లో సస్పెన్స్ అనే ఎలిమెంటే వుండడం లేదు. అదేదో మిస్టరీ, క్రైం, యాక్షన్ కథల వ్యహారమనుకునే దురవగాహనతో వుంటున్నారు. పైగా గత రెండు దశాబ్దాలుగా తెలుగులో అవే రోమాంటిక్ కామెడీలూ, లేదంటే అవే మాస్ యాక్షన్లూ మాత్రమే చూస్తూ పెరిగిన కొత్తతరం దర్శకులు ఇంకో కళాప్రక్రియని వూహించలేక పోతున్నారు. ఎప్పుడైనా కుటుంబ కథ తీస్తే ఆ పాత్రల జీవితాల్లో థ్రిల్లే వుండదు, సస్పెన్సే వుండదు. పాసివ్ పాత్రలతో చప్పగా పాసివ్ కథనాలు చేసి చేతులు దులుపు కుంటున్నారు. ‘మనసే మందిరం’ ముఖ్య పాత్రలు మూడూ పాసివ్ పాత్రలు కాదు. ఈ కథ ట్రాజడీయే అయినా తలరాతని విధికే వదిలేసి ఏడుస్తూ కూర్చునే పాసివ్ పాత్రలు కావు. తలరాతని మార్చుకోవడానికి పరిస్థితులతో సంఘర్షించే, లక్ష్యమున్న యాక్టివ్ పాత్రలు. డాక్టర్ రఘు పాత్రలో ఏఎన్నార్ కి ఆపరేషన్ విజయవంతం చేయాలన్న లక్ష్యం, దాంతో సంఘర్షణ; సీత పాత్రలో సావిత్రికి మృత్యు ముఖం లోంచి భర్తని కాపాడుకోవాలన్న లక్ష్యం, దాని తాలూకు సంఘర్షణ; క్యాన్సర్ రోగి రాము పాత్రలో జగ్గయ్యకి వాళ్ళిద్దర్నీ కలపాలన్న లక్ష్యం, దీని తాలూకు సంఘర్షణ. లక్ష్యం మాటల్లో వుంటే చాలదు, అది చర్యల్లో విజువల్ గా కన్పించాలి. జగ్గయ్య వాళ్ళిద్దరికీ కలిపి వీలునామా కూడా రాసేసి లక్ష్య శుద్ధిని చాటుకుంటాడు. ఈ కథనంలో ఆలస్యం చేయకుండా రెండో సీన్లోనే కథ ప్రారంభించేస్తాడు దర్శకుడు. మొదటి సీనులో తల్లి వచ్చి, ఇంటికి రమ్మని ఏఎన్నార్ తో చెప్పి వెళ్ళాక, రెండో సీన్లోనే సావిత్రి జగ్గయ్యతో వచ్చేస్తుంది. జగ్గయ్యకి క్యాన్సర్. ఏఎన్నార్ కి ఎదుట వున్న సావిత్రితో పాత జ్ఞాపకాల తూఫాను, సావిత్రికి ఏఎన్నార్ మీద అనుమానం, వ్యతిరేకత. ఇలా కథకి ప్రధాన పాత్ర ఏఎన్నార్ అయితే, వ్యతిరేకించే ఎదుటి పాత్రగా సావిత్రి, వీళ్ళిద్దరి మధ్య గార్డియన్ పాత్రగా జగ్గయ్య. ఇలా బలాబలాల సమీకరణ పూర్తయ్యింది ఇక సంఘర్షణ అనే కథనరంగానికి. ఈ రెండో సీన్లోనే ఎక్స్ రే చూస్తున్నప్పుడు, ఏఎన్నార్ కి సావిత్రితో గతం తాలూకు ఒక దృశ్యం మెదులుతుంది. వీళ్ళిద్దరూ పూర్వ ప్రేమికులని దృశ్యపరంగా క్లుప్తంగా చెప్పడం. ఈ సంక్షిప్త దృశ్యంలో పెళ్లెప్పుడని సావిత్రితో ఏఎన్నార్ అంటాడు. తండ్రితో మాట్లాడతానని ఆమె చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంతకి మించి వీళ్ళిద్దరి పూర్వ ప్రేమ సన్నివేశాలు కథనంలో మరెక్కడా రావు. హాలీవుడ్ స్క్రీన్ ప్లే సూత్రమొకటుంది : కథనంలో డిమాండ్ ని సృష్టించు, సరఫరాని ఆపెయ్యి అని. ఇలా ఈ వొక సీనులో వాళ్ళ ప్రేమని అరకొరగా చూపించేసి, మనకి పూర్తిగా చూడాలన్పించే డిమాండ్ ని సృష్టించాడు దర్శకుడు. కానీ మరెక్కడా ఏఎన్నార్ – సావిత్రి హిట్ రోమాంటిక్ జంటతో మనకి చూడాలన్పించే ఆ పూర్తి ప్రేమ తాలూకు నులి వెచ్చని సన్నివేశాలని సరఫరా చేసి, డిమాండ్ ని తీర్చే పాపాన పోడు దర్శకుడు. కవితాత్మకంగా వూహకే వదిలేశాడు. దీంతో ఈ కథన భంగం (సీనస్ ఇంటరప్టస్) ఒక తియ్యటి బాధలా మిగిలిపోతుంది మనకి. ఇలాటి తియ్యటి బాధల్ని సృష్టించడం గొప్ప దర్శకుల వల్లే అవుతుంది. సినిమా ద్వితీయార్ధంలో ఒక చోట సావిత్రే తానెందుకు జగ్గయ్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మాటల్లో చెప్తుంది. ఇప్పుడు కూడా ఫ్లాష్ బ్యాక్ వేయలేదు. ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రధాన కథకి అవసరమైన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే. అది కథవదు. కనుక మాటల్లో చెప్పేస్తే సరిపోతుంది. దాన్నే ఫ్లాష్ బ్యాకువేసి చూపిస్తూ పోతే, అది ప్రధాన కథ స్క్రీన్ టైముని తినేసి, అదే ప్రధాన కథ అన్నట్టుగా తయారవుతుంది. ఒకసారి ఇప్పుడొస్తున్న దర్శకుల సినిమాల సరళిలో ఈ కథనాన్ని పెట్టి చూస్తే, తమాషాగా ఇలా వుంటుంది – సావిత్రి జగ్గయ్యతో వచ్చి క్యాన్సర్ అని ఏఎన్నార్ తో చెప్తుంది. ఏఎన్నార్ ఎక్స్ రే చూస్తూ సావిత్రిని వూహించుకుంటాడు. అంతే, ఫ్లాష్ బ్యాక్ తన్నుకొచ్చేస్తుంది. కాలేజీలో వాళ్ళిద్దరి చదువులు, ప్రేమలు, వాళ్ళిద్దరి కుటుంబ పరిస్థితులు, యుగళ గీతాలు, విద్య కోసం ఏఎన్నార్ విదేశీ యానం, సావిత్రి కి తండ్రి వల్ల జగ్గయ్యతో బలవంతపు పరిణయం, ఏఎన్నార్ స్వదేశాగమనం, ఇక ప్రేమంతా మంటగలిసిందని వైద్య సేవల్లో కలిసిపోవడం. ఇలా రొడ్డకొట్టుడు ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యే సరికి ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇక్కడ్నుంచి జగ్గయ్య ఆపరేషన్ గురించిన అసలు కథ. ఏ కథైనా ఈ చట్రంలోనే వేసి రంగులరాట్నం తిప్పడం. రెండు మాటల్లో చెప్తే పోయే పాత పురాణాన్ని సగం సినిమా ఫ్లాష్ బ్యాకుగా వేసి, అది కూడా ప్రధాన కథే అన్నట్టుగా విన్యాసాలు చేయడం. ఒకే సినిమాలో రెండు ప్రధాన కథలుండవన్న ఇంగిత జ్ఞానంలేక. ఉన్న ప్రధాన కథ లోతుపాతుల్లోకి వెళ్ళడం తెలీక, ఎత్తుకున్న ప్రధాన కథ నడపడమూ తెలీకా, ఇలా ఇంటర్వెల్ వరకూ వృధా కాలక్షేపం చేయడం. కథని వీలయినంత తక్కువ స్క్రీన్ టైముకి కుదిస్తూ, సెకండాఫ్ లో ఏదో కథ చెప్పేసి, బయటికి దూకెయ్యడం. ఆ వికృత సినిమాల్ని ప్రేక్షకుల చేతిలో పెట్టడం. కానీ శ్రీధర్ ప్రధాన కథ రెండో సీన్లో వెంటనే ప్రారంభమయింది మొదలు, చివరంటా రెండున్నర గంటలూ ఎడతెగని బిగితో ఆద్యంతం జ్వలిస్తూ సాగుతుంది ఫ్లాష్ బ్యాక్ ని ఎగేస్తూ. ఇందులో ఏఎన్నార్ – సావిత్రిల పూర్వ ప్రేమ కథని నామమాత్రం చేయడంలో ఇంకో ఉద్దేశం కూడా వుండొచ్చు. దర్శకుడు దీన్ని పూర్తి స్థాయి సస్పెన్స్ కథగా చెప్పాలనుకున్నాడు. పూర్వ ప్రేమ తాలూకు ఏ మాత్రం ఫ్లాష్ బ్యాక్ వేసినా, నడుస్తున్న ప్రధాన కథ తాలూకు సస్పెన్స్ ధార చెదిరిపోతుంది. కథనిండా మేట వేసిన శోక రసాన్ని మరిపించడానికి సస్పెన్స్ అనే షుగర్ కోటింగ్ ఇచ్చాడు – ‘ముత్యాల ముగ్గు’ లో బాపు - రమణలు కథా మూలంలో వున్న శోక రసాన్ని మరిపించే, అద్భుత రసపు షుగర్ కోటింగుతో హుషారైన కథ చెప్పినట్టు. శ్రీధర్ కూడా ఈ షుగర్ కోటింగ్ ని కాపాడుకునే కథనమే చేశాడు సస్పెన్సు అనే ఏకసూత్రతని కాపాడుకుంటూ. రెండు విడతల సస్పెన్స్ రెండో సీన్లోనే జగ్గయ్యకి ఆపరేషన్ అనీ, అది రెండు వారాల్లోననీ ఒక టైం లాక్ తో సమస్య నేర్పాటు చేశాక, నడిపే కథనంలో సస్పెన్సు రెండు విడతలుగా కన్పిస్తుంది. ఇప్పుడు చెప్పిన ఆపరేషన్, దీని తాలూకు పరిణామాలతో కూడిన సస్పెన్సుతో ఏర్పడే సెన్సాఫ్ డేంజర్ ని ఇప్పట్నుంచే ఫీలవ్వం మనం. ఇది మొదలవడానికింకా టైముంది. దీనికంటే ముందు ఇంకో సెన్సాఫ్ డేంజర్ ప్రారంభించిన కథలోనే తోస్తోంది మనకి. అది ఏఎన్నార్ - సావిత్రిలు జగ్గయ్య ముందు దాచిపెడుతున్న పూర్వ ప్రేమాయణం. ఇది బయటపడే ప్రమాదం పొంచి వుంది. ఇలా ప్రస్తుతం ఈ సెన్సాఫ్ డేంజర్ ని మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడేంటి? ఎప్పుడో జరిగే ఆపరేషన్ సంగతి సరే, ఇప్పుడున్న వీళ్ళ రహస్యం మాటేమిటి? దాచి పెడుతున్నది బయట పడక తప్పదు. అప్పుడేం జరుగుతుంది? ఇది ముందు తేల్చడం ఈ కథ ముందుకు సాగడానికి అవసరం. కాబట్టి అనివార్యంగా ముందు చేపట్టాల్సిన కథనం దీనికి సంబంధించిందే అయింది. ఆర్ట్ ఆఫ్ నెగోషియేషన్ లో సమస్యల్ని డీల్ చేసే విధానముంటుంది. ప్రతీ సమస్యా ఓ గతంతో ముడిపడి వుంటుంది. ఆ గతాన్ని సరిచేస్తే సమస్య పరిష్కారమైపోతుంది. పాలకులు సరి చేయరు. వాళ్లకి కాష్ఠం రగులుతూ వుండాలి. రచయితలు సరి చేయాల్సి వుంటుంది. రచయితలు కూడా పాలకుల పాలెగాళ్ళయితే చెయ్యరు. అది వేరే సంగతి. ఆపరేషన్ సమస్యతో ఏఎన్నార్, సావిత్రిల పరస్పర భయసందేహాలు తీరి పరిష్కారమవాలంటే, వాళ్ళ గత సంబంధాన్ని తేల్చెయ్యాలి. అంటే గార్డియన్ పాత్రగా వున్న జగ్గయ్యకి ఈ వ్యవహారం తెలిసిపోయి, అతనో నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఆపరేషన్ తో సమస్య పరిష్కారమవుతుంది. అంటే కథనం జగ్గయ్యకి తెలిసే ముందు, తెలిసిన తర్వాతా అనే ద్విముఖాలుగా వుండాలి. తెలిసేముందు రిలేషన్ షిప్ తో ఒక సస్పెన్స్, తెలిశాక ఆపరేషన్ తో ఇంకో సస్పెన్స్. ఇలా రెండు విడతల సస్పెస్ తో కథాపథకం. ఈ స్పష్టత, ఈ విభజన, ఈ ప్లానింగ్ లేకపోతే ఏం కథ చేస్తున్నామో జుట్టు పీక్కున్నా అర్ధంగాదు. స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ మాటల్లో సినిమా కథంటే సైకో థెరఫీయే. తొలి విడత సస్పెన్స్ రెండు వారాల్లో ఆపరేషన్ చేయాలనీ నిర్ణయించాక, జగ్గయ్య హాస్పిటల్లో అడ్మిటవుతాడు. సావిత్రి కూడా అక్కడే వుండిపోతుంది, బట్టలూ అవీ తెప్పించుకుని. ఏఎన్నార్ నివాసం ఎలాగూ అక్కడే. ఒక రాత్రి పూట సావిత్రితో దిగిన పాత ఫోటో చూసుకుంటూ పాటలోకెళ్ళి పోతాడు. ఆ పాటలో సుమంగళిగా ఆమె సుఖాన్నే కోరుకుంటాడు. పాట పూర్తయ్యాక జగ్గయ్య వచ్చేస్తాడు. కంగారుపడి ఫోటోని పత్రికలో దాచేస్తాడు ఏఎన్నార్. చదువు కోవడానికి ఏమైనా పుస్తకాలుంటే ఇమ్మని పత్రిక తీసేసుకుంటాడు జగ్గయ్య. ఏఎన్నార్ గుండె ఢామ్మంటుంది. ఏం చేసే లోగా పత్రికతో వెళ్ళిపోతాడు జగ్గయ్య. పత్రిక తిరగేస్తోంటే ఆ ఫోటో జారి కింద పడుతుంది. ఇది చూసి సావిత్రి గుండె ఢామ్మంటుంది. ఎలాగో జగ్గయ్యని లోపలికి పంపి ఆ ఫోటో తీసెయ్యబోతే, ఏఎన్నార్ తీసుకుని వెళ్ళిపోతూంటాడు గబగబా. ఈ గండం గడిచాక మరో గండం ఎదురవుతుంది. ఏఎన్నార్ తల్లి హాస్పిటల్ కొస్తుంది. ఆమె కొడుకు జీవితం గురించి సావిత్రి, జగ్గయ్యల ముందు వాపోతుంది, “ఎవరో ఒకమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి ఇంకొకర్ని పెళ్లి చేసుకుందట. దాంతో వాడి మనసు విరిగిపోయి పెళ్ళే చేసుకోలేదు” అని. ఇక్కడున్న సావిత్రియే కొడుకు ప్రేమించినమ్మాయని ఆమెకి తెలీదు. ఇదెక్కడ బయటపడుతుందోనని సావిత్రికి ఒకటే ఆందోళన. జగ్గయ్య అంతా విని నిర్వేదంగా, “ఈ రోజుల్లో ప్రేమించడం సరదా అయిపోయింది. దీనివల్ల ఎందరి జీవితాలు ఎలా నాశనమవుతున్నాయో ఎవ్వరూ వూహించడం లేదు. నేనూ సీతా మీ అబ్బాయికి నచ్చజెప్పి ఎలాగైనా పెళ్ళికి ఒప్పిస్తాం” అంటాడు. ఆమె వెళ్ళిపోయాక సావిత్రితో అంటాడు, “చూశావా సీతా, ఒక పురుషుడికి ఒక స్త్రీ చేసిన ద్రోహం. ప్రేమించింది ఒకర్ని, పెళ్ళాడింది ఒకర్ని. ఆ అమ్మాయి ఎంత మోసగత్తె అయి వుండాలి. నా బాధంతా పాపం ఆ డాక్టర్ గురించే. ఇంత చదువూ తెలివీ వుండి కూడా ప్రేమంటే ఒక ఆట వస్తువుగా భావించే ఆడదాన్ని నమ్మి ఎలా మోసపోయాడో చూశావా?” సావిత్రికి గుండె పగిలిపోతూంటుంది తనని ఇంతింత మాటలంటూంటే, “ ఏమో ఆ అమ్మాయి మంచిది కాదని ఎలా అనగలం?” అనేస్తుంది. అందుకు జగ్గయ్య, “మంచిదెలా అవుతుంది సీతా? ఆమె నిజంగా డాక్టర్ని ప్రేమించి వుంటే, తర్వాత ఆ భర్తకి మనసెలా ఇవ్వగలుగుతుంది? ఒకవేళ భర్త పట్ల నిజాయితీగా వుంటే, డాక్టర్ తో ఆమె ప్రేమంతా నాటకమే కదా?” అని. ఆమె తట్టుకోలేక భోరుమంటుంది. ఇక్కడ కథాపరమైన తొలి విడత సస్పెన్స్ నిర్వహణతో బాటు, పాత్రచిత్రణల వికాసం కూడా వుంది. ఏఎన్నార్ తల్లి రాకతో జగ్గయ్యకి ఏఎన్నార్ విషయం తెలిసి అతడి పెళ్లి ఆలోచన స్ఫురించింది. ఇది మున్ముందు కథలో ఏఎన్నార్ కి పెళ్లి అనే చర్య తీసుకోవడానికి దారి తీస్తుంది. రెండోది, సావిత్రికి తన రహస్యం ఎక్కడ బయట పడుతుందోనన్న భయాందోళనలతో బాటు, పైకి చెప్పుకోలేని తన నిర్దోషిత్వం గురించిన భావోద్వేగాలు అనుభవించడం. తను మోసగత్తె కాదని ఎలా చెప్పుకోవాలి? అసలేం జరిగిందో ఎలా చెప్పుకుంటుంది? చెప్పుకోవడానికి మొహం చెల్లకే ఏఎన్నార్ తో ఇంతకాలం చెప్పలేదు. ఇప్పుడు కథాపరమైన మొదటి విడత సస్పెన్సుకి తోడు అసలు గతంలో ఏం జరిగి ఏఎన్నార్ నుంచి సావిత్రి విడిపోయిందన్న అనుబంధ సస్పెన్సుని ప్రేక్షకుల మీద రుద్దాడు దర్శకుడు. ఇప్పుడు మనకి వాళ్ళ రోమాంటిక్ గతం తెలుసుకోవాలన్న డిమాండ్ పక్కకి వెళ్ళిపోయి, ఆ ట్రాజిక్ గతమేంటో తెలుసుకోవాలన్న డిమాండ్ పెరిగిపోయింది. దీన్నె ప్పుడు సరఫరా చేస్తాడు దర్శకుడు? ఇది అనుబంధ సస్పెన్స్. దీంతో అయిపోలేదు. సావిత్రీ ఏఎన్నార్ లకి జగ్గయ్యతో ఇంకో గండం. సావిత్రి ముందు ఏఎన్నార్ కి కౌన్సెలింగ్ చేస్తాడు జగ్గయ్య. ఏఎన్నార్ పాత ప్రేమని తోడుతాడు. ఆ ప్రియురాలిని నిందిస్తాడు. ఈ ప్రేమలు ఒట్టి కబుర్లనీ, బతకడానికి తెలియని వాళ్ళే వీటిని పట్టుకుని ప్రాకులాడతారనీ, దీన్నుంచి తేరుకుని పెళ్లి చేసుకుని తల్లిని సంతోష పెట్టమనీ అంటాడు. తర్వాత ఏఎన్నార్ సావిత్రిని ఏకాంతంలో కలిసి మాట్లాడుతూండడంతో వినేస్తాడు జగ్గయ్య. ఈ సందర్భంగా సీత అంటుంది, “నా భర్త నన్ను ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాడు. ఒకనాడు మీరు ప్రేమించిన అమ్మాయి నేనేనని తెలిస్తే వారి హృదయం బద్దలై పోతుంది. అందువల్ల ఏర్పడే విపరీత పరిణామాలకు మీరు కారణం కాకూడదనే నా కోరిక” అని. ఏఎన్నార్ మాటిస్తాడు, అసలు తను తెలిసినట్టు కూడా ప్రవర్తించనంటాడు. అయితే ఒక్క సందేహం తీర్చి మనశ్శాంతి కల్గించమంటాడు. ఇందుకామె, “డాక్టర్, మీకు కొంచెమైనా మనశ్శాంతి కల్గించడం నాకు చేతనైతే నేను చేసిన పాపానికి అదే ప్రాయశ్చిత్తం, చెప్పండి?” అంటుంది. అసలెందుకు విడిపోయావని అడుగుతాడు. ఆమె చెప్పుకొస్తుంది. ఆమె తండ్రి బ్యాంకు క్యాషియర్. యాభై వేలు పోయిన నేరం మీద పడింది. బ్యాంక్ డైరెక్టర్ ని కలిసి చెప్పుకుంటే, జైలుకెళ్ళకుండా వుండాలంటే తన కొడుక్కి కూతుర్నివ్వా లన్నాడు డైరెక్టర్. కూతురికి చెప్పుకుంటే, తను ఏఎన్నార్ ని ప్రేమించానని చెప్పుకుని ససేమిరా అంది. “నీ సుఖం కోసం జైలు పాలవ్వాలా నేనూ? ఈ ఇంటికోసం ప్రేమని త్యాగం చేయలేవా?’ అని నిలదీశాడు తండ్రి. తను జైలుకెళ్తే తల్లి గుండాగి చస్తుందని కూడా అన్నాడు. ఇక విధిలేక జగ్గయ్యని చేసుకుంది. చేసుకున్నాక తెలిసింది అతడికి క్యాన్సర్ అని. జగ్గయ్య తండ్రి ఇది దాచిపెట్టి తనకి తాళి కట్టించాడని అర్ధమైంది... ఇలా సావిత్రి చెప్పేసరికి ఏఎన్నార్ ఆమె పరిస్థితికి కదిలిపోతాడు. అటు చాటుగా వుండి వింటున్న జగ్గయ్య ఛాతీ పట్టుకుని ఉక్కిబిక్కిరైపోతాడు. అసలే గుండెకి ముదిరిన క్యాన్సర్. అందులో ఇలాటి అగ్నిపర్వతం బద్ధలవడం... దీంతో ఏఎన్నార్ – సావిత్రిల తాలూకు రహస్యం కొలిక్కి వచ్చింది. ఇప్పుడు బంతి జగ్గయ్య కోర్టులో పడింది. మనకీ గతం తాలూకు అనుబంధ సస్పన్స్ తీరిపోయింది. సావిత్రి ఇలా చెప్పేసి ఆగదు. ఆ ఫోటో ఇచ్చెయ్యమంటుంది. అదొక్కటే తను సాంత్వన పొందడానికి మిగిలిన ఆధారమంటాడతను. ప్రేమని మర్చిపోలేనంటాడు. మానవ జీవిత పరమార్ధం వలచి విలపించడం కాదంటుంది. అతడి వృత్తి, పేరు ప్రతిష్టలు తన మూలంగా నాశనమై, తానో సమాజ ద్రోహిగా నిలబడ లేనంటుంది. ఇక మర్చి పొమ్మంటుంది. చేసేది లేక ఫోటో చించేస్తాడు. కథనంలోఈ తొలి విడత సస్పెన్స్ విభాగంలో, రాబోయే మలి విడత సస్పన్స్ విభాగపు కథనానికి అడ్డు పడకుండా కొన్నిసమస్యల్ని పరిష్కరిస్తున్నాడు దర్శకుడు. ప్రేమని అతను మర్చిపోకపోతే చేయబోయే ఆపరేషన్ కి అది అడ్డుపడుతుంది. కానీ చేయబోయే ఆపరేషన్ కి జగ్గయ్య ప్రకటించే నిర్ణయం అడ్డుపడబోతోంది. అందువల్ల రెండు కారణాలు అడ్డుపడితే గజిబిజి అవుతుందని, మొదటి కారణమైన ప్రేమ ని క్లియర్ చేసేశాడు దర్శకుడు. ఇప్పుడు వీళ్ళ పూర్వ ప్రేమ తెలిసిపోయిన నేపధ్యంలో, జగ్గయ్య ఏం నిర్ణయం తీసుకుంటాడనే మలి విడత సస్పెన్స్ తో కథనం మొదలు. జగ్గయ్యకి తెలియక ముందు కథనం పూర్తయి, తెలిసింతర్వాత కథనం ఇక మొదలవుతోంది. మలి విడత సస్పెన్స్ “డాక్టర్ మీరు నాకో సహాయం చేయాలి. ఆపరేషన్ చేస్తే నేను బతుకుతానంటారా? నేను పిరికి వాణ్ణి కాను, మీ మనసులో వున్న నిజాన్ని ధైర్యంగా చెప్పండి. చచ్చిపోతానని నేను భయపడ్డం లేదు. నేను బ్రతికి సాధించేది లేదు. ఇంతవరకూ నా జీవితంలో నాకెలాటి కొరతా కలగలేదు. ఐశ్వర్యం లోపుట్టాను, అల్లారు ముద్దుగా పెరిగాను. ఆనందంగా జీవించాను. అందం, గుణం వున్న పిల్లనే చేసుకున్నాను. ఈ క్షణం వరకూ ఆమెకే లోటూ రానివ్వకుండా ప్రాణప్రదంగా చూసుకుంటున్నాను. అన్నివిధాలా అందరికీ అసూయ కల్గించే జీవితాన్ని నేననుభవించాను...” “ఇక ముందు కూడా మీకిలాగే జరుగుతుంది” “మీరు చెప్తున్నది జ్యోతిషం, నేను చెప్తున్నది నిజం... మీరొక వాగ్దానం చెయ్యాలి. నేను చనిపోతే ఆమెకి మళ్ళీ పెళ్లి జరిపించే బాధ్యత మీది...” ఏఎన్నార్ నెత్తిన పిడుగులు పడతాయి. ససేమిరా అంటాడు జగ్గయ్య. సరే, ఆమె అంగీకరిస్తే తన వాగ్దానం తప్పక నేరవేరుస్తానంటాడు ఏఎన్నార్. ఇక్కడ జగ్గయ్య వ్యూహాత్మకంగా నేరుగా ఆమెని పెళ్లి చేసుకోమనడం లేదు. సావిత్రితో కూడా ఇలాగే వ్యూహాత్మకంగా అంటాడు. నేరుగా చెప్పేసి షాకివ్వదల్చుకోలేదు. ఇప్పుడు సావిత్రి, ఏ ఎన్నార్ లకి జగ్గయ్య చావుబతుకుల సమస్య ముఖ్యమైపోతుంది. పూలూ పసుపూ తెప్పించుకుని సుమంగళిలా అలంకరించుకుని పూజలు చేస్తుంది. ఇంతలో ఓ ఐదేళ్ళ బాలికకి ఏఎన్నార్ చేసిన ఆపరేషన్ విఫలమై చనిపోతుంది. దీంతో సావిత్రికి ఏఎన్నార్ సామర్ధ్యం మీద నమ్మకం పోతుంది. జగ్గయ్యని ఇక్కడ్నించి తీసికెళ్ళి పోతానంటుంది. “డాక్టర్, ఏదైనా జరిగితే మీరు కారణం కాకూడదని నా కోరిక. మీరు నా హృదయంలో శాశ్వతంగా వుండాలంటే నా భర్త ఇక్కడ చచ్చిపోకూడదు. నన్ను ప్రేమించి విఫలమయ్యారని మీరు కక్ష సాధించారని నేనేనాడూ అనుకోకూడదు” జగ్గయ్యకి కూడా చెప్పేస్తుంది ఇక్కడ్నుంచి వెళ్ళిపోదామని. ఏఎన్నార్ ని అవమానించడం తగదంటాడు అతను. దీంతో ఉద్రిక్తత సడలుతుంది. మళ్ళీ పెట్రేగుతుంది. ఈసారి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని జగ్గయ్య నేరుగా చివరి కోరిక వెల్లడించడంతో. ఇద్దర్నీ ఏడ్పిస్తాడు. ఇద్దరూ నిరసిస్తారు. అయినా చేసేది చేసుకుపోతాడు జగ్గయ్య. లాయర్ ని పిలిపించుకుని ఇద్దరికీ తన ఆస్తి వీలునామా రాసేస్తాడు. ఇక లాభం లేక సావిత్రి తన నిర్ణయం తానూ తీసుకుంటుంది. సరీగ్గా రెండు వారాల గడువు పూర్తయి ఆపరేషన్ మొదలవుతూంటే, గదిలో కెళ్ళి తలుపులు బిడాయించుకుంటుంది. ఏఎన్నార్ చేతిలో భర్త మరణ వార్త వింటే, అదే క్షణం తన చావూ జరిగిపోవాలని గదిలో వుండి పోతుంది. ఏఎన్నార్ పరిస్థితి కొన్ని రోజుల ముందునుంచే దారుణంగా వుంటుంది. ఆపరేషన్ చేయగలుగుతాడా అన్న గొప్ప ఆత్మనూన్యతా భావానికి లోనవుతాడు. ఒక ఉత్తమురాలైన తల్లికి పుట్టిన కొడుకుగా నీతో ఎలాటి స్వార్ధానికీ పోనని అన్నా కూడా ఆమె నమ్మదు. కన్న తల్లిని సాక్ష్యంగా చేసి చెప్పడం కన్నా ఉత్కృష్ట నివేదన ఇంకేం వుంటుంది. ఆమె నమ్మదు. ఆమె పరిస్థితులు ఆమెకున్నాయి. ఆమె కూడా నమ్మనప్పుడు డాక్టర్ గా తన సామర్ధ్యం పట్ల ఆత్మవిశ్వాసం పూర్తిగా కరిగిపోతుంది. తిండి మానేసి, నిద్ర మానేసి, శస్త్ర చికిత్స పుస్తకాలు చదివేస్తూంటాడు. ఎలాగైనా ఆపరేషన్ సక్సెస్ చేసి తన నిజాయితీ నిరూపించుకోవాలి... నిరూపించుకుంటాడు. కానీ అది యాంటీ క్లయిమాక్స్ కి దారి తీస్తుంది. జగ్గయ్యకి ఆపరేషన్ సక్సెస్ అయిందని తలుపు కొట్టి కొట్టి సావిత్రిని పిల్చి, ఆమె తలుపు తీశాక శుభవార్త చెప్పేసి కుప్పకూలి మరణించి పోతాడు. లోటు తీర్చే ప్రయత్నాలు సంక్లిష్ట కథా కథనాలు, సంక్లిష్ట పాత్ర చిత్రణలు. 29 ఏళ్ల శ్రీధర్ విరచిత విన్యాసాలు. నటత్రయం అభినయ వైశిష్ట్యాలు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్యల గురించి చెప్పుకోవాలంటే వాక్యాలందవు. చూసి తరించాల్సిందే. ఏ వొకరి ముఖంలోనూ సంతోషం పలకని గూడు కట్టిన విషాదమే. అభిమాన తారలు ఇంత విషాదంతో వుండిపోతే ప్రేక్షకులకి ఇబ్బందే. అక్కినేని ఎక్స్ రే చూస్తూ తలచుకున్నప్పుడు సావిత్రితో ఒక సంక్షిప్త ప్రేమ సన్నివేశం తప్ప, ఇంకే రిలీఫ్ కూడా వుండదు. ఫోటో చూస్తూ పాడుకున్నప్పుడు కూడా వాళ్ళ గతం తాలూకు రోమాంటిక్ మాంటేజీలు పడవు. దీనికి భిన్నంగా హిందీ రీమేక్ లో వుంది. రాజేంద్రకుమార్ ఎక్స్ రే చూస్తున్నప్పుడు మీనా కుమారితో పాటలోకి వెళ్ళిపోతాడు (తేరే మేరే సివా యహా కోయీ నహీ). ఇది సినిమాకి మాంచి యూత్ అప్పీల్ ని సరఫరా చేస్తుంది. తర్వాత ఫోటో చూస్తూ పాడుకున్నప్పుడు (యాద్ న జాయే భీతే దినోకీ) విరివిగా వచ్చే వాళ్ళ పూర్వ ప్రేమ తాలూకు మాంటేజీలు మరోసారి యూత్ అప్పీల్ కి న్యాయం చేస్తాయి. ముందంతా విషాదమే చూపిస్తున్నప్పుడు ప్రారంభంలో ఈ మాత్రమైనా వినోదపర్చాలి. తమిళ మాతృక తర్వాత హిందీ రీమేక్ అయింది. దీని తర్వాత తెలుగు రీమేక్. కానీ ఎందుకనో అప్డేట్ చేసిన హిందీ రీమేక్ ని తెలుగుకి అనుసరించలేదు. తమిళ మాతృకనే ఫాలో అయ్యారు. హిందీలో పత్రికలోంచి ఫోటో బయటపడే సీన్లో థ్రిల్, సస్పెన్సుల పోషణ భలే వుంటుంది. బ్లాక్ అండ్ వైట్ వెలుగు నీడలతో ఛాయాగ్రహణం కూడా ఉన్నత ప్రమాణాలతో వుంటుంది. ఇక అన్నిపాటలూ ప్రజాదరణ పొందాయి. తెలుగులో రెండే (అపరంజి బొమ్మ, తలచినదే) హిట్టయ్యాయి. ఈ విషాద కథ హిందీలో మ్యూజికల్ హిట్టయితే, తెలుగులో అది కూడా కాలేదు. మూడు సార్లు తీసిందే తీస్తూ అలసిపోయి వుంటాడు శ్రీధర్. కథ పూర్తి విషాదం కాబట్టి కామెడీ ట్రాకు పెట్టారు. చలం – గిరిజ – రేలంగిలు వేసుకునే కామెడీ వేషాలు కథతో సంబంధం లేకుండా హాస్పిటల్లో ఓ పక్క వచ్చి పోతూంటాయి. వినోదం లేని లోటు ఇలా తీర్చినట్టున్నాడు. కానీ వినోదం ప్రధాన పాత్రలతో కూడా కాస్త వుండాలి. ఇక హాస్పిటల్లో కొందరి పేషంట్లతో సబ్ ప్లాట్స్ (ఉపకథలు) వుంటాయి. ఇవి ప్రధాన కథలో సంఘర్షిస్తున్న ఏఎన్నార్, సావిత్రి, జగ్గయ్య పాత్రల ప్రవర్తనల్ని నియంత్రించే దిశగా వుంటాయి. సబ్ ప్లాట్స్ లో ఉత్పన్నమయ్యే అర్థాలు మెయిన్ ప్లాట్స్ లో ప్రతిఫలిస్తూంటాయి. ఇలా ఇన్ని పొరలుగా కథ వున్నప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అనే ఇంకో పొర కల్పిస్తే ఎక్కువైపోయే మాట నిజమే. అందుకని ఫ్లాష్ బ్యాక్ ని పరిహరించడం మేలే చేసింది. దర్శకుడితో బాటు తెరవెనుక ఆత్రేయ గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన మాటల మాంత్రికుడు కాదు. మాయ చేయడు. జీవితాలు పలికే పలుకులనే నిరాడంబరంగా స్వచ్ఛంగా పలికిస్తాడు. సంభాషణల బలం ఈ ట్రాజడీకి ప్రధాన ఆకర్షణ. ఐతే ఈ కథలో దర్శకుడు కూడా జవాబు చెప్పలేని ప్రశ్న వొకటుంది. ఈ ప్రశ్న వేస్తే కథేమవుతుందో, పాత్రలేమై పోతాయో తెలీదు. సినిమా కూడా వుండే అవకాశమందో లేదో తెలీదు. కానీ మన బుద్ధికి ఇలా తోస్తుంది : జగ్గయ్య తాను చనిపోతే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలన్నాడు. చనిపోకపోతే? ముగ్గురూ ఇలాగే సిగపట్లు పడుతూ వుండిపోతారా ముగింపు లేకుండా? దేవుడు జోక్యం చేసుకుని ఏఎన్నార్ ని తప్పించడం జగ్గయ్య అదృష్టమే! ―సికిందర్ Posted by సికిందర్ at 10:33:00 AM Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Newer Posts Older Posts Home Subscribe to: Posts (Atom) ఈ కాన్సెప్ట్ కి బాధితురాలి కథ అవసరం! స్క్రీన్ ప్లే సంగతులు...? Search This Blog contact msikander35@gmail.com, whatsapp : 9247347511 Popular Posts 1234 : రివ్యూ! రచన - దర్శకత్వం : రిషభ్ శెట్టి తారాగణం : రిషభ్ శెట్టి , సప్త మీ గౌడ , కిషోర్ , ప్రమోద్ శెట్టి , అచ్యుత్ కుమార్ , ఉగ్రం రవి తదితరులు సం... 1250 : రివ్యూ! (దేశవిదేశ పాఠకులందరికీ నమస్కారం. సినిమాలు చూస్తూనే వున్నా రాయాలంటే రైటర్స్ బ్లాక్ లాంటిది అడ్డుపడి ఇప్పుడు రిలీజ్ చేసింది. ఇక నుంచి రెగ్యు... తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17 స్క్రీ న్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసల... 1249 : రివ్యూ! రచన - దర్శకత్వం : రాజ్ విరాట్ తారాగణం : నందు విజయ్ కృష్ణ , రష్మీ గౌతమ్ , కిరీటి దామరాజు , రఘు కుంచె తదితరులు సంగీతం : ప్రశాం... నాటి సినిమా! దే శం దుర్మతుల పాలయినప్పుడు, అమాయకులు అన్యాయాలకి బలౌతున్నప్పుడు, ధర్మానికి తానే రాజు అయి, న్యాయానికి తానే బుద్ధి అయ్యి, ధర్మ సంస్థాపన... రైటర్స్ కార్నర్ హై కాన్సెప్ట్ స్క్రిప్ట్ అంటే బిగ్ కలెక్షన్స్ ని రాబట్టే స్క్రిప్ట్. ఈ ఆర్టికల్ లో మీకు బిగ్ కలెక్షన్స్ ని సాధించి పెట్టే హై కాన్స... (no title) ప్ర తిభ నిరూపించుకోవడానికి షార్ట్ ఫిలిమ్సే కాదు, డాక్యుమెంటరీ లనే విభాగం కూడా వుంది. ఐతే ఇది సామాజిక బాధ్యతలతో కూడుకున్నది. వివ... 1246 : రివ్యూ! రచన- దర్శకత్వం : మేర్లపాక గాంధీ తారాగణం : సంతోష్ శోభన్ , ఫరియా అబ్దుల్లా , బ్రహ్మాజీ , సప్తగిరి , ప్రవీణ్ , శుభలేఖ సుధాకర్ , బెనర్జ... 1251 : స్క్రీన్ ప్లే సంగతులు -1 దె య్యాలు ఎలాగైతే మూఢ నమ్మకమో , చేతబడి అలాటి మూఢ నమ్మకమే. దెయ్యాలతో హార్రర్ సినిమాలు తీసి ఎంటర్ టైన్ చేయడం వరకూ ఓకే. చేతబడి వుందంటూ నమ... 1244 : సండే స్పెషల్ రివ్యూ! జ గత్ప్రసిద్ధ బ్రిటిష్ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ గురించి తెలియని వారుండరు. షెర్లాక్ హోమ్స్ మీద చాలా సినిమాలొచ్చాయి. షెర్లాక్ హ...
శాస్త్రీయ సంగీతం, సారస్వత రంగం లో వున్న ఉత్సుకతతో శ్రీ పాములపర్తి సదాశివ రావు గారు 1945 లోనే వరంగలులో “కాకతీయ కళాసమితి” అనే ఒక సంగీత సారస్వత సంస్థను నెలకొల్పారు. ఈ కళా సమితి కార్యాలయం స్థానిక శ్రీ రామలింగేశ్వర ఆలయంలో వుండేది. ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ఈ సమితి “ శ్రీ త్యాగరాజ మహోత్సవాలు” నిర్వహించేది. తొలుత ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు, పిదప ఐదు రోజుల పాటు జరిగేవి. ఈ ఉత్సవాలు జరిగిన అన్ని రోజులూ వరంగల్ ప్రజలకు పండగ రోజులే! దాదాపు 15 సంవత్సరాలు ఈ కళాసమితి వరంగల్ ప్రజలకు సంగీత సాహిత్య మధుర రుచులను చూపించింది. కాకతీయ కళాసమితి ఆ రోజుల్లోనే సుమారు 50 మంది విద్యార్థులతో ఒక సంగీత పాఠశాలను నిర్వహించేది. ఇంకా (1) శ్రీ రామనవమి, (2) దీపావళి, (3) స్వాతంత్ర దినం,(4) గోకులాస్టమి (5) గణేష ఉత్సవాల సందర్భంగా ప్రతి యేడూ 5 సంగీత వాద్య కార్యక్రమాల్ని నిర్వహించేది. ఈ కళాసమితి కార్య కలాపాల్ని మెచ్చుకున్న అలనాటి హైదరాబాద్ ప్రభుత్వం, డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా 1950-51 నుండి 500/- రూపాయల గ్రాంటును ప్రతి యేడూ ఇచ్చేది. ఈ కళా సమితి కార్యాలయాన్ని ఆ రోజుల్లో మద్రాసులో అమెరికన్ కాన్సలేట్ జనరల్ గా వ్యవహరించిన “పాల్ గ్రైంస్” స్వయంగా వచ్చి సందర్శించారు. అలనాటి కాకతీయ కళాసమితి కార్యవర్గ సభ్యుడైన శ్రీ దేవులపల్లి దామోదర్ రావు గారి మాటల్లో చెప్పాలంటే … “శ్రీ సదాశివరావు గారు నాకంటే రెండున్నర సంవత్సరాలు వయస్సులో పెద్దవారు. 1945 నుండి మా పరిచయం బాగా వృద్ధి చెందింది. ఆ రోజుల్లోనే వరంగల్ లో కాకతీయ కళాసమితి యను ఒక సంస్థను స్థాపించుటకు మూలకారకుడు. ఆయనకు చేదోడువాదోడుగా వుంటూ, శ్రీ రాయపరాజు వేంకట్రామారావు గారు సుమారు పది సంవత్సరాలు కళాసమితి అధ్యక్షులుగా వున్నారు. శ్రీ సదాశివరావు కార్యదర్శిగాను, శ్రీయుతులు కక్కెర్ల కాశీనాధంగారు, పులిపాక కోటిలింగంగారు, శ్రీరాం చంద్రమౌళిగారు, బెలిదె ముకుందంగారు, తమ్మడి వీరమల్లయ్య గారు, నేను (అంటే దామోదర్ రావుగారు)మున్నగు వారు నిర్వాహకులుగా వున్నారు. అలనాటి పుర ప్రముఖులు ఆచార్య చందాకాంతయ్య శ్రేష్ఠిగారు, ఆకారపు చెన్నయ్య గారు, సిద్దంశెట్టి రామనాధం గారు, బొల్లం లింగయ్య గారుమొదలగు స్థానిక వాణిజ్య ప్రముఖుల అండదండలు మరియు ఆనాటి వరంగల్ పౌరుల ఆదరాభిమానాలు, ఆర్థిక ప్రోత్సాహం కళాసమితి కార్యక్రమాల్ని విజయవంతం చేసాయి. వీరందరినీ కదిలించి కళాసమితి నిర్వహించిన అనేక కార్యక్రమాలను తమవిగా భావించి తోడ్పడుటకు ఉత్తేజితులను చేయుటలో శ్రీ సదాశివ రావుగారి కృషి ప్రముఖమైనదని చెప్పుటలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కళాసమితియే తానుగా, తానే కళాసమితిగా ఎప్పటికప్పుడు దాని దిశా నిర్దేశనములు నిర్ణయిస్తూ పాటుపడి ఒక దశాబ్దం పాటు ఒక వెలుగు వెలిగిన నాయకుడిగా అందరిచేత శ్లాఘింపబడ్డ ప్రముఖ వ్యక్తి శ్రీ సదాశివరావు గారు…” ఇంకా ఈ కళాసమితిలో చురుకుగా పాల్గొన్నవారిలో ముఖ్యులు శ్రియుతులు గార్లపాటి రాఘవరెడ్డి గారు,కాళొజీ నారాయణరావుగారు, చౌడవరపు రాజా నరేంద్రగారు, ప్రముఖ చిత్రకారుడు మల్లారెడ్డిగారు, పల్లా రామకోటార్యగారు, ఉదయరాజు వెంకట రంగారావుగారు, కొండబత్తిని జగదీశ్వర రావు గారు, నరసింహస్వామి గారు, దివ్వెల హనుమంత రావు గారు తదితరులు. ఐదు రోజుల పాటు నిర్వహించే శ్రీ త్యాగరాజ మహోత్సవాల ప్రత్యేకత ఏమంటే, మిగతా గాన సభలలో నిర్వహించునట్లుగా కేవలం ‘సంగీత సభ ‘లకే పరిమితం కాకుండా వివిధ కళా రంగాల కార్యక్రమాల నిర్వహణ! ఐదు రోజుల కార్యక్రమాలు ఈ విధంగా వుండేవి: (1) ప్రముఖ కళాకారులచే సంగీత కార్యక్రమాలు: శ్రీయుతులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, బాల మురళీకృష్ణ గారు,దంతాలపల్లి పురుషోత్తమ శాస్త్రి గారు, నల్గొండ వాస్తవ్యులు శ్రీ రామానుజాచార్యగారు,పిఠాపురం వాస్తవ్యులు పురుషోత్తమాచారి గారు,నెల్లూరు వాస్తవ్యులు జీపీఆర్ విఠల్ రావు గారు, శ్రీకాకుళం వాస్తవ్యులు రాజా జగన్నాథ దేవ్ వర్మ గారు, మద్రాసు వాస్తవ్యులు పురాణం ఫురుషోత్తమ శాస్త్రిగారు, హైదరాబాదు నుండి హిందూస్తానీ సంగీత విద్వాంసుడు దంతాలే గారు మున్నగు ఉద్ధండులతో పాటు స్థానిక హిందూస్తానీ, కర్ణాటక సంగీత కళాకారులచే ప్రతి రోజూ ఒక సంగీత కార్యక్రమం (2) ఏకాంకిక నాటిక పోటీలు: తెలంగాణా లోని వివిధ ప్రాంతాలనుండి నాటక సంస్థలు ఈ పోటీలలొ పాల్గోనేవి. 1953 వ సంవత్సరం జరిగిన ఉత్సవాలలో అలనాటి ప్రఖ్యాత మోనోయాక్టర్ శ్రీ చంద్రశేఖరం గారు (నెల్లూరు వాస్తవ్యులు) ప్రత్యేక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. (3) స్థానిక విద్యాసంస్థల నుండి ఔత్సాహిక పెయింటర్లు గీసిన పెయింటింగులు (వాటిలో ఉత్తమమైన మూడు పెయింటింగులకు బహుమతుల నివ్వడం), వాటితో పాటు ప్రముఖ చిత్రకారులు (శ్రీయుతులు కొందపల్లి శేషగిరి రావు గారు, సిద్దిపేట వాస్తవ్యులు కె. రాజయ్య గారు, పీ. టీ. రెడ్డిగారు, మల్లారెడ్డిగారు, సోమేశ్వరరావుగారు మున్నగువారు) గీసిన పెయింటింగులతో ఒక ‘ఆర్ట్ గాలరీ’ని నిర్వహించడం. ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారుడు శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారు ‘ వరంగలులో వున్న అన్ని విద్యా సంస్ఠలనుండి పెయింటింగ్స్ సేకరించి, ఆర్ట్ ఎగ్జిబిషన్ అనంతరం వాటిని తిరిగి విద్యా సంస్ఠలకు మళ్ళీ తిరిగి ఇచ్చే బాధ్యత నాపై పెట్టారు…’అని ఒక సందర్భంలో తెలపడం జరిగింది. (4) స్థానిక విద్యాసంస్థల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, ఫ్యాన్సీ డ్రెస్సు, క్లాసికల్ మరియు లైట్ మ్యూజికులో పోటీలు నిర్వహించడం. (5) ప్రత్యేకంగా మహిళలకు సాంఘిక, సాహిత్య, సంగీత అంశాలపై ‘చర్చా వేదిక ‘ నిర్వహించడం శ్రీ కొండబత్తిని జగదీశ్వరరావు గారి మాటల్లో … “ ఈ కళా సమితి కార్యక్రమాల్లో శ్రీ పీవీ గారు కూడా అప్పుడప్పుడూ పాల్గొనేవారు. పీవీ గారు తబలా వాయిస్తే, సదాశివరావుగారు హార్మోనియంపై అరుదైన రాగాల గమకాల్ని తమ గొంతుతో చూపించే వారు. ఆ దృశ్యం ఎంతో కమనీయంగా వుండేది”.
కరోనా మరింత కోరలు చాస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 24 గంటల్లోనే లక్ష కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది. మహమ్మారి ఎప్పుడు తగ్గిపోతుందా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. తగ్గడం మాట దేవుడుడెరుగు... ఇంకా ఇంకా కరోనా విజృంభిస్తూనే ఉంది. ఈ పిశాచి ప్రపంచానికి సవాలు విసురుతూనే ఉంది. మంగళవారం నుంచి బుధవారం మధ్య 24 గంటల్లో లక్షా ఆరు వేల కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటిదాకా అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 51 లక్షలు దాటింది. ఇందులో యాక్టివ్‌ కేసుల సంఖ్య 27 లక్షల 46 వేలు. ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ తర్వాత 20 లక్షల 43 వేల మందికి పైగా వ్యాధి నుంచి బయటపడి ఇళ్లకు వెళ్లిపోయారు. కొవిడ్‌-19 కారణంగా 3 లక్షల 32 వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఇక అమెరికా, రష్యాలో ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. బ్రెజిల్, మెక్సికో, బ్రిటన్ వంటి దేశాల్లో పరిస్థితులు విషమంగా మారాయి. ఈ మహమ్మారి ఇంకా ఎంతమందిపై దాడి చేస్తుందోనని ప్రపంచానికి టెన్షన్ పట్టుకుంది. కొవిడ్‌-19 కారణంగా అమెరికాలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. గంటల్లో అమెరికాలో మొత్తంగా 96 వేల మంది మరణించారు. బ్రిటన్‌లో 36 వేలు, ఇటలీలో 33 వేలు, ఫ్రాన్స్‌లో 29 వేలు, స్పెయిన్‌లో 19 వేల మంది ప్రాణాలు కోల్పో యారు. నెదర్లాండ్స్, కెనెడా, మెక్సికో, ఇరాన్, జర్మనీ, బెల్జియంలలో 5 వేల నుంచి 10 వేల మంది మృతి చెందారు. ఇక, చైనాలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. కరోనా వైరస్ ఉద్భవించిన వూహాన్ సిటీలో రెండోదశ వైరస్ వ్యాప్తి చెందుతోంది. సెకండ్‌ వేవ్‌లో ఒక్కరోజే 33 కేసులు వెలుగుచూశాయి. వూహాన్‌లో 28, గాంగ్‌డాంగ్ ప్రావిన్స్, షాంఘైలలో ఒక్కొక్కటి చొప్పున కేసులు బయటపడ్డాయి. వైరస్ మళ్లీ వ్యాపిస్తుండడంతో వూహాన్‌లో హై అలర్ట్ ప్రకటించారు. నగరంలో ముందుజాగ్రత్త చర్యగా కోటి 10 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన రోగులను క్వారంటైన్ కు తరలిస్తున్నారు.
Marri Rajasekhar Reddy: ఐటీ రైడ్స్ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి టర్కీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. X Marri Rajasekhar Reddy: ఐటీ రైడ్స్ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి టర్కీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఐటీ రైడ్స్ పై స్పందించిన రాజశేఖర్ రెడ్డి... తనకు అధికారుల నుంచి ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. మీడియా ద్వారానే తనకు ఐటీ దాడుల విషయం తెలిసిందన్నారు. తాము వ్యాపారాల్లో ఉన్నందున ఐటీ దాడులు సహజమేనన్నారు. గతంలో 1995, 2008లో ఐటీ సోదాలు జరిగాయని.. తాజా మళ్లీ ఇప్పుడు జరుగుతున్నాయన్నారు. ఇక ఐటీ సోదాల్లో భాగంగా ఎలాంటి విచారణను ఎదుర్కొనేందుకైనా తాను సిద్ధంగా ఉన్నాని రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ శాఖ నజర్ వేసింది. ఇందులో భాగంగానే రెండు రోజుల పాటు మంత్రి మల్లారెడ్డి నివాసాలు, విద్యాసంస్థలు, కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇక ఈ సోదాల్లో భారీ నగదుతోపాటు, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 4వందల మంది అధికారులు 65 బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఆయన సన్నిహితులు, సమీప బంధువుల ఇళ్లలోనూ అధికారులు ముమ్మరంగా సోదాలు చేశారు. ఈ సోదాల్లో సుమారు వంద కోట్ల నగదు సీజ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక సోదాల అనంతరం విచారణకు రావాలని మంత్రి మల్లారెడ్డికి సమన్లు జారీ చేశారు.. ఐటీ అధికారులు. ఐటీ అధికారుల సమన్ల నేపథ్యంలో మల్లారెడ్డి ఈ రోజు ఐటీశాఖ కార్యాలయంలో విచారణకు హాజరయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు మంత్రి మెడికల్ కళాశాలలో వంద కోట్లు దొరికాయనే ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. దీనికి బలం చేకూరే విధంగా మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. వంద కోట్లు దొరికాయని అధికారులు తమతో సంతకం చేయించుకున్నారని మంత్రి చెప్పడంతో... ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే మంత్రి మల్లారెడ్డి కళాశాలల్లో భారీగా నగదు పట్టబడిందని వాదనలు వినిపిస్తున్నాయి. అక్రమాస్తుల చిట్టాను మొత్తం అధికారులు బయటకు తీసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో మంత్రి మల్లారెడ్డి మెడకు ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డిని కూడా ఐటీ అధికారుల పిలిచారు. ఐటీ అధికారుల పిలుపు అందగానే ప్రీతి రెడ్డి.. ఓ బ్యాగ్‌తో అధికారుల ఎదుట హాజరయ్యారు. అయితే ఆ బ్యాగ్‌లో ఏముంది అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అలాగే మల్లారెడ్డి మనవరాలు శ్రేయను బ్యాంక్‌కి తీసుకెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు శంషాబాద్ మండలం కాచారంలోని వర్థమాన్ ఇంజనీరింగ్ కళాశాలలోనూ ఐటీ సోదాలు జరిగాయి. మూడు కార్లలో వచ్చిన ఐటీ అధికారులు కళాశాలలో విస్తృతంగా తనిఖీలు చేశారు. కళాశాల విద్యార్థులను తప్పా మిగతావారిని లోనికి అనుమతించ లేదు. ఇక వర్థమాన్ కళాశాలకు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. మరోవైపు మల్లారెడ్డి బంధువు సంతోష్‌ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు జరిపారు. ఆయన ఇంట్లో ఏకంగా 4కోట్ల రూపాయలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పలు డాక్యుమెంట్లను రెట్రివ్ చేశారు. వాటిలో ఏముందన్నది సస్పెన్స్‌గా మారింది. సంతోష్‌ రెడ్డి.. మల్లారెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఫ్యామిలీకి సంబంధించిన రియల్‌ ఎస్టేట్‌ భూముల కొనుగోళ్ల వ్యవహారాలను ఆయనే చూస్తారు. మల్లారెడ్డి కాలేజీలు, ఆర్థిక వ్యవహారాల్లోనూ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. మల్లారెడ్డి యూనివర్శిటీ వ్యవహారాలు చూసే ప్రవీణ్‌ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే సోదాల సమయంలో ప్రవీణ్ అస్వస్థతతో ఆస్ప్రత్రిలో అడ్మిట్ అయ్యారు. ట్రీట్‌మెంట్‌ అనంతరం ఐటీ అధికారులు ప్రవీణ్ ను ఇంటికి తీసుకెళ్లి పలు పత్రాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మల్లారెడ్డి యూనివర్శిటీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ప్రవీణ్‌ రెడ్డే చూస్తారు. ఇక ఐటీ అధికారుల ముప్పేట దాడితో మంత్రి మల్లారెడ్డి ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలుస్తోంది.
పదిగంటల పాటు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. నానిన తరువాత నీళ్లు ఒంపేసి సగ్గుబియ్యం మెత్తగా రుబ్బుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో రుబ్బిన సగ్గుబియ్యం పిండిని, బెల్లం పిండిని వేసి బాగా కలిపి సన్నని సెగమీద మాడకుండా, అడుగంట కుండా కలుపుతూ ఉడకనివ్వాలి. దగ్గరగా ఉడికిన తరువాత నెయ్యి వేసి కలిపి యాలకుల పౌడర్‌ వేసి, నేతిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను కూడా వేసి కలపాలి. ఒక పళ్లానికి నెయ్యి రాసి గట్టిగా అయిన తరువాత హల్వాను పళ్లెంలో పోసి, చల్లారిన తరువాత కట్‌ చేసుకోవాలి. 0 Comments Leave a Reply. Author నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.
చిరు ధాన్యాలు, కూరగాయలు, చిలకడదుంపలు ఇలా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాల... హెల్త్ టిప్స్రో: జా లిప్స్... సొసైటీలో చర్మ సౌందర్యం ఎంతో ప్రాముఖ్యమైంది. స్టేటస్ మైంటైన్ చెయ్యలలనుకునే వారికి స్కిన్క్ విషయంలో అత్యంత శ్రద్... New Device Enables Heart Surgery with out stopping Heart Scientists say that they have developed a unique device that will enable doctors to perform heart bypass surge...
అవెంజర్స్ లాంటి బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీతో పాటు ఎన్నో భారీ ఫ్రాంఛైజీలను రన్ చేస్తున్న మార్వెల్ కి అభిమాని కానిది ఎవరు? ఈరోజుల్లో ఏదైనా తెలుగు బ్యానర్ గురించి అడిగితే వెంటనే చెప్పలేరేమో కానీ మార్వల్ సినిమాస్ అని అడిగితే వెంటనే డీటెయిల్స్ చెప్పేంతగా సదరు హాలీవుడ్ బ్యానర్ తెలుగు లోగిళ్లలో అభిమానుల్లోకి దూసుకుపోయింది. ఇప్పుడు మార్వల్ అభిమానుల జాబితాలో కొత్త పేరు రివీలైంది. సమంతా రూత్ ప్రభు ఈ రోజు ప్రతి మార్వెల్ అభిమాని గర్వించే రీతిలో ట్వీట్లు వదిలారు. మార్వెల్ స్టూడియోస్ థోర్: లవ్ అండ్ థండర్ ట్రైలర్ ను విడుదల చేయగా సామ్ తన ఫానిజం చాటుకున్నారు. ఈ చిత్రం క్రిస్ హేమ్స్వర్త్- నటాలీ పోర్ట్మన్ - టెస్సా థాంప్సన్ ల పునరాగమనంతో ఆకట్టుకోనుంది. అయితే ట్రైలర్ లో అతిపెద్ద హైలైట్ క్రిస్టియన్ బాలే రోల్.. గోర్ ది గాడ్ బుట్చర్. అతడి లుక్ సమంతను విపరీతంగా ఆకట్టుకుంది. నిజానికి సామ్ మొదట హేమ్స్ వర్త్ రోల్ ని ప్రస్థావించే పోస్టర్ ను షేర్ చేసింది. కొన్ని ఫైర్ ఎమోజీలతో `డెడ్` అని రాసింది. ఆమె బేల్ గాడ్ బుట్చేర్ రూపాన్ని అతనిని ప్రశంసిస్తూ ఒక వ్యక్తిగత పోస్ట్ ను భాగస్వామ్యం చేసింది. ది గాడ్ ఆఫ్ యాక్టింగ్ !! అంటూ బేల్ అనే హ్యాష్ ట్యాగ్ తో పాటు పోస్ట్ చేసింది. థోర్: లవ్ అండ్ థండర్ లో గాడ్ ఆఫ్ థండర్ గా క్రిస్ హెమ్స్వర్త్ తన పాత్రను తిరిగి పోషిస్తున్నాడు. అతను అనేక MCU సినిమాల లీడ్ హీరోగా కనిపించారు. ఇప్పుడు తాజా ముఖాలతో కలిసి నటించారని ట్రైలర్ ధృవీకరించింది. క్రిస్ ప్రాట్ - ఇతర గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ తిరిగి వస్తున్నారు. MCU సూపర్ హీరోలు ఎవెంజర్స్: ఎండ్ గేమ్ లో థానోస్ను ఓడించిన తర్వాత జరిగిన సంఘటనలతో పాటు కనిపిస్తారు. నటాలీ పోర్ట్మన్ కూడా జేన్ ఫోస్టర్ గా తిరిగి వస్తోంది. లవ్ అండ్ థండర్ మైటీ థోర్ గా ఆమె అరంగేట్రానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ వీక్లీతో మాట్లాడుతూ దర్శకుడు తైకా వెయిటిటి ఇలా అన్నారు. ``నేను చేయకూడదనుకున్నది మళ్లీ రాగ్నారోక్ ని చేయడం.. ఎందుకంటే అది పూర్తయింది. మొత్తం విషయం వెలుగులోకి రావడానికి నేను సృజనాత్మకంగా ఉద్దీపన చెందుతున్నట్లు నిర్ధారించుకోవడానికి నేను నా కోసం మరింత ఆసక్తికరంగా ఏదైనా చేయవలసి ఉంది. నేను అనుకున్నాను ఈ ఫ్రాంచైజీతో కనీసం ఆశించిన విషయం సాధిస్తాను అని!`` అంటూ ఎమోషనల్ నోట్ రాసారు. సమంత ఇటీవల విజయ్ దేవరకొండతో తన కొత్త చిత్రం ఖుషి కోసం మంచు కొండల్లో కి పయనించింది. అక్కడ ఎగ్జోటిక్ లొకేషన్లలో తొలి షెడ్యూల్ ను ముగించింది. టీమ్ సభ్యులు ప్రస్తుతం కాశ్మీర్ లో షూటింగ్ లో ఉన్నారు. సామ్ తరచుగా అభిమానులకు లోయ నుండి తమ ఫోటోలను షేర్ చేస్తూనే ఉన్నారు.
దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నంత వరకు దళితులకు అం డగా ఉంటూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని మాజీ మంత్రి, ఏఐసీసీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి అ న్నారు. గౌరయ్యకుంట తండా రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 - మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి పెద్దమందడి, జూలై 7: దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నంత వరకు దళితులకు అం డగా ఉంటూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని మాజీ మంత్రి, ఏఐసీసీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి అ న్నారు. గురువారం మండల పరిధిలోని గౌరయ్య కుంటతండాలో నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ వరంగల్‌ డిక్లరేషన్‌ కరపత్రాలను ప్ర తీ ఒక్కరికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుల కోసం చేపట్టనున్న సంక్షేమ పథ కాలను వివరించారు. రైతుకు రాజు చేయడమే పార్టీ లక్ష్యమన్నారు. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికార ప్రభుత్వంపై రైతుల కోసం, నిరు ద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల కోసం ప్రజా వ్య తిరేక విధానాలపై అనేక పోరాటాలు చేశామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని.. అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరగాలని ఎన్‌ఎస్‌యూఐ నేషనల్‌ కోఆ ర్డినేటర్‌ నందిమల్ల త్రినాథ్‌ కోరారు. కార్యక్రమం లో శ్రీరంగాపూర్‌ జడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్ర సాద్‌యాదవ్‌, ఎంపీపీ శంకర్‌నాయక్‌. మాజీ వైస్‌ ఎంపీపీ సురేష్‌గౌడ్‌, మాజీ సర్పంచులు మన్యం, శ్రీనివాసులు, నాయకులు పెంటన్న, వహీద్‌, అమ్మపల్లి తిరుపతయ్య, బిక్యనాయక్‌, చీర్ల రాజు, రోహిత్‌ తదితరులున్నారు. కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేయాలి పాన్‌గల్‌ : కొల్లాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచే యాలని పార్టీ నియోజకవర్గ నాయకుడు చింతల పల్లి జగదీశ్వర్‌రావు అన్నారు. గురువారం మండ లంలోని దవాజిపల్లి, దొండాయిపల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కార్యక్ర మంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహరెడ్డి, కార్యదర్శి కృష్ణ, సీనియర్‌ నాయకులు ఆది చం ద్రయ్య, మంగదొడ్డి సుధాకర్‌యాదవ్‌, స్వామి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బిచ్చారెడ్డి, కృష్ణయ్య, జానకిరామ్‌, కృష్ణయ్యగౌడ్‌, గట్టుయాదవ్‌, రోహిత్‌ సాగర్‌, నాగన్న, రామకృష్ణ తదితరులు పాల్గొ న్నారు. అధికారంలోకి రావడం ఖాయం వనపర్తి టౌన్‌ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గురువారం సంబురాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ చౌరస్తాలో టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బండారు రాధాకృష్ణ, సీనియర్‌ నాయకుడు కోట్లరవి, సురేష్‌, ఎండీ.బాబా, డి.వెంకటేష్‌, నాగరాజు, కదిరె రాములు, పెండెం మన్నెం యాదవ్‌, బాలరాజు, అబ్దుల్లా, దిలీప్‌, గంధం లక్ష్మయ్య, విజయ్‌బాబు తదితరులున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి సాయి పవన్ అదృశ్యమయ్యాడు.కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. narsimha lode First Published Nov 16, 2022, 12:26 PM IST సంగారెడ్డి:జిల్లాలోని అమీన్ పూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి సాయి పవ,న్ అదృశ్యమయ్యాడు. సాయి పవన్ కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.సాయి పవన్ షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి రూ. 10 లక్షలు నష్టపోయాడు.దీంతో కుటుంబ సభ్యులు ఆయనను మందలించారు. కుటుంబసభ్యులు మందలించడంతో మనోవేదనకు గురైన సాయి పవన్ ఇంటి నుండి వెళ్లిపోయాడు.ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.సాయి పవన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడలు పెట్టే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి షేర్ మార్కెట్ లో పెట్టుబడుల విషయమై నిపుణుల సూచనలు తీసుకోవాలని ఆర్ధికనిపుణులు సూచిస్తున్నారు.అయితే సాయి పవన్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి టెక్కీ సాయి పవన్ రూ. 10 లక్షలు నష్టపోయినట్టుగా కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉంటే లిజ్జీ మెక్‌గుయిర్స్ ఏతాన్ క్రాఫ్ట్ మీ చిన్ననాటి ప్రేమ (మరియు అబద్ధం చెప్పకండి, అతను ఎక్కువగా ఉండేవాడు), ఈ క్రింది వార్తలు మీకు బాధ కలిగించవచ్చు. టీన్ హార్ట్‌త్రోబ్ పాత్ర పోషించిన నటుడు క్లేటన్ స్నైడర్ తన స్నేహితురాలు అల్లెగ్రా ఎడ్వర్డ్స్ కు ప్రతిపాదించాడు థాంక్స్ గివింగ్ మరియు ఆమె నిస్సందేహంగా అవును అని చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన 'డికేడ్ ఛాలెంజ్' ను ఈ నటుడు సద్వినియోగం చేసుకుని, 2009 లో మరియు 2019 లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ జంట ఫోటోను పంచుకుంటున్నట్లు ప్రకటించారు. ఏదేమైనా, 2019 వినోదం కొద్దిగా భిన్నంగా కనిపించింది-ముఖ్యంగా ఎడ్వర్డ్స్ కొత్తది నిశ్చితార్ధ ఉంగరం ! '2009 • 2019 ప్రియమైన అల్లెగ్రా. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు 'అని స్నైడర్ తన పోస్ట్‌కు శీర్షిక పెట్టాడు. 'తప్ప, చాలా మార్పు వచ్చింది, ఆపై అది చాలా పోలి ఉంటుంది, కానీ చాలా భిన్నమైనది, కానీ మంచిది, మరియు ఇప్పుడు, మీ వేలు కొంచెం బరువుగా ఉంది. మరియు అన్ని కారణంగా కాదు పెకాన్ పై .ఏమి థాంక్స్ గివింగ్. నేను మీ నవ్వును ప్రేమిస్తున్నాను. నేను మీ హృదయాన్ని ప్రేమిస్తున్నాను. నేను మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని వైఫ్ చేయడానికి ఎదురు చూస్తున్నాను. ' ఎడ్వర్డ్స్ ఆమెపై అదే ఫోటోలను పంచుకున్నాడు ఇన్స్టాగ్రామ్ , writing, '2009/2019 నా జీవితాంతం, నా జీవితపు ప్రేమతో నేను పెద్దవాడవుతాను. & # x1f48d నేను నిన్ను ఆరాధిస్తాను క్లే. కృతజ్ఞత ఒక సాధారణ విషయం. ' స్నైడర్ తన సింపుల్‌తో ప్రతిపాదించినట్లు కనిపిస్తుంది పియర్ ఆకారపు వజ్రం బంగారు బ్యాండ్‌పై సెట్ చేయబడింది. ప్రకటన తరువాత, నిశ్చితార్థం జరిగిన కొద్దిసేపటికే ఈ జంట యొక్క మరిన్ని ఫోటోలను కూడా నటుడు పంచుకున్నారు. 'మరికొన్ని క్షణాలు ... అడిగిన కొద్దిసేపటికే. ఆమె చూసిన నా తల్లిదండ్రులు కూడా అక్కడ ఉన్నారు. ఆ సాయంత్రం ఒక క్షణం. బోడెగా బేలో మరుసటి రోజు ఒక క్షణం. ఆ తర్వాత కొద్దిసేపు 'అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. స్నైడర్ అధికారికంగా మార్కెట్లో లేనప్పటికీ, తెరపై ఏతాన్ క్రాఫ్ట్ మరియు లిజ్జీ మెక్‌గుయిర్‌ల కోసం ఇంకా ఆశ ఉంది. హిల్లరీ డఫ్ రాబోయే డిస్నీ + పునరుద్ధరణపై ఇటీవల కొన్ని వివరాలను పంచుకున్నారు లిజ్జీ మెక్‌గుయిర్ ఇంటర్వ్యూలో ఇ! వార్తలు . “అతను వేడిగా ఉన్నాడు. అతను చాలా వేడిగా ఉన్నాడు, ”అని నటి క్రాఫ్ట్ గురించి ప్రస్తావించింది. 'అక్కడ ఉండబోతోందని నాకు ఖచ్చితంగా తెలుసు, ఒక విషయం ఉంటుంది.' కాబట్టి ఈతాన్ క్రాఫ్ట్‌ను వివాహం చేసుకోవడంలో మా షాట్ చాలా కాలం గడిచిపోయింది, కనీసం మనం లిజ్జీ మరియు ఎడ్వర్డ్స్ ద్వారా ప్రమాదకరంగా జీవించగలం! హిల్లరీ డఫ్ మాథ్యూ కోమా నుండి ఆమె శృంగార ప్రతిపాదన వెనుక కథను పంచుకుంటుంది ఎడిటర్స్ ఛాయిస్ రియల్ వెడ్డింగ్స్ న్యూ ఓర్లీన్స్లో రొమాంటిక్ వింటర్ వెడ్డింగ్ ఈ న్యూ ఓర్లీన్స్ జంట టైంలెస్ వేడుకను రెండవ లైన్ బ్యాండ్, వ్యక్తిగతీకరించిన కాక్టెయిల్స్ మరియు కొవ్వొత్తులతో పుష్కలంగా విసిరారు మరింత చదవండి ప్రతిపాదనలు ఇంట్లో ప్రతిపాదించడానికి 6 శృంగార మార్గాలు కరోనావైరస్ మీ ప్రతిపాదన ప్రణాళికలను పాడుచేస్తే, ఈ ఆరు సృజనాత్మక ఇంట్లో ప్రతిపాదన ఆలోచనలను పరిగణించండి. శృంగారం కూడా ఉంది!
అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు సుప్రీం తీర్పు తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు గుంటూరు కు బయలు దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌లాస‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యం ప్రారంభం టీడీపీని నడిపేది ఆ రెండు పత్రికలు, టీవీలే మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం మన సంస్కృతి, కళలను భావితరాలకు అందిద్దాం నీ మాట‌లు తెలుగువారందరినీ అవమానించినట్టేనయ్యా.. లోకయ్యా! You are here హోం » టాప్ స్టోరీస్ » సంక్షేమ ప‌థ‌కాల‌తో పేద‌ల‌కు అండ‌గా ఉంటున్నాం సంక్షేమ ప‌థ‌కాల‌తో పేద‌ల‌కు అండ‌గా ఉంటున్నాం 11 Oct 2022 2:36 PM గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు శ్రీ‌కాకుళం: ఎన్నికల ముందు చెప్పినవన్నీ చేస్తున్నామ‌ని, కన్నీరు, ఆక‌లితో అలమ‌టిస్తున్న పేద‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల‌తో అండ‌గా ఉంటున్నామ‌ని రెవెన్యూశాఖా మాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. మంగ‌ళ‌వారం శ్రీకాకుళం గుడివీధిలో గ‌డ‌ప గ‌డప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని మంత్రి నిర్వ‌హించారు. ఇక్క‌డి స‌చివాల‌యం ప‌రిధిలో ఉన్న ఇంటింటికీ తిరిగి ల‌బ్ధిదారుల‌తో భేటీ అయ్యారు. ప‌థ‌కాల అమ‌లు తీరు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా స్థానిక స‌మ‌స్య‌లు గుర్తించారు. ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాన మాట్లాడుతూ...సంక్షేమ ప‌థ‌కాల అమలులో భాగంగా ఎవ్వరికీ ఎలాంటి లంచాలు ఇవ్వ‌నవస‌రం లేకుండానే ప‌నిచేస్తున్నామ ని చెప్పారు. ఇవాళ ప‌థ‌కాల అమ‌లు ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు మీ అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చాన్నారు. ప‌థ‌కాల పేరిట ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేస్తున్నాము అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాం అని విప‌క్ష శ్రేణులు అంటున్నాయి కానీ ఎంతమాత్రం సమంజసం కాదు. పేద పిల్ల‌లు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆర్థిక కార‌ణాల రీత్యా చ‌దువు అర్ధత‌రంగా ఆపేయాల్సిన సంద‌ర్భాలే రాకూడ‌ద‌ని ఈ ప్ర‌భుత్వం అమ్మ ఒడి కార్య‌క్ర‌మం అమలు చేస్తుంద‌న్నారు. విప‌క్షాల‌కు సూటి ప్ర‌శ్న, ఇవ‌న్నీ దుబారా ఖ‌ర్చే అంటారా ? ఈ ప‌థ‌కం అమ‌ల్లో భాగంగా బిడ్డ‌ల త‌ల్లులకు ఒక్కొక్కరికీ ప‌దిహేను వేలు రూపాయ‌ల చొప్పున వారి ఖాతాల్లో నేరుగా జ‌మ చేస్తున్నామ‌ని, అదేవిధంగా మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం కింద నాణ్య‌మైన, స‌మ‌తుల ఆహారం అందిస్తున్నామ‌ని, పిల్ల‌ల‌ను బ‌డికి పంపేవేళ మంచి యూనిఫాంలు, షూ, బ్యాగ్, నోటు పుస్త‌కాలు సైతం అందిస్తున్నామ‌ని, పేద పిల్ల‌లు ఉన్నత విద్య అందుకోవాల న్న త‌ప‌న‌తో ఫీజ్ రీ యింబ‌ర్స్ మెంట్ ను వ‌ర్తింప‌జేస్తున్నామ‌ని అన్నారు. సంపన్నుల పిల్లలు లానే పేద పిల్లలను ఉన్నత స్థాయిలో ఉండాలి అన్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని, అదేవిధంగా వృద్ధాప్యం, విక‌లాంగ, వితంతు పింఛ‌ను అందిస్తున్నామ‌ని చెప్పారు. వికలాంగులకు పెన్షన్ రూ.3000 అందిస్తున్నామని అన్నారు. స్వ‌యంశ‌క్తి సంఘాల‌కు చెందిన రుణాల‌ను ఆ రోజు ఇచ్చిన మాట ప్ర‌కారం మూడు విడత‌ల్లో బ్యాంకుల‌కు తీర్చేశామ‌ని, ఇంకా ఒక్క విడ‌త‌తో మొత్తం రుణం చెల్లింపు పూర్తి అవుతుంద‌ని తెలిపారు. ఇవ‌న్నీ దుబారా ఖ‌ర్చే అంటారా అని ప్రతిపక్షాన్ని ఆయ‌న ప్ర‌శ్నించారు. విశాఖే రాజ‌ధాని..ఆ అదృష్టం దూరం చేయ‌వ‌ద్దు "ఇచ్ఛాపురం నుంచి ర‌ణ స్థ‌లం వ‌ర‌కూ మంచి స్థాయిలో పాఠ‌శాల‌ల నిర్మాణం చేశాం. నాడు నేడు ద్వారా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు మ‌హ‌ర్ద‌శ‌. 12,000 కోట్ల‌తో 30 ల‌క్ష‌ల మంది పేద‌ల‌కు భూమి పంపిణీ.. మీరు ఒక్క ఎక‌రం భూమి కొనుగోలు చేశారా ! మాయ చేసి మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని అనుకుంటున్నారు. ఈ ప్రాంతానికి ఇన్నాళ్ల‌కు అవ‌కాశం వ‌స్తే ప్రతిపక్ష సభ్యులు అభ్యంత‌రం చెప్ప‌డం సమంజ‌సం కాదు. పాద‌యాత్ర‌కు ఎదురెళ్లి స్వాగ‌తం పలుకుతాన‌ని అచ్చెన్నాయుడు చెప్ప‌డం భావ్యం కాదు. టీడీపీ వ్య‌తిరేక‌త స‌బ‌బు కాదు ఈ ప్రాంతానికి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధి అచ్చెన్నాయుడు విశాఖ రాజ‌ధానిని వ్య‌తిరేకించడం స‌బ‌బు కాదు. ఈ జిల్లాలో రాజకీయాల‌కు అతీతంగా అంతా ఏక‌మై అంతా ప‌నిచేయాల్సి ఉంది." అని అన్నారు. మ‌న గ‌డ్డ‌పైకి వ‌చ్చి అమ‌రావ‌తి రైతులు మ‌న ఆకాంక్ష‌ల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడ‌తామ‌నడం భావ్యం కాద‌న్నారు.రాజ‌ధాని ఏర్పాటు విష‌య‌మై 130 ఏళ్ల తరువాత ఈ ప్రాంతానికి ద‌క్కుతున్న అవ‌కాశాన్ని దూరం చేయ‌వ‌ద్ద‌ని అన్నారు. మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగానే ఉంటాను అదేవిధంగా ప్రతిపక్ష నేతలు ఈ ప్రాంతానికి చేసింది లేదు. ఒక్క సంస్థ‌ను కూడా మీరు తెప్పించ‌లేక‌పోయారు. మీరు చంద్ర‌బాబు పంచ‌న చేరి ఆయ‌న చెప్పిన విధంగా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారానికి తెలుగుదేశం నాయ‌కులంతా ప్ర‌య‌త్నిస్తున్నారా అని ప్ర‌శ్నించారు. మ‌నం ఇంత‌కాలం వివిధ సంద‌ర్భాల్లో రాజ‌ధాని పేరిట జ‌రిగిన ఏర్పాటులో వివిధ సంద‌ర్భాల‌లో చాలా కోల్పోయాం. కానీ ఇప్పుడు జ‌గ‌న్ మ‌న‌కు న్యాయం చేయాల‌ని భావిస్తున్నారు. ఇందుకు వ్య‌తిరేకంగా ఎవ్వ‌రు మాట్లాడినా ఉత్తరాంధ్ర ద్రోహులే ..వారిని మ‌నం వ్య‌తిరేకించాలి. మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగానే ఉంటాను. అని చెప్పారు. చంద్ర‌బాబుది రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం రాజధాని పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నారు. కానీ అక్క‌డ ఇప్ప‌టిదాకా చేప‌ట్టిన నిర్మాణాలేవీ క‌నీస స్థాయిలో కూడా పూర్తి కాలేద‌ని, కేవ‌లం ఆయ‌న బినామీల కోస‌మే రాజ‌ధాని నిర్మాణం చేప‌ట్టార‌ని, అందుకోస‌మే ప‌ట్టుబ‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. ఈ ప్రాంతానికి రాజ‌ధాని వ‌స్తే ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయ‌ని అన్నారు. ఇన్నాళ్లూ ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్ళామ‌ని,కానీ రాజ‌ధాని ఏర్పాటుతో మున్ముందు అటువంటి ప‌రిస్థితులు త‌లెత్తే అవ‌కాశాలే ఉండ‌వ‌ని అన్నారు. అడుగ‌డుగునా మ‌న‌కు అన్యాయం కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌లో శ్రీ‌కాకుళంకు ద‌క్కిందేంటి ? ఇక ఆ రోజు కేంద్ర ప్ర‌భుత్వం 23 సంస్థలు మంజూరు అయితే ఒక్కటి కూడా ఇక్క‌డ నెల‌కొల్ప‌లేద‌ని గుర్తు చేశారు. ఏదేమ‌యినప్ప టికీ ప్రజల ఆత్మ విశ్వాసంతో బ్రతకడమే అభివృద్ధి. ఇందుకు అనుగుణంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పాల‌న సాగుతోంది. ఇక ధరల విషయానికే వ‌స్తే దేశం మొత్తం చూడండి.ఒక్క మన రాష్ట్రంలోనే కాదు. ధ‌రల విష‌య‌మై పొరుగు రాష్ట్రాల‌తో పోల్చి చూడండి. మీకే వాస్త‌వాలు అర్థం అవుతాయి. ఇక వీటన్నింటితో పాటు మ‌న‌ల్ని అత్య‌ధికంగా ప్ర‌భావితం చేస్తున్న విశాఖ రాజ‌ధాని కోసం ఇప్పుడు అంతా ఆలోచించాలి. మన తాతలు..చెన్నై,మన తండ్రులు కర్నూలు,మనం హైదరాబాద్ వెళ్ళాం. ఇప్పుడు మనకి రాజ‌ధానిగా వైజాగ్ రాబోతోంది. దీనిని మ‌నం స్వాగ‌తించాలి. అడ్డుకునే వారిని వ్య‌తిరేకించాలి. ప్ర‌తిఘ‌టించాలి. విశాఖే రాజ‌ధాని అన్న నినాదంతో ఉద్య‌మించాలి.అనేక దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంతో మ‌గ్గిపోతోంది,వయసు వచ్చిన యువకులు ఊళ్ల‌ల్లో లేరు. ఇప్పుడు మన పిల్లల బ‌తుకులు మారేందుకు మంచి అవకాశం రాబోతుంది.. ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నాం 23 సంస్థలను కేంద్రం మన‌కు కేటాయించింది. ఇవ‌న్నీ విభ‌జ‌న‌లో భాగంగా నష్టపోయిన ఆంధ్రాకు పరిహారం నిమిత్తం ఇచ్చిన్న‌వే ! కానీ ఒక్కటంటే ఒక్క‌టి కూడా శ్రీ‌కాకుళం జిల్లాలో పెట్టలేదు నాటి ముఖ్య‌మంత్రి చంద్రబాబు. ఆయ‌న మనకు అన్యాయం చేశారు. కానీ మేం ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నాం. వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 3 వేల కోట్ల తో భావన పాడు పోర్టుకు ఆర్థిక అనుమ‌తులు మంజూరు చేశాం. అదేవిధంగా రూ.300 కోట్లతో బుడగుట్ల పాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి,ఉద్దాన ప్రాంతా నికి తాగునీటిని అందించేందు రూ.700 కోట్లు, అదేవిధంగా గొట్టా బ్యారేజీ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి త‌ద్వారా వంశధారను వ‌చ్చే వేస‌విలో అందించేందుకు రూ.200 కోట్లు వెచ్చించి చ‌ర్య‌లు తీసుకుంటున్నాం అని అన్నారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్మును విడుద‌ల చేసిన సీఎం వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ వైయస్ జగన్ - ఫొటో గ్యాల‌రీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైయస్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
ఎన్టీఆర్‌ రాజకీయనాయకుడు కాదని, తెలుగువారి గుండె చప్పుడని, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకని తెలుగు దండు అధ్యక్షుడు పరవస్తు సూరి చెప్పారు. మద్దిలపాలెం జంక్షన్‌లోని తెలుగుతల్లి విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న తెలుగు దండు సభ్యులు అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 విశ్వవిద్యాలయం పేరు మార్పు సరికాదు తెలుగు దండు అధ్యక్షుడు పరవస్తు సూరి విశాఖపట్నం, సెప్టెంబరు 25: ఎన్టీఆర్‌ రాజకీయనాయకుడు కాదని, తెలుగువారి గుండె చప్పుడని, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకని తెలుగు దండు అధ్యక్షుడు పరవస్తు సూరి చెప్పారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్షిటీని వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్షిటీగా మార్పు చేయడానికి వ్యతిరేకంగా ఆదివారం తెలుగుదండు నాయకులు మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పరవస్తు సూరి మాట్లాడుతూ ప్రజాసమస్యలు పక్కతోవ పట్టించేందుకు ప్రభుత్వం ఇలాంటి రాజకీయ ఎత్తుగడకు పాల్పడిందన్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని పేరుమార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదండు నాయకులు చిన్న సూర్యానారాయణ, శేఖరమంత్రి ప్రభాకర్‌, నాంచారయ్య, ఆనందరావు తదితరులు సాల్గొన్నారు.
బిర్యానీ విషయంలో అర్థరాత్రి ఓ వ్యక్తి హోంమంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేసిన ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. పాతబస్తీలో బిర్యానీ విషయంలో ఫైట్ జరగడంతో..ఓ వ్యక్తి హోంమంత్రి మహమూద్ అలీకి కాల్ చేశాడు. పాతబస్తీలో ఎన్ని గంటల వరకు హోటళ్లు తెరిచి ఉంచాలో చెప్పాలని డిమాండ్ చేశాడు. అర్థరాత్రి ..ఫుల్ నిద్రలో ఉన్న తనకు..బిర్యానీకి సంబంధించిన కాల్ రావడంతో మహమూద్ అలీ అవాక్కయ్యారు. హోంమంత్రి అసహనం.. గాఢనిద్రలో ఉన్న తనను డిస్ట్రబ్ చేసిందే కాకుండా..హోంమంత్రిని ఏ ప్రశ్నలు వేయాలో తెలియదా అని సదరు వ్యక్తిపై మహమూమ్ అలీ ఫైర్ అయ్యారు. తాను హోంమంత్రినని..వంద టెన్షన్లు ఉంటాయని. అర్థరాత్రి పూట ఈ బిర్యానీ పంచాయతీ ఏంటని అసహనం వ్యక్తం చేశారు. సిటీలో ఎక్కడైనా సరే..రాత్రి 11 గంటల వరకే హోటళ్లు మూసివేస్తారని చెప్పారు. బిర్యానీ కోసం సీపీకి వినతీ పత్రం.. ఇదిలా ఉంటే పాతబస్తీలో రాత్రి 11గంటలకే హోటళ్లు మూసివేస్తామని వాటి యజమానులు అంటుండగా.. అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచాలని ఎంఐఎం నేతలు పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా పాతబస్తీలో అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాల అనుమతివ్వాలంటూ గతంలో ఎంఐఎం నేతలు హైదరాబాద్‌ కమిషనర్ను కలిశారు.
Vitamn B For Brain Health : మెదడు ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. మరి ఆ మెదడు సరిగ్గా పనిచేయాలంటే.. పోషకాహారం ఎంతో అవసరం. మెదడుకు మేలు చేకూర్చే విటమిన్​ బి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. Vitamn B For Brain Health : మెదడు ఆరోగ్యానికి సమతులాహారం తినటం అత్యవసరం. అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు లభించినప్పుడు మెదడు చురుకుగా, సమర్థంగా పనిచేస్తుంది. అయితే అన్నింటిలో కెల్లా బి విటమిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కుంగుబాటు, మతిమరుపు, మానసిక స్థిరత్వం కోల్పోవటం వంటివాటికీ బి విటమిన్ల లోపానికీ సంబంధం ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిల్లో 8 రకాల విటమిన్లు ఉన్నాయి. అన్నీ ప్రత్యేకమైనవే. ఇవి మెదడుకు ఎలా మేలు చేకూర్చుతాయో చూద్దాం. శక్తిని పెంచుతూ విటమిన్‌ బి1 (థయమిన్‌) కణాలు పనిచేయటంలో, పోషకాల నుంచి శరీరం శక్తిని గ్రహించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరంలో జీవక్రియల పరంగా అత్యంత చురుకుగా ఉండే అవయవాల్లో మెదడు ఒకటి. అంటే నాడీ సమస్యలకు దారితీసే లోపాలు తగ్గటానికి థయమిన్‌ తోడ్పడుతుందన్నమాట. కొవ్వు ఆమ్లాలకు బాసట విటమిన్‌ బి5 (పాంటోథెనిక్‌ ఆమ్లం) కోఎంజైమ్‌ ఎ అనే అణు సమ్మేళనం తయారీకి అత్యవసరం. కొవ్వు ఆమ్లాలు ఏర్పడటానికి, శక్తి కోసం వీటిని విడగొట్టటానికి ఎంజైమ్‌లకు తోడ్పడేది ఇదే. అవసరమైన కొవ్వులు ఉత్పత్తి కావటానికి తోడ్పడే అసీల్‌ క్యారియర్‌ ప్రొటీన్ల తయారీలోనూ విటమిన్‌ బి5 పాలు పంచుకుంటుంది. మన మెదడు ప్రధానంగా కొవ్వే. అందువల్ల మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. జబ్బులతో పోరాటం విటమిన్‌ బి6 (పైరిడాక్సిన్‌) జబ్బుల నివారణకు పెట్టింది పేరు. ఎందుకంటే ఇది తగు మోతాదుల్లో ఉంటే పలు క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. మెదడు ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థకు బాసటగా నిలిచే పలు రసాయనిక ప్రతిచర్యలకూ పైరిడాక్సిన్‌ తోడ్పడుతుంది. ఎంజైమ్‌లకు సహాయంగా విటమిన్‌ బి2 (రైబోఫ్లావిన్‌) కణాల్లోని ఎంజైమ్‌లకు సహాయకారిగా పనిచేస్తుంది. ఇలా మెదడు వంటి భాగాల్లో కీలకమైన ప్రతిచర్యల నిర్వహణలో తోడ్పడుతుంది. ఇది కణాలు వృద్ధి చెందటానికి, శక్తి ఉత్పన్నం కావటానికి.. కొవ్వులు, మందుల వంటివి విచ్ఛిన్నం కావటానికీ దోహదం చేస్తుంది. కణ సమాచార మార్పిడి విటమిన్‌ బి7 (బయోటిన్‌) కణాల సంకేతాలను నియంత్రిస్తుంది. ఇలా శరీరమంతటా సమాచార మార్పిడి త్వరగా, సమర్థంగా సాగేలా చేస్తుంది. మెదడులోనైతే నాడీ సమాచారవాహికల ద్వారా కణాల సంకేతాల మార్పిడిలో ముఖ్య భూమిక నిర్వహిస్తుంది. వాపును తగ్గిస్తూ.. విటమిన్‌ బి3 (నియాసిన్‌) 400కు పైగా ఎంజైమ్‌లతో కలిసి శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్, కొవ్వు వంటి పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని శక్తిగా మార్చి, అవయవాలకు అందిస్తుంది. నియాసిన్‌ మంచి యాంటీఆక్సిడెంట్‌ కూడా. అతిగా ప్రేరేపితమయ్యే వాపు ప్రక్రియనూ ఇది అడ్డుకుంటుంది. సమతుల్యత తప్పకుండా విటమిన్‌ బి9 (ఫోలేట్‌) మెదడు ఆరోగ్యానికి ప్రధానమైన విటమిన్‌. ఇది నాడీసమాచార వాహికల పనితీరును ఉత్తేజితం చేస్తుంది. మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉండేలా చూస్తుంది. కణాల్లోంచి విషతుల్యాలు బయటకు వెళ్లి పోవటానికీ తోడ్పడుతుంది. గుండెకు మేలు విటమిన్‌ బి12 (కోబలమిన్‌) ఎర్ర రక్తకణాలు, డీఎన్‌ఏ ఏర్పడటానికి అత్యవసరమైన పోషకం. నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందటానికి, సమర్థంగా పనిచేయటానికి తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే హోమోసిస్టీన్‌ అనే ప్రొటీన్‌ విచ్ఛిన్నం కావటానికీ కోబలమిన్‌ దోహదం చేస్తుంది. ఈ ప్రొటీన్‌ మోతాదులు మితిమీరితే డిమెన్షియాకూ దారితీస్తుంది. పెరుగు, గుడ్లు, పప్పులు, సాల్మన్‌ చేపలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, ఆకు కూరలను తరచూ తీసుకుంటే అన్నిరకాల బి విటమిన్లు లభించేలా చూసుకోవచ్చు.
శ్రీలంక : తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక నిరసనల హోరుతో రగులుతోంది. అధ్యక్ష, ప్రధాని ఇద్దరూ తప్పుకోవాల్సిందేనంటూ నిరసనకారులు ఇప్పటికే అధికారిక నివాసాలను ముట్టడించారు. అధికారిక భవనాలు నిరసనకారుల అధీనంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ... శ్రీలంక పాలన బాధ్యతలు చేపట్టేందుకు రాజకీయ నాయకులు జంకుతున్నారు. ఇప్పటికే శ్రీలంక ద్రవ్యోల్బణం జూన్‌ నాటికి 55 శాతానికి చేరింది. సంక్షోభ సమయంలో శ్రీలంక పాలనా పగ్గాలను చేబట్టేందుకు..ప్రతిపక్ష నేత సజిత్‌ ప్రేమదాస ముందుకొచ్చారు. ఆయన ఆంగ్ల పత్రిక బీబీసీతో మాట్లాడుతూ ... గొటబాయ రాజపక్సా అధికారం నుంచి దిగిన వెంటనే అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని చెప్పారు. ఆయన పార్టీ సమగి జన బలవెగయ (ఎస్‌జేబీ) ఇప్పటికే ఇతర పక్షాలతో ఈ అంశంపై చర్చలు జరిపింది. ఒక వేళ అధ్యక్ష స్థానానికి ఖాళీ ఏర్పడితే తాను నామినేషన్‌ వేసేందుకు సిద్ధమని సజిత్‌ ప్రకటించారు. ఇప్పటికే ఈ అంశంపై పార్టీలో, మిత్రపక్షాలతో చర్చించామని తెలిపారు. తాము ప్రజలను మోసం చేయడానికి గద్దెనెక్కబోమని..శ్రీలంకను ఈ సంక్షోభం నుంచి బయటపడేయటానికి అనుకున్న ప్రణాళికను ముక్కుసూటిగా అమలు చేస్తామని చెప్పారు. ప్రతిపక్ష నేత సజిత్‌ ప్రేమదాస 2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా అధ్యక్ష పీఠం ఎక్కాలంటే అధికార పార్టీ ఎంపీల మద్దతు కూడా అవసరం. ఇప్పటికే రాజపక్సే కుటుంబంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం సజిత్‌కు కలిసి వచ్చే అంశం. ఈ నేపథ్యంలో అన్నిపక్షాలతో కలిసి ఏర్పాటు చేయనున్న తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు అంగీకరించారు. గొటబాయ రాజీనామా.. వచ్చే వారం పార్లమెంటులో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు స్పీకర్‌ మహీంద యాపా అబేవర్ధన ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అంతకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీ నేతలు కలిసి తీసుకున్నారు. బుధవారం గొటబాయ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని రణిల్‌ విక్రమసింఘె మంగళవారం అధికారికంగా తెలిపారు. రాజపక్స రాజీనామా సమర్పించగానే, అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఈనెల 15 న పార్లమెంటు సమావేశమై.. అధ్యక్ష పదవి ఖాళీని అధికారికంగా ప్రకటిస్తుంది. 19న నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 20న పార్లమెంటులో నూతన అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేస్తే.. గరిష్ఠంగా 30 రోజుల వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా స్పీకర్‌ కొనసాగవచ్చు. ఆలోపు పార్లమెంటు.. తమ సభ్యుల్లో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి. గొటబాయ పదవీ కాలం మరో రెండేళ్లు మాత్రమే ఉంది. కాబట్టి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు కూడా ఆ రెండేళ్లే.. పదవిలో కొనసాగుతారు.
Vehicle ownership transfer new rules updated : విడాకులు లేదా ఆస్తి విభజన వంటి సందర్భాల్లో నామినీలో మార్పు కోసం, యజమాని నామినేషన్‌ను అంగీకరించిన ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) తో మార్చవచ్చు. క్రొత్త చట్టాలను తనిఖీ చేయండి ఇక్కడ! రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో ఒక వ్యక్తిని నామినేట్ చేయడానికి ఒక వాహన యజమానిని సులభతరం చేయడానికి సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనలు, Vehicle ownership transfer new rules updated 1989 లో కొన్ని మార్పులను రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది, ఇది మోటారు వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి లేదా పేరిట బదిలీ చేయడానికి సహాయపడుతుంది. నామినీ, యజమాని మరణం విషయంలో. ఇప్పుడు, యజమాని వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో నామినీ పేరును ఉంచవచ్చు మరియు తరువాత ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా కూడా జోడించవచ్చు. ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా గజిబిజిగా మరియు ఏకరీతిగా ఉంటుంది. నోటిఫైడ్ నిబంధనల ప్రకారం, ఒక వాహనం యొక్క యజమాని నామినీ యొక్క గుర్తింపుకు రుజువును సమర్పించాలి. “మోటారు వాహనం యొక్క యజమాని మరణించిన చోట, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో వాహన యజమాని నామినేట్ చేసిన వ్యక్తి లేదా వాహనాన్ని స్వాధీనం చేసుకున్న వ్యక్తి, కేసు నుండి, మరణం నుండి మూడు నెలల కాలానికి ఉండవచ్చు మోటారు వాహనం యొక్క యజమాని, వాహనాన్ని తనకు బదిలీ చేసినట్లుగా ఉపయోగించుకోండి, అటువంటి వ్యక్తి యజమాని మరణించిన ముప్పై రోజులలోపు, యజమాని మరియు మరణించిన సంఘటన గురించి రిజిస్ట్రేషన్ అధికారికి తెలియజేసాడు. వాహనాన్ని ఉపయోగించాలనే తన సొంత ఉద్దేశం, “నోటిఫికేషన్ తెలిపింది. మోటారు వాహన యజమాని మరణించినప్పటి నుండి మూడు నెలల వ్యవధిలో, వాహనం యొక్క యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి రిజిస్ట్రేషన్ అథారిటీకి వాహనం స్వాధీనం చేసుకున్న నామినీ లేదా వ్యక్తి ఫారం 31 లో దరఖాస్తు చేసుకోవాలని ఇది పేర్కొంది. పేరు. విడాకులు లేదా ఆస్తి విభజన వంటి సందర్భాల్లో నామినీలో మార్పు కోసం, యజమాని నామినేషన్‌ను అంగీకరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) తో మార్చవచ్చు. ప్రస్తుతం, ఒక వాహనం యొక్క రిజిస్టర్డ్ యజమాని మరణించిన సందర్భంలో, వాహనాన్ని నామినీకి బదిలీ చేసే విధానానికి తెప్ప విధానాలు మరియు వివిధ కార్యాలయాలకు తరచూ సందర్శించడం అవసరం. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో ఒక వ్యక్తిని నామినేట్ చేయడానికి వాహనం యజమానిని సులభతరం చేయడానికి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ 2020 నవంబర్ 27 న సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనలను సవరించాలని ప్రతిపాదించింది. ప్రభుత్వం “ప్రతిపాదిత సవరణపై ప్రజల నుండి మరియు అన్ని వాటాదారుల నుండి సలహాలు మరియు వ్యాఖ్యలను ఆహ్వానించింది …” అని పేర్కొంది. ప్రతిపాదిత సవరణ ప్రకారం, “ఒక అదనపు నిబంధనను చేర్చాలని ప్రతిపాదించబడింది, ఇందులో ‘నామినీ యొక్క గుర్తింపుకు రుజువు, ఏదైనా ఉంటే’ యజమాని మరణించినప్పుడు వాహనం యొక్క చట్టపరమైన వారసుడిగా ఎవరినైనా నామినేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది” అని పేర్కొంది. యజమాని నోమినీ పేర్కొనకపోతే వాహనాన్ని చట్టపరమైన వారసుడికి బదిలీ చేయడానికి, యజమాని నామినీని నామినేట్ చేయడానికి అదనపు నిబంధనను చేర్చవచ్చని ప్రతిపాదించబడింది. ఒకవేళ నామినీ ఇప్పటికే పేర్కొనబడితే, వాహనం అతని / ఆమె పేరు మీద బదిలీ చేయబడుతుంది.
ఆసియా నెంబ‌ర్ కుబేరుడు రిల‌యెన్స్ అధినేత ముఖేష్ అంబానీకి 100 బిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లో స్థానం ల‌భించింది. కేవ‌లం 11తో కూడిన ప్ర‌పంచ కుబేరుల జ‌ఫ్ బెజాస్, అలెన్ మ‌స‌క్ క్ల‌బ్ లోకి ముకేష్ అడుగుపెట్టాడు. తాజాగా ముఖేష్ అంబానీ సంప‌ద 100 బిలియ‌న్ డాల‌ర్లు దాటిపోయింది. By Balu J Updated On - 03:52 PM, Sat - 9 October 21 ఆసియా నెంబ‌ర్ కుబేరుడు రిల‌యెన్స్ అధినేత ముఖేష్ అంబానీకి 100 బిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లో స్థానం ల‌భించింది. కేవ‌లం 11తో కూడిన ప్ర‌పంచ కుబేరుల జ‌ఫ్ బెజాస్, అలెన్ మ‌స‌క్ క్ల‌బ్ లోకి ముకేష్ అడుగుపెట్టాడు. తాజాగా ముఖేష్ అంబానీ సంప‌ద 100 బిలియ‌న్ డాల‌ర్లు దాటిపోయింది. స్టాక్ మార్కెట్ లో పెరిగిన సంప‌ద ఆధారంగా ముకేష్ సంప‌ద విలువ ప్ర‌స్తుతం 100.6 బిలియ‌న్ డాల‌ర్లు. ఈ ఏడాది ఆయ‌న సంప‌ద 23.8 బిలియ‌న్ డాల‌ర్లు పెరిగింద‌ని బ్లూంబ‌ర్గ్ మిలియ‌నీర్ల ముఖ‌ప‌త్రం స్ప‌ష్టం చేస్తోంది. చిల్ల‌ర వ‌ర్త‌కం,ఆయిల్‌, టెక్నాల‌జీ రంగాల్లో వ్యాపార‌, వాణిజ్యాల‌ను ముకేష్ చేస్తున్నాడు. 2005 నుంచి వంశ‌పారంప‌ర్యంగా వ‌చ్చిన ముడి చ‌మురు, పెట్రో కెమిక‌ల్స్ వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రింప చేశాడు. టెక్నాల‌జీ, ఈ కామ‌ర్స్ రంగంలోకి అడుగుపెట్టిన రిల‌యెన్స్ అధినేత ముఖేష్ అన‌తికాలంలోనే ప్ర‌ముఖంగా వెలిగిపోతున్నాడు. టెలికం రంగంలోకి 2016లో ప్ర‌వేశించిన రిల‌యెన్స్ అనూహ్యంగా లాభాల బాట ప‌ట్టింది. రిటైల్, టెక్నాల‌జీ రంగాల్లోని రిల‌యెన్స్ గ‌త ఏడాది 27 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌ను ఆర్జించింది. ఫేస్ బుక్, గుగూల్ వంటి ప్ర‌ముఖ సంస్థ‌ల్లో భాగ‌స్వామ్యం కావ‌డానికి భారీగా పెట్టుబ‌డులు ముఖేష్ పెట్టాడు. మూడేళ్ల‌లో 10 బిలియ‌న్ డాల‌ర్ల‌ను పెట్టుబడిగా పెట్టేందుకు గ్రీన్ ఎన‌ర్జీ విభాగం వైపు ఇటీవ‌ల ఆయ‌న అడుగువేశాడు. ప్ర‌స్తుతం ముడిచ‌మురును దిగుమ‌తి చేసుకునే దేశాల్లో భార‌త్ మూడో స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎన‌ర్జీ ద్వారా దిగుమ‌తుల‌ను త‌గ్గించుకోవ‌డంతో పాటు కాలుష్య ర‌హిత ఇంధ‌నం ఉప‌యోగించేలా చేయాల‌ని మోడీ ల‌క్ష్యం. ఆ టార్గెట్ దిశ‌గా రిల‌యెన్స్ ను ముందుకు న‌డ‌ప‌డానికి ముఖేష్ ముందుకు క‌దిలారు. స‌మీప భ‌విష్య‌త్ లో సిమెంట్ ఇండిస్ట్రీస్ వైపు మ‌ళ్లేందుకు ఆలోచిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయిల్ నుంచి కెమిక‌ల్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి దుబాయ్ ఆయిల్ కంపెనీల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. రిల‌యెన్స్ గ్రూప్ చ‌రిత్ర‌లోకి వెళితే..దీన్నీ స్థాపించిన ధీరూభాయ్ అంబానీ 1960లో యెమెన్ దేశంలోని ఒక పెట్రో కంపెనీలో కూలీ. అక్క‌డ స‌ముపార్జిన సంప‌ద‌ను ఇండియాలో పాలిస్ట‌ర్ వ్యాపారాన్ని విస్త‌రింప చేయ‌డానికి పెట్టుబ‌డిగా పెట్టాడు. సుదీర్ఘ కాలం ఆ వ్యాపారంలో చ‌క్ర‌వ‌ర్తిగా ఎదిగాడు. గుండెపోటుతో ధీరూభాయ్ అంబానీ 2002లో చ‌నిపోయాడు. వార‌సులుగా ముఖేష్‌, అనిల్ కంపెనీల‌ను విజ‌య ప‌థాన న‌డిపించారు. త‌ల్లి కోకిలాబెన్ స‌మ‌క్షంలో 2005లో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు కంపెనీల‌ను పంచుకున్నారు. ముడిచ‌ములు, పెట్రో కెమిక‌ల్స్ వ్యాపారాన్ని ముఖేష్ కు అప్ప‌గించారు. విద్యుత్‌, టెలికం, ఆర్థిక సేవా రంగాల్లోకి అనిల్ ప్ర‌వేశించాడు. ఒక‌ప్పుడు అనిల్ బిలియ‌నీర్..ప్ర‌స్తుతం జీరో అయ్యాడు. ఆ విష‌యాన్ని లండ‌న్ కోర్టు గ‌త ఏడాది చెప్పింది. ప్ర‌పంచ కుబేరుల జాబితాలోకి చాలా మంది ఇండియా బిలియ‌నీర్స్ వెళ్లారు. రెండేళ్లుగా మిలియ‌నీర్స్ సంఖ్య పెరుగుతోంది. ఆసియాలోనే భార‌త బిలియ‌నీర్ల సంప‌ద ఎక్కువ‌గా పెరుగుతోంది. అదానీ గ్రూప్ అధినేత గౌత‌మ్ ఆదానీ ఏడాది కాలంలోనే 39.5 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌ను పొందాడు. దేశంలోని మూడో అతి పెద్ద కుబేరుడు అజీజ్ ప్రేమ్ జీ ఈ ఏడాది 12.8 బిలియ‌న డాల‌ర్ల సంప‌ద‌ను ఆర్జించాడు. వీళ్లంద‌రిలోనూ ముఖేష్ ఆధ్వ‌ర్యంలోని రిల‌యెన్స్ సంప‌దను అనూహ్యంగా ఆర్జించ‌డంలో దూసుకు వెళుతోంది. ప్ర‌పంచ టాప్ కుబేరుల జాబితాలోకి వెళ్లిన ముఖేష్ అనతి కాలంలోనే వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 1 కుబేరునిగా ఎదిగే దిశ‌గా ప‌రుగు పెడుతున్నాడు. ఆయ‌న విజ‌యాన్ని భార‌త విజ‌యంగా కేంద్రం కూడా అక్క‌డ‌క్క‌డ ప్ర‌శంసించ‌డం గ‌మ‌నార్హం.
17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోరణి కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన,... 17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోరణి కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేసాడు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజి అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. శివాజీ దాడులతో ఆదిల్ శా సతమతమవుతున్నాడు. కాబట్టి అతడికి తక్షణ పరిహారం అవసరం అయింది. అపుడు అతడికి గుర్తుకొచ్చిన పేరు అఫ్జల్ ఖాన్. సేనాపతి అయిన అఫ్జల్ ఖాన్ ఆదిల్ శాహి రాజకుటుంబపు ప్రముఖ వ్యక్తి. పదివేల మంది సైనికులకు నాయకుడు. అంతటి వీరుడైన అఫ్జల్ ఖాన్ కు ఒక దౌర్బల్యముండేది. అతడి జీవితపుటడుగులను శుభ-అశుభ శకునాలు నిర్ధారించేవి. యుద్ధాలలో పాల్గొనే ముందు అతడు భవిష్యత్తును తెలుసుకునే ముందుకెళ్ళేవాడు. శివాజీని నియంత్రించడానికి అఫ్జల్ ఖానే సరైన వ్యక్తి అని ఆదిల్ శా నిర్ణయించాడు. యథాప్రకారం అఫ్జల్ ఖాన్ జ్యోతిష్కులను కలుసుకుని తన భవిష్యత్తు ఏమిటని అడిగాడు. "నువ్వు బయల్దేరుతున్న సమయం సరైంది కాదు. ఈ యుద్ధంలో నువ్వు గెలవలేవు. అంతేకాదు, ప్రాణాలతో తిరిగిరావడం కూడా సందేహమే" అన్న మాటలు విని విచలితుడయ్యాడు. ఇక అఫ్జల్ ఖాన్ కున్న అరవైనాలుగు మంది భార్యలను చంపాలని నిర్ణయానికి వచ్చాడు అరవై మూడు ‌మందిని ఒకేచోట చంపించాడు, ఖతీజా బీబీ అనే భార్య మాత్రం తప్పించుకుపోబోయింది కానీ దారిలో చంపేశారు అక్కడ ఆతరువాత ఆమె పేరిట ఖతీజా పుర అనే ఊరు గా మిగిలిపోయింది. మిగిలిన అరవై మూడు మంది పేర్లు ఎవరికీ తెలీకుండా గోరీలలో మట్టిక్రింద కప్పబడిపోయాయి. ఒక జోస్యం ఇంత పని చేసింది. తాను చనిపోవడం ఖాయమని తెలిసి, భార్యలందరినీ హత్యచేసి ఒకే స్థలంలో సమాధి చేయడానికి వ్యవస్థ చేశాడంటే, అఫ్జల్ ఖాన్ ఎంత క్రూరుడో ఊహించుకోండి. శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకొన్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చకొట్టడానికి శివాజీ ఇష్ట దైవమయిన భవానీ దేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్దముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్‌ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి ఇద్దరూ అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినపుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికాధికారులను, శివాజీ సైన్యాధికారులు అడ్డుకోనగా, శివాజీ తన దగ్గరన్న పిడి పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీనరసింహ వలె చీల్చి చెందాడుతాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటకు పారిపోతుండగా, ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు. అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమయిన అడవుల్లో అటకాయించి మెరుపు దాడులతో మట్టికరపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. కౄరుడైన, దుర్మార్గుడైనా అఫ్జల్ ఖాన్ తను చస్తానని తెలిసి సొంత భార్యలనే 64 మందిని చంపి‌న నీచుడ్ని చత్రపరి శివాజీ వదించిన రోజు 10 నవంబర్ 1659. జై శివాజీ జై హిందు రాష్ట్ర. -నన్నపనేని రాజశేఖర్.
మొన్న వీకెండ్ ( అక్టోబర్ 29 - 30, 2022) డాలస్ లో ఏర్పాటు చేసిన అమెరికా తెలుగు రచయితల సదస్సుకు వెళ్ళాను. నేను ఇంతకు ముందు కలిసిన వాళ్ళు కొందరు, కేవలం ఫేస్బుక్ పరిచయం మాత్రమే ఉన్న వాళ్ళు కొందరు, కేవలం పేర్లు మాత్రమే తెలిసిన వాళ్ళు కొందరు, పేర్లు కూడా తెలియని వాళ్ళు కొందరు ... రెండు రోజుల సమయం చర్చలతో, నవ్వులతో, విందులతో నిమిషాల్లా గడిచిపోయింది. సదస్సుని కథనం, కథ, కవిత్వం, పత్రికలు – పుస్తక ప్రచురణలు, నవల, విమర్శ, అనువాదాలు అన్న అంశాలుగా విభజించి, ఒక్కో అంశంపై చర్చించడానికి కొంతమంది చొప్పున ఎన్నుకున్నారు. చర్చల్లో పాల్గొన్నవారూ, ప్రేక్షకుల నుంచి ప్రశ్నలూ అడిగినవారు చర్చలు ఆసక్తికరంగా ఉండేలా చేసారు. సమన్వయకర్తలందరూ, వారి సెషన్చలో చర్చిస్తున్న విషయం మీద మంచి అవగాహనతో చేసిన వాఖ్యలూ, ఆలోచనతో వేసిన ప్రశ్నలూ, సమయపరిపాలన అమలుపరిచిన విధమూ నాకు ఆశ్చర్యమూ, సంతోషమూ కలిగించాయి. సదస్సుని నిర్వహించి, అతిధులకు ఆతిధ్యం ఇచ్చిన డాలస్ స్నేహితుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. వెళ్లేముందు అందరూ కొత్తవారే, పైగా కొత్తవారి ఇంట్లో విందులూ అని కొంచెం తడబాటుగా అనిపించినా, మొదటిరోజే అందరూ ఎప్పటినుంచో తెలిసినట్టు అయిపోయారు. నేను వచ్చేస్తాను అని చెప్పినా ఒప్పుకోకుండా, 'మీరు మావూరు వస్తున్నారు, మిమ్మల్ని తీసుకెళ్లడం మాకు సంతోషం. మమ్మల్ని ఆ మాత్రం చెయ్యనివ్వండి' అని ఎయిర్ పోర్ట్ నుండి ఇంటికి తీసుకెళ్ళిన సురేష్ కాజ (తెలుగు యాంకీ) గారిని కలవడంతోనే నా సందేహాలన్నీ ఎగిరిపోయాయి. సదస్సు విషయం ప్రకటించగానే నన్ను ఇంటికి ఆహ్వానించిన విజయ కర్రా గారికి, విసుక్కోకుండా ఓపికగా తిప్పిన సురేష్ & వారి శ్రీమతి శిరీష గారికీ, ఆప్యాయంగా అందరికీ విందు చేసిన అనంత్ & సురేఖ గారికీ , చంద్రహాస్ & నీలిమ గారికీ ధన్యవాదాలు. విందు మాత్రమే కాకుండా ఆ రెండు రోజులూ అందరూ మమ్మల్ని ఎప్పటి నుంచో తెలిసినట్టుగా స్నేహంగా చూసుకున్నారు. I really felt at home. సదస్సు ముఖ్య నిర్వాహకులు చంద్ర కన్నెగంటి, గొర్తి బ్రహ్మానందం, అఫ్సర్, కల్పన రెంటాల గార్లకు, నాకు ఇందులో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మంచి అనుభవాలతో, జ్ఞాపకాలతో, కొత్త స్నేహాలతో వెనక్కి వచ్చాను. ఈ సదస్సు ఏర్పాట్లలో భాగం పంచుకున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
గత కొంత కాలంగా బాలయ్య కు సరైన హిట్ పడలేదు. దీంతో ఆశలన్నీ బోయపాటి తో చేస్తున్న అఖండ సినిమా పైనే పెట్టుకున్నారు. ఇక మాంచి హిట్ కోసం ఆకలి మీద ఉన్న బాలయ్యతో బోయపాటి జత కట్టడంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారి బాలయ్య. నటసింహా నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ గా వచ్చిన చిత్రం “అఖండ”. ఈరో జు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫిస్ వద్ద ఘన విజయం అందుకుంది. దీంతో ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో కచ్చితంగా చెప్పుకోవాల్సిన కేరక్టర్‌ వరదరాజులుగా నటించిన శ్రీకాంత్‌. అతని కాస్ట్యూమ్స్ నుంచి ప్రతిదీ ఆ కేరక్టర్‌ని ఎలివేట్‌ చేసింది. ఇంటర్వెల్‌లో బాలయ్యతో తలపడే సీన్లు… వేటికవే ప్రత్యేకంగా అనిపించాయి. భారీ అంచనాలతో నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది ఈ చిత్రం..ఉదయం నుంచే అఖండ ప్రీమియర్ షో లతో ధియేటర్ల వద్ద సందడి నెలకొంది. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఇండస్ట్రీలో సంబరాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా పైన సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. బోయ‌పాటి శ్రీను డైరెక్ష‌న్‌లో మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌చ్చిన ఈ చిత్రంపై టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేశ్ బాబు రియాక్ట్ అయ్యాడు. ఈ సినిమా పై స్పందిస్తూ తన అధికారిక ట్వీట్టర్ ఖాతానుండి పోస్ట్ చేసారు. అఖండ భారీ ఓపెనింగ్స్ తో షురూ అయింద‌ని విన‌డానికి చాలా సంతోషంగా ఉంది అంటూ ఓ ట్వీట్ చేసాడు. మహేష్ బాబు పోస్ట్ చేస్తూ.. “చప్పట్లు కొడుతున్న బొమ్మ పోస్ట్ చేసి నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీను, టీమ్ మొత్తానికి అభినందన‌లు తెలిపారు. దీంతో బాల‌య్య సినిమాపై మ‌హేశ్ బాబు ట్వీట్ చేయ‌డంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అఖండ‌పై మ‌రింత హైప్ క్రియేట్ అవుతుందంటూ కామెంట్స్ పెడూతున్నారు. ఇక త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ‌, మ‌హేశ్‌బాబు UNSTOPPABLE షోలో సంద‌డి చేయ‌నున్న విషయం తెలిసిందే.మ‌హేశ్ పెట్టిన ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. Extremely happy to hear that #Akhanda has had a massive start! 👏👏 Congratulations to #NandamuriBalakrishna garu, #BoyapatiSreenu garu and the entire team! @ItsMePragya @MusicThaman @dwarakacreation
మనిషికి మనిషే బరువైపోతున్న ఈ రోజుల్లో ఆ ఏనుగు పిల్లలు తమ ప్రేమను చాటుకుంటున్నాయి. చిన్నప్పుడు ముద్దు చేసిన అమ్మమ్మ మంచానపడితే కంటికి రెప్పలా సాకుతున్నాయి. ఆ ఏనుగుల కథ విన్న... అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 మనిషికి మనిషే బరువైపోతున్న ఈ రోజుల్లో ఆ ఏనుగు పిల్లలు తమ ప్రేమను చాటుకుంటున్నాయి. చిన్నప్పుడు ముద్దు చేసిన అమ్మమ్మ మంచానపడితే కంటికి రెప్పలా సాకుతున్నాయి. ఆ ఏనుగుల కథ విన్న మనుషులు అందరూ పిల్ల ఏనుగులది ‘ఎంత మంచి మనసో’ అంటున్నారు. ఈ ఏనుగు పేరు వత్సల. ఈ భూమ్మీద జీవించి ఉన్న ఏనుగుల్లో పెద్ద వయస్కురాలు. 1972లో కేరళ నుంచి మధ్యప్రదేశ్‌కు తీసుకొచ్చారు. అప్పుడు వత్సల వయసు 45 ఏళ్లు. 1993లో హోషంగాబాద్‌ నుంచి మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్‌ రిజర్వ్‌ (పీటీఆర్‌)కు తరలించారు. అప్పటి నుంచి మూడు దశాబ్దాల పాటు ఏనుగులకు సుఖప్రసవం కావడానికి మంత్రసానిలా, ఒక నర్స్‌లా సాయపడేది. రెండేళ్ల వయసు వచ్చిన పిల్ల ఏనుగులతో పాలు మాన్పించి మేత మేయడం నేర్పిది. ఒక్కమాటలో చెప్పాలంటే వత్సల ఏనుగుల మందకు కుటుంబ పెద్దలా ఉండేది. తోటి ఏనుగుల బాగోగులు చక్కగా చూసుకునేది. ‘పిల్ల ఏనుగులపైన వత్సల వాత్సల్యం అపారం’ అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మధ్య కాలం దాకా వత్సల బాగానే తిరగగలిగి ఉంది. ముదిమి మీదపడింది. వయసు 90 ఏళ్లకు పైబడింది. ఆరోగ్యం పాడయింది. మేత తిన్నా జీర్ణం కావడం లేదు. కాటారాక్ట్‌ సమస్య తలెత్తి కంటిచూపు బాగా మందగించింది. పాకను వదలి బయటకు రావడం లేదు. ‘వత్సలను అలా వైద్యశాలలో చూడడం మాకు చాలా బాధగా ఉంది’ అంటున్నారు పీటీఆర్‌కు చెందిన పశువైద్యుడు డాక్టర్‌ సంజీవ్‌ గుప్తా. మరి ఇట్లాంటి పరిస్థితిలో వత్సల బాగోగులు ఎవరు చూసుకుంటారు అంటే పిల్ల ఏనుగులు ఆ పనిచేస్తున్నాయి. మూడేళ్ల వయసున్న బాపూ అనే పిల్ల ఏనుగు, తొమ్మిదేళ్ల మాన్యా, ఎనిమిదేళ్ల ప్రహ్లాద్‌, ఏడేళ్ల కృష్ణకాళీ, ఐదేళ్ల పూర్ణిమలు అమ్మమ్మ వత్సలకు అండగా ఉంటున్నాయి. కళ్లు కనిపించకపోయినా తొండంతో తాకి వత్సల తన మనుమరాళ్లు, మనవళ్లను గుర్తిస్తుంది.
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు లిక్కర్ స్మగ్లింగ్ జరుగుతోంటే.. ఆంధ్రనుంచి తెలంగాణకు డబ్బు స్మగ్లింగ్ జరుగుతోంది. తమాషాగా అనిపించినా ఇది నిజం. హవాలారూపంలో చేతులు మారడానికి హైదరాబాద్ తరలుతున్న సొమ్మును పోలీసులు పట్టుకున్నారు. September 9, 2020 at 12:09 PM in General, Latest News Share on FacebookShare on TwitterShare on WhatsApp బెజవాడ హవాలాకు అడ్డాగా మారింది. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వేలాది మంది సౌదీతోపాటు, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి వద్ద నుంచి డాలర్లు కొనుగోలు చేసి హైదరాబాద్ తరలిస్తున్న ముఠాను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కోటి 40 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా వచ్చిన సమాచారం మేరకు నరసాపురం నుంచి హైదరాబాద్ తరలిస్తున్న హవాలా డబ్బు ఉంచిన కారును విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో పోలీసులు అడ్డగించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కారు వెనుక సీటులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బాక్సు నుంచి పోలీసులు కోటి 40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఏమిటీ హవాలా? విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు ఆ దేశాల కరెన్సీని జీతాల రూపంలో పొందుతారు. ఆ డబ్బును బ్యాంకుల్లో రూపాయిల్లోకి మార్చుకోవాలి. ఉదాహరణకు అమెరికా డాలర్ కొనుగోలు ధర రూ.76, అమ్మకం ధర రూ.73 నడుస్తోంది. ఈ వ్యత్యాసమే హవాలా మాఫియాకు వరంగా మారింది. బ్యాంకుల ద్వారా విదేశీ కరెన్సీని రూపాయిల్లోకి మార్చుకుంటే రిమిటెన్సు టాక్సు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే విదేశాల్లో ఉద్యోగాలు చేసే కొందరు ఉద్యోగులు హవాలా మాఫియాను ఆశ్రయించి డాలర్లను రూపాయిల్లోకి మార్చుకుంటున్నారు. ఇది ఎప్పటి నుంచో జరగుతున్నా పోలీసులకు ఖచ్చితమైన సమాచారం ఉన్నప్పుడే వారిని పట్టుకుని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. శాఖల సమన్వయలోపంతో చెలరేగుతోన్న హవాలా మాఫియా పోలీసులు, ఆదాయపన్ను శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం హవాలా మాఫియాకు వరంగా మారింది. పోలీసులు కేవలం చెక్ పాయింట్ల వద్ద అనుమానం వచ్చిన వాహనాలు చెక్ చేసి అధిక మొత్తంలో డబ్బుతరలిస్తూ ఆధారాలు చూపకపోతే వారిని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. వేలాది కోట్ల రూపాయలు హవాలా మార్గంలో చేతులు మారుతున్నా పోలీసులు పట్టుకునేది గోరంతే. వారికి ఆదాయపన్ను శాఖ అధికారులను నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో హవాలా మాఫియాను అదుపుచేయడం కష్టంగా మారింది. కొందరు హవాలా వ్యాపారులు దొంగ బిల్లులు, సూట్ కేస్ కంపెనీలు సృష్టించి దర్జాగా హవాలా వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు స్పాట్ లో ఉంటేనే వారిని పట్టుకోవడం సాధ్యం అవుతుంది. పోలీసులకు ఏవో కొన్ని బిల్లులు చూపించి నగదు తరలిస్తున్న సందర్భాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ఆదాయపన్ను శాఖ సిబ్బంది, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తే హవాలా మాఫియాకు అడ్డుకట్ట వేయవచ్చు.
సినీ పరిశ్రమకు, ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య అంతరం ఏర్పడి, ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో `మెగాస్టార్’ చిరంజీవి చొరవ తీసుకొని సినీ ప్రముఖులతో కలసి ముఖ్యమంత్రిని కలవడం పట్ల తెలుగు సినీ పరిశ్రమలో హర్షం వ్యక్తం అవుతున్నా ఈ విషయమై చిరంజీవి జగన్ ను `యాచించి’ న్నట్లు వీడియో వెలువడంతో టాలీవుడ్ లో పెద్ద దుమారం చెలరేగుతుంది. చిరంజీవి తన స్థాయిని మరిచి ఏపీ ప్రభుత్వాన్ని యాచించడం నచ్చలేదని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భేటీకి సంబంధించి విడుదలైన వీడియోపై స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వాన్ని చిరంజీవి తన స్థాయిని మరిచి.. అంతగా అభ్యర్థించాల్సిన అవసరం లేదని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. దీనిపై ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. మరోవంక, ప్రముఖ నిర్మాత – దర్శకుడు రాంగోపాల్ సహితం `హీరోలు అంతా వెళ్లి జీరోలు అయ్యారు” అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. వీరందరిని రప్పించుకొని జగన్ తానే అసలైన హీరో అనిపంచుకున్నాడని అవహేళన చేశారు. జగన్‌ను చిరంజీవి బృందం కలవడం మంచి పరిణామం అయినా . ఫిల్మ్‌ ఛాంబర్‌తో సంబంధం లేకుండా వ్యక్తులను పిలిచి భేటీ జరపడం అప్రజాస్వామికం అని ప్రముఖ నటుడు నరేష్ విమర్శించారు . ఛాంబర్‌ ఆధ్వర్యంలో అధికారికంగా ప్రజాస్వామ్యబధ్దంగా సామరస్యపూర్వక తీర్మానాలు, పరిష్కారాలు జరిగితే తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఐక్యతను చాటి చెప్పినట్లు ఉండేదని చెప్పారు. ఏదేమైనా త్వరలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయిని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయిన తర్వాత సినిమా ప్రముఖులు అంతా బాగా జరిగిందని చెప్పారు. చాలా సంతోషం. ఈ భేటీతో ఏపీ ప్రభుత్వానికి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి విభేదాలు లేవని క్లియర్ చేసినందుకు చిరంజీవి‌గారికి ధన్యవాదాలు. అయితే ఆయన ఒక మెగాస్టార్. మేము ఇండస్ట్రీకి పెద్దగా భావిస్తున్నాం” అని భరద్వాజ పేర్కొన్నారు. “ఆయన కూడా ఇండస్ట్రీకి బిడ్డ అని చెప్పుకుంటారు. ఇండస్ట్రీకి పెద్దయినా, బిడ్డయినా ఆయనకి కూడా ఒక ఆత్మగౌరవం ఉంటుంది. సినీ ఇండస్ట్రీకి ప్రతినిధిగా వెళ్ళినప్పుడు స్వతహాగా ఆయనే పెద్ద మనిషి. కానీ సీఎం జగన్‌గారితో ఆయన మాట్లాడుతున్న వీడియో చూస్తే ఆయన ఆత్మగౌరవం పక్కనపెట్టి యాచించినట్లు ఉంది. ఆయన అలా అడగడం చూసి.. మనం ఇలాంటి స్టేజ్‌లో ఉన్నామా అని చాలా బాధేసింది” అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా, ఈ భేటీలో సినిమా టికెట్ ధరల గురించే కానీ.. ఇండస్ట్రీలో ఉన్న అనేక సమస్యలు గురించి ప్రస్తావన వచ్చినట్లుగా అనిపించడం లేదని ఆయన విమర్శించారు. ఐదో షో అంటూ సీఎంగారు వైజాగ్‌లో స్థలాలు ఇస్తామని.. ఇండస్ట్రీని అక్కడ కూడా డెవలప్ చేయమంటున్నారు. మిగతా సమస్యలపై కూడా సీఎంగారు సానుకూలంగా స్పందించి ఉంటే.. సంతోషించే వాళ్ళమంటూ జరిగిన భేటీపై ఒక విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ధరల పెంచుతున్నట్లుగా వారు చెప్పినా.. మహా అయితే ఇప్పుడున్న దానికి 15-20 శాతం మాత్రమే పెంచుతారు. వాటి వల్ల వచ్చే తేడా ఎంతో ఉండదు. దానికే సినిమాలు రిలీజ్ చేయలేకపోతున్నామని వారు చెప్పడం ఏంటో నాకు అర్థం కాలేదు అంటూ విస్మయం వ్యక్తం చేశారు. అసలు సినిమాలు రిలీజ్ కాకపోవడానికి కారణం కరోనా. అది కాకుండా కేవలం టికెట్ ధరల వల్లే అని చెప్పడం.. వినడానికి బాధగా అనిపించిందని చెప్పారు. ఇప్పుడున్న టికెట్ల ధరలతోనే ‘అఖండ’, ‘పుష్ప’ సినిమాలు బాగా వసూలు చేశాయని గుర్తు చేశారు. ఓ రూ 20 నుండి 25 కోట్ల కోసం ఇండస్ట్రీకి దిగ్గజాలైన చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి వంటి వారు వెళ్లి అడుక్కోవడం నిజంగా బాధ అనిపించిందని స్పష్టం చేశారు. చిరంజీవి వంటి వ్యక్తి అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెబుతూ మనం శాసించే వాళ్లం కాకపోయినా.. టాక్స్‌లు కడుతున్నవాళ్లమే. అలాగే మనం కూడా ఓటేసిన వాళ్లమే అని గుర్తు చేశారు. మన గౌరవాన్ని కాపాడుకుంటూ.. ఎదుటివారిని కూడా గౌరవిస్తూ మాట్లాడాలి. అంతేకానీ, అణిగిపోయి అణగారిన వర్గంలా ఉండాల్సిన అవసరం లేదని భరద్వాజ హితవు చెప్పారు.
అన్‌స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్‌పై అప్పుడే అంచనాలు క్రియేట్ కావడంతో, అందరూ ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ టాక్ షో గురించి అభిమానులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు ఎంతగానో చర్చించుకుంటున్నారు. Surya Prakash First Published Oct 14, 2022, 12:42 PM IST బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోతో ప్రేక్షకులను అలరించడంలో ఆయన కృషితో పాటు మరొకరి హ్యాండ్ కూడా ఉంది. బాలయ్య రెండో కూతురు నందమూరి తేజస్విని అన్‌స్టాపబుల్ టాక్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వ్యవహిరంచారు. ఆమె తన తండ్రి లుక్స్, కాస్ట్యూమ్స్ వంటి విషయాలపై చాలా రిసెర్చ్ చేసి, మన ముందుకు అల్ట్రా స్టైలిష్ బాలయ్యను తీసుకువచ్చింది తేజస్విని. ఆమె అన్‌స్టాపబుల్ షో కోసం ఏ విధంగా కష్టపడిందో డైలాగ్ రైటర్ బీవీఎస్​ రవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘అన్‌స్టాపబుల్ 2’ ప్రోమో మేకింగ్ వీడియోలోనూ మనకు తేజస్విని కనిపిస్తుంది. దీన్ని బట్టి ఆమె రెండో సీజన్ కోసం కూడా ఇంతగా కష్టపడుతుందా అని అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక అన్‌స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్‌ను అక్టోబర్ 14 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుండగా, తొలి ఎపిసోడ్‌కు గెస్టులుగా నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లు వస్తున్నారు. ఈ మొదటి ఎపిసోడ్‌కు తన బావ చంద్రబాబు, అల్లుడు నారా లోకేష్‌ను తీసుకొచ్చాడు. ఈ మేరకు వదిలిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. మొదటి ఎపిసోడ్‌కు నా బంధువుని తీసుకొద్దామని అనుకున్నా.. కానీ ప్రజల బంధువుని తీసుకొస్తే బెటర్ అనిపించింది.. మీ అందరికీ బాబు.. నాకు బావ అంటూ చంద్రబాబు గురించి బాలయ్య అదిరిపోయే ఇంట్రడక్షన్ ఇచ్చాడు. తనకు రెండు ఫ్యామిలీలు ఉన్నాయని బాలయ్య సరదాగా అనడం.. వసుంధరకు ఫోన్ చేస్తాను అని బాబు ఫోన్ తీయడం సరదాగా సాగింది. ఇక ఇలా సరదాగా సాగుతున్న ప్రోమోలో కాస్త సీరియస్ అంశాలను కూడా జోడించారు. వెన్నుపోటు సంఘటనలు కూడా ప్రస్థావించారు. 95లో అతి పెద్ద నిర్ణయం తీసుకున్నానని, అది తప్పు నిర్ణయమా? అని బాలయ్యను సూటిగా అడిగేశాడు బాబు. నాటి సంఘటనలను బాబు గుర్తు చేసుకున్నాడు. తనకు అత్యంత ఆప్త మిత్రుడు వైఎస్సార్ అని బాబు చెప్పుకొచ్చాడు. నువ్ సినిమాల్లో చిలిపి పనులు చేస్తే మేం కాలేజీల్లో చేశామంటూ బాబు తన రోజులను గుర్తు చేసుకున్నాడు. ఇక నారా లోకేష్ ఎంట్రీతో ఇంకాస్త సరదాగా సాగింది ప్రోమో. బాలయ్య, చంద్రబాబులను కలిపి నారా లోకేష్ ప్రశ్నలు అడిగాడు. కాసేపు హోస్ట్‌గా మారిన లోకేష్.. బాబు, బాలయ్య పర్సనల్ విషయాలను కూపీ లాగే ప్రయత్నంచేశాడు. ఇంట్లో భార్యకు ఎవరు బాగా భయపడతారు.. వంటలు ఎవరు చేస్తారంటూ ఇలా పర్సనల్ ప్రశ్నలు వదిలాడు లోకేష్. ఈ సీజన్ కు ఇది పెద్ద బ్లాస్టర్ అవుతుందని, సరిగ్గా ప్లాన్ చెయ్యమని చెప్పారట. ఈ ఎపిసోడ్ క్లిక్ అయితే మరింత మంది రాజకీయనాయకులను సైతం ఇక్కడికి అహ్వానించే అవకాసం ఉంది. మొత్తానికి ఆహా అనిపించాలనే తపనతో టీమ్ అదిరిపోయే ఐడియాలు ప్లాన్ చేస్తోంది. అన్‌స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్‌పై అప్పుడే అంచనాలు క్రియేట్ కావడంతో, అందరూ ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ టాక్ షో గురించి అభిమానులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు ఎంతగానో చర్చించుకుంటున్నారు. ఒకే వేదికపై బాలయ్య, చంద్రబాబు, నారా లోకేశ్‌లను చూడటం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయాలకు సంబంధించి బాలయ్య టాక్ షోలో ఎలాంటి చర్చ సాగుతుందో చూడాలి.
Tirumala, 11 Apr. 21: Plavanama Samvatsara Ugadi Asthanam will be observed in Tirumala temple on April 13. The traditional temple court will be observed between 7am and 9am at Bangaru Vakili inside the temple in the presence of Sri Malayappa, Sridevi, Bhudevi accompanied by Vishwaksenulavaru. TTD has cancelled all arjitha sevas (virtual) on that day following Asthanam. ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI ఏప్రిల్ 13న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం తిరుమల, 2021 ఏప్రిల్ 11: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 13వ తేదీన మంగ‌ళ‌వారం శ్రీ ఫ్ల‌వ‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని ఏప్రిల్ 13వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ‌ఆర్జిత సేవలైన (వ‌‌ర్చువ‌ల్ సేవ‌లు) కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాల‌ను టిటిడి రద్దు చేసింది. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. « Total pilgrims who had darshan on 10.04.2021: 49,751 » CJI DESIGNATE JUSTICE NV RAMANA OFFERS PRAYERS AT TIRUMALA TEMPLE
“The sole purpose of the Constitution is to unite people of the country”, said Indresh Kumar Ji, national executive member of the Rashtriya Swayamsevak Sangh. On Nov 26, Samajika Samarasatha Vedika, Muslim Rashtriya Manch, and SC/ST Rights Forum organized an event commemorating the National Constitution Day at the Zakir Hussain Auditorium of Hyderabad Central University. […] Bharat has to be strong for Vishwa Kalyaan: Sarsanghchalak Mohan Bhagwat Ji Sarsanghchalak of Rashtriya Swayamsevak Sangh (RSS) Dr. Mohan Bhagwat said that India will have to become powerful for the welfare of the world. Till now the superpowers have only run their stick on on the world. These superpowers have been running their own system for their own benefit. Once upon a time, Britain used to […] కేరళ : మదర్సాలలో మైన‌ర్ బాల‌బాలిక‌లపై లైంగిక వేధింపులు… పెరుగుతున్న‌ పోక్సో కేసులు గత కొన్ని రోజులుగా కేర‌ళ రాష్ట్రం నలుమూలల నుండి అనేక పోక్సో (లైంగిక నేరాల నుండి బాలల రక్షణ) చట్టం కేసులు నమోదయ్యాయి. ఎడక్కాడ్‌లో మైన‌ర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మదర్సా మతాధికారిని కోజికోడ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కన్నూర్‌కు చెందిన షంషీర్ రిమాండ్‌కు తరలించారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని షంషీర్ బాధితురాలిని బెదిరించినట్లు సమాచారం. అయినప్పటికీ మైనర్ తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వ‌డంతో నిందితున్ని అరెస్టు చేశారు. మరికొంత మంది […] VIDEO: సైన్స్ ప్రపంచంలో భారత కీర్తి పతాక డా. జ‌గ‌దీష్ చంద్ర‌బోస్‌ ప్రపంచానికి మిల్లీమీటర్ తరంగాలు, రేడియో, క్రెస్కోగ్రాఫ్ ప్లాంట్ సైన్స్ అందించిన శాస్త్రవేత్తగా జగదీష్ చంద్ర బోస్ పేరుగడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక అంతర్జాతీయ పురస్కరాలను బోస్ అందుకున్నారు. అంతర్జాతీయ పరిశోధనా రంగంలో భారతీయ కీర్తి పతాకను ఎగురవేశారు. అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన భారతీయ పరిశోధక శాస్త్రవేత్తగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. The post VIDEO: సైన్స్ ప్రపంచంలో భారత కీర్తి పతాక డా. జ‌గ‌దీష్ చంద్ర‌బోస్‌ appeared first on VSK Telangana. విజ్ఞానశాస్త్రానికీ, విశ్వాసానికీ దూరమెంత? నవంబర్‌ 30 ‌- జగదీశ్‌ ‌చంద్రబోస్‌ ‌జయంతి ‘రాత్రివేళ మొక్కలని బాధ పెట్టకూడదు. అవి నిద్రపోతాయి.’ ఎందుకో మరి, ఒకరాత్రి పూట ఆ పిల్లవాడు పువ్వు తెంపడానికి ఒక మొక్కవైపు చేయి చాపినప్పుడు అతడి తల్లి అలా మందలించింది. ఆ బాలుడే జగదీశ్‌ ‌చంద్ర బోస్‌ (‌జేసీ బోస్‌), ‌మందలించిన ఆ మహిళ బామాసుందరీ బోస్‌. అతని కన్నతల్లి. ఇదేమాట ఎన్నో తరాలలో ఎందరో తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు ఎందరో పిల్లలకు చెప్పారు కూడా. కొందరు పిల్లలు […] ఆధునిక మహర్షి జగదీశ్‌ చంద్రబోస్ నవంబర్‌ 30 జగదీష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా బ్రిటీష్‌ ఇండియా బెంగాల్‌ ప్రావిన్స్‌లోని మున్షీగంజ్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) లో 1858 నవంబరు 30వ తేదీన జగదీశ్‌ చంద్రబోస్‌ జన్మించాడు. అతని తండ్రి భగవాన్‌ చంద్రబోస్‌ బ్రహ్మసమాజీ. ఇతను డిప్యూటి మెజిస్ట్రేట్‌, సహాయ కమిషనరుగా ఫరీద్‌పూర్‌, బర్దమాన్‌ వంటి పలుచోట్ల పనిచేశారు. జగదీశ్‌ చంద్రబోస్‌ ప్రాథమిక విద్యభ్యాసం బంగలా భాషలో, స్వదేశీ స్కూల్లో ప్రారంభమైంది. ఆ రోజుల్లో ధనవంతులకు ఆంగ్ల విద్య మీద మోజు ఉన్నా జగదీశ్‌ […] ఢిల్లీలో ఇమామ్‌లకు వేతనాలు… రాజ్యాంగ ఉల్లంఘనే – కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్‌ ఢిల్లీలోని మసీదులలో ఇమామ్‌లు, ముస్లిం మతపెద్దలకు వేతనాన్ని అనుమతిస్తూ 1993 సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పన్ను చెల్లింపుదారుల డబ్బును ఏదైనా ప్రత్యేక మతానికి అనుకూలంగా ఉపయోగించరాదని పేర్కొన్న రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్ ఉదయ్ మహుర్కర్ అన్నారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ పిటిషన్ ఆధారంగా, 1993లో సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డు నిర్వహించే మసీదుల్లోని ఇమామ్‌లకు వేతనం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మసీదుల ఇమామ్‌లకు […] చైనాలో ప్ర‌జ‌ల ఆగ్ర‌హం… COVID లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు ప్ర‌మాదంలోనూ నిబంధ‌న‌లు స‌డ‌లించ‌ని వైనం ప‌త్రికా స్వేచ్చకు భంగం చైనా పశ్చిమ జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో కోవిడ్ లాక్‌డౌన్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చెలరేగాయి. చైనా దేశవ్యాప్తంగా అంటువ్యాధులు రికార్డును స్థాయిలో న‌మోదవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఆగ‌స్టు నుంచి లాక్‌డౌన్ విధించారు. అయితే ఇటీవ‌ల ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించడం ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి కార‌ణమ‌యింది. ఒక‌వైపు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు, మ‌రో వైపు అగ్నిప్ర‌మాదంలో ప్ర‌జ‌లు చిక్కుకుపోయారు. దీంతో లాక్‌డౌన్ ఎత్తివేయాల‌ని ఆందోళ‌న చేశారు. నవంబర్ 25 శుక్రవారం రాత్రి […] మార్గదర్శి బాలాసాహెబ్‌ దేవరస్‌ 28 నవంబర్ (మార్గశిర‌ శుక్ల పంచమి, 1915) – బాలాసాహెబ్‌ దేవరస్ జ‌యంతి రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి మూడవ సర్‌సంఘచాలక్‌గా నేతృత్వం వహించిన బాలాసాహెబ్‌ దేవరస్‌ది విశిష్ఠ వ్యక్తిత్వం. బాలాసాహెబ్‌ అసలు పేరు మధుకర్‌ దత్తాత్రేయ దేవరస్‌. మధుకర్‌, అతని తమ్ముడు భావురావు దేవరస్‌ ఇద్దరూ 1929లో తమ 12వ యేటనే బాల స్వయంసేవకులుగా ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో చేరారు. ఇద్దరిలో చిన్నప్పటి నుండే సహజంగా నాయకత్వ లక్షణాలుండేవి. మధుకర్‌ నిర్వహించే ఆర్‌.ఎస్‌.ఎస్‌. గణకు ఎప్పుడూ ఎక్కువ సంఖ్యలో బాల […] ‘‌సెక్యులరిజం అంటే మెజారిటీ ప్రజల హక్కులను హరించడం కాదు!’ రాజ్యాంగ దినోత్సవం (నవంబర్‌ 26) ‌సందర్భంగా జస్టిస్‌ ‌నరసింహారెడ్డితో జాగృతి ముఖాముఖీలోని కొన్ని అంశాలు: రెండ‌వ భాగం ప్ర‌శ్న‌ : సెక్యులరిజం అనే మాటను లేక భావనను రాజ్యాంగంలో చేర్చడానికి మన రాజ్యాంగ నిర్మాతలు సందేహించారు. కానీ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ దానిని రాజ్యాంగంలోకి తీసుకొచ్చారు. తరువాత పరిణామాలు ఏమిటి? ఇపుడు సెక్యులరిజం పేరుతో, కొత్త భాష్యాలతో దేశాన్ని వర్గాలుగా చీల్చే ప్రయత్నం, ఒక విషాదకర దృశ్యం కనిపిస్తోంది. దీన్ని ఎలా చూస్తారు? జ‌వాబు : సెక్యులరిజమనేది […]
Diabetes Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. మహిళల్లో మధుమేహానికి సంకేతాలు ఇవే. మహిళల్లో ఆకస్మిక బరువు తగ్గడం మధుమేహ లక్షణమే.. Diabetes Symptoms Sanjay Kasula | Aug 16, 2022 | 8:59 PM దేశంలోనూ, ప్రపంచంలోనూ మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గణాంకాల ప్రకారం, భారతదేశాన్ని డయాబెటిస్ రాజధాని అని పిలుస్తారు. మధుమేహం అనేది సరైన ఆహారం, క్షీణించిన జీవనశైలి కారణంగా అభివృద్ధి చెందుతున్న వ్యాధి. మధుమేహం టైప్-1 మధుమేహం, టైప్-2 మధుమేహం రెండు రకాలు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల సంఖ్య భారతదేశంలో ఎక్కువగా ఉంది. డయాబెటిస్ అటువంటి వ్యాధి, ఇది నియంత్రించబడకపోతే, దాని ప్రభావం శరీరంలోని అనేక ముఖ్యమైన అవయవాలపై కూడా కనిపిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ పెరగడం వల్ల దీని ప్రభావం గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కళ్లపై కూడా కనిపిస్తుంది. మధుమేహ లక్షణాల గురించి ముందుగా తెలుసుకుందాం.. రోగి మరింత అలసిపోయినట్లు, ఎక్కువ ఆకలిగా, ఎక్కువ దాహంతో, ఎక్కువ మూత్రం విసర్జించబడుతుంది. నోటి నుండి దుర్వాసన వస్తుంది. పురుషుల కంటే మహిళలకు మధుమేహం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో మధుమేహాన్ని సూచించే కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అనేది మహిళల్లో ఒక సాధారణ వ్యాధి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, UTI అనేది వైరస్, బ్యాక్టీరియా , ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వ్యాధి. తరచుగా ఈ వ్యాధిలో, స్త్రీలు కిడ్నీ, గర్భాశయం లేదా మూత్రాశయం మొదలైన వాటిలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ కలిగి ఉంటారు. కొన్నిసార్లు UTI కూడా మహిళల్లో మధుమేహానికి సంకేతంగా ఉంటుందని వివరించండి, కాబట్టి అటువంటి లక్షణాన్ని విస్మరించవద్దు, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. నోటిలో తెల్లటి పుండ్లు: చాలా మంది మహిళలు తమ నోటిలో తరచుగా తెల్లటి పుళ్ళు గురించి ఫిర్యాదు చేస్తారు. నోటిలో తరచుగా తెల్లటి పుండ్లు రావడం మధుమేహం లక్షణాలలో కూడా వస్తుంది. స్త్రీలు అలాంటి లక్షణాలను గమనించినట్లయితే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి లేదా మధుమేహం పరీక్ష చేయించుకోండి. మూడ్ స్వింగ్స్ కలిగి ఉండటం: బిజీ లైఫ్ స్టైల్ లేదా ఒత్తిడి కారణంగా మహిళల్లో మూడ్ స్వింగ్స్ సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు మహిళల్లో మూడ్ స్వింగ్స్ కూడా మధుమేహం సంకేతం కావచ్చు. మధుమేహం వచ్చిన తర్వాత కూడా మహిళల్లో మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తాయి. బరువు తగ్గడం: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మహిళల్లో అకస్మాత్తుగా బరువు తగ్గడం లేదా తగ్గడం కూడా మహిళల్లో మధుమేహం లక్షణం. అందువల్ల, మీ బరువును ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండండి. మీరు నిరంతరం బరువు తగ్గడం లేదా తగ్గడం వంటివి చేస్తుంటే, మీరు ఖచ్చితంగా మధుమేహాన్ని తనిఖీ చేసుకోవాలి. ఈ లక్షణాలన్నీ మధుమేహం ఉన్న మహిళల్లో తరచుగా కనిపిస్తాయి. మహిళలు అలాంటి లక్షణాన్ని విస్మరించకూడదు. మహిళలు తమ మధుమేహాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.) ఇవి కూడా చదవండి Improve haemoglobin: ఇవి హిమోగ్లోబిన్‌ను పెంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి.. ఇనుము లోపాన్ని కూడా తొలగిస్తాయి..
