inputs
stringlengths
53
5.97k
targets
stringlengths
51
5.93k
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: పీర్ల పండుగ పూట సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగూర్ బీ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలప్ప నిర్మల దంపతులకు కుమారుడు శివ (10) మంగళవారం ఉదయం పీర్ల ఊరేగింపు ఉత్సవాలు చూసేందుకు ఇంటి బయట వచ్చి ఆడుతున్నాడు. అదే సమయంలో అక్కడ వేలాడుతున్న స్తంభం విద్యుత్ తీగ తెగి బాలుడు పై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుకుంటున్నాడు. అయితే విద్యుత్ తీగల సమస్యపై పలుమార్లు అధికారులు తెలిపిన పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం వల్లనే బాలుడు మృతి చెందినట్లు గ్రామస్తులు ఆవేదనతో తెలిపారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'పీర్ల పండుగ పూట నాగుర్ బీలో విషాదం...!'.
2
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: తిరుమల: తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామివారి సర్వదర్శనానికి భక్తులు 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సాధారణ సర్వదర్శనానికి 10 గంటల సమయం, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: కరివేపాకు ఆకులు ఎల్లప్పుడూ ప్రత్యేక రుచి వాసన వలన వంటలో అధిక రుచి కోసం ఉపయోగపడుతున్నయి. కానీ చాలా ఆకర్షణీయమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకులు ఎండబెట్టి లేదా వేయించి కూడా ఉపయోగిస్తారు.తాజా రూపంలో కూడా వంట మరియు మూలికా ఔషధాల కోసం కూడా చాలా ప్రజాదరణ పొందింది. ఆయుర్వేద ఔషధం లో, కరివేపాకు ఆకులు డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీమైక్రోబియాల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్జోనిక్ మరియు హెపాటో-రక్షణ (లక్షణాలు నుండి కాలేయాన్ని కాపాడుకునె సామర్ధ్యం) లక్షణాలు వంటి పలు ఔషధ లక్షణాలను కలిగి ఉన్నాయి . వేరులు శరీర నొప్పులు కోసం ఉపయోగిస్తారు. మరియు పాము కాటు ఉపశమనం కోసం బెరడును ఉపయోగిస్తారు. కరివేపాకు లో కనిపించే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్లు, శక్తి, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి మరియు ఖనిజాలు. ఇది నికోటినిక్ ఆమ్లం మరియు విటమిన్ సి, విటమిన్ A, విటమిన్ B, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్స్, ప్లాస్టీ స్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు మరియు ఫ్లేవానాయిడ్స్ వంటి వివిధ విటమిన్లను కలిగి ఉంటుంది. అలాగే, దాదాపు సున్నా కొవ్వు (100 g కి 0.1 గ్రా) వాటిలో కనిపిస్తుంది. కరివేపాకు లో ఉన్న ఇతర రసాయన పదార్థాలు కార్బాజోల్ అల్కలాయిడ్స్. కరివేపాకు ను ఆకులు గా గాని మరియు పేస్ట్ గా గాని తినడం మరియు ఆకులరసం గా గాని సేవించడం వలన డయేరియా ను నియంత్రించవచ్చు. ఆయుర్వేదంలో జీర్ణశయ సమస్యలకు కరివేపాకు ఉపయోగం సిఫార్సు చేస్తారు. కరివేపాకు ఆకుల నుండి రసం తయారు చేయండి మరియు నిమ్మరసం జోడించండి. ఈ మిశ్రమాన్ని అజీర్ణం కోసం తీసుకోవాలి లేదా ఆకులతో తయారు చేసిన పేస్ట్ ను మజ్జిగకు జోడించి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఫినిల్స్ వంటి కరివెపాకు ఆకుల లో కనిపించే రసాయన పదార్థాలు లుకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్, మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి క్యాన్సర్లకు సహాయపడతాయి. కరివేపాకు చెడు LDL కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించగలవు. కరివేపాకు జుట్టు మూలాలను బలపరుస్తుంది. ఆయిల్లో కలిపిన కరివేపాకు ఆకు పొడిని మీ జుట్టుకు రాయండి. రోజూ ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. కరివేపాకు అధిక స్థాయిలో విటమిన్ ’’ ఎ’’ ను కలిగి ఉంటాయి . అందువలన కంటి చూపుకు మంచిది. కంటి ఉపరితలం మిద ఉన్న కార్నియాను రక్షించే కెరోటినాయిడ్స్ విటమిన్’’ ఎ’’ లో ఉంటుంది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'కరివేపాకు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: హైదరాబాద్: ప్రయాణికులతో కూడిన మెట్రో రైలు మొదటి ప్రయాణం ఈ తెల్లవారుజామున ప్రారంభమైంది. నాగోల్-మియాపూర్ మధ్య మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. నగరవాసులు మెట్రో ప్రయాణం చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తొలి రోజు లక్ష మంది ప్రయాణికులు మెట్రో జర్నీని ఆస్వాదించనున్నట్లు అంచనా. మియాపూర్-నాగోలు