ఉత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ముఖ్య నిర్ణయాలలో సోదరుల, సన్నిహితుల సలహాలు తీసుకుంటారు . ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తుంది. స్వగృహ నిర్మాణం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలను మరింతగా విస్తరించాలనుకునే వారికి మంచి కాలమే ! కళారంగాలలో ఉన్నవాళ్లకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వారం మధ్యలో కాస్త చికాకులు. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తూర్పు ప్రయాణం అనుకూలం. మరిన్ని లాభాల కోసం ఆంజనేయ దండకం పఠించండి. వృషభం : పనులు అనుకున్న విధంగా పూర్తి చేసినప్పటికీ , ఆర్ధిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ప్రారంభం కాకపోయినా వారం చివర్లో మంచి ఫలితమే వస్తుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు , వస్తులాభం కూడా. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయంతో వ్యాపారాలు లాభసాటిగా మారతాయి. ఉద్యోగాల్లో మార్పులు సంభవిస్తాయి , మిత్రుల సహకారం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవాళ్లకు లాభం చేకూరుతుంది. కుటుంబంలో చికాకులు , ధనవ్యయం . దక్షిణ దిక్కు ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్ర నామం పఠించండి. మిథునం : వివాదాల నుండి బయటపడతారు. కొత్తగా ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కోర్టు కేసులు పరిష్కార దిశకు చేరుకుంటాయి దాంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాహనాలు , ఆభరణాలు కొనడానికి ఉత్సాహం చూపిస్తారు. ఉద్యోగులు సంతృప్తిగా తమ కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. వ్యాపారులకు మంచి లాభాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుంది. బంధువులతో కాస్త విబేధాలు ఏర్పడతాయి. అనారోగ్యం సూచిస్తోంది. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీరామ స్త్రోత్రం పఠిస్తే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు. కర్కాటం : దీర్ఘ కాళిక సమస్యలనుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పనులు ఉత్సాహంతో పూర్తి చేస్తారు. స్నేహితుల సహకారంతో పనులు పూర్తిచేస్తారు, వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులు అందుతాయి. గృహ నిర్మాణాల్లో ఉన్న అడ్డంకులు తొలగుతాయి. ఉద్యోగులకు అడ్డంకులు తొలగుతాయి. కళారంగంలో ఉన్నవాళ్లకు కలిసి వస్తుంది. కుటుంబంలో కాస్త చికాకులు ఏర్పడతాయి. ఉత్తర దిశ ప్రయాణాలు కలిసి వస్తాయి. విష్ణు పారాయణం చేయండి. సింహం : ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. ఒత్తిడులు అధికమౌతాయి . రుణాల కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అన్ని ప్రయత్నాలు కూడా నిరాశకు గురిచేస్తాయి. మీ ప్రత్యర్థులను ఓ కంట కనిపెడుతూనే ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఆశించిన స్థాయిలో లాభాలు రావు. ఉద్యోగస్తులకు కొత్త చిక్కులు సవాల్ గా మారతాయి. పారిశ్రామిక రంగాల వారికి కొన్ని చిక్కులు ఎదురౌతాయి. అయితే వారం మధ్యలో శుభవార్తలు వింటారు , ఆకస్మిక ధనలాభం. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కన్య : చేపట్టాల్సిన పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. రుణ భారాలు తగ్గే సూచనలు , ఆర్ధికంగా కొంత అనుకూలం. బంధు మిత్రుల సహకారంతో వివాదాలనుండి బయటపడతారు. నిరుద్యోగులకు , విద్యార్థులకు ఓ ప్రకటన అమితంగా ఆకర్షిస్తుంది. గృహ నిర్మాణంలో కొంత ముందడుగు పడుతుంది. ధనలాభం , వాహనయోగం. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులు తమకు ఇచ్చిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. రాజకీయాల్లో ఉన్నవాళ్లకు కాస్త కలిసి వచ్చే అవకాశం. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గా మాత స్త్రోత్రాలు పఠించడం మంచిది. తుల: ఆర్ధిక పరిస్థితి మెరుగు అవుతుంది. కళారంగంలో కొత్త అవకాశాలు మిమ్మల్ని ఉత్తేజితులను చేస్తుంది. సన్నిహితులు , మిత్రుల సహకారంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. భూములు , వాహనాలు కొనుగోలు చేయాలనీ ప్రయత్నాలు చేస్తారు కొంతవరకు సఫలం అవుతారు. మీ ప్రత్యర్ధులు సైతం మీకు కలిసి వస్తారు , కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శ్రమ ఎక్కువ పడాల్సి వస్తుంది , స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్ర స్తుతి కలిసి వస్తుంది. వృశ్చికం : సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులలో విజయం , ఆర్ధిక లావాదేవీలు అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆస్థి వివాదాలు పరిష్కారం కావడంతో ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం . ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూల్ అవుతాయి. వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్న చిక్కులు తొలగుతాయి. రాజకీయాలలో ఉన్నవాళ్లకు మరింత మంచి కాలం. స్వల్ప ఘర్షణలు , అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర దిశ ప్రయాణాలు మంచిది. గణేశాష్టకం పారాయణం చేయడం మంచిది. ధనుస్సు : కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వాగ్దాటితో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. కొంత కాలంగా వివాదాలలో ఉన్న స్థిరాస్తి ఎట్టకేలకు పరిష్కారం అవుతుంది. స్వగృహ నిర్మాణం కు నడుం కడతారు. నిరుద్యోగులకు కాస్త కలిసి వచ్చే కాలం. వ్యాపారస్తులకు మరింత అనువైన కాలం. ఉద్యోగులకు కొంత అనుకూలం , శ్రమ తగ్గుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. స్వల్ప విబేధాలు. తూర్పు దిశ ప్రయాణాలు కలిసి వస్తాయి. హనుమాన్ చాలీసా పఠించండి. మకరం : చేపట్టిన వ్యవహారాల్లో కొంత పురోగతి. బంధువుల నుండి అందిన సమాచారం ఊరట నిస్తుంది. గృహ , వాహన కొనుగోలు చేయాలనీ భావిస్తారు ….. కొంతవరకు కలిసి వస్తుంది కూడా. కోర్టు వ్యవహారాల్లో కొంత అనుకూలత. వ్యాపారాలలో ఇబ్బందులు తొలగిపోతాయి. కళారంగంలో ఉన్నవాళ్లకు మరిన్ని మంచి అవకాశాలు. ఉద్యోగస్తులకు కొత్త విధులు ఉత్సాహాన్నిస్తాయి. వారం ప్రారంభంలో స్వల్ప ఇబ్బందులు , బంధు మిత్రులతో విబేధాలు అలాగే స్వల్ప అనారోగ్య సూచనలు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. దేవీ ఖడ్గమాల పఠించండి. కుంభం : పనులు కొంత నిదానంగా ప్రారంభం అవుతాయి. బంధు మిత్రుల సలహాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనిలో బాధ్యతాయుతంగా ప్రవర్తించి మెరుగైన ఫలితం రాబడతారు. గృహం , వాహనం కొనాలని సంకల్పిస్తారు ఆమేరకు విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యం చేయాలనే తలంపుతో ఉంటారు. ఓ సంఘటన మీలో మార్పు తెస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయాల్లో ఉన్నవాళ్లు సంతోషకరమైన వార్తలు వింటారు. వారం ప్రారంభంలో ధనవ్యయం , స్వల్ప అనారోగ్యం. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్త్రోత్రాలు పఠించడం మంచిది. సింహం : పనుల్లో విజయం , సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని వేడుకలకు రంగం సిద్ధం చేస్తారు. ఉన్నత హోదాలో ఉన్నవాళ్ళతో పరిచయాలు లభిస్తాయి. భూములు , వాహనాలు కొంటారు. ఓ ముఖ్యమైన సమాచారం మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. వ్యాపారస్తులకు మంచి కాలం. ఉద్యోగస్తులకు కలిసి వచ్చే కాలం. కళారంగంలో ఉన్నవాళ్లకు వివాదాలు సద్దుమణిగే కాలం. వారం మధ్యలో ధనవ్యయం , కుటుంబంలో స్వల్ప ఘర్షణలు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామారక్షా స్త్రోత్రాలు పఠించడం మంచిది.
చాలా రోజుల క్రితం.. రోజులేంటిలే యేళ్ళ క్రితం మా ఆయన ఇండియా కొచ్చిన ఉత్సాహంలో పెట్టిన వెయ్యినొక్క వ్యాపారాల్లో ఒకటయిన మెడికల్ షాప్ లో నన్ను ఓ రోజు బలవంతంగా కూర్చో పేట్టేసి ఆయన శబరిమలయ్ చెక్కేసారు.... పారాసిటమాల్ అంటే జ్వరానికి వాడతారు అని తప్ప ఇంకేమి తెలియని నేను నా వల్ల కాదు మొర్రో అని బ్రతి మాలినా సరే... మా షాప్లో పని చేసే 'ఎం ఫార్మసి 'అమ్మాయి డెలివరీకి పుట్టింటికి వెళ్ళడం వల్ల ,వేరే దారిలేక నన్ను బెదిరించి మరీ కుర్చీలో కూర్చో పెట్టేసారు... అది కాదండి చీరల షాపో ,నగల షాపో అయితేవంద ,యాబై అటు ఇటు అయిత్టే సర్దుకుపోవచ్చు.. మందులండి మందులు.. ప్రాణాలతో చెలగాటం కాదూ అన్నాను భయం భయంగా.. ఓస్ అదా నీ గోలా ఇది పెద్ద విషయం కాదు.. ఈ రేక్ లో బి. పి కి ,ఆ రేక్ లో షుగర్ ...అందులో దానికి సంబందించినవి ...ఇందులో దీనికి సంబందించినవి.. అందులొ ఇంకేదో సంబందించినవి అని అయిదు నిమిషాల్లో అయిదువందల మందులు గురించి చెప్పేసి వెళ్ళిపోయారు... ఆ మొత్తం మందుల్లో నాకు అర్ధం అయిన మందు ఒక్కటే "ఓమిప్రోజోల్".. గ్యాస్ కి సంబందించింది.. ఎందుకంటే అది బ్లు కలర్ లో పే..ద్ద డబ్బా ..చక్కగా ఎదురుగా కనబడుతుంది... అన్నట్లు నాకో అసిస్టెంట్ని కూడా ఏర్పాటు చేసారు.. దానిపేరు దాక్షాయిని. నాకు కనీసం పారసిటమాల్ పేరన్నాతెలుసు.. దానికి జండూబాం పేరు కూడా తెలియదు... అలాంటప్పుడు నాకు మా నాన్న మీద కోపం వస్తుంది కదా.. మామూలుగా రాదు.. ఎందుకో మీలాంటి విజ్ఞులకు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.. ఎక్కడన్నా షాప్లో కూర్చుంటే కష్టమర్లు వస్తే సంతోషిస్తారు ..నాకు ఎవరన్నా షాప్ వైపు వస్తున్నారంటే దడదడ లాడేది.. పస్ట్ కస్టమర్ ఎంత మంచోడంటే మగాడయిపోయాడు కాబట్టి బాగోదని వదిలేసాగాని లేకపోతే ఎత్తుకుని గిర గిర తిపేసేదాన్ని... పారాసిటమాల్ అడిగాడు. ..కళ్ళ కద్దుకుని మరీ ఇచ్చాను ఆ తర్వాత నుండి మొదలయ్యాయి కష్టాలు.మామూలు కష్టాలు కాదు.. "మెట్ఫార్మిన్ 500 "ఇవ్వండి.. మెట్ఫార్మినా అండి.. ఒక్క నిమిషం... అని బుర్ర గోక్కుంటుంటే ...మా దాక్ష అయిపోయాయండి అంది సింపుల్ గా.. అయిపోయాయా ..పోని "ఏంలిప్ ఏటి."..అన్నాడు... అదికూడా అయిపోయింది అంది ఏమాత్రం తొణక్కుండా... మరింకేం ఉన్నాయి అన్నాడు విసుగ్గా.. "ఓమిప్రోజోల్ " నేను గట్టిగా అరిచాను ఆనందం తట్టుకోలేక... అతను నా వైపు ఎగాదిగా చూసి వెళ్ళిపోయాడు... నీకు బుర్ర భలే పని చేసిందేవ్..నాకు భయం తో బుర్ర పని చెయ్యలేదు తెలుసా..అన్నాను...మరి దాక్ష నా మజాకానా అంటుండగా ఇంకో కష్టమర్ టె లిస్మార్ట్ హెచ్ ఇవ్వమ్మా... అన్నాడు ...లేవు అయిపోయాయి అన్నాను సీరియస్ గా... ఆ ఎదురుగా కనబడుతుంటే అయిపోయాయి అంటావేంటి అంతకన్నా సీరియస్ గా అన్నాడు అతను... పక్కకుచూస్తే అవే డబ్బాలు... నేను బేలగా దాక్ష వైపు చూసాను... అంటే మేడం ప్రొద్దున్నే వచ్చాయి ఇందాకే సర్దాను కవర్ చేసింది... మరొకతను నన్ను చూడగానే క్రొత్తగా జాయిన్ అయ్యావమ్మా..అన్నాడు ....,,,,,"అవును సార్.".అన్నాను ...నాకు కావలసిన మందులు ఆ చివరన పింకు పెట్టె ఉందే అందులో ఉంటాయి ఇవ్వమ్మా..అన్నాడు.. థాంక్స్ అండి అన్న.... ఇలా ఆ రోజు నేను పడ్డ కష్టాలు పగోడికి కూడా రాకూడదు బాబు... కొంత మంది కష్టమర్లు తిట్టిన తిట్లు రాస్తే పరువు పోతుందని రాయట్లేదుగాని భగవంతుడా.. ఉఫ్ఫ్ఫ్... దాక్షా నా వల్ల కాదే మా ఆయన నన్ను వదిలేసినా సరే రేపటి నుండి నీకు అయిదురోజులు శెలవులు.. ఆ తర్వాత నువ్వు ఆయన చూసుకోండి అనేసా... అయితే రాత్రి డబ్బులు వసూలుకు డీలర్స్ వస్తారు.. అలాంటి డీలర్స్ లో ప్రవీణ్ అని ఒక అబ్బాయి వచ్చాడు... మీకు ఒకవిషయం చెప్పడం మర్చిపోయా కదా.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎవరో రూపంలో వచ్చి కాపాడేస్తూ ఉంటాడు..ఈ సారి ప్రవీణ్ రూపం లో వచ్చాడన్నమాట.అదేంటి మేడం ఈ రోజు కలెక్షన్ ఇంత పూర్ గా ఉంది..అన్నాడు... నా మొహం నాకసలు ఏం తెలియదు ప్రవీణు.. నన్ను బలవంతంగా ఇక్కడ కూర్చో పెట్టేసారు.. అన్నా...:( తను కొంచెం జాలిగా చూసాడు.. మీది జెనరిక్ మేడం ....కనీసం కంపెనీ పేరుతో కూడా మందులు ఇవ్వలేరు.. ఒక పని చెయ్యండి ముందు మీరు ప్రిస్క్రిప్షన్ జోలికి వెళ్ళ కండి... అందులో అర్దం చేసుకోవడం కష్టం... ఎవరయితే మెడికల్ షీట్ తెస్తారో వాళ్ళ మందులో కాంపోజిషన్ జాగ్రత్తగా చూసి ఇవ్వండి.. ఒకటికి పది సార్లు చూసుకోండి.. 1mg.com... ఈ సైట్ లో ప్రతి మందు వివరం ఉంటుంది.. మీరు ఏం డవుటొచ్చినా ఇందులోగాని ,గూగుల్ లో గాని చెక్ చేసి అప్పుడు అమ్మాలి..అని ఎంతో ఇదిగా బోలెడు జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు.. నాలో ఒక ప్రత్యేకత ఉంది.. నాకు ఇంట్రెస్ట్ లేని విషయం తలక్రిందులుగా తపస్సు చేసినా నేర్చుకోలేను... ఒక్కసారి అది నచ్చిందా..ఒక పిచ్చి పట్టినట్లు పడుతుంది అంతే.. రాత్రి పగలు ఇదే పిచ్చి.. షుగర్కి ఎన్ని రకాలు, బి. పి కి ఎన్ని రకాలు ,థైరాయిడ్ కి ఎన్ని ...ఇలా వారం రోజుల్లో మా షాపులో ఉన్న మందులన్ని అవపోసన పట్టేసాను.. ఇంకోవారం రోజులు గట్టిగా చదివి ఉంటే మన చందు శైలజగారితో కలిసి ఆపరేషన్లు కూడా చేసిపడెసేదాన్ని... ప్లిచ్ ఈ లోపల మా ఆయన వచ్చేసారు.. అయితే ఎక్కడ పడితే అలా ,ఎలా పడితే అలా ఉన్న మందులను ఒక పద్దతి ప్రకారం ..ఎలా సర్దితే ఈజిగా తీసుకోవచ్చో మొత్తం మార్చిపడేసా... మా ఆయన వచ్చాక జనాలు ..మీరు వచ్చారా ..అక్కరలేదులేండి మీ ఆవిడ వచ్చాకా వస్తాం.. ఆవిడయితే బాగా చెప్తారు అని వెళ్ళిపోయేవారట... ఈయన కుళ్ళు మామూలు రేంజ్లో ఉండేది కాదు... జనాలు అలా అనడానికి ఓ కారణం ఉండేది... నేను చక్కగా ఫెద్దోళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకు మందులు ఇస్తూ.. ఇవిగో ఇవ్వి నెప్పుల టెబ్లెట్స్ ఎక్కువ వాడకూడదు.. కిడ్నీలకు దెబ్బ... ఇదిగో ఇది అయిరన్ టానిక్కు పెరుగన్నం తినేసివెంటనే అయిరన్ వేసుకోవద్దేం.. ఇలాంటి నా గూగుల్ నాలెడ్జి ఉపయోగించడం తో పాటు వాళ్ళ బాధలు కష్టాలు అన్ని వినేదాన్ని... కొందరు కొడలిని తిడితే... కొందరు అత్తల్ని దులిపేసే వారు...మరికొందరు కొడుకుల గురించి చెపితే ఇంకొందరు తండ్రుల చాదస్తం గురించి చెప్పేవారు.. అసలు భార్యభర్తల తగువులయితేనా అబ్బ్బో అబ్బో అబ్బో.. నా గొప్పలు నే చెప్పుకోకూడదబ్బా... ఓ రోజు నేను సీరియస్సుగా మందుల మీద రీసెర్చ్ చేస్తుంటే ,మా దాక్ష మందులన్న్ని తుడిచి సర్దుతుంటే సడన్ గా మహత్తరమైన అవిడియా ఒకటి వచ్చింది... అరే దాక్షమ్మా ఎన్నాళ్ళిలా ఇద్దరం మందులు తుడుచుకుంటు బ్రతుకుతాం. శుబ్బరంగా ఓ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టేసి ఇక్కడ భార్య భర్తల గొడవలు తీర్చబడును అని బోర్డెట్టేద్దాం.. ఈ రోజుల్లో కొట్టుకు చావని మొగుడుపెళ్ళాలు ఎక్కడున్నారు చెప్పు... ఒక్కసారి గాని క్లిక్ అయితే నా సామిరంగా ఎలా ఉంటాది అన్నాను ఉత్సాహంగా చూస్తూ... అది కళ్ళు కూడా పైకెత్తకుండా ....మా అమ్మ ఓ సామెత చెప్తాది లెండి గురువింద గింజ గురించి.. మీకు అంకుల్ గారి మధ్య పచ్చ గడ్డి కాదు.. పారే జలపాతం ఉరికినా బగ్గున మండి ఆవిరై పోతుంది... ఈవిడ కౌన్సిలింగు సెంటరెడతాదట.. ముందు మీ ఇద్దరు ఒకరుకొకరు ఇచ్చుకోండి అని తీసి పడేసింది.. నీ మొహం పెరటి చెట్టు వైధ్యానికి పనికి రాదని మాకు మేము ఇచ్చుకోలేము అంటూన్నాను.. బయట ఒకటే హడావుడి, గోల.. ఆంటీగారు వీధి చివర పేద్ద కోతి మీ అంత ఉంది అంది.. భయంగా.. చితక్కొట్టేస్తానేవ్ నాతో పోల్చావంటేఅన్నాను.. అబ్బా.. అంటే అది కాదు ఆంటీ ..మనిషంత కోతి జనాలు వెనుక పరిగెడుతున్నారు ...అది అటు అటు, ఇటు చూస్తుంది అంది వణికిపోతూ... నువ్వు అక్కడే కూర్చుని డాన్స్ కడితే నిన్ను చూసి మనలాగే ఉందే అనుకుని మన షాప్ కే వస్తుంది.. లోపలికి రా కసిరాను.. అయబాబోయ్ నిజంగా వచ్చేస్తాదంటారా అంది నా వైపు చూసి.. నిజ్జంగా నిజం అన్నాను.. అయితే నేను లంచ్ కి అరగంట ముందే వెళ్ళిపోతున్నా.. టా..టా బాయ్ బాయ్ అని ఒక్క అంగలో వీధిలో ఉరికేసింది.. పిరికి మాలోకం అని నేను సీరియస్సుగా నాపని చేసుకుంటుంటే జనాల గోల ,గొడవ మా షాప్ కి దగ్గరగా వినబటం మొదలయ్యాయి... ఏంటబ్బా ఈ కోతి గోల ఓ పాలి చూద్దాం అని తల తిప్పానో లేదో కరెంట్ షాక్ కొట్టిన కోతిలా బిగుసుకుపోయా... మామూలు కోతా అది.. మనిషంత కోతి.. జెనరల్ గా దీన్ని జూలో పెట్టాలే..అలా ఎలా రోడ్ మీద వదిలేసారబ్బా... నేను ఆశ్చర్యపోతుండగా... అది నా వైపు చూసింది.. చూసి ఊరుకుందా మా షాప్ మెట్లెక్కి చిన్న తలుపు ఉంటుంది దానిని తీసుకుని నా ఎదురుగా కష్టమర్ కూర్చునే కూర్చీలోకూర్చుని "దా ఏం కొన్సిలింగ్ ఇస్తావో ఇవ్వి అన్నట్లు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం మొదలెట్టీంది... ఆ టైం లో నా పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే అదేం సినిమా ?ఆ... రేసు గుర్రంలో ....లిఫ్ట్లో శృతిహాసన్ లా ఒక రేంజ్ లో ఇన్సైడ్ డేన్స్ కట్టేస్తున్నా...కాని పైకి మాత్రం చాలా హుందాగా మరియు డీసెంట్గా పెళ్ళి చూపుళ్ళో పెళ్ళి కొడుకు ఎదురుగా కూర్చున్న పెళ్ళి కూతురు మాదిరి తల ఎత్తకుండా చేతిలో పోన్ ని అన్ని రకాల కోణాల్లో తీపేస్తూ దేవుడా దేవుడా కాపాడు అని ఒకటే భగవన్నామ స్మరణలో బిజిగా ఉన్నా.... అంత భయం లోనూ నాకో విషయం గుర్తొచ్చింది.. జంతువుల కళ్ళల్లో చూస్తే వాటికి కోపం వచ్చి మన మీద తిరగ బడతాయట.. అందుకనే నేను ఆ పెళ్ళికూతురి అవతారంలో సెటిల్ అయ్యా... విచిత్రంగా బయట జనాలు కూడా అరుపులు మానేసి మా ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తున్నారు... చాలా మంది సెల్ ఫోన్స్ తీసి ఈ తతంగం అంతా వీడియోతీయడంలో బిజీగా ఉన్నారు... ఓరి దొంగ సచ్చినోళ్ళారా అని తిట్టుకుంటుంటే సడంగా మా ఆయన గుర్తొచ్చారు.. ఆయనకు చేస్తే ....గజేంద్ర మోక్షం లో ఏనుగు కాపాడినట్లు కాపాడేస్తే నన్ను.... .ఏమో ఎవరికి తెలుసు అనుకుని మెల్లిగా ఆయన నెంబర్ ప్రెస్ చేసా... హలో హలో ఏవండీ (లో గొంతుకతో.. ) ఏంటి చెప్పు.. (విసుగ్గా) పెద్ద కోతి నా ఎదురుగా కూర్చుంది... దానికి కాల్ చెయ్యాలా.. మన దేవుడి గూట్లో అరటి పండు ఉంది అది ఇచ్చి ఉస్ ఉస్ అను వెళ్ళిపోద్ది... మీరు చెప్పండి నా సిట్యుఎషన్లో మీరుంటే ఏం చేసేవారు.. అహా మాట వరసకు చెప్పండి అసలు.. అప్పటికి అది నా ముందు కూర్చుని పది నిమిషాల పైన అయ్యింది... ఒక్కసారి మీరు షాప్ దగ్గరకు వస్తే బాగుంటుంది... ఇక్కడ పరిస్థితి ఘోరం గాఉంది అని కాల్ కట్ చేసేసి ఫోన్ కుర్చి క్రింద పెట్టేసా.. నాకెందుకో భయం ఈ కోతికి మన భాష వచ్చేమో అని. గబుక్కున దానికి అర్ధం అయిపోతే... నా సెల్ ఫోన్ లాగేసుకొని ఢాం అని నేల కేసి కొట్టేస్తే? అదన్నమాట భయం... కాని అది మాత్రం నా వైపే చూస్తూ టేబుల్ మీద ఉన్న పెన్ తీసి ఆడుకోవడం మొదలెట్టింది... చుట్టూరా ఉన్న జనాలు ఆ వీధి నుండి ,ఈ వీధి నుండి పోలోమని పోగయి వీడియోలు తీసుకుంటున్నారు... అంత భయం లోనూ నాకో డవుటేమిటంటే నా ఎదురుగా ఉన్న కొట్టు అరటిపళ్ళ కొట్టు... నా పక్కనే బేకరీ.. నేను సగం లావు అవ్వడానికి కారణం అదే.. ఈ పక్కన చెరుకు రసం కొట్టు.. ఇవన్ని వదిలేసి మందుల షాపులో నీకేం పనే తల్లి అని తల పట్టుకు కూర్చున్నా.. ఈ లోపల ఎవరో కోతిని కొట్టాబోయి గురి తప్పి మందుల రేక్ని కొబ్బరి చిప్పతో కొట్టాడు..అంతే సగానికి పైగా మందుల పెట్టెలు క్రింద పడి పోయాయి.. ఎవడ్రా అది నేను, కోతి ఒకేసారి అటు చూసాం... ఇంకెవరు.. మా ఆయన... జనంలో కలిసిపోయి రెండు కొబ్బరి చిప్పలు, నాలుగు అరటిపళ్ళు పట్టుకుని కోతి పై నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు... సరిపోయింది.... దేవుడా ఇప్పుడెలా అని తల పట్టుకు కూర్చుంటె ఒక అయిడియా వచ్చింది.. చాలా సినిమాల్లో జంతువులను భయపెట్టడానికి ఢంకు డమా అని డప్పుల శబ్ధం వాయిస్తూ ఉంటారుగా కోయోళ్ళు... మనం కూడా అదే పని చేస్తే..నాకు తెలిసిన ఒక గేం సైట్లో సరిగ్గా అట్టాంటి మ్యూజిక్కే వస్తుంది.. మెల్లిగా ఆ సైట్ ఓపెన్ చేసి ఆ మ్యూసిక్ పెట్టా... అప్పటి వరకు పెన్ను పుచ్చుకుని ఆడుకుంటున్నదల్లా నా వైపు చూసింది... దేవుడా కొంపదీసి పెనం మీదనుండి పొయ్యిలో జంపుచేసానా అని భయంగా చూసా.. టేబుల్ మీద మందులు తుడవడానికి ఉపయోగించే పాత గుడ్డ తీసి ఒకసారి మొహం తుడిచి ఆ తరువాతా చెయ్యెత్తి అక్కడకూడా తుడిచి ఆ తర్వాతా ఎక్కడెక్కడొ తుడిచి దాన్ని నా కంప్యూటర్ మీద వేసి ఒక్కసారి పళ్ళన్ని ఇకిలించి తలుపు పై నుండి ఒక్క గెంతు గెంతి బయటకు పోయింది... జనాలందరూ మళ్ళీదాని వెనుక పరుగు... మీరెవరూ నాకు వంకలు పెట్టక్కరలేదు.. అంతకు వందరెట్లు మా దాక్ష రెండు నెలలు ఆడేసుకుంది.. అది కాదు ఆంటీ గారు ...కోతన్నాకా నాలుగు డబ్బాలు క్రింద పడేయాలి..లేకపోతే నాలుగు వస్తువులు చింపేయాలి... ఇంకా తిక్కరేగితే మీ కాలో ,చెయ్యో కొరికేయడమో, జుట్టు పీకేయడమో చెయ్యాలి గాని... పెళ్ళి కొడుకులా మీ ఎదురుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం ఏంటండి...అదీ 20నిమిషాలు పైగా.... అహా.. ఇదే కధ ఇంకెవరన్నా మీకు చెప్తే మీరునమ్ముతారా... మీ గుండెల మీద చెయ్యేసి చెపోండి... అసలు బయట ఉన్న ఎదవలకి సెల్ఫీల మీద ఉన్న మోజు ఓ TV9 మీదో ఓ TV 5 మీదో ఏడ్చిందా... వాళ్ళయితే ఆ కోతినే ఇంటెర్వ్యూ చేసి విషయం రా బట్టేసే వారు... అసలు మీకు బుర్ర లేదండి ...పాపం monkey సార్ గారు పెన్ను పట్టుకుని గంట సేపు హింటిచ్చిన్నా మీకు పేపర్ ఇద్దామన్న అయిడియా ఎక్కడ ఏడ్చింది... నన్ను అడిగితే ఈగ సినిమాలో లాగా ఈ కోతి ఒకప్పుడు మీ లవ్వర్ అయి ఉంటాడు... ఏమాత్రం కాలం చెల్లి ఇలా కోతి రూపం లో పుట్టేసి మీ కోసం వచ్చి ఉంటాడు... ఓ సారి ఒకప్పుడు మీరు ప్రేమించిన అబ్బాయిల లిస్ట్ గుర్తు తెచ్చుకోండి... అంది.. దాక్ష నేను ఇప్పటి కొచ్చి నరమాంసం తినలేదే.. నువ్వు ఇలాగే వాగేవనుకో సాయంత్రం లోగా ఖైమా కొట్టి కూరొండుకుని తినేస్తాను అని బెదిరించినా ఆగదే... పోని మీకు ఆ స్టోరి నచ్చి ఉండదు.. ఇంకొకటి చెప్తా... మే బీ ....ఒక వేళ ఆ కోతి గర్ల్ ఫ్రెండ్ పోలికలు మీలో బాగా కనిపించి ఉండి ఉంటాయండి.... నేను కొట్టడానికొచ్చేసరికి ఇది కూడా నచలేదా రేపు తప్ప కుండా మంచిగా గెస్ చేసి చెప్తా అని నెల రోజులు చావ గొట్టింది మహా తల్లి వీరిచే పోస్ట్ చేయబడింది నేస్తం వద్ద 12:25 AM 15 కామెంట్‌లు 28, మే 2020, గురువారం కరోనా ఓసారి జపాన్లో సునామి వస్తే దాని ఎఫెక్ట్ సింగపూర్ మీద పడుతుందేమో అని నెలకు సరిపడా సరుకులు కొనేసిన ఘన చరిత్ర నాది.. అటువంటిది ఊహాన్లో వైరస్ గురించి వినగానే ఊరుకుంటానా... ఎందుకైనా మంచిది అని ఫిబ్రవరిలోనే మూడు నెలలకు సరిపడా సరుకులు కొనేసి ఇంట్లో పెట్టేసా.. సార్స్, మెర్స్ గురించి తెలిసినా పెద్దగా పట్టించుకోలేదుగాని ఈ కోవిడ్ విషయంలో ఎందుకో నా కుడికన్ను అదురుతూనే ఉంది..అదే సమయంలో ట్రంప్ ఇండియాకి రావడం... ఓ కోటిమంది నా సభకి రావాలని జోకులాంటి ఆర్డర్ వెయ్యడం.. మోదీ గారు వెంటనే వాకే అని జనాలను తోలుకొచినప్పుడే మా కుటుంభ సభ్యులందరికి కాల్ చేసి చెప్పా... నాన్నా మందులు గట్రా ముందే కొనుక్కు పెట్టుకోండి.. వంట సామాను నెలకు సరిపడా కొనుక్కోండి అని.. విన్నారా.. ఊహు.. నువ్వూ నీ ఎదవ చాదస్తం అని తిట్టారు.. ఏమైంది.. చివరకి కోవిడ్ వచ్చి మన పక్కన సెటిల్ అయ్యింది.. అందుకే నాలాంటి కాలజ్ఞానులను తక్కువ అంచనా వేయకూడదు.. ఉన్నట్లుండి మోదీగారు మంచి ముహూర్తం చూసి జనతాకర్ఫ్యూ అన్నారు...ఆ దెబ్బతో వైరస్ చైన్ లింకులు ఎక్కడివక్కడే విడిపోయి, మరసటి రోజునుండి కరోనా ఫ్రీ భారత్ అయిపోతుందని జనాలు ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్ అని ఇళ్ళల్లో గడియలేసుకు కూర్చున్నారు.. కొంపలో గంట సేపు ఉంటే ఓవెన్ లో పాప్ కార్న్ లా ఎగెరెగిరి పడే మా ఆయన కూడా కరోనా నుండి దేశాన్ని రక్షించడానికి కంకణం కట్టుకుని టి.వి ముందు సెటిలయ్యారు.. ఆ సమయంలోనే భయంకరమైన నిజం ఒకటి తెలిసింది... నిమిషం కూడా ఇంట్లో ఉండనివ్వరు ఈ మనిషిని అని రోజంతా నా శాపానార్ధాలకు భలయ్యే ఆయన ఫ్రెండ్స్ నాకు ఎంత మేలు చేస్తున్నారో అని.. బుజ్జి..మజ్జిగ... గ్రీన్ టీ.. కాస్త పకోడి చెయ్యకూడదూ.. బ్లాక్ టీ.. మళ్ళీ మజ్జిగ.. చల్లగా నిమ్మరసం... ఆ లిస్ట్ కి అంతూ పొంతూ లేదు.. ఇక మీదట ఆయన ఫ్రెండ్స్ని తిట్టకూడదని ఒట్టెట్టుకున్నాను.. సాయంత్రం కాగానే జనాలందరూ వీదుల్లోకొచ్చేసి ప్లేట్లు ,గరిటలు, గంటలు, డప్పులు దొరికింది దొరికినట్లుగా వాయించేసి చప్పట్లు కొట్టేసాం.. ఎవరెవరు ఏ వస్తువులు వాయించారో అవే వస్తువులతో మాడు పగలగొట్టీ మరీ చెప్పారు మోడీ గారు లా..క్.. డౌ.. న్ అని.. ఈ విషయం తెలియగానే ఫస్ట్ వచ్చిన ఫోన్ కాల్ మా అబ్బాయి కాలేజ్ నుండి.. మేడం ఈ రోజునుండి.. బాబుకి ఆన్ లైన్ క్లాసెస్.. అప్పుడప్పుడూ కాల్ చేస్తాం ఏమనుకోకండి అన్నాడు.. మాటవరసకు అప్పుడప్పుడు అన్నాడుగాని ...ఎప్పుడూ చేస్తూఉంటాడని ఆ తర్వాతే తెలిసింది.. మీ అబ్బాయి నిద్రలేచాడా?.. ఇంకా క్లాస్ కి రాలేదేంటి.?. స్క్రీన్ మీద బాబు పేరు కనిపించట్లేదేంటి?... అందరూ ఊ కొడుతుంటే మీ వాడు అనట్లేదేంటి?.....వీడు నన్నే ఇలా తినేస్తున్నాడంటే పిల్లాడిని ఏ రేంజ్ లో వేపుకు తింటున్నాడో అని జాలేస్తూ ఉంటుంది నాకు.. మా ఆయన సంగతి చెప్పే అక్కరలేదు.. దాహంతో ఉన్న కాకి గులకరాళ్ళు కుండలో వేయడానికి దీక్షగా గల్లీ ,గల్లీ తిరిగినట్లు ఊరంతా తిరగడమే..ఏమన్నా అంటే చూడు బుజ్జీ ఇది ఇప్పుడప్పుడే తీరేదికాదు.ముందు ,ముందు మనం కరోనాతో సహజీవనం చెయ్యాల్సిందే అని జగనన్న కంటే ముందే చెప్పేసారు నాకు.. ఇలాంటి సమయాల్లోనే ఇంట్లో పంపు లీక్ అయిపోద్ది..వాషింగ్ మిషన్ పాడైపోతుంది.. సింకు దగ్గర ఏదో అడ్డుకుని వాటర్ స్ట్రక్కయిపోతుంది.. కుంచమంత కూతురుంటే మంచం దిగక్కరలేదని సామెత..అదెంత వరకూ నిజమో తెలియదుగాని కొడుకుంటే మాత్రం తల్లికి చేదోడు వాదోడమ్మా.. మా అబ్బాయి రెంచు.. స్క్రూ డ్రైవర్ పట్టుకుని నన్ను గండం నుండి బయట పడేస్తూ ఉంటాడు.. ఇదిలా ఉంటే అప్పటి వరకూ ఏ కలుగుల్లో వుంటారో ఎక్కడెక్కడి ఫ్రెండ్స్ బంధువులు అందరూ బయటికొచ్చేసి ప్రొద్దున లేచేసరికి పాతిక గ్రూపుల్లో నన్ను ఏడ్ చేసి ఒకటే మెసేజ్లు..ఇంతా చేసి అవి ఏం మెసేజ్ లయ్యా అంటే.. నేను ఈ వంట వండాను.. అని నాలుగు రకాల వంటల పోస్ట్లు ఒకరు పంపితే.. ఓస్ నువ్వు అవి వండావా నేను అయితే ఇవి వండాను అని ఇంకొకరు ఆరు రకాల వంటలు... వీళ్ళు ఇలా పోటీలు పడి వండేస్తుంటే మగాళ్ళందరూ సరుకుల కోసం సంచులు పట్టుకుని ఊరిమీద తిరగడం..ప్రతి మార్కెట్ని కోడంబాకం మార్కెట్లా తయారు చెయ్యడం.. కరోనా కేసులు పెరుగుతున్నాయి అంటే పెరగవూ మరి... వీళ్ళందరిదీ ఒక గోల అంటే నా కూతురు మరీ స్పెషలు...గబుక్కున వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టి ఐ లవ్యూ మమ్మీ.. అనగానే పుత్రికోత్సాహంతో నేను దగ్గరికి తీసుకోబోతుండగానే.." సెల్ఫీ "అని క్లిక్ మనిపిస్తుంది.. ఏంటే అదీ అంటే.... మరీ దీప్తీ వాళ్ళ డాడీతో ఫొటో తీయించుకుని పంపింది మరి నేను నీతో తీసి పంపద్దా.. ఈ రోజు ఏంవండావ్.. ఛీ... బీరకాయా..నా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీలు ఎన్ని మంచి వంటలు వండుతారో.. అని మొహం ముడుచుకుంది..వంటల ఫొటోలేగా.. కావలసినన్ని నీకు ఫార్వర్డ్ చేస్తా..... హేపీగా మీ ఫ్రెండ్స్కి పంపేసుకో అన్నాను.. అబద్దం ఆడమంటావా గొప్ప ఆశ్చర్యంగా ఫేసుపెట్టింది.. వాళ్ళు చేసేపని కూడా అదేనమ్మా...ఈ ఎండల్లో వంటలు చేయడం కూడాను విసుక్కున్నా..జనాలకు మరీ ఖాళీ ఎక్కువైపోతుంది.. బాల్కానీనుండి బయటకు చూద్దునుకదా.. జనాలు విచ్చల విడిగా తిరుగుతున్నారు.. ఒక్కళ్ళ ఫేసుకు మాస్కు ఉంటే ఒట్టు..అంటే కర్చీఫ్ లాంటిది కడతారు కాని అది మెడలో ఉంటుంది.. మూతి మీద ఉండదు. ఏ పోలీసో అటు వస్తుంటే గబుక్కున పైకి లాగుతారన్నమాట..అప్పటికీ అన్ని టీవి చానల్స్ లో మొత్తుకుంటూనే ఉంటారు.. అయినా వీళ్ళకు అర్దంకాదు.. ఇది ఇలా ఉండగా ఒక శుభముహుర్తాన మా ఇల్లు రెడ్ జోన్ పరిధిలోకి వచ్చేసింది...ఇంకేంటి బయటకు వెళ్ళడం పూర్తిగా బంద్... కొంత విసుగన్నమాటేగాని రెడ్ జోన్ వల్ల బోలెడు లాభాలండి.. అయినదానికి ,కానిదానికి ఊరిమీద కాలుగాలిన పిల్లుల్లా తిరిగే మా ఆయన లాంటోళ్ళను ఇంట్లో కట్టేయచ్చు.. పోలీసులు నిరంతర కాపల వల్ల దొంగల భయం ఉండదు.. ..కూరగాయలు పాలు పెరుగు ఫ్రీగా పంచే రాజకీయ నాయకులు...అసలా లెక్కేవేరు.. ఓ అర్దరాత్రి 12 కి మా వాచ్మెన్ నుండి ఫోన్ కాల్.. మేడంగారు మీరు అర్జెంట్గా క్రిందకు రావాలి.. ఎందుకు అన్నాను అయోమయంగా.. మా ఆవిడకి కడుపునెప్పి మీరు వచ్చి వోదార్చండి.. కడుపు నెప్పి వస్తే టేబ్లెట్ వెయ్యాలిగాని ఓదార్చడం ఏంటి ?నేను ఆలోచనలో పడగానే తొందరగా రండి బాబోయ్ అని ఒక్క అరుపు అరిచాడు.. నేను ఉలిక్కి పడి గబుక్కున టేబ్లెట్ తీసుకుని నైటీ లోనే క్రిందకు దిగిపోయా.. లిఫ్ట్ ఎదురుగా వెనుక చేతులు కట్టుకుని అటు ఇటు పచార్లు చేస్తూ మా వాచ్మెన్ నన్ను చూడగానే ... ఇంక ఏడుపు ఆపు.. మేడంకు నీ బాధలన్ని చెప్పు ఓదారుస్తారు అన్నాడు భారంగా నిట్టూర్చి.. ఈ ఓదార్పు గోలేంటిరా నాయనా అనుకుని ఏమయ్యింది.. ఎందుకు కడుపు నెప్పి.. 'డేటా' అన్నాను అనుమానంగా.. ఉహు అంది ఎర్రని కళ్ళను తుడుచుకుంటూ.. బయట ఫుడ్ ఏమన్నా తిన్నావా అరగలేదేమో.. ఫుడ్ పోయిజన్ అయిందేమో అన్నాను ఇంకేం కారణాలు అయి ఉంటాయో అని ఆలోచిస్తూ.. ఇప్పుడు బయట ఫుడ్ ఎక్కడ దొరుకుతుందండీ అది గ్యాస్ నెప్పి..రెండు రోజులనుండి అన్నం తినట్లేదు .. టేబ్లెట్ వేసా ఇప్పుడే అన్నాడు.. మరి ఆ మాత్రం దానికి నన్ను ఎందుకు పిలిచావు అన్నాను అయోమయంగా.. అబ్బా.. అది కాదండి.. మన అపార్ట్మెంట్ ఎదురు ఇంటిలో కరోనా పోజిటివ్ వచ్చింది కదండీ.. వాళ్ళ ఇంట్లో పిల్లలతో మావోడు రోజూ ఆడేవాడు..తల్లి మనసు కదండీ వాడికెక్కడ అంటుకుంటుందో అని ఈవిడ రెండురోజులనుండి అన్నం తినట్లేదు.. మీరు బాగా మాట్లాడతారని దాని నమ్మకం కొంచెం ఓదార్చండి అన్నాడు సీరియస్సుగా.. నేను ఒక్క గెంతు గెంతా వెనక్కి. ఓరి దుర్మార్గుడా కంగారులో మాస్కు పెట్టుకోలేదు.. చున్నీ కూడా లేదు... ఎలా ఉన్నదాన్ని అలా వచ్చేసా అనుకుని.. మరి మొన్న జనాలను క్వారంటైన్ తీసుకు వెళ్ళారుగా వాళ్ళకు చెప్పలేదా నువ్వు ఈ విషయం అన్నాను భయంగా... చెప్పానండి.. అరె ..టెస్టులు చేసేవరకు నువ్వు హోం క్వారంటైన్లో ఉండాలి ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారండి..అందుకేగదండి నేను రాకుండా మిమ్మల్ని పిలిచా ఇక్కడికి అన్నాడు.. ఓరిబాబు క్వారంటైన్ అంటే మేము కూడా నీదగ్గరకు రాకూడదు.. సరే భయపడకండి.. ఏం రాదులే అని ఆ అమ్మాయికి రెండు ముక్కలు ధైర్యం చెప్పి ఇంటి కొచ్చేసా... ఆ ప్రొద్దున్నే మళ్ళీ ఫోన్.. ఏంటి ?అన్నాను.. ఓ పాలి సార్ గారిని పిలుస్తారా అండి అన్నాడు.. దేనికీ? అన్నాను. కొబ్బరాకులుకావాలండి...అన్నాడు.కొబ్బరాకులా!! అవెందుకు? అన్నాను అయోమయంగా.. పిల్ల పెద్దది అయ్యిందండి అన్నాడు ముసి ముసి నవ్వులు నవ్వుతూ... ఇష్హ్.. అదికాదయ్యా ఇప్పుడు ఈ క్వారంటైన్ లో అవసరం అంటావా!! ఏదో ఇంట్లో ఉన్న చాప తో సరిపెట్టెసుకోరాదు అన్నాను.. అయ్యబాబోయ్ శాస్త్రం ఒప్పుకోదండి కొబ్బరాకుల మీదే కూర్చోబెట్టాలి... అన్నాడు మొండిగా.. ఐతే ప్రెసిడెంట్ని అడుగు మా ఆయన్ని కాదు అన్నాను కోపంగా... అంతే లేండి.. మీ పాప పెద్దది అయినప్పుడు నా చేతే తెప్పించారు గుర్తుందా.. అవన్ని మర్చిపోయారు..మీకేం మీ పిల్ల గట్టేక్కేసింది.. మేము పేదోళ్ళం కదండి..పెద్దోళ్ళు మీరు సాయం చెయ్యడానికి ఎనకాడితే ఎలాగండి ఒక్కగానొక్క కూతురు.. .అంటూ సెంటిమెంట్తో చావగొడుతుంటే ...అది కాదు..ఇప్పుడు రెడ్ జోన్ కదా ..బయటకు పంపరు కదా అన్నాను అనునయంగా..నాకు తెలియదేటండి.. నిన్న మీరు అంతలా చెప్పాకా.. మన వెనుక ప్రహరి గోడ ఉందికదండీ దానెనుక కొబ్బరి చెట్టు ఉందండి..సార్ గారు అడిగితే వాళ్ళు ఇస్తారు కదండి.. మేము అడిగితే ఇవ్వరండి.. ఎందుకంటే మేము పేదోళ్ళం కదండీ.. ఒప్పుకోరండి..ఓర్నాయనా నీ పేదపురాణం చల్లగుండా..ఇక ఆపు ఆయన నిద్ర లేవగానే పంపుతా కొబ్బరి చెట్టు ఎక్కిస్తావో తాడి చెట్టు ఎక్కిస్తావో మీ ఇద్దరూ పడండి అనేసి పోన్ పెట్టేసా.. రోజూ పేపర్ ముందేసుకోవడం.. ఏదో వేక్సినో మందో కనిపెట్టారెమో అని ఆశగా చూడటం... ఈ పేపరోళ్ళు అంతకన్నాను... ఇదిగిదిగో వేక్సిన్ వచ్చేసింది.. త్వరలో కరోనా ఖతం అని హెడ్డింగ్ పెడతారు.. గబగబా మొత్తం చదివితే చివ్వర్లో అశ్వద్దామా హతహః కుంజరహః అన్నట్లు ఇంకో సంత్సరంలో తప్పకుండా వచ్చేస్తుంది అని చల్లగా చెప్పడం.. సంవత్సరం తర్వత ఎవరికి అవసరం?.. రెడ్ జోన్ లో ఇంటిదగ్గరే కూరగాయలు అమ్ముతారు కాబట్టి కాయగూరలు కొనడానికి వెళ్ళా.. కూరలబ్బాయి అర నిమిషానికోసారి ముక్కు మీద కర్చీఫ్ తియ్యడం బరబరమని గొకడం మళ్ళీ కర్చీఫ్ పైకి లాగడం.. నా నోరు ఊరుకోదుగా.. ఇప్పుడూ.. మూతికి ఎందుకు కట్టుకున్నావ్ అది అన్నాను.. కరోనా కదండి ఇది కట్టుకుంటేనే బయటకు వెళ్ళనిస్తున్నారండి ఇప్పుడు అన్నాడు.. అది సరే ఎందుకు కట్టుకోవాలి అంటున్నా... వైరస్ ముక్కులోకి వెళ్ళిపోద్ది అండి.. అన్నాడు ఇవన్ని నన్ను ఎందుకు అడుగుతున్నావ్ అన్నట్లు చూస్తూ... కదా.. మరి నువ్వు పాతికసార్లు ఈ కూరగాయలు అన్ని ముట్టుకుని అదే చేత్తో ముక్కు బర బర గోకేవనుకో వాటి మీద ఉన్న వైరస్ ముక్కులోకి వెళుతుందిగా... అందుకే ముక్కుని చేత్తో ముట్టుకోకూడదన్నమాట ..అసలే బయట మార్కెట్లనుండే ఎక్కువగా ఇది అందరికి అంటుకుంటుంది అన్నాను.. హమ్మయ్య ఒకరికి జ్ఞానోదయం చేసా అన్న సంతృప్తితో.. తీరా చూస్తే అతను ఉల్లిపాయలు తూయడం మానేసి కరెంట్ షాక్ కొట్టినవాడిలా బిగుసుకుపోయి భయంగా చూస్తూ అంటే ఇప్పుడు నాకు కరోనా వచ్చేస్తాదా అండీ అన్నాడు.. నేను కంగారుగా.. అబ్బెబ్బే ఈ రోజు ముట్టుకుంటే వచ్చేసింది అని కాదు.. ఇకమీదట అలా చెయ్యకూడదు అని చెప్తున్నా అన్నాను... అది కాదండీ ఈ విషయం తెలియకా దురదపుట్టేస్తుందని రోజూ ఇలాగే గోకుతున్నానండి..మా ఆడదానికి అసలే వొంట్లో బాగోదు.. ఇద్దరూ ఆడపిల్లలు.. ఇంకా పెళ్ళి కూడా చెయ్యలేదమ్మా ఏడుపు గొంతుతో చెప్తున్నాడు... నాకేం చెప్పాలో అర్ధం కాలేదు.. అంటే అది.. మరి.. అందరికీ వచ్చేస్తుంది అని కాదు.. వచ్చినా ఏం కాదట.. ఎవరో బీపి ,షుగరు ఉన్న వాళ్ళకి తప్పా మామోలోళ్ళకు ఏం కాదట.. ఉల్లిపాయలు కేజి ఇవ్వవా అన్నాను.. తొందరగా అక్కడినుండి వెళ్ళిపోదామని..అసలే పొయ్యిమీద కూర పెట్టేసొచ్చా... నాకు బీపి, షుగరు రెండూ ఉన్నాయమ్మా ఈ సారి మరింత భయంగా అన్నాడు... నాకేం చెప్పాలో తెలియలేదు.. అంటే మరి నీకు ఇప్పటికిప్పుడు వచ్చేసినట్లు కాదుగా.. జలుబు, దగ్గు ,జ్వరం అట్లాంటివి వస్తే అప్పుడు ఆలోచించాలి.. ఉల్లిపాయలు కేజీ అన్నాను.. తుమ్ములొచ్చినా అది జలుబే అవుతాదా అమ్మా నాకు అస్తమాను తుమ్ములొస్తాయి అన్నాడు. నేను దీనంగా చూసా..ఇంతలో 202 పోర్షన్ ఆయన దిగాడు ఏంటండీ కరోనా టైంలో కబుర్లా హిహిహి అని నవ్వుకుంటూ.. అరే.. డబ్బులు తేవడం మర్చిపోయా.. మీరు తీసుకుంటూ ఉండండి ఇప్పుడే వస్తా అని ఇంటికి పరిగెట్టుకొచ్చేసా... రాత్రి బట్టలు ఆరబెడుతుంటే ఎదురుగా ఉన్న ఏడు పోర్షన్ల ఇంటి పెరడులో ఒక ఇరవైమంది జనాలు రెండు వర్గాలుగా విడిపోయి వాదించుకుంటున్నారు.. లాక్డవున్ పెట్టడం తప్పా ,ఒప్పా అనే పోయింట్ మీద.. ఒకపక్క పేకాట ఆడి పాతిక మందికి ...అష్టా, చెమ్మా ఆడి ముప్పై మందికి వచ్చిందని టీవీల్లో ఊదరగొడుతుంటే ఈ ఉప్పర మీటింగులు ఏంటిరా బాబు అని ఒక చెవేసి వింటున్నా.. అమెరికాయే అతలాకుతలం అయిపోతుంది 134 కోట్ల జనాభా.. ఏటయిపోతారనుకున్నావ్ లాక్ డవున్ ఎత్తేస్తే ఎవరో అంటున్నారు.. ఒయబ్బో అదొచ్చి చస్తామో బ్రతుకుతామో తెల్దుగాని ఆటో కిస్తా కట్టి రెండు నెలలవుతుండి... షాపుల్లేవు మాకు వచ్చే కిరాయే ఆడ కస్టమర్ల నుండి వొత్తాది.. ఆళ్ళు ఇళ్ళల్లో కూచుంటే రేపు లాక్డవున్ ఎత్తేస్తే ఎట్టా చావాలా.. కరోనా కంటే ఆకలితో చచ్చేలా ఉన్నాం.. అతని బాధ మూడంతస్తుల పైన వరకూ స్పష్టంగా వినబడుతుంది.. ఒక పక్క వలసకూలీలు వెతలు మరోపక్క బడుగు జీవుల కతలు..అయిన వాళ్ళ దగ్గరకు కష్టంలో వెళ్ళ లేని పరిస్తితి.. ఎవరి బాధలు వారివి.. ఏం చెయ్యాలో తెలియడంలేదు.. హాల్లో టీవిలో నుండి మెల్లగా వినబడుతుంది... గత యాబయ్యేళ్ళుగా ఏ ప్రభుత్వం చెయ్యలేని పని కరోనా చేసింది...స్వచ్చమైన నీటితో ప్రవహిస్తున్న గంగా యమునా నదులు.. వేల రకాల పక్షులు తరలి వస్తున్నాయి.. ప్రకృతి తనని తాను రిపేర్ చేసుకుంటుంది... వీరిచే పోస్ట్ చేయబడింది నేస్తం వద్ద 10:53 AM 23 కామెంట్‌లు 10, అక్టోబర్ 2012, బుధవారం తాళి చంద్రమతి తాళి భర్త హరిశ్చంద్రుడికి మాత్రమే కనబడుతుందట..అందుకే చీకటిలో స్మసానంలో కాటికాపరి తాళి అడిగితే అతనే హరిశ్చంద్రుడని ఇట్టే అంటే అట్టేకనిపెట్టేస్తుంది చంద్రమతి అని పురాణాలు ఘోషించాయని మా తాతయ్య చిన్నప్పుడు ఏ ముహూర్తాన చెప్పారో అప్పటి నుండి తాళి అనేడిది భర్తకు మాత్రమే కనిపించే వస్తువని ఇతరులు ఎట్టిపరిస్తితుల్లో చూడరాదని నాకు మైండ్లో ఘా..ట్టిగా ఫిక్స్ అయిపోయింది... అందుకేనేమో చిన్నప్పుడూ అమ్మావాళ్ళతో పాత సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సినిమాల్లో గో..ప్ప పతిభక్తి కలిగిన వీరోయిన్లు తాళి బొట్టు పైకే వేసుకుని భర్త పాదాలకు నమస్కరించినా , గుళ్ళుకీ గోపురాలకి తిరిగేసి పద్దాకా కళ్ళకద్దుకుని తెగ కష్ట పడిపోతున్నా మా గొప్ప చిరాకొచ్చేసి సినిమా మధ్యలోనే ఇంటికెళ్ళిపోదాం అంటూ పేచీ పెట్టేసేదాన్ని.. అదొక్కటేనా మా మేనత్త ఈ తాళి విషయంలో రోజుకో సెంటిమెంట్ చెప్పి తెగ భయపెట్టేసింది ...తాళి బొట్టు నిద్రపోయి లేవగానే మెడ వెనుకగా వీపు వైపుకు చేరితే భర్త రెండో పెళ్ళి చేసుకుంటాడట... తాళి బొట్టు కొత్త చైను మారుస్తున్నప్పుడు ఇలా మెడలో తీసి అలా కంసాలికి ఇవ్వగానే వాళ్ళ ఆయనకు చెయ్యి విరిగిపోయిందట ..అందుకే ఏదో పధ్యం చదవాలట.. ఎవరికన్నా తాళి బొట్టు ఎరువుగా ఇస్తే(ఇవి కూడా అప్పులు,ఎరువులు ఇచ్చుకుంటారా !!!) గనుక దాన్ని మరగేసి వేసుకోమని వాళ్ళకు చెప్పాలట..లేకపోతే వీళ్ళ ఆయన ఆ అమ్మాయికి దాసోహం అయిపోతాడట..అబ్బో ఇలాంటివి చాలా చెప్పేసి..తాళి అనగానే తుళ్ళిపడేలా భయంపెట్టేసింది మహా తల్లి... కాని ఈ మంగళ సూత్రం విషయంలో ఒక్కో అమ్మాయికి ఒక్కో నిర్ధిష్టమైన అభిప్రాయాలు ఉంటాయని..అందరూ నాకులా ఎదుటివాళ్ళు ఏం చెప్తే అదివినేసే రకాలు ఉండరని మా అక్క పెళ్ళయ్యాకే తెలిసింది ... అక్క పెళ్ళయిన కొత్తలో ఓ ఆరునెలల పాటు అది స్నానం చేసిన గంటకి మా నాన్నకి బిపి ఓ రేంజ్లో పెరిగిపోయేది... "శారదా!!" అని ఆయన శంకరశాస్త్రి అవతారం ఎత్తగానే మేమందరం అక్క మెడవైపు చూడటం అది యధావిది గా నాలుక్కొరుక్కుని మా వైపో క్లోజ్ అప్ యాడ్ ఇవ్వడం ఆ వెంటనే అమ్మ " పెళ్ళయిన పిల్లకి ఇంత మతిమరపు ఉండకూడదమ్మా..హవ్వా ఎవరన్నా స్నానం పేరు చెప్పి మంగళ సూత్రం కొక్కాలకు,మేకులకు తగిలించి వదిలేస్తారా..ఎవరన్నా వింటే నవ్విపోతారు..అక్కడ కూడా ఇలాగే చేస్తున్నావా.. అని క్లాస్ పీకడం మాకు అలవాటయిపోయింది.. ఓ రోజు ఈ బాధ పడలేకా..మా అక్కకు ఎలాగయినా జ్ఞానోదయం కలిగిద్దాం అనే సంత్సంకల్పంతో చంద్రమతి కధను అక్కకు చెప్పాలని నిర్ణయించుకుని ,ఎందుకయినా మంచిదని ఒకసారి హరిశ్చంద్రుడి సినిమా చూసి మరీ ప్రిపేర్ అయివచ్చాను..కొద్దిగా చెప్పానో లేదో అది మధ్యలోనే ఆపేసి.." ఒసే పిచ్చ మొహమా మిగతా పురాణాలన్ని మగవాళ్ళు రాసినా ఈ చంద్రమతి స్టోరీ లో ఈ పార్ట్ మాత్రం ఖచ్చితంగా అమ్మాయే రాసింది... ఇప్పుడు తాళి బొట్టు అందరికీ కనబడేలా వేసుకుని తిరిగామనుకో మనకి పెళ్ళయిపోయిన విషయం తెలిసిపోతుందికదా.. అప్పటివరకూ మనల్ని చూడగానే కళ్ళల్లో మతాబులు వెలిగించుకున్న అబ్బాయిలందరూ ..ఆ.. దీనికి పెళ్ళయిపోయింది ఇంకో అమ్మాయిని చూసుకుందాం అనేసుకుని వెళ్ళిపోతే మనసెంత గాయపడుతుంది ..అందుకే అన్నమాట భర్తకు తప్పించి ఇంకెవరికీ తాళి చూపకూడదని నియమం పెట్టారు..కాబట్టి నాన్నా,అన్న,తమ్ముడు లాంటి కొంతమందికి తప్పా ఇంకే మగాడికీ చూపించకూడదు అన్నమాటా.. పాపం నాన్నకు ఆ విషయం తెలియదంతే "అని నాకే జ్ఞానోదయం చేసి వెళ్ళిపోయింది.. .. మరోసారి మా పెళ్ళయిన కొత్తలో ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే నీ తాళిబొట్టు ఏ చేత?? లక్క చేతా,జల్లెడ చేతా అని అడిగింది.."అంటే" అన్నాను అర్ధంకాక ... "ఏది నీ మోడల్ చూపించు చెప్తాను "అని బయటకు తీసి అదిరి పోయి బెదిరిపోయింది...అసలు మన తాళి అంటే ఆషా మాషీనా ఎంచక్కా ఫ్రెష్గా పౌర్ణమి నోములు చేసుకుని కట్టుకున్న చంద్రికలు,ఇంకేదో నోముకోసం కట్టుకున్న పసుపుకొమ్ములు..,వరలక్షివ్రతం రూపులు ,చీరకోసం అని అట్టే పెట్టుకున్న ఓ అయిదారు పిన్నులుతో కళ కళ లాడిపోతుంది .. "ఏంటే ఇది పూసలదానిలా ఈ దారాలేమిటి,కుంకాలేమిటి" అని దులిపేసింది.. "అదికాదే..సెంటిమెంట్ ... భర్త క్షేమం కోసమనీ చేయించారుగా అన్నాను "నసుగుతూ. అది కూడా సేం మా అక్కలాగే సంబోధిస్తూ "ఓసి పిచ్చి మొహమా తాళి అంటే ఎవరు??భర్త ...భర్తకు మారు రూపం తాళి..అటువంటి భర్తను నీట్గా ఉంచుకోవాలా వద్దా? మన అమ్మమ్మలు,నాన్నమ్మలు,అమ్మలు ఈ పురుషాధిక్య ప్రపంచంలో భర్తలను ఏమి అనలేక ఆ కసికోపం ఇలా భర్తకు మారు రూపమైన తాళికి పసుపులు కుంకాలు రాసేసి పిన్నులతో అలంకరించి మరీ తీర్చుకుంటారు..ఇప్పుడు జమనా బదల్ గయారే..కోపం వస్తే ఆ రాసేదో డైరెక్ట్గానే రాసేయచ్చు...కాబట్టి మన తాళి జిగేల్ జిగేల్మని మెరుస్తూ బాగుంటే మన బట్టలూ బాగుంటాయి ,భర్తా బాగుంటాడు.. అర్ధం అయ్యిందా అని మరో గొప్ప విషయం చెప్పింది... ఇదిలా ఉంటే మా ఆయనకో కంప్యూటర్ ఇన్సిట్యూట్ ఉండేది ... అప్పట్లో ఒక అమ్మాయి మానస అని వచ్చేది.... ఆ అమ్మాయి వస్తే చాలు జనాలందరూ ఎక్కడిపనులు అక్కడ వదిలేసి మరీ ఆ అమ్మాయిని తొంగి తొంగి చూసేవారు.. ఎందుకంటే మరి ఆ రోజుల్లో రెండు కోట్లు కట్నం ఇచ్చి పెళ్ళిచేసుకుందంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుందికదా .. ఏదో సామేత చెప్పినట్లు "తా దూర కంతలేదుగాని మెడకో డోలు" అని నాకొకటి కంప్యూటర్ రాదుగాని ఈ పిల్లను నాకు అప్పచెప్పారు నేర్పించమని...నేను ఎంచక్కా నాకొచ్చిన గేంస్ అన్ని నేర్పించేసి..పెయింట్ బ్రష్లో ఎడాపెడా నాలుగు బొమ్మలు గీసి చూపించేసి ఆ తరువాత ఎంచక్కా ఇద్దరం అత్తవారింట్లో ఆరళ్ళ గురించి ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళం .. ఆ అమ్మాయి ఎప్పుడూ రాత్రి ఎనిమిది గంటలకు వెళ్తూ వెళ్తూ మెట్లు ఎంత స్పీడ్గా దిగివెళ్ళేదో అంతే స్పీడ్గా పైకొచ్చేసి అమ్మో మర్చిపోయాను అని మెడలో మంగళ సూత్రం టక్కున తీసేసి బ్యాగ్లో పడేసి వెళ్ళేది..అలా చేసినప్పుడల్లా "అదేంటండి అలా తీయకూడదు కదా భర్త కు హాని చేసినట్లుకదా" అని బుగ్గలు నొక్కుకొనేదాన్ని... "మీరు భలే వాళ్ళండి భర్తను ఎక్కడన్నా వదిలేసి వచ్చినా సేఫ్గా ఇంటికొచ్చేస్తాడు..అదే బంగారం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా ...అయినా భర్తను ఒక సారి పెళ్ళి చేసుకున్నాకా వేల్యూ తగ్గుతుందేమోగాని పెరుగదు కదండి.. అదే బంగారం అయితేనా పెరగడమే పెరగడం అందునా నా తాళి పది కాసులు పెట్టి చేయించారు ..మీరెన్నన్నా చెప్పండి భర్త కంటే తాళే గొప్పది " అని ఇంకో గొప్ప విషయాన్ని నాకు చెప్పి జ్ఞానోదయం కలిగించింది.. ఇక అన్నిటికంటే లాస్ట్ జ్ఞానోదయం మొన్న జరిగింది..మాకో బీరకాయ పీచు అత్తగారు ఉన్నారు ..మొన్న వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆవిడ హడావుడిగా ఎక్కడికో వెళుతూ కంగారు పడిపోతుంది.."ఏమిటి అత్తయ్య ఏమైనా హెల్ప్ కావాలా " అనగానే "ఓ ఫ్రెండ్ కూతురి పెళ్ళికి వెళ్ళాలి.. అన్ని నగలు సెలెక్ట్ చేసుకున్నా కాని తాళి బొట్టు ఏం సెలెక్ట్ చేసుకోవాలో తెలియడం లేదు అంది"...నేను విన్నది కరక్టేనా అని డవుటొచ్చి పక్కకు చూస్తే మంచం మీద ఒక అయిదారు మంగళ సూత్రాల సెట్టులు జిగేల్మంటూ కనిపించాయి...ఏంటి క్రింద పడిపోయారా ...మరదే నేను ఈ మధ్య కాస్త ఇలాంటి వాటికి రాటుదేలాను లెండి అందుకే వెంటనే తేరుకున్నా..మూడు కాసుల నుండి పదిహేను కాసులవరకూ వివిద రకాల చైన్లతో ,మధ్య మధ్య రాళ్ళు పొదగబడిన పతకాలు కూర్చి జిగేల్మనిపించే సూత్రాలన్నమాట.. ఆగాండాగండి ఇప్పుడు మీరేం అనుకుంటున్నారో చెప్తాను..మరీ విడ్డూరం కాకపోతే ఇన్ని తాళి బొట్టులు చేయించడం ఏమిటి ..ఎక్స్ట్రాలు అనేకదా... ..తప్పుకదా ..పైన అన్ని ఉదాహరణలు ఇచ్చినా అలా నెగిటివ్గా ఆలోచిస్తారా..నా అనుభవాల దృష్యానేను దీనికి మీనింగ్ చెప్తాను..ఇప్పుడూ తాళి అంటే ఏమిటి ..భర్త ..భర్త అంటే తాళి ...ఎంత సేపూ మన సోకులకే గాని భర్తకి ఏమన్నా చేయిద్దామని ఆలోచన మన ఆడవాళ్ళకు ఏ కొసన అయినా వస్తుందా..అబ్బే ... అందుకే మన భర్త గౌరవం మన భాద్యత కాబట్టి భర్తకు మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఇలా తాళినన్నా రక రకాల మోడల్స్లో చేయించుకుని భర్త గౌరవాన్ని నలుగురిలో గొప్పగా చాటుదాం.. అదండి మగ మహారాజులు సంగతి..అందుకని తాళి కట్టడంతోనే మీ బాధ్యత అయిపోలేదు..మీ గౌరవాన్ని మేము నిలబెట్టేలా మీరు కృషి చేయాలి ..అది సంగతి ..ఏమంటారు లేడీస్ ... వీరిచే పోస్ట్ చేయబడింది నేస్తం వద్ద 8:33 PM 91 కామెంట్‌లు 12, మే 2012, శనివారం సంతూర్ సంతూర్ ఎక్క్యూజ్ మీ..... ఏం కాలేజ్ చదువుతున్నారు .... కాలేజ్ నేనా ?????? మమ్మీ!!!!!!!! ... పసుపు చందనా గుణాల కలయికా సంతూర్ చర్మం మిల మిల మెరిసే ఇక సంతూర్ సంతూర్ ..................................... యాడ్ చూడగానే ఘాడంగా నిట్టూర్చాను ఆ రోజు ప్రొద్దున్న జరిగిన సంఘటన గుర్తొచ్చి ..... అచ్చం ఇలాగే ఆ యాడ్లో అమ్మాయిలా ఒక్కదాన్నే నడుచుకుంటూ వెళుతుంటే ఒక అమ్మాయి పరిగెత్తుకుని వచ్చి నా ఎదురుగా నించుని ఆయాసం తీర్చుకుంటూ "ఎక్స్క్యూజ్ మీ!!! ..ఏం కాలేజ్ చదువుతున్నారు" అంది.....చేతిలో ఏదో అడ్డ్రెస్ పుచ్చుకుని .... "కాలేజ్ నేనా !!! " రెండో డైలాగ్ ఫర్ఫెక్ట్ గా చెప్పాను ఏడుపు మొహం వేసుకుని... ఆ అమ్మాయికి డవుట్ వచ్చి మూడో డైలాగ్ చెప్పేవాళ్ల కోసం చుట్టూ చూసి నా కాళ్ళ వైపు చూసింది అనుమానంగా... గొప్ప అవమానం అయిపోయింది.."నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా "కోపంగా అనేసి మా స్కూల్లోకి పరిగెత్తాను.. ఆ అమ్మాయి టైడ్ యాడ్లో మురికి చొక్కా అబ్బాయి తెల్లషర్ట్ అబ్బాయిని చూసి అవాక్కయిపోయినట్లు అవాక్కయిపోయింది... రెండో సంఘటన..... "బుజ్జీ బుజ్జీ బుజ్జీ ...నీ వళ్ళంతా గజ్జి ...."మా పెద్ద తమ్ముడు ఆరువందల అరవయ్యోసారి ఏడిపించడం మొదలెట్టాడు.. నేను చెవులు గట్టిగా మూసుకుని ..."ఆ... ఏంటో ...నాకేం వినిపించడం లేదు ...నువ్వు ఏదో పెదాలు కదుపుతున్నావు అంతే..నా కసలు వినిపించనే లేదు.." పైకి బింకంగా అనేసి మా అమ్మ దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి... రెండుకాళ్ళు నేల కేసి టప, టపా కొడుతూ .."అన్ని ముద్దు పేర్లు ఉండగా ఎందుకమ్మా నాకు బుజ్జీ అని పెట్టావు..పెద్దమ్మ చూడు ఎంచక్కా పెద్దక్కను చిన్నూ అంటుంది.. దీన్నేమో శారు అంటారు ...దాన్ని బేబి అంటారు.. నన్నే ఎందుకమ్మా బుజ్జీ,బజ్జీ అని సుత్తి పేరుతో పిలుస్తారూ.. అని ఏడుస్తూ అడిగాను.. "ఎహే ఆపు..బుజ్జిగా ఉండేదానివి కాబట్టి బుజ్జీ అనేవాళ్ళం.. వాళ్ళు నీకులా లేరుకాబట్టి అనలేదు " మా అమ్మ సింపుల్గా కొట్టిపడేసింది.. "అది బుజ్జిగా కాదులే వదినా బండదానిలా ఉండేది ... ఎత్తుకోలేక చచ్చేవాళ్ళం ....కదా పెద్దోదినా.. మా ఆఖరు చిన్నాన్న పెద్దమ్మను రంగంలో దింపాడు..(కావాలనే అన్నాడు నాకు తెలుసు ) "మరే...పుట్టినప్పుడు ఎంచక్కా ౩ కేజీల బరువుతో ఎంత బొద్దుగా ఉండేదని .... మోయలేక పోయేవాళ్ళం ..పెద్దమ్మ తూకాలు, కొలతలతో సహా ఆధారాలు ఇచ్చేసింది.. "అచ్చే ..మూడు కేజీలు కాదక్కా మూడున్నర అనుకుంటా " .... మా అమ్మను చూసినప్పుడల్లా అమయాకత్వానికి కేరాఫ్ అడ్రెస్స్ మా ఇల్లే అనుకుంటాను ... ముచ్చటగా మూడో సంఘటన ...... "నా పెద్ద మనవరాలిని ( మా అక్క అన్నమాట) ఈ ఇంటి కోడలిని చేసుకుంటా అని నా కూతురుకి మాటిచ్చాను.. అది కాదని ఇంకేవరినయినా తీసుకొచ్చి నా కొడుక్కి ( మా చిన్న మావయ్య) చేసారో ....ఖబడ్దార్ ...." మా అమ్మమ్మ హోల్సేల్గా అందరికి కలిపి వార్నింగ్ ఇచ్చింది ..... "మేనరికాలు మంచివి కావంటా ... పిల్లలు అంగ వైకల్యంతో పుడతారంట ... రేపు జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు ఏడ్చి లాభం ఉండదు.. వాడికి బయట సంబంధమే చేస్తాను ఎవరు అడ్డం వస్తారో చూస్తాను .."మా తాతయ్య మా అమ్మమ్మకు మాత్రమే వార్నింగ్ ఇచ్చారు.. "అమ్మా ...నేను దాన్ని చిన్నప్పటి నుండి ఎత్తుకుని తిప్పాను..చిన్న పిల్ల ..దానికి నాకు పదేళ్ళు తేడా ఉంది ....పెళ్లయినా మానేస్తాను కాని దాన్ని చేసుకోనంతే "మా మావయ్య బెదిరించాడు.. "నువ్వు నోరు ముయ్యి, దాన్ని నువ్వు చూసి నాలుగేళ్లయింది .... ఇప్పుడెంత చక్కగా ఉందో తెలుసా ....ఆడపిల్ల ఎంతలో ఎదిగిపోవాలి ... నా మాట కాదని వేరే ఎవరినైనా చేసుకున్నావో నా ఫోటో మాత్రమే చూస్తావు తర్వాతా " .. అంతే ఆ తరువాత పే..ద్ద...ఆ పే..ద్ద ..ఆ గొడవలు అయిపోయి మా అమ్మమ్మ ఊరికి ,మాకు దాదాపు ఆరు సంవత్సరాలు రాకపోకలు లేకుండా అయిపోయాయి... చివరాఖరికి మా అమ్మమ్మను బలవంతంగా ఒప్పించేసి మా మావయ్యకు వేరే అమ్మాయితో పెళ్లి కుదిరాక, పది రోజులు ముందుగా నన్ను పంపించారు పెళ్ళికి ... అదేంటో అమ్మమ్మ ఇల్లంటే ఆడపిల్లలకు గొప్ప అలుసు కదా.. బస్సు దిగగానే రోడ్ మీదే మొదలు పెట్టాను నా చిట్టా పద్దు కోరికలు.."