నడుమ 18 రైళ్లు పరుగులు తీస్తూ 24 స్టేషన్లలో ఆగనున్నాయి. ఇరు చివరల గమ్యస్థానాల మధ్య 64 నిమిషాల ప్రయాణ సమయం పడుతుంది. మెట్రో సర్వీసు ప్రధాని చేతుల మీదుగా నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'మెట్రో మొదటి రైలు ప్రయాణం ప్రారంభం'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: ముంబై :ఈనెల 26వతేదీన బీసీసీఐ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి శ్రీనివాసన్కు అనుమతి లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆఫీస్ బేరర్లకే అనుమతి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక '26న బీసీసీఐ ప్రత్యేక సమావేశం'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్
ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. జవాన్లు- మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు నగేష్ మృతి చెందారు. మావోయిస్టు నాగేశ్ పై రూ. 9 లక్షలు రివార్డ్ ఉంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
1
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: గత ప్రభుత్వ హయాంలో జీసీసీలో జరిగిన అక్రమాలన్నింటిమీదా విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అధికారులను ఆదేశించారు. అటవీ ఉత్పత్తుల విలువను పెంచే ప్రాసెసింగ్ కేంద్రాలను పెంచాలని, ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని కూడా ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో శుక్రవారం గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జీసీసీ విసి ఎండి పి.ఎ. శోభతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జీసీసీలో పలు అక్రమాలు జరిగాయని, కోట్లాది రుపాయలు దుర్వినియోగమైయ్యాయని వస్తున్న ఆరోపణలపై సమగ్ర స్థాయిలో విచారణకు ఆదేశించారు. అక్రమాలు చేసి లక్షల రుపాయలు దుర్వినియోగం చేసిన వారిని బదిలీ చేయడంతోనో, సస్పెండ్ చేయడంతోనో సరిపెట్టకూడదని స్పష్టం చేసారు. లక్షలాది రుపాయలను దుర్వినియోగం చేసిన వారు ఆ డబ్బును వెనక్కి చెల్లించేస్తే చేసిన తప్పు ఒప్పయిపోతుందా.? అని ప్రశ్నించారు. అక్రమాలు జరిగాయంటూ చిరుద్యోగులపై చర్యలు తీసుకోవడం, కక్ష సాధించడం చేస్తూ, పెద్ద ఉద్యోగులను వదిలేయడం జరుగుతోందని కూడా తన దృష్టికి వచ్చిందని, ఇది ఏమాత్రం సమంజసం కాదని చెప్పారు. తప్పు చేసినట్లుగా తేలిన వారిపై తప్పనిసరిగా క్రిమినల్ కేసులు పెట్టాలని, దుర్వినియోగమైన డబ్బు మొత్తాన్ని ఖచ్చితంగా తిరిగిరాబట్టాలని పుష్ప శ్రీవాణి స్పష్టం చేసారు. ఈ విషయంగా తన దృష్టికి వచ్చిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ తప్పు చేసిన ఉద్యోగులను యధావిధిగా విధుల్లో కొనసాగించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేసిన తప్పులకు రెగ్యులర్ ఉద్యోగులను బాధ్యులు చేయడం కూడా భావ్యం కాదన్నారు. జీసీసీలో గత నాలుగేళ్లుగా ఆడిట్ జరగలేదని ప్రస్తావించారు. పూర్తి స్థాయిలో ఆడిట్ జరిపించి, ఆడిట్లో వెలికివచ్చే అక్రమాలపై కూడా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలోనైనా తప్పనిసరిగా అన్ని నిబంధనలు పాటించాలని, గతేడాది జీసీసీలో జరిగిన నియామక ప్రక్రియను పునస్సమీక్షించాలని సూచించారు. ఈ నియామకాల్లోనూ అక్రమాలు జరిగాయని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. అలాగే జీసీసీలో సేల్స్ మెన్లుగా చేరిన వారు ఇరవై, ముప్ఫై సంవత్సరాలు పని చేసినా వారికి పదోన్నతులు రాకపోగా సేల్స్ మెన్లుగానే రిటైర్డ్ అవుతున్నారని తెలిపారు. జీసీసీలో పని చేస్తున్న వారికి బోర్డు ఆమోదం తీసుకొని ప్రమోషన్లు కూడా ఇవ్వాలని ఆదేశించారు. జీసీసీలోని అన్ని వ్యవహారాలపై దృష్టి సారించి దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని శోభను ఆదేశించారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'పని చేసే ఉద్యోగులకు వారికి ప్రమోషన్లు ఇవ్వండిః ఉప ముఖ్యమంత్రి ఆదేశం'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
వరంగల్ : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో రామన్నగూడెం,లంబాడీ తండాలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు. వాగులో పేకాట ఆడుతున్న 7 గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రూ. 20 వేలు స్వాధీనం. కేసు నమోదు చేసిన ఏటూరు నాగారం పోలీసులు
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: ఓ మహిళాకు న్యాయం చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తక్షణం స్పందించారు. కాకినాడ జిల్లా అన్నవరంకు చెందిన రాజులపూడి ఆరుద్ర అనే మహిళ తన క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంపై సీఎం జగన్ స్పందించారు. ఆమె సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. అధికారులు ఆమెకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో కదిలిన అధికారులు ఆరుద్రను ప్రత్యేక అంబులెన్సులో తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. సీఎం ముఖ్యకార్యదర్శి ధనంజయరెడ్డి ఈ సందర్భంగా ఆరుద్రతో మాట్లాడి ఆమె సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆరుద్ర హర్షం వ్యక్తం చేశారు. తన సమస్యల పట్ల స్పందించడమే కాకుండా హామీ ఇచ్చిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. తన కుమార్తె చికిత్సకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారని, తన ఇంటిని అమ్ముకునేందుకు అడ్డుపడుతున్న పోలీసు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటామని కూడా భరోసా ఇచ్చారని ఆరుద్ర వెల్లడించారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'ఆ మహిళా సమస్యను తీర్చండి...అధికార్లు సీఎం వై.ఎస్.జగన్ ఆదేశం'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు దీవకొండ దామోదరరావు, బండి పార్థసారథి రెడ్డి. తెరాస రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు దీవకొండ దామోదరరావు, బండి పార్థసారథి రెడ్డి. తెరాస రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న గంగుల'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని కుట్రలు చేస్తోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27 నుంచి యువగళం పేరిట పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు. లోకేశ్ యువగళం పాదయాత్రను అడ్డుకుంటే రాష్ట్ర యువతను అడ్డుకున్నట్టేనని స్పష్టం చేశారు. యువతకు జరిగిన అన్యాయం, వారి సమస్యలు తెలుసుకునేందుకు లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ఈ కుట్రలో భాగమే జీవో నెం.1 అని అన్నారు. అదికాస్తా హైకోర్టులో పెండింగ్ లో ఉండేసరికి, డీజీపీని అడ్డుపెట్టి పాదయాత్రను ఆపాలని జగన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. "పొంతనలేని సమాచారం ఇవ్వాలని కోరుతూ డీజీపీ లేఖ రాయడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని స్పష్టమవుతోంది. జగన్ రెడ్డి, అతని ప్రభుత్వంపై యువతలో పెల్లుబుకుతున్న ఆగ్రహం, ఆవేశం, అసంతృప్తిని పోలీసులు, పాలకులు ఆపలేరని గుర్తుపెట్టుకోవాలి. యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ అధికారంలో కొనసాగిన దాఖలాలు లేవని జగన్ రెడ్డి తెలుసుకోవాలి. శాంతియుతంగా ర్యాలీలు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు రాజ్యాంగం భారత పౌరులకు స్వేచ్ఛనిచ్చింది. రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు చూస్తుంటే మనం భారతదేశం వంటి ప్రజాస్వామికదేశంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అని ఒక్కోసారి అనుమానం కలుగుతోంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేసుకునేందుకు రాజ్యాంగం అవకాశాలు కల్పించింది. కానీ జగన్ రెడ్డి పాలనలో అడుగడుగునా ఆటంకాలు, నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, అక్రమ కేసులు, బెదిరింపులు వంటి ఘటనలు చూస్తుంటే రాజ్యాంగం మన రాష్ట్రానికి వర్తించదా? అనే అనుమానం కలుగుతోంది. యువగళం కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకునేందుకు అనుమతులు కోరితే, డీజీపీ అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడగడం వైసీపీ పతనానికి తొలిమెట్టులా కనిపిస్తోంది. ప్రభుత్వం, డీజీపీ ఇప్పటికైనా స్పందించి రాజ్యాంగయుత, ప్రజాస్వామ్యయుత పాలన అందించాలని, యువగళాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ఆపాలని కోరుతున్నాం" అని యనమల డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా చేసిన పాదయాత్రలో యువతకు అనేక హామీలిచ్చి వాటిని గాలికొదిలేశాడని యనమల ఆరోపించారు. ప్రతి యేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పోస్టులు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించాడని వివరించారు. "రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రాకముందు ఉన్న 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీలిచ్చి వాటి ఊసెత్తలేదు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక యువతకు స్వయం