మావయ్య నాకు విసిఆర్ కావాలి .. ముఖ్యంగా అమీర్ ఖాన్ ఖయామత్ సే ఖయామతక్ సినిమా తెప్పించాలి... ఇంకా 1942 ఏ లవ్ స్టోరి కావాలి ....ఇంకా ".. "ఇంక నోరు మూస్తావా ... ఇది పల్లెటూరు ..ఇక్కడ హిందీ సినిమాలు ఎవరు చూస్తారు ???...ఆడపిల్లన్నాకా సుబ్బరంగా పెద్ద వాళ్లకు హెల్ప్ చెయ్యాలి ..ఇలాంటి పిచ్చి సినిమాలు చూడకూడదు.." మావయ్య క్లాస్ పీకాడు... "నాకు సినిమాలు చూపించవా!!!! ..నేను మా ఊరు వెళ్ళిపోతాను పో..నా బ్యాగ్ నాకిచ్చేసే..అమ్మమ్మ కి చెప్తాను నీ పని "...అని రోడ్ మీద చిందులు తోక్కేస్తుంటే .... అల్లం మామ్మ చూసింది దూరం నుంచి..(ఆవిడ పేరేమిటో తెలియదు అల్లం మామ్మ అంటారు).. "ఎవర్రా చిన్నోడా నీతో ఉన్న అమ్మాయి " ఘాట్టిగా పిలిచ్చింది .... "చూసేసిన్దిరా బాబు "విసుక్కుంటూ ...మా అక్క కూతురు మామ్మా అన్నాడు.. "ఎవరూ మన పెద్దమ్మడు కూతురే... దీన్నేనా చిన్నపిల్ల అని చేసుకోనన్నావు "నన్ను దగ్గరకు తీసుకుని అడిగింది ఆరాగా ..నేను ఎంచక్కా జామకాయ తింటూ పక్కన కూర్చున్నాను.. మరి ఎక్కడి నుండి వచ్చిందో మా అమ్మమ్మ .... "ఇదికాదు పిన్ని దీనికంటే పెద్దది.. మహా లక్ష్మిలా ఉంటుంది ..వెధవ సచ్చినోడికి చిన్నపిల్లలా కనబడిందట "..మా అమ్మమ్మ మొటికలు విరిచేసింది.. "ఇది చిన్నపిల్లేంటి ..బంగారు బొమ్మలా ఉంది ..చక్కగా చీరకట్టి రూపయకాసంత బొట్టు పెడితే ఇద్దరు పిల్లల తల్లిలా ఉంటుంది ... నీకేం పోయేకాలంరా అని కయ్ మంది అల్లం మామ్మ .. వాళ్ళ పొగడ్తలకు సంతోషించాలో ,లేక వేరే కోణంలో బాధపడాలో తేల్చుకోక మునుపే ఎంచక్కా నాలుగు వీధుల్లో ఆడవాళ్ళు పోగయిపోయి (పల్లెటూరు కదా...ఒక ఇంటి సమస్య ఊరంతటికి కావాలి ) మా మావయ్యని, పనిలో పని మా తాతయ్యని బోలెడు తిట్లు, శాపనార్ధాలు పెట్టేసి మా అమ్మమ్మని ఓదార్చి వెళ్ళిపోయారు..(మా అల్లం మామ్మ మాత్రం ఆ తరువాత దాదాపు అయిదేళ్ళు మా మావయ్యను ఏకి, పీకి పందిరేసిందట ..ఈ ముక్క మా చిన్నత్త వచ్చినప్పుడల్లా చెప్పి నవ్వుతుంది) ఆ దెబ్బతో మా మావయ్య నన్ను ఇంటికి తీసుకువెళ్ళి .."నిన్నేవడే పది రోజులు ముందు రమ్మనాడు..నీకు అమీర్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ ,షారుఖ్ ఖాన్ ఏ ఖాన్ కావాలంటే ఆ సిన్మాలు ..మా వూర్లో దొరక్కపోతే పక్కూరు నుండి అయినా తెచ్చి పడేస్తాను కాని నువ్వు గుమ్మం దాటి బయటకురాకు తల్లో "అని దీనంగా వేడుకున్నాడు.. అక్కడితో ఊరుకున్నాడా దొంగ మొహం ....ఎంచక్కా పెళ్ళిలో కట్టుకుందామని నేను ముచ్చట పడి కొనుక్కున్న పరికిణి ,వోణి వేయనివ్వకుండా "అక్కా దీన్ని చూసి ఇదే పెద్దదనుకుని సంబంధాలు వచ్చేస్తున్నాయి..తర్వాత నీఇష్టం" అని మా అమ్మ మనసు చెడగోట్టేసాడు... ఆ దెబ్బతో నేను అరిచి గీ పెట్టినా మా అక్క పెళ్లి అయ్యేంత వరకూ మహా తల్లి నన్ను పరికిణి ,వోణి వెయ్యనివ్వలేదు.. ఆ తరువాత నేను కొత్తవి కొనుక్కునేలోపే నా పెళ్లి చేసేసారు ..అలా నా జీవితంలో పరికిణి ,వోణి అనేది ఒక కల క్రింద మిగిలిపోయింది. ఇలా ఉండగా మరి మా అమ్మకు ఎవరు ఏం చెప్పారో మరి పాపం..ఒక రోజు నా దగ్గరకొచ్చి బుజ్జీ! మరేమో ఈ రోజు నుండి రాత్రిళ్ళు నువ్వు చపాతి తిను అంది ...నేనసలు మూడు పూటలా ఆరు సార్లు అన్నం పెట్టినా తింటాను గానీ ఒక పూట టిఫిన్ తినమంటే ఏడుస్తా .." ఏంటి చపాతీయా..ఛీ ఛీ నావల్లకాదు "అని తేల్చి చెప్పేసాను ... అలాకాదుగాని రాత్రిళ్ళు చపాతి తింటే చాలా మంచిదంట తినాల్సిందే అని ఆర్డరేసి వెళ్ళింది.. సరే అని చపాతి ప్లేట్ ముందు పెట్టుకోగానే మా అక్క ఎదురుగా ఆవకాయ అన్నం నెయ్యి వేసుకుని ఎంచక్కా తింటుంటే ఆగలేక ఆ పళ్ళెం పక్కన పడేసి మామూలుగానే అన్నం తినేసా..అమ్మొచ్చి ప్లేట్ చూసి "అదేంటి చపాతి తినలేదా "అంది ... "ఉహు నాకొద్దు ఆ ఆరోగ్యమేదో నువ్వే తెచ్చుకో ..అయినా వాళ్ళెవరికీ పెట్టకుండా నాకే పెడతావేంటి..వాళ్ళకు అక్కరలేదా ఆరోగ్యం "విసుగ్గా అన్నా.."ఒసే గాడిదా..నువ్వు ఇలా అన్నం తింటే వళ్ళు తగ్గదు.. ఎవడూ నిన్ను పెళ్లి చేసుకోడు" కోపంగా అనేసి వెళ్ళిపోయింది... అంతే మేటర్ క్లియర్గా అర్ధం అయిపోయింది.. ఆ షాక్ కి ముందు ఏడుపోచ్చ్సింది, తరువాత కోపం వచ్చింది ,ఆ తరువాత నోట్లోంచి పాట వచ్చింది..దేవుడి రూంలోకి వెళ్లి నాకు తెలిసిన దేవుడి పాటలన్నీ పాడేసుకుని ...హే భగవాన్ ..నేనేం తప్పు చేసాను... తిండి కూడా ఏం తినను కదా మరెందుకు ఇలా నన్ను లావుగా చేసేస్తున్నావు..నాకసలే ఎక్సర్ సైజులు,డైటింగు లు గట్రాలు పడవు..నువ్వేం చేస్తావో నాకేం తెలియదు పెళ్లి అయ్యేలోపు నేను సన్నంగా మెరుపు తీగలా అయిపోవాలంతే అని కోరేసుకున్నా ...(దేవుడికి నేనంటే చాలా ఇష్టం .... నిజంగా నిజంగా నేను ఏమి చెయ్యకుండానే పెళ్లి టైంకి దాదాపు 12 కేజీలు తగ్గిపోయా ..ఆఖరికి పిల్లలు పుట్టినా సరే యాబై కేజీలు ఇప్పటివరకు దాటలేదు ...ఇక మీదట విషయం తెలియదనుకోండి ముందు జాగ్రత్తగా చెప్పేస్తున్నా :D) ఫ్లాష్ బ్యాకులు అయిపోయాయి..అలా నా బండతనం వల్ల ..ఛీ ఛీ...కాదు కాదు.. నా బొద్దుతనం వల్ల ఎన్ని బాధలు పడ్డానో ఒకటా రెండా ఎన్నని చెప్పను.. ఆ దెబ్బతో పైన చెప్పిన సంతూర్ యాడ్ నా మనసుమీద తీవ్ర ప్రభావం చూపేసింది.. నేను కూడా పెళ్లయినా సరే,పిల్లలు పుట్టినాసరే...స్లిమ్ముగా ,చక్కగా మెరుపు తీగలా ఉంటే,ఆ యాడ్ లోలా నన్ను కూడా ఏం కాలేజ్ అనడిగితే ,నా కూతురు మమ్మీ అని పరిగేట్టుకొస్తే ఎంత బాగుంటుందో కదా అని తెగ కలలు కనేసేదాన్ని..అసలందుకే నాకు ముందు అమ్మాయే పుట్టాలని కోరుకున్నాను కూడా :P అలా పెళ్లికాకుండానే ఒక చిన్నపిల్లకి తల్లిగా మారాకా ఎలా ఉండాలో అని తీవ్రంగా ఆలోచిస్తుండగానే పెళ్ళయిపోయింది..నేను సింగపూర్ వెళ్ళిపోయాను...పిల్లలు పుట్టేసారు ..వాళ్లకు నెస్టంలు తినిపించాడాలు,డైపర్లు మార్చడంలు ,స్కూళ్ళు,చదువులు, చట్టుబండలు వరసపెట్టేసాయి ...ఇంకేంటి నేను ఆ గోలలో పడి యాడ్ సంగతి మర్చిపోయాను .. ఆ తరువాత ఇన్నాళ్ళకు మొన్న టివి పెట్టి చూస్తుంటే మహేష్ బాబు సంతూర్ యాడ్లో వచ్చి "దేవుడు వరమిచ్చినా పూజారి పడనివ్వలేదని..నువ్వు సన్నంగా అయినా ,మొదట నీకు కూతురు పుట్టినా నీ కోరిక తీర్చుకోలేకపోయావు..రాసి పెట్టి ఉండాలి" అని సోప్ పుచ్చుకు కొట్టినంత పనిచేసేసరికి టక్కున ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది.. ఆ వెంటనే బడేలు కొంగలా నా అంత ఎత్తు ఎదిగిన నా కూతురు ని చూసి ఏడుపొచ్చింది(మా ఆడపడుచు పోలిక,పైగా ఇంతెత్తు హీలొకటి వేస్తుంది గాడిద ) ..ఎంత పనయ్యింది దేవుడా !!!! .... ఎంచక్కా దానికి 3 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఇండియా వచ్చినప్పుడల్లా దాన్ని తీసుకుని మా కాలేజ్ వైపు తిరిగితే ఎవరో ఒకరు నా కల తీర్చేవారు కదా (మనిషి ఆశా జీవి) ఇప్పుడు ఎవరంటారు నా మొహం అని ఘాడంగా నిట్టూర్చి ఊరుకున్నా ... చెప్పానుగా దేవుడికి నేనంటే బోలెడు ఇష్టం అని ...నమ్మట్లేదుగా మీరెవరూ.. సరే వినండి... అయితే మొన్న మా పక్క పోర్షన్ వాళ్ళ అబ్బాయి పెళ్లి జరిగిందని కొత్తకోడలితో సత్యన్నారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు .... పేరంటానికి రమ్మంటేనూ.... ఆ ....జస్ట్ తాంబూలమే కదా అని డ్రెస్ వేసుకుని వెళ్లాను.. జనాలందరూ హడావుడిగా తిరుగుతుంటే పెళ్లి కొడుకు చెల్లెలు రెండు మూడుసార్లు నన్ను చూసి నవ్వింది ..నేను కూడా నవ్వాను.. నాకు తెలుసు నాకు తెలుసు .. ఇప్పుడేమనుకుంటున్నారో ... ఆ అమ్మాయి వచ్చ్చి" ఎక్స్క్యూజ్మీ ..మీరేం కాలేజ్ "అని అనిఉంటుంది అనుకుంటున్నారు కదా... హిహిహి కాదు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి ఎవరా అమ్మాయి నేను ఇదే చూడటం అన్నాది..ఆయనేమో ఆ హడావుడిలో నన్ను పరిచయం చేస్తూ" నువ్వు చూడలేదు కదూ ఈ అమ్మాయిని..ఈ మధ్యనే ఇండియా వచ్చింది..మన పక్కింటిఆవిడ మనవరాలు"..అని మా అత్తగారి వైపు నా వైపు చూపిస్తూ పరిచయం చేసారు... నేనేం ఢాం అని పడిపోలేదు...అంటే పొరపాటున కోడలు అనాబోయి మనవరాలు అనేసారనుకుని ..చిన్నగా నవ్వాను...ఓ పక్కాంటీ మనవరాలా అని ఆ అమ్మాయి పలకరింపుగా నవ్వింది..""అవును వాళ్ళ తమ్ముడు కూడా ఉండాలి బయట ఆడుకుంటున్నట్లున్నాడు"" అన్నారు ఆయన ... అప్పుడు ..అప్పుడు వెలిగింది లైటు ..అప్పుడు " ఢాం "అని పడిపోయాను ..( చెప్పానా దేవుడున్నాడని..) మా అత్తగారి ఫేస్ ఎక్ప్రేషన్స్ గట్రాలు నేనేం చూడలేదమ్మా ..అందుకే నో కామెంట్ అన్నమాట .... ఈ లోపల రాబోయే ప్రమాదాన్ని గ్రహించిన వాళ్ళ ఆవిడ పరిగెత్తుకొచ్చి " ఏమండోయ్ ఈ అమ్మాయి ఆవిడ పెద్దకోడలు ....మనవరాలు కాదు అని అరిచి సారి అండీ మా ఆయన పొరబడ్డారు" అంది... ఆ తరువాత ఆయన కూడా నాలుగు సార్లు నా దగ్గరకోచ్చ్చి" సారి అమ్మా..పొరబడ్డాను..మీ అమ్మాయి నీ పోలికలే కదా..కాస్త పొడవు కదా.. అయినా మీ అమ్మాయిని దూరం నుండి చూసాను అందుకే సరిగ్గా గుర్తుపట్టలేక నిన్నే తను అనుకున్నా .." అని మొత్తుకున్నా సరే నా మెదడేంటో ఆయన చెప్పిన మొదటి మాటకే ఫిక్స్ అయిపోయింది ..పైగా వాళ్ళమ్మాయి అయితే ఇది మీకు బెస్ట్ కాంప్లిమెంట్ యూ నో అన్నాది కూడా... అయితే మిగిలినవాళ్ళు అసూయతో రక రకాల కారణాలు చెప్పి నన్ను చాలా చాలా డిసప్పొయింట్ చెయ్యాలని చూసారుగాని (అంటే మా ఆయన , ఇతర కుటుంభ సబ్యులు వగైరాలన్నమాట )..ఇష్ష్ .. తప్పు కదా పెదరాయుడు లాంటి పక్కింటి పెదనాన్న గారు అబధ్దం చెప్తారా? కళ్ళుపోతాయ్.. లెంపలేసుకోండీ.. పైగా పెద్దవాళ్ళ మాటలు మనం తప్పు పట్టకూడదు కూడానూ అందుకని అవన్ని ఇగ్నోర్ చేసేసాను..మీరు కూడా చేసేయండి..మనసులో అటువంటి వ్యతిరేకపు ఆలోచనలు రానివ్వకండి.. రావులేండి మంచివాళ్ళకు అటువంటి అనుమానాలు రావు......ఆ విషయం మీకు కూడా తెలుసనుకోండి.. ఇదంతా కాదుగాని నాకో గొప్ప డవుటేమిటంటే సంతూర్ సోప్ యాడ్ చూస్తేనే ఇంత చిన్నదానిలా కనబడిపోతుంటే అది వాడితే ఎలా ఉంటుందా అని.. బహుసా ఒక పాతికేళ్ళ తరువాత.. ఎక్స్క్యూజ్ మీ ఏం కాలేజ్ చదువుతున్నారు మీరు కాలేజ్ నేనా!!!! అమ్మమ్మా.... ( నా మనవరాలు పరిగెత్తుకొస్తూ ) వీరిచే పోస్ట్ చేయబడింది నేస్తం వద్ద 10:55 PM 67 కామెంట్‌లు 28, నవంబర్ 2011, సోమవారం నేను చూసిన మలేషియా అప్పుడెప్పుడో రాద్దామనుకున్నా పోస్ట్ అన్నమాట ఇది..నా జ్ఞాపకాల్లో ముఖ్యమైనదినూ పనిలో పని సింగపూర్ ,ఇండోనేషియ,మలేషియా చూడాలనుకునే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది అనీను రాస్తున్నా.. ముందు మలేషియా గురించి చెప్పుకుందాం..మేమసలు సింగపూర్ రాక మునుపు ఓ వెన్నెల రాత్రి చందమామను చూస్తూ విదేశాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మలేషియా ప్రస్తావన వచ్చింది ...నీకు తెలుసా బుజ్జీ సింగపూర్ నుండి మలేషియాకు సముద్రంలో వంతెన కట్టేసారట ...మా ఉదయ్ లేడూ..వాడు చెప్పాడు.. టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో కదా అనగానే నేను ఓ రేంజ్లో ఆశ్చర్యంగా నోరుతెరుచుకుని ఉండిపోయాను ... "నిజ్జంగానా...మన గోదావరి బ్రిడ్జ్ చూసే నాకు మతిపోతుంది ఎలా కట్టారా అని..... అలాంటిది ఆ అలల్లో ఇంకో దేశానికి వంతెన కట్టేయడమే ..హ్మ్మం మానవుడు సామాన్యుడు కాదండి ...ఈ లెక్కన రామాయణం నిజమే నన్నమాట ..." అని బోలెడు బోలెడు హాచ్చర్య పడిపోయాను.. విధి విచిత్రమైనది..బోలెడు అద్భుతాలు చూపిస్తుంది... ఆ మాట అనుకున్న సంవత్సరం కూడా తిరక్కుండానే నన్ను మలేషియా ఎంబసి దగ్గర నించో పెట్టింది ...సింగపూర్ వచ్చ్సిన నెలరోజులకే నేనే నేనే వీసా తెచ్చాను.. వద్దులెండి అదో పెద్ద కధ ...ఆ విషయం తరువాత చెప్పుకుందాం..ప్యాకేజ్ లలో కాకుండా మనకు మనమే స్వయంగా వెళ్లి చూసేసోద్దాం అని మా ఆయన అనేసరికి సరే అని మరుసటి రోజు రాత్రి వుడ్ లాండ్స్ అనే ఊరికి బయలు దేరాం ...మా సింగపూర్లో ఏ మూల నుండి ఏ మూలకి వెళ్ళినా గట్టిగా గంటన్నర జర్నీ ఉంటుంది ....ఇక రాత్రే ఎందుకు బయలుదేరాం అంటే .. సింగపూర్ నుండి కౌలాలం పూర్ (మలేషియా రాజధాని ) బస్లో ఒక నాలుగు గంటలు జర్నీ ఉంటుంది అంతే ...కాబట్టి రాత్రి జర్నీ వల్ల మనకు రోజు మొత్తం కలసి వస్తుంది కదా.. అయితే ట్రైన్ లో కూడా వెళ్ళొచ్చు..కాని మీరు మాత్రం ట్రైన్లో అస్సలు వెళ్లొద్దు..పరమ ,శుద్ద వేస్ట్.. మేము నెక్స్ట్ టైం ట్రైన్ లో వెళ్లి మా చెప్పులు తెగేలా కొట్టుకున్నాం ...ఎందుకంటే ట్రైన్లో వెళితే టిక్కెట్ రేట్ త్రిబుల్ ఉంటుంది..పైగా జర్నీ వచ్చీ పన్నెండు గంటలు ...(బస్సులో ఎంత స్లో వెళ్ళినా నాలుగు గంటలే ) ఇంకా రాత్రి పడుకున్నప్పుడు ఆ కుదుపులకు ట్రైన్ పడిపోతుందేమో అన్నంత భయం వేసేసింది.. మన ఇండియాలో ట్రైన్లు లో ఎంత హాయిగా పడుకుంటాం..ఇదయితే ప్రొద్దున్న లేచ్చేసరికి ముసుగేసి చితక్కోట్టేసినట్లు ఒళ్ళంతా నెప్పులే నెప్పులు...వచ్చేప్పుడు భయపడి కూర్చుని వచ్చాం ... మరెందుకు ట్రైన్ పెట్టారో ..ఇంకెందుకు జనాలు దానిలో వెళతారో ఆ ట్రైన్ పెట్టినవాడికే తెలియాలి.. సరే ఎంత వరకూ చెప్పుకున్నాం..హా..వుడ్లాన్డ్స్ లో ఇమిగ్రేషన్ దగ్గర .. వీసాలు గట్రాలు లగేజ్లు అన్ని చెక్ చేసుకున్నకా ... అక్కడి నుండి జోహార్ బరు (JB )అనే ఊరుకి బస్ ఉంటుంది ...ఇంకేంటి అదే మలేషియా ..అంటే మలేషియా బోర్డర్ అన్నమాట ....అంటే సముద్రంలో కట్టిన వంతెన మీద మరో దేశానికి ..అచ్చంగా మరో దేశానికి వెళ్ళిపోతాం అన్నమాట..అసలు చదువుతున్న మీకే ఇంత ఒళ్ళు పులకరించిపోతుంటే వెళుతున్న నాకెలా ఉండి ఉంటుంది..ఆ అనుభూతిని సొంతం చేసుకోవడానికి ప్రిపేర్ అవుతూ గట్టిగా ఊపిరి పీల్చి తన్మయంగా కళ్ళు మూసుకుని మెల్లిగా కళ్ళు తెరిచేసరికి బస్ ఆపేసాడు ...పద పద మలేషియా వచ్చేసింది అన్నారు మా ఆయన :(... అప్పుడే వచ్చేసామా !!!! మరి వంతెనో అనగానే ..ఇందాక దాటేసాం కదా అన్నారు..అదన్నమాట సంగతి ...అంటే మన ఊర్లో గోదావరి బ్రిడ్జ్లో సగంలో సగం...ఛీ ఎందుకులెండి ఓ పిల్లకాలువ పైన ఉన్నంత బ్రిడ్జ్ ఉందన్నమాట అంతే...పాపం మా సింగపూరోళ్లు దూరమైతే కట్టేసేవాళ్ళమ్మా ..కాని ప్రక్క ప్రక్కనే ఉన్నాయి రెండు దేశాలునూ... వాళ్ళుమాత్రం ఏం చేస్తారూ!!!.. అలా జే బి బస్ స్టాండ్లో నిన్చున్నామా ...అక్కడ వరుసగా బోలెడు బస్సులున్నాయి ...కౌలాలంపూర్ కౌలాలం పూర్ అని పిలిచిమరీ టిక్కెట్స్ ఇస్తున్నారు..మేము రాత్రి ఒంటిగంటకు ఒక బస్ ఎక్కాం .... చెప్పానుగా మధ్యలో వాడు అరగంట రెస్ట్ రూమ్స్ దగ్గర ఆపినా నాలుగు గంటలే జర్నీ ...సరే సరిగ్గా అయిదింటికల్లా మలేషియాలో పుదురాయ బస్ స్టాప్లో దిగాం ...మేము మొదటి సారి మలేషియా వెళ్ళినప్పుడు హోటల్ గెంటింగ్ (జెంటింగ్) లో తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాం అనుకోండి ...కాని ముందు నేను కే ఎల్ లో ముఖ్యమైన ప్లేస్లు చెప్పేస్తాను ... కే ఎల్ లో ముఖ్య మైనవి ఊ..మామూలుగా ట్విన్ టవర్స్ ...ఇంకా కే ఎల్ టవర్ ...ఇంకా బటూ కేవ్స్ ,ఇంకా జెంటింగ్,ఇంకా సన్ వే లగూన్ ,ఇంకా అండర్ వాటర్ వరల్డ్.. ఓపిక ఉంటే బర్డ్స్ పార్క్,జూ ఇలా అన్నమాట..అయితే ఇక్కడ హోటల్ వాడు అరేంజ్ చేసిన టాక్సీ ఎక్కామో సీన్ సితారే అన్నమాట.. వాడు గంటకు 80 రింగేట్స్ అడిగాడు ...అంటే రోజులో ఒక ఏడుగంటలు తిరిగామనుకోండి ఎంతవుతుందో లేక్కేసుకోండి ... మా ఆయన సరే అనేసారు ఎంచక్కా తల ఊపేసి ...నేను ఆ అరాచకాన్ని సహించలేక మేము బయటకొచ్చి తింటున్న తమిళ్ ఫుడ్ సెంటర్ వాడిని అడిగాను.. ఇక్కడ హోటల్ అంటే గుర్తొచ్చింది ...మలేషియాలో ఫుడ్ సూపర్ డూపర్ చీప్ (అంటే మా సింగపూర్ తో పోలిస్తే )మాకు పది డాలర్లకు వచ్చేది అక్కడ ఐదు డాలర్లకే వస్తుంది..సగానికి సగం తేడా ఉంటుంది..అది ఫుడ్ అయినా బట్టలయినా సరే ... అంటే కళ్ళు చెదిరే షాపింగ్ కాంప్లెక్స్లో కొద్దిగా బేండ్ వేస్తాడు...కాబట్టి బట్టలు లాంటివి బయట షాప్స్లో కొంటే బాగా కలిసొస్తుంది.. అయితే ఇక్కడ మరొక విషయం తమిళియన్స్ ...అబ్బా నాకు తమిలియన్స్లో నచ్చేవిషయం ఏమిటంటే వాళ్ళ ప్రాంతం వారి పై ఇంకా వాళ్ళ భాష పై ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం.. ఎలాంటి సహాయం అయినా అడగకుండా చేస్తారు..అదే కొద్దిగా తమిళ్ ముక్కలు రాకపోయినా మాట్లాడటాని ట్రై చేసామనుకోండి మనకు నీరాజనాలే.. అందుకే ఆ హోటల్ తమిళ్ ఓనర్ తో " అన్నా.... ఎనకు తమిళ్ తెరియాదు ....ఆనా రొంబ పుడికం.... కొంజెం కొంజెం పురియుం.. ..హెల్ప్ పన్ను" అని ఎంతో ఇదిగా నా తమిళ్ సీరియల్స్ ప్రతిభను ఉపయోగించి అడిగేసరికి అతనే ఒక కేబ్ అబ్బాయిని పిలిచి దగ్గరుండి బేరమాడి మాకు హెల్ప్ చేసాడు .. ఎంతో చెప్పనా..... మొత్తం రోజంతటికీ ౩౦౦ రింగేట్స్ ...కాబట్టి ఎంచక్కా నేను చెప్పినట్లు చెయ్యండి .. ఆ కేబ్ అబ్బాయి ఎంచక్కా అసలు లిస్టు లో లేని చాలా ప్లేస్లు తిప్పాడు ...ఏవో ముస్లిం భవనాలు,హైకోర్ట్ , ఇంకా ఏంటో ఏంటో లే ...మనం అవన్నీ వదిలేసి ముఖ్యమైనవి చెప్పుకుందాం... ట్విన్ టవర్స్ ..మొదటి సారి మలేషియా వెళ్ళినప్పుడు నేను ట్విన్ టవర్స్ చూడలేదు.. సుత్తిలే ఎవడు చూస్తాడు టీవి లో చూసాం గా అని..మనకు ఏది ఓ పట్టాన ఎక్కదుగా... కౌలాలం పూర్లో ఎక్కడ తిరుగు... ఈ ట్విన్ టవర్ కనబడుతూనే ఉంటుంది ... కాని ఆ తరువాత చాలా సార్లు వీటిని చూడటానికే ప్రత్యేకంగా వెళ్లాను అంటే అర్ధం చేసుకోండి ..ఎంత బాగుంటుందో.. వీటిని పగలు చూస్తే ఏం బాగోవు మామూలుగా ఉంటుంది ...కాని రాత్రి చూస్తే మాత్రం అక్కడే కూర్చుని వాటిని చూస్తూ తెల్లార్లూ గడిపేద్దాం అనిపిస్తుంది.. ఎంత బాగుంటుందో..నాకు వర్ణించడం రావట్లేదు మరి.. ఇది కట్టించడానికి ఏదో కారణం చెప్పాడబ్బా కేబ్ వాడు ...సమయానికి నాకు గుర్తురావడం లేదు..అయితే ఈ టవర్స్ ని ఎక్కాలంటే ప్రొద్దున్నే లేచి అయిదుగంట్లకో ఎప్పుడో క్యూలో నించుంటే ఒక రెందొందలమంది పంపుతాడట... హిహిహిహి మనసంగతి తెలుసుగా ..ఇప్పటికోచ్చి ఎక్కలేదు ఎన్నిసార్లు వెళ్ళినా.. ఇంకొకటి కే ఎల్ టవర్ దీన్ని కూడా నేను ఎక్కలేదు ..దూరం నుండి చూసాను అంతే... కాబట్టి తెలియదు దీని గురించి.. ఇక బటు కేవ్స్ ..ఇది సూపర్ డూపర్ ..చాలా సినిమాల్లో ఈ గుడిని తీసారు.. పే........ద్ద సుభ్రమణ్య స్వామీ విగ్రహం ఉంటుంది ... సూపర్ అంతే ...అక్కడో నాలుగు వందల మెట్ల ఎత్తోలో గుడి ఉంటుంది పైన గుహలో ... ఆ మేట్లేక్కేసరికి కాళ్ళు పడిపోతాయి.. కాని లోపల చాలా బాగుంటుంది.. ఇంకా దారంతా కోతులు ..ఆ జనాలను చూస్తే నాకు తిరపతి గుర్తొచ్చింది.. అన్నట్లు మర్చిపోయాను ఈ పూజలు వ్రతాలూ అంటే ఏ మాటకామాట చెప్పుకోవాలి..తమిళియన్సే ...బాగా చేస్తారు... ఇంకా సన్వే లగూన్ ....ఇదేమో పెద్ద వాటర్ వరల్డ్ అన్నమాట ...దీని దగ్గరకు వెళ్ళాలంటే అలా ఎన్ని ఫ్లోర్స్ క్రిందకు దిగాలో ...బయట నుండి చూస్తేనే సూపర్ డూపర్ బంపర్ ఉంటుంది ...అసలు పిల్లలు ఉన్నవాళ్ళు దీనికోసమే మలేషియా వెళతారు... అండర్ వాటర్ వరల్డ్..ఇది అచ్చం సింగపూర్ లానే ఉంటుంది ...అస్సలేం తేడా ఉండదు.. ఆ చేపలు గట్రాలు అన్ని సేమ్ సేమ్ కాని ... ఆ లోపల డెకరేషన్ కి నేను పడిపోయాను..అదేదో బృందావనం లా ఇంకేదో లోకంలా ...లోపల అన్ని లతలు తీగలు ,పళ్ళు,కాయలు అబ్బబ్బబ్బా నాకయితే ఎంత నచ్చేసిందో.. నా కోసమయినా వెళ్ళండి అంతే అంతే ... హా ఇక్కడ ఇంకొకటి చెప్పాలి ..ఇక్కడ ఎక్కడకు వెళ్ళినా చాక్లెట్ ఫ్యాక్టరీలని,లెదర్ ఫ్యాక్టరీలని అంతా ప్యూర్ చాక్లెట్ ,లెదర్ దొరుకుతుందని కేబ్ వాళ్ళు మనల్ని మొహమాటం కూడా పెట్టకుండా తీసుకు వెళ్ళిపోతారు ...వాళ్లకు వాళ్లకు ఏవో ఒప్పందాలు ఉంటాయన్నమాట..ఆ వస్తువులు ధర బయట వాటికి కనీసం అధమ పక్షం ఒక పదిహేను రేట్లు ఎక్కువ ఉంటుంది..అయినా జనాలు కోనేస్తూ ఉంటారేమిటో... నేను చెప్పేది చెప్పాను మరి..వెళ్ళేవాళ్ళు ఉంటే ఆలోచించుకోండి :) ఇక బర్డ్స్ పార్క్ ,జూలు మిగిలినవి నేను చూడలేదు ..టైం లేదు ..మరి నాకు తెలియదు..కాకపొతే మా సింగపూర్ కి మలేషియాకి తేడా ఏమిటంటే మా వాళ్ళు ప్లేస్ లేక పది ఎకరంలో కట్టినదాన్ని మలేషియావాళ్ళు యాబై ఎకరాల్లో కడతారు అది సంగతి.. నీట్ నెస్ గాని మిగిలిన ఏ విషయమైనా సరే మా దేశం తో పోల్చుకోలేము దాన్ని ..( మా సింగపూర్ని బాగా పొగుడుకున్నా కదా) ... అయితే ఇక్కడ మేము వెళ్ళిన కొత్తలో ఎవరూ ఇంగ్లిష్ మాట్లాడక చాలా ఇబ్బంది అయ్యేది కాని ఈ మధ్య పర్లేదు..అలాగే ఇక్కడ లోకల్ ట్రైన్స్ భలే ఉంటాయి ..మొకమల్ క్లాత్ తో అదేదో రాజ్ మహల్ లో ఉన్నట్లు..కాకపొతే అబ్బ ప్రతి ట్రైన్ అరగంటకోసారి వస్తుంది ....చిరాకు బాబు .. ఇప్పుడు జెంటింగ్ ... జెంటింగ్ కి వెళ్ళాలంటే తెల్లవారు జామున వెళితే ఉంటుంది కదా......సూ..ప..ర్ అంతే ...అసలు ఎంత బాగుంటుందో.. అక్కడకు రోప్ వే ఉంటుంది.. అంటే తెలుసుకదా కేబుల్ కార్ లో వెళ్ళడం అన్నమాట..తెల్లవారు జామున మబ్బుల్లో , ఆ చలిలో క్రింద లోయలు ,పైన ఆకాశం ..మధ్యలో ఒక్క తాడుకి వ్రేల్లాడుతున్న పెట్టెలో మనం ....ఓ సారి ఊహించుకోండి ...కొద్దిగా భయం వేసినా కాసేపటికి బాగా ఎంజాయ్ చేస్తాం.. మా సింగపూర్ తో పోలిస్తే ఇక్కడ చాలా చీప్ ...ఈ రోప్ వే మీద జర్నీ చేయడం.. అప్పుడు ..ఎంచక్కా జెంటింగ్ వెళ్ళిపోతాం ... జెంటింగ్ లో ఏముంటుంది అంటే ఏమీ ఉండదు... పెద్ద కొండ పై బాగా డబ్బులు వదిలించుకోవడానికి కావలసిన అన్ని హంగులు ఉంటాయి..ఇండోర్ అవుట్ డోర్ గేమ్స్ ... ఇండోర్ గేమ్స్ చిన్నపిల్లలు పెదా వాళ్ళు అందరూ ఎంజాయ్ చెయ్యొచ్చు.. కాని అవుట్ డోర్ గేమ్స్ నాకులాంటి ధైర్యస్తులు మాత్రమే వెళ్ళాలి..ఏంటలా చూస్తారేంటి ..నమ్మరా.. ఇప్పుడంటే భయమేస్తుంది కాని ఓ పదేళ్ళక్రితం "నువ్వు నాకు నచ్చావ్లో బ్రహ్మానందం ఎక్కిన రోలర్ కోస్టర్ లో నాలుగు సార్లు ఎక్కేసాను తెలుసా..ఇంక ఈ గేమ్స్లోకి వెళ్ళమంటే టైం ఏం ఉండదు ...అలా ఆడుకోవడమే ఆడుకోవడమే ఆడుకోవడమే..హా మర్చిపోయాను ఇక్కడ పెద్ద జూద గృహం ఉంది.. అబ్బా...అదే ఏదో అంటారుగా కేసినో ఏదో అదన్నమాట ..నేను మొదటి సారి అందులో పది రింగెట్లు జూదమాడి గెలిచాను ...కాని మా ఆయన మళ్ళీ ఆడించి ఇంకు ఇరవై తగలేయించి బయటకు తీసుకొచ్చారు :(... అలా మన దగ్గరున్న డబ్బులు ,ఓపిక అన్ని అయ్యేవరకూ ఆడుకుని కాసేపు ఆ కొండ ప్రాంతం అంతా తిరిగి సాయంత్రం మళ్ళీ అదే రోప్ వేలో క్రిందకు వెళ్లి పోవచ్చు ..కాని పైన భోజనాలు పిచ్చ రేట్లు ..క్రింద ప్యాక్ చేయించుకుని తెచ్చుకు తినండి ..ఇక షాపింగ్ అయితే మన తెలివి పై ఆధారపడి ఉంటుంది..ఉదాహరణకు ఒక విషయం చేపాతాను.. కౌలాలం పూర్లో చైనా బజార్ అని ఒకటుంటుంది..మన సంతల లెక్కన టెంట్ లేసుకుని అమ్ముతారు.. మొదటి సారి వచ్చినప్పుడు మా ఆయన ఒక సంతలో ఫ్రెండ్స్ కి లైటర్స్ కొంటా అన్నారు .. మొదటి దుకాణం వాడి దగ్గర అడిగితే రివాల్వర్ మోడల్ లో ఉన్న లైటర్ ౩౦ రింగేట్స్ అన్నాడు.. మా ఆయనగారు 25 రింగేట్స్ కి బేరమాడి నా వైపో లుక్కిచ్చారు.. ఒక పది కోనేసాం ... నెక్స్ట్ షాప్ వాడి దగ్గరకు వెళ్లి ఇదెంత బాబు అనగానే ఇది 25 కాని మీకు 20 కి ఇస్తాను అన్నాడు ..ఆ నెక్స్ట్ షాప్ వాడు 15 కే ఇస్తా అన్నాడు..ఇంకో షాప్ వాడి దగ్గరకు వెళితే అయిదు కి ఇస్తా అన్నాడు.. ఇక ఆఖరి షాప్ వాడు పది రింగేట్స్ కి మూడు అన్నాడు ... ఇక ముందుకు వెళితే ఊరికే ఇస్తానంటాడేమో అని భయమేసి వెళ్ళ లేదనుకోండి..అలాగే హ్యాండ్ బ్యాగ్ 350 రింగేట్స్ కొంటే ముందు షాప్లో 50 రింగేట్స్ కి బెరమాడింది ఇంకో అమ్మాయి..:( కాబట్టి నేను చెప్పొచ్చేదేమిటంటే ఇక్కడ బేరాలు ఆడగలిగే సత్తా ఉన్నవాళ్ళు మాత్రమే ఆ షాప్స్ కి వెళ్లి లాభములు పొందగలరు..లేదా బేండ్ బజాయింపే...మామూలు పెద్ద షాప్స్ లో ఫిక్స్డ్ రేట్లే లెండి.. అదన్నమాట నేను చూసిన మలేషియా.. వీరిచే పోస్ట్ చేయబడింది నేస్తం వద్ద 10:59 AM 45 కామెంట్‌లు 13, సెప్టెంబర్ 2011, మంగళవారం పాడమని నన్నడగవలెనా!!!! చిన్నప్పటి నుండి నాకు రెండు తీరని కోరికలు ఉండిపోయాయి ..ఒకటి .. " పంచభూతములు ముఖ పంచకమై...చతుర్వేదములు ప్రాకారములై " అంటూ సాగరసంగమం కమల్ హాసన్ లా కదక్, కూచిపూడి మణిపురి , ఒడిస్సీ ,భరతనాట్యం ఇలా అన్ని నృత్యాలు నేర్చేసుకుని స్టేజ్ ఎక్కి మరీ ఆహా ఓహో అనిపించేసుకోవాలని.. రెండోదేమో అదే స్టేజ్ మీద కుడిచేయి ఒక తిరగా, ఒక బోర్లా వేస్తూ ..సరిగమపదనిస సనిదపమగరిస అంటూ బోలెడు కచేరీలు ఇచ్చేయాలని ..... నాకు తెలుసు మీరందరూ దిగులు దిగులుగా,భయం భయంగా చూస్తున్నారని ...ఆ మాత్రం జాలి, మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద నాకు లేవనుకున్నారా !! అందుకే మొదటిదాన్ని చెప్పకుండా మీకోసం త్యాగం చేస్తున్నాను..దానికి ప్రతిఫలంగా రెండోవ విషయం వినాలి ...:) అంటే అసలు ఈ పాటలు పాడాలి అన్న కాన్సెప్ట్ నాలో ఎప్పటినుండి మొదలైంది అంటే ..శంకరాభరణం సినిమాలో సోమయాజులు వరలక్ష్మిని ..తెల్లవారుజామున పీకల్లోతు నీటిలో ముంచేసి సా రి గ రీ గ పదా పా స రి గ ప దా ప గ రీ రి గ ప ద సా నీ దా పా అని .... సంగీతం నేర్పే సీన్ చూసినదగ్గరనుండి .." ఓస్ ఇంతేనా ????ఇంత సింపులా పాడటం అంటే?" అనేసుకున్నాను .. ఆ పళంగా రెండు రోజులు ప్రొద్దున్నే లేచి మా ఇంట్లో నీళ్ళ కుండీలో అమ్మ చూడాకుండా ఒక ఐదు నిమిషాలు "ఖష్ట పడి " సాధన చేసేసాను... ఇంకేముంది నాకు సంగీతం వచ్చేసింది ... అయితే ఒట్టి సంగీతం వచ్చేస్తే సరిపోతుందేమిటీ!! .. పాటలు కూడా రావాలిగా ..అప్పట్లో అప్పుడప్పుడు రేడియో పాటలు..వారానికోసారి టీవిలో వచ్చే చిత్రలహరి తప్ప పాటలు నేర్చుకోవడానికి వేరే ప్రత్యమ్నాయం ఉండేదికాదు ... అప్పుడెలాగా?? అని ఆలోచిస్తే మా అక్క గుర్తొచ్చింది..దాని నోట్ బుక్స్ నిండా స్కూల్ లో వాళ్ళ మిస్ లు నేర్పే పాటలే.. అంతే ..మా పై మేడ ఎక్కేసి అబ్బో తెగ ప్రాక్టీస్ చేసేసాను....ఇంకేంటి కచేరి చేయడం ఒక్కటే మిగిలింది.... ఇక శ్రోతల్ని సమకూర్చుకోవడమే.. సరిగ్గా అదే టైమ్లో మా పెద్దమ్మ.. మా పెద్దక్క లెక్కల్లో క్లాస్ ఫస్ట్ వస్తుందని వద్దు వద్దని మొత్తుకున్నా బలవంతంగా ఓ ట్యూషన్ లో జాయిన్చేసేసింది.. అది ఏడుస్తుంటే నవ్విన పాపానికి నేరుగా మా అమ్మదగ్గరకు వెళ్లి .."పిన్నీ నేనైతే క్లాస్ ఫస్టే..మన బుజ్జయితే స్కూల్ ఫస్ట్ వస్తుంది "అని చెప్పిన మరుసటి రోజే దానితో పాటు నేనూ అదే ట్యూషన్లో చేరాల్సి వచ్చింది... అలా లెక్కలేనన్ని తిట్లు తిట్టుకుంటూ లెక్కలు చేసుకుంటూ రోజులు లెక్కపెట్టుకుంటుంటే ..ఒక శుభముహుర్తాన మా సార్ వాళ్ళ పాప పుట్టినరోజు వచ్చింది ..అందరం ఎప్పటిలా పుస్తకాలు ముందేసుకోగానే సార్ వాళ్ళ అమ్మగారు .."అరే ..పండగ పూట పాఠాలేమిటిరా ఈ రోజు పిల్లల చేత నాలుగు పాటలు పాడించరాదూ" అనేసరికి ఎగిరి గెంతులేసేయాలనిపించింది .. అసలే ఆయనకు వాళ్ళ అమ్మగారంటే మహా గౌరవం (భయం?) ఉండేది.. సరే ఎవరన్నా వచ్చి మంచిపాటలు పాడండి అన్నారు.. నాకేమో నేర్చుకున్న పాటలన్నీ పాడేయాలని ఉందికాని... మరీ నాకు నేనుగా అంటే లోకువ అయిపోతానని సార్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా ..అబ్బే ..ఆయన నన్ను పట్టించుకుంటే కదా.. ఎవరెవరినో పిలుస్తున్నారు.. ఇహ లాభం లేదని నా పక్కదానితో గుస గుసగా .."హే నాకు చాలా పాటలు తెలుసు కానీ ఏమో బాబు నాకు భయం "అన్నాను సిగ్గుపడుతూ.. ఆ పిల్ల నావైపు ఓసారి చూసి "ఓహో " అనేసి మళ్లీ తలతిప్పేసుకుంది..ఎవర్తివే నువ్వు గాడిద అని కసిగా తిట్టుకుని ఇటు మా అక్క వైపు తిరిగాను.. నేనింకా విషయం చెప్పకముందే ..నీకెందుకే నోరుమూసుకుని కూర్చో అనేసింది కుళ్ళు మొహంది .... దున్నపోతా అని అనుకుంటుంటే మా గుసగుసలకు సార్ నా వైపు చూసి నువ్వు పాడతావమ్మా అన్నారు .... ఆట్టే బెట్టు చేస్తే మొదటికే మోసం అని ' ఊ ' అని తల ఊపాను మొహమాటంగా .. ఆలోపలే సార్ వాళ్ళ అమ్మగారు ఇద్దరుముగ్గురు ఫ్రెండ్స్ని కూడా తీసుకు వచ్చేసారు షోకి ... నేను గట్టిగా ఊపిరిపీల్చి శ్రావ్యంగా మొదలుపెట్టాను .."ఏసయ్య ఇంటి ముందు సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టు " మొదటి లైన్ పూర్తవ్వగానే సార్ వాళ్ళ అమ్మగారు ఫ్రెండ్స్ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూడటం మొదలు పెట్టారు ...ఏదో తేడా తెలుస్తుందికాని అదేమిటో తెలియడం లేదు ... ఇంకో నాలుగైదు లైన్స్ పాడగానే వాళ్ళందరూ మూకుమ్మడిగా మా సార్ ని చూడటం మొదలు పెట్టారు... మా సార్ మధ్యలో ఆపేసి పాప ఇంకో మంచి పాట పాడమ్మా అన్నారు.. ఓస్ అంతే కదా అనుకుని గొంతు సవరించుకుని మరొక పాట మొదలు పెట్టాను "దేవుడే నాకాశ్రయంబు " ... పాట మొదలు పెట్టిన అయిదు నిమిషాలకే వాళ్ళ అమ్మగారి ఫ్రెండ్స్ మూతి మూడు వంకర్లు తిప్పి.. వస్తాను కామాక్షిగారు పొయ్యి మీద ఎసరు మరిగిపోతుంది అని మనిషికో వంక పెట్టి వెళ్ళిపోయారు.. ఆవిడ రుస రుసలాడుతూ కొడుకు వైపు ఒక్క చూపు చూసి లోపలికి వెళ్ళిపోయింది..ఆ తరువాత మా సార్ ఇక పాటలు చాలు పుస్తకాలు తీయండి అనో గసురు గసిరి ఓ గంట ఎక్కువ వాయించేశారు .. "బుద్దుందా అసలు ..రోజంతా మడి చీరతోనే తిరుగుతూ మనం వెళ్ళగానే ఇల్లంతా కడిగేసుకునే చాదస్తం ఆవిడది ..అక్కడ ఆ పాటలు పాడుతావా " అని ఆ రోజంతా మా పెద్దక్క తిట్లతో తెల్లారిపోయింది నాకు .." ఆ దెబ్బతో కొన్నాళ్ళు పాడుతా తీయగా కార్యక్రమం వాయిదా వేసాను ... కాని మనకి అవకాశాలు తంపానుతంపరలుగా తన్నుకోచ్చేస్తే ఏం చేసేది ??? ఓ రోజు మా స్కూల్లో ఇన్స్పెక్షనో పాడో గుర్తులేదుగాని ఒక అతను వచ్చారు.. మా సార్లు అందరూ కంగారుగా వాళ్ళ వెనుక పరుగులు పెడుతున్నారు .. అతను రావడం రావడం ఖర్మకాలి(ఎవరి ఖర్మ అనేది ముందు ముందు తెలుస్తుంది) మా క్లాస్ కు వచ్చారు.. వచ్చిరాగానే మీలో దేశభక్తి ఎంత మందికి ఉంది అన్నారు.. మొత్తం చేతులు ఎత్తేసాం.. మీలో దేశభక్తి గీతాలు ఎవరికి వచ్చు అన్నారు.. నేను ,మా స్వాతి నిన్చున్నాం.. మరి మేమే రోజు ప్రేయర్లో వందేమాతరం పాడేది.. దేశభక్తి అంటే దేశం లో ఉన్న లోపాలు కప్పేసి సుజలాం సుఫలాం అంటూ లేనివి ఉన్నట్లు పాడేయడం కాదు... లోపాలేమిటో తెలుసుకుని వాటిని పారద్రోలడం ..అసలు మన దేశం లో పేదరికం పై ఉన్న కవితలు, పాటలు ఎవరికైనా తెలుసా అన్నారు ..పాపం ఆయన ఉద్దేశం శ్రీ శ్రీ గురించో మరొకరి గురించి చెప్తామని కాబోలు... మాకు అప్పట్లో అంత నాలెడ్జ్ ఎక్కడిది...మేమందరం తీవ్రంగా ఆలోచిస్తుంటే ఆయన చూపు నా మీద పడింది.. ఏది ఓ మంచి పాట పాడు అన్నారు ఆయన నా వైపు చూస్తూ..(చెప్పానుగా తలరాత) నేనేమిటంటే నాగేశ్వరరావు పాట " పాడవోయి భారతీయుడా" పాట గుర్తుతెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాను ..ఆయన ఉన్నట్లుండి నన్ను అడిగేసరికి ఆ కంగారులో మర్చిపోయాను ..ఎంత గింజుకున్నా గుర్తురాదే ... పోనీ రాదనీ చెప్దామా అంటే రాక రాక వచ్చిన అవకాసం .. ఈ లోపల అనుకోకుండా చిన్నప్పుడు రేడియోలో విన్న ఒక పాట గుర్తు వచ్చింది.. పూర్తిగా గుర్తులేదు ఏదో పల్లవి ... ఏదైతే ఏమిటిలే అని మొదలుపెట్టేసాను ఆలోచించకుండా... ఎవరూ భయపడకండెం.. ఆ పాటేమిటంటే .... ఇల్లూ వాకిలి లేదు... వెనకా ముందు లేరు..( ఈ ముక్కను ఎలకల మందు లేదు అని పాడేదాన్ని ...నాకు సరిగా వినిపించకా) ఎక్కడికని పోనూ.... పాట ఇంకా పల్లవి అవ్వనేలేదు మా సార్లు,మేడం లు గోడకి దభేల్ ధబెల్ మని మూకుమ్మడిగా తల కొట్టేసుకుని నా నోరు మూయించేసారు అంతే... మరి నాకేం తెలుసు అది ఐటం సాంగ్ అని ..పాపం ఒక అమ్మాయి బీదరికంతో ఎలకల మందు మింగిచనిపోదాం అనుకుంటూ అలా పాడేదనుకునేదాన్ని ... ఆ తరువాత మా హెడ్ మాస్టార్ నన్ను ప్రత్యేకంగా పిలిపించి స్పెషల్ గా పొగిడేసరికి మళ్లీ ఇంకోసారి అవుట్ డోర్ కచేరీలు పెట్టలేదు ...అయినా తిరిగే కాలు పాడే నోరు ఊరుకుంటాయా ??? అసలు ఇదంతాకాదు ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు కాబట్టి ముందు ఇంట్లోవాళ్ళతో శభాష్ అనిపించుకోవాలాని కఠోర సాధన చేసాను ... ఒక శుభ ముహూర్తాన నాన్న ఆదివారం పూట మధ్యాహ్నం సుబ్బరంగా తిని పడుకుంటే మెల్లగా "నన్ను దోచుకుందువటే వన్నెలదొరసాని " ఆ పాట పాడటం మొదలు పెట్టాను..మరి నాన్న ఎన్ టి రామారావు ఫేన్ కదేంటి ..తేడా రానిస్తానా!! కాసేపటికి మా నాన్న శారదా !! అంటూ ఒక్క అరుపు అరిచారు ..ఏమిటి నాన్న గారు మా అక్క పరుగున వచ్చింది ... నువ్వు పాడుతున్న రాగామేంటి ..ఎంచుకున్న తాళ మేమిటి ..అని పాపం శంకరాభరణం శాస్త్రి గారిలా క్లాస్ పీకబోయారు కాని అది మధ్యలో ఆపేసి" పాడింది నేను కాదు బుజ్జీ" అనేసి చక్కా వెళ్ళిపోయింది..గొప్ప అవమానం అయిపోయింది.. మెల్లగా మా చెల్లి పక్కకు చేరి ..మరీ అంత చండాలంగా పాడానంటావా అనుమానంగా (కొద్దిగా ఆశగా) అడిగాను..అది నావైపు ఒక సారి చూసి నిట్టూర్చీ ... చెప్తే ఏడుస్తావని ఊరుకున్నాం గాని అక్కా వారం రోజులనుండి మాకు చెవుల్లో రక్తాలు కారిపోతున్నాయి... అనేసింది (ఇప్పటికీ ఈ విషయం తలుచుకుని ఏడిపిస్తూనే ఉంటారు మా వాళ్ళు :() ఇంకేం చేస్తాం అలా ఒక వర్ధమాన గాయినిని తూటాలవంటి మాటలతో తోక్కేసారు.. పెళ్ళయ్యాకా అసలు పాడే ప్రయత్నమే చేయలేదు ...నాకు తెలుసు మీరేమనుకుంటున్నారో..మా ఆయన వంకలు పెట్టి ఉంటారనేగా ...హి హి హి హి కాదు ...నేను మొదలు పెట్టగానే రెండో లైన్ నుండి ఆయన పాడటం మొదలెట్టేస్తారు :( ఆ బాధకంటే ఇలా బాత్ రూం సింగర్ గా మిగిలిపోవడమే ఉత్తమం అని కేవలం నా పాటకు నేనే శ్రోతనై అలా మిగిలిపోయాను ... అక్కడితో ఆగిపోతే అసలు ఈ రోజు ఈ పోస్ట్ పుట్టేదేకాదు ... మొన్నో మధ్య ఒక ఫ్రెండ్ వాళ్ళింట్లో సత్యన్నారాయణ స్వామివారి వ్రతం అని పిలిస్తే వెళ్లాను ... పూజ అయ్యాకా దంపతులను హారతి ఇచ్చి లేపాలి.. ఎవరన్నా పాడండమ్మా అంటే..అమ్మో నాకు రాదంటే నాకు రాదు అని మెలికలు తిరిగిపోతున్నారు జనాలు.. నాకు జరిగిన అనుభవాల దృష్యా నేను లేవలేదు ... ఎందుకు చెప్పండి పిలిచి తిట్టించుకోవడం..కాని అవకాసం తరుముకొస్తే ఏం చేస్తాం..అక్కడ చీరకట్టుకున్న ఏకైక మహిళను నేనే ...అందుకని అందరూ నన్ను లాక్కోచ్చేసారు ...భయం భయం గా "క్షీరాబ్ది కన్యకకు నీరాజనం" అని అన్నమాచర్య కీర్తన కొద్దిగా పాడాను..హమ్మయ్యా ఎవరూ మాట్లాడలేదు ...ఒక పనైపోయిన్దిరా బాబు అని వెళ్లిపోతుంటే పూజ చేసిన పంతులుగారు పిలిచి చాలా బాగా పాడావమ్మా" గాన సరస్వతి" లా అన్నారు...అందరూ అవునవును అన్నారు చప్పట్లు కొట్టి.. ఇంక మీకు నేను విడమరచి చెప్పక్కరలేదనుకుంటా నేను ఇంటికి వెళ్ళేంతవరకూ నేలకు నాలుగు అడుగుల పైన నడిచానని .. మా ఆయనకు చెప్తే ...అంటే బుజ్జీ ముసలాయనకదా సరిగ్గా వినిపించి ఉండదు ... పొరపాటు పడటం మానవ సహజం.. నువ్వు మామూలుగా నడిచేయచ్చు అనేసారు :( అయినా సరే నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను..చిన్నప్పుడే నాలో ఒక చిత్ర ,ఒక శ్రేయగోషల్ ,ఒక గోపికా పూర్ణిమ ఉన్నారు అంతే అంతే అంతే ...అంతే బాబు..ఇక ఎవ్వరి మాటలు నమ్మదలుచుకోలేదు నాకు తెలుసు మీరేమంటున్నారో ..మీ పాట ఒకటి మాకూ వినిపించచ్చుకదా అని కదా.. హమ్మా పొరపాట్లు అన్ని సార్లు జరుగుతాయ్ ఏంటి ....మీరు మరీను వీరిచే పోస్ట్ చేయబడింది నేస్తం వద్ద 11:26 PM 88 కామెంట్‌లు 27, జూన్ 2011, సోమవారం ఆషాడం - 2 ఆ..ఎంతవరకూ చెప్పాను ..ఆషాడంలో మా ఆయన్ని కలుసుకోవడానికి మా అమ్మమ్మ ఊరు వెళ్లాను అని చెప్పాను కదా ... అక్కడికి వెళ్ళగానే అనుకున్న కధ మొదలైంది.."ఆషాడంలో మొక్కులేమిటే మరీ విచిత్రంగానూ" అని కాసేపు మా అమ్మమ్మ బుగ్గలు నొక్కుకుని ,ఎదురుగా అల్లుడిగారిని(మా నాన్నను) చూసి ఏమనలేక ..."అయినా ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే బాబు ... మీ మావయ్య గారు షాపు వదిలి ఇంటికొచ్చేసరికి రాత్రి ఒంటిగంట అవుతుంది .. ట్రైన్ పది గంటలకు కదా ,వెనుక గుమ్మం దగ్గర నుండి మా చిన్నోడు ( చిన మావయ్య) స్టేషన్కి తీసుకు వేళతాడులే "అనేసి నన్ను గట్టున పడేసింది.... నాన్న మా వూరు వెళ్ళేవరకూ ఓపికపట్టిన మా అత్తలు నా చెరో ప్రక్కనా చేరిపోయారు ..."ఆషాడంలో బయటకు వెళుతున్నారా!!! మా తమ్ముడుగారు ఎంత డేరు, ఎంత రోమాన్టిక్కు ... మీ పెద్ద మావయ్యా ఉన్నారు దేనికీ!! .. పెళ్ళయి పదేళ్ళు అయినా ప్రక్క వీధిలో గుడికి తీసుకువెళ్ళమంటే ప్రక్కింట్లో దొంగతనం చేయమన్నట్లు జడిసిపోతారు" అని ఏడుపుమొహం పెట్టి మా పెద్దత్తా.... "ఈ నల్లపూసలు అయిదుకాసులు పెట్టి చేయించారా !!...పెళ్ళయిన మూడునెలలు కాకుండానే ఇన్ని చేయిస్తే ముందు ముందు ఏడువారాల నగలు చేయిన్చేస్తారేమో ...మీ చిన్న మావయ్యా ఉన్నారు... పావుకాసు పెట్టి ఉంగరం చేయించమంటే పందిరి గుంజలా బిగుసుకుపోతారు "అని భారంగా నిట్టూరస్తూ చిన్నావిడా గతాన్ని తలుచుకుని తలుచుకుని ,తవ్వుకుని, తవ్వుకుని బాధపడిపోవడం మొదలుపెట్టారు.. "వచ్చావా మహా తల్లీ!!! ..నువ్వు ,మీ అక్కా వచ్చారంటే మా కాపూరాల్లో నిప్పులే ... అక్కడేం ఉద్దరిస్తారో తెలియదుకాని ఇక్కడ మాత్రం మీ అత్తలకు మణిరత్నం సినిమా చూపించి వెళ్ళిపోతారు ..తర్వాతా ఓ నెల రోజులు పాటు మాకు ' కొత్తబంగారు లోకం మాకు కావాలి సొంతం ' అని పాడి వినిపిస్తారు వీళ్ళు" అని మా చిన్న మావయ్య విసుక్కుంటుంటే...... చూడంమమ్మా నీ కొడుకు అని కంప్లైంట్ చేస్తూ భోజనం తింటుంటే ఫోన్ .... పరుగు పరుగున వెళ్లి ఫోన్ తీశాను ... "బుజ్జీ ! వచ్చేసా"వా అటునుండి మా ఆయన.." ఆ వచ్చేసాను కానీ అదేంటది ఈ పాటికి ట్రైన్లో ఉండాలి కదా మీరు..ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నారు" అయోమయంగా అడిగాను....." ట్రైన్ ఓ గంట లేటే ..అందుకని ఇంకా బయలుదేరలేదు" అన్నారు బాంబ్ పేలుస్తూ ....."అమ్మ బాబోయ్ గంట లేటా!!!రాత్రి పదిన్నర అంటేనే మా నాన్న ,అమ్మమ్మ వందసార్లు ఆలోచించారు ... ఇప్పుడు గంట లేటంటే పదకుండున్నర అవుతుంది ఇంకేమన్నా ఉందా" అన్నాను భయంగా ..." మీ అమ్మమ్మకు ,నాన్నకు పనేముంది ప్రతిదానికి భయపడటమే గాని ఇంకేదన్నా చెప్పు "అన్నారు తాపీగా...." మీకేం బాబు మిమ్మల్ని ఎవరేమంటారు ,అక్షింతలు పడేది నాకే కదా " విసుక్కున్నాను.... "అబ్బా నీతో ఇదే చిక్కు ...ఎప్పుడూ ఎలా టెన్షన్ పడదామా అని ఆలోచిస్తావ్... నాకైతే బోలెడు ప్లాన్స్ ఉన్నాయి..నువ్వు ఎప్పుడన్నా ట్రైన్ డోర్ దగ్గర నిన్చున్నావా ... మనం ఎంచక్కా డోర్ దగ్గరకు వెళ్లి కూర్చుని తెల్లవార్లు కబుర్లు చెప్పుకుందామేం"....అన్నారు పరవశంగా.." ఏంటీ డోర్ దగ్గరకా !! మా నాన్నకు తెలిస్తే అప్పుడు చేస్తారు నాకు అసలు పెళ్లి "అన్నాను విసుగ్గా.. "అవును మరి ప్రతీది వెళ్లి మీ నాన్నకు చెప్పు ... అయినా పెళ్ళయ్యాకా నా ఇష్టం .. ... నా పెళ్లానివి... తండ్రి కంటే భర్తే గొప్ప,పతియే ప్రత్యక్ష దైవం తెలుసా నీకా విషయం" అన్నారు కచ్చగా( ఈ మాట అరిగిపోయిన రికార్డులా ఇప్పటికీ అంటారులెండి) ... "తోక్కేం కాదు నాకు మా నాన్నే గొప్ప "అంటుంటే ఇంకేవరివో మాటలు ,గుసగుసలు వినిపించి ప్రక్క రూం లో తొంగి చూస్తే ,మా అత్తలు ప్రక్క రూం లో ఉన్న మరో ఫోన్ పట్టుకుని మా మాటలువింటూ తోసుకుంటూ...... దెబ్బకి ఫోన్ పెట్టేసి ఆ రూంలోకి పరుగెత్తాను .... "ఏం పనిలేదా ,మేనర్స్ లేదా" కోపం గా అడిగాను...." అస్సలు లేదు .. అయినా ఇది మా ఇల్లు.. మా ఫోను ... మా ఇష్టం ... కొత్తగా పెళ్ళయిన వాళ్ళను మా ఊర్లో ఇంతకన్నా ఎక్కువ ఏడిపిస్తాం తెలుసా "అన్నారు ఇద్దరూ కోరస్ గా ... ఖర్మరా బాబు అనుకుని 11 ఎప్పుడవుతుందా అని ఎదురు చూడటం మొదలు పెట్టాను ... మధ్యలో ఫోన్ చేయాలని ఉన్నా మా అత్తలతో భయం ... పది అవుతుండగా నాన్న నుండి ఫోన్ .."ఇంకా బయలుదేరలేదా? రాత్రి పూట ప్రయాణాలు కాస్త ముందుగానే వెళ్లాలని తెలియదా.. మావయ్యను పిలు నేను మాట్లాడుతాను "అని ఒక్క కసురు కసిరారు.... అసలే మాంచి కోపం మీద ఒకటి ఉన్నారు... ఇప్పుడు ట్రైన్ లేటంటే ఏమంటారో అని సైలెంట్గా మా మావయ్యకు ఇచ్చేసాను ఫోన్.. పాపం విషయం వినగానే నాన్న కోపానికి మావయ్య బలి.. మొత్తానికి పదకుండు అయింది మావయ్య ఇంకా రాలేదు.... నాకు కంగారు...." నీ కొడుకు ఎప్పుడు ఇంతే అమ్మమ్మ ..ఏం ఒక్క రోజు షాప్ నుండి తొందరగా వస్తే ఏం కొంపలు మునిగిపోయాయట ,ఆ ట్రైన్ వెళ్లి పోయిందంటే ఇంక అంతే" ఏడుపు మొహం వేసి అన్నాను .... పదకొండున్నర అవుతుండగా మావయ్య ఇంటికి వచ్చాడు ...ఈ లోపల చిన్న అత్తకు, అమ్మమ్మ కు నాలుగో విడత క్లాస్ పీకేసాను.. రాగానే తాండవం చేసేయబోతుంటే" ఇక ఆపు అక్కడ ట్రైన్ గంట కాదు ... రెండు గంటల లేట్ అంట రాత్రి పన్నెండున్నరకు వస్తుంది అట... ఫోన్ చేసి కనుక్కున్నాను "అన్నాడు.. నాకు నీరసం వచ్చేసింది..." అమ్మ బాబోయ్ పన్నెండున్నరకు వస్తుందా ...నాన్నక్కు తెలిస్తే ఇంకేమన్నా ఉందా " నీరసంగా జారబడ్డాను.." నీకేం నువ్వు బాగానే ఉంటావ్ నాకు కదా మీ నాన్న క్లాస్ పీకేది "అని మావయ్య అంటుండగానే మళ్ళీ ఫోన్.."ఇంకెవరూ మీ నాన్నే వెళ్లి ఎత్తు" అన్నాడు మావయ్య నవ్వుతూ..."మావయ్యా మావయ్యా ప్లీజ్ మావయ్య నువ్వు మాట్లాడి ఏదోఒకటి చెప్పవా "బ్రతిమాలే పొజిషన్ కొచ్చేసాను ... "అంటే బావగారు పర్వాలేదండి ..నేను ఉంటాను కదా ...పన్నెండుకి కూడా జనాలు తిరుగుతూనే ఉంటారండి ఏం పర్లేదు "...మావయ్య మాటలు మెల్లగా వినబడుతున్నాయి ... అటునుండి నాన్న కొంచెం గట్టిగానే తిడుతున్నట్లు ఉన్నారు..ఫోన్ పెట్టగానే అమ్మమ్మ మొదలు పెట్టింది .." ఏంటి అర్ధరాత్రి పూటా ఆడపిల్లను తీసుకువెళతావా ..అందునా నాన్న ఇంటికొచ్చే టైమయ్యింది.... చూసారంటే ఇంకేమయినా ఉందా అంటూ... అబ్బా ,నాన్న ఒంటిగంటకు కదమ్మా వచ్చేది నేను తీసుకు వెళ్తానుగా" మావయ్య సరిపెట్టేసాడు.. హూం గట్టిగా నిట్టూర్చి నిమిషాలు లెక్క పెట్టడం మళ్ళీ మొదలు పెట్టాను.. పన్నెండు అవుతుండగా మావయ్య మళ్ళీ కాల్ చేసాడు రైట్ టైం ఎన్ని గంటలకో కనుక్కుందామని .."దేవుడా దేవుడా ప్లీజ్ ప్లీజ్ "అనుకుంటూ ఉండగానే అటునుండి వాడు చెప్పాడు.." ఈ రోజు ఆ ట్రైన్ లేటండి రాత్రి 2 కి రావచ్చు" అని ... అయిపొయింది, ఇంక వెళ్ళినట్లే నిరాశ వచ్చేసింది ...మళ్ళీ నాన్న ఫోన్ ... "నువ్వే తీయవే ..ఇందాక నిన్ను అడిగినా ఏదో మేనేజ్ చేసాను " మావయ్య తనవల్లకాదని చెప్పేసాడు.. ఇక తప్పక 'హలో' అన్నాను.." ఏమైంది ఇంకా బయలు దేరలేదా" అన్నారు.." లేదు నాన్నా రెండుగంటలకట "అన్నాను మెల్లిగా.. "సరేలేగాని నువ్వు పడుకో ఇంక ...అంతగా అయితే రేపు నేను వచ్చి వైజాగ్ తీసుకెళతాలే "అన్నారు.. " కానీ నాన్న... మరీ ఆయన ఎదురుచూస్తారేమో" అన్నాను గునుస్తూ ... "చూడనీ.. ఇలా అర్ధం పర్ధం లేకుండా అర్ధరాత్రి ప్రయాణాలు పెడితే అలాగే అవుతుంది.. ఆడపిల్ల అనుకున్నాడా ఇంకేమన్నాన.. ప్రొద్దున్న కాల్ చేస్తాడులే అప్పుడు చెప్దాం నువ్వు పడుకో ఇక.. నేను రేపు వస్తున్నా" అని పెట్టేసారు... "మావయ్యా!!! ఇంకోక్కసారి ఫోన్ చేయవా "ఆశ చావకా అడిగాను ...కాల్ చేయగానే ..."ట్రైన్ రాత్రి రెండు మూడు మధ్యలో రావచ్చండీ".... వాడు ఇంకొంచెం టైం పెంచేసరికి ఇక మాట్లాడకుండా పడుకున్నాను..నా కళ్ళ ముందు ప్లాట్ఫాం మీద నాకోసం వెదుకుతున్న మా ఆయన కనిపించసాగారు... జాలి ,బాధ ,భయం కలగలిపి వస్తున్నాయి ...అసలే ముక్కు మీద కోపం అయ్యగారికి ...ఎన్ని అలకలు పెట్టి సాధిస్తారో అని.. ఎప్పుడు నిద్ర పట్టేసిందో ..బుజ్జీ ,బుజ్జీ అని ఎవరో పిలుస్తుంటే కళ్ళు తెరిచాను ...ఎదురుగా చిన్న మావయ్య ...." ష్ ... ట్రైన్ కరెక్ట్ టైం నాలుగున్నర కట.. నాలుగయ్యింది వెళదామా" అన్నాడు ... "మరి నాన్న,అమ్మమ్మ ".... అంటూ ఇంకేదో చెప్పబోతుంటే ...." అబ్బా అవన్నీ నేను చూసుకుంటాలే ... నేను సందు గుమ్మం వైపు బండి తీసుకొస్తాను నువ్వు మెల్లగా వచ్చేసేయి... తాతయ్య ఇంట్లోనే ఉన్నారు జాగ్రత్త "అన్నాడు ... తల కూడా దువ్వుకోలేదు ....అలాగే నా బ్యాగ్ పట్టుకుని చీకట్లో దొంగలా తడుముకుంటూ మెల్లిగా బయటకు వచ్చేసాను .... దారంతా మావయ్యా,నేను ప్లాన్స్ వాళ్లకు ఏం చెప్పాలి అని .... అక్కడ చేరుకున్నాకా ఇంకో అరగంట లేట్ చేసి అయిదుగంటలకు వచ్చింది ట్రైన్ .... మావయ్య కు టాటా చెప్పేసి ట్రైన్ లో కూర్చున్నాను ... మా ఆయన ఫ్రెండ్, వాళ్ళ ఆవిడ పలకరించారు ... ఆ సరికే కొంపలు మునిగిపోయినట్లు జనాలు పొలోమని లేచి అటు ఇటు తిరగడం మొదలు పెట్టారు ...నేను, మా ఆయన ట్రైన్ డోర్ వైపు,మొహా మొహాలు చూసుకుని గాడం గా నిట్టూర్చాం ... హోటల్ మేఘాలయ... అప్పటివరకూ తిరపతిలో రూమ్స్ తప్ప ఇలా హోటల్స్ లో డీలక్స్ రూమ్స్ అవి చూడలేదేమో ...నాకు అదేదో భలే బాగా నచ్చేసింది ...పరుపెక్కి గెంతులే గెంతులు..అప్పడే నాకు ఎ.సి అనే పరికరం గురించి తెలిసింది.... కావాలంటే మీరందరూ బయటకు పొండి ...నేను రానంటే రాను అని భీష్మించుకు కూర్చున్నా లాక్కునిపోయారు ....ఆ తరువాత మహా మహా హోటల్స్కి వెళ్ళినా ఆ సరదా అస్సలు రావడం లేదు :(... అనుకుంటాం గాని మన ప్రక్కన ఉన్న చిన్న చిన్న ఊర్లే బోలెడు బాగుంటాయి... నాకు వైజాగ్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది.. ఉడా పార్క్ ,కనక మహా లక్ష్మి గుడి ..అక్కడ ఒక వినాయకుడి గుడి ఉంటుంది ...చిన్న గుడే కాని చాలా ఫేమస్ ..పేరు గుర్తురావడం లేదబ్బా.. ఆ గుడి ..ఇంకా సింహా చలం ..కైలాస గిరి ..చాలా చూసాం ...రామ కృష్ణా బీచ్ లో అలలు చూడగానే నేను రాను బాబోయ్ అన్నా వాటి మధ్యలోకి వెళ్లి నిన్చోపెట్టేసారు మా ఆయన..టీవిలో చూడటమే అలా మధ్యలోకి వెళ్లి చూడటం భలే బాగుంది.. ( ఇక్కడ ఆరెంజ్ సినిమాలో జేనిలియాలా నేను సింహాన్ని చూసాను అన్న రేంజ్లో ఎక్స్ ప్రెషన్ ఇచ్చాను అప్పట్లో ) నిజం చెప్పాలంటే ఆ రోజు ఎంత హేపీ ఫీల్ అయ్యానంటే ఇప్పటికీ ప్రతి నిమిషం గుర్తుంది :) ఆ తరువాత అన్నవరం వచ్చేసాం.. ఆషాడం కదా జనాలు అస్సలు లేరు ..( గమనిక :ఆషాడం లో అన్నవరం వెళితే మీకు దర్సనం తొందరగా అవుతుంది ) వ్రతం అది అవ్వగానే మావారి ఫ్రెండ్ని వాళ్ళ ఊరు వెళ్ళిపొమ్మని చెప్పి , మా ఊరి స్టేషన్ లో నన్ను దిగబెట్టేసి నెక్స్ట్ ట్రైన్కి తను వెళ్లి పోయేట్లుగా ప్లాన్ .... నాన్నను స్టేషన్ కి రమ్మని ఫోన్ చేసి ట్రైన్ ఎక్కేసాం..కాసేపట్లో తను వాళ్ళ ఊరు వెళ్లిపోతున్నారంటే మళ్ళీ దిగులు... ఏవో మాట్లాడుతూ మధ్యలో..." మొన్నో సారి మా బావ ఏం చేసారో తెలుసా.. అక్కను తీసుకుని తెలియక ఒక ట్రైన్ ఎక్కబోయి మరొక ట్రైన్ ఎక్కేసారట ... మధ్యలో గమనించి దిగిపోయారట ...కాని పర్స్ తేవడం మర్చిపోయారట ... లక్కీగా మా నాన్న ఫ్రెండ్ అక్కడ కనబడితే ఆయన్నిడబ్బులు అడిగి ఊరు వెళ్ళారు ...ఇప్పటికీ నాన్న తలుచుకుని తలుచుకుని తిడతారు " అన్నాను.." అయినా మీ బావ అలా ఎలా చేసారు బుజ్జీ ..ఏ ట్రైన్ ఏదో తెలుసుకోకపోతే చాలా చిక్కుకదా..ఒంటరిగా అయితే ఎలా అయినా పర్వాలేదు.. ఆడవాళ్ళు ఉండగా చాల కష్టం తెలుసా అన్నారు మా ఆయన గొప్ప ఆశ్చర్యంగా మొహం పెట్టి .... అప్పటి వరకూ మమ్మల్ని గమనిస్తున్న మా ప్రక్కనున్నాయన "అమ్మా మీరు ఎక్కడి వరకూ వెళ్ళాలి "అన్నాడు ... నేను చెప్పాను.." ఈ ట్రైన్ వైజాగ్ వెళుతుంది మీరు ఎక్కినది కరెక్ట్ ట్రైన్ కాని చివరి రెండు బోగీలు వేరే బండికి కలుపుతాడు" అన్నాడు.. దెబ్బకి నాకు,మా ఆయనకు నో సౌండ్ ... తరువాతి స్టాప్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరే ... వెంటనే దిగిపోయాం ...దూరం నుండి టీ.సి మావైపు చూస్తున్నాడు.."అమ్మో రాంగ్ టిక్కెట్ ..పెనాల్టి అంటాడేమో" అన్నారు మా ఆయన ..." ఏం చేస్తాం తప్పదుగా కట్టండి" అన్నాను విసుగ్గా .. " బుజ్జీ ఒక విషయం చెప్తే తిట్టవు కదా "కొంచెం నసుగుతూ అన్నారు మా ఆయన ..." ఏంటీ "అన్నాను కోపంగా ...." నాకొక్కడికే కదా టిక్కెట్టు కావలసింది అని నిన్న మొత్తం ఖర్చు పెట్టేసాను" అన్నారు మెల్లగా....ఓరి దేవుడా ఏం చేద్దాం.. అనుకుంటుండగానే టీ.సి మా వైపు వచ్చాడు.."ఏంటి తప్పు ట్రైన్ ఎక్కి వచ్చేసారా .. చాలా మంది అలా పొరపాటు పడతారులెండి ...చీకటి పడుతుంది బస్ స్టాప్కి వెళ్లి మీ వూరు వెళ్ళిపొండి" అని పంపేశాడు.. బ్రతుకు జీవుడా అనుకుని బయటకు వచ్చేసాం.. "ఇప్పుడేం చేద్దాం నాన్న ఎదురు చూస్తారేమో ముందు నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పండి స్టేషన్ కి బయలుదేరి ఉంటారు "అన్నాను .. "అమ్మో !మీ నాన్నకా!! నీకు పుణ్యం ఉంటుందే బాబు... మీ బావని నాలుగేళ్లే తిట్టారు..నన్ను వదులుతారా .. అసలే వద్దంటే తీసుకువచ్చా అని కచ్చ మీద ఉండి ఉంటారు పరువుపోతుంది చెప్పకు ప్లీజ్ "అన్నారు .. "ఇప్పుడెలా మరి " అన్నాను విసుగ్గా .... " అంటే ఇది మీ అమ్మమ్మ వాళ్ళ ఊరే కదా ..మొన్న చెప్పకుండా వచ్చేసావ్ కదా ... అందుకని మీ అమ్మమ్మ మీద బెంగ పెట్టుకుని నువ్వు ఏడుస్తుంటే నిన్ను ఇక్కడకు తీసుకు వచ్చేసా అని చెప్తాను ఏమంటావ్ "అన్నారు.." ఏడ్చినట్లు ఉంది అస్సలు నమ్మరు "అన్నాను.. "నమ్మకపోయినా అదే చెప్పాలి పదా "అని మా అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్ళిపోయారు... ఇంటికి వెళ్ళగానే అమ్మమ్మను చూడగానే" అమ్మమ్మా "అని చెప్పబోతుండగా లోపల భోజనం చేస్తూ తాతయ్య ఉన్నారు...దెబ్బకు నూటొకటి... ఏం చెయ్యాలి???.. వెంటనే అమ్మమ్మా మొన్న తాతయ్యను చూడకుండా వెళ్లిపోయానుగా బెంగ వచ్చేసింది .... కలలో కూడా తాతయ్యే ... అని మా తాతయ్య ప్రక్కకు చేరిపోయాను వెక్కేస్తూ ... అప్పుడు పడిపోయిన మా తాతయ్య ఇప్పటికీ అలాగే నన్ను తలుచుకుంటారు.. మా బుజ్జోడికి నేనంటే ఎంత ప్రాణమో ...సింగపూర్ వెళ్ళినా నన్నే కలవరిస్తుంది అని.. నేను అంటే చాలా ప్రాణం పెట్టేస్తారు (అమ్మో ఇప్పుడు మా తాతయ్య మీద బెంగోచ్చేస్తుంది నాకు :(......) అలా అనేకానేక సాహసాలు చేసుకుంటూ మా ఇంటికి చేరాను ఆషాడంలో.. వీరిచే పోస్ట్ చేయబడింది నేస్తం వద్ద 12:02 PM 40 కామెంట్‌లు పాత పోస్ట్‌లు హోమ్ దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom) Google Analytics నా గురించి నేస్తం నా జాజి పూలు.. ఎన్నెన్నో ఙ్ఞాపకాల పరిమళాలు, తీపి తీపి కబుర్ల తోరణాలు, మిత్రుల కొరకు వేచి ఉన్న స్వాగతాలు, చిరుదివ్వెలు,విరి జల్లులు,హరి విల్లులు వెరసి నా జాజిపూలు...
అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉం డాలని, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు పేర్కొన్నారు. సోమవా రం జడ్పీ సమావేశ మందిరం లో స్థాయీ సంఘాల సమా వేశంలో జడ్పీ సీఈవో నరేం దర్‌తో కలిసి పాల్గొన్నారు. కోరం సభ్యులు హాజరు కాకపోవడంతో 2 కమిటీలతో సమావేశాలు సాదాసీదాగా నిర్వహించారు. వ్యవసాయం, మహిళా సంక్షేమం పైనే సమావేశాలు నిర్వహించారు. స్థాయి కమిటి సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌ పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 26: అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉం డాలని, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు పేర్కొన్నారు. సోమవా రం జడ్పీ సమావేశ మందిరం లో స్థాయీ సంఘాల సమా వేశంలో జడ్పీ సీఈవో నరేం దర్‌తో కలిసి పాల్గొన్నారు. కోరం సభ్యులు హాజరు కాకపోవడంతో 2 కమిటీలతో సమావేశాలు సాదాసీదాగా నిర్వహించారు. వ్యవసాయం, మహిళా సంక్షేమం పైనే సమావేశాలు నిర్వహించారు. లక్షెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య మాట్లా డుతూ ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని, వ్యవసాయానికి సంబం ధించి కందుల మీద సబ్సిడీ ఇవ్వడం లేదని నిలదీశారు. ధాన్యం తూకంలో క్విం టాల్‌కు 5 నుంచి 10 కిలోల వరకు ఎందుకు తేడా వస్తుందో తెలపాలన్నారు. మార్కెటింగ్‌ శాఖ అధికారి గజానంద్‌ మాట్లాడుతూ కొనుగోలు సమయంలో ఎటువంటి తేడా జరగడం లేదని, సమస్యలుంటే పరిష్కరిస్తామన్నారు. కందుల సబ్సిడీని ప్రభుత్వ ఆదేశానుసారం నిర్ణయిస్తామన్నారు. జిల్లా ఫారెస్టు అధికారి సమావేశాలకు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం అందించడం లేదని జడ్పీటీసీ సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై అధికారులు స్పందించడం లేదని జడ్పీటీసీ సభ్యుడు ముత్తె సత్తయ్య అన్నారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ విత్తనాల సరఫరా, ఆహార భద్రత పథకాల్లో పురోగతి తెలపాలని, అభివృద్ధి పను లలో ఆలస్యం ఎందుకు అవుతుందో తెలపాలన్నారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ మాట్లాడుతూ పార్టీలకతీతంగా అభివృద్ధి పనుల్లో అధికా రులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. సమావేశానికి హాజరు కాకపోవడం పరిష్కారం కాదని, దాని వల్ల ప్రజలు నష్టపోతారని, అభి వృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందన్నారు. అధికారులు ప్రభుత్వ పథకాల్లో అల సత్వం ప్రదర్శించవద్దన్నారు. ప్రజలతో మమేకమై జవాబుదారీగా వ్యవహరించ డం అధికారుల బాధ్యత అన్నారు.
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది 30, జూన్ 2020, మంగళవారం భూతల స్వర్గమేనా...16 పార్ట్... 16 అనోన్య స్కూల్ లో నోటీస్ బోర్డ్ మీద ఓ స్లోగన్ రాసుండేది. అది నాకు బాగా నచ్చింది కూడా... " No one can do everything But Every men can do something "...నిజమే కదా ఇది. రోజులు గడిచిపోతున్నాయి మామూలుగానే. నాకు పిల్లల పని, అప్పుడప్పుడు వంట, ఫోన్లు ఇలా జరిగిపోతోంది. డాక్టర్ గారు మూడ్ బావుంటే బానే ఉండేవారు, లేదంటే అప్పుడప్పుడూ ఏదోకటి అనేవారు. నా టైమ్ బాలేదులే అని సరిపెట్టుకునేదాన్ని. ఓ రోజు డాక్టర్ గారికి వాళ్ళాయన ఫోన్ చేస్తే, ఆవిడ తీయలేదు. అందుకని ఇంటికి చేసారు. నేను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాను. ఇక ఆ సాయంత్రం డాక్టర్ గారు నన్ను ఫోన్ ఎక్కువ వాడవద్దని చెప్పారు. నాకు వేరే ఫోన్ లేదు. ఆరోజు చాలా బాధనిపించింది. నాకేదయినా బాధనిపిస్తే పుస్తకంలో రాసుకునేదాన్ని అప్పుడు. పెళ్ళైనప్పటి నుండి ఇలా ఎవరితో ఒకరితో మాటలు పడాల్సి వస్తోందని దిగులు వేసింది. నాకంటూ ఏమి లేకపోబట్టే కదా ఇలా జరుగుతోందనిపించింది. ఇలా బాధ పడిన క్షణాలెన్నో. ఉమకి విషయం చెప్పాను. నాకు చెప్పకుండానే ఉమ సెల్ ఫోన్ బుక్ చేసింది. అది వచ్చే ముందు చెప్పింది. మెుత్తానికి నా మెుదటి సెల్ ఫోన్ రావడమూ, దానిని యాక్టివేట్ చేయడమూ జరిగిపోయింది. స్ప్రింట్ నెట్ వర్క్ అన్నమాట. అప్పటి నుండి అమెరికా వదలి వచ్చే వరకు అదే నెట్ వర్క్ వాడాను. నా H1B అమెరికన్ సొల్యూషన్స్ ఫైల్ చేయడము, LIN నెంబర్ రావడమూ జరిగింది. ఓ రోజు సుబ్బరాజు ఇందుకూరి కాల్ చేసి 3వీక్స్ జాబ్ ఉంది. వెంటనే జాయిన్ కావాలి వెళతారా అన్నారు. మరి డాక్టర్ గారు నేను సడన్ గా వెళిపోతే ఇబ్బంది పడతారు కదా, అదీనూ 3 వారాలే అంటున్నారు, మీ ఇష్టం వెళ్ళమంటే వెళతాను అన్నాను. ఏ విషయం మళ్ళీ ఫోన్ చేస్తానన్నారు. ఇదంతా డాక్టర్ గారు ఇంట్లో ఉన్నప్పుడే జరిగింది. మరుసటి రోజు సుబ్బరాజు ఫోన్ చేసి మరేదైనా జాబ్ చూద్దాంలెండి అన్నారు. అప్పటి నుండి డాక్టర్ గారు బావుండేవారు నాతో. నాకు ఫోటోలు తీయడం, అందరివి కలక్ట్ చేయడం బాగా ఇష్టం చిన్నప్పటి నుండి. అమెరికా వచ్చాక కెమేరా కొనలేదు. పిట్స్ బర్గ్ వచ్చాక 10 డాలర్లకు కెమేరా షాప్ లో చూసి, అది కొన్నాను. దానితో నాకు వచ్చినట్టు ఫోటోలు తీసేదాన్ని. మధ్యలో క్రిస్మస్ కి హాలిడేస్ వచ్చాయి. డాక్టర్ గారి హజ్బెండ్ పిట్స్ బర్గ్ వస్తానన్నారు. డాక్టర్ గారికి కూడా శలవలే. బాల్టిమెార్ లో ఉండే శిరీష వాళ్ళు డెల్లాస్ వెళిపోయారు. తనేమెా వాళ్ళింటికి రమ్మని, నా ఫ్రెండ్ వెంకట రమణ కాలిఫోర్నియా రమ్మంటే, డాక్టర్ గారు వెళ్ళిరా ఓ 4,5 రోజులు, నేను చూసుకుంటాను పిల్లలని, ప్రసాద్ కూడా వస్తారు కదా అన్నారు. సరేనని రానుపోనూ ఫ్లైట్ టికెట్ రమణతో బుక్ చేయించుకున్నా నా డబ్బులతోనే. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ కి. మెర్సీ గారి హజ్బెండ్ నన్ను ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేస్తూ, పాస్ పోర్ట్ బయటకు తీయకండి, స్టేటస్ ఇబ్బంది అవుతుందేమెా, డ్రైవర్ లైసెన్స్ ఇవ్వండి ఐడిప్రూఫ్ కి అంటే లైసెన్స్ లేదండి, స్టేట్ ఐడి ఉంది అంటే, అది చూపించండి చాలు అన్నారు. మెుత్తానికి శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో దిగాను. లగేజ్ తీసుకుంటుంటే వెంకట రమణ ఫోన్, ఎక్కడ ఉన్నావని, నన్ను చూడలేదు కదా గుర్తు పట్టడానికి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. నా ఫ్రెండ్ శోభ, అబ్బు కూడా కాలిఫోర్నియాలోనే ఉన్నారు. వాళ్ళకు ఫోన్ చేసాను. అబ్బు వాళ్ళ అన్నయ్య వాళ్ళింట్లో ఉంటున్నాడు. రమణ వాళ్ళింటికి దగ్గరలోనే. తోలు ఓ రోజు భోజనానికి కూడా వెళ్ళాం. శోభ వచ్చి వాళ్ళింటికి తీసుకువెళ్ళింది. బోలెడు మా కాలేజ్ కబుర్లు చెప్పుకుని, హైదరాబాదులోని శ్రీదేవికి ఫోన్ చేసాము. ఇద్దరం మాట్లాడుతుంటే తనకి నేను అమెరికాలో ఉన్నానా అని డౌట్. నువ్వు కూడా అమెరికా వెళ్ళావా అంది. ఏం వెళ్ళననుకున్నావాఅన్నాను. అలా కాసేపు తనని ఏడిపించాం. నన్ను షాప్ కి తీసుకువెళ్ళి, నా ఫోటో పిచ్చి తెలుసు కనుక, నాకు ఓ ఆల్బం కొనిపెట్టి, మళ్ళీ రమణ వాళ్ళింట్లో వదిలేసింది. వాళ్ళు ముగ్గురు రూమ్మేట్స్. ఇద్జరు తెలుగు, మరొకరు కన్నడ. నాకు కన్నడ వచ్చుగా, చాలా రోజుల తర్వాత కన్నడ మాట్లాడాను ఈ రూపంగా. మెుత్తానికి పుస్తకాల్లో చదివిన గోల్డెన్ గేట్ చూడటం ఓ థ్రిల్. పోర్ట్ కూడా చూసాను. వెస్ట్ సముద్రం వర్షంలో చూడటమెా మంచి అనుభూతి. మెుత్తానికి కాలిఫోర్నియా ట్రిప్ బాగా జరిగింది నా కెమేరాతో ఫోటోలు తీసుకోవడంతో సహా. అలా ఓ ఆరు నెలలు పిట్స్ బర్గ్ లో గడిచిపోయాయి. ఆ టైమ్ లోనే ఓ అమెరికన్ లాయర్ తో చికాగో బాబ్ గురించి మాట్లాడాను. బాబ్ కి మెయిల్ కూడా పెట్టాను. నాకు బాకీ ఏది ఉంచుకోవడం ఇష్టం ఉండదు. కుక్కకయినా జాబ్ వస్తుంది, నాకు రాదన్నాడు కదా, డాలర్ కూడా ఇవ్వనన్నాడు. అది గుర్తు చేస్తూ, అవును కుక్కకి వస్తుంది, నాకు వస్తుంది జాబ్. కాని నీకు రాదు అని వాడికి మెయిల్ పెట్టాను. వినయ్ గుమ్మడి గారు ఫోన్ చేసి HNC బాబ్ మీద కేస్ ఫైల్ చేద్దామన్నారు. అనవసరమండి అంటే కాదు ఇద్దరం కలిపి వేద్దామన్నారు. 1500 డాలర్లు పంపండి, నేను తర్వాత ఇస్తాను లెక్కలు చూసి అన్నారు. సరేనని పంపించాను. లాయర్ బాబ్ కి నోటీస్ పంపాడు. లాయర్ తో కపుల్ఆఫ్ డాలర్స్ ఇస్తాను సరి చేయమన్నాడట. నవ్వుకున్నా.. నాకు రావాల్సినవి ఇమ్మనండి చాలన్నాను. మన లాయర్సే కాదు అక్కడి లాయర్స్ కూడా అంతే. వినయ్ గారు కొన్ని రోజులు ఫాలోఅప్ చేసి, లాయర్ కి తలో 2,3 వేల డాలర్లు సమర్పించి, బాబ్ మాకు ఇవ్వాల్సిన వాటికి ఇవి మేం కట్టిన వడ్డీ అని సరిపెట్టేసుకుని ఓ దణ్ణం పెట్టి వదిలేసాం. తర్వాత నా పుట్టినరోజుకి డాక్టర్ గారు పట్టుచీర, కేక్ కట్ చేయించారు. మెర్సీ గారు కూడా వచ్చారు. ఇంతలో నాకు H1B కి డబ్బులు కట్టిన రామస్వామి యనమదల గారికి మనుషులు కావాల్సివచ్చారు. మా ఆయన ఫోన్ లో చికాగో రామస్వామి గారి దగ్గరకు వెళ్ళు, అన్ని వాళ్ళు చూసుకుంటారని చెప్పాడు. ఫోన్ చేసి మాట్లాడితే వచ్చేయమన్నారు. ఓ వారం, పది రోజులు టైమ్ కావాలని చెప్పాను. డాక్టర్ గారికి మరో మనిషి దొరికి ఆమెకు పిల్లలను, పనిని అలవాటు చేసి, చికాగో బయలుదేరాను. అనోన్య బాగా ఏడిచింది, నాకూ బాధనిపించింది. నేను వెళిపోతున్నానని డాక్టర్ గారి ఫ్రెండ్ మెర్సీ వాళ్ళు వచ్చి నాకో 25 డాలర్లు కూడా ఇచ్చారు. అభీని స్కూల్లో దించేటప్పుడు నాకో అమెరికన్ మంచి ఫ్రెండ్ అయ్యిందని చెప్పాను కదా. తను ఓసారి ఇంటికి కూడా వచ్చింది, నన్ను డ్రాప్ చేయడానికి. చికాగో వెళడానికి బస్ టికెట్ తీసుకున్నా. నన్ను డ్రాప్ చేయడానికి అమెరికన్ ఫ్రెండ్ వస్తానంది. తనకి నేను కొన్న కెమేరా ఇచ్చేసాను అప్పటికే. తను వాళ్ళింటికి తీసుకువెళ్ళి డిన్నర్ పెట్టి, బస్ స్టేషన్ లో బస్ ఎక్కించి, జాగ్రత్తలు చెప్పి,గిఫ్ట్ ఇచ్చింది. అది 35 డాలర్స్ గిఫ్ట్ కార్డ్. వద్దంటే వినలేదు. మరోసారి చికాగో బయలుదేరాను బస్ లో.
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి అధికారంలోకి వచ్చాక జుట్టు రాలడం ఎక్కువై బట్టతల బయటపడుతోంది. ఫలానా ఫలానా వాళ్లు కట్టకట్టుకొని వచ్చినా ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అని ఆయనే... ఖాళీ నేతలతో ఒరిగేదేమిటి? ‘‘చంద్రబాబు కట్టని, కట్టలేని రాజధాని అమరావతిని నన్ను కట్టమంటే ఎలా? డబ్బులు లేవు గానీ.. చేతిలో డబ్బులు ఉండి ఉంటే అమరావతిని కట్టేవాడినే!’’ ..ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటన ఇది... పాపం కాంగ్రెస్‌! కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్‌ పార్టీ బలంగా కనిపించింది. ఆ పార్టీ అధినేత సోనియాగాంధీ ప్రపంచంలో శక్తిమంతమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు. గతమెంతో ఘనమన్నట్టుగా సాగిన కాంగ్రెస్‌ పార్టీ... అరాజకీయం అటు.. ఇటు! తెలుగు రాష్ర్టాల రాజకీయాలు ఆందోళనకరంగా ఉంటున్నాయి. రాజకీయ పార్టీలు సంయమనం కోల్పోతున్నాయి. ఫలితంగా ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. పార్టీల మధ్య సిద్ధాంతపరంగా ఉండాల్సిన విభేదాలు వ్యక్తిగత వైషమ్యాలకు... పెద్ద సార్ల సుద్దులు! స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా పంద్రాగస్టు రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నోళ్ల నుంచి వెలువడిన సుభాషితాలు... స్వరాజ్యవేళ సిగ్గు సిగ్గు...! దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలను జరుపుకొంటున్నాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించాం.... ‘మునుగోడు’లో మునిగేదెవరు? భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం పన్నిన వ్యూహంలో భాగంగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోంది. కేసీఆర్‌ అష్టదిగ్బంధనం? ‘ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు’గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెట్టుకున్న వైరం కారణంగా... కేసీఆర్‌.. కింకర్తవ్యం? ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ, భారతీయ జనతా పార్టీకీ మధ్య నడుస్తున్న వ్యూహప్రతివ్యూహాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ఉన్నట్టుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించి, ఆయనను వ్యక్తిగతంగా దుర్భాషలాడుతున్న... జగన్‌.. కపట నాటకం! ‘‘తల్లీ చెల్లీ అంటూ ఏ సెంటిమెంటూ లేని సిల్లీ ఫెలోవి’’ అని అసెంబ్లీ రౌడీ చిత్రంలో మోహన్‌బాబు ఒక డైలాగ్‌ చెబుతాడు. శుక్రవారంనాటి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి...
కోవర్టుగా, నరేంద్ర మోదీ ఏజెంట్‌గా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పనిచేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి విమర్శించారు. పరిపాలనా సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన గట్టుప్పల మండలంలో ఆదివారం నూతన కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. గట్టుప్పల మండల ప్రారంభ సభలో మాట్లాడుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 మంత్రి జగదీ్‌షరెడ్డి గట్టుప్పల మండల కార్యాలయాలు ప్రారంభం చండూరురూర ల్‌, అక్టోబరు 2: కోవర్టుగా, నరేంద్ర మోదీ ఏజెంట్‌గా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పనిచేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి విమర్శించారు. పరిపాలనా సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన గట్టుప్పల మండలంలో ఆదివారం నూతన కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడా రు. బ్రిటీష్‌ వారికి, నిజాం రజాకార్లకు భూస్వాములు కోవర్టులుగా మారి దేశాన్ని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినట్లు మునుగోడు ప్రాంత ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్‌రెడ్డి బీజీపీకి తాకట్టు పెట్టారని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని 2.20లక్షల మంది ఓట ర్ల నమ్మకాన్ని, అభివృద్ధిని స్వలాభం కోసం రూ.22వేల కోట్ల రూపాయలకు అమ్మిన కోవ ర్టు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని అన్నారు. ఈ ప్రాంతానికి ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గతంలో ఉప ఎన్నికలు కేవలం ఆ ప్రాంత ఎమ్మెల్యే మృతిచెందితేనో, అనివార్య కారణాలతో రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటేనో, రెండు పదవులకు ఎన్నికైతే ఒక దానికి రాజీనామా చేస్తేనే ఉప ఎన్నిక వచ్చేదన్నారు. అయితే స్వలాభం కోసం బహిరంగ మార్కెట్‌లో అమ్ముడుపోయి పార్టీకి, పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు గతంలో ఎవ్వరూ వెళ్లలేదని విమర్శించారు. బీజేపీలో చేరి ఈ ప్రాంతానికి అమిత్‌షాను తీసుకువచ్చి ఏం చేశాడు, ఏం తెచ్చాడు, ఎన్ని నిధులు మంజూరు చేయించారని మంత్రి ప్రశ్నించారు. భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని, అన్ని రంగాల్లో దేశంలో తొలిస్థానంలో నిలబెట్టిన సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలు, రైతులు, నాయకుల కోరిక మేరకే సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీని స్థాపిస్తున్నారని పేర్కొన్నారు. మునుగోడు ప్రాంత ప్రజలు 50 సంవత్సరాల నుంచి ఫ్లోరోసిస్‌ బారిన పడి ఎన్నో అవస్థలు పడ్డారని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ వంటి పథకాలను అమలు చేయడంతో ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్‌ పూర్తిగా రూపుమాసిపోయిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని అన్నారు. అది గట్టుప్పల మండలం నుంచే మొదలవ్వాలని, రానున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించి గట్టుప్పల, మునుగోడు ప్రజలు సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, 37 ఏళ్ల కల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో సాకారమైందన్నారు. 1984లో గట్టుప్పల మండల ఏర్పాటుకు ప్రతిపాదన ఉండగా, నేడు ఏర్పాటైందన్నారు. గట్టుప్పల నూతన మండల కార్యాలయాలు ప్రారంభం అనంతరం తహసీల్దార్‌గా పులి సైదులు, ఎస్‌ఐగా ఉప్పు సురేష్‌ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ రెమారాజేశ్వరి, ఆర్డీవో జగన్నాథరావు, గట్టుప్పల ఎన్నికల ఇన్‌చార్జి గొపగాని వెంకట్‌నారాయణ గౌడ్‌, మునగాల నారాయణరావు, గుర్రం వెంకట్‌రెడ్డి, బొమ్మరబోయిన వెంకన్న, అన్నెపర్తి శేఖర్‌, గ్రామ సర్పంచ్‌ ఇడెం రోజా, ఇడెం కైలాసం, ఎంపీటీసీలు అవ్వారు గీతాశ్రీనివాస్‌, చెరుపల్లి భాస్కర్‌, గొరిగ సత్తయ్య, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.
నారదమహర్షి మాటలను వినిన అంబరీష మాహారాజు నారదమహర్షికి నమస్కరించి మహర్షీ! వైశాఖమాసమున చేయదగిన దానము లివియేనా? మరి యింకనూ ఉన్నవా? అవి యేవి? వాని ఫలితములను గూడ దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును (మంచమును) సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినవారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండ జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆధివ్యాధులు లేకుండ సుఖముగ జీవింతురు. ఇహలోకసుఖముల ననుభవింతురు. పాపములు లేకుండనుందురు. అంతియేకాదు మహాయోగులు సైతము పొందలేని అఖండమోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖమాసపు యెండలకు బాధపడినవారికి /బ్రాహ్మణశ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి యుత్తమ పర్యంకమునిచ్చి యిహలోకముననెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు / సద్బ్రాహ్మణుడు ఆశయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వపాపములును అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. Vaishakha Purana – Chapter 3 ఇహలోక సుఖములననుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖమాసమున కశిపును(పరుపు లేక వస్త్రము) మంచముపై మంచి ఆచ్చాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై/చక్రవర్తి సమానులై తమ వంశము వారితో బాటు శారీరక, మానసిక బాధలు లేకుండ సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు. ఆయురారోగ్యములను కీర్తిప్రతిష్ఠలను పొందుదురు. నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తినందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతోబాటు దిండును గూడ దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును, పరుపును, దిండును యిచ్చుటచే ఆ దాత అందరకు అన్నివిధముల ఉపకారము చేయువాడై ప్రతిజన్మయందును, సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు యేడు జన్మల వరకు మహావైభవముగ గడిపి తుదకు ముక్తినందును. Vaishakha Purana – Chapter 3 తనతోబాటు నేడు తరములవారికిని ముక్తిని కలిగించును. గడ్డి తుంగ మున్నగువానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీమహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించును. ఊర్ణ, ఉన్ని, గొఱ్ఱె బొచ్చు నీటియందు పడినను తడవకనుండునో అట్లే పర్యంక శయ్యా దానము చేసినవారు. సంసారసముద్రములోనున్నను ఆ వికారములంటని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేనివారు కట(చాప) దానమును చేయవచ్చును. శక్తియుండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై కట/శయ్యాదానము చేసినవారికిని వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ, దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములనిచ్చును. రాజా! వైశాఖమాసమున కంబళి దానము చేసినవానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును. ఎండచే పీడింపబడినవానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తుదకు ముక్తినందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును. దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులను వశపరచుకొన్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు, మనుమలు మున్నగువారితో సర్వసౌఖ్యములనంది ముక్తినందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున కర్పూర, తాంబూల దానమిచ్చినచో చక్రవర్తియై మోక్షమునందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయమునశించి సుఖించును. దుఃఖములు, పాపములు లేకుండ జీవించి ముక్తి నందును. కస్తూరి మున్నగు సుగంధద్రవ్యముల నిచ్చినచో నెట్టి బాధలు లేకుండ జీవించి మోక్షమునందును. పద్మమాలను గాని అడవిమల్లెల మాలనుగాని దానమిచ్చినచో చక్రవర్తియై సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తినందును. వైశాఖమున మొగలి, మల్లెపువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని యనుగ్రహమున సుఖ భోగములనంది ముక్తి నందును. పోక చెక్కలను, సుగంధద్రవ్యమును, కొబ్బరి కాయలను దానమిచ్చినచో నేడు జన్మలవరకు బ్రాహ్మణుడై జన్మించి వేదపండితుడు, ధనవంతుడై యుండి యేడు తరములవారితో గలసి ముక్తినందును. సద్బ్రాహ్మణుని యింటిలో విశ్రాంతి మండపమును కట్టించి యిచ్చినచో వాని పుణ్యము యింతయని చెప్పుటకు మాటలకందనిది సుమా. నీడనిచ్చు మండపము, నీడలోనున్న యిసుక తిన్నెలు, చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు, జనులకు ఉపకారము చేసినవారు లోకాధిపతులగుదురు. Vaishakha Purana – Chapter 3 మార్గమున తోట, చెరువు, నూయి, మండపము, వీనిని నిర్మింపజేసినవానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలని భయము లేదు. నూయి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము,పరులకుపయోగించు మంచి పనులు చేయుట, పుత్రుడు యివియేడును సప్తసంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలోనే యొకటి చేయకున్నను మానవునకు పుణ్యలోకప్రాప్తి లేదు. సచ్చాస్త్రశ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వర్థరోపణము (రావి చెట్టును నాటుట) పుత్రుడు అను నేడును సప్తసంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు. వందలకొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేనివానికి పుణ్యలోకప్రాప్తి లేకుండుటచే నతడు పైన చెప్పిన యేడు సంతానములలో యధాశక్తిగ వేనినైనను ఏ ఒకదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములనందవచ్చును. పుణ్యపాప వివేకములేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోకప్రాప్తినందవు. కాని పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులి సద్ధర్మముల నాచరింపనిచో వారికి పుణ్యలోకములెట్లు కలుగును. ఉత్తమములైన పోకచెక్కలు, కర్పూరము మున్నగు సుగంధద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నియు పోవును. తాంబూల దాత కీర్తిని ధైర్యమును, సంపదను పొందును. నిశ్చయము, రోగియైనవాడు తాంబూల దానము నిచ్చినచో రోగవిముక్తుడగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తినందును. వైసాఖమాసమున తాపహారకమైన తక్రమును(మజ్జిగ) దానమిచ్చినవాదు విద్యావంతుడు, ధనవంతుడు నగును. కావున వేసవి కాలమునందు తక్రదానము తప్పక చేయదగినది సుమా. వేసవికాలమున ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగ నిచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మపండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగయైన దప్పిక కలవానికి హితకరముగ నుండును. వైశాఖమాసమున దప్పిక తీరుటకై బాటసారులకు /సద్బ్రాహ్మణులకు పెరుగు కుండనిచ్చినచో కలుగు పుణ్యమెంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీవల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్ఠమైన బియ్యమును దాన మిచ్చినవారు పూర్ణాయుర్దాయమును, అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమునుపొందును. తేజోరూపమైన గోఘ్ర్తమును(ఆవునేయి) సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమునంది తుదకు విష్ణుపదమును చేరుదురు. విష్ణుప్రీతికరమైన వైశాఖమాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చినవారు సర్వపాపములను పోగొట్టుకొని శ్వేతద్వీపమున వసింతురు. పగటి యెండకు అలసినవానికి సాయంకాలమున చెరకు గడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యమనంతము. వైశాఖమాసమున సాయంకాలమున యెండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖమాసమున పానకముతో బాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వపాపములు హరించును. పుణ్యలోకప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్యయందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరుమార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. Vaishakha Purana – Chapter 3 ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్లు మున్నగువానిని కలిపి చైత్రమాసము నందలి అమావాస్యయందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను.
ఆర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలోసిహెచ్ క్రాంతి కిరణ్ సహకారం తో అదిరే అభి ( అభినవ కృష్ణ ) ఆమీక్షా పవార్,ప్రగ్య నాయన్, సోనాక్షి వర్మ హీరో హీరోయిన్లుగా సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సస్పెన్స్ త్రిల్లర్ చిత్రం “ఇన్ సేక్యూర్” నవంబర్ 11న గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ … తప్పు చేసి డబ్బు హోదాను అడ్డుపెట్టుకుని చట్టం నుండి ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే చెడు ఆలోచనను దూరం చేసే ప్రయత్నగా “ఇన్ సేక్యూర్” మూవీని నిర్మించాం ఈ చిత్రంలో కీలక పోలీస్ పాత్రలో “సీతారామం” ఫేమ్ మధు నంబియర్, నటించగా ప్రముఖ ప్రొడ్యూసర్ రాజేష్ నాయుడు మరో కీలక పాత్రలో నటించారు, నవంబర్ 11న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ చిత్రం మా బ్యానర్లో నాలుగో చిత్రం గతంలో నందికొండవాగుల్లోన , మోని , స్టూవర్టుపురం చిత్రాలు నిర్మించాం గత చిత్రలాగానే ఈచిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు ఈ చిత్రానికి సంగీతం : నవనీత్ చారి ,సమర్పణ: రంజిత్ కోడిప్యాక , సహకారం : సిహెచ్ క్రాంతి కిరణ్ , పాటలు : బస్వాగాని భాస్కర్ , మాటలు : శిల్ప కసుకుర్తి , నిర్మాత, దర్శకత్వం : సత్యనారాయణ ఏకారి Adire Abhi, Amiksha Pawar, Archon Entertainments, CH Kranti Kiran, Pragya Nayan, Ranjith Kodipyaka, Satyanarayana Ekari, Sonakshi Verma, Suspense Thriller "In Secure", Telugu70mm, Tollywood
మీరు ఇది గమనించారో లేదో.. మధ్య వయస్కుల్లోనే పీడకలలు ఎక్కువగా వస్తాయి. దీని వెనుక అసలు నిజాన్ని బయటపెట్టారు శాస్త్రవేత్తలు. అదేంటంటే.. పీడకలలు రాత్రిళ్లు నిద్రలేకుండా చేయడమే కాదు.. మనస్సును కుదురుగా ఉండనీయవు. అసలు ఇలా ఎందుకు కల పడింది. దీనిఅర్థం ఏంటని.. ఆలోచించేలా చేస్తాయి. నిజానికి ఈ పీడకలలకు మీ ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉందని పరిశోధకులు గుర్తించారు. తాజాగా చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. మధ్యవయస్కుల్లో రోజూ పీడకలలు వస్తే వారు పెద్దవారయ్యాక చిత్త వైకల్యం వచ్చే ప్రమాదం ఉందని వెల్లడైంది. పీడకలలు వచ్చే వారిలో మతిమరుపు సమస్య వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అంటే వీరిలో మెదడు కణాలు దెబ్బతిన్నాయన్న సంకేతం అన్న మాట. చిత్తవైకల్యం అంటే ఏంటి? చిత్తవైకల్యం అంటే విషయాలను మర్చిపోవడం. విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం తగ్గడమని అర్థం. సాధారణంగా ఈ సమస్య 90 ఏండ్ల వయసు వారిలోనే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ సమస్య చిన్న వయసువారిలోనే కనిపిస్తుంది. ఈ చిత్తవైకల్యం వల్ల ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. రోజు వారి జీవితం ఛేంజ్ అవుతుంది. స్వతంత్ర్యంగా పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. ఇది రోజు రోజుకు మీ పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. పరిశోధన ఏం చేబుతోంది బర్మింగ్ హమ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మూడు అధ్యయనాలను విశ్లేషించారు. దీనిలో మధ్యవయస్కులు (35 నుంచి 64 ఏండ్లు) 600 మందితో పాటుగా 2,600 పెద్దవయసు (79 ఏండ్ల నుంచి అంతకంటే ఎక్కువ) వారు వయోజనులు పాల్గొన్నారు. వీరిలో నిద్ర నాణ్యత, మెదడు ఆరోగ్యం గురించి పరిశోధన జరిపారు. కనీసం వారానికి ఒకసారి చెడు కలలు కంటున్న మధ్య వయస్కులు రాబోయే దశాబ్దంలో అభిజ్ఞా క్షీణతను అనుభవించే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. చెడు కలల వల్ల నిద్రకూడా సరిగా ఉండదు. ఇది కాస్త చిత్తవైకల్యంతో సంబంధం ఉన్న ప్రోటీన్ల నిర్మాణికి దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. సాయంత్రం అయితే కెఫిన్ ఉండే కాఫీ, టీలను, ఇతర పానీయాలను తాగకపోవడం బెటర్. ఒత్తిడి నుంచి బయటపడటానికి మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిటీ మెండర్స్ తో మాట్లాడండి. టీవీ, మొబైల్ ఫోన్ స్క్రీన్ ను చూసే సమయాన్ని తగ్గించండి. రాత్రి భోజనంలో గ్యాస్ ను కలిగించే ఆహారాలను తినడం మానుకోండి. నిద్రపోయే రెండు గంటల ముందు నుంచి పనిచేయడం, చదవడం మానేయండి. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా రుగ్మతలతో మీరు నిద్రతో బాధపడుతున్నట్లయితే.. వైద్యుడిని సంప్రదించండి.
thesakshi.com : “ఇన్‌క్రెడిబుల్ ఇండియా” యొక్క మంత్రముగ్ధులను చేసే అందాలను చూసి మరోసారి ఆశ్చర్యపోయిన నార్వేజియన్ దౌత్యవేత్త ఎరిక్ సోల్‌హీమ్, ఇటీవల హిమాలయాల ఎత్తైన శివాలయం యొక్క ఉత్కంఠభరితమైన డ్రోన్ వీడియోను పంచుకున్నారు. సోల్హీమ్ ఆదివారం ట్విట్టర్‌లో క్లిప్‌ను పంచుకున్నారు మరియు ఇది 720,000 కంటే ఎక్కువ వీక్షణలు మరియు 50,000 కంటే ఎక్కువ లైక్‌లను సేకరించింది. “ఇన్‌క్రెడిబుల్ ఇండియా! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాదేవ్ మందిరం.., 5000 ఏళ్ల నాటిదని నమ్ముతారు! ఉత్తరాఖండ్,” అని దౌత్యవేత్త పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. అద్భుతమైన క్లిప్ పూర్తిగా మంచుతో కప్పబడిన పర్వతాలలో ఉన్న శివాలయం యొక్క 360-డిగ్రీల వైమానిక దృశ్యాన్ని సంగ్రహించింది. ‘కేదార్‌నాథ్‌’ సినిమాలోని ‘నమో నమో’ అంటూ సాగే పాట కూడా వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తోంది. Incredible India 🇮🇳! World's Highest Located Mahadev Mandir.., believed to be 5000 years old ! Uttarakhand pic.twitter.com/GwWfxoHrra — Erik Solheim (@ErikSolheim) October 2, 2022 ఈ పోస్ట్ వెంటనే ఇంటర్నెట్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. కొంతమంది నెటిజన్లు అద్భుతమైన వీక్షణ యొక్క అందాన్ని చూసి ఆశ్చర్యపోతుండగా, మరికొందరు, అయితే, దౌత్యవేత్త యొక్క శీర్షిక తప్పుదారి పట్టించేలా ఉందని అభిప్రాయపడ్డారు. “ఆలయ వాస్తుశిల్పం అద్భుతంగా ఉంది, ఇది హిమపాతాలు మరియు భూకంపాల నుండి కూడా బయటపడింది” అని ఒక వినియోగదారు రాశారు. “పంచ కేదార్లలో ఒకటైన తుంగనాథ్ మహాదేవ్ ఆలయం. ఆలయానికి ట్రెక్ చాలా అద్భుతంగా ఉంది. కొంచెం పైన చంద్రశిల ఉంది, ఇక్కడ నుండి హిమాలయ శిఖరాలు 270-డిగ్రీల విశాల దృశ్యం… అద్భుతమైన భారతదేశం,” మరొకటి జోడించారు. మూడవవాడు, “ఇది ఎత్తైనది కాదు, మరియు ఆలయ నిర్మాణం ఖచ్చితంగా 5000 సంవత్సరాల పురాతనమైనది కాదు. ఇది దాని స్వంత అందమైన దేవాలయం; మరియు ఈ తప్పు విశేషణాలు అవసరం లేదు.” నాల్గవవాడు ఇలా వ్యాఖ్యానించాడు, “అంత పాతది కాకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఆలయం క్రీ.శ. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల కాలంలో నిర్మించబడింది. వరదలు మరియు హిమపాతాలకు లోనయ్యే భూభాగాల కారణంగా ఏదైనా ముందస్తు పురావస్తు ఆధారాలు కష్టంగా ఉంటాయి.” ఇదిలా ఉండగా, ప్రభుత్వ స్థలం ప్రకారం, తుంగనాథ్ ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం, ఇది ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో 3,680 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆలయం 1,000 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. Tags: #Rudraprayag district#Uttarkhand#viral videohighest Shiva templeIncredible IndiaInternet MesmerisedShiva temple
రేపు విజ‌య‌వాడ‌లో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన ఆ రాత‌లు సిరాతో రాస్తున్నారా..? సారాతో రాస్తున్నారా..? ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ఔదార్యం ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఔదార్యం బీసీలంతా త‌లెత్తుకొని తిరిగేలా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న ర‌విశేఖ‌ర్ కుమార్తె వివాహానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ దంప‌తులు హాజ‌రు నిరుపేదల పాలిట ప్రాణదాత మీరిచ్చిన స‌హ‌కారం, మ‌నోధైర్యంతో ముఖ్యమంత్రిగా మీ ముందున్నా.. సీబీఆర్ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ‘జయహో బీసీ మహాసభ’ను విజయవంతం చేయండి You are here హోం » టాప్ స్టోరీస్ » స్కూల్ ఎడ్యుకేష‌న్‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌ స్కూల్ ఎడ్యుకేష‌న్‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌ 13 Oct 2022 12:50 PM తాడేపల్లి: పాఠశాల విద్యాశాఖపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా సమావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రుగుతున్న ఈ సమావేశానికి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎం.వి.శేషగిరిబాబు, స్టేట్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఎస్‌ఎస్‌ఏ) బి.శ్రీనివాసులు, ఎండీఎం డైరెక్టర్ దివాన్‌, నాడు నేడు కార్యక్రమం డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.మనోహరరెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌(ఎస్‌సీఈఆర్‌టి) బి.ప్రతాప్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు చిత్రావ‌తి బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బోటింగ్ - ఫొటో గ్యాల‌రీ చిత్రావ‌తి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ - ఫొటో గ్యాల‌రీ మ‌ద‌న‌ప‌ల్లెలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌భ‌కు హాజ‌రైన జ‌న‌సందోహం - ఫొటో గ్యాల‌రీ జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 3 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ 2 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన న‌గ‌దును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్ - ఫొటో గ్యాల‌రీ
2019 వసంత Texas తువులో, టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో పోలీసులు దాదాపు 40 మందిని చంపి తినడం అంగీకరించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు విస్తృతంగా పంచుకున్న నివేదిక యొక్క ఖచ్చితత్వం గురించి మాకు పలు విచారణలు వచ్చాయి. ఫిబ్రవరి 12 న, వరల్డ్ న్యూస్ డైలీ రిపోర్ట్ వెబ్‌సైట్ ఒక పోస్ట్ చేసింది వ్యాసం “నరమాంస భక్షకుడు చంపబడ్డాడు మరియు 23 పిజ్జా డెలివరీ పురుషులు, 6 యెహోవాసాక్షులు, గత 7 సంవత్సరాలలో 2 పోస్ట్‌మెన్‌లు” అనే శీర్షికతో ఇలా పేర్కొంది: గత దశాబ్దంలో 31 మంది కంటే తక్కువ మంది అదృశ్యం వెనుక హూస్టన్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఇవాన్ ఫెడోరోవిచ్ యనుకోవిచ్, 56, ఈ ప్రాంతంలో అనేక రహస్యమైన అదృశ్యాలతో సంబంధం కలిగి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అర్ధరాత్రి చైన్సా ఉపయోగించారని పొరుగువారు ఫిర్యాదు చేయడంతో యనుకోవిచ్‌ను పోలీసులు విచారించారు మరియు ఆ వ్యక్తి 'రక్తంతో కప్పబడి ఉన్నాడు' అని నివేదించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నప్పుడు, యనుకోవిచ్ తన గ్యారేజీలో మృతదేహాన్ని కసాయి మరియు పోలీసు అధికారులు వివరించిన వాటిని సిద్ధం చేస్తున్నట్లు గుర్తించారు. 'సుగంధ ద్రవ్యాల సుగంధ మిశ్రమంతో' కలిపిన 'పెద్ద పరిమాణంలో నేల మాంసం'. వ్యాసం ఒక బూటకపుది. దీనిని ప్రచురించిన వెబ్‌సైట్, వరల్డ్‌న్యూస్‌డైలీ రిపోర్ట్.కామ్, హోమ్‌పేజీలో ఈ క్రింది నిరాకరణ ప్రకారం, వ్యంగ్యంగా సమర్పించిన కల్పిత కంటెంట్‌ను మాత్రమే పోస్ట్ చేస్తుంది: 'వరల్డ్ న్యూస్ డైలీ రిపోర్ట్ దాని వ్యాసాల వ్యంగ్య స్వభావం మరియు వాటి కంటెంట్ యొక్క కాల్పనిక స్వభావం కోసం అన్ని బాధ్యతలను తీసుకుంటుంది. ఈ వెబ్‌సైట్‌లోని కథనాలలో కనిపించే అన్ని పాత్రలు - నిజమైన వ్యక్తుల ఆధారంగా కూడా - పూర్తిగా కల్పితమైనవి మరియు వారికి మరియు ఏ వ్యక్తికి మధ్య ఏదైనా సారూప్యత, జీవించడం, చనిపోయిన లేదా మరణించినవారు పూర్తిగా అద్భుతం. ” వ్యాసంలో మగ్‌షాట్‌లో చూపిన వ్యక్తి యొక్క గుర్తింపు స్పష్టంగా లేదు, కానీ అది 2019 లో ఎవరైనా అరెస్టు కాలేదు, ఎందుకంటే ఆ ప్రత్యేకమైన ఛాయాచిత్రం ఆన్‌లైన్‌లో ప్రసారం చేయబడినందున కనీసం చాలా కాలం నుండి 2009 . హూస్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ చీఫ్ 'జెఫ్ బుకానన్' గా తప్పుగా గుర్తించబడిన వ్యక్తి వాస్తవానికి మాజీ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ చీఫ్ జార్జ్ బ్యూనిక్. ప్రదర్శన జూన్ 2016 విలేకరుల సమావేశంలో. మే 2019 నాటికి, దిప్రస్తుతహ్యూస్టన్ పోలీసు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ చీఫ్ ట్రాయ్ ఫిన్నర్.
తరచుగా గుండెల్లో మంటఇది తరచుగా పుండు (కడుపు వ్యాధి) యొక్క లక్షణంగా పరిగణించబడుతుంది. అయితే నిజానికిఈ ఫిర్యాదు గుండెపోటుకు కూడా ఒక లక్షణం కావచ్చు. అప్పుడు, కడుపు మరియు గుండె జబ్బులలో గుండెల్లో మంటను ఎలా వేరు చేయాలి? ఆందోళన, సంతృప్తి, కడుపు మంట (గ్యాస్ట్రిటిస్), యాసిడ్ రిఫ్లక్స్ వ్యాధి (GERD), పిత్తాశయ రాళ్లు, గుండె జబ్బుల వరకు వివిధ కారణాల వల్ల గుండెల్లో మంటలు సంభవించవచ్చు. గుండెల్లో మంట కలిగించే ప్రతి వ్యాధి వివిధ లక్షణాలను కలిగి ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ ఉన్న రోగులలో కేవలం 3.6% మంది గుండెల్లో మంట గురించి ఫిర్యాదు చేసినప్పటికీ, మరియు 5% మంది రోగులు సోలార్ ప్లేక్సస్‌కు వ్యాపించే ఛాతీ నొప్పి గురించి ఫిర్యాదు చేసినప్పటికీ, ఈ లక్షణాన్ని విస్మరించకూడదు. గుండెపోటులో గుండెల్లో మంట సాధారణంగా మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు అనుభవిస్తారు. కడుపు మరియు గుండె జబ్బులలో గుండెల్లో తేడాలు తెలుసుకోండి గ్యాస్ట్రిక్ లేదా గుండె జబ్బుల కారణంగా గుండెల్లో మంటను కలవరపెట్టకుండా ఉండటానికి, ఇక్కడ రెండింటి మధ్య తేడాలు ఉన్నాయి: గుండె జబ్బులలో గుండెల్లో మంట గుండె జబ్బులు లేదా గుండెపోటులో, గుండెల్లో మంట యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి: ఇది అకస్మాత్తుగా కనిపిస్తుంది మరియు దవడ, మెడ లేదా చేతులకు ప్రసరించే ఛాతీ నొప్పితో కూడి ఉంటుంది. నొప్పి యొక్క తీవ్రత నిమిషాల వ్యవధిలో పెరుగుతుంది. కత్తిపోటు, నలిపి, పుండ్లు పడినట్లు అనిపించింది. శారీరక శ్రమ లేదా ఒత్తిడి చేసేటప్పుడు సాధారణంగా బరువు పెరుగుతారు. ఛాతీ దడ, ఊపిరి ఆడకపోవడం లేదా అధిక శ్వాస తీసుకోవడం (ముఖ్యంగా మహిళల్లో), జలుబు చెమటలు, ఆకస్మిక బలహీనత మరియు మీరు బయటకు వెళ్లినట్లు అనిపించడం వంటివి ఉంటాయి. గుండె జబ్బు లక్షణాలకు దారితీసే గుండెల్లో మంటగా అనిపిస్తే, వెంటనే సమీపంలోని ఆసుపత్రి అత్యవసర విభాగానికి వెళ్లండి. ఈ పరిస్థితి మరింత గుండె దెబ్బతినకుండా నిరోధించడానికి వీలైనంత త్వరగా చికిత్స చేయవలసి ఉంటుంది. కడుపు వ్యాధిలో గుండెల్లో మంట గుండెల్లో మంట చాలా సాధారణం. ప్రతి సంవత్సరం 25-40% మంది పెద్దలు గుండెల్లో మంటను అనుభవిస్తారని అంచనా. యాసిడ్ రిఫ్లక్స్ వ్యాధి లేదా గుండెల్లో మంట గుండెపోటుకు సమానమైన లక్షణ స్థానాన్ని కలిగి ఉంటుంది, అయితే లక్షణాలు భిన్నంగా ఉంటాయి, అవి: బర్నింగ్ లేదా బర్నింగ్ అనిపిస్తుంది, కొన్నిసార్లు ఛాతీ నొప్పి కూడా ఉంటుంది. ఆహారం లేదా గ్యాస్ట్రిక్ యాసిడ్ ద్రవం రూపంలో గ్యాస్ట్రిక్ కంటెంట్‌ల విడుదల తర్వాత. సాధారణంగా మీ వెనుకభాగంలో పడుకున్నప్పుడు కనిపిస్తుంది మరియు యాంటాసిడ్స్ వంటి గుండెల్లో మంట మందులు తీసుకున్న తర్వాత తగ్గుతుంది. అపానవాయువు, తిన్న తర్వాత ఉబ్బరం, వికారం లేదా వాంతులు వంటివి ఉంటాయి. గుండెల్లో మంటలో, చాలా ఆలస్యంగా తినేటప్పుడు లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి; ఒత్తిడి అనుభూతి; ఆమ్ల, కారంగా మరియు కొవ్వు పదార్ధాలు వంటి కడుపు ఆమ్లం ఉత్పత్తిని ప్రేరేపించే ఆహారాలు తినడం తర్వాత; లేదా చాక్లెట్ లేదా కాఫీ వంటి కెఫీన్ ఉన్న ఆహారాలు మరియు పానీయాలను తీసుకున్న తర్వాత. దాదాపు సారూప్య లక్షణాలతో వివిధ వ్యాధుల వల్ల గుండెల్లో మంట వస్తుంది కాబట్టి, మీరు ఈ ఫిర్యాదును ఎదుర్కొంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా గుండెల్లో మంట చాలా తీవ్రంగా ఉంటే, అది మీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంది లేదా తక్కువ సమయంలో బరువు పెరుగుతుంది. డాక్టర్ గుండె యొక్క స్థితిని అంచనా వేయడానికి X- కిరణాలు, రక్త పరీక్షలు లేదా EKG వంటి శారీరక మరియు సహాయక పరీక్షను నిర్వహిస్తారు. వ్యాధి నిర్ధారణ నిర్ధారించబడిన తర్వాత, కొత్త వైద్యుడు కారణాన్ని బట్టి గుండెల్లో మంటకు చికిత్స అందించవచ్చు.
"ఆది పురుష్" సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ అనుకున్నట్టుగానే వచ్చే ఏడాది జూన్ 16వ తేదీకి వాయిదా పడింది.. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ లభించింది. అయితే అదొక్కటే కారణం కాదంటున్నారు. Surya Prakash First Published Nov 9, 2022, 7:16 AM IST పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ (Prabhas) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ 'ఆదిపురుష్‌' (Adipurush) వాయిదా పడటం ఊహించిందే అయినా అభిమానులకు డైజస్ట్ చేసుకోవటం కష్టంగా ఉంది. రాధేశ్యామ్ డిజాస్టర్ జ్ఞాపకాల నుంచి ఈ సినిమా బయిటపడేస్తుందని ఆశలు పెట్టుకుంటే సంక్రాంతి నుంచి ఈ సినిమా ప్రక్కకు వెళ్లింది. అయితే ఈ సినిమా వాయిదా పడటానికి కారణం ...సినిమాకు రిపేర్లు చేయాలనే మాట వినపడుతోంది. అయితే అదొక్కటే కారణం కారణం బాలీవుడ్ మీడియా అంటోంది. రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన విమర్శలపై ఫోకస్‌ చేసిన చిత్ర టీమ్.. టెక్నికల్‌ అంశాలపై దృష్టి పెట్టిందని.. ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టి మరోసారి వీఎఫ్‌ఎక్స్‌, సీజీ పనులు చేయిస్తోందని బీటౌన్‌ టాక్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే 'ఆదిపురుష్‌' వచ్చే ఏడాది సమ్మర్‌లో కూడా థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదని ఆయా కథనాల్లోని సారాంశం. అయితే ఈ సినిమా రిపేర్లు ఎలా ఉన్నా ముందు...'ఆదిపురుష్' పై వచ్చిన నెగిటివి, అసంతృప్తి మర్చిపోవటానికి ఆరు నెలలు టైమ్ తీసుకుంటే బెస్ట్ అని భావించారట. ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఓపినింగ్స్ పై ఉంటుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ పై ఉంటుంది. జనం ఈ విషయం మర్చిపోయాక ప్రెష్ గా ఓ ట్రైలర్ వదిలి హైప్ క్రియేట్ చేసి ఆదిపురుష్ ని వదులుతారని చెప్పుకుంటున్నారు. ఇది ఓ స్ట్రాటజీగా చేస్తున్న యత్నం అని వివరిస్తున్నారు. మహాకావ్యం రామాయణాన్ని ఆధారంగా చేసుకుని 'ఆదిపురుష్‌' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్‌ రాముడి పాత్రలో, సీతగా కృతిసనన్‌ నటించారు. రామాయణంలో కీలకపాత్రగా భావించే రావణాసురుడిగా సైఫ్‌ అలీఖాన్‌ కనిపించనున్నారు. దసరా వేడుకల్లో భాగంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాము ఊహించిన స్థాయిలో టీజర్‌ లేదని, లంకేశ్వరుడు, హనుమంతుడు లుక్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ అంతగా బాగోలేదని విమర్శించారు. ప్రభాస్ ఉదాసీన వైఖరిని ఆసరాగా తీసుకుని మేకర్స్ ఇలా వ్యవహరించారంటూ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది.దీంతో టీమ్‌.. ఇప్పుడు తప్పులను సరిచేసే పనిలో పడినట్లు సమాచారం. ఏదైమైనా ప్రభాస్ అభిమానుల్లోని అసంతృప్తిని పోగొట్టడానికి దర్శకుడు ఓం రౌత్ ఈ ఆరునెలల సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటే బెస్ట్.