ఉపాధి అవకాశాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత జగన్ రెడ్డి దోపిడీ విధానాలతో తీవ్రంగా నష్టపోయారు. చంద్రబాబు పాలనలో యువతకు స్వయం ఉపాధికి సంబంధించి ప్రత్యేకంగా పథకాలుండేవి. వాటిని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశాడు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి యువతను మోసం చేశాడు. ఉన్నత చదువులు చదివిన యువతన నేడు ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక పెడదారి పడుతున్నారు. జగన్ రెడ్డి మోసకారి హామీలపై యువత ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని యువతే ఆశగా ఎదురు చూస్తున్నారు" అని వివరించారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'పాదయాత్రను జగన్ రెడ్డి, అతని దొంగల ముఠా అడ్డుకొనే ప్రయత్నం చేస్తోంది'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: వైసీపీ ప్రభుత్వానికి గద్దె దింపుదామని టీడీపీ నాయకులు పిలుపు నిచ్చారు. శనివారం చిలమత్తూరు మండలంలోని కోడూరు పంచాయతీ వడ్డిపల్లి గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బేకరీ గంగాధర్, మాజీ ఎంపీటీసీ సూర్యనారాయణ, శ్రీదేవి, నాగార్జున, గాజుల కిష్టప్ప, గంగాధర్, నారాయణప్ప, వెంకటేశులు తదితరలు పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం: టీడీపీ'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: వరంగల్: కలెక్టరేట్లో అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ కాకతీయ పనులపై అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. మిషన్ కాకతీయ పనులు వేగవంతం చేయాలని, నాలుగోదశ కాకతీయ పనులను పూర్తి చేసి ప్రథమస్థానంలో నిలిచేలా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. మిషన్కాకతీయ పనులపై జిల్లా కలెక్టర్లు వారానికోసారి సమీక్ష జరపాలని సూచించారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'జిల్లా కలెక్టర్లు వారానికోసారి సమీక్ష జరపాలి : కడియం శ్రీహరి'.
2
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రియల్ హీరో అని మెచ్చుకున్నారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఈ రోజు నూతన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చెయ్యబోతున్న జగన్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లేఖ రాసారు ఈ లేఖ లో ఆయన ఏం పేర్కొన్నారంటేముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్మోహన్ రెడ్డి గారికి.నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్న శుభ సందర్భంలో మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మంత్రివర్గ విస్తరణలో మీ నిర్ణయం ‘సామాజిక విప్లవానికి నాంది’ గా నేను భావిస్తున్నానను. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మంత్రి మండలి ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీ, బలహీన మైనారిటీ వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యత కల్పించటం అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఐదుగురు ఉపముఖ్యమంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ, కాపులకు కేటాయించడం మీ ఉన్నత నాయకత్వ లక్షణాలకు నిదర్శనం. ఎవరు ఊహించని విధంగా ఎనిమిది మంది బీసీలకు, ఐదుగురు ఎస్సీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం భవిష్యత్తు రాజకీయాలకు మార్గదర్శకం గా నేను భావిస్తున్నాను. పరిణితి చెందిన ప్రజా నాయకుడిగా మీరు స్పీకర్ పదవి బీసీలకు, డిప్యూటీ స్పీకర్ పదవి బ్రాహ్మణులకు కేటాయించడం చాలా మంచి నిర్ణయం.ప్రజల అఖండ అభిమానం చూరగొన్న నాయకుడిగా, పిన్న వయసులోనే ప్రజానేతగా ఎదిగిన మీరు ‘రాజకీయాలలో రియల్ హీరో’. మీరు, మీ మంత్రిమండలి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలనే ధ్యేయంగా ముందడుగు వేస్తారని నా గట్టి నమ్మకం. రాష్ట్ర పురోభివృద్ధిలో మీ పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడబోతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోకి ముఖ్యమంత్రి హోదాలో మీరు తొలిసారిగా అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లుయూ.వి.కృష్ణంరాజు; కేంద్ర మాజీమంత్రివర్యులుబీజేపీ సీనియర్ నాయకులు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'మీరు హీరో...జగన్ని అభినందిస్తూ రెబల్స్టార్ లేఖ'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: కాపు నిధులపై శ్వేత పత్రం విడుదల కోసం పవన్ కల్యాణ్ డిమాండ్...
కాపు నిధులపై శ్వేత ప్రతం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కులాల మధ్య విద్వేషాలు పెంచేలా ప్రచారం చేస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. కాపు కార్పొరేషన్కు ఇప్పటి వరకు ఏ బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఎంత ఖర్చు చేశారో తెలపాలని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘వెనుకబడిన జాతికి రిజర్వేషన్లు పునరుద్ధరించాలని చేస్తున్న ఆందోళన నుంచి కాపుల దృష్టి మరల్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నాటి పాలకులు తెలివిగా కాపు కార్పొరేషన్ను ఏర్పాటు చేసి సమస్య నుంచి కొంత వరకు కాపులను ఏమర్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పెద్దలు మరింత తెలివితేటలతో ‘గాలికిపోయే పేలాల పిండి కృష్ణార్పణం’ అన్న రీతిలో ఏ పథకం కింద లబ్ది చేకూర్చినా అది కాపులను ప్రత్యేకంగా ఉద్దరించడానికేనని గొప్పలు చెబుతున్నారు. నవరత్నాలను కూడా కలిపేసి అంకెలను అమాంతం పెంచేశారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: మునుగోడు ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బోనమెత్తారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీల నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయనకు అధిష్ఠానం కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఈరోజు గ్రామాల్లో తీసిన బోనాల్లో పాల్గొన్న మంత్రి. మహిళలతో పాటు ఆయన కూడా బోనమెత్తారు
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'బోనమెత్తిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ పేటీఎంకి చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పిపిబిఎల్) తమ యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 211 టోల్ ప్లాజాల్లో ఆటోమేటిక్ క్యాష్లెస్ చెల్లింపులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నూతన సేవలతో ఇకపై పేటీఎం యూజర్లు తమ ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపుల కోసం ఇతర బ్యాంకుల్లా ప్రత్యేక ప్రీపెయిడ్ ఖాతా సృష్టించాల్సిన అవసరం లేదు. దీనితో దేశంలోనే అతిపెద్ద ఫాస్ట్ట్యాగ్లను జారీ చేసే బ్యాంకుగా అవతరించిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన ట్యాగ్లతో 5 మిలియన్ వాహనాలను కలిగి ఉంది. అంతేకాక, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్ఇటిసి) ప్రోగ్రాం కింద ఏర్పాటైన అతిపెద్ద ఆర్జిత బ్యాంకుగా కూడా అవతరించింది. త్వరలోనే మరో 100 టోల్ ప్లాజాలను సొంతం చేసుకోవడంతో పాటు రాబోయే 3 నెలల్లో ఫాస్ట్ ట్యాగ్ అమ్మకాలలో 100% వృద్ధిని సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేటీఎం ప్రకటించింది. వాహన యజమానులు తమ వెహికిల్ రిజిస్ట్రేషన్ నంబర్ & సర్టిఫికేట్ వంటి కనీస డాక్యుమెంటేషన్తోనే ఫాస్ట్ ట్యాగ్ను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. అంతేకాక, కొనుగోలుదారుడు అందజేసిన రిజిస్టర్డ్ చిరునామా వద్ద ఫాస్ట్ ట్యాగ్ ఉచితంగా పంపిణీ చేయబడుతుందిని పేర్కొంది. టోల్ చెల్లింపు సమయంలో పేటీఎం వ్యాలెట్ నుండి వినియోగదారుడి డబ్బు ఆటో డెబిట్ అవుతుందని, దీని కోసం ఇతర బ్యాంకుల్లా ప్రత్యేక ప్రీపెయిడ్ అకౌంట్ సృష్టించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'పేటీఎం యూజర్లకు శుభవార్త'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: మహబూబ్ నగర్ జిల్లా భూత్పుర్ పరిధిలో అడ్డాకుల మండలం వర్నే గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం పేరిట ఇసుకను త్రవ్వి డబల్ బెడ్ రూమ్ నిర్మాణానికి తరలిస్తున్నారని గ్రామస్థులు బుధవారం నిరసన చేపట్టారు. ఊక చెట్టు వాగులో ఇసుక తీయడం వల్ల వ్యవసాయ పొలాలకు బోర్లు ఎండిపోయి భూగర్భ జలాలకు నీరు అందక పంటచేలు ఎండిపోతాయని గ్రామస్తులందరూ ఇసుక టిప్పర్లను అడ్డుకుంటున్న పోలీస్ అండ దండాలతో ఇసుక టిప్పర్లను తరలిస్తున్నారని వాపోయారు. ట్రిప్పర్లను అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని గ్రామస్తులు ను, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇక్కడ ఇసుక తరలించకూడదని అనుమతులు రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపడుతున్నామని వారు పేర్కొన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: హయత్ నగర్ లో చెడ్డి గ్యాంగ్ అరెస్ట్