బాగా చ‌ద‌వ‌డం, మంచి మార్క‌లు తెచ్చుకోవ‌డం, ఉద్యోగం సంపాదించ‌డం, ల‌క్ష‌ల్లో జీతాలు తీసుకోవ‌డం ఇదేనా లైఫంటే..?.ఇంత‌కు మించి ఏమీ లేదా? అని ఆలోచిస్తోన్న క్ర‌మంలో నాకు ఎంతో ఇష్ట‌మైన సినిమా రంగం ప‌ట్ల ఆకర్షితుడ‌య్యాను. దీన్నే నా వృత్తిగా తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకోని హీరోగా `4లెట‌ర్స్` సినిమా చేసానంటున్నారు ఈశ్వ‌ర్‌. ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఉద‌య్ కుమార్ దొమ్మ‌రాజు , ఆర్‌. ర‌ఘురాజ్ ద‌ర్శ‌క‌త్వంలో `4 లెట‌ర్స్` చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 22న విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఈ సంద‌ర్భంగా యంగ్ హీరో ఈశ్వ‌ర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు… న‌ట‌న‌లో శిక్ష‌ణ ఏమైనా తీసుకున్నారా? గ‌తేడాది వైజాగ్ స‌త్యానంద్ గారి వ‌ద్ద మూడు నెల‌ల పాటు యాక్టింగ్ లో శిక్ష‌ణ తీసుకున్నాను. వారి ద‌గ్గ‌రే సినిమా గురించి, యాక్ట‌ర్ కావాల్సిన డిసిప్లేన్‌, డెడికేషన్ తో పాటు యాక్ట‌ర్ చేయాల్సిన హార్డ్ వ‌ర్క్ గురించి తెలుసుకున్నాను. అలాగే యుఎస్ లో ఉన్న‌ప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఆ అనుభ‌వం ఈ సినిమాకు చాలా హెల్ప‌యింది. అలాగే `ఆ ఇద్ద‌రూ` అనే ఒక షార్ట్ ఫిలింలో న‌టించాను. దానికి మంచి కాంప్లిమెంట్స్ వ‌చ్చాయి. మీ ఫ్యామిలీకి ఇష్ట‌మేనా సినిమా ఫీల్డ్ లోకి రావ‌డం? నా గ్రాడ్యుయేష‌న్ కంప్లీట్ అయ్యాక… ఇండియా కెళ్లి నా సినిమా ట్రైల్స్ నేను చేసుకుంటాను అని మా ఫ్యామిలీతో చెప్పాను. మా ఫ్యామిలీ కి కూడా సినిమాలంటే చాలా ఇంట్ర‌స్ట్ ఉండ‌టంతో ఓకే అన్నారు. స‌రే ఎవ‌రో ఎందుకు మ‌న‌మే ఒక బేన‌ర్ పెట్టి సినిమా చేద్దాం అని ఈ సినిమా చేశారు. ద‌ర్శ‌కుడు గురించి చెప్పండి? ర‌ఘురాజ్ గారు ఫుల్ స్క్రిప్ట్, లొకేష‌న్స్, షెడ్యూల్స్ తో స‌హా వ‌చ్చి క‌లిసారు. ఫ‌స్ట్ సిటింగ్ లో వారి క్లారిటీ అంద‌రికీ న‌చ్చ‌డంతో ఓకే చేశాం. అందులో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ప‌ది సినిమాల‌కు పైగా చేశారు. అంత ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న ద‌ర్శ‌కుడుతో సినిమా చేస్తే బావుంటుంద‌నిపించింది. అన్న‌ట్టుగానే వారి ద‌గ్గ‌ర నుంచి చాలా నేర్చుకున్నా. ఒక యాక్ట‌ర్ కి కావాల్సిన క్వాల‌టీస్ అన్నీ వారే నేర్పించారు. నేను ఈ సినిమాకు డ‌బ్బింగ్ చెప్పానన్నా, మంచి ప‌ర్ఫార్మెన్స్ ఇవ్వ‌గ‌లిగానన్నా ర‌ఘురాజే గారే కార‌ణం. రెండు నెల‌లు వ‌ర్క్ షాప్ పెట్టి మా అంద‌రికీ శిక్ష‌ణ ఇప్పించారు. ఇందులో డైలాగ్స్ చాలా కొత్త‌గా రాసారు. నా ఫ‌స్ట్ సినిమానే బెస్ట్ డైర‌క్ట‌ర్ తో చేశానన్న సంతృప్తి ఉంది. సినిమా క‌థేంటి? కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే క‌థ ఇది. ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంది. ఏంటి? అన్న క‌థాంశానికి ల‌వ్‌, ఎంట‌ర్ టైన్ మెంట్ మిక్స్ చేసి `4లెట‌ర్స్` సినిమాను తెర‌కెక్కించారు మా డైర‌క్ట‌ర్. స్టూడెంట్స్ త‌ల‌చుకుంటే ఏమైనా చేయ‌గ‌ల‌రు అనే సందేశాన్ని ఫైన‌ల్ గా ఇచ్చాము. స్టూడెంట్స్ తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా సినిమా ఉంటుంది. క్లైమాక్స్ లో వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ట్రైల‌ర్ చూస్తుంటే అడ‌ల్ట్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంద‌నిపిస్తోంది?? డైలాగ్స్ తో నే కామెడీ జ‌న‌రేట్ చేసాము త‌ప్ప , విజువ‌ల్ గా అయితే వ‌ల్గారిటీ ఉండ‌దు. ప్ర‌జంట్ యూత్ ఎలా బిహేవ్ చే్స్తున్నారో..వారు ఎలా మాట్లాడుకుంటున్నారో అలా నాచ‌రుల్ గా త‌ప్ప వాంటెడ్ గా డ‌బుల్ మీనింగ్ డైలాగులు పెట్ట‌లేదు. మీ సొంత బేన‌ర్ లో సినిమా చేయ‌డం ఎలా అనిపించింది? చాలా కంఫ‌ర్ట్ గా అనిపించింది. ఇంట్లోనే నాన్న‌, బాబాయి అన్న‌ట్టు ఉండేవాళ్లం. సెట్స్ మీద‌కు వెళితే…ఎవ‌రి చాలా ఫ్రొఫెష‌న‌ల్ గా ఉండేవాళం. మా ఫాద‌రే ప్రొడ్యూస‌ర్ కావ‌డంతో ఫ‌స్ట్ నుంచి ప్రొడ‌క్ష‌న్ గురించి తెలుసుకునే అవ‌కాశం క‌లిగింది. ప్ర‌తిది ప్లానింగ్ ప్రకారం వెళ్లడంతో ఎక్క‌డ మ‌నీ వేస్ట్ కాకుండా అనుకున్న టైమ్ కు సినిమా తీయ‌గ‌లిగాం. టెక్నీషియ‌న్స్ గురించి చెప్పండి? బెంగాల్ టైగ‌ర్, పేప‌ర్ బాయ్, గ‌రుడవేగ (డియో డియో) చిత్రాల‌కు ప‌ని చేసిన భీమ్స్ గారు మా సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రెండు మాస్, రెండు వెస్ట్ర‌న్ సాంగ్ ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. అలాగే ఆర్ ఆర్ కూడా అద్భుతంగా ఇచ్చారు. అలా సినిమాటోగ్ర‌ఫీ, గ‌ణేష్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌. ఇందులో ఒక పాట కూడా పాడిన‌ట్టున్నారు? అవునండీ నాకు ఫ‌స్ట్ నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే సినిమా ఫీల్డ్ లోకి వ‌చ్చాను. త‌బ‌ల‌, ఫ్లూట్ ప్లే చేస్తాను. భీమ్స్ గారు పాట‌ల ర‌చ‌యిత సురేష్ ఉపాధ్యాయ ద‌గ్గ‌రుండి నాతో పాడించారు. పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. నా క్యార‌క్ట‌ర్ కు నేనే డ‌బ్బింగ్ కూడా చెప్పాను. వెంక‌టేష్ ట్రైల‌ర్ చూసి ఏమ‌న్నారు? అవునండీ..వెంక‌టేష్ గారికి ట్రైల‌ర్ చూపించాం. మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా అడ్వైజెస్ కూడా ఇచ్చారు. మాట్లాడిన కొద్దిసేపైనా ఒక యాక్టింగ్ క్లాస్ లా అనిపించింది. నెక్ట్స్ సినిమా మీ బేన‌ర్ లోనే ఉంటుందా? నేను వైజాగ్ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్న‌ప్పుడు మా ఫాద‌ర్ వ‌చ్చారు. అక్క‌డ ఎంతో కొత్త‌వారు యాక్టింగ్ లో శిక్ష‌ణ తీసుకుంటున్నారు. ఎంతో మంది ప్ర‌తిభావంతులు ఉన్నారు. ఇలాంటి వారికి మ‌న వంతుగా అవ‌కాశం క‌ల్పించాలన్న ఉద్దేశంతో బేన‌ర్ స్టార్ట్ చేశారు. క‌చ్చితంగా నాతో పాటు కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తూ బ‌య‌ట వాళ్ల‌తో మా బేన‌ర్ లో సినిమాలు చేస్తాం. అలాగే స్టోరీస్ వింటున్నా. ఈ సినిమా విడుద‌ల‌య్యాక నా త‌దుప‌రి సినిమా ప్ర‌క‌టిస్తా. ఇక మీద‌ట హైద‌రాబాద్‌లోను ఉంటూ సినిమాకే అంకిత‌మ‌వ్వాల‌నుకుంటున్నా. సినిమా రిలీజ్ ఎప్పుడు? ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నాం. ఎక్క‌డా బోర్ లేకుండా సినిమా ఉంటుంది. మంచి సాంగ్స్ , సినిమ‌టోగ్ర‌ఫీ, కొరియోగ్ర‌ఫీ అన్నీ బాగా కుదిరాయి. సినిమా రిలీజ్ అవుతోంది క‌దా టెన్ష‌న్ ఏమైనా ఉందా? కొంచెం టెన్ష‌న్ అయితే ఉంది. కానీ మొద‌టి నుంచి నా మెంటాల్టీ ఏంటంటే ..ఏ ప‌ని చేసిన హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎఫ‌ర్ట్ పెడ‌తాను. కాబ‌ట్టి క‌చ్చితంగా స‌క్సెస్ అవుతామ‌న్న న‌మ్మ‌కం ఉంది. హిట్ట‌యితే నాన్నకు నేనిచ్చే రిట‌న్ గిఫ్ట్ అవుతుంది
thesakshi.com : తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీని.. వచ్చే ఎన్నికల్లోనూ.. అధికారంలోకి తీసుకురావాలని పార్టీ జాతీయ అధ్యక్షులు.. చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు మాత్రమే కాదు.. టీడీపీలోని ప్రతి నేతా కూడా వచ్చే ఎన్నికల్లో సైకిల్ పార్టీని పరుగులు పెట్టించాలనే అనుకుంటున్నారు. అభిమానులుసైతం.. ఉత్సాహంగానే పనిచేస్తున్నారు. అయితే.. ఇదంతా.. నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు చూస్తే… రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఎక్కడికక్కడ నాయకులు ఉదాసీనత.. సీనియర్ల మధ్య సఖ్యత లేమివంటివి.. పార్టీని ఇరాకాటంలోకి నెడుతున్నాయి. రాష్ట్రంలో175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఏవిధంగా నాయకులు ముందుకు సాగుతున్నారు అనే విషయాలు నిశితంగా పరిశీలిస్తే.. సుమారు 100 నియోజకవర్గాల్లో పార్టీ ఇబ్బందులు పడుతోంది. వాస్తవానికి ఇటీవలే 40వ వసంతంలోకి అడుగు పెట్టిన టీడీపీ నవనవోన్మేషంగా.. ముందుకు సాగాలని.. అలా సాగేలా చర్యలు తీసుకుంటామని.. నాయకులు సంకల్పం చెప్పుకొన్నారు. కానీ ఆ తరహా.. ప్రయత్నాలు ఎక్కడా చేయడం లేదు. గత 2014 ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో 105 స్థానాల్లో మాత్రమే పార్టీ విజయం దక్కించుకుంది. గత ఎన్నికల్లో ఘోరపరాజయం పాలై .. కేవలం 23 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఇక వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు మానసికంగా రెడీ అయినా.. భౌతికంగా.. పార్టీని ముందుకు నడిపించేందుకు నాయకులు.. ఇంకా సిద్ధం కాకపోవడం.. గమనార్హం. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తే.. ఎన్నిచోట్ల గెలిచే అవకాశం ఉంది? అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికిప్పుడు ఉన్న అంచనాల మేరకు .. పార్టీ తరఫున ఏదైనా కార్యక్రమం చేస్తే.. జిల్లాలను ఎంచుకుని పార్టీ కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయా నగరాలు.. జిల్లాల్లో నాయకుల పరిస్థితి.. మూడ్ను బట్టి.. పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ విశాఖ రాజమండ్రి అనంతపురం వంటి ప్రాంతాలనే పార్టీ అధిష్టానం ఎంచుకుంటోంది. మిగిలిన చోట్ల ఎక్కడా కార్యక్రమాలు పెద్దగా సాగడం లేదు. దీనికి కారణం.. ఆయా నియోజకవర్గాల్లో.. పార్టీకి నాయకులు ఉన్నా.. పట్టించుకోకపోవడం.. తీవ్రమైన ఉదాసీనత… ఇప్పటికీ.. చంద్రబాబు ఫేమ్తోనే ముందుకు నడవాలని.. గెలవాలని భావిస్తుండడమే. దీంతో పార్టీ కార్యక్రమాల సంగతి పక్కన పెడితే.. అసలు పార్టీ కేడర్ను పట్టించుకుని.. పరుగులు పెట్టించే నాయకులు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికలకు సంబంధించి వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన నాయకులు.. ఇప్పటికీ నిర్లిప్తతగా వ్యవహరించడం.. పార్టీ అధినేత ఇచ్చిన పిలుపును కూడా పట్టించుకోక పోవడం.. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కదా.. అప్పుడే ఎందుకు ఈ ప్రయాస అని అనుకోవడం.. వంటివి పార్టీకి అశనిపాతంగా మారాయి. ఈ పరిస్థితినని ఇప్పటికిప్పుడు పరిష్కరించాల్సిన అవసరం ఉందని.. పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు సమయం కేవలం ఏడాదిన్నర మాత్రమే ఉందని ఇప్పటి నుంచి చక్కదిద్దే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. Tags: #Andhrapradesh#AndhraPradeshnews#andhrapradeshpolitics#appolitics#ChandrababuNaidu#NaraChandrababuNaidu#TDP#TeluguDesamParty
టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్ ఆ పార్టీ జెండాలతో నిండిపోయింది. బుధ‌వారం నాడు హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీన‌రీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ పార్టీ నేత‌లు భారీ ఎత్తున జెండాలు, క‌టౌట్ల‌ను ఏర్పాటు చేశారు. ఫ‌లితంగా న‌గ‌ర‌మంతా ఎక్క‌డ చూసినా గులాబీ జెండాలే క‌నిపిస్తున్నాయి. ఈ త‌ర‌హా ప‌రిస్థితిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇతర రాజకీయ పార్టీలు ఇలా న‌గ‌రంలో జెండాలు, క‌టౌట్లు పెడితే జ‌రిమానాలు విధిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు టీఆర్ఎస్ జెండాల‌పై ఎందుకు స్పందించ‌ర‌ని ప్ర‌భాక‌ర్ మండిప‌డ్దారు. ఇత‌ర పార్టీల‌కు వ‌ర్తించే ఆంక్ష‌లు అధికార టీఆర్ఎస్‌కు వ‌ర్తించ‌వా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతేకాకుండా రాత్రిలోగా న‌గ‌రంలో వెల‌సిన టీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలు, క‌టౌట్ల‌ను తొల‌గించాల‌ని ఆయ‌న జీహెచ్ఎంసీ అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి ..ఇది కూడా చదవండి 2023 వేసవిలో ముందస్తు ఎన్నికలు... అందుకే జగన్ ఎన్నికల సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు: బీజేపీ నేత సత్యకుమార్
----Old Testament - పాత నిబంధన---- Genesis - ఆదికాండము Exodus - నిర్గమకాండము Leviticus - లేవీయకాండము Numbers - సంఖ్యాకాండము Deuteronomy - ద్వితీయోపదేశకాండము Joshua - యెహోషువ Judges - న్యాయాధిపతులు Ruth - రూతు Samuel I- 1 సమూయేలు Samuel II - 2 సమూయేలు Kings I - 1 రాజులు Kings II - 2 రాజులు Chronicles I - 1 దినవృత్తాంతములు Chronicles II - 2 దినవృత్తాంతములు Ezra - ఎజ్రా Nehemiah - నెహెమ్యా Esther - ఎస్తేరు Job - యోబు Psalms - కీర్తనల గ్రంథము Proverbs - సామెతలు Ecclesiastes - ప్రసంగి Song of Solomon - పరమగీతము Isaiah - యెషయా Jeremiah - యిర్మియా Lamentations - విలాపవాక్యములు Ezekiel - యెహెఙ్కేలు Daniel - దానియేలు Hosea - హోషేయ Joel - యోవేలు Amos - ఆమోసు Obadiah - ఓబద్యా Jonah - యోనా Micah - మీకా Nahum - నహూము Habakkuk - హబక్కూకు Zephaniah - జెఫన్యా Haggai - హగ్గయి Zechariah - జెకర్యా Malachi - మలాకీ ----New Testament- క్రొత్త నిబంధన---- Matthew - మత్తయి సువార్త Mark - మార్కు సువార్త Luke - లూకా సువార్త John - యోహాను సువార్త Acts - అపొ. కార్యములు Romans - రోమీయులకు Corinthians I - 1 కొరింథీయులకు Corinthians II - 2 కొరింథీయులకు Galatians - గలతీయులకు Ephesians - ఎఫెసీయులకు Philippians - ఫిలిప్పీయులకు Colossians - కొలస్సయులకు Thessalonians I - 1 థెస్సలొనీకయులకు Thessalonians II - 2 థెస్సలొనీకయులకు Timothy I - 1 తిమోతికి Timothy II - 2 తిమోతికి Titus - తీతుకు Philemon - ఫిలేమోనుకు Hebrews - హెబ్రీయులకు James - యాకోబు Peter I - 1 పేతురు Peter II - 2 పేతురు John I - 1 యోహాను John II - 2 యోహాను John III - 3 యోహాను Judah - యూదా Revelation - ప్రకటన గ్రంథము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 తెలుగు English Lo వివరణ గ్రంథ విశ్లేషణ A Conservative Version Prev Next 1. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను 1. And LORD spoke to Moses, saying, 2. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిగూర్చిన విధి యేదనగా, యాజకుని యొద్దకు వానిని తీసికొని రావలెను. మత్తయి 8:4, లూకా 17:14, మార్కు 1:44, లూకా 5:14 2. This shall be the law of the man with a leprous disease in the day of his cleansing: He shall be brought to the priest, 3. యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన యెడల 3. and the priest shall go forth out of the camp. And the priest shall look, and, behold, if a leprous disease be healed in the man with a leprous disease, 4. యాజకుడు పవి త్రత పొంద గోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సో పును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. హెబ్రీయులకు 9:19, మత్తయి 8:4 4. then the priest shall command to take two living clean birds, and cedar wood, and scarlet, and hyssop for him who is to be cleansed. 5. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటిపాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప నాజ్ఞాపించి 5. And the priest shall command to kill one of the birds in an earthen vessel over running water. 6. సజీవమైన పక్షిని ఆ దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తీసికొని పారు నీటి పైని చంపిన పక్షిరక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి 6. As for the living bird, he shall take it, and the cedar wood, and the scarlet, and the hyssop, and shall dip them and the living bird in the blood of the bird that was killed over the running water. 7. కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణ యించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయ వలెను. 7. And he shall sprinkle seven times upon him who is to be cleansed from the leprous disease, and shall pronounce him clean, and shall let the living bird go into the open field. 8. అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసికొని నీళ్లతో స్నానముచేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలెను. 8. And he who is to be cleansed shall wash his clothes, and shave off all his hair, and bathe himself in water, and he shall be clean. And after that he shall come into the camp, but shall dwell outside his tent seven days. 9. ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసికొనవలెను. తన రోమ మంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును. 9. And it shall be on the seventh day, that he shall shave all his hair off his head and his beard and his eyebrows, even all his hair he shall shave off. And he shall wash his clothes, and he shall bathe his flesh in water, and he shall be clean. 10. ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొనిరావలెను. 10. And on the eighth day he shall take two he-lambs without blemish, and one ewe-lamb a year old without blemish, and three tenth parts of an ephah of fine flour for a meal-offering, mingled with oil, and one log of oil. 11. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను. 11. And the priest who cleanses him shall set the man who is to be cleansed, and those things, before LORD, at the door of the tent of meeting. 12. అప్పుడు యాజకుడు ఒక మగ గొఱ్ఱపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అపరాధ పరిహారార్థబలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింప వలెను. 12. And the priest shall take one of the he-lambs, and offer him for a trespass-offering, and the log of oil, and wave them for a wave-offering before LORD. 13. అతడు పాపపరి హారార్థబలి పశువును దహన బలిపశువును వధించు పరిశుద్ధస్థలములో ఆ గొఱ్ఱపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైనదానివలె అపరాధపరి హారార్థ మైనదియు యాజకునిదగును; అది అతిపరిశుద్ధము. 13. And he shall kill the he-lamb in the place where they kill the sin-offering and the burnt-offering, in the place of the sanctuary. For as the sin-offering is the priest's, so is the trespass-offering; it is most holy. 14. అప్పుడు యాజకుడు అపరాధపరిహారార్థమైనదాని రక్త ములో కొంచెము తీసి పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను, దానిని చమరవలెను. 14. And the priest shall take of the blood of the trespass-offering, and the priest shall put it upon the tip of the right ear of him who is to be cleansed, and upon the thumb of his right hand, and upon the great toe of his right foot. 15. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన యెడమ అరచేతిలో పోసికొనవలెను. 15. And the priest shall take of the log of oil, and pour it into the palm of his own left hand. 16. అప్పుడు యాజ కుడు తన యెడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడిచేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని ఏడుమారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను. 16. And the priest shall dip his right finger in the oil that is in his left hand, and shall sprinkle of the oil with his finger seven times before LORD. 17. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసికొని పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను ఉన్న అపరాధపరిహారార్థ బలిపశువుయొక్క రక్తముమీద చమరవలెను. 17. And of the rest of the oil that is in his hand the priest shall put upon the tip of the right ear of him who is to be cleansed, and upon the thumb of his right hand, and upon the great toe of his right foot, upon the blood of the trespass-offering. 18. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొంద గోరువాని తలమీద చమరవలెను. అట్లు యాజ కుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. 18. And the rest of the oil that is in the priest's hand he shall put upon the head of him who is to be cleansed, and the priest shall make atonement for him before LORD. 19. అప్పుడు యాజకుడు పాపపరిహారార్థబలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలిపశువును వధింపవలెను. 19. And the priest shall offer the sin-offering, and make atonement for him who is to be cleansed because of his uncleanness, and afterward he shall kill the burnt-offering. 20. యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠముమీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా వాడు పవిత్రుడగును. 20. And the priest shall offer the burnt-offering and the meal-offering upon the altar, and the priest shall make atonement for him, and he shall be clean. 21. వాడు బీదవాడై పైచెప్పినదంతయు తేజాలని యెడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లా డించుటకు అపరాధపరిహారార్థబలిగా ఒక గొఱ్ఱపిల్లను నైవేద్యముగా తూములో పదియవవంతు నూనెతో కలిసిన గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను 21. And if he is poor, and cannot get so much, then he shall take one he-lamb for a trespass-offering to be waved, to make atonement for him, and one tenth part of an ephah of fine flour mingled with oil for a meal-offering, and a log of oil, 22. వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని, అనగా పాపపరిహారార్థ బలిగా ఒకదానిని దహనబలిగా ఒక దానిని తీసికొని రావలెను. 22. and two turtle-doves, or two young pigeons, such as he is able to get, and the one shall be a sin-offering, and the other a burnt-offering. 23. వాడు పవిత్రతపొంది ఎనిమిదవ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యాజకునియొద్దకు వాటిని తీసికొని రావలెను. 23. And on the eighth day he shall bring them for his cleansing to the priest, to the door of the tent of meeting, before LORD. 24. యాజకుడు అపరాధ పరిహారార్థబలియగు గొఱ్ఱపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. 24. And the priest shall take the lamb of the trespass-offering, and the log of oil, and the priest shall wave them for a wave-offering before LORD. 25. అప్పు డతడు అపరాధపరిహారార్థబలియగు గొఱ్ఱపిల్లను వధింప వలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థబలిపశువు యొక్క రక్తములో కొంచెము తీసికొని, పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను దానిని చమరవలెను. 25. And he shall kill the lamb of the trespass-offering. And the priest shall take of the blood of the trespass-offering, and put it upon the tip of the right ear of him who is to be cleansed, and upon the thumb of his right hand, and upon the great toe of his right foot. 26. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన యెడమ అరచేతిలో పోసికొని 26. And the priest shall pour of the oil into the palm of his own left hand. 27. తన యెడమచేతిలో నున్న ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యెహోవా సన్నిధిని ఏడు మారులు ప్రోక్షింపవలెను. 27. And the priest shall sprinkle with his right finger some of the oil that is in his left hand seven times before LORD. 28. మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను ఆ అపరాధ పరిహారార్థ బలిపశువుయొక్క రక్తమున్న చోటను వేయవలెను. 28. And the priest shall put of the oil that is in his hand upon the tip of the right ear of him who is to be cleansed, and upon the thumb of his right hand, and upon the great toe of his right foot, upon the place of the blood of the trespass-offering. 29. యాజకుని అరచేతిలో నున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరువానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తలమీద పోయవలెను. 29. And the rest of the oil that is in the priest's hand he shall put upon the head of him who is to be cleansed, to make atonement for him before LORD. 30. అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లగువ్వలలోనేగాని పావురపుపిల్లలలోనేగాని ఒక దాని నర్పింపవలెను. 30. And he shall offer one of the turtle-doves, or of the young pigeons, such as he is able to get, 31. తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థబలిగా ఒక దానిని దహనబలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజ కుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను. 31. even such as he is able to get, the one for a sin-offering, and the other for a burnt-offering, with the meal-offering, and the priest shall make atonement for him who is to be cleansed before LORD. 32. కుష్ఠుపొడ కలిగినవాడు పవిత్రత పొందతగినవాటిని సంపాదింపలేని యెడల వాని విషయమైన విధి యిదే. 32. This is the law of him in whom is a leprous disease, who is not able to get what pertains to his cleansing. 33. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను 33. And LORD spoke to Moses and to Aaron, saying, 34. నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చినతరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల 34. When ye have come into the land of Canaan, which I give to you for a possession, and I put a leprous disease in a house of the land of your possession, 35. ఆ యింటి యజమా నుడు యాజకునియొద్దకు వచ్చినా యింటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలెను. 35. then he who owns the house shall come and tell the priest, saying, There seems to me to be as it were a disease in the house. 36. అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగాచేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను. 36. And the priest shall command that they empty the house before the priest goes in to see the disease, that all that is in the house not be made unclean. And afterward the priest shall go in to see the house, 37. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చ దాళుగానైనను ఎఱ్ఱదాళుగానైనను ఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండిన యెడల 37. and he shall look on the disease. And, behold, if the disease is in the walls of the house with hollow streaks, greenish or reddish, and the appearance of it is lower than the wall surface, 38. యాజ కుడు ఆ యింటనుండి యింటివాకిటికి బయలువెళ్లి ఆ యిల్లు ఏడు దినములు మూసి యుంచవలెను. 38. then the priest shall go out of the house to the door of the house, and shut up the house seven days. 39. ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైన యెడల 39. And the priest shall come again the seventh day, and shall look. And, behold, if the disease be spread in the walls of the house, 40. యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్రస్థలమున పారవేయవలెను. 40. then the priest shall command that they take out the stones in which the disease is, and cast them into an unclean place outside the city. 41. అప్పుడతడు ఆ యింటిలోపలను చుట్టు గోడలను గీయింప వలెను. వారు గీసిన పెల్లలను ఊరివెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి 41. And he shall cause the house to be scraped inside round about, and they shall pour out the mortar, that they scrape off, outside the city into an unclean place. 42. వేరురాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ యింటిగోడకు పూయింపవలెను. 42. And they shall take other stones, and put them in the place of those stones. And he shall take other mortar, and shall plaster the house. 43. అతడు ఆ రాళ్లను ఊడదీయించి యిల్లుగీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ యింట బయలు పడినయెడల యాజకుడు వచ్చి దాని చూడవలెను. 43. And if the disease comes again, and breaks out in the house, after he has taken out the stones, and after he has scraped the house, and after it is plastered, 44. అప్పుడు ఆ పొడ ఆ యింట వ్యాపించినయెడల అది ఆ యింటిలో కొరు కుడు కుష్ఠము; అది అపవిత్రము. 44. then the priest shall come in and look. And, behold, if the disease be spread in the house, it is a fretting leprosy in the house; it is unclean. 45. కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడ గొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. 45. And he shall break down the house, the stones of it, and the timber of it, and all the mortar of the house, and he shall carry them forth out of the city into an unclean place. 46. మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును. 46. Moreover he who goes into the house all the while that it is shut up shall be unclean until the evening. 47. ఆ యింట పండు కొనువాడు తన బట్టలు ఉదుకు కొనవలెను. ఆ యింట భోజనముచేయు వాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. 47. And he who lays in the house shall wash his clothes. And he who eats in the house shall wash his clothes. 48. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపక పోయినయెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. 48. And if the priest shall come in, and look, and, behold, the disease has not spread in the house after the house was plastered, then the priest shall pronounce the house clean, because the disease is healed. 49. ఆ యింటి కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసికొని 49. And he shall take two birds, and cedar wood, and scarlet, and hyssop to cleanse the house. 50. పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి 50. And he shall kill one of the birds in an earthen vessel over running water. 51. ఆ దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ యింటిమీద ఏడు మారులు ప్రోక్షింపవలెను. 51. And he shall take the cedar wood, and the hyssop, and the scarlet, and the living bird, and dip them in the blood of the slain bird, and in the running water, and sprinkle the house seven times. 52. అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోను సజీవ మైన పక్షితోను దేవదారు కఱ్ఱతోను హిస్సోపుతోను రక్త వర్ణపు నూలుతోను ఆ యింటి విషయములో పాపపరి హారార్థబలి అర్పింపవలెను. 52. And he shall cleanse the house with the blood of the bird, and with the running water, and with the living bird, and with the cedar wood, and with the hyssop, and with the scarlet, 53. అప్పుడు సజీవమైన పక్షిని ఊరివెలుపల నెగర విడువవలెను. అట్లు అతడు ఆ యింటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును. 53. but he shall let the living bird go out of the city into the open field. So he shall make atonement for the house, and it shall be clean. 54. ప్రతివిధమైన కుష్ఠుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు 54. This is the law for all manner of a leprous disease, and for a scall, 55. వస్త్రకుష్ఠమునుగూర్చియు, వస్త్రమునకై నను ఇంటికైనను కలుగు కుష్ఠమునుగూర్చియు, 55. and for a leprous disease of a garment, and for a house, 56. వాపును గూర్చియు, పక్కునుగూర్చియు, నిగనిగ లాడు మచ్చను గూర్చియు, 56. and for a rising, and for a scab, and for a bright spot, 57. ఒకడు ఎప్పుడు అపవిత్రుడ గునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి. 57. to teach when it is unclean, and when it is clean. This is the law of a leprous disease. Prev Next Telugu Bible - పరిశుద్ధ గ్రంథం ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | గ్రంథ విశ్లేషణ నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | గ్రంథ విశ్లేషణ లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | గ్రంథ విశ్లేషణ సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | గ్రంథ విశ్లేషణ యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ రూతు - Ruth : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ 2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ 1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ 2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | గ్రంథ విశ్లేషణ 1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | గ్రంథ విశ్లేషణ 2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | గ్రంథ విశ్లేషణ ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | గ్రంథ విశ్లేషణ యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | గ్రంథ విశ్లేషణ కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 | గ్రంథ విశ్లేషణ సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | గ్రంథ విశ్లేషణ ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | గ్రంథ విశ్లేషణ యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | గ్రంథ విశ్లేషణ యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | గ్రంథ విశ్లేషణ విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | గ్రంథ విశ్లేషణ దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | గ్రంథ విశ్లేషణ హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ యోవేలు - Joel : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | గ్రంథ విశ్లేషణ ఓబద్యా - Obadiah : 1 | గ్రంథ విశ్లేషణ యోనా - Jonah : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | గ్రంథ విశ్లేషణ నహూము - Nahum : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ జెఫన్యా - Zephaniah : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ హగ్గయి - Haggai : 1 | 2 | గ్రంథ విశ్లేషణ జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | గ్రంథ విశ్లేషణ మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | గ్రంథ విశ్లేషణ యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | గ్రంథ విశ్లేషణ అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | గ్రంథ విశ్లేషణ రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | గ్రంథ విశ్లేషణ 2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ ఫిలిప్పీయులకు - Philippians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | గ్రంథ విశ్లేషణ 2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 | గ్రంథ విశ్లేషణ తీతుకు - Titus : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ ఫిలేమోనుకు - Philemon : 1 | గ్రంథ విశ్లేషణ హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | గ్రంథ విశ్లేషణ యాకోబు - James : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 | గ్రంథ విశ్లేషణ 1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 | గ్రంథ విశ్లేషణ 2 యోహాను - 2 John : 1 | గ్రంథ విశ్లేషణ 3 యోహాను - 3 John : 1 | గ్రంథ విశ్లేషణ యూదా - Judah : 1 | గ్రంథ విశ్లేషణ ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | గ్రంథ విశ్లేషణ Close Shortcut Links లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation | Explore Parallel Bibles 21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318 Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.
బస్టాపులో జనం గుంపు పెరగసాగింది. బస్‌ అలా రాగానే జనం లోపలికెక్కడానికి ఒకరినొకరు తోసుకుంటూ హడావుడి చేయసాగారు. బస్సు దిగడం బసంతాణికి అతి కష్టం మీద సాధ్యమైంది. కిందికి దిగిన తర్వాత వెనక వైపుకు తిరిగి తన ద ష్టిని మరల్చి చూసాడు. గుంపులో కొందరు ఆడ, మగ. ఆడ, మగ కాదు కానీ నిరర్థకమైన, పనికిమాలిన ఆడంగి చేష్టలతో మానసిక రోగం పాలైన కొన్ని జంతువులు అవి. సంధ్య వాలింది. మహానగరం సంధ్య, పల్లె సంధ్యతో పోలిస్తే పూర్తిగా వేరుపడి పోయింది. పల్లెలోని సంధ్య, క్షితిజం నుండి మెల్లమెల్లగా ఊరి కాపురాలను పలకరించి తిరిగి పొలాల మీదికి దిగుతుంది. నగరాల్లో సాయంకాలాలు ఇంటికి త్వరగా చేరుకోవాలన్న ఆత్రుత జనానికి వుండదు. చేరుకోవాలన్న ఆత్మీయత కనబడదు. చేరుకున్నా త ప్తివుండదు. ఇక్కడ కరెంటు దీపాల కాంతిలో కూడా తమ వైయుక్తికమైన, వ్యక్తిగత జీవితమనే దుప్పటిని కప్పుకొని వుండి, అందరూ ఏదో కోల్పోయినట్లు బరిబత్తలతనాన్ని వెంటేసుకొని తిరుగుతూ వుంటారు. బసంతాణి ముందుకు కదిలాడు. ఫెడరేషన్‌ హౌస్‌ ఇంకా కొద్ది దూరంలో వుంది. నగరం మధ్యలో రీగల్‌ సినిమా టాకీస్‌ దగ్గర ఫెడరేషన్‌ హౌస్‌ పేరుతో ఒక పెద్ద భవంతి వుంది. అది భారత దేశానికి ఒక చిన్న ప్రతిరూపమని చెప్పుకోవచ్చు. ఆ భవంతిలో భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడినవారు తమ తమ సాంస్క తిక సంస్థలను నెలకొల్పి వున్నారు. ఆ భవన నిర్మాణం పూర్తికాగానే అన్ని తరగతుల, వర్గాల వారి సంస్థలు వచ్చి చేరాయి. దేశ విభజన తరువాత మా వర్గం వారి ధ్యాసంతా రోటి, కప్డా, మకాన్‌ నేపథ్యంలో ఉత్పన్నమైన సమస్యల పరిష్కారంలోనే మునిగిపోయి వుంది కదా అని బసంతాణి విచారించసాగాడు. లేకపోతే, నిస్సందేహంగా వారి సాంస్క తిక సంస్థకు కూడా ఈ భవంతిలో యధోచిత స్థానం దక్కేది. మా సంస్థలోని వారు ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు. వీళ్ళు అన్ని ప్రాంతాల్లో వ్యాపించియున్నారు. దేశ విభజన అనే దుస్సంఘటన కారణంగా వారికి చాలా అన్యాయం జరిగింది. ఎవరికైనా అధిక నష్టం జరిగిందంటే అది వీరికే జరిగింది. ఇంకా నయం, ఈ భవంతి పై భాగంలో టెర్రస్‌ పైన ఒక గది వేసుకోవచ్చని అనుమతి దొరకడం ఒక విధంగా అద ష్టమే. అప్పట్నుంచి ప్రతి ఆదివారం పద్ధతి ప్రకారం తమ ఈ సంస్థ నిర్వహించే సమావేశానికి హాజరవుతూ వస్తున్నాడు బసంతాణి. నగరంలోని ఒక అద్భుతమైన ఈ భవంతిలో సాయంకాలం పూట పండగ వాతావరణంతో సందడిగా వుండి అందరూ గుమికూడుతారు. మనుషుల హడావుడి అధికంగానే వుంటుంది. రకరకాల, రంగు రంగుల దుస్తులు వేసుకొని చాలా బిజీగా కనబడుతారు. కానీ, వారికి అతి దగ్గరగా, సమీపంగా వుంటూ వారి మనసులలోకి తొంగి చూస్తే మాత్రం వాళ్ళంతా తమ తమ ఖాళీ సమయాన్ని ఎలా గడపాలా? అన్న ఆలోచనలోనే మునిగివుంటారనే విషయం తెలిసివచ్చింది. ఈ రోజుల్లో మనిషికి జ్ఞానాన్ని ఆర్జించాలనే తాపత్రయంవుంది. కాని మనిషి ఎలా మారి ఎదిగిపోయాడు అంటే, తన ఖాళీ సమయాన్ని సినిమా టాకీస్‌లలో, కళారంగాల, వ్యాపార రంగాల ప్రదర్శనల వాటిల్లో గడిపి వ ధా చేస్తున్నాడు. తన కుటుంబం, సంసారం ఉన్నప్పటికీ, ఆ కుటుంబానికీ ఆవల జులాయిగా, సోమరిగా తిరగడానికి మాత్రం సమయం అలా సులువుగా దొరికిపోతుంది. బసంతాణికి దాదాపుగా అరవై ఏళ్ళు వుండి వుంటాయి. కానీ, ఆయనలో ఇంకా అదే ఉత్సాహం, చురుకుదనం వుంది. అతను నగరంలోని ఒక మూల దూరంగా వున్న బస్తీలో రెండున్నర అంతస్తుల భవనంలోని 'బర్సాతి' గదిలో అద్దెకు వుంటున్నారు. సాధారణంగా స్థానికులు ఇంకా ఇంటి యజమాని కింది భాగంలో వుంటారు. నగరానికి వచ్చివుండే బయటి వాళ్ళు, దాదాపుగా క్లర్కు స్థాయిలోని ఉద్యోగాలే చేస్తున్నారు. ఈ ఇంటి 'బర్సాతి' గదుల్లో వారి జీవితాలు గడిచిపోతూ వుంటాయి. బసంతాణి స్వయంగా క్లర్కు గాదు కానీ అతనికి తెలుసు అతని సంస్థలో వేళ్ళమీద లెక్కపెట్టగలిగే కొందరు పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు. మిగతా వాళ్ళు కనీసం చిన్న దుకాణపు యజమానులు లేదా కేవలం క్లర్కులయి ఉండొచ్చు. బెంగాలీలకు సగం బెంగాల్‌, పంజాబీలకు సగం పంజాబ్‌ దొరికింది. కానీ మా సింధీలకు ..ప్చ్‌.. మా సింథ్‌ పూర్తిగా పాకిస్తాన్‌లో కలిసిపోయింది అంటూ బసంతాణి మదనపడసాగాడు. ఇలా ఆలోచనల్లో మునిగిపోయి అతను ఫెడరేషన్‌ హౌస్‌ బయట వాకిలి ముందుకు చేరాడు. అంతలో వెనక నుంచి ఎవరో అతని భుజం పై చెయ్యి వేశారు. వెనక్కి తిరిగి చూస్తే, మోహన్‌ పలకరింపుగా నవ్వుతూ, ''బసంతాణిజీ, నమస్కార్‌. నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద, ఇంటి టెర్రస్‌ పైన మంచం వేసి పడుకొని ఒక అద ష్ట రహస్యాన్ని కనుగొని వుంటారు. గత రాత్రి కూడా ఇలాంటిదేదో అనుభవం జరిగివుంటుంది. చెప్పకూడదూ!'' అని అడిగాడు. ఈ రోజు బసంతాణి హ దయం బస్సు దిగగానే అలజడితో చెదిరిపోయింది. ఎప్పుడైతే బుద్దిజీవి, విషాద క్షణాల ననుభవిస్తాడో అప్పుడు నిస్సందేహంగా అతను జీవితపు లోతుల్లో దాగిన సత్యం వరకు చేరుకుంటాడు. అతను గంభీరంగా అన్నాడు. ''నిన్నటి రాత్రి మాట వదిలేరు! ఇప్పుడు ఈ సంధ్యాకాలంలో ఎలా అనిపిస్తుందంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాంటి సాహిత్య సమావేశాల్లో పాల్గొంటూ సమయం వ ధా చెయ్యాలో కదా? జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు సాధించగల ఉత్క ష్ట కావ్యాలు, క తులు అందించలేమా !?'' ఆరు గంటలకు సమావేశ కార్యక్రమాలు ప్రారంభం కావడానికి రంగం సిద్ధమవుతున్నది. ఆరు గంటలు కావస్తుంది. వేరు వేరు మార్గాలనుండి జనం వచ్చి చేరారు. వారందరి క త్రిమమైన, కుత్సితమైన నవ్వుల్లో బసంతాణి మాట మరుగున పడిపోయింది. ఫెడరేషన్‌ హౌస్‌ కింది అంతస్తులో గోష్టి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అక్కణ్ణుంచి బయటికి వస్తూ వస్తూ రామ్‌, మోహన్‌తో చెప్పాడు- ''మన స్వంత భాష కిచిడీ అయిపోతున్నది. ఇప్పుడు మనం ఒక ప్రాంతానికి పరిమితమై వుండక పోవడంతో మన ప్రాంతీయ భాషపై వేరే భాషల ప్రభావం పడుతున్నది. అలాంటి సందర్భంలో వారి పదాలు, మన భాష, మన కలంపై పెత్తనం చేయడం సహజమే కదా !'' మోహన్‌ ఎలాంటి సమాధానమివ్వలేదు. కానీ అతను లోలోపల తప్పకుండా ఉద్వేగాన్ని అనుభవిస్తున్నాడు. మన జీవితాలు చాలావరకు నగరీకరణం చెందినవి. అందుకే మన భాష, నగర వాతావరణానికి తగినట్లుగా పరిమితమై, మిశ్రమ శబ్దాల బాండాగారం అయిపొయింది. అతను తన కథలోని సారాంశంపై మనసును కేంద్రీకరించి వున్నాడు. తన సాహితీ మిత్రులకు తప్పకుండా ఈ కథ నచ్చుతుందన్న ఆశ అతనిలో పుట్టింది. తన కథానాయిక ఆధునిక జీవన సంక్లిష్టతలకు నిజమైన ప్రతినిధి అన్న భావన అతనిలో కలిగింది. తాను ఒక స్కూల్‌ లో ఉపాధ్యాయురాలు. కొత్తగా పెళ్లయ్యింది. కానీ, కొత్త పెళ్లికూతురు ముఖంలో వుండాల్సిన సంతోషపు ఛాయలు, కాంతి దాదాపుగా లేదనే చెప్పాలి. ఎప్పుడైతే ఆమె భర్త ఆమెను సమీపిస్తాడో, ఇద్దరూ ఒకరి బాహువుల్లో మరొకరు బందీలవుతారో ఆమెకు ఈ నెల కాకుండా వచ్చేనెలలో తనకు తానుగా పూర్తిగా సమర్పించుకోవాలి, అన్న ఆలోచన ఆమెను బాధిస్తూ వుంటుంది. ఎందుకనగా ఇలా చేయడం ద్వారా తన 'మెటర్నిటీ లీవ్‌' ను వేసవి సెలవులతో పాటు కలిపి పూర్తిగా నాలుగు నెలలు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చన్నది ఆమె ఆలోచన. రామ్‌ అడిగాడు- ''మీరు నా ప్రశ్నకు జవాబివ్వలేదు, ఏమాలోచిస్తున్నారు?'' మోహన్‌ అతనికి తన కథలోని సమస్యతో పరిచయం చేసాడు. దగ్గర్లోనే వున్న మెట్ల రెయిలింగ్‌ను పట్టుకొని బసంతాణి గారు నెమ్మదినెమ్మదిగా పైకెక్కసాగారు. భవనంలోని రెండవ అంతస్తుకు రాగానే రామ్‌ తన సిగరెట్టు చివరి దమ్ములాగి మిగిలిన సగం సిగరెట్టు ముక్కను ఆర్పేస్తూ అడిగాడు- ''మోహన్‌, నా కథలో కూడా ఇలాగే ఒక 'టెన్షన్‌' వుంది. కానీ, ఆ కథను హిందీ మూలభాషగా రాసాను. మిత్రమా, నేను హిందీ సాహిత్య రంగంలో ప్రముఖుణ్ణి కావాలనుకుంటున్నాను'' అని చెప్పి సగం కాలిన సిగరెట్టు ముక్కను పారేసి రెండవ అంతస్తులో జరుగుతున్న హిందీ సాహిత్య సమావేశానికి వెళ్ళిపోయాడు. మోహన్‌ ఆలోచనలో పడిపోయాడు. దేశ విభజనలో మా హస్తం ఏమీ లేదు గదా! మరి ఎందుకు రామ్‌ నుండి అతని అసలైన, ప్రామాణికమైన మాధ్యమం అతనినుండి దూరమవుతుంది. ఒక రామ్‌ హిందీ సాహిత్య రంగంలో విజయం సాధించవచ్చుగాక ! మిగతా వారి జన్మతః వచ్చిన శక్తి సామర్ధ్యాల విషయం గురించి ఏమిటి? కేవలం మేము మామూలు చిన్న వ్యాపారులుగానే వుండిపోతామా? బసంతాణి అనాయాసంగానే ఒక దీర్ఘమైన శ్వాస తీసుకున్నాడు. వెనకాల వున్న ఒకరిద్దరు దగ్గరవుతున్న ఫీలింగ్‌. హరి దగ్గరికి వచ్చి బసంతాణితో అన్నాడు- ''ఏం దాదా, ఈ రోజు మిమ్ముల్ని ఈ విధంగా, నెమ్మది నెమ్మదిగా మెట్లెక్కుతూ వుంటే మీరు నిజంగానే ముసలివాళ్లై పోతున్నారని నాకనిపిస్తుంది.'' జవాబుగా బసంతాణి ముఖంపై మెట్లమీద వెలుగుతున్న 'జీరో పవర్‌' బల్బులా పేలవంగా ఓ జీవం లేని నవ్వు వెలిగింది. భవనంపై కప్పుకు చేరగానే, ఒక కార్పెట్‌ పరచబడివున్న ద శ్యం కనబడింది. ఎంతో కాలం నుంచి ఆ సంస్థ సభ్యులు, ఇతర సంస్థలకు చేసిన సహాయంలా మాకు గ్రాంటు మంజూరు చేసి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా లాభం లేకుండా పోయింది. కనీసం కార్పెట్‌కు బదులుగా కుర్చీలు, ఒక మెజా బల్ల వేసుకునే వాళ్ళం కదా! కానీ, మా బాధ ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మా సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను కాపాడుకోవడానికి కూడా రాజకీయ అధికారంపై ఆధారపడే స్థితికి వచ్చింది. వారి అధికార మార్పిడి సమయంలోనూ మమ్ముల్ని పట్టించుకున్నవారు లేరు. వచ్చిన వారు తమ తమ చెప్పులు, బూట్లను తమ అభిరుచులతో పాటు వదిలి ఒక మూలన బెట్టి కూర్చుండి పోయారు. బసంతాణికి కూర్చోవాలన్న మనసొప్పడం లేదు. లోపలి గదిలోకి వెళ్లి అక్కడ గోడకు వేళ్ళాడుతున్న షాహ లతీఫ్‌, సచల్‌, సామి వేసినటువంటి తైలవర్ణ చిత్రాలు చూస్తుండి పోయాడు. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ చిత్రాలన్నీ చిత్రకారుల అద్భుత కల్పనా శక్తికి ప్రతీకలు. పూర్వ కాలంలోని కవుల, రచయితల చిత్రాలు ఒక ఎత్తు, కాని వారు చివరికి తమ జీవిత వివరాలను, విశేషణాలను కూడా వదిలి వెళ్లలేదు. ఈ రోజు అలా కాదు. వర్తమాన కవులు, రచయితల చిత్రాలు కాల ప్రవాహంలో సురక్షితంగా ఉంటున్నాయి. అతను బయటికి వచ్చి టెర్రస్‌ పైన పెట్టిన పూలమొక్కల కుండీలను చూస్తూ అలా వుండిపోయాడు. కుండీల్లో 'సదా బహార్‌' పూలు వికసించి వున్నాయి. చాలా అందంగా వున్నాయి. అంతలో క ష్ణ వచ్చి అతని ఏకాగ్రతను భగం చేసాడు. క ష్ణ ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వులు నాట్యమాడుతూ వుంటాయి. ఆ నవ్వుల్లో ఇతరుల కష్టాల మీద దయాగుణం, కొన్నిసార్లు తన మీద తనకే జాలి, అలా భిన్న భావాలు ముప్పిరిగొని వుంటాయి. అతను నమస్కారంలో తన నవ్వును మార్మికం చేస్తూ బసంతాణితో చెప్పాడు- ''ఎందుకు, బసంతాణి గారు, ఇక్కడ నిలబడ్డారు? రండి వచ్చి కూర్చోండి?'' బసంతాణి కూడా జవాబులో ప్రశ్నను మిళితం చేసి- ''ఎలా వున్నారు, క ష్ణా? ఇక్కడ ఈ రోజు సింధీలో వినిపిస్తారు గదా? 'కాఫీ'లేదా 'వాఈ' వినాలనే ఇష్టంతో వచ్చాను'' అన్నాడు. క ష్ణ చెప్పాడు- ''కాఫీ లేదా 'వాఈ'లో సింధీ లోయ విస్త తి వుండాలి. వర్తమానంలో మనం నగరపు ఇరుకు సందుల్లో వచ్చి జీవిస్తున్నాము. ఈ రోజుల్లో ఆ చిన్న చిన్న గజల్‌ లు కూడా బరువెక్కి మన ఇరుకు జీవితాలతో మమేకమై పోతున్నాయి.'' బసంతాణి నిరుత్సాహంగా అన్నాడు, ''ఐతే ఈ రోజు కూడా నువ్వు గజల్‌ వినిపిస్తావన్న మాట?'' క ష్ణ, ''ఔను, ఆధునికం, ఆధునిక గజళ్ళు. లయాత్మకంగా, మార్మికంగా వుంటూ జీవితం బరువును భుజాలపై మోసుకెళ్తుంది. మీకు తెలుసా, నేను ఈ రోజు చదవబోయే నా గజల్‌ లోని ఒక 'షేర్‌' లో ఏమని చెప్పానో'' బసంతాణికి తెలుసు, క ష్ణ హ దయం ఎంత సంవేదనా భరితమో, ''ఏమిటది'' అడిగాడు. క ష్ణ బదులిచ్చాడు, ''ఇప్పుడు, సంతానం పిత రుణం తీర్చుకోవాలి అన్న కాంక్షతో పిల్లల్ని కనడంలేదు. అలాంటి భావనలు అస్సలు లేవు. పిల్లలు వద్దనుకున్నా, కేవలం యవ్వన వాంఛలు తీర్చుకోవాలన్న తపనలో పిల్లలు పుట్టుకొస్తున్నారు. మరి, ఈ పిల్లలు ముందుకు నడిచి మన ఆకాంక్షల మేరకు నడుచుకోక, తమ కర్తవ్యాన్ని నెరవేర్చకపోతే అందులో వాళ్ళ తప్పేముంది.'' క ష్ణ గట్టిగా నవ్వసాగాడు. కానీ ఎందుకో బసంతాణి ఆ నవ్వులో భాగస్వామి కాలేకపోయాడు. అతని కనిపించింది, రాజధాని లేదా రాజధాని లాంటి పెద్ద నగరాలలోని జీవితం సగటు భారతీయుడి జీవితాన్ని దర్షింపజేయదు. ఈ నగరం పల్లెకు పై 'టెర్రస్‌' లాంటిది. మనం ఇంటి పై కప్పు మీద కాలక్షేపానికి చేరతాము. ఫలితంగా నేలతో మన సంబంధం తెగిపోతుంది. ఈ రోజు ఒక శ్రామికుడు, రైతు కూడా ఇలా అర్ధ రహితమైన, నిరర్ధకమైన జీవితాన్ని గడుపుతున్నాడా? రైతు తన ఎడ్లను తన సంతానం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అతనికి కూడా ఈ ఎడ్లను చూసుకోవడానికి ఒక కొడుకు అఖ్ఖర్లేదా? అతనికి కూడా కొడుకు పుట్టుకొస్తాడు. నాలుగు కాళ్ళ జంతువులైన మేకలు, గొర్రెలను పోషిస్తూ తమ సంతాన మనుకునే ఈ 'గడరియా'లు తమకు సంతానం కావాలని ఆశించరా? అతను క ష్ణతో అన్నాడు, ''నువ్వు పూల మొక్కలతో వున్న ఈ కుండీలను చూసావా?'' క ష్ణ, ఆశ్చర్యంతో పూలకుండీ వైపు చూడసాగాడు. బసంతాణి- ''మనమంతా ఈ టెర్రస్‌ పైన వున్న ఈ కుండీల్లోని పూల మొక్కల్లాంటి వాళ్ళం. వేరు, వేరు కుండీల్లో వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చి ఆవాసమేర్పరచుకున్న 'సదాబహార్‌'లా మన కళాపరిమళం, సౌందర్యం నిస్సందేహంగా వికసిస్తూ వుంది. కానీ ఈ పూల మొక్కలు కుండీలకే పరిమితమై పోయాయి. మరి ఈ కుండీలు నేలకు దూరంగా ఎక్కడో టెర్రస్‌ మీద వుంచబడి వున్నాయి. అంతేగాదు, అలాగే మన సంబంధం కూడా ఈ నేలతో తెగిపోయివుంది. అందువల్ల మన ద్వారా రచింపబడిన భూమిక, పాత్ర క త్రిమమైనది.న్యూ ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ కావచ్చు, ముంబాయిలోని ఫ్లోరా ఫౌంటెన్‌ ప్రదేశంలో తిరిగే జనం కావచ్చు, ఆ పాత్రధారులందరి ముఖాలు, అస్తిత్వాలు చెరిపేయబడినాయి. ''ఆల్‌ ఆఫ్‌ దెమ్‌ ఆర్‌ ఫేస్‌ లెస్‌''. వారికి ఏమైనా ప్రత్యేక గుర్తింపుగాని, వ్యక్తిత్వంగాని వుందా? అందరూ ఈ జన సమూహంలో కాటగలిసి పోయారు . క ష్ణ అతని వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు. బసంతాణి ఒక దీర్ఘ శ్వాస తీసుకొని, ''ఈ రోజు టెర్రస్‌ మీద ఈ సమావేశంలో పాల్గొనాలని వున్నా, మనసొప్పడం లేదు'' అని చెప్పి పెద్ద పెద్ద అంగలు వేస్తూ, కిందికి దిగడానికి మెట్ల వైపుకు తిరిగాడు. క ష్ణ మెదడులో ఒక రోమాంచితమైన ఆలోచన మెరుపులా మెరిసి మాయమయ్యింది. ''అరే, రేపటి సమాచార పత్రికలో ఈ వార్త చదివాల్సి వస్తుందేమో, నేలతో పేగుబంధం ముడివేసే ఆలోచనతో ఒక సింధీ రచయిత ఫెడరేషన్‌ హౌస్‌ భవనపు టెర్రస్‌ మీద నుండి వేగంగా మెట్లు దిగే సమయంలో అకాల మ త్యువుకు గురయ్యారు ''అన్న వార్త వినాల్సి వస్తుందా!'' వెంటనే మరుక్షణంలో అతనూ ఇలాంటి మ త్యువు నిరీక్షణలో వున్న భ్రాంతికి లోనయ్యాడు.
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750 సాగర్‌కు పెరిగిన వరద ఉధృతిఫ 2.3 లక్షల క్యూసెక్కుల రాక 578 అడుగులకు చేరుకున్న సాగర్‌ నీటి మట్టం నాగార్జునసాగర్‌/ చింతలపాలెం/ కేతేపల్లి / డిండి, ఆగస్టు 9 : నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌కు మంగళవారం ఎగువనుంచి వరద ఉధృతి పెరిగింది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఆరు క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,67,898 క్యూసెక్కులు, రెండు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,608 క్యూసెక్కులు మొత్తంగా 2,30,506 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు) కాగా ప్రస్తుతం 578 అడుగులకు(276. 0932టీఎంసీలకు) చేరుకుంది. సాగర్‌ నుంచి కుడి, ఎడమ కాల్వలతో పాటు విద్యుత్‌ కేంద్రం, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా మొత్తంగా 31,535 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 36 టీఎంసీల నీరు సాగర్‌కు వచ్చి చేరితే ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి నీరు చేరుకుంటుంది. ‘పులిచింతల’లో మూడు క్రస్ట్‌గేట్ల నుంచి నీటి విడుదల సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టులో మూడు క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 30,219 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో మూడు గేట్లను 1.5 మీటర్లు ఎత్తి 41,456 క్యూసెక్కులు, ప్రాజెక్టు పవర్‌ హౌస్‌లోని మూడు యూనిట్ల ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ 70 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు (45.77టీఎంసీలు) కాగా ప్రస్తుతం 171.25 అడుగులకు (40.16 టీఎంసీలు) చేరుకుంది. మూసీ ప్రాజెక్టులో నాలుగు క్రస్ట్‌గేట్ల ద్వారా... నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువన భారీ వర్షాలకు ప్రాజెక్టుకు 3,798క్యూసెక్కుల వరద వస్తుండగా నాలుగు క్రస్ట్‌గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 645అడుగులు(4.49 టీఎంసీలు) కాగా ప్రస్తుతం నీటిమట్టం 638.30అడుగులుగా(2.84 టీఎంసీలు) ఉంది. డిండి ప్రాజెక్టుకు పెరిగిన ఇన్‌ప్లో నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. దుందుభివాగుకు వరద ప్రవాహం పెరగడంతో డిండి రిజర్వాయర్‌కు భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుంచి 3,755 క్యూసెక్కులు వస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ ఫయాజ్‌ తెలిపారు. స్పిల్‌వే నుంచి 3,755 క్యూసెక్కులు దిగువకు వెళ్తుందని తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 36అడుగులు(2.4టీఎంసీ) గరిష్టస్థాయికి చేరింది. స్పిల్‌వేపై నుంచి నీరు కిందికి దూకుతుండటంతో చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో ప్రాజెక్టు వద్దకు చేరుకుంటున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు శాలిగౌరారం: వరుస వర్షాలతో నల్లగొండ జిల్లా శాలిగౌరారం ప్రాజెక్టులో క్రమేనా నీటిమట్టం పెరుగుతుంది. గరిష్ట నీటిమట్టం 21అడుగులకు గాను మంగళవారం సాయంత్రం 16అడుగులకు చేరింది. శాలిగౌరారం నుంచి ఊట్కూరుకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు మధ్యలో వరద పెరగడంతో వాహనాలకు తీవ్రంగా ఆటంకం కలుగుతోంది. నేటి నుంచి ఏఎమ్మార్పీ విడుదల గుర్రంపోడు : ఏఎంఆర్పీ ప్రధాన కాల్వకు ఈ నెల 10 నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వానాకాలం ఆరుతడి పంటలకు వారబంధీ పద్ధతిలో డిసెంబరు 7వ తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఈ మేరకు అధికారులు మంగళవారం గేట్లను పరిశీలించారు. రైతులు ఎవరూ నీటి కోసం గేట్లను విరగగొట్టవద్దని ఏఎమ్మార్పీ డివిజన్‌ -5 ఏఈ శ్రీనివాస్‌రావు కోరారు. ప్రభుత్వం రూ.36లక్షలతో గేట్లకు మరమ్మతులు చేయించిందని తెలిపారు. పాలేరు వాగులో ఎడ్లు గల్లంతు మద్దిరాల : పొలం దున్నిన ఎడ్లను కడుగుతుండగా పాలేరు వాగులో కొట్టుకుపోయాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు పులిగిల్ల మల్లయ్య తన పొలాన్ని దున్నిన అనంతరం పక్కనే ఉన్న పాలేరు వాగులో ఎద్దులను కడుగుతుండగా లెంకతో (జంటగా) ఉండడంతో ఒక్క ఎద్దు బెదిరి వాగు లోపలికి దూకింది. మరో ఎద్దు సైతం లోపలికి వెళ్లడంతో వరద ఉధృతికి రెండు ఎడ్లు వాగులో కొట్టకుపోయాయి. గ్రామస్థుల సాయంతో రైతు వాగు వెంట కిలో మీటర్‌ వరకు వెతికినా ఎడ్ల ఆచూకీ లభించలేదు. ఎడ్ల విలువ సుమారు రూ.90 వేలు ఉంటుందని రైతు మల్లయ్య తెలిపారు.
పాలు జతచేసి దోసె మిశ్రమంలా తయారుచేయాలి కొద్దిగా జిగురుగా ఉండాలి. లేదంటే మరీ మెత్తగా అయిపోయి, సరిగా రావు. స్టౌ మీద పాన్ ఉంచి, వేడయ్యాక నూనె రాయాలి తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని పెనం మీద వేసి, దోసె మాదిరిగా కొద్దిగా మందంగా వేయాలి. గోధుమరంగులోకి మారాక రెండవవైపు తిప్పి కాలనివ్వాలి. మూలం : సాక్షి దినపత్రిక 0 Comments Author నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.
మనమందరం కూడా నిత్యమూ ఏదో ఒక సందర్బంలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తుంటాము. కానీ దాని అర్థం మనం తెలుసుకోకుండానే వల్లిస్తుంటాము. మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారంగా భావించాలి. అందుకే ఈ మంత్రాన్ని ఎన్నో సంస్థలు ప్రత్యేకించి విధి నిర్వహణలో పఠించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ శాంతి మంత్రాన్ని అంతటా అమలుపరచినట్లయితే సర్వత్రా శాంతిసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పై శ్లోకం తెలియచేస్తుంది. ఈ శ్లోకం అర్థమేమనగా.. సహనావవతు…. మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం. పరస్పరం కలసిమెలసి రక్షించుకుందాం. మన రాష్ట్రాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకుందాం. ముఖ్యంగా ఇది ఐక్యతా సూత్రం వంటిది. సహనౌభువన్తు…. ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరం కలసి అనుభవిద్దాం. అలాంటి ధన సంపాదనకుగాను దోహదం చేసే శక్తి గల విద్యనే మనం సంపాదించుకుందాం. విలువలు లేని విద్యలు మనకొద్దు. అలాంటి వాటిని తక్షణమే వదిలేద్దాం. సహవీర్యం కరవావహై… మనం కలసిమెలసి పరాక్రమిద్దాం. మానసిక వికాసాన్ని కలిగించే సాహస కార్యాలను చేయగలిగే చైతన్యాన్ని కలిగించే ప్రభోదించే విద్యను మనం సాదిద్దాం. తేజస్వినావధీతమస్తు… మనల్ని తేజోవంతులుగా, వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని, విద్యను పొందుదాం. మనలో ఆత్మాభిమానం, స్వజాతి అభిమానం కల్గి ఉండేలా నడుచుకుందాం. అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా కార్య తేజస్సుతో కొత్తకొత్త పరిశోధనలు గావిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం. మావిద్విషావహై….. మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం. అహింసా పరమోధర్మః అనే సూక్తిని పాటిద్దాం. ఇదే విశ్వశాంతికి దోహదకారి కాబట్టి ప్రగతిపధం వైపు పయనిస్తూ పురోభివృద్దిని సాధిద్దాం. కాబట్టి పైన తెల్పిన విధంగా నమమందరం కూడా శాంతిమమంత్రాన్నని తప్పక పఠిస్తూ ఆచరణలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ఉండేందుకు ప్రయత్నిద్దాం. ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుందాం.
* ఏడాది నుంచి తప్పని సమస్యలు * వివేకానందనగర్‌ కాలనీ మహిళల ఆందోళన ఆకివీడు : తాగడానికి గుక్కెడు నీళ్లు ఇప్పించాలని వివేకానందనగర్‌ కాల... 9:05:00 PM * ఏడాది నుంచి తప్పని సమస్యలు * వివేకానందనగర్‌ కాలనీ మహిళల ఆందోళన ఆకివీడు : తాగడానికి గుక్కెడు నీళ్లు ఇప్పించాలని వివేకానందనగర్‌ కాలనీ మహిళలు వేడుకుంటున్నారు. కాలనీలో ఏడాది నుంచి మంచినీరు, వాడకపునీటి సమస్య ఉందని ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళినప్పటికీ పట్టించుకోవడంలేదు. 20వ వార్డులోని వివేకానందనగర్‌ కాలనీలో నీటి సమస్య ఉండడంతో ఎమ్మెల్యే కార్యాలయం, జడ్పి ఉపాధ్యక్షురాలు లలితాదేవి, ప్రత్యేకాధికారి అప్పటి నాగార్జునరెడ్డి, మీకోసంలో పలుమార్లు తెలియచేశామని చివరకు గత్యంతరం లేక కుటుంబానికి నెలకు 4 వేలు ఖర్చు చేసి తాగడానికి, వాడకానికి నీళ్లను కొనుగోలు చేనుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీలో వాడకానికి బోరు చేయించుకుంటే ఉప్పునీరు వస్తుండడంతో ఆ నీటిని వినియోగించకుండా నెలకు కుటుంబానికి రెండు ప్రైవేట్ ట్యాంకుల నీటిని రప్పించుకుంటున్నామని మహిళలు వాపోతున్నారు. కాలనీలో ఉన్న మంచినీటి పైప్ లైన్కు దొర గారి చేరువు ట్యాంక్ నుంచి అందచెయ్యాల్సి ఉండగా నీరు అందకపోవడంతో సరఫరా చేయడం లేదు ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో సమీపంలోని శాంతినగర్ ట్యాంక్ నుంచి సరఫరా చేస్తామని చెప్పి పది రోజులు చేసిన తరువాత సరఫరా చేయడం మానేశారన్నారు. రానున్నది వేసవికాలం కావడంతో పాలకుల,అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుచున్నారు. పైప్‌లైన్‌ మరమ్మతులతో సమస్య ఏర్పడింది. వివేకానంగనగర్ కాలనీకి సరఫరా చేసే మంచినీటి ఫైపులైన్ మరమ్మతులు పాలవ్వడం వల్ల సమస్య ఏర్పడిందని మరమ్మతులు చేయించాం తాగునీటి చెరువులో నీటిని మార్చుతున్నందున నీరు సరఫరా కాలేదు వెంటనే నీటిని అందచేస్తాం. ఏడాది నుంచి నీరు సక్రమంగా అందడంలేదు అనేది నిజం కాదు. ఠాగూర్, పంచాయతీ కార్యదర్శి
హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ దేశంలోనే ఆల్ టైం రికార్డ్ సృష్టించిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అపహాస్యం చేశారు. గత మూడేళ్లలో 4700 కోర్టు ఆదేశాల ఉల్లంఘన పిటిషన్లను ప్రభుత్వం దాఖలు చేసిందన్నారు. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మామూలుగా చివాట్లు పెట్టలేదని, సిగ్గున్న అధికారి ఎవరు కూడా కోర్టుకు వెళ్లి ఎన్నిసార్లు చివాట్లు తినరని ఎద్దేవా చేశారు. వారి దౌర్భాగ్యానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమైనా సౌభాగ్యాన్ని కలిగిస్తున్నారేమోనని అనుమానాన్ని వ్యక్తం చేశారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో పనులు చేసిన ఎవ్వరికీ డబ్బుల చెల్లింపులు లేవన్నారు. ఆదాయం బ్రహ్మాండంగా ఉందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారని, ఆదాయమే ఉంటే అప్పులు ఎందుకు చేస్తామని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొంటున్నారన్నారు. కరోనా కారణంగా ఆదాయం కుంటు పడిందని బుగ్గన చెబుతుంటే, కరోనా అనే సమర్ధవంతంగా ఎదుర్కొన్న వీరుడిని తానేనని జగన్మోహన్ రెడ్డి అంటున్నారని ఎద్దేవా చేశారు. కరోనా కష్టకాలంలోనూ ఆదాయం తగ్గకుండా చూశానని గొప్పలు పోతున్నారన్నారు. ఇప్పటికే ఈ సంవ్సరంలోనే 50 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని, ఇంకా ఎన్ని అప్పులు చేస్తారో తెలియదన్నారు. పెద్ద మొత్తం అప్పులు చేస్తూ , బాకీలను కూడా తీర్చకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. ఎన్ ఆర్ జి ఎస్ పనులు చేసిన వారికి డబ్బులు చెల్లించడం లేదని, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి మాత్రం డబ్బులు డ్రా చేశారన్నారు. ఈ డబ్బులను పక్కదారి పట్టించినట్లు వెల్లడించారు. ఉన్నత విలువలకు మార్గదర్శి రామోజీరావు ఉన్నత విలువలకు మార్గదర్శి, మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవస్థాపకులు రామోజీరావు అని రఘురామకృష్ణంరాజు కొనియాడారు. పూర్తి పారదర్శకత తో నడుస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్ పై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం దాడులు చేసి సోదాలు నిర్వహించిందన్నారు. తన జన్మ దినోత్సవ రోజు తనని అరెస్టు చేసి వేధించినట్లుగానే, రామోజీరావు జన్మదినోత్సవం సందర్భంగా వేధించాలని చూశారన్నారు. కేసులే లేని మార్గదర్శిపై సాక్షి దినపత్రికలో నానా కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. సుప్రీం కోర్టు చివాట్లు పెట్టిన వార్త మాత్రం సాక్షి దినపత్రికలో కనిపించదని ఎద్దేవా చేశారు. విజయసాయిని ప్యానల్ చైర్మన్ గా తప్పించాలి రాజ్యసభ ప్యానల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డిని తక్షణమే ఆ పదవి నుంచి తప్పించాలని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతిని రఘురామకృష్ణం రాజు కోరారు. మహిళా లోకం పై, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై దుర్గంధం వెదజల్లే ట్విట్ల ను విజయ సాయి రెడ్డి పెడుతున్నారన్నారు. పెద్దల సభలో చైర్మన్ స్థానంలో కూర్చున వ్యక్తి మహిళల గురించి జుగుస్సాకరంగా, దేశ రాజకీయాలను కొన్నాళ్లు శాసించి, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గురించి అసహ్యమైన ట్విట్లను విజయసాయిరెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు విజయసాయిరెడ్డిని క్షమించరని, తమ పార్టీ అధ్యక్షుడు కూడా దీని వెనుక ఉన్నాడని జనం అనుకుంటున్నారని అన్నారు. తమ పార్టీ పార్లమెంటరీ నాయకుడు మహిళా సమాజం గురించి తప్పుగా మాట్లాడినందుకు అతన్ని పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవి నుంచి తప్పిస్తే, పోగొట్టుకున్నది కొద్దిగా సాధించవచ్చునని అన్నారు. సహచర ఎంపీగా తనపై ఏమైనా ట్వీట్లు వేస్తే వేయవచ్చునని, తాను నాలుగు ట్విట్లు వేస్తానని తెలిపారు. మనం మనం ఎంపీలమని మనలో మనం అనుకుంటే పెద్ద ఇబ్బంది ఏమి లేదన్నారు. దేశ నాయకులు, మహిళల గురించి జుగుస్సా కరంగా మాట్లాడితే పార్టీ భూస్థాపితం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్లను ఉపరాష్ట్రపతికి లేఖ రాస్తానని, త్వరలోనే ఆయన అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. జగన్ మీటింగ్ కు ఎంత మంది వస్తారో... తనకు స్వాగతం పలికేందుకు ఎంతమంది వస్తారో చూసుకుందాం నరసాపురంలో అభివృద్ధి పనులు చేయడానికి ముఖ్యమంత్రి వెళ్తున్నారని, స్థానిక ఎంపీ మాత్రం ఢిల్లీలో కూర్చున్నారని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ పై రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై దొంగ కేసులు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద అక్రమ కేసులు పెడుతూ, తాను ఢిల్లీలో కూర్చున్నానని ట్విట్ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ 15 రోజులపాటు తనపై అక్రమ కేసులు నమోదు చేయనని హామీ ఇస్తే, రాష్ట్రానికి వస్తానని అన్నారు. తనకు స్వాగతం పలికేందుకు ఊర్లకు ఊర్లే కదిలి వస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు ఎంత మంది వస్తారో... తనకు స్వాగతం పలికేందుకు ఎంతమంది వస్తారో చూసుకుందామని సవాల్ చేశారు. అడాన్ డిస్టలరీస్ మద్యాన్ని పంచిన, బిర్యానీ పొట్లాలను అందజేసిన జగన్మోహన్ రెడ్డి సభకు హాజరయ్యే ప్రజలకంటే ఎక్కువగానే తనకు స్వాగతం పలికేందుకు ప్రజలు హాజరవుతారన్నారు. భూములు కేటాయించిన రోజే... సాక్షి షేర్ల కొనుగోలు హెటిరో, అరబిందో ఫార్మా కంపెనీలకు 2006 నవంబర్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు కేటాయించిన రోజే, ఆ రెండు కంపెనీలు జగతి పబ్లికేషన్స్ పది రూపాయల షేర్ ను 350 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఒకే రోజు అన్ని జరిగాయని, చాలా క్లియర్ గా ఉందంటూ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే పరోక్షంగా క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పకనే చెప్పారన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 2006లో హెటిరో, అరబిందో ఫార్మా కంపెనీలు తమకు 75 ఎకరాల భూములు కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగానే, అదే రోజు ఏపీఐఐసీ ద్వారా భూములను కేటాయించారన్నారు. అంతకుముందే మరొక ఫార్మా కంపెనీ పది ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరితే, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిరాకరించిందని తెలిపారు. హెటిరో, అరబిందో ఫార్మా కంపెనీలు దరఖాస్తు చేసుకున్న రోజే ప్రభుత్వం భూములు కేటాయించడం, అదే రోజు ఈ రెండు కంపెనీలు జగతి పబ్లికేషన్ షేర్లను కొనుగోలు చేయడం క్విడ్ ప్రోకోలో భాగమేనని మాజీ మంత్రి శంకర్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ జెడి లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసి చార్జి షీట్ దాఖలు చేశారని తెలిపారు. చార్జ్ షీట్ ను కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించగా, చార్జిషీట్ కొట్టివేయడానికి కోర్టు తిరస్కరించిందని తెలిపారు. చార్జిషీట్లో శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి పేర్లు ఉన్నాయని తెలిపారు. వీరంతా కుటుంబ సభ్యులు బంధువులేనని వెల్లడించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో అన్న అధ్యక్షుడు... తమ్ముడు ఉపాధ్యక్షుడా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరొకసారి ఎన్నికయ్యారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో శరత్ చంద్ర రెడ్డి తరఫున ఆయన తమ్ముడు రోహిత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారన్నారు. అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా రోహిత్ రెడ్డి ఎన్నిక కాగా, వీరి వ్యాపార భాగస్వామి అయిన గోపీనాథ్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. గోపీనాథ్ రెడ్డి కంపెనీకి రోహిత్ రెడ్డి అప్పు ఇచ్చారని, దస పల్లా భూములను డెవలప్మెంట్ కోసం తీసుకున్న వ్యక్తి గోపీనాథ్ రెడ్డే నని తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను, వారి వ్యాపార భాగస్వామిని అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడానికి క్రికెట్ ఆడేవాళ్ళకైనా బుద్ధి ఉండాలని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల వెనుక ఎవరున్నారని, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఈ వ్యక్తులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
కోస్టా రికా యొక్క కాల్ సెంటర్ మీ అత్యంత సమీప ద్విభాషా BPO టెలిమార్కెటర్ల బృందంతో, మీ ప్రచార సామగ్రిని రూపొందిస్తుంది మరియు రూపొందించడానికి మీ సమీప దగ్గరి నిధుల ప్రచారాన్ని నిర్వహిస్తుంది మరియు అతి ముఖ్యమైనది, ఆదాయాన్ని అందించే ఆదాయం మొత్తాన్ని గరిష్టంగా పెట్టుబడి పెట్టింది. మా సెంట్రల్ అమెరికన్ కాల్ సెంటర్లు, ఎన్నో మానవతావాద కారణాలను సూచిస్తున్న ఎన్నుకున్న సంస్థలతో శాశ్వత మరియు సహాయక సంబంధాలను నిర్మించడంలో అంకితమయ్యాయి. కోస్టా రికా యొక్క కాల్ సెంటర్ వద్ద, మేము ప్రతిజ్ఞకు నెరవేర్చడానికి అనేక వ్యవస్థలను అవుట్సోర్సింగ్ చేయగలము. అన్ని ద్విభాషా విరాళాలు మీరు సంస్థాగత రికార్డులకు పత్రబద్ధం చేయబడతాయి మరియు మీ సమీక్ష కోసం రోజువారీ పంపబడతాయి. మా ఆఫ్షోర్ నిధుల వ్యవస్థ మా బలమైన విలువ వ్యవస్థ ద్వారా ప్రభావితమవుతుంది. ఇది తగిన నియమాల ప్రకారం ప్రతి ఫోన్ కాల్పై మా ప్రవర్తనను మార్గదర్శకత్వం చేసే ఈ సూత్రం. మీ ఆఫ్షోర్ నిధుల సేకరణ స్క్రిప్ట్స్ దానికి మరింత దాతృత్వ మొత్తానికి దాతని ముందుకు తెచ్చేందుకు వ్రాస్తారు, తద్వారా వారు అనుభవం గురించి మంచి అనుభూతి చెందుతారు. అన్ని ప్రారంభ పరిచయాలు గత విరాళం ట్రిపుల్ ప్రయత్నం ప్రారంభమవుతాయి మరియు దాత క్షీణత ఉంటే, మా కస్టమర్ సేవా ఏజెంట్లు మరింత సౌకర్యవంతమైన మొత్తం వెలికితీసే సిద్ధమైన. టెలిమార్కెటింగ్ ధైర్యం యొక్క మా స్థాయి దాత యొక్క ప్రారంభ ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది మరియు అడిగిన ప్రారంభ మొత్తానికి ప్రతిస్పందన. విరాళాన్ని స్వీకరించడానికి అవసరమైన ఖచ్చితమైన కమ్యూనికేషన్ను అర్థం చేసుకోవటానికి గత దాతల యొక్క మీ డేటాబేస్కు వ్యతిరేకంగా జనాభా మరియు మార్కెట్ అధ్యయనాల నుండి మా ఖచ్చితమైన వ్యూహాలు సమాచారాన్ని ఉపయోగిస్తాయి. మీ ఔట్సోర్స్ నిధుల సేకరణ ప్రచారానికి బహుళ రిమైండర్లు ఎంత ముఖ్యమైనవి అని మా లాటిన్ అమెరికన్ ఏజెంట్లు గుర్తించారు. అదనంగా, మా కాల్ సెంటర్ వెబ్ డిపార్ట్మెంట్ వారి వార్తాపత్రిక లేదా వెబ్సైట్ వారి దృష్టిని పొందడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నాలుగు రిమైండర్లు ఇమెయిల్ ద్వారా అలాగే బహుళ అవుట్బౌండ్ మర్యాద కాల్స్ ద్వారా పంపబడతాయి. ఒక ప్రత్యక్ష సంభాషణ తరువాత వ్యక్తిగత పరిచయం విజయవంతమవుతుంది. మేము బహుమతిని అందుకునే సంభావ్యతను పెంచడానికి కదిలే మరియు హృదయపూర్వక సందేశాలను వదిలివేస్తాము. మీ కోస్టా రికా యొక్క కాల్ సెంటర్ ద్విభాషా టెలిమార్కెటింగ్ బృందం అదనంగా మీ విలువలను మరియు నిధుల సేకరణ లక్ష్యాలను ప్రతి ఒక్కరికి మరింత విశ్వసనీయమైనదిగా కమ్యూనికేట్ చేస్తుంది. అంతిమంగా, భవిష్యత్లో పెద్ద బిపివో నిధుల సేకరణ ప్రచారానికి దాతలు మరియు వారి వ్యక్తిగత రిఫరల్స్తో మంచి దీర్ఘకాల సంబంధాలను నిర్మించడానికి మేము ఈ సందర్భంగా ఉపయోగిస్తాము. Follow us Facebook Twitter LinkedIn Instagram Pinterest Notice: JavaScript is required for this content. Address Costa Rica's Call Center. Av 11, Calle 23, Barrio Aranjuez, San José, Costa Rica © 2007 - 2022 Outsourcing Business Services International, Inc. - Costa Rica's Call Center - All Rights Reserved
దేశంలో కోవిడ్ పరిస్థితిపై శుక్రవారం సుప్రీంకోర్టులో వీడియో ద్వారా విచారణ జరుగుతుండగా..సాంకేతిక సమస్య తలెత్తింది. విచారణ సమయంలో జస్టిస్ మాట్లాడుతున్నప్పుడు కొద్దిసేపు వీడియో డిస్ కనెక్ట్ అయింది. Justice Fallen Off A Lighter Moment Umakanth Rao | Edited By: Phani CH Apr 30, 2021 | 7:42 PM దేశంలో కోవిడ్ పరిస్థితిపై శుక్రవారం సుప్రీంకోర్టులో వీడియో ద్వారా విచారణ జరుగుతుండగా..సాంకేతిక సమస్య తలెత్తింది. విచారణ సమయంలో జస్టిస్ మాట్లాడుతున్నప్పుడు కొద్దిసేపు వీడియో డిస్ కనెక్ట్ అయింది. ఈ సందర్భంలో ఓ లాయర్..’ బహుశా చంద్రచూడ్ పడిపోయారేమో’ అని చమత్కరించాడు. కాగా కొద్దిసేపటికే న్యాయమూర్తికి సంబంధించి వీడియో రీకనెక్ట్ కావడంతో.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..’చూడబోతే ఆ లాయర్ సముచిత పదాన్ని వాడినట్టు లేదు ‘ అని వ్యాఖ్యానించారు. కానీ జస్టిస్ చంద్రచూడ్ దీన్ని తేలిగ్గా తీసుకున్నారు. ‘అరే ! వో తో పరమాత్మా కే హాథ్ మే హై ‘ ( అది దేవుడి చేతుల్లో ఉంది) అని పేర్కొన్నారు. సుమారు 20 సెకండ్ల పాటు తన లాగింగ్ పోయిందని ఆయన తెలిపారు. అత్యున్నత న్యాయస్థానంలో ఈ తరహా ఘటన జరగడం ఇదే మొదటిసారి. ఇక దేశంలో ఈ కోవిద్ విపత్కర సమయంలో.. ప్రజలు నిర్భయంగా తమ ఇబ్బందులను, సమస్యలను సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి తేవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మహమ్మారి అదుపులో వారు పోలీసులకు, అధికారులకు సహకరించాలని, సరైన సమాచారం ఇవ్వాలని సూచించింది. తప్పుడు సమాచారం ఇస్తే అది కోర్టు ధిక్కారమే అవుతుందని కూడా హెచ్చరించింది. ప్రజల గళాలను తాము వినగోరుతున్నామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దేశంలో ఆక్సిజన్, మందుల కొరతను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, కేంద్రం ఓ నిర్దిష్ట ప్రణాళికతో ఈ సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని కూడా సలహాఇచ్చింది . దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పరోక్షంగా పేర్కొంది. మరిన్ని ఇక్కడ చూడండి: AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే.. Digital Frauds: క‌రోనా క‌ష్ట స‌మ‌యాన్ని సొమ్ము చేసుకుంటున్న సైబ‌ర్ నేర‌గాళ్లు.. భార‌త్‌లో పెరుగుతున్న మోసాలు..