హయత్ నగర్ లో చెడ్డి గ్యాంగ్ అరెస్ట్ చేశారు. గత నెలలో చెడ్డి గ్యాంగ్ ఆరు దోపిడిలు చేశారు. రాచకొండ పోలీసులు చెడ్డి గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 150 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: 2019-20 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక రెవెన్యూ లోటు ఆంధ్రప్రదేశ్లో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ లోటు ఏర్పడిందని సీతారామన్ వెల్లడించారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న అమ్మ ఒడి, ఉచిత విద్యుత్ వంటి ఉచిత పథకాల వల్ల ఏపీలో రెవెన్యూ లోటు ఎక్కువగా ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లోపంతో లోటు పెరిగిందని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు .
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ఉచిత పథకాలతో ఏపీలో అత్యధిక రెవెన్యూ లోటు: నిర్మలా సీతారామన్'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: జగనన్నకి చెబుదాం కార్యక్రమానికి ప్రజలనుండి వచ్చిన వినతులను సత్వరమే నాణ్యమైన పరిష్కారం చూపాలని మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన వినతులు శాఖల వారిగా సత్వరం పరిష్కరించాలని సూచించారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'అర్జీలను సత్వరమే పరిష్కరించాలి'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: బాధితులకురూ. 2 లక్షల చెక్కు అందజేసిన మంత్రి రజిని
రేపల్లెలో అత్యాచారానికి గురైన దళిత మహిళ బంధువులకి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని రెండు లక్షల రూపాయల చెక్కును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళ సంరక్షణకై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. బాధిత మహిళ కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండగా ఉంటుందని మంత్రి రజిని అన్నారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: నితీష్ రాణేకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
సింధుదుర్గ్ కోర్టు శుక్రవారం బిజెపి ఎమ్మెల్యే నితీష్ రాణే మరియు అతని సహాయకుడు రాకేష్ పరబ్ హత్యాయత్నం కేసుకు సంబంధించి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ విధించింది.కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణే కుమారుడు నితీష్ రాణే బుధవారం కోర్టులో లొంగిపోవడంతో రెండు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. రాణే కుటుంబానికి చెందిన సిటాడెల్ అయిన కంకావలి పట్టణంలో శివసేన కార్యకర్త సంతోష్ ఎం. పరాబ్పై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నితేష్ రాణేతో సహా మొత్తం ఎనిమిది మంది నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేశారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: విషాదం... లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య
పుణెలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే. శ్రద్ధా శివాజీ జయభే (28) అనే మహిళ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ పుణెలో ఉంటోంది. ఆమెకు వివాహమైంది. ఆమె భర్త ఇండియన్ నేవీలో ఉద్యోగిగా పనిచేస్తూ కేరళలో ఉంటున్నాడు. వారికి నాలుగేళ్ల పాప ఉంది. శ్రద్ధా తల్లిదండ్రులు, ఆమె మామ అహ్మద్ నగర్ లో ఉంటుండగా. పాపను బంధువుల ఇంట్లో ఉంచి శ్రద్ధా రోజూ విధులకు వెళ్లేది. ఆదివారం రాత్రి కూడా బంధువుల ఇంట్లో కూతురిని వదిలి డ్యూటీకి వెళ్లిన శ్రద్ధా. తిరిగి బంధువుల ఇంటికి రాలేదు. ఆమె ఇంట్లోనే ఉరేసుకుని కనిపించింది. పాపను తీసుకెళ్లేందుకు ఉదయాన్నే శ్రద్ధా రాకపోవడంతో. బంధువులు ఇంటికి వెళ్లి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్కు లోనైన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య విభేదాల గురించి పోలీసులు ఆరా తీశారు. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయంతో నాలుగేళ్ల పాప తల్లి ప్రేమకు దూరమైంది. శ్రద్ధా ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేదని. అలాంటి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం నమ్మశక్యంగా లేదని తోటి ఉద్యోగులు చెప్పారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక ఆమె మృతికి సంబంధించిన కారణాలపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.
1
['tel']
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: భారతదేశానికి ఆల్ ద బెస్ట్...మైత్రీ దేశమైన ఇండియాకు శుభాకాంక్షలు: పుతిన్
భారతదేశానికి ఆల్ ద బెస్ట్. మైత్రీ దేశమైన ఇండియాకు శుభాకాంక్షలు అంటూ మోడీకి రష్యా దేశాధినేత పుతిన్ వినూత్నంగా విషేష్ చెప్పారు. దీనికి ఓ కారణముంది. ఉజ్బెకిస్థాన్లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిన్న పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగింది. అయితే, మోదీ మర్నాడు (17న) బర్త్ డే జరుపుకుంటున్న విషయం తెలిసి కూడా పుతిన్ విషెస్ చెప్పలేదు. మోదీకి తాను ఎందుకు విషెస్ చెప్పడం లేదో వివరిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని పుతిన్ వెల్లడించారు. ‘‘నేను ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. నా ప్రియ మిత్రుడు మోదీ రేపు బర్త్ డే జరుపుకుంటున్న విషయం నాకు తెలుసు. కానీ నేను ఆయనకు ఇప్పుడు విషెస్ చెప్పను. రష్యా సంప్రదాయం ప్రకారం ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పకూడదు. అందుకనే నేనిప్పుడు ఆయనకు విషెస్ చెప్పడం లేదు’’ అని అన్నారు. ఆ తర్వాత పుతిన్ కొనసాగిస్తూ. ‘‘ మీ బర్త్ డే విషయం నాకు తెలుసన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. భారతదేశానికి ఆల్ ద బెస్ట్. మైత్రీ దేశమైన ఇండియాకు శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో దేశం మరింత శ్రేయస్సు సాధించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. కాగా, నేటితో మోదీ 72వ పడిలోకి ప్రవేశించారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: కర్ణాటక తీర ప్రాంతంలో పునరుత్పాదక ఇంధనం కోసం దాదాపు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం తెలిపారు.ఇటీవల ముగిసిన ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశంలో పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్ శక్తి మరియు సముద్రపు నీటి నుండి అమ్మోనియా ఉత్పత్తిపై రాష్ట్రం సుమారు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడిని అంచనా వేస్తోందని, కోస్తా జిల్లాల్లో భారీ పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు.ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, తద్వారా ఈ ప్రాంత యువతకు అవకాశాల ద్వారాలు తెరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'కోస్తా ప్రాంతంలో పునరుత్పాదక ఇంధనం కోసం భారీ పెట్టుబడి : కర్ణాటక సీఎం బొమ్మై'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది అనే చెప్పొచ్చు. నియోజకవర్గం లోని నేత పరుచూరి సుభాష్ చంద్ర బోస్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముందు చూపు లేని ప్రభుత్వ విధానాలతో విసిగి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఘంటసాల, చల్లపల్లి మండలాలను ప్రభావితం చేయగల నేత పార్టీని వీడటంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో సుభాష్ చంద్రబోస్ కలసి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి జగన్కు ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా జగన్ పరిపాలన చేస్తారని ఆశిస్తే మోసపు మాటలతో ప్రజలను వంచించారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ నిర్మాణంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పేదల బ్రతుకు భారం కావడంతో పార్టీని విడుతున్నానని ఆయన ప్రకటించారు. కాగా సుభాష్ చంద్రబోస్తో పాటు ఆయన అనుచరులు, 50 మంది ముఖ్య నేతలు వైసీపీని వీడుతున్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: అన్నమయ్య జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ గిరీష మంగళవారం రాయచోటి లోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో సోమవారం ఆయన జేసీ తమీమ్ అన్సారియాతో కలిసి అధికారులతో సమీక్షించారు. మదనపల్లె పీలేరు జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి 455. 18 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు సర్వే సంఖ్య 676 లో 172. 