బాబూ.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేస్తావా..? ఆక్వా రైతులను ఆదుకోండి పార్టీ నేతల సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కీలక ప్రకటన నిషేధిత ప్లాస్టిక్ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత శ్రీ‌నాథ్‌రెడ్డి పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్ సమావేశం ప్రారంభం కాసేపట్లో పార్టీ నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం బడుగు, బలహీనవర్గాలకు వెన్నుపోటే బాబు డీఎన్ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం You are here హోం » Others » తిత్లీ తుపాను బాధితులకు వైయస్‌ జగన్‌ సాయం.. తిత్లీ తుపాను బాధితులకు వైయస్‌ జగన్‌ సాయం.. 31 Oct 2018 12:18 PM పంపిణీకి రూ.కోటి విలువైన 10 వేల కిట్‌లు సిద్ధం.. శ్రీకాకుళంః తిత్లీ తుపాను బాధితులకు వైయస్‌ జగన్‌ అందించిన సాయాన్ని తుపాను బాధితులకు అందించే ఏర్పాట్లు వైయస్‌ఆర్‌సీపీ నేతలు చేస్తున్నారు. 10వేల బాధిత కుటుంబాలకు పంపిణీ చేసే విధంగా రూ.కోటి విలువైన 10వేల కిట్‌లు శ్రీకాకుళం చేరుకున్నాయి. సహాయక సామాగ్రి వ్యాన్‌లను నియోజకవర్గాల వారీగా వైయస్‌ఆర్‌సీపీ నేతలు ధర్మాన, తమ్మినేని సీతారాం తదితరులు పంపించారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన వారు నటనని కంటిన్యూ చేస్తూ హీరోలుగా, హీరోయిన్లుగా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోవడం ఇండస్ట్రీలో పరిపాటి.. ఆ కోవకి చెందినవాడే మాస్టర్ భరత్.. సారీ ఇప్పుడు మనోడు మాస్టర్ కాదు కదా..భరత్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయి ఇప్పుడు హీరో ఫ్రెండ్ రోల్స్ పోషిస్తూ తన నటనతో మెప్పిస్తున్నాడు..ఇటీవల చిత్రసీమలో తన అనుభవాల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు శేర్ చేసుకున్నాడు భరత్.. అనగనగా ఒక పేద కుటుంబం..ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు..తల్లి కూడా పేదదే..పిల్లలు,తోటమాలి ఆఖరికి వంటవాడు కూడా పేదవాడే..వాళ్లు తినడానికి చికెన్ బిర్యాని దొరక్క ఎసి కార్లో వెళ్తుంటే…పదిహేనేళ్ల క్రితం వచ్చిన ఆనందమానందమాయే మూవీలోని ఫన్నీ సీన్ ఇప్పటికి కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది..ఆ సీన్లో నటించిన మాస్టర్ భరత్ తర్వాత రెడీ, ఢీ, కింగ్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు.రెడీ, బిందాస్లో తన కామెడికి గాను నంది అవార్డులు కూడా అందుకున్నాడు. ఢీ లో మంచు విష్ణు – భరత్ కాంబినేషన్లో వచ్చిన ఫన్నీ సీన్స్ ఇప్పటికి మర్చిపోలేం.. మంచు వారి ఫ్యామిలితో భరత్ ది ప్రత్యేక అనుబంధం ..ఢీ, బిందాస్, దేనికైనా రెడీ,సలీమ్, ఆచార్య అమెరికా యాత్రా ఇలా మంచు సోదరులతో భరత్ వారి చిత్రాల్లో నటించాడు.. ఇక ఇండస్ట్రీలో మోహన్ బాబుకి ఉన్న పలుకుబడి తెలిసిందే, చాలామంది ఆయన ముందు నిలబడి మాట్లాడానికి భయపడతరాంటరు..అలాగే భరత్ కూడా మోహన్ బాబుకి ఒకసారి భయపడి ఏడ్చాడట.. విష్ణు-ఇలియానా హీరోహీరోయిన్లుగా నటించిన సలీం షూటింగ్ అప్పుడు భరత్ దగ్గరకి వచ్చిన మోహన్ బాబు..ఏంట్రా ఎక్కువ చేస్తున్నావట? పొగరెక్కిందా ??? అని అడిగేసరికి భరత్ వెంటనే ఏడ్చేసాడట.. అప్పుడు కొంచెం దూరంలో ఉన్న విష్ణు వచ్చి నాన్న, ఏం అనొద్దు చాలా మంచోడు అని చెప్తే..నేనేం అనట్లేదురా, జస్ట్ జోక్ చేసా అని మోహన్ బాబు అనగానే స్పాట్లో ఉన్నవాళ్లంతా ఒకేసారి నవ్వుతున్నా కూడా భరత్ అదే షాక్లో ఉండిపోయాడట..తన కొడుకులతో పాటుగా నన్ను చూస్తారు,బాగా ఎంకరేజ్ చేసేవారు అని మోహన్ బాబుతో తనకున్న అనుబంధం గురించి పంచుకున్నాడు భరత్. Recent Posts “గాడ్ ఫాదర్” చిత్రం లో అవే మైనస్లు : పరుచూరి గోపాల కృష్ణ మరో సారి సొంత కథతో తెరపైకి “పవర్ స్టార్”..!! “పోకిరి” నుండి “పుష్ప” వరకు… సమాజానికి “చెడు సందేశం” ఇచ్చిన 10 హిట్ సినిమాలు..! Vijay Deverakonda: ”విజయ్ దేవరకొండ” స్ట్రాంగ్.. ఎక్కడ పడినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు.. రాహుల్, ప్రియదర్శి
లేవీయకాండము 19:18 – కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచుకొనక నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను. సామెతలు 24:17 – నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము. సామెతలు 24:29 – వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెద ననుకొనకుము. మత్తయి 5:39 – నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పుము. మత్తయి 5:40 – ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరినయెడల వానికి నీ పైవస్త్రము కూడ ఇచ్చివేయుము. మత్తయి 5:41 – ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము. రోమీయులకు 12:17 – కీడుకు ప్రతికీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి. రోమీయులకు 12:19 – ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది. 1దెస్సలోనీకయులకు 5:15 – ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకనియెడల ఒకడును మనుష్యులందరియెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి. 1పేతురు 3:9 – ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి. Christ an example of forbearing యెషయా 53:7 – అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. 1పేతురు 2:23 – ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. Rebuked by Christ లూకా 9:54 – శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా, ఆకాశమునుండి అగ్నిదిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, లూకా 9:55 – ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను. Inconsistent with Christian spirit లూకా 9:55 – ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను. Proceeds from a spiteful heart యెహెజ్కేలు 25:15 – మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఫీలిష్తీయులు పగతీర్చుకొనుచు నాశము చేయుచు, మానని క్రోధముగలవారై తిరస్కారము చేయుచు పగతీర్చుకొనుచున్నారు గనుక Instead of taking, we should -Trust in God సామెతలు 20:22 – కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవా కొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును. రోమీయులకు 12:16 – ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితోనొకడు మనస్సు కలిసియుండుడి. హెచ్చువాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. -exhibit love లేవీయకాండము 19:18 – కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచుకొనక నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను. లూకా 6:35 – మీరైతే ఎట్టి వారినిగూర్చి యైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదై యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు. -give place to wrath రోమీయులకు 12:19 – ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది. -Exercise forbearance మత్తయి 5:38 – కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. మత్తయి 5:39 – నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పుము. మత్తయి 5:40 – ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరినయెడల వానికి నీ పైవస్త్రము కూడ ఇచ్చివేయుము. మత్తయి 5:41 – ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము. -bless రోమీయులకు 12:14 – మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు. -overcome others by kindness సామెతలు 25:21 – నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము సామెతలు 25:22 – అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. రోమీయులకు 12:20 – కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. Keep others from taking 1సమూయేలు 24:10 – ఆలోచించుము; ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నాచేతికి అప్పగించెనో అది నీ కండ్లార చూచితివే; కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీయందు కనికరించి ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక నా యేలినవాని చంపనని నేను చెప్పితిని. 1సమూయేలు 25:24 – నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము; 1సమూయేలు 25:25 – నా యేలినవాడా, దుష్టుడైన యీ నాబాలును లక్ష్యపెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము; నా యేలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. 1సమూయేలు 25:26 – నా యేలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండ యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించెనన్నమాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులును నా యేలినవాడవైన నీకు కీడుచేయ నుద్దేశించువారును నాబాలువలె ఉందురు గాక. 1సమూయేలు 25:27 – అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి 1సమూయేలు 25:28 – నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా యేలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా యేలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రదుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును. 1సమూయేలు 25:29 – నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపుమూటలో కట్టబడును; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును. 1సమూయేలు 25:30 – యెహోవా నా యేలినవాడవగు నిన్నుగూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయులమీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత 1సమూయేలు 25:31 – నా యేలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకేగాని, నా యేలినవాడవగు నీవు పగతీర్చు కొనినందుకేగాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా యేలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలుగకపోవును గాక, యెహోవా నా యేలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసికొనుము అనెను. 1సమూయేలు 26:9 – దావీదు నీవతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందినవానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము? Be thankful for being kept from taking 1సమూయేలు 25:32 – అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. 1సమూయేలు 25:33 – నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. The wicked are earnest after యిర్మియా 20:10 – నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించినయెడల మేమును చాటింతుమందురు; అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరు నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకొనియున్నారు. Punishment for యెహెజ్కేలు 25:15 – మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఫీలిష్తీయులు పగతీర్చుకొనుచు నాశము చేయుచు, మానని క్రోధముగలవారై తిరస్కారము చేయుచు పగతీర్చుకొనుచున్నారు గనుక యెహెజ్కేలు 25:16 – ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఫిలిష్తీయులమీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలము చేసెదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసెదను. యెహెజ్కేలు 25:17 – క్రోధముతో వారిని శిక్షించి వారిమీద నా పగ పూర్తిగా తీర్చుకొందును; నేను వారిమీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. ఆమోసు 1:11 – యెహోవా సెలవిచ్చునదేమనగా ఎదోము మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగు వారిని మానక చీల్చుచువచ్చెను. ఆమోసు 1:12 – తేమానుమీద అగ్ని వేసెదను, అది బొస్రా యొక్క నగరులను దహించివేయును. Exemplified -Simon and Levi ఆదికాండము 34:25 – మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు, తమ కత్తులుచేతపట్టుకొని యెవరికి తెలియకుండ ఆ ఊరిమీద పడి ప్రతి పురుషుని చంపిరి. -Samson న్యాయాధిపతులు 15:7 – అప్పుడు సమ్సోనుమీరు ఈలాగున చేసినయెడల నేను మీమీద పగతీర్చుకొనిన తరువాతనే చాలించెదనని చెప్పి న్యాయాధిపతులు 15:8 – తొడలతో తుంట్లను విరుగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటుపిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించెను. న్యాయాధిపతులు 16:28 – అప్పుడు సమ్సోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసి కొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బల పరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొఱ్ఱపెట్టి న్యాయాధిపతులు 16:29 – ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమచేతను పట్టుకొని న్యాయాధిపతులు 16:30 – నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాల మందు అతడు చంపినవారి లెక్కకంటె ఎక్కువాయెను. -Joab 2సమూయేలు 3:27 – అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి యెవరికి వినబడకుండ గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలెనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడువగా అతడు చచ్చెను. -Absalom 2సమూయేలు 13:23 – రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొఱ్ఱల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను. 2సమూయేలు 13:24 – అబ్షాలోము రాజునొద్దకు వచ్చి చిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొఱ్ఱబొచ్చు కత్తిరించు కాలము వచ్చెను; రాజవైన నీవును నీ సేవకులును విందునకు రావలెనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా 2సమూయేలు 13:25 – రాజు నా కుమారుడా, మమ్మును పిలువవద్దు; మేము నీకు అధిక భారముగా ఉందుము; మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేసెను. 2సమూయేలు 13:26 – అయితే దావీదు వెళ్లనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా అబ్షాలోము నీవు రాకపోయినయెడల నా అన్నయగు అమ్నోను మాతోకూడ వచ్చునట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. అతడు నీయొద్దకు ఎందుకు రావలెనని రాజు అడుగగా 2సమూయేలు 13:27 – అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరును అతనియొద్దకు పోవచ్చునని సెలవిచ్చెను. 2సమూయేలు 13:28 – అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసమువలన సంతోషియై యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతని చంపుడి, నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను. 2సమూయేలు 13:29 – అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞచొప్పున వారు చేయగా రాజకుమారులందరును లేచి తమ కంచరగాడిదల నెక్కి పారిపోయిరి. -Jezebel 1రాజులు 19:2 – యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. -Ahab 1రాజులు 22:26 – అప్పుడు ఇశ్రాయేలు రాజు మీకాయాను పట్టుకొని తీసికొనిపోయి పట్టణపు అధికారియైన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి -Haman ఎస్తేరు 3:8 – అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటియందుండు జనులలో ఒక జాతివారు చెదరియున్నారు; వారి విధులు సకలజనుల విధులకు వేరుగా ఉన్నవి; వారు రాజుయొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు; కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. ఎస్తేరు 3:9 – రాజునకు సమ్మతియైతే వారు హతము చేయబడునట్లును, నేను ఆ పనిచేయువారికి ఇరువదివేల మణుగుల వెండిని రాజుయొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును, చట్టము పుట్టించుమనగా ఎస్తేరు 3:10 – రాజు తనచేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామానున కిచ్చి ఎస్తేరు 3:11 – ఆ వెండి నీ కియ్యబడియున్నది; నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి యున్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. ఎస్తేరు 3:12 – మొదటి నెల పదమూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆ యా సంస్థానములమీద నుంచబడిన రాజుయొక్క అధిపతులకును అధికారులకును, ఆ యా సంస్థానములలోని జనములమీద నుంచబడిన అధిపతులకును అధికారులకును, వారి వారి లిపినిబట్టియు, ఆ యా జనముల భాషనుబట్టియు, రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్రచేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరముచేత ముద్రింపబడెను. ఎస్తేరు 3:13 – అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమందు యౌవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరిని ఒక్కదినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారిచేత రాజ్య సంస్థానములన్నిటికిని పంపబడెను. ఎస్తేరు 3:14 – మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. ఎస్తేరు 3:15 – అంచెవారు రాజాజ్ఞచేత త్వరపెట్టబడి బయలువెళ్లిరి. ఆ యాజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను, దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతట రాజును హామానును విందుకు కూర్చుండిరి. -Edomites యెహెజ్కేలు 25:12 – మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎదోమీయులు యూదావారిమీద పగతీర్చుకొనుచున్నారు, తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా -Philistines యెహెజ్కేలు 25:15 – మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఫీలిష్తీయులు పగతీర్చుకొనుచు నాశము చేయుచు, మానని క్రోధముగలవారై తిరస్కారము చేయుచు పగతీర్చుకొనుచున్నారు గనుక -Herodias మార్కు 6:19 – హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింపగోరెను గాని ఆమెచేత గాకపోయెను. మార్కు 6:20 – ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు, ఏమిచేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. మార్కు 6:21 – అయితే తగిన దినమొకటి వచ్చెను; ఎట్లనగా, హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయదేశ ప్రముఖులకును విందు చేయించెను. మార్కు 6:22 – అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడ పంక్తిని కూర్చున్నవారిని సంతోషపరచెను గనుక రాజు నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను మార్కు 6:23 – మరియు నీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టుపెట్టుకొనెను మార్కు 6:24 – గనుక ఆమె వెళ్లి నేనేమి అడిగెదనని తన తల్లినడుగగా ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను. -James and John లూకా 9:54 – శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా, ఆకాశమునుండి అగ్నిదిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, -chief Priests అపోస్తలులకార్యములు 5:33 – వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా -Jews అపోస్తలులకార్యములు 7:54 – వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అపోస్తలులకార్యములు 7:59 – ప్రభువునుగూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.
ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యవసాయం పై మక్కువ చూపిస్తున్నారు. చక్కటి లాభాలను కలిగే పంటల్ని వేస్తూ అధికంగా లాభాలను పొందుతున్నారు. ముఖ్యంగా యువత కూడా పంటలపై ఆసక్తి చూపిస్తోంది చాలా మంది యువకులు వివిధ రకాల పంటలు వేసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు. వ్యవసాయం చేయాలన్నా మంచి లాభాలను పొందాలన్నా ఎటువంటి పంటలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది..?, ఎక్కువ లాభాలను ఎలా పొందవచ్చు అనేది తెలుసుకుని అనుసరిస్తే సక్సెస్ అవ్వొచ్చు. వాణిజ్య పంటలతో డబ్బులు బాగా వస్తాయి. ఉద్యోగాలను వదిలేసే వాణిజ్య పంటల పై ఆసక్తి చూపిస్తున్నారు చాలామంది. అయితే అలాంటి పంటల్లో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లిని సాగు చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. వెల్లుల్లి సాగుకు సంబంధించి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరూ వంటల్లో వెల్లుల్లిని వాడుతూ ఉంటారు. వెల్లుల్లి వల్ల వంటకు రుచి వస్తుంది పైగా ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి వల్ల చాలా మేలు కలుగుతుంది. ఈ వెల్లుల్లి సాగు చేయడానికి వానాకాలం అయిపోవాలి. ఆ తర్వాత సాగుని ప్రారంభించవచ్చు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ సాగుకు అనుకూలంగా ఉంటుంది. వెల్లుల్లి మొగ్గల నుండి వెల్లుల్లి పండిస్తూ ఉంటారు ఈ పంట వేయడానికి ఎటువంటి నేల అయినా బాగుంటుంది. ఒక ఎకరంలో వెల్లుల్లి సాగు చేస్తే 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఒక క్వింటాల్ వెల్లుల్లి ధర మార్కెట్లో పది వేల నుంచి 20 వేల వరకు ఉంటుంది. ఒక ఎకరంలో పండించడానికి 40 వేల వరకు ఖర్చు అవుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాణ్యమైన వెల్లుల్లిని పండించి మంచిగా లాభాలను పొందవచ్చు. మంచి రకమైన వెల్లుల్లిని కొనుగోలు చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇలా వెల్లుల్లి సాగు తో మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.
న్యూఢిల్లీ : ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు ఎలా సమకూర్చుతారో స్పష్టం చేయాలని రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ మేరకు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ రాసింది. అందులో వివరాలు తెలియజేయాల్సిన ఫార్మాట్‌ను రూపొందించి జత చేసింది. ఎన్నికల వాగ్దానాలకు రాజకీయ పార్టీలను మరింత జవాబుదారీగా చేయడానికీ, ఓటర్లకు ''నిజమైన, తగిన'' సమాచారాన్ని అందించాలని కోరింది. ఈ నెల 19లోగా సమాధానాలు పంపాలనీ, ఒక వేళ పంపకపోతే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) సవరణకు ఆయా పార్టీలు చెప్పేది ఏమీ ఉండదని ఈసీ భావిస్తోందని పేర్కొంది. రాజకీయ పార్టీలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలకు ఖర్చుల వివరాలను వివరించి, ఓటర్లకు కొంత అవగాహన కల్పిస్తూ వారి ఆర్థిక స్థితిని కూడా వివరించాలని ప్రతిపాదించింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలకు ఆర్థికపరమైన చిక్కులు, వాటికి ఆర్థికసాయం చేసే మార్గాల వివరాలను అందించడానికి గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు తెలియజేయాలని కోరింది. ఎన్నికల వాగ్దానాలపై స్పష్టత అంశంపై ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపడమనేదాన్ని విస్మరించలేమని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించడం అవసరమని తెలిపింది. ఓటర్లందరూ తమ ఓటును సులభంగా భయం, ఆకర్షణ లేకుండా వినియోగించుకునే చూడాల్సిన అవసరం ఉంది. సుబ్రమణ్యం బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశాలను నేరుగా నియంత్రించే చట్టమేదీ లేదనీ, అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి మ్యానిఫెస్టో కోసం మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిందనీ, దానికనుగుణంగా ఈసీ ప్రక్రియ మొదలుపెట్టిందని తెలిపింది. సంప్రదింపుల కోసం 2013 ఆగస్టు 12న, మళ్లీ 2019లో అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని పేర్కొంది. ''పౌరుల కోసం వివిధ సంక్షేమ చర్యలను రూపొందించాలని రాజ్యాంగంలో పొందుపర్చిన నిర్దేశక సూత్రాలు ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాయి. కాబట్టి ఎన్నికల మ్యానిఫెస్టోల్లో అలాంటి సంక్షేమ చర్యల వాగ్దానానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఏది ఏమైనప్పటికీ, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతకు భంగం కలిగించే, తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఓటర్లపై అనవసరమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్న వాగ్దానాలు చేయడం మానుకోవాలి'' అని తెలిపింది. ''పారదర్శకత, వాగ్దానాల విశ్వసనీయత దృష్ట్యా మ్యానిఫెస్టోలు వాగ్దానాల హేతుబద్ధతను ప్రతిబింబిస్తాయనీ, అందువల్ల ఆర్థిక అవసరాలను తీర్చడానికి మార్గాలను విస్తృతంగా సూచిస్తాయని భావిస్తున్నాం. నెరవేర్చడానికి సాధ్యమయ్యే హామీలపై మాత్రమే ఓటర్ల విశ్వాసాన్ని కోరాలి'' అని సూచించింది. ఇప్పటికే ఉన్న నియమావళి మార్గదర్శకాలను అమలు చేయాలనీ, అలాగే ఓటర్లకు పూర్తి సమాచారం ఇవ్వాలని రాజకీయ పార్టీలను ఆదేశించాలని కమిషన్‌ ప్రతిపాదించింది. చేసిన వాగ్దానాల ఆర్థిక చిక్కులు, ఆర్థిక వనరుల లభ్యత అంశాలను, వాగ్దానాలను నెరవేర్చడానికి అదనపు ఖర్చులను తీర్చడానికి వనరులను సేకరించే మార్గాలు తెలియజేయాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) పార్ట్‌ 8లోని సబ్‌ పేరా 3 (2)లో ప్రతిపాదిత సవరణను కొనసాగించే ముందు రాజకీయ పార్టీల అభిప్రాయాలను అభ్యర్థించాలని ఈసీ నిర్ణయించింది. అందుకనుగుణంగా అక్టోబర్‌ 19న లోపు రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలపాలని కోరింది. అప్పటికి ఎటువంటి స్పందన పంపని పార్టీలు, ఎంసీసీలో ప్రతిపాదించిన సవరణపై ఆయా పార్టీలు ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదని ఈసి భావిస్తోందని పేర్కొంది.
Telugu News » World » Success story: After 600 cold emails and 80 odd calls, this 23 year old Yale graduate landed a World Bank job Success Story: మొదటి జీతం డాలర్లలోనే తీసుకోవాలని.. ప్రపంచ బ్యాంక్ లో జాబ్ సంపాదించిన భారతీయ యువకుడు.. సక్సెస్ స్టోరీ మీ కోసం తాను భారతదేశానికి తిరిగి రావాలని కోరుకోలేదని.. తన మొదటి జీతం డాలర్లలో ఉండాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పాడు వత్సల్'. దీంతో ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. Vatsal Nahata Surya Kala | Sep 24, 2022 | 6:30 PM Success Story: కష్టపడి పనిచేయడాన్నినమ్మేవారు ఎప్పుడూ జీవితం పై ఆశని వదులుకోరు. కృషి పట్టుదల, కష్టపడే తత్వం ఉన్నవారి జీవితం ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది. అలాంటి వారిలో వత్సల్ నహతా ఒకరు. శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన 23 ఏళ్ల వత్సల్ నహతా సక్సెస్ కథ తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. నిజానికి ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేయడం వత్సల్ కల. అలాంటి పరిస్థితుల్లో తన కలను సాకారం చేసుకునేందుకు చాలా కష్టపడ్డాడు. 600 కోల్డ్ ఇమెయిల్‌లు, 80 కాల్స్ తర్వాత.. వత్సల్ నహతా చివరకు తన డ్రీమ్ జాబ్‌ను పొందారు. వత్సల్ స్ఫూర్తిదాయకమైన సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం. కోవిడ్-19 మహమ్మారి సమయంలో వత్సల్ స్ఫూర్తిదాయక ప్రయాణం ప్రారంభమైంది. వాస్తవానికి 2020 లో వత్సల్ అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయంలో తన చదువును పూర్తి చేశాడు. అయితే కరోనా సృష్టించిన విలయంలో ఆర్ధిక మాంద్యం ఏర్పడడంతో ఉద్యోగం సంపాదించడంలో అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. అనేక కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడంలో నిమగ్నమై ఉన్నాయి. అదే సమయంలో.. ఇమ్మిగ్రేషన్‌ విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి కూడా కఠినంగా ఉంది. అమెరికా పౌరులకు మాత్రమే ఉద్యోగాల్లో ఇవ్వాలని ఆదేశించారు. ఇదే విషయంపై వత్సల్ నహతా మాట్లాడుతూ.. తనకు అప్పుడు ఉద్యోగం లేదని యేల్ యూనివర్సిటీ నుంచి ఇంకో రెండు నెలల్లో గ్రాడ్యుయేట్ పట్టాను పుచ్చుకోబోతున్నాను.. ఏమి చేయాలనీ అని ఆలోచించాను. అప్పుడే తనకు ఉక్కు లాంటి దృఢ సంకల్పం ఏర్పడిందని పేర్కొన్నాడు. తనకు అమెరికాలో ఉద్యోగం రాక పోతే యేల్ లో చదువుకుని ఏం లాభం అని భావించినట్లు నహతా స్వయంగా చెప్పాడు. తన పేరెంట్స్‌ ఫోన్‌ చేసి ఎలా ఉన్నావని అడిగినప్పుడు.. వారికీ తన గురించి చెప్పడం చాలా కష్టంగా మారింది’ అని చెప్పాడు. అంతేకాదు తాను భారతదేశానికి తిరిగి రావాలని కోరుకోలేదని.. తన మొదటి జీతం డాలర్లలో ఉండాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పాడు వత్సల్’. దీంతో ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. రెండు నెలల వ్యవధిలో.. 1500 కంపెనీలకు దరఖాస్తులను పంపాడు. 600 కోల్డ్-ఇమెయిల్స్ వ్రాసాడు.. సుమారు 80 సంస్థల నుంచి వివిధ కాల్స్ అందుకున్నాడు. అయితే తన ప్రయత్నాలు ఫలించలేదని.. చాలా తిరస్కరణలను ఎదుర్కోవలసి వచ్చిందని పేర్కొన్నాడు. తన అవసరాన్ని గ్రహించి తనని తాను బలంగా మలచుకున్నట్లు.. ఆత్మవిశ్వాసంతో మరింత పట్టుదలగా మరింత కష్టపడి పనిచేస్తినట్లు చెప్పాడు. చివరకు తన ప్రయత్నాలు ఫలించి ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం సంపాదించానని హర్షం వ్యక్తం చేశాడు వత్సల్ నహతా. ‘మే మొదటి వారం వరకు.. తనకు 4 ఉద్యోగ ఆఫర్లు ఉన్నాయి. అయితే తాను ప్రపంచ బ్యాంకులో పని చేయడానికి ఎంచుకున్నానని చెప్పాడు. ప్రస్తుతం తనకు వీసాను స్పాన్సర్ చేయడానికి కంపెనీలు సిద్ధంగా ఉంది. ప్రపంచ బ్యాంక్‌లో ప్రస్తుత డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్‌తో కలిసి మెషీన్ లెర్నింగ్ పేపర్‌ను సహ రచయితగా చేయమని నా మేనేజర్ నాకు ఆఫర్ చేశారని పేర్కొన్నాడు. వత్సల్ నహతా ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో పనిచేస్తున్నారు. రెండు నెలల ఆ ప్రయాణం కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్పిందని అంటున్నారు. ఇవి కూడా చదవండి Success Story: దేశంలోని ధనవంతుల జాబితాలో.. అత్యంత పిన్న వయస్కురాలైన నేహా.. సెల్ఫ్ మేడ్ ఉమెన్‌ సక్సెస్ స్టోరీ Success Story: 90 ఏళ్ల వయసులో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించిన ఈ బామ్మ సక్సెస్ స్టోరీ.. నేటి యువతకు ఆదర్శం Inspiring Story: నాడు కాల్ సెంటర్‌లో రూ.8000 జీతగాడు.. నేడు కోటీశ్వరుడు.. నిఖిల్ కామత్ ప్రస్థానం Viral News: ఫుడ్ డెలివరీ ఆలస్యంతో అసహంతో కస్టమర్.. డెలివరీ చేసిన వ్యక్తిని చూసి షాక్.. హృదయాన్ని కదిలించే కథనం వైరల్‌ ఇది నెట్‌వర్కింగ్ నిజమైన శక్తిని నాకు చూపించింది. ఇప్పుడు నా స్వభావాన్ని మార్చింది. నేను ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని అమెరికాకు వలసదారుగా వెళ్లగలననే విశ్వాసాన్ని నాకు ఇచ్చింది. నా ఐవీ లీగ్ డిగ్రీ మాత్రమే నన్ను ఇంత దూరం తీసుకురాగలిగింది. సంక్షోభ సమయాలు (COVID-19 , ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానం) తనను మరింత అభివృద్ధి చెందిన వ్యక్తిగా సిద్ధం కావడానికి అనువైనవిగా మలచాయని పేర్కొన్నాడు.
ఎదురుగా వచ్చి గుండెల్ని చీల్చగల దమ్ము, ధైర్యం ఉన్న రక్తమే వైయ‌స్ జగన్‌గారిలో ప్రవహించేది. - మంత్రి కొడాలి నాని | YSR Congress Party Skip to main content You are here Home ఎదురుగా వచ్చి గుండెల్ని చీల్చగల దమ్ము, ధైర్యం ఉన్న రక్తమే వైయ‌స్ జగన్‌గారిలో ప్రవహించేది. - మంత్రి కొడాలి నాని 29 Mar 2022 12:11 PM తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌
1. ముందుగా సూచించుట 2. రామచంద్ర దాదా పాటీలు, తాత్యా కోతే పాటీలుల చావులను తప్పించుట 3. లక్ష్మీబాయి శిందేకు దానము 4. చివరి దశ. ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. తొలిపలుకు గత అధ్యాయములలో చెప్పిన కథలు, బాబా కృపయను కాంతిచే ఐహికజీవితమందలి భయము నెటుల త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గము నెట్లు తెలిసి కొనగలమో, మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదారవిందములను జ్ఞప్తియందుంచుకొనినచో, మన కష్టములు నశించును. మరణము దాని నైజమును కోలిపోవును. ఐహిక దుఃఖములు నశించును. ఎవరయితే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా విన వలెను. అది వారి మనస్సును పావనము చెయును. ముందుగా సూచించుట చదువరు లింతవరకు బాబా జీవితకథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినెదరుగాక. 1918 సెప్టెంబరు 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము రెండు మూడు దినము లుండెను, కాని అటుతరువాత బాబా భోజనమును మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్చోబరు 15వ తేదీ మంగళవారము 2-30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచెను. ఈ విషయమును రెండు సంవత్సరములకు ముందే బాబా సూచించెను గాని, యది యెవరికి బోధపడలేదు. అది యిట్లు జరిగెను. విజయదశమినాడు సాయంకాలము గ్రామములోని వారందరు సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘన మనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫనీ, లంగోటీ తీసి వానిని చించి ముందున్న ధుని లోనికి విసిరివైచిరి. దీని మూలముగా ధుని యెక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరుడై నిలచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా అరచెను. "ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో, మహమ్మదియుడనో చెప్పుడు." అచటనున్న ప్రతివాడు గడ గడ వణకిపోయెను. బాబా వద్దకు పోవుట కెవ్వరును సాహసించలేకపోయిరి. కొంతసేపటికి భాగోజి శిందే (కుష్ఠురోగ భక్తుడు) ధైర్యముతో దగ్గరకు బోయి లంగోటును గట్టి యిట్లనెను. "బాబా! సీమోల్లంఘనమునాడు ఇదంతయునేమి?" "ఈ రోజు నా సీమోల్లంఘనము." అనుచు బాబా సటకాతో నేలపై గొట్టెను. బాబా రాత్రి 11 గంటలవరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి యుత్సవము జరుగునో లేదో యని యందరు సంశయించిరి. ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటివలె దుస్తులు వేసికొని చావడి యుత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరానాడు సమాధి చెందుదుమని సూచించిరి గాని అది యెవరికి అర్ధము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరియొక సూచన గూడ చేసిరి. రామచంద్ర, తాత్యాకోతే పాటీళ్ళ మరణము తప్పించుట ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధవడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను గాని, అవి గుణము నివ్వలేదు. నిరాశ చెంది, చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా యతని దిండువద్ద నిలచెను. పాటీలు బాబా పాదములు పట్టుకొని "నేను నా జీవితముపై ఆశ వదలుకొన్నాను. నేనెప్పుడు మరణించెదనో దయచెసి చెప్పుడు" అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా "నీ వాతురపడవద్దు, నీ చావు చీటి తీసివేసితిని. త్వరలో బాగుపడెదవు. కాని, తాత్యాకోతేపాటిలుగూర్చి సంశయించుచున్నాను. ఆతడు శక సం. 1840 విజయదశమినాడు (1918) మరణించును. ఇది యెవరికిని తెలియనీయకు; వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును." అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కాని యాతడు తాత్యాగూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదనియు కనుక తాత్యా రెండు సంవత్సరములలో మరణము చెందుననుకొనెను. దీనిని రహస్యముగా నుంచెను, ఎవరికిని తెలియనీయలెదు. కాని బాలాషింపికి మాత్రము చెప్పెను. రామచంద్రపాటీలు, బాలాషింపియు, ఈ యిరువురు మాత్రమే తాత్యాగుర్చి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో ప్రక్కనుండి లేచి నడువసాగెను. కాలము వేగముగా కదలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వయుజ మాసము సమీపించుచుండెను. బాబా మాటప్రకారము తాత్యా జబ్బుపడెను. మంచము బట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలే కుండెను. బాబా కూడ జ్వరముతో నుండెను. తాత్యాకు బాబాయందు పూర్తి విశ్వాసముండెను; బాబా శ్రీ హరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడు బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడ క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు, బాలాషింపియు తాత్యాగూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరమంతయు చమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చెననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణము విడుచునని యనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను, అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా గతించెను. వారిలో వారు మరణము మార్చుకొన్నట్లు గనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యాకోసమర్పించెనని జను లనుకొనిరి. బాబా యెందుకిట్లు చేసెనో బాబాకే తెలియును. వారి కృత్యము లగోచరములు. ఇవ్విధముగా బాబా తమ సమాధిని సూచించెను. తన పేరుకు బదులు తాత్యాపేరు తెలిపెను. ఆ మరుసటి యుదయము అనగా అక్టోబరు 16వ తేదీన పండరీ పురములో దాసగణుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి యిట్లనిరి. "మసీదు కూలిపోయినది, వర్తకులు నన్ను చాలా చీకాకు పెట్టిరి, కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే గప్పుము." షిరిడినుండి వచ్చిన ఉత్తరమువలన కూడ దాసగణుకీ సంగతి దెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజనకీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందురోజంతయు భగవన్నామ స్మరణ చేసెను. భగవన్నామస్మరణ చేయుచు నొక చక్కని పువ్వుల హారమును స్వయముగా గ్రుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను. లక్ష్మీబాయి శిందేకు దానము దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభసమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగా నున్నది. కొన్నిదినములనుండి వారు వ్యాధి గ్రస్తులుగా నుండిరి, లోపలమాత్రము పూర్ణచైతన్యులుగా నుండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా, లేచి కూర్చుండి మంచి స్థితిలో నున్నట్లు గనపడిరి. అపాయస్థితి దాటినదని బాబా కోలుకొనుచుండెనని యందరనుకొనిరి. తాము త్వరలో సమాధిచెందెదమని బాబాకు తెలియును. కాన, లక్ష్మీబాయి శిందేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొనిరి. బాబా సర్వజీవవ్యాపి ఈ లక్ష్మీబాయి శిందే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రిసమయమందు భక్త మహాళ్సాపతి, తాత్యా, లక్ష్మీ బాయి శిందే తప్ప తదితరులెవ్వరు, మసీదులో కాలుపెట్టుట కాజ్ఞలేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చొనియుండగా లక్ష్మీబాయి శిందే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా యిట్లనెను, "ఓ లక్ష్మీ! నాకు చాల ఆకలి వేయుచున్నది." వెంటనే యామె లేచి "కొంచెము సేపాగుము. నేను త్వరలో రొట్టెను దీసికొని వచ్చెదను" అని అనెను. అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె, కూర తీసికొని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని యొక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి యిట్లడిగెను. "ఇది యేమి బాబా! నేను పరుగెత్తుకొని పోయి నా చేతులార నీకొరకు రొట్టె చేసితిని. నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరముగా నాకు శ్రమ కలుగజేసితివి." అందుకు బాబా యిట్లు సమాధానమిచ్చెను. "అనవసరముగా విచారించెదవేల? కుక్క ఆకలి దీర్చుట నా ఆకలి దీర్చుట వంటిది. కుక్కకుకూడ ఆత్మగలదు. ప్రాణులు వేరు కావచ్చును. కాని అందరి ఆకలి యొకటియే. కొందరు మాట్లాడగలరు. కొందరు మూగవలె మాట్లాడలేరు. ఎవరయితే ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము." ఇది చాల చిన్న విషయము గాని, బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి, ఇతరుల కెట్టి బాధయు కలుగకుండ నిత్యజీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించెను. ఆనాటినుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని యెంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగత రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే యెల్లప్పుడు తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులయందు గలరని తెలిసి కొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తియందుంచుకొనిరి. ఆమెను మరచెదరెట్లు? బాబా తమ భౌతిక శరీరమును విడుచునపుడు, తన జేబులో చేయిపెట్టి యొకసారి 5 రూపాయలు, యింకొకసారి 4 రూపాయలు మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయి కిచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయములోని నవవిధభక్తులను తెలియజేసెను. లేదా ఇది సిమోల్లంఘన సమయమున నిచ్చు దక్షిణ యనుకొనవచ్చును. లక్ష్మీబాయి శిందే ధనవంతురాలగుటచే నామెకు ధనమవసరములేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధభక్తులను గూర్చి బోధించియుండవచ్చును. భాగవతము ఏకాదశస్కంధమందు దశమాధ్యాయములో ఆరవశ్లోకమున పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడియున్నది. బాబా ఈ ప్రకారముగ మొదట 5, తదుపరి 4 మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఒక తొమ్మిదేకాక తొమ్మిదికి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతిమీదుగా వ్యయమైనవి. కాని బాబా యిచ్చిన ఈ తొమ్మిది రూపాయల నామె యెన్నటికిని మరువదు. మిక్కిలి జాగురూకత మరియు పూర్ణచైతన్యము కలిగియుండు బాబా అవసానకాలమందు కూడ జాగ్రత్త పడెను. తన భక్తుల పై గల ప్రేమానురాగములయందు తగుల్కొనకుండునట్లు, వారందరిని లేచిపొమ్మనెను. కాకాసాహెబు దీక్షిత్, బాపుసాహెబు బుట్టీ మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాను గనిపెట్టుకొనియుండిరి. కాని బాబా వారిని వాడాకు బోయి భోజనము చేసి రమ్మనెను. వారు బాబాను విడువలేకుండిరి; బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికి వారు పోలేక పోలేక మసీదు విడిచి పొయిరి. బాబా స్థితి యపాయకరముగా నుండెనని వారికి దెలియును. కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చిండిరే కాని వారి మనస్సు ఎక్కడనో బాబాపై నుండెను. వారు భోజనము పూర్తిచేయక మునుపే బాబా తమ భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చెను. భోజనములను విడిచి యందరు మసీదుకు పరుగెత్తిరి. బాయాజీ తొడపై బాబా వ్రాలి యుండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా గూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరమును విడిచిరి. యోగులు శరీరము ధరించి యేదో పనిమీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు.
తల్లిపాల మాధుర్యాన్ని తలపించేదే అమ్మభాష. అలాంటి మన తెలుగు, నేడు ఆంగ్ల ప్రభావంవల్ల చిక్కిశల్యమైపోతోంది. తెలుగు భాషావికాసోద్యమం మళ్ళీ మొదలైతే తప్ప, పరిస్థితి చక్కబడదు. విజయవాడలో నిన్న ప్రారంభమైన ‘ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభ’లో పాల్గొన్న వక్తల ప్రసంగాల సారాంశమిదే. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ‘ఈనాడు’ సంపాదకులు రామోజీరావు- భాషోద్ధరణ పాఠశాలనుంచి మొదలుకావాలన్నారు. వాడుకే భాషకు వేడుక అవుతుందని స్పష్టంచేశారు. తెలుగు భాష పునరుజ్జీవానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ కృషికి ‘తెలుగు రచయితల మహాసభ’ నాంది పలకాలన్నారు. రామోజీరావు ప్రసంగం పూర్తిపాఠమిది… మాతృభాష మీద మమకారంతో, ప్రేమతో మీరందరూ ఎంతో దూరాలనుంచి వచ్చారు. ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇదొక బృహత్‌ యజ్ఞం. దీన్ని నిర్వహిస్తున్న కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అమ్మభాష గురించి మాట్లాడటం అంటే తల్లిపాల మాధుర్యాన్ని తనివితీరా మననం చేసుకోవడమే. తెలుగు గడ్డపై పుట్టడం ఎన్నో జన్మల తపోఫలమని కొందరు మహాత్ములన్నారు. అంతెందుకు- జాతీయభాష కాగల అర్హత తెలుగుకు మాత్రమే ఉందని జేబీ హేల్డెన్‌ లాంటి విదేశీయుడే మెచ్చుకున్నాడు. తెలుగు ఒక భాష మాత్రమే కాదు. ఒక సంస్కృతి… ఒక సంప్రదాయం… ఒక జీవన విధానం. ఆ మాటకొస్తే, ఏ జాతికైనా చైతన్యం కలిగించేది భాషే. ఒక జాతి ప్రజల కట్టుబాటును మతంకన్నా భాషే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. బంగ్లాదేశ్‌ అనుభవమే ఇందుకు ఉదాహరణ. భాషను, సంస్కృతిని నిలబెట్టుకుంటేనే తెలుగుజాతి కలకాలం వర్ధిల్లుతుంది. నిజానికి మన భాషకేం తక్కువ? దేశంలో హిందీ తరవాత ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగే. అయితే… ఆంగ్ల ప్రభావంవల్ల మన భాష చిక్కి శల్యమైపోతోంది. మన ఆలోచనల్లో, ఆచార వ్యవహారాల్లో తెలుగుదనం కరిగిపోతోంది… తరిగిపోతోంది. ఇందువల్ల మన సంస్కృతి, సంప్రదాయం, మానవ సంబంధాలు… అన్నీ దెబ్బతింటున్నాయి. రానురాను తెలుగుదనం ఉనికే పోతుందా అన్న భయం కలుగుతోంది. 30శాతం ప్రజలకు సొంత భాష చదవడం, రాయడం రాకపోతే ఆ భాష అంతరించిపోతుందని యునెస్కో చెప్పింది. ఈ కష్టం… ఈ నష్టం తెలుగుకు రాకూడదు. ఈ బాధ్యత మన భుజస్కంధాలమీద ఉంది. ఇందుకు ఎవరికి వాళ్లు ముందుకు రావాలి. మనరాష్ట్రంలో పిల్లల్ని గమనించండి… ఆంగ్లపదం రాకుండా ఒక్క నిమిషం కూడా తెలుగులో మాట్లాడలేరు. కారణాలేమైనా చక్కటి తెలుగు రాయడం, మాట్లాడటం, చదవటం అపురూపమైపోతోంది. వాడుక… భాషకు వేడుక ఏదైనా మాతృభాషలో నేర్చుకుంటేనే పిల్లలకు బాగా ఒంటపడుతుంది. అది తెలిసినా తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోతున్నారు. అది వాళ్ల తప్పు కాదు. ఎవరికైనా పిల్లల భవిష్యత్తే ముఖ్యం కదా? పిల్లల చదువుసంధ్యలు, వాళ్ల భవిష్యత్తు ఒకపక్క- మాతృభాష అయిన తెలుగు భవిష్యత్తు ఒకపక్క. ఈ రెండూ ఒకదాంతో ఒకటి ముడివడి ఉన్నాయి. తెలుగు భాషమీద మొహంమొత్తి ఇంగ్లిషు వ్యామోహం పెరిగిందా అంటే, అదీ కాదు. ఏ భాషకైనా తప్పకుండా బహుముఖ ప్రయోజనం ఉండాలి. మొదటిది… చెప్పిన మాట ఎదుటివారికి స్పష్టంగా అర్థం కావాలి. ఇది సామాజిక ప్రయోజనం. భాష ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఉపయోగపడాలి. ఇది ఆర్థిక ప్రయోజనం. ఈ ప్రయోజనాలు నెరవేర్చినప్పుడే భాష రోజువారీ వ్యవహారంలో ఉంటుంది. భాషా సంస్కృతులు బాగున్న జాతి జీవకళతో ఉప్పొంగుతుంటుంది. ఇది ఎక్కడి విషయమో కాదు… మన ఇరుగు పొరుగును చూడండి. తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, మరాఠీలు ఉన్నారు కదా!. భాషా సంస్కృతుల్ని ప్రాణంగా చూసుకుంటారు. వాటిని ఆత్మగౌరవ చిహ్నాలుగా చేసుకున్నారు. రేడియో, టీవీ, సెల్‌ఫోన్‌ వంటి ఇంగ్లిషు మాటల్ని కూడా వెంటనే తమిళ భాషలోకి అనువాదం చేసుకున్నారు. చివరికి డెంగీ, స్వైన్‌ ఫ్లూ లాంటి కొత్త వ్యాధులకూ తమిళ పేర్లున్నాయి. ఎక్కడో తప్ప ఆంగ్ల పదజాలానికి వారు దాసోహం కాలేదు. తమిళుల ధోరణి మిగతా భాషల వారందరికీ ఆదర్శం. ఒకటినుంచి పదో తరగతి దాకా ప్రతి విద్యార్థీ తమిళం నేర్చుకోవాలని అక్కడ నిబంధన పెట్టారు. తమిళంలో చదివినవారికే అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలిస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమిళ భాషపై పరిశోధనలను బాగా ప్రోత్సహిస్తుంది. ఎప్పటికప్పుడు ఆంగ్ల పదాలకు తమిళ సమానార్థకాలను రూపొందించడంలో వాళ్లు తలమునకలవుతుంటారు. పొరుగు దేశాల సంగతి తీసుకుందాం… చైనా రెండు భాషల పద్ధతి పాటిస్తుంది. అందువల్ల ఆ దేశ ప్రజలు స్థానిక సంస్కృతిని, సంప్రదాయాన్ని, అస్తిత్వాన్నీ ఏ మాత్రం పోగొట్టుకోకుండానే అంతర్జాతీయ స్థాయిని అందుకుంటున్నారు. సమకాలీన పరిస్థితులనుబట్టి అక్కడి పాఠశాలల్లో బోధించే మాతృభాషను నిత్యనూతనంగా మలచుకుంటున్నారు. ఫ్రెంచ్‌ ప్రభుత్వమూ ఇలాంటి కృషే చేస్తోంది. మరి అలాంటి భాషాచైతన్యం, కట్టుబాట్లు మనకెందుకు లేవు? మనరాష్ట్రంలో అధికార భాష తెలుగు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఉత్తరప్రత్యురాలు… అన్నీ తెలుగులో ఉండాలన్న నిబంధనలకు లోటు లేదు. అయితేనేం… రాజ్యమేలుతున్నది ఇంగ్లిషే! ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సందర్భంగా మన తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పారు… ప్రతి రాష్ట్రానికి మాతృభాషే అధికార భాషగా ఉండాలని… పరిపాలన వ్యవహారాలన్నీ మాతృభాషలోనే జరగాలని. ఇప్పటికి అయిదున్నర దశాబ్దాలైంది. ఆంధ్రప్రదేశ్‌ ఆంగ్లప్రదేశ్‌ అయింది తప్ప- తెలుగు వాడకం పెరగలేదు. ఇతరులను చూసి నేర్చుకోవడం కూడా మనకు కరవైపోయింది. అమెరికా రాయబార కార్యాలయ సిబ్బంది రోజుకు ఎనిమిది గంటల చొప్పున, ఎనిమిది నెలలపాటు కష్టపడి తెలుగు నేర్చుకున్నారట. మరి మనమో? తెలుగులో మాట్లాడటం, రాయడం నామోషీ అనుకుంటున్నాం. భాషా ప్రేమికులైన ఒకరిద్దరు అధికారులో, న్యాయమూర్తులో తెలుగులో ఉత్తర్వులు జారీచేస్తే దాన్నే గొప్పగా చెప్పుకొంటున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలుగు భాషా వికాసోద్యమం మళ్లీ మొదలు కావాలి. ఇందుకు రెండు రకాల ప్రయత్నాలు సాగాలి. తెలుగువల్ల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాలుండేట్టుగా ప్రభుత్వ విధానాలు రూపుదిద్దుకోవాలి. తెలుగు వస్తేనే తమ బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులకు నమ్మకం కలగాలి. అప్పుడే తమ పిల్లలు తెలుగు నేర్చుకోవడంమీద వాళ్లు సుముఖత చూపిస్తారు. సమాజం పెరిగేకొద్దీ భాష పెరుగుతుంది. విజ్ఞానం పెరిగేకొద్దీ భాష విస్తరిస్తుంది. ఈ క్రమంలో తెలుగు కూడా ఆంగ్లంతో పోటీపడి పెరగాలి. మనం వెనకబడితే భాష కూడా వెనకబడుతుంది. ఇంగ్లిషు మీద విముఖత అక్కర్లేదు. తెలుగు పట్ల సుముఖతను పెంచుకోవాలి. తెలుగులోనే మాట్లాడటం, చదవటం అంటే ఇంగ్లిషుకు వ్యతిరేకం కానే కాదు. ఇది అందరికీ స్పష్టం చెయ్యాలి. మనది అందరి భాష… ఎవరికీ అందని భాష కాకూడదు. ఇందుకు ప్రభుత్వం చెయ్యాల్సినవి కొన్ని… ప్రజలు చెయ్యాల్సినవి ఇంకొన్ని. భాషకు పట్టం కట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఇందుకు సమాజంనుంచి ఒత్తిడి రావాలి. భాషోద్ధరణ పాఠశాలనుంచే మొదలు కావాలి. ఒకటో తరగతినుంచి పట్టభద్రస్థాయి దాకా తెలుగు భాషను తప్పనిసరి పాఠ్యాంశంగా చెయ్యాలి. ఇక్కడ మరో విషయం చెప్పాలి… పాఠ్యపుస్తకాల్లో ఉండే తెలుగు- పిల్లల్ని భయపెట్టేలా ఉండకూడదు. తేనెలొలికే తెలుగుమీద వాళ్లకు ఆసక్తి పెంచేట్టుగా ఉండాలి. ఇందుకోసం పాఠ్యపుస్తకాల్లోని పదజాలాన్ని ఇంకా సరళీకరించాలి. ఆంగ్ల పదాల వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి భాషాప్రియులు నడుం కట్టాలి.మన వ్యవహారంలోకి వచ్చిపడుతున్న ఆంగ్ల శబ్దాలకు ఎప్పటికప్పుడు తెలుగు మాటలను సృష్టించాలి. అయితే ఒక జాగ్రత్త తీసుకోవాలి. సమానార్థకాలు తయారు చేసేటప్పుడు అవి వినడానికి ఇంపుగా, తేలిగ్గా ఉండాలి. కొరుకుడు పడని పదాలైతే నష్టం వాటిల్లుతుంది. తెలుగు అనగానే ఏ తెలుగు అన్న మీమాంస అనవసరం. యాస భాషకు బలం. లక్షలమంది మాట్లాడే మాండలికాలన్నీ భాషకు ఆయువుపట్టులే. అవన్నీ అవసరమే. అసలు సిసలైంది జనభాషే. మంచి మంచి తెలుగు మాటలను ప్రసార సాధనాల్లోకి తెచ్చుకుంటే భాష అందగిస్తుంది. ఈ క్రతువులో పండితులే కాదు… భాష మీద ప్రేమ, అవగాహన ఉన్న సామాన్యులు కూడా పాలుపంచుకోవాలి. నిజమైన భారతదేశం గ్రామాల్లో ఉందంటారు. నా దృష్టిలో నిజమైన భాష పల్లెపట్టుల్లోనే ఉంటుంది. అక్కడ వాడుకలో ఉన్న పదాలను అందరం వాడుకుందాం. ఆ వాడుక తెలుగు భాషకు వేడుక అవుతుంది. డ్రెడ్జర్‌ అనే మాటకు ‘తవ్వోడ’ అన్న పదాన్ని సృష్టించింది సామాన్యులే. వారి అవసరార్థం దాన్ని కనిపెట్టారు. డ్రిప్‌ ఇరిగేషన్‌కు చుక్కల సాగు కూడా అలా వచ్చిందే. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ అందరి వాడుకలోకి రావాలి. అప్పుడే మన భాష మరింత శక్తిమంతమవుతుంది. మరో మహోద్యమం భాష, సంస్కృతి… రెండూ విడదీయరానివి… ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్నవి. అందుకే పిల్లలకు ఇవన్నీ నేర్పాలి. ఒక్క ఆంగ్ల శబ్దం కూడా రాకుండా తెలుగులో మాట్లాడేలా, రాసేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. వక్తృత్వం, వ్యాసరచన, సామెతలు, శతక పద్యాలు, కీర్తనలు వంటివాటిలో పోటీలు పెట్టాలి. విజేతలకు బహుమతులివ్వాలి. పాల్గొన్నవారందరినీ ఏదోరకంగా ప్రోత్సహించాలి. అవకాశం ఉన్నవారు తమ ఇళ్లలో కూడా పిల్లలచేత కసరత్తు చేయించాలి. ప్రోత్సహించాలి. పిల్లల్లో తెలుగు చదవాలన్న ఆసక్తిని, రచనాశక్తిని మనం పెంపొందించాలి. అందమైన తెలుగులో చిన్నారులను ఆకట్టుకునే కథలు, పుస్తకాలు విరివిగా రావాలి. వాటివల్ల భాషమీద, సంస్కృతిమీద మమకారం పెరుగుతుంది. మన భాషాసంస్కృతులు మనకు అమూల్య ఆస్తులు… మన వారసత్వ సంపద. వాటిని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడతారు? ప్రపంచం మొత్తంమీద ఉన్న 12కోట్లమంది తెలుగువారి ఉనికికి సంబంధించిన విషయం ఇది. దీనికి ఎటువంటి ప్రమాదం రాకుండా అడ్డుకుందాం. 1822లో రాజా రామ్మోహన్‌రాయ్‌ సొంత సొమ్ముతో ఒక పాఠశాలను పెట్టారు. అందులో శాస్త్ర సాంకేతిక విషయాలను కూడా బెంగాలీలోనే బోధించే ఏర్పాట్లు చేశారు. ఆ మహానుభావుడే మనకు స్ఫూర్తి కావాలి. ఫ్రెంచ్‌ దేశస్తులు వాళ్ల కళలు, సంస్కృతిని కాపాడుకోవడానికి రెండు శతాబ్దాలపాటు సాంస్కృతిక పునరుజ్జీవన విప్లవం చేశారు. ఇది చరిత్ర. మన దగ్గర కూడా అలా చరిత్ర సృష్టించాలి. ‘తెలుగు భాషా పునరుజ్జీవన ఉద్యమం’ సాగాలి. ఈ మహాసభలు ఇందుకు నాందీ ప్రస్తావన చెయ్యాలి. భాషాప్రియులుగా మీరున్నారు. మీకు తోడుగా మేమూ ఉన్నాం. తెలుగు భాషా పునర్వికాసానికి కృషి చేసేందుకు ఈనాడులో ‘తెలుగు వెలుగు’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఆంగ్ల పదాలకు ప్రత్యామ్నాయాలు, సమానార్థకాల అన్వేషణ, పద సేకరణ, నూతన పదాల్ని సృష్టించడం, వాటిని వ్యాప్తిలోకి తేవడం… వంటివాటిపై ఈ విభాగం పనిచేస్తుంది. నా ఆకాంక్ష ఒక్కటే… తెలుగు భాష కొత్త పుంతలు తొక్కాలి. అగ్రగామిగా నిలవాలి. తెలుగు సంస్కృతి, వైభవం ఎప్పటికీ జీవనదిలా ప్రవహించాలి. ఇప్పటికే జాప్యం జరిగి ఉండవచ్చు. ఇక కాలయాపన తగదు. నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేస్తారని ఆశిస్తూ… సెలవు తీసుకుంటున్నాను.
తెలంగాణాలోనే. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలంలోని, చెలిమితండాలో సోనూసూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.. December 21, 2020 at 2:21 PM in Tollywood Share on FacebookShare on TwitterShare on WhatsApp వెండితెరమీద ఖరీదైన విలన్ గా తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేసే సోనూ సూద్.. లాక్ డౌన్ కాలంలో రియల్ హీరో అయిపోయిన సంగతి తెలిసిందే. ఎందరో వలస కూలీల్ని తమ స్వస్థలాలకు తరలించడంలో ఎంతగానో సాయపడిన అతడు.. అన్నార్తుల పాలిట దేవుడిగానూ, కష్టాల్లో ఆదుకొనే ఆపద్బాంధవుడిగానూ మారిపోయాడు. అడిగినవారికే కాకుండా.. అడగని వారికి సైతం ఎన్నోసార్లు ఆర్ధికంగా సాయపడి.. ఆదుకున్న అతడు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా రియల్ హీరో. ఈ నేపథ్యంలో సోనూసూద్ కు ఒక అభిమాని ఏకంగా గుడే కట్టేశాడు. తన సొంత ఖర్చుతో సోనూ సూద్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంఘటన ఇటీవలే జరిగింది. అది ఇంకెక్కడో కాదు.. తెలంగాణాలోనే. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలంలోని, చెలిమితండాలో సోనూసూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రాజేశ్ రాథోడ్ అనే ఒక యువకుడికి సోనూసూద్ అంటే విపరీతమైన అభిమానం. కరోనా సమయంలో సోనూ కార్యక్రమాలకు అభిమానిగా మారిపోయిన రాజేశ్ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఈ విగ్రహానికి రోజూ పూజ చేసి హారతి కూడా ఇస్తున్నాడు రాజేశ్. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Must Read ;-సోనూసూద్ సంచలన నిర్ణయం Tags: #covid-19jai ho Sonu Soodleotopmigrant workerssonu soodsonu sood charitysonu sood corona worksonu sood godsonu sood idolsonu sood mandirsonu sood migrant workerssonu sood newssonu sood prayersonu sood telangana templesonu sood templesonu sood temple locationsonu sood worshiptelanganatelangana siddipettemple for Sonu Soodtemple of sonu sood
సినిమా పాటలకు వన్నెతెచ్చిన శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం మనమందరం అభిమానంగా పిలుచుకునే బాలు ఇకలేరు. కోట్లాది అభిమానులకు తన పాటల అనుభూతులను మిగిల్చి దివికేగారు. September 25, 2020 at 3:40 PM in Cinema, Latest News, Tollywood Share on FacebookShare on TwitterShare on WhatsApp బాలసుబ్రమణ్యం తన పాటలతో దేశ, విదేశాలలో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. 17 భాషల్లో 41 వేలు పాటలు పాడిన ఆయన శాశ్వతంగా సెలవంటూ దివికేగారు. ఆయన గొంతుక ఆగిపోవడంతో కోట్లాది గొంతులు మూగబోయాయి. తమ ప్రియమైన ‘గాన గంధర్వుడు’ లేరంటూ శోకసంద్రంలో మునిగిపోయారు. కరోనా కారణంగా కడసారి చూసే వీలులేని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులే గాక అన్నీ వర్గాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. ప్రముఖుల సంతాపాలు రాష్ట్రపతి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమయంతో సినీ రంగం ఓ మధుర గాత్రాన్ని కోల్పోయిందని రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. ‘పాడుమ్ నిలా’, ‘పాటల చందమామ’ అంటూ అశేష అభిమాన జనం ఎంతో ప్రేమగా పిలుచుకునే ఎస్పీ బాలు పద్మభూషణ్ సహా అనేక జాతీయ అవార్డులు అందుకున్నారని రాష్ట్రపతి అన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నానని ప్రకటన చేశారు. In the passing of music legend SP Balasubrahmanyam Indian music has lost one of its most melodious voices. Called ‘Paadum Nila' or ‘Singing Moon’ by his countless fans, he was honoured with Padma Bhushan and many National Awards. Condolences to his family, friends and admirers. — President of India (@rashtrapatibhvn) September 25, 2020 వైస్ ప్రెసిడెంట్: ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, ఐదున్నర దశాబ్దాలుగా తన అమృత గానంతో ప్రజలను అలరింపచేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారినపడ్డారని తెలిసినప్పటి నుంచి డాక్టర్లతో రోజూ మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నానని వెల్లడించారు. బాలు కుమారుడితో కూడా మాట్లాడి కావాల్సిన సలహాలు ఇస్తూ, వైద్యులకు సూచనలు చేస్తుండేవాడినని తెలిపారు. కానీ, బాలు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం విచారకరం అని వెంకయ్యనాయుడు ట్విట్టర్ లో స్పందించారు. ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది.#SPBalasubrahmanyam pic.twitter.com/j6cHkIRESO — Vice President of India (@VPSecretariat) September 25, 2020 ప్రధాని: దిగ్గజ గాయకుడు సింగర్ ఎస్పీ బాలు కన్నుమూసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు మరణం దురదృష్టకరం అన్న ప్రధాని, మన సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బాలు పేరు ప్రతి ఇంటా వినిపించేదని, దశాబ్దాలుగా ఆయన మధుర కంఠస్వరం, సంగీతం శ్రోతలను అలరించిందని తెలిపారు. ఈ విచారకర సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు. With the unfortunate demise of Shri SP Balasubrahmanyam, our cultural world is a lot poorer. A household name across India, his melodious voice and music enthralled audiences for decades. In this hour of grief, my thoughts are with his family and admirers. Om Shanti. — Narendra Modi (@narendramodi) September 25, 2020 కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్: సంగీతానికి ఓ మధుర సంగీత మాల శకం నేడు ముగిసింది. ఆ దేవుడు అతని ఆత్మకి శాంతి కలిగించాలని కోరుకుంటున్నాను…ఓం శాంతి भारत की मधुर संगीतमाला का एक सुरीला स्वर ‘पद्मभूषण’ श्री एसपी बालसुब्रमण्यम आज शांत हो गए . अब यह स्वर सुनाई तो देगा मगर दिखाई नहीं देगा. ईश्वर उनकी दिवंगत आत्मा को शांति दे और उनके परिवारजनों, मित्रों और करोड़ों चाहने वालों को यह दुःख सहने की शक्ति प्रदान करे | ॐ शांति 🙏 — Prakash Javadekar (@PrakashJavdekar) September 25, 2020 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.#RIPSPB — YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2020 తెలంగాణ సీఎంఓ: సినీ గాయకుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన శ్రీ బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాన గాయకులు అయ్యారని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు. సినీ గాయకుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన శ్రీ బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాన గాయకులు అయ్యారని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు. — Telangana CMO (@TelanganaCMO) September 25, 2020 చంద్రబాబు నాయుడు: కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదు. రేపో మాపో ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్న బాలసుబ్రహ్మణ్యంగారు ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉంది. ఆయన మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసింది. ఇది దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటు కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదు. రేపో మాపో ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్న బాలసుబ్రహ్మణ్యంగారు ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉంది. ఆయన మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసింది. ఇది దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటు.(1/2) pic.twitter.com/QPdvN7BaEf — N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) September 25, 2020 నారా లోకేష్: ఆబాల గోపాలాన్ని త‌న గానంతో అల‌రించిన ఎస్‌పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గారు క‌న్నుమూయ‌డం.. సంగీత‌, సాహిత్య, సినీ, క‌ళా ప్ర‌పంచానికి తీర‌నిలోటు. ద‌శాబ్దాలుగా భార‌తీయ భాష‌ల‌న్నింటిలోనూ 40 వేల‌కు పైగా పాట‌లు పాడిన సుస్వ‌రాల సుమ‌ధుర బాలు మ‌న‌మ‌ధ్య‌ లేక‌పోవ‌చ్చు. ఆయ‌న పాట‌, మాట‌, బాట‌, న‌ట‌న‌, సంగీతం అన్నీ చిర‌కాలం జీవించే ఉంటాయి. గాన‌గంధ‌ర్వుడు ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంగారి కుటుంబానికి, అశేషాభిమానులకు నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను.. ఆబాల గోపాలాన్ని త‌న గానంతో అల‌రించిన ఎస్‌పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గారు క‌న్నుమూయ‌డం.. సంగీత‌, సాహిత్య, సినీ, క‌ళా ప్ర‌పంచానికి తీర‌నిలోటు. ద‌శాబ్దాలుగా భార‌తీయ భాష‌ల‌న్నింటిలోనూ 40 వేల‌కు పైగా పాట‌లు పాడిన సుస్వ‌రాల సుమ‌ధుర బాలు మ‌న‌మ‌ధ్య‌ లేక‌పోవ‌చ్చు.(1/2) pic.twitter.com/R3wlpaAmfg — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 25, 2020 కేటీఆర్: సినీ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి విచారకరం. సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు, వారి అభిమానులకు తీరని లోటు. ఆలపించిన ఎన్నో వేల పాటల ద్వారా వారు ప్రజల మనసుల్లో సుస్థిరంగా నిలుస్తారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి సినీ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి విచారకరం. సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు, వారి అభిమానులకు తీరని లోటు. ఆలపించిన ఎన్నో వేల పాటల ద్వారా వారు ప్రజల మనసుల్లో సుస్థిరంగా నిలుస్తారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: మంత్రి @KTRTRS pic.twitter.com/KOPlloEAEt — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 25, 2020 హరీష్ రావు: గానగంధర్వుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం దురదృష్టకరం. సినిలోకానికి వారు చేసిన సేవలు వెలకట్టలేనివి. అనేక భాషలలో పాటలుపాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న బాలు గారు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గానగంధర్వుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం దురదృష్టకరం. సినిలోకానికి వారు చేసిన సేవలు వెలకట్టలేనివి. అనేక భాషలలో పాటలుపాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న బాలు గారు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/guKWenbLN7 — Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) September 25, 2020 విజయసాయి రెడ్డి: లెజెండరీ సింగర్ బాలు గారి మరణం షాక్ కు గురి చేసింది. 16 భాషల్లో 40 వేల పాటలు పాడి ఆయన చరిత్ర సృష్టించారు. ఆయన మనతో లేకపోవచ్చు కానీ ఆయన పాటలతో మనకు గుర్తుండి పోతారు. My deep condolences to the family of the greatest playback singer of all time SP Balasubramanyam. He has the rare distinction of working in 16 languages and has recorded over 40K songs. He may not be with us but his ever green songs and legacy are carried forward for generations. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 25, 2020 కృష్ణ: బాలు మనతో లేకపోయినా ఆయన పాడిన అద్భుతమైన పాటలతో మనతో కలిసే ఉంటారు. బాలు మనతో లేకపోయినా ఆయన పాడిన అద్భుతమైన పాటలతో మనతో కలిసే ఉంటారు. – కృష్ణ#Krishna Gari condolences over the demise of #SPBalasubrahmanyam garu #RIPSPB pic.twitter.com/c91FapfN8o — BARaju (@baraju_SuperHit) September 25, 2020 చిరంజీవి: సంగీత జగత్తుకు ఇది ఒక చీకటి రోజు. ఒక శకం ముగిసింది. నేను ఈ స్థాయిలో ఉండటానికి బాలు గారు ఒక కారణం. వందలాది సూపర్ హిట్ సాంగ్స్ ఆయన నాకు ఇచ్చారు. ఘంటశాల గారి మరణం తరువాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఈ సమయాన తానున్నానంటూ బాలు వచ్చారు…ఆ స్థానాన్ని భర్తీ చేశారు. ఆయన తన పాటలతోనే హద్దులు చెరిపేశారు. బాలు మరణంతో ఓ వాక్యూమ్ ఏర్పడింది. దీనిని తిరిగి పుట్టి బాలు తప్ప ఎవరూ భర్తీ చేయలేరు. మీ ఆత్మకు శాంతి కలుగుగాక అంటూ ఆయన ట్వీట్ చేశారు. Heartbroken!! RIP SP Balu garu. pic.twitter.com/YTgZEBdvo9 — Chiranjeevi Konidela (@KChiruTweets) September 25, 2020 నందమూరి బాలకృష్ణ: బాలు గారిని ప్రతి క్షణం తలుచుకుంటూనే ఉంటాను. బాలు గారిని ప్రతి క్షణం తలుచుకుంటూనే ఉంటాను. – నందమూరి బాలకృష్ణ#NandamuriBalakrishna's condolence message over the demise of #SPBalasubrahmanyam Garu pic.twitter.com/ehAmz81fKw — BARaju (@baraju_SuperHit) September 25, 2020 పవన్ కళ్యాణ్: బాలు మరణం సంగీత జగత్తుకు తీరని నష్టం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. JanaSenaParty Chief PawanKalyan paid his deep Condolences to Legendary Singer Sri S.P.Balasubrahmanyam garu #RIPSPB pic.twitter.com/gwDng37lBl — BARaju (@baraju_SuperHit) September 25, 2020 రాజమౌళి: ‘బాలు గారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు. ఆ ఏలిక మరి రాదు. చాలామంది తమిళ కన్నడ సోదరులు ఆయన తెలుగు వాడంటే ఒప్ప్పుకునేవారు కాదు. బాలు మావాడు అని గొడవ చేసేవారు. అన్ని భాషలలోను పాడారు. అందరిచేత మావాడు అనిపించుకున్నారు. ఈ ఘనత ఒక్క బాలు గారికే సాధ్యం. ఆయన పాడిన పాటలు మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయి. మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. బాలు గారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు. ఆ ఏలిక మరి రాదు. — rajamouli ss (@ssrajamouli) September 25, 2020 అమీర్ ఖాన్: బాలు మరణవార్త దిగ్బ్రాంతిని కలిగించింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. దిగ్గజాన్ని పోగొట్టుకున్నాం. రెస్ట్ ఇన్ పీస్ సర్ Deeply saddened to hear of the demise of Shri S P Balasubrahmanyam . My heartfelt condolences to the family 🙏 . We have lost one of the most talented artistes of our times. Rest in Peace sir 🙏. — Aamir Khan (@aamir_khan) September 25, 2020 సల్మాన్ ఖాన్: బాలసుబ్రహ్మణ్యం గారి గురించి షాకింగ్ న్యూస్ విన్నాను. సంగీతం ఉన్నంత వరకు ఆయన ఉంటారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్ చేశారు. Heartbroken to hear about #SPBalasubrahmanyam sir… you will forever live on in your undisputed legacy of music! condolence to the family #RIP — Salman Khan (@BeingSalmanKhan) September 25, 2020 అరవింద్ కేజ్రీవాల్: ఢిల్లీ సీఎం బాలు మృతి పట్ల తీవ్ర విచారాన్ని తెలియచేశారు. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక అంటూ ట్వీట్ చేశారు. Saddened to know about the passing away of legendary singer SP Balasubrahmanyam ji. Condolences to the family and millions of fans of legendary voice. May God bless his soul. #RIPSPB — Arvind Kejriwal (@ArvindKejriwal) September 25, 2020 మమ్మూటీ: సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. బాలు ఓ దిగ్గజ గాయకుడు. ఆయన లేని లోటు తీర్చలేనిది. "Sangeetha swarangal ezhae kanakkaa Innum irukkaa" SPB – The True Legend. RIP#SPBalasubrahmanyam pic.twitter.com/PDVawVy5QJ — Mammootty (@mammukka) September 25, 2020 రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు: ‘‘బాలు ఇక లేరంటేనే బాధగా దిగులుగా ఉంది. మనసు మెలిపెట్టినట్టు ఉంది. ఆయన గంధర్వ గాయకుడే కాదు.. నాకు అత్యంత ఆత్మీయుడు. గుండెలకు హత్తుకుని ప్రేమగా పలకరించే తమ్ముడు. తెలుగు జాతికేకాదు ప్రపంచ సంగీతానికే ఆయన స్వరం ఓ వరం. 50 సంవత్సరాల ఆయన సినీ ప్రయాణంలో జాలువారిన వేల వేల పాటలు తేట తీయని తేనెల ఊటలు. ఎన్ని గానాలు.. ఎన్ని గమకాలు..ఎన్ని జ్ఞాపకాలు.. ఏం గుర్తుకు వచ్చినా ఈ క్షణంలో కురిసేవి కన్నీటి జలపాతాలే. మా కోసం మధురమైన పాటలెన్నో మిగిల్చి మరలిపోయిన స్నేహితుడికి తిరిగి కనీసం మాటలు కూడా ఇవ్వలేని మహా విషాదమిది. బాలు.. నీకిదే మా అందరి అశ్రుతర్పణం’’… రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి:ఎస్పీ బాలసుబ్రమణ్యం భౌతికంగా దూరమైనా పాట రూపంలో ప్రజలలో బతికే ఉంటారు. నటుడు , గాయకుడుగా సినీరంగంలో వారి స్థాయిని అందుకోవడం అసాధ్యం. 50 రోజులు వైద్యుల శ్రమ ఫలించక పోవడం బాధాకరం. బాలసుబ్రమణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. పూరి జగన్నాథ్: మిస్ యూ సర్ Miss you sir 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/VFZ35JM1K0 — PURIJAGAN (@purijagan) September 25, 2020 మోహన్ బాబు: శ్రీకాళహస్తిలో మేమిద్దరం కలిసి చదుకున్నాం. నాకు అత్యంత ఆప్తుడు, ఆత్మీయుడు, శ్రీవిద్యానికేతన్ లో ఏ కార్యక్రమం జరిగినా బాలు రావాల్సిందే. మార్చి 19న నా పుట్టిన రోజుకు కరోనా కారణంగా ఆయన రాలేకపోయారు. ఈ మధ్య కూడా ఫోన్ లో మాట్లాడుకున్నాం. బాలు మరణం నన్నెంతో బాధించింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. I am deeply saddened and devasted by the death of my good friend. During the times when I worked as an Assistant Director in Chennai, I had borrowed 100 rupees from him. Till recent times, Balu used to remind me of the debt and used to make fun of me for interest to pay. pic.twitter.com/IzHNMpMR7E — Mohan Babu M (@themohanbabu) September 25, 2020 విజయశాంతి: గాన గంధర్వుడు శ్రీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేనిది. కోట్లాదిమందికి గానామృతాన్ని పంచిన శ్రీఎస్పీబీ త్వరగా కోలుకుని మళ్ళీ తన గానంతో అలరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారన్న వార్త తీవ్రంగా కలచివేసింది. గాన గంధర్వుడు శ్రీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేనిది. కోట్లాదిమందికి గానామృతాన్ని పంచిన శ్రీఎస్పీబీ త్వరగా కోలుకుని మళ్ళీ తన గానంతో అలరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారన్న వార్త తీవ్రంగా కలచివేసింది. pic.twitter.com/x8rVGEodQW — VijayashanthiOfficial (@vijayashanthi_m) September 25, 2020 దర్శకుడు శంకర్: ప్రేక్షకులకు చేరకముందే ఓ పాటను హిట్ చేసే దమ్ము ఉన్న గాయకుడు బాలు గారు ఒక్కడే. ఆయనను మనం కోల్పవడం మన దురదృష్టం. ఆయన గొంతు మనతోనే ఎప్పటికీ ఉంటుంది. Only a very few singers have the quality,they sing a song and it will be a hit even before it reaches the audience. SPB sir was the top among them. We lost him, not his voice. It will always be in the air🙏 pic.twitter.com/5FuZJ6Tyrj — Shankar Shanmugham (@shankarshanmugh) September 25, 2020 తనికెళ్ళ భరణి: బాలు..జ్ఞాపకాలు బాలూ.. జ్ఞాపకాలూ…#SPBalasubrahmanyam pic.twitter.com/jY8uTYFMPb — Tanikella Bharani (@TanikellaBharni) September 25, 2020 రామ్ పోతినేని: గుండె పగిలింది. తరతరాలకు మీరే ఓ ఇన్స్పిరేషన్. థాంక్యూ సర్. రెస్ట్ ఇన్ పీస్ బాలు సర్ Heartbroken 💔…the singer who made me realise that you could act/express so much through your voice…you shall still be an inspiration for many generations to come…Thank you sir!🙏 #ripspb garu! pic.twitter.com/EXXWAgAixI — RAm POthineni (@ramsayz) September 25, 2020 చిత్ర: ఓ శకం ముగిసింది. ఓ కంప్లీట్ సింగర్ గా నన్ను తయారు చేయడంలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. మీరు లేకుండా కన్సర్ట్ ఊహించలేకపోతున్నా బాలు గారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. An era is over. Music will never be the same. World will never be the same. Words are not enough to Thank him for guiding me to be a better singer. Cannot think about a concert without your great & gracious presence. Condolences &prayers to Savithriamma,Charan,Pallavi & Family.🙏 pic.twitter.com/vIteV53TRf — K S Chithra (@KSChithra) September 25, 2020 మోహన్ లాల్: సంగీత ప్రపంచానికి అతి పెద్ద నష్టం. ఆయన మరణవార్తను జీర్ణించుకోలేక పోతున్నాను. రెస్ట్ ఇన్ పీస్ సర్.. A true loss to the world of Music…Heart breaking … May his soul Rest in Peace. pic.twitter.com/3KG1JOcGLG — Mohanlal (@Mohanlal) September 25, 2020 నాగార్జున అక్కినేని: ఆయనతో గడిపిన స్మృతులను తలుచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదు. అన్నమయ్య సినిమా తరువాత ఆయన నుంచి వచ్చిన ఫోన్ కాల్ ను నేను మరిచిపోలేను. దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో ! As the memories and conversations with Balu Garu come flooding back so do the tears… I still remember the call I got from him after my film Annamayya🙏He was such a unsaid integrable part of my life… దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో ! #ripspb 🙏 pic.twitter.com/pK8jYS5ONs — Nagarjuna Akkineni (@iamnagarjuna) September 25, 2020 వెంకటేష్ దగ్గుబాటి: బాలు గారి మరణ వార్త చాలా బాధను కలిగించింది. ఓ దిగ్గజాన్ని మనం కోల్పోయాం. ప్రేమ, పవిత్రబంధం లాంటి సినిమాలలో ఆయనతో నటించే అదృష్టం నాకు కలిగింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. Extremely sad to hear the news of SP Balasubramaniam Garu’s passing. We have lost a legend today. I’ve had the privilege to work with him in some of my best movies like Prema and Pavitra Bandham. Your legacy will live on Sir! My heartfelt condolences to the family. RIP🙏 #RIPSPB pic.twitter.com/NjjcdSg2l1 — Venkatesh Daggubati (@VenkyMama) September 25, 2020 చంద్రబోస్: మధ్యాహ్నం నుండి ఏకధారగా కన్నీళ్లు-భగవంతుడా….. మధ్యాహ్నం నుండి ఏకధారగా కన్నీళ్లు-భగవంతుడా….. — chandrabose (@boselyricist) September 25, 2020 సీతారామశాస్త్రి: బాలు గారి లేని పాటకు న్యాయం చేసేదెవరు. ఆయన మరణం విషాదాన్ని కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. బాలు అన్నయ్య 🙏🏽🙏🏽🙏🏽https://t.co/ake4tOuiOE — Sirivennela Official (@sirivennela1955) September 25, 2020 అమలా పాల్: పవర్ హౌస్ అఫ్ టాలెంట్ ను మేము మిస్ అవుతున్నాం. రెస్ట్ ఇన్ పీస్ సర్ We'll miss your smile amidst lyrics, powerhouse of talent. Rest in peace, beloved SPB Sir. 🌸#RIPSPBSir pic.twitter.com/dpaZbQRt1E — Amala Paul ⭐️ (@Amala_ams) September 25, 2020 రామ్ గోపాల్ వర్మ: విషయం జీవించడం గురించి కాదు, కానీ అతను జీవించేటప్పుడు ఆ వ్యక్తి ఇతరుల జీవితాలకు ఏమి దోహదపడ్డాడనే దాని గురించి .. బాలసూబ్రహ్మణ్యం యొక్క భౌతిక అస్తిత్వం ముగిసింది, కానీ అతని స్వరం సంగీతం జీవించినంత కాలం బతుకుతూనే ఉంటుంది. The point is not about living, but it is about what the person contributed to other people’s lives when he was living ..The physical entity of #SPBalasubrahmanyam ended, but his voice will live as long as music lives 🙏💐💐💐 — Ram Gopal Varma (@RGVzoomin) September 25, 2020 త్మీయుడు. గుండెలకు హత్తుకుని ప్రేమగా పలకరించే తమ్ముడు. తెలుగు జాతికేకాదు ప్రపంచ సంగీతానికే ఆయన స్వరం ఓ వరం. 50 సంవత్సరాల ఆయన సినీ ప్రయాణంలో జాలువారిన వేల వేల పాటలు తేట తీయని తేనెల ఊటలు. ఎన్ని గానాలు.. ఎన్ని గమకాలు..ఎన్ని జ్ఞాపకాలు.. ఏం గుర్తుకు వచ్చినా ఈ క్షణంలో కురిసేవి కన్నీటి జలపాతాలే. మా కోసం మధురమైన పాటలెన్నో మిగిల్చి మరలిపోయిన స్నేహితుడికి తిరిగి కనీసం మాటలు కూడా ఇవ్వలేని మహా విషాదమిది. బాలు.. నీకిదే మా అందరి అశ్రుతర్పణం’’
వారి సరికొత్త EP లో, ది స్ట్రోక్స్ కొత్త తరం యువ మరియు సాధారణ శ్రోతల కోసం ది స్ట్రోక్‌లను ప్రదర్శిస్తూనే ఉంది. స్ట్రోక్స్ ఒకప్పుడు-ఫ్లాష్ పాయింట్ NYC గిటార్ బ్యాండ్లైన అవును అవును అవును, ఇంటర్పోల్, నేషనల్, మరియు వాక్‌మెన్‌ల మాదిరిగానే ఉన్నప్పటికీ, అవి వారి తోటివారికి లేనివిగా మారాయి: క్లాసిక్ రాక్. కిందకి జారిపడు చాలు వ్యాఖ్య థ్రెడ్లు , లేదా వారి అరుదైన ప్రదర్శనలలో ప్రేక్షకుల జనాభాను చూడండి-స్ట్రోక్‌లను వాస్తవమైన మొదటి తరం 21 వ శతాబ్దపు NYC కూల్ బ్యాండ్‌గా ఆరాధించే శ్రోతలు చాలా మంది ఉన్నారు, వృద్ధాప్యం, దిగువ పట్టణ 70 మరియు 80 ల హిప్‌స్టర్‌లు బ్యాండ్‌ను ఆరాధించారు వారి యువత. క్లాసిక్ రాక్ అవ్వడం అంటే, సాధారణం మరియు చిన్న శ్రోతలకు సంబంధించినంతవరకు, బ్యాండ్ వారి అంచుని కోల్పోకుండా వారి ఐకానోగ్రఫీని రీసైకిల్ చేయవచ్చు. (అధికారికంగా, షియా లాబ్యూఫ్ వారి చొక్కా ధరించినప్పుడు స్ట్రోక్స్ పాత స్టేషన్ల వైపు నెమ్మదిగా ప్రయాణాన్ని ప్రారంభించింది ట్రాన్స్ఫార్మర్స్ .) విచిత్రంగా, వారు ఇకపై మంచిగా ఉండరని కూడా దీని అర్థం. లాస్ట్ నైట్ వంటి సింగిల్స్ యొక్క శాశ్వత శక్తిని చెడ్డ రికార్డ్ తగ్గించదు. 2014 లో, స్ట్రోక్స్ తమ అభిమాన బృందం అని ఒక వ్యక్తిని కలిశాను. 2013 లను వారు ఎలా ఇష్టపడుతున్నారని నేను అడిగినప్పుడు కమ్‌డౌన్ మెషిన్ , సమాధానం ఏమిటి? కనుక ఇది మంచిది ఫ్యూచర్ ప్రెజెంట్ పాస్ట్ , మూడు సంవత్సరాలలో వారి మొదటి కొత్త విడుదల మరియు 2001 సన్నివేశం ప్రారంభమైనప్పటి నుండి మొదటి EP ఆధునిక యుగం , EP ఉన్నంత కాలం మాత్రమే. 2011 న కోణాలు మరియు కమ్‌డౌన్ మెషిన్ , చాలా ఎక్కువ జరుగుతోంది - మరియు, చాలా సరళంగా, చాలా ఎక్కువ . ఇక్కడ, స్ట్రోక్స్ వారి చివరి కాలం ధ్వనితో బొమ్మను కొనసాగిస్తున్నందున, అలసట లేకుండా ఆలోచించడం సరిపోతుంది. భావన శీర్షికలో ఉంది: ఇక్కడ స్ట్రోక్స్ ఏమిటి చేయండి వారు ఇక్కడ ఉన్నారు చేసింది ఇలా అనిపిస్తుంది మరియు అవి ఇక్కడ ఉన్నాయి సంకల్పం అనిపించు. ఆ క్లాసిక్ స్ట్రోక్స్ ధ్వని యొక్క సంకేతాలు OBLIVIUS లో కనిపిస్తాయి, EP యొక్క తక్షణ స్టాండ్: సింథ్ లాగా అనిపించే గిటార్ (కాని కాదు), గిటార్ లాగా ముడిపడి ఉంది (మరియు ఉంది), ఖచ్చితమైన పెర్కషన్ మద్దతుతో మరియు జూలియన్ కాసాబ్లాంకాస్ యొక్క బ్లీరీ, స్ట్రెయిన్డ్ వాయిస్ చేత అల్లినది. పరాయీకరణ గురించి సాహిత్యం ఉన్నాయి, బహుశా సెమీ-ఉద్దేశపూర్వక, ఫాక్స్-డీప్ * వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ * యాడ్ లిబ్, మరియు కాసాబ్లాంకాస్ వలె ఎక్కువ సిగరెట్లు తాగిన వ్యక్తి చేత బట్వాడా చేయలేని కోరస్ గాత్రం. (బ్యాండ్ యొక్క ఫాబ్ మోరెట్టి నుండి రీమిక్స్ కూడా ఉంది, ఇది పూర్తిగా వినదగినది.) మీరు ఏ వైపు నిలబడ్డారు? కాసాబ్లాంకాస్ పాడాడు, ఇది బ్యాండ్ నటిస్తున్న ఎవరికైనా సవాలుగా అనిపిస్తుంది, దాని చుట్టూ తిరిగే హక్కు సంపాదించలేదు. చుట్టూ స్క్రూ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను సవాలు చేయవచ్చు. డ్రాగ్ క్వీన్ భవిష్యత్ అని పిలవబడేది-ఇది మరింత అపవిత్రమైన, క్షీణించిన గిటార్ల స్మెర్‌తో తెరుచుకుంటుంది మరియు కాసాబ్లాంకాస్ ద్వంద్వ స్వరాలలో తనను తాను పాడటం అనే అధిక భావనతో కొనసాగుతుంది, ఇది ఒక హ్యాంగోవర్ ఫాంటమ్ యొక్క ధ్వని ఒపెరా. అర్ధంతరంగా, స్ట్రోక్స్-సియాన్ గిటార్ పల్లవి ప్రవాహంలోకి కాపీ-అతికించబడుతుంది. ఇది గందరగోళంగా ఉంది, కానీ ఇది ఆసక్తికరమైన గజిబిజి. జాయ్ యొక్క బెదిరింపు, అదే సమయంలో, వారి పూర్వ-కీర్తి రోజులలో విస్తరించి ఉంది, వారు కేవలం విసుగుగా మరియు సెక్సీగా ఉండటానికి అహంకారంగా ఉన్నారు. ఇది ఆధునిక యుగం మందగించడానికి, మెరుగైన స్టూడియోని పొందడానికి మరియు నేరుగా ప్లే చేయడానికి రికార్డ్ ఎగ్జిక్యూటివ్ సలహాలను తీసుకుంటే, ఆధునిక యుగం ఎలా ఉంటుందో అది ప్రత్యామ్నాయ విశ్వం. ఇది అలా కాదు మంచిది , అయితే, ఇది ఇప్పటికీ మనోహరంగా ఉంది మరియు కాసాబ్లాంకాస్ యొక్క అత్యంత ఆకర్షణీయమైన స్వర ప్రదర్శనను కలిగి ఉంది. కనీసం, మూడు పాటలు వారి లైవ్ షోలో సజావుగా సరిపోతాయి. 2015 లో, స్ట్రోక్స్ ప్రిమావెరా సౌండ్ వద్ద ప్రతి పాటను, మచు పిచ్చును కూడా తిన్న క్రూరమైన ప్రేక్షకుల కోసం హెడ్‌లైన్ సెట్‌ను ప్లే చేయడాన్ని నేను చూశాను. బ్యాండ్ వారు 00 ల ప్రారంభంలో ఉన్నదానికంటే బాగా దుస్తులు ధరించారు (కాసాబ్లాంకాస్ తప్ప, cosplaying గా ఒక ప్లానిటీర్ , కానీ హే, ఇది ఒక లుక్), మరియు మొత్తం సెట్లో ఒక సభ్యుడు మరొకరి పది అడుగుల లోపల వచ్చాడని నేను అనుకోనప్పటికీ, వారు గమనికను కోల్పోలేదు. ఫక్ యాదృచ్చికంగా ఉన్నందున వారు ఉదయం 12:51 గంటలకు 12:51 ఆడలేదు. మీ తండ్రి తనఖా ఖర్చు కంటే 90 నిమిషాల సెట్ కోసం వారి రుసుము ఎక్కువ అని విశ్వసనీయ మూలం నాకు తెలిపింది. గత అర్ధ-దశాబ్దంలో వారి సోలో డాలియన్స్ స్ట్రోక్స్ ఒక జీవన, శ్వాస బ్యాండ్ కంటే ఎక్కువ వ్యాపారం అనే ఆలోచనకు బరువును ఇస్తే, అవి వారి చర్మాన్ని చిందించడం మరియు అవి ఏమైనా అవుతాయో చూడటం ఇంకా మనోహరంగా ఉంది. వారి కెరీర్ మిగిలిన. మరియు కాసాబ్లాంకాస్ కల్ట్ రికార్డ్స్ యొక్క ఇరుసుతో, బ్యాండ్ పుట్టడానికి సహాయపడే జీవన, శ్వాస సంస్కృతికి గేట్ కీపర్‌గా పనిచేయడానికి, వారు వారి వారసత్వం గురించి బాగా తెలిసిన బ్యాండ్ లాగా కనిపిస్తారు… అలాగే అది ఆపడానికి ఎంత సులభం సందర్భం ఇకపై ఉండకూడదు. బహుశా వారు ఐకానిక్ కావాలని అనుకోకపోవచ్చు, కానీ అది జరిగింది, తరువాత ఏమి జరుగుతుందో చూడాలనుకునే వ్యక్తులు ఇంకా ఉన్నారు.
Remedies to get rid of oily skin – విపరీతమైన చెమట లేదా చర్మంలో నూనె విడుదల చేయడం వల్ల, చర్మం జిడ్డుగా మారుతుంది, ఇది తరువాత మొటిమలకు కారణమవుతుంది. అదే సమయంలో, దీని కారణంగా, మీకు చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు ఉండవచ్చు. ఈ సమస్యలను ఇంటి నివారణలతో అధిగమించవచ్చు. ప్రస్తుతం జిడ్డు చర్మం సమస్య సర్వసాధారణం. నేడు ప్రతి ఇతర వ్యక్తి ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. చర్మంలో అధిక చెమట లేదా చమురు విడుదల కారణంగా, చర్మం జిడ్డుగా మారుతుంది, ఇది తరువాత మొటిమలకు కారణమవుతుంది. అదే సమయంలో, దీని కారణంగా, మీకు చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు ఉండవచ్చు. మీ చర్మం కూడా జిడ్డుగా ఉంటే, అది మొటిమలు మరియు మొటిమలు మరియు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. అధిక నూనె, నెయ్యి లేదా కారంగా ఉండే ఆహారం వల్ల చర్మం చాలాసార్లు జిడ్డుగా మారుతుంది లేదా వాతావరణం మారినప్పుడు కూడా, చర్మం మురికి మరియు మొటిమల రూపంలో మీరు దాని భారాన్ని భరించవలసి ఉంటుంది. remedies to get rid of oily skin జిడ్డుగల చర్మం యొక్క కారణాలు జిడ్డు చర్మం వెనుక ఒత్తిడికి గురికావడం, ఆహారంలో జిడ్డైన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, ఎప్పటికప్పుడు హార్మోన్లను మార్చడం వంటి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. మీ చర్మం జిడ్డుగా మారడానికి కారణాలు ఇవి. సాధారణంగా, చాలా మంది యువతలో జిడ్డు చర్మం సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీని కారణంగా కూడా, వారు కొత్త రసాయనాలతో నిండిన ఉత్పత్తులను ఉపయోగించడం ప్రారంభించారు, దీని కారణంగా ఈ సమస్య పెరుగుతూనే ఉంది. మీ చర్మం ఎలా ఉంటుందో, అది ప్రధానంగా మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఈ మూడు విషయాలు లిపిడ్ స్థాయిలు, నీరు మరియు సున్నితత్వం. ఈ రోజు మనం మీకు కొన్ని హోం రెమెడీస్ చెబుతాము, వీటిని ఉపయోగించి మీరు జిడ్డు చర్మాన్ని వదిలించుకోవచ్చు. జిడ్డు చర్మం వదిలించుకోవడానికి రెమెడీస్ గుడ్డులోని తెల్లసొన- విటమిన్ ఎ అధికంగా ఉండే గుడ్డులోని తెల్లసొన మీ సమస్యను పరిష్కరించగలదు. దీని కోసం కోడిగుడ్డులో నిమ్మరసం కలిపి పేస్ట్ తయారు చేసి ముఖానికి పట్టించాలి. ఇది ముఖంలోని అదనపు జిడ్డును తొలగించి మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముల్తానీ మిట్టి- జిడ్డుగల చర్మాన్ని వదిలించుకోవడానికి మీరు ముల్తానీ మిట్టి సహాయాన్ని తీసుకోవచ్చు. ఇది సులభమైన మరియు ఇంటి నివారణ. దీని కోసం ముల్తానీ మిట్టిని రోజ్ వాటర్‌తో కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత కడగాలి. పెరుగు- ముఖం నుండి అదనపు నూనెను గ్రహించడంలో పెరుగు సహాయపడుతుంది. పెరుగును మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. గ్రాము పిండి మరియు పసుపు- ఈ రెండు వస్తువులను చర్మంపై ఉపయోగించడం వల్ల చర్మశుద్ధిని తొలగించడమే కాకుండా, జిడ్డు మరియు మొటిమలను కూడా తొలగిస్తుంది. దీన్ని మీ ముఖం మరియు మెడపై ఉపయోగించడం ద్వారా, మీ చర్మం నుండి అదనపు నూనె మరియు మృత చర్మ కణాలను శుభ్రం చేయవచ్చు. దీని కోసం, మీరు ఒక పెద్ద చెంచా శెనగ పిండిని తీసుకోండి, దానికి చిటికెడు పసుపు జోడించండి. నీటి సహాయంతో మందపాటి పేస్ట్ చేయండి. ఇప్పుడు చివర్లో అర టీస్పూన్ నిమ్మరసం వేసి ముఖానికి బాగా పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. దోసకాయ- విటమిన్ ఇ, విటమిన్ ఎ, పొటాషియం, మెగ్నీషియం విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న దోసకాయలో అధిక మొత్తంలో కనిపిస్తాయి, ఇది శరీరం నుండి నూనెను తగ్గిస్తుంది మరియు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మెత్తగాపాడిన మరియు ఆస్ట్రింజెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంది. తినడంతో పాటు ముఖానికి కూడా రాసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు దోసకాయ ముక్కలను ముఖానికి రాసుకోవాలి. దీని తరువాత, ఉదయం సాధారణ నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోండి. ప్రతి రాత్రి ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి.
సినిమా స్క్రిప్ట్ & రివ్యూ : 04/02/16 .Header h1 { font: normal normal 90px Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; color: #ffff00; } .Header h1 a { color: #ffff00; } .Header .description { font-size: 130%; } /* Tabs ----------------------------------------------- */ .tabs-inner { margin: 1em 0 0; padding: 0; } .tabs-inner .section { margin: 0; } .tabs-inner .widget ul { padding: 0; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; } .tabs-inner .widget li { border: none; } .tabs-inner .widget li a { display: inline-block; padding: 1em 1.5em; color: #ffffff; font: normal bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; } .tabs-inner .widget li.selected a, .tabs-inner .widget li a:hover { position: relative; z-index: 1; background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } /* Headings ----------------------------------------------- */ h2 { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #00ffff; } .main-inner h2.date-header { font: normal bold 14px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #0f0e0c; } .footer-inner .widget h2, .sidebar .widget h2 { padding-bottom: .5em; } /* Main ----------------------------------------------- */ .main-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner { padding: 20px 0; } .main-inner .column-center-inner .section { margin: 0 20px; } .main-inner .column-right-inner { margin-left: 20px; } .main-inner .fauxcolumn-right-outer .fauxcolumn-inner { margin-left: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner { margin-right: 20px; } .main-inner .fauxcolumn-left-outer .fauxcolumn-inner { margin-right: 20px; background: rgba(0, 0, 0, 0) none repeat scroll top left; } .main-inner .column-left-inner, .main-inner .column-right-inner { padding: 15px 0; } /* Posts ----------------------------------------------- */ h3.post-title { margin-top: 20px; } h3.post-title a { font: italic bold 16px 'Trebuchet MS',Trebuchet,sans-serif; color: #b02ef1; } h3.post-title a:hover { text-decoration: underline; } .main-inner .column-center-outer { background: #ffffff none repeat scroll top left; _background-image: none; } .post-body { line-height: 1.4; position: relative; } .post-header { margin: 0 0 1em; line-height: 1.6; } .post-footer { margin: .5em 0; line-height: 1.6; } #blog-pager { font-size: 140%; } #comments { background: #cccccc none repeat scroll top center; padding: 15px; } #comments .comment-author { padding-top: 1.5em; } #comments h4, #comments .comment-author a, #comments .comment-timestamp a { color: #b02ef1; } #comments .comment-author:first-child { padding-top: 0; border-top: none; } .avatar-image-container { margin: .2em 0 0; } /* Comments ----------------------------------------------- */ #comments a { color: #b02ef1; } .comments .comments-content .icon.blog-author { background-repeat: no-repeat; background-image: url(); } .comments .comments-content .loadmore a { border-top: 1px solid #b02ef1; border-bottom: 1px solid #b02ef1; } .comments .comment-thread.inline-thread { background: #ffffff; } .comments .continue { border-top: 2px solid #b02ef1; } /* Widgets ----------------------------------------------- */ .sidebar .widget { border-bottom: 2px solid #f1d08f; padding-bottom: 10px; margin: 10px 0; } .sidebar .widget:first-child { margin-top: 0; } .sidebar .widget:last-child { border-bottom: none; margin-bottom: 0; padding-bottom: 0; } .footer-inner .widget, .sidebar .widget { font: normal normal 14px Georgia, Utopia, 'Palatino Linotype', Palatino, serif; color: #ffe599; } .sidebar .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .sidebar .widget a:visited { color: #6ef12e; } .sidebar .widget a:hover { color: #c1c1c1; text-decoration: underline; } .footer-inner .widget a:link { color: #3630f4; text-decoration: none; } .footer-inner .widget a:visited { color: #000000; } .footer-inner .widget a:hover { color: #3630f4; text-decoration: underline; } .widget .zippy { color: #ffffff; } .footer-inner { background: transparent none repeat scroll top center; } /* Mobile ----------------------------------------------- */ body.mobile { background-size: 100% auto; } body.mobile .AdSense { margin: 0 -10px; } .mobile .body-fauxcolumn-outer { background: transparent none repeat scroll top left; } .mobile .footer-inner .widget a:link { color: #c1c1c1; text-decoration: none; } .mobile .footer-inner .widget a:visited { color: #6ef12e; } .mobile-post-outer a { color: #b02ef1; } .mobile-link-button { background-color: #3630f4; } .mobile-link-button a:link, .mobile-link-button a:visited { color: #ffffff; } .mobile-index-contents { color: #444444; } .mobile .tabs-inner .PageList .widget-content { background: rgba(0, 0, 0, 0) url(https://resources.blogblog.com/blogblog/data/1kt/travel/bg_black_50.png) repeat scroll top center; color: #ffffff; } .mobile .tabs-inner .PageList .widget-content .pagelist-arrow { border-left: 1px solid #ffffff; } sikander777 --> సినిమా స్క్రిప్ట్ & రివ్యూ రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు... టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం! Saturday, April 2, 2016 రివ్యూ ! రచన- దర్శకత్వం : రాం గోపాల్ వర్మ తారాగణం : మంచు మనోజ్, జగపతి బాబు, వడ్డే నవీన్, ప్రకాష్ రాజ్, సురభి, మంజుభార్గవి, పూనమ్ కౌర్, అభిమన్యు సింగ్, నర్సింగ్ యాదవ్, చలపతి రావు తదితరులు సంగీతం: రవిశంకర్, ఛాయాగ్రహణం : అంజి బ్యానర్ : సికె ఎంటర్ టైన్మెంట్స్ – శుభ శ్వేతా ఫిలిమ్స్ నిర్మాతలు : స్వెట్లానా, వరుణ్, తేజా, సివి రావు సమర్పణ : సి. కళ్యాణ్ విడుదల : ఏప్రెల్ 1, 2016 *** రాం గోపాల్ వర్మతో ఒక భరోసా వుంటుంది. ఆయన అంబాసిడర్ కారు నడుపుకుంటూ ఎప్పుడూ రాడు. కొత్త కొత్త మోడల్ కార్లు డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. ఇవాళ్టి దర్శకులు కొందరు ఇంకా ‘సావిత్రి’ లాంటి పాత అంబాసిడర్ కారునే చోద్యంగా తోలుకుంటూ వస్తూంటే, వర్మ తిప్పితిప్పి తీసేవి రెండు మూడు జానర్లే అయినా, వాటి ఉన్న బడ్జెట్ లోనే నిర్మాతకి ఎక్కువ క్వాలిటీనీ కొత్తదనాన్నీ ఇవ్వాలని ప్రయత్నిస్తూ, ‘హై ఎండ్ కార్లని’ వాడేస్తూంటాడు. పాతికేళ్ళుగా సినిమాలు తీస్తున్నా పాతబడి పోకుండా, పాత స్కూల్ అన్పించుకోకుండా, ఎవరు నేర్చుకున్నా నేర్చుకోక పోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, స్క్రిప్టులో కొత్త టెక్నిక్స్ నీ, మేకింగ్ లో కొత్త టెక్నిక్స్ నీ ప్రవేశపెడుతూ జోరుగా డ్రైవ్ చేసుకుంటూ తన మానాన తను వెళ్లిపోతూంటాడు- ‘ఛోటీసీ యే దునియా పహెచానే రాస్తే హై..తుమ్ కహీఁ తో మిలోగే, తో పూఛేంగే హాల్ ..’ అనిపాడుకుంటూ. నిన్న ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే డాషింగ్ డాక్యూ డ్రామా తీస్తే, ఇవ్వాళ ‘ఎటాక్’ అనే గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్ తీశాడు. జీవిత చరిత్రని మరోకోణంలో చిత్రానువాదం ఎలా చేయాలనే దానికి ‘కిల్లింగ్ వీరప్పన్’ ని గైడ్ లా అందిస్తే, ఒపెన్స్ సస్పెన్స్ తో ఎండ్ సస్పెన్స్ అనే ఊబిలో పడకుండా ఎలా బయటపడొచ్చో ‘ఎటాక్’ ని రూల్ బుక్ లా అందించాడు. తెలుసుకోవాలన్న ఆసక్తి వుందా? అయితే కథలోకి వెళ్దాం... కథ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒకప్పుడు రౌడీయిజంతో బతికిన గురురాజ్ (ప్రకాష్ రాజ్), రౌడీయిజానికీ కుటుంబ యోగ క్షేమాలకీ లంకె కుదరని, రౌడీయిజాన్ని వదిలేసి ‘చార్మినార్ గ్రూప్స్’ అనే కంపెనీని పెట్టుకుని కుటుంబంతో సంతోషంగా గడుపుతూంటాడు. అయినంత మాత్రాన పాత జీవితం వెన్నాడక పోదని అప్రమత్తంగా ఉంటాడు. భయపడినట్టు జరగనే జరుగుతుంది- ఒకరోజు గుడి కెళ్ళి వస్తున్న తనని మాటు వేసిన శత్రువులు చంపేస్తారు. గురురాజ్ కి ముగ్గురు కొడుకులు, భార్య. పెద్ద కొడుకు కాళి (జగపతి బాబు) తండ్రి హత్యకి బాధ్యుడు పాత శత్రువు నర్సింహులేనని వాదిస్తాడు. చాలా కాలంగా నలుగుతున్న భూవివాదమే ఈ హత్యకి కారణమనీ, ఆ నర్సింహులుని వదిలిపెట్టే ప్రసక్తే లేదనీ అంటాడు. రెండో కొడుకు గోపి ( వడ్డే నవీన్) ఇంకా ఈ చంపుకోవడాలు వద్దంటాడు, ఆ భూమిని వదిలేద్దామంటాడు. చిన్న కొడుకు రాధ ( మనోజ్) పెద్దన్న కాళీనే సపోర్టు చేస్తాడు. రాధని ప్రేమిస్తున్న వల్లి ( సురభి) కంపెనీ బిజినెస్ చూసుకోకుండా మళ్ళీ గొడవల్లోకి తలదూర్చావంటే వెళ్ళిపోతానని హెచ్చరిస్తుంది. కాళి మాత్రం పగబట్టిన త్రాచులా నర్సింహులు కోసం గాలిస్తూనే వుంటే, ఓ పోలీస్ ఇన్స్ పెక్టర్ ఉప్పందిస్తాడు, నర్సింహులు ఫలానా టైములో ఫలానా చోట వుంటాడని. ఈ సమాచారంతో తన గ్రూపుతో అక్కడికెళ్ళిన కాళీని మాటువేసి చంపేస్తారు గ్రూపుతో సహా ప్రత్యర్ధులు. దీంతో ఇక వూరుకోననీ, తండ్రినీ, అన్ననీ చంపిన వాళ్ళందర్నీ, చంపడానికి తోడ్పడ్డ వాళ్ళందరితో సహా, అంతమొందిస్తానని ప్రకటించి ఎటాక్ కి బయల్దేరతాడు రాధ. తెరపైకి రాని మూల శత్రువు నర్సింహులెవరో వాణ్ణి కనుక్కోవడం రాధ టాప్ ప్రయారిటీగా వుంటుంది. ఎందుకంటే, తనకి తెలిసి ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం తన చిన్నప్పుడు, తన తండ్రీ- నర్సింహులు ప్రత్యర్ధులని వినడమే గానీ నర్సింహులుని చూసింది లేదు. ఈ నేపధ్యంలో రాధ వేట మొదలెడతాడు.. ఎలావుంది కథ పాతదే. కానీ మెసేజ్ రెబెల్ ధోరణిలో వుంది. రామాయణ భారతాల్ని చూపిస్తూ శత్రువుల్ని మంచితనంతో క్షమించరాదనీ, వధించడమే ధర్మమనీ చెబుతున్నాడు వర్మ. నేరం చేసిన వాణ్ణి శిక్షించడం దేవుడితో మనిషి కూర్చుని రాయించుకున్న ధర్మ సూత్రమని హీరో పాత్రద్వారా అన్పిస్తాడు (ఈ డైలాగు మాత్రం టెర్రిఫిక్ గా, ఎమోషనల్ గా వుంది). చట్టాల్ని సీనులోకి తీసుకు రాకుండా, ఎవరి చట్టం వాళ్ళే రాసుకుని శత్రువుని చంపెయ్యాలనీ చెబుతున్నాడు. దీన్నెవరూ సీరియెస్ గా తీసుకోరు, అది వేరే విషయం...కానీ ఈ వాదంతో తన సేఫ్టీ కోసం రామాయణ మహా భారతాలని ఉటంకించినట్టు కన్పిస్తాడు. మతగ్రంధాలకి తప్పుడు భాష్యాలతో టెర్రరిస్టులు చేస్తున్నది ఇదేగా? కాకపోతే వర్మ వక్ర భాష్యాలు చెప్పడం లేదు. ఏదోవొక వివాదాస్పద అంశాన్ని జోడిస్తే గానీ రొటీన్ కథలు నిలబడవని కావొచ్చు. అయితే, దీన్నయినా మన మానసిక చీకటి కోణాల్లో ఎక్కడో సమర్ధించుకుని రహస్యంగా సంతృప్తి పడాలన్నా, కాస్త సన్నివేశ బలం అవసరం. ఆ సన్నివేశ బలం ఏమిటో, అదెందుకు లేదో తర్వాత చూద్దాం. అయితే గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్ డిమాండ్ చేసే జానర్ మర్యాదలన్నిటినీ తుచ తప్పకుండా వర్మ పాటించి- ఈ కథని చివరంటా కళ్ళప్పగించి చూడగలిగేట్టు కథనం చేశాడు- అదీ గొప్పతనం. ఎవరెలా చేశారు ఇందులో హేమాహేమీలు నటించడం బాక్సాఫీసు అప్పీల్ కి ప్లస్ అయింది. ఓపెనింగ్స్ బాగానే వున్నాయి. ఆ హేమాహేమీలతో ఇది ఉత్త తాటాకుల చప్పుళ్ళే అని అన్పించకుండా వాళ్ళ పాత్రల్నీ, నటనల్నీ సమర్ధవంతంగా తెరకెక్కించాడు వర్మ. మారిన మనిషిగా ప్రకాష్ రాజ్ హుందాతనంతో కూడిన నటన, హావభావాలూ మైక్రోస్కోపిక్ విజన్ తో శోధిస్తున్నట్టు విస్పష్టమైన క్లోజప్స్ తో కట్టి పడేస్తాయి. అలాగే జగపతిబాబులోని ప్రతీకారేచ్ఛతో కూడిన ముఖభావాలూ మనల్ని వెన్నాడతాయి. మంచుమనోజ్ నుంచి కూడా కమర్షియల్ కి దూరంగా రియలిస్టిక్ అప్రోచ్ తో ప్రదర్శించిన నటనని ఎంజాయ్ చేయగలం. మంజుభార్గవి కూడా ఒక కీ లక సన్నివేశంలో ఇచ్చిన టైట్ క్లోజప్ ఒక క్లాసిక్ ఆర్ట్. ఆ షాట్ ని అలాగే కత్తిరించి ఫ్రేము కట్టించి గోడకి పెట్టుకుంటే, మొనాలిసాతో పోటీ పడుతుంది. గొడవలు వద్దని ఎప్పుడూ మనోజ్ ని సాధిస్తూ వుండే పాత్రలో సురభికి, ఎప్పుడూ అవే సీన్లు అరడజను సార్లు మార్చి మార్చి వస్తూంటాయి. ఇక విలన్ అభిమన్యు సింగ్ కి వాంప్ పాత్రలో పూనమ్ కౌర్, వర్మే తీసిన ‘కంపెనీ’ లో మనీషా కోయిరాలకి చెల్లెలు అన్పించే చేష్టలతో వుంటుంది. అభిమన్యు సింగ్ ఈ సినిమాలో తొలిసారిగా ప్లే బాయ్ లుక్ తో కన్పిస్తాడు. ఇంకా చిన్న చిన్న రౌడీలున్నారు. ఆయా సన్నివేశాల్లో వాళ్ళ విచిత్రమైన క్లోజప్స్ కూడా సన్నివేశాలకి బలం చేకూరుస్తాయి. ఇక తెరపైకి తిరిగి వచ్చిన ఒకప్పటి హీరో వడ్డే నవీన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కెమెరా వర్క్ ఈ థ్రిల్లర్ ని చాలా నిలబెట్టింది. జానర్ మర్యాదకి తగిన ఛాయగ్రహణం ప్రాణం ఈ సినిమాకి. ఈ కెమెరా వెనుక కన్ను అంజిది. అద్భుతమైన దృశ్య ఫలితాల్ని ఇచ్చాడితను. ఒక రివెంజి డ్రామాని కూడా కంటికింపైన రంగులతో తీయవచ్చా అన్నది ఎప్పుడూ ప్రశ్న కాలేదు. కాకపోతే వర్మ ఎప్పుడూ ఇలా తీయలేదు. ఆయనదెప్పుడూ గ్రే- బ్రౌన్- ఎల్లో టింట్సే. ఈసారి మాత్రం కలర్ గ్రేడింగ్ ని రెడ్- పింక్ టింట్స్ లకి మార్చేశారు. ఇదెంతో విజువల్ ట్రీట్ ని సంతరించి పెట్టింది. ఏ కలర్ తోనూ, ఏ లైటింగ్ తోనూ ఎక్కడా డార్క్ మూడ్ అనేదే క్రియేట్ చేయకుండా, టేబుల్ మీద నోరూరించే తియ్యటి కేక్ ని అమర్చి పెట్టినట్టుగా దృశ్యాల్ని మనోరంజితం చేశారు. ఓల్డ్ సిటీ, పురనాపుల్, నయాపుల్, మూసీ నదుల ఏరియల్ షాట్స్ అయితే మైండ్ బ్లోయింగే. ఇలాటి ఓల్డ్ సిటీ షాట్స్ ఇంతవరకూ ఏ తెలుగు సినిమాలోనూ రాలేదు.ఓల్డ్ సిటీ భవనాలూ గల్లీలూ కూడా, పింక్ టింట్ తో అద్భుతంగా వెలిగిపోతూంటాయి. నడిబజార్లో ప్రకాష్ రాజ్ ఓపెన్ ఇల్లు నేటివిటీకి నిలువెత్తు సాక్ష్యంలా వుంటుంది. యాక్షన్ సీన్ల చిత్రీకరణ కూడా కాస్త భిన్నంగానే వున్నా, క్లయిమాక్స్ లో విలన్ తో మనోజ్ పోరాడుతున్నప్పుడు ఎంతసేపూ ఇద్దరూ పెనుగులాడుకోవడమే సరిపోయింది- పంచులిచ్చుకోకుండా. అరటి పండుకోసం చిన్న పిల్లలిలాగే పెనుగులాడుకుంటారు. అలాగే గన్ షాట్స్ ఎఫెక్ట్స్ మూస పద్ధతిలో వున్నాయి. ఒక రివాల్వర్ ఒకసారి పేలిందంటే దాని శబ్దంతో గుండెలదరాలి- వయోలెంట్ యాక్షన్లో వెపన్స్ కూడా వయోలెంట్ గానే వుండాలికదా. ఇక జగపతి బాబుని నిలువెల్లా కాల్చేసింతర్వాత, అతను సీన్లోంచి అవుట్ అవడం, దర్శకుడు కట్ చెప్తే నటన విరమించుకుని వెళ్లి పోయినట్టుంది- ఇలాటిదే ఇంకో యాక్షన్ సీన్లో మనోజ్ తోనూ జరిగింది. ఈ రెండూ అన్వర్ అలీ ఎడిటింగ్ లో వుండాల్సినవి కావు. ఇక సినిమా ప్రారంభంలో ప్రకాష్ రాజ్ హత్య, ఇంటర్వెల్ దగ్గరలో జగపతి బాబు హత్య, అలాగే సెకండాఫ్ లో మనోజ్ ని చంపడానికి ఎటాక్ - ఈ మూడూ స్ట్రక్చర్ ని విజువలైజ్ చేసే మంచి ప్లేస్ మెంట్సే. అయితే ఈ మూడూ మూసలో ఉండకుండా చూడాల్సింది. ప్రకాష్ రాజ్ ని చంపేటప్పుడు పావురాల గుంపుతో యాక్షన్ ఒక మూస, జగపతి బాబుని చంపేటప్పుడు వర్షంలో గొడుగులతో యాక్షన్ ఇంకో మూస, దోభీ ఘాట్ లో మనోజ్ మీద ఎటాక్ చేయడం మరింకో మూస. ఈ పావురాలూ గొడుగులూ దోభీ ఘట్లూ ఏనాటి మూసో! వీటిని మారుస్తూ కొత్త ‘మూసని’ కనిపెట్టాల్సింది వర్మ. పోతే, ప్రకాష్ రాజ్ ని క్లోజప్ లో కూడా అంత మంది అన్ని సార్లు కాల్చినపుడు, ఆయన తెల్ల చొక్కా మీద ఒకే ఒక్క గాయం మాత్రమే అయినట్టు రక్తం కారడం ఏమీ బాగాలేదు. తీయడంలో ఇలాటి టెక్నికల్ లోపాలు కొన్ని దొర్లినా, కథ చెప్పడంలో దర్శకుడుగా ఎక్కడా ఫోకస్ కోల్పోలేదు వర్మ. అలాగే చిత్రీకరణలో, సన్నివేశాలకి డెప్త్ తీసుకురావడానికి మింగిల్ చేసిన పక్క పాత్రల ‘బిజినెస్’ షాట్స్ తో, వర్మ సంస్కారవంతమైన దర్శకత్వం వహించాడు. ఇక సంగీతం విషయానికొస్తే, బ్యాక్ గ్రౌండ్ లో రెండూ థీమ్ సాంగ్సే. ఈమధ్య ఇలాటి సినిమాలు వర్మ తీస్తూ పెడుతున్న విచిత్రమైన గొంతుకల, హింసని ప్రేరేపించే అరుపుల పాటలు ఇందులో కూడా వున్నాయి. చివరికేమిటి కొన్ని స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకుని ముగిద్దాం. వర్మ సెట్ చేసుకున్న ఈ స్క్రీన్ ప్లేని త్రీ యాక్ట్స్ కింద విభజిస్తే, జగపతిబాబుకి నర్సింహులు ఆచూకీ చెప్తానని ఇన్స్పెక్టర్ అనడం, కథలో ప్రధాన సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో భాగంగా వచ్చే ఒక బీట్. ఇది సుమారు నలభై నిమిషాలకి వస్తుంది. ఇక్కడ్నించీ జగపతి బాబు నర్సింహులు కోసం వెళ్ళడం, తనే హత్యకి గురి కావడం, హాస్పిటల్లో చనిపోవడం ఇంకో అయిదు నిమిషాల్లో జరిగిపోతుంది. బిగినింగ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ పడుతుంది. అంటే ముప్పావు గంటలో ఇంటర్వెల్ వచ్చేస్తుందన్న మాట. ఇలా ఇంటర్వెల్ సీనే బిగినింగ్ ముగింపు సీను కావడం బహుశ ఇదే మొదటి సారి చూడ్డం. ఇంటర్వెల్ తర్వాత కథకి హీరో అయిన మనోజ్ కి ఇక శత్రువు లందర్నీ చంపెయ్యాలన్న గోల్ ఏర్పడుతుంది – అంటే ప్లాట్ పాయింట్- 1 అన్న మాట. అంటే కథ మిడిల్లో పడిందన్న మాట. మిడిల్ అంటే గోల్ కోసం హీరో చేసే స్ట్రగులే కాబట్టి- హంతకుడైన నర్సింహులు ని కనుక్కోవడానికి వివిధ ప్రయత్నాలు చేసి, చివరికి వాణ్ణి పట్టుకుంటే అసలు రహస్యం తెలిసి, ఆ తెలుసుకున్న రహస్యంతో అసలు విలన్ని పట్టుకుంటాడు. రెండో అన్నతో బాటు హీరోయిన్ కూడా ఎదురు తిరగడంతో, ఆ విలన్ తో రాజీ ప్రయత్నానికి సిద్ధమవుతాడు హీరో. ఇక్కడ మిడిల్ ముగిసి ప్లాట్ పాయింట్ - 2 ఏర్పాటయింది. మిడిల్ ముగియడమంటే గోల్ కోసం హీరో చేస్తున్న స్ట్రగల్ కి చివరి ఎత్తుగడ పన్నడమే కాబట్టి- అలా ఈ ప్లాట్ పాయింట్- 2 దగ్గర నుంచీ రాజీ మంత్రంతో విలన్ ని ఆశ్రయిస్తాడు మనోజ్. అంటే ఎండ్ లో పడింది కథ. ఆ రాజీమంత్రమే అస్త్రంగా క్లైమాక్స్ వైపు పయనం! హీరో ఎవరు? గురురాజ్ చిన్న కొడుకు (బిగినింగ్), ఇతను ఇరుక్కున్న సమస్యేమిటి? తన తండ్రిని, అన్నని చంపిన శత్రువు లందర్నీ చంపడం (మిడిల్), ఈ సమస్య లోంచి ఎలా బయట పడ్డాడు? రాజీ మంత్రంతో ( ఎండ్). పోతే, ఈ స్క్రీన్ ప్లే బలమేమిటి? థ్రిల్లర్ సినిమాకి నష్టం చేసే ఎండ్ సస్పెన్స్ కథనాన్ని ఎవాయిడ్ చేస్తూ ఓపెన్ సస్పెన్స్ ని మెయిం టెయిన్ చేయడం. అదెలా? ‘కథాకళి’.. ‘కథాకళి’ లాంటి ఇంకెన్నో సినిమాలూ చూస్తే తెలుస్తుంది. ఏముంది వాటిలో? ‘కథాకళి’ నే తీసుకుందాం. విలన్ ని ఎవరో చంపితే ఆ నేరం హీరో మీద పడుతుంది. హీరో తో సహా ప్రేక్షకులకి కూడా హంతకుడెవరో తెలీదు. కొందరు అనుమానితులుగా కన్పిస్తూంటారు. వీళ్లల్లో హంతకుడెవరా అని మనం గెస్ చేస్తూ వుంటాం. చివరికి – కథ నడిపీ నడిపీ ఎండ్ లో ఆ సస్పెన్స్ విప్పి ఇదిగో ఈ ఫలానా వాడే హంతకుడని చూపించేశారు. సినిమాలకి ఈ విధానం పనికి రాదని చాలా సార్లు చేతులు కాల్చుకున్న తర్వాత హాలీవుడ్ తెలుసుకుంది. ప్రేక్షకుల ఓపికని ఇది చాలా పరీక్షిస్తుంది. హీరోకి విలన్ (హత్య చేసిన వాడు) కన్పించక ఏక్ నిరంజన్ లా, లింగు లిటుకుమని, తాడూ బొంగరం లేనివాడిలా కథంతా వేస్టుగా పాసివ్ గా తిరుగుతూ, టైం ( బుర్ర కూడా) తినేస్తూంటాడు. వీణ్ణి పట్టి అమెజాన్ అడవుల్లో పడెయ్యాలన్పిస్తుంది. గోల్ వుంటుంది, విలన్ లేక కాన్ ఫ్లిక్టే వుండదు. ఇలా కాకుండా, హత్య చేసింది ఫలానా హంతకుడని హీరోకి, ప్రేక్షకులకీ తెలిసిపోయే ట్టు కథనముంటే, అప్పుడు ఆ హంతకుణ్ణి పట్టుకునే యాక్షన్ లోంచి యాక్టివ్ పాత్ర, థ్రిల్లింగ్ కథనం సాధ్యమవుతాయి. దీన్ని సీన్ - టు – సీన్ సస్పెన్స్ అంటారు. ఎందుకంటే తెలిసిన కిల్లర్ ఎలా పట్టుబడతాడా అని సీను సీనుకీ సస్పెన్స్ ని పెంచుతూ కథనం – కాన్ ఫ్లిక్ట్- పరస్పర ఎత్తుగడలూ వుంటాయి గనుక. ఇంకో పధ్ధతి మర్డర్ చేస్తున్నప్పుడు కిల్లర్ ని ప్రేక్షకులకి మాత్రమే చూపించేసి, హీరోకి చూపించకపోవడం. అయితే ప్రేక్షకులకి తెలిసి హీరోకి తెలియని కథనంతో బలహీన మవుతుంది. ఉత్తమ కథనానికి గుర్తు- ప్రేక్షకులు హీరోని ఫాలో అవుతూ అతను కనుగొంటున్న ర హస్యాల్ని అదే సమయంలో అతడితో బాటే తెలుసుకుంటూ- హీరో తో బాటే థ్రిల్లవడం. టై అప్ జర్నీ చేయడం. ‘ఎటాక్’ లో జరిగిందేమిటంటే, ఎండ్ సస్పెన్స్ కాదు, సీన్ టు సీన్ సస్పెన్స్ కూడా కాదు- పైన చెప్పుకున్న టై అప్ జర్నీ. అంటే ఓపెన్ సస్పెన్స్. సస్పెన్స్ అన్నది ఒక అంశం అనుకుంటే, ఆ అంశానికి రెండు పార్శ్వా లుంటాయి : ఎవరు? ఎందుకు? అనేవి. వీటిలో ఒకటే ఓపెన్ చేసి రెండోది మూసి పెట్టినప్పుడు, ఆ మూసిపెట్టిన పార్శ్వమే కథని నడిపిస్తూ వుంటుంది. ఫలానా వాడు హత్య చేశాడని చూపించి, ఎందుకు చేశాడో మూసిపెట్టి నడపడం, లేదా ఎందుకు చేశాడో చూపించి, వాడెవడో మూసిపెట్టడం...అన్నమాట! ‘ఎటాక్’ లో రెండోది జరిగింది. మొట్టమొదట ప్రకాష్ రాజ్ ని ఒకడి నాయకత్వంలో వచ్చి కొందరు చంపుతారు. ఈ నాయకుణ్ణి చూస్తే కథకి విలన్ లాగే వుంటాడు (ఇలాటి ఆర్టిస్టుల్ని పెట్టి మిస్ లీడ్ చేయడం సస్పెన్స్ థ్రిల్లర్స్ లో మామూలే). ప్రకాష్ రాజ్ ని ఎందుకు చంపారో కథనంలో చెప్పేశారు, ఎవరు చంపి వుంటారో కూడా నర్సింహులు అనే పేరుని వెల్లడి చేస్తూ చెప్పేశారు. కానీ ఆ నర్సింహులు ఎవరో మనకి చూపించలేదు. కానీ మనం చూసిన ఆ విలన్ లాంటి వాడే అయ్యుంటాడని మనకి దొలుస్తూ వుంటుంది. వాడేనా కాదా, వాడెక్కడున్నాడు, ఎలా దొరికిపోతాడు, అన్న రకరకాల సస్పెన్సులు ఏర్పడి ఊపిరి బిగబట్టి చూడడమే మనపని. ఇలాటి థ్రిల్లర్ కథనం ఎలా ఉంటుందంటే, ఫస్టాఫ్ సెకండాఫ్ కనిపించని కవలల్లాగా వుంటాయి. ఫస్టాఫ్ లో హీరోకి గోల్ ఏర్పడడానికి ఒకటి కాదు రెండు మూడు సంఘటనలు జరుగుతాయి- లేకపోతే గోల్ ఏర్పడేందుకు తగ్గ ఎమోషన్ వుండదు. ఫస్టాఫ్ లో తండ్రి చావు చూశాక, అన్న చావుకూడా చూశాక ఇక విజృంభించాడు మనోజ్. సెకండాఫ్ లో ఏం జరుగుతుందంటే, ఫస్టాఫ్ లో హీరో పాత్ర రెండు సంఘటనలతో వేడెక్కి రెండు మెట్లు ఎక్కినట్టే, సెకండాఫ్ లో వేడి తగ్గి రెండు మెట్లు దిగుతాడు. ఫస్టాఫ్ లో వేడెక్కించిన ఆ రెండు మెట్లూ తండ్రి చావు, అన్న చావులైతే- సెకండాఫ్ లో వేడి తగ్గి దిగివచ్చిన ఆ రెండు మెట్లూ- ఒకటి, మనం భావిస్తున్నవాడు నర్సింహులే కాదని తేలడం; రెండు, నర్సింహులునే పట్టుకుంటే వాడికి హత్యలతో సంబంధమే లేదని తేలడం! ఈ పోలికలతో ఫస్టాఫ్ సెకండాఫ్ రెండూ కవలలు. ఇలా ఉన్నప్పుడే రెండూ ఒకదానితో ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటూ కుప్పకూలకుండా వుంటాయి. నర్సింహులు కూడా కాకపోతే ఇంకెవరన్నది ట్విస్ట్. సెకండాఫ్ లో రెండు మెట్లు జారి కింది కొచ్చిన హీరో ఈ ట్విస్టుతో మళ్ళీ మొదటి కొచ్చాడన్న మాట. యాదృచ్చికంగా ఈ ట్విస్టే ప్లాట్ పాయింట్ -2 అవుతుంది. ఓపెన్ సస్పెన్స్ ఎప్పుడూ కథని పొరలు పొరలుగా విప్పి చూపుతూంటుంది... ఇక హీరో ప్రవచించే కంటికి కన్ను, పంటికి పన్ను న్యాయం కాన్సెప్ట్ రహస్యంగానైనా ఆనందిద్దామంటే మనకి అడ్డు పడుతోందేమిటంటే- మన కంతగా ‘కచ్చి’ పుట్టడం లేదు. ప్రకాష్ రాజ్ ని, జగపతినీ చంపడం మనం కళ్ళారా చూసినప్పటికీ, మనోజ్ రివెంజ్ కాన్సెప్ట్ కి మనం కనెక్ట్ కాలేక పోతున్నాం. మన కళ్ళ ముందు ఆ చావులు చాలక, చావులకి కారణమయ్యాడని అంటున్న వాడితో గతం తాలూకు ఫ్లాష్ బ్యాకు లేక! ప్రకాష్ రాజ్ మంచి వాడిగా ఎలా బతికాడో వాటి తాలూకు మాంటేజెస్ మాత్రమే అప్పుడప్పుడూ చూపడం వల్ల! నర్సింహులుతో ప్రకాష్ రాజ్ కి ఫ్లాష్ బ్యాక్ వేస్తే నర్సింహులెవరో ప్రేక్షకులకి ముందే తెలిసిపోతుందనుకోవడం వల్ల!! దీనికేమిటి మందు? మందుంటే మర్డర్లు చేయమని ప్రకృతి చెప్పినట్టే. కాబట్టి మందు లేదు! -సికిందర్ http://www.cinemabazaar.in Posted by సికిందర్ at 12:28:00 AM Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest Newer Posts Older Posts Home Subscribe to: Posts (Atom) ఈ కాన్సెప్ట్ కి బాధితురాలి కథ అవసరం! స్క్రీన్ ప్లే సంగతులు...? Search This Blog contact msikander35@gmail.com, whatsapp : 9247347511 Popular Posts 1255 : రివ్యూ! రచన- దర్శకత్వం : శైలేష్ కొలను తారాగణం : అడివి శేష్ , మీనా క్షీ చౌదరి , కోమలీ ప్రసాద్ , రావు రమేష్ , శ్రీకాంత్ అయ్యంగార్ , తనికెళ్ళ భర... 1257 : రివ్యూ! 2023 లో జరిగే 95 వ ఆస్కార్ అవార్డ్స్ కి మన దేశం తరపున అధికారిక ఎంట్రీ పొందిన గుజరాతీ చలన చిత్రం ‘ చెల్లో షో ’ (చివరి షో) అక్టోబర్... 1258 : సండే స్పెషల్ రివ్యూ! ‘ చాం దినీ బార్ ’ (ముంబాయి బార్ గర్ల్స్ జీవితాలు) , ‘ పేజ్ త్రీ ’ (ఉన్నత వర్గాల హిపోక్రసీ ) , ‘ కార్పొరేట్ ’ (కార్పొరేట్ రంగం... 1256 : రివ్యూ! రచ న -దర్శక త్వం : ఆనంద్ జె తారాగణం: రావణ్ రెడ్డి , శ్రీ ని ఖి త , లహ రీ గుడివాడ , రవీంద్ర బొమ్మకంటి , అమృత వర్షిణి తదిత తరులు సంగీతం: ఫ... 1259 : రివ్యూ! రచన - దర్శకత్వం : చెల్లా అయ్యావు తారాగణం : విష్ణు విశాల్ , ఐశ్వ ర్యా లక్ష్మి , కరుణాస్ , శ్రీజా రవి , మునిష్కాంత్ తదితరులు సంగీతం : జస్... రైటర్స్ కార్నర్ హై కాన్సెప్ట్ స్క్రిప్ట్ అంటే బిగ్ కలెక్షన్స్ ని రాబట్టే స్క్రిప్ట్. ఈ ఆర్టికల్ లో మీకు బిగ్ కలెక్షన్స్ ని సాధించి పెట్టే హై కాన్స... తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17 స్క్రీ న్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసల... 1254 : రివ్యూ! రచన - దర్శక త్వం : ప్రదీప్ రంగనాథన్ తారాగణం : ప్రదీప్ రంగనాథన్ , సత్యరాజ్ , యోగి బాబు , ఇవానా , రాధి కా శరత్‌కుమార్ , రవీనా తదితరులు సంగీ త... 1251 : స్క్రీన్ ప్లే సంగతులు -1 దె య్యాలు ఎలాగైతే మూఢ నమ్మకమో , చేతబడి అలాటి మూఢ నమ్మకమే. దెయ్యాలతో హార్రర్ సినిమాలు తీసి ఎంటర్ టైన్ చేయడం వరకూ ఓకే. చేతబడి వుందంటూ నమ... 1253 : రివ్యూ! రచన - దర్శక త్వం : ఏఆర్ మోహన్ తారాగణం : అల్లరి నరేష్ , ఆనంది , వెన్నెల కిషోర్ , ప్రవీణ్ , సంపత్ రాజ్ , శ్రీ తేజ్ , రఘుబాబు తదితరులు ...
Hyderabad Taskforce Constable crimes: పోలీసులు అంటే నిజం వైపు నిలబడి తప్పు చేసేవారిని దండించడం.. అయితే అందుకు పూర్తి భిన్నం ఈ కానిస్టేబుల్​. పేరుకే కానిస్టేబుల్​ కానీ.. దొంగల నాయకుడు. గ్యాంగ్​స్టర్​ అవ్వాలనే బలమైన కోరిక అతడిది. తప్పుడు పనులు చేస్తూ ఎంత తప్పించుకొని తిరిగితే ఏం.. తప్పు చేసినవాడు ఎప్పటికైనా దొరకడం ఖాయం అన్నట్లు ఈ కానిస్టేబుల్​ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. Hyderabad Taskforce Constable crimes: నేరస్తులతో దోస్తీ చేస్తూ దొంగల నాయకుడిగా మారిన నగర టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ ఈశ్వర్‌ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇటీవల నల్గొండ పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు చిన్నారులు, మహిళను అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో ఇతడి బండారం బట్టబయలైంది. పక్కా ఆధారాలతో సోమవారం నల్గొండ పోలీసులు కానిస్టేబుల్‌ ఈశ్వర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతడికి సహకరించిన మరో కానిస్టేబుల్‌పైనా విచారణకు ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ ఈశ్వర్‌ గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలనే కోరిక: 2010 బ్యాచ్‌ కానిస్టేబుల్‌ ఈశ్వర్‌కు గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలనే కోరిక. సహచర కానిస్టేబుల్‌తో స్నేహం పెంచుకున్నాడు. గాంధీనగర్‌, చిక్కడపల్లి, ఎస్సాఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్లలో వీరిద్దరూ కలిసే పనిచేశారు. పలుకుబడితో ఇద్దరూ టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేయించుకున్నారు. గాంధీనగర్‌లో ఓ పోలీసు అధికారి తోడ్పాటుతో నేరస్తుల నుంచి సొత్తు గుంజటం ప్రారంభించారు. ఈ సంపాదన చాలక దొంగల ముఠాలనే రూపొందించడం ప్రారంభించారు. చోరీలు చేయించి వాటాలు పంచుకున్నారు. అనంతరం పంపకాల్లో విభేదాలతో ఇద్దరూ వేర్వేరు ముఠాలను తయారు చేశారు. అధికారులకే బెదిరింపులు: ఈశ్వర్‌ ఉత్తర మండలంలోని ఓ ఠాణాలో పనిచేసినప్పుడు ఉదయం వెళ్లి సంతకం పెట్టి, విధులకు డుమ్మా కొట్టి దొంగలతో బేరసారాలు, సెటిల్‌మెంట్‌లు నడిపేవాడు. ప్రశ్నించిన ఇన్‌స్పెక్టర్‌కు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చేవాడు. బదిలీ చేయిస్తానంటూ బెదిరించేవాడు. చిన్నపిల్లలు, మహిళలతో ముఠాలు కట్టించి చోరీలు చేయించటం ప్రారంభించాడు. ప్రస్తుతం 4-5 ముఠాలకు చీరాల, హఫీజ్‌పేటలోని తన నివాసాల్లో బస ఏర్పాటుచేసి ఏపీ, తెలంగాణలో దొంగతనాలు చేయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. పోలీస్‌స్టేషన్లకు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడేవాడంటూ గతంలో బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. కేసులు, సస్పెన్షన్లున్నా.. వెంటనే పోస్టింగ్‌లు సంపాదించటం చర్చనీయాంశంగా మారింది. ఓ ఉన్నతాధికారి సహకారంతో అడ్డంకులు అధిగమించేవాడని తెలుస్తోంది. సస్పెన్షన్‌కు చర్యలు.. ఈశ్వర్‌ను సస్పెండ్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఇతనికి సహకరించిన ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈశ్వర్‌ దారిలోనే ఉన్న మరో ముగ్గురు టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుళ్లపైనా విచారణకు ఆదేశించనట్లు తెలుస్తోంది.
భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. డాక్టర్‌గా తెలుగు భాషాభిమానిగా, ఖద్దరు దారిగా, స్వాతంత్య్ర సమరశీలిగా, మహాత్మాగాంధీకి ఆప్తునిగా, రాజకీయ చతురునిగా, నిరంతర ప్రజా సేవకునిగా, ముక్కుసూటి మనిషిగా మన్ననలందుకొన్నారు సీతారామయ్య. సామాన్య ప్రజలకు బ్యాంకులు అందుబాటులో లేని రోజుల్లో, అప్పులకోసం అన్నదాతలు ఎదురు తెన్నులు చూస్తున్న రోజుల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారాయన. 1906లో మచిలీపట్నంలో వైద్యవృత్తిని చేపట్టారు. గాంధీజీ పిలుపు మేరకు 1916 లో ఆ వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్య్రోద్య మంలో పాల్గొన్నారు. అంతే కాకుండా భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఎటువంటి వృత్తిని చేపట్టకూడదనే ధ్యేయంతో ముందుకు నడిచారు. 1948లో జైపూర్‌ కాంగ్రెస్‌ సమావేశం నాటికి కాంగ్రెస్‌ అధ్యక్షుని స్థాయి కి ఎదిగారు. 1952-57 మధ్యకాలంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవరించారు. నేడు దేశంలో ప్రముఖ బ్యాంకుగా చలామణి అవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను 1923లో స్థాపిం చాడు. అంతేకాకుండా ఈయన స్థాపించిన ఆంధ్ర ఇన్సూరెన్స్‌ కంపెని (1925), హిందు స్తాన్‌ ఐడియల్‌ ఇన్సూరెన్స్‌ కంపెని (1935) లు తరువాతి కాలంలో ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించారు. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన ఆయనకు రాష్ట్ర మంత్రి వర్గంలో అవకాశం తలుపుతట్టినా, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి పదవి గుమ్మం వరకు వచ్చినా సున్నితంగా తిరస్కరించి ప్రజాసేవలో, రాజకీయాల్లో మునిగిపోయిన మహనీయుడు డాక్టర్‌ పట్టాభి సీతారామయ్య. రావు బహదూర్ "కందుకూరి వీరేశలింగం పంతులు" గారు కందుకూరి వీరేశలింగం పంతులు (1848 -1919)- తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. విశిష్టత ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఆయనకున్న ఇతర విశిష్టతలు: మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే తెలుగులో తొలి నవల రాసింది ఆయనే తెలుగులో తొలి ప్రహసనం రాసింది కందుకూరి తెలుగుకవుల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు రచయిత ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసాడు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి ఆయన. యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. సాహిత్య విమర్శకుడుగా గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకం ఇవాల్టికీ గురజాడ కళా సృష్టికి దర్పణంగా నిలుస్తోంది. ‘ముత్యాల సరాలు’ ఛందస్సులో ఆయన తెచ్చిన గొప్ప మార్పుకి ప్రతీకగా నిలుస్తోంది. ‘తెలుగు కవిత్వంలో నేను కొత్త, ఎక్స్పెరిమెంట్‌ ఆరంభించాను. నా ముత్యాల సరాల రీతిని మీరు గమనించినట్లయితే మీకే ఈ విషయం ధృవపడుతుంది... నా మొదటి గేయంలో సాధ్యమైనన్ని వాడుక మాటలను, గ్రాంధిక వ్యాకరణ సూత్రాలకు, లేదా ప్రాచీన కవుల పద్ధతులకు ఒదగని శబ్దాలను ప్రయోగించాను’ అని ఆయన ఒక లేఖలో రాశారు. నాటక ప్రక్రియలో, కవితా వ్యాసంగంలో, వ్యవహారిక భాషకు పునాది వేసిన గురజాడ విమర్శన మార్గాన్ని కూడా అనుసరించాడు. ప్రత్యేకించి విమర్శనాత్మక రచనలు చేయలేదు. కాని లేఖల్లో, ‘అసమ్మతి పత్రం’లో ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన హేతువాద విమర్శనా దృష్టికి ఉదాహరణగా నిలుస్తాయి. నాటకంలో, కవిత్వంలో ఆయన కళాత్మక నైపుణ్యం కనిపించినట్టే, విమర్శకి సంబంధించిన ఆయన శాస్ర్తీయ ఆధునిక దృష్టిని ఆ అభిప్రాయాలు తెలియచేస్తాయి. రావి నారాయణరెడ్డి రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. 1908 జూన్ 4న జన్మించాడు. ఆంధ్ర మహాసభకు ఆధ్యక్షుడుగా పని చేశారు. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐలో చాలాకాలం పని చేశారు. రావి నారాయణరెడ్డి విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించారు. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకానికి, మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసినారు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌పై పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఖ్యాతి ఆయనకే దక్కింది. దామోదరం సంజీవయ్య దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. పారిశ్రామికాభివృద్దికి ప్రభుత్వంలో తెలుగు భాష వాడుక అధికం చేయడం, భూసంస్కరణల అమలు ఇలా ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలు ఆయన హయాంలో చేపట్టారు. బాల్యము మరియు విద్యాభ్యాసము : కొండా వెంకటప్పయ్య కొండా వెంకటప్పయ్య ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. ఆయన గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందినవాడు. సహాయ నిరాకరణోద్యమం రోజులలో బీహార్ కు డాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళనాడుకు రాజాజీ ఎలాంటివారో ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటివాడు. కృష్ణా పత్రికను స్టాపించి అక్షర శస్త్రాన్ని ఆంగ్లేయులపై సందించిన అక్షర సేనాని. శ్రీ పనప్పాకం ఆనందాచార్యులు తొలితరం జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒకరు పనప్పాకం ఆనందాచార్యులు. అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు. బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ సభకు హాజరైన 72 మంది ప్రతినిధుల్లో ఆనందాచార్యులు ఒకరు. పనప్పాకం ఆనందాచార్యులు, చిత్తూరు జిల్లాకు చెందిన కడమంచి గ్రామంలో 1843 సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి శ్రీనివాసాచార్యులు. వీరు చిత్తూరు జిల్లా కోర్టులో ఉద్యోగం చేశారు. తండ్రి మరణానంతరం ఆతని మిత్రుడైన సి. వి. రంగనాథ శాస్త్రులు సహాయంలో 1863లో మెట్రిక్యులేషన్, తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1865లో ఎఫ్.ఎ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చియప్పా పాఠశాలలో ఉపాధ్యాయునిగా 1969 వరకు పనిచేశారు. ప్రైవేటుగా చదివి 1869లో బి.ఎల్ పరీక్షలో ఉత్తీర్ణులై మద్రాసు హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులైన కావలి వెంకటపతిరావు వద్ద అప్రెంటిస్ గా పనిచేశారు. 1870లో వకీలుగా అనుమతిని పొంది హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులయ్యారు. మద్రాసులో న్యాయవాదుల కోసం ఒక అసోసియేషన్ స్థాపన చేయడంతో పాటు , న్యాయ విచారణ పద్దతులు, న్యాయవాదుల స్థితిగతుల మెరుగుదల కోసం చక్కని గ్రంధాలు శ్రీ అనంతాచార్యులు రచించారు. వీరు 1889లో మమద్రాస్ అడ్వకేట్స్ అసోసియేషన్ స్థాపించారు. శ్యామశాస్త్రి శ్యామశాస్త్రి, కర్నాటక సంగీతంలో ప్రముఖ వాగ్గేయకార త్రయంలో త్యాగరాజు , ముత్తుస్వామి దీక్షితుల సరసన నిలిచే తెలుగు పెద్దలలో శ్యామశాస్త్రి ప్రముఖులు. శ్యామశాస్త్రి వయస్సులో వారిద్దరికన్నా పెద్దవాడు. శ్యామశాస్త్రి తండ్రి విశ్వనాథ శాస్త్రి. ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని గిద్దలూరుకు సమీపంలోగల కంభం ప్రాంతీయులు. అయితే, 17వ శతాబ్దంలో తమిళనాడుకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. శ్యామశాస్త్రి అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము. అయితే, చిన్నతనంలో ముద్దుపేరుగా శ్యామకృష్ణ గా పిలుస్తూ, ఆ పేరే చివరకు వ్యవహరికంలో సార్ధకమైందని ఆయన శిష్యులు పేర్కొంటారు. తండ్రి విశ్వనాధ శాస్త్రి సంస్కృత, తెలుగు భాషలలొ పండితుడు కావడంతో- శ్యామశాస్త్రి చిన్నతనంలో తండ్రి దగ్గరే సంస్కృతాంధ్రభాషలు అభ్యసించాడు. సంగీతంలో తన మేనమామ దగ్గర స్వరపరిచయం కల్గినా, ఆ పిదప తంజావూరులో ‘సంగీత స్వామి’ అనబడే ప్రముఖ తెలుగు సంగీత విద్వాంసుని దగ్గర, తంజావూరులోని రాజాస్థానంలో సంగీత విద్వాంసుడైన శ్రీ పచ్చిమిరియము ఆది అప్పయ్య సహకారంతో సంగీత శాస్త్రాలలో మర్మములు ఎన్నో అధ్యయనం చేశాడు. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య, కడప జిల్లాలోని తాళ్ల్లఫాక గ్రామంలో మే 9, 1408 లో జన్మించాడు. పుట్టినప్పటినుండి, "తిరుమలప్పప్రసాదం" అని చెప్పందే ఉగ్గుకూడా త్రాగేవాడు కాదని ప్రతీతి. జోలపాటలలో వెంకటేశ్వరస్వామిపై పాడుతుంతేనే నిదురించెవాడట. చిన్ననాటినుండి ఆడిన మాటలెల్ల అమృత కావ్యంగా , పాడినపాటలెల్ల పరమగానాం "అన్నమయ్య కవితలు అల్లేవాడు. అన్నమయ్యకు 16వ ఏటనే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్లు చెప్తారు. స్వామి ఆదేశంతో ఏన్నోకీర్తనలు రచించాడు. అన్నమయ్య సనాతన వేదాలలోని జ్ఞానాన్ని సంకీర్తనల రూపంలో గానం చెసిన పద కవితా పితామహుడు. సుమారు 32 వేలకు పైగా సంకీర్తనలు తెలుగులో స్వయంగా రాసి గానం చెసిన ప్రప్రథమ సంకీర్తనాచార్యుదు అన్నమయ్య. తెలుగు సూర్యుడు సి.పి.బ్రౌన్ 1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి, నేటి వైభవానికి కారణబూతమైనవాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిషు అధికారులలో బ్రౌన్ ఒకడు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు. దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్.
జయహో బీసీ మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌ ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా? బీసీల పల్లకి మోస్తున్న జ‌న‌నేత సీఎం వైయ‌స్ జగన్‌ మళ్లీ వైయ‌స్‌ జగన్‌నే గెలిపించుకుందాం You are here హోం » వార్తలు » జలవనరులశాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష జలవనరులశాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష 21 Oct 2022 12:30 PM తాడేప‌ల్లి: జ‌ల‌వ‌న‌రుల శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తాజా వీడియోలు ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఎమ్మెల్యేలు, ఎంపీల స‌మావేశం వ‌ర్షాలు, వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ ముగింపులో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్వేగ ప్ర‌సంగం చేసిన పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌సంగం తాజా ఫోటోలు విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 5 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 4 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 3 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ 2 విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ `జ‌య‌హో బీసీ మ‌హాస‌భ` - ఫొటో గ్యాల‌రీ
Lockdown: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు భారీగా నమోదు కావడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించుకుంటున్నాయి... Subhash Goud | May 10, 2021 | 6:14 AM Lockdown: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు భారీగా నమోదు కావడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించుకుంటున్నాయి. ఇక తాజాగా తమిళనాడు రాష్ట్రం సోమవారం (నేడు) నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారమే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సంపూర్ణ లాక్‌డౌన్‌ నేటి నుంచి అమల్లోకి రానుంది. అయితే సోమవారం తెల్లవారుజామున 4 నుంచి 24వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు, ఆదివారాలు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు. సినిమా థియేటర్లు మూతపడ్డాయి. బీచ్‌లు, పర్యాటక ప్రాంతాలు, పార్క్‌లు, మ్యూజియం తదితరాలకు ప్రజలు వెళ్లేందుకు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో, నిబంధనలు మరింత కఠినతరం చేసేలా 6వ తేదీ నుంచి కూరగాయల మార్కెట్లు, ఇతర చిల్లర దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకే పనిచేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా సీఎం స్టాలిన్‌ జిల్లా కలెక్టర్లు, వైద్యనిపుణులతో చర్చించిన అనంతరం సోమవారం తెల్లవారుజామున 4 నుంచి 24వ తేది తెల్లవారుజామున 4 గంటల వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు- నిషేధం విధించనవి ► కేంద్ర హోంశాఖ అనుమతించిన మార్గాలు తప్ప, విదేశాలకు విమానసేవలు రద్దు చేసింది. ఈ నిషేధం రాష్ట్రంలో కూడా అమలులో ఉంటుంది. ► విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి విమానం, రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణికులతో సహా అందరికీ ఈ-రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. రాత్రి సమయాల్లో ప్రయాణికులు తమ టిక్కెట్లు చూపించి విమానాశ్రయానికి వెళ్లవచ్చు. ► మూడు వేల చదరపు అడుగులకు పైగా ఉన్న దుకాణాలు, వాణిజ్య కాంప్లెక్స్‌, మాల్స్‌ పనిచేసేందుకు గత నెల 26 నుంచి నిషేధం విధించారు. ఈ కాంప్లెక్స్‌లలో పనిచేసే కూరగాయలు, చిల్లర దుకాణాలపై కూడా నిషేధం విధించారు. కొన్నింటికి మధ్యాహ్నం 12 వరకు అనుతిచ్చారు. ► సంపూర్ణ లాక్‌డౌన్‌ కాలంలో మద్యం దుకాణాల మూసివేత. ► హోటల్స్‌, రెస్టారెంట్‌లలో పార్శిల్‌ సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. టీ దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకే పనిచేస్తాయి. ► హోటళ్లు, లాడ్జీల్లో కొత్తగా బసచేసేందుకు అనుమతి లేదు. వ్యాపార రీత్యా వచ్చే వారు, వైద్యరంగానికి సంబంధించిన వారికి మాత్రం అనుమతి ఉంటుంది. ► ఆడిటోరియం, మైదానాలు, కమ్యూనిటీ హాళ్లలో రాజకీయపార్టీల సమావేశాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్య, ఇతరత్రా కార్యక్రమాలపై నిషేధం. రాష్ట్రంలో బ్యూటీపార్లర్లు, సెలూన్లకు అనుమతి లేదు. ► సినిమా థియేటర్లు, వ్యాయామశాలలు, యోగా శిక్షణా కేంద్రాలు, రిక్రియేషన్‌ క్లబ్‌లు, అన్ని రకాల బార్లపై నిషేధం. ► ఇది వరకే ప్రకటించిన విధంగా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 20 మందికి మాత్రమే అనుమతి. ► కోయంబేడు మార్కెట్‌ చిల్లర విక్రయ దుకాణాలపై విధించిన నిషేధం కొనసాగింపు. ► అత్యవసర శాఖలు, సచివాలయం, వైద్య, రెవెన్యూ, పోలీసు శాఖలు, విపత్తుల నివారణ బృందాలు, హోంగార్డ్స్‌, అగ్నిమాపక, జైళ్ల శాఖ, విద్యుత్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, సాంఘిక సంక్షేమం, మహిళాభివృద్ధి శాఖల కార్యాలయాలు మినహా మిగిలిన అన్ని శాఖల కార్యాలయాలు మూసివేత. ► ఉద్యోగులు ఆయా కార్యాలయాలకు వెళ్లేలా రవాణా వసతి ఏర్పాటు. ఈ నిషేధం కేంద్రప్రభుత్వ కార్యాలయాలకు కూడా వర్తింపు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మూసివేత. అలాగే అన్ని బీచ్‌ ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతి లేదు. ► పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణా కేంద్రాలు, వేసవి శిక్షణా తరగతుల నిర్వహణపై నిషేధం. ► జిల్లాలకు వెళ్లే, జిల్లాల్లో నడిచే ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, టాక్సీలు, ఆటోల నిషేధం. వివాహాలు, అంత్యక్రియలు, ఇంటర్వ్యూలు, ఆస్పత్రులకు వెళ్లే వారు తగిన ఆధారాలతో వెళ్లేందుకు అనుమతి. లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు.. ► పాలు, దినపత్రికల వినియోగం, కొరియర్‌ సర్వీసులు, ఆస్పత్రులు, వైద్యపరీక్షల కేంద్రాలు, అంబులెన్స్‌లు, అంత్యక్రియలకు వెళ్లే వాహనాలు, సరకులు వాహనాలు, వ్యవసాయ ఉత్పత్తులు తరలించే వాహనాలు, ఆక్సిజన్‌, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ తీసుకెళ్లే వాహనాలకు అనుమతి. వ్యవసాయ సంబంధిత ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేసేందుకు అనుమతి. ► కూరగాయలు, పూలు విక్రయించే ఫుట్‌పాత్‌ దుకాణాలకు మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతి. ► చిల్లర దుకాణాలకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతి. ► మీడియా, పాత్రికేయులు యధావిధిగా పనిచేయవచ్చు. ► వివాహాలకు 50 మందికి, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి. ► డేటా సెంటర్లు, వైద్యం, రెవెన్యూ, బ్యాంక్‌, రవాణా మరియు ఇతర అత్యవసర పనులకు అనుమతి. ► గోడౌన్లలో సరకులు ఎగుమతి, దిగుమతి, కోల్డ్‌ స్టోరేజ్‌ గోడౌన్‌లలో పనులకు అనుమతి. ► రైల్వేస్టేషన్లు, హార్బర్లు, విమానాశ్రయాలు, సరుకుల రవాణా వెళ్లే ఉద్యోగులకు అనుమతి. ► బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు, బీమా సంస్థలు 50 శాతం మంది ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలి. ఇవీ కూడా చదవండి: COVID-19: గాలిలో కరోనా వైరస్‌ ప్రభావం ఎన్ని అడుగుల దూరం వరకు ఉంటుందో తెలుసా..? మరోసారి క్లారిటీ ఇచ్చిన సీడీసీ హైదరాబాద్‌లో విషాదం.. ఆక్సిజన్‌ అందక కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి.. కారణం ఏంటంటే..!