683 ఎకరాలు సేకరించామని అధికారులు తెలిపారు. మంగంపేట ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పునరావాసం కింద ఎన్ని కోట్లు ఖర్చు చేశారో నివేదించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేసి బాధితుల జాబితాలు సిద్ధం చేయాలని, బాధిత కుటుంబాలు పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఓబులవారిపల్లె మండలంలో భూ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దారు పీర్ మున్నీని ఆదేశించారు. ఆయా సమావేశాల్లో ఎన్హెచ్ఎఐ పీడీ హరికృష్ణ, రాయచోటి, మదనపల్లె, రాజంపేట ఆర్డీవోలు రంగస్వామి, మురళీ, కోదండరామిరెడ్డి, ఏపీఎండీసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'భూ సేకరణ పనులు వేగవంతం చేయండి'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: 24గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : కేసీఆర్
సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్ర అగ్రస్థానంలో నిలిచిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ… అన్ని రంగాలకు 24గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మిషన్ భగీరథ వల్ల తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందన్నారు. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సాగునీటి వసతి ఏర్పడిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప, ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు ఉద్భోదించారు. pic.twitter.com/hLb2un1Rqm
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: దేవాలయంలో దుండుగుడు చోరీకి యత్నం...
జవహర్నగర్లోని శ్రీలక్ష్మి నర్సింహ దేవాలయంలో దుండుగుడు చోరీకి యత్నించాడు. హుండీ ఉన్న నలబై వేల నగదు, అమ్మవారి, స్వామివారి బంగారు, వెండి నగలను దుండగుడు ఎత్తుకెళ్లాడు. దీన్ని గమనించిన స్థానికులు దొంగ ఒడుసు నర్సింహను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆపై పోలీసులకు అప్పగించారు. గతంలో కూడా ఇదే దేవాలయంలో దొంగతనం చేసాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: ఉగాది పండుగ సందర్భంగా చిరు వ్యాపారులు తమ ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నారు. సికింద్రాబాద్ రసూలుపురలో కొందరు చిరు వ్యాపారులు మామిడి కాయలను అధిక ధరలకు అమ్ముతున్నారు. ఒక్క మామిడికాయ ఏకంగా 50 రూపాయలకు అమ్ముతున్నారు. దీనితో పాటు మిగితా నిత్యావసర ధరలు కూడా మండిపోతున్నాయని జనాలు వాపోతున్నారు. ధరలు ఎంత పెంచిన జనాలు మాత్రం తగ్గకుండా భారీగా మోహరించి వాళ్లకు కావలసిన వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం అధిక ధరలకు అమ్ముతే చర్యలు తీసుకుంటామని చెప్పిన పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'ఇష్టానుసారంగా ధరలు పెంచిన వ్యాపారులు...!'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం డీఈవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ సైదులు రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు, అతడిని పట్టుకున్నారు. కళాశాల పునరుద్ధరణ కోసం సీనియర్ అసిస్టెంట్ లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ అధికారులు సైదులు నివాసంలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ప్రొఫెసర్ భారతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని, తాను అధ్యాపకురాలిగా పనిచేసిన యూనివర్సిటీకే వీసీ కావడం ఆనందంగా ఉందని తెలిపారు. అంతకుముందు యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్ భారతి బాధ్యతలు'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: విజయవాడ, మేజర్న్యూస్: 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికలో పేర్కొన్న లక్ష్యాలను సాధించే దిశగా బ్యాంకర్లు కషి చేయాలని మంత్రి పుల్లారావు కోరారు. ఆంధ్రా బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను మంత్రి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకర్లను ఉద్దేశించి మంత్రి పుల్లారావు మాట్లాడుతూ 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు మొత్తం రూ 19,600.39 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వీటిలో అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ. 11,634.97 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ మొత్తంలో వ్యవసాయ రుణాలకు రూ 9,020.32 కోట్లు, ఇతర రుణాలకు రూ. 1,829.67 కోట్లు కాగా మౌలిక సదుపాయాలకు, ఇతర కార్యక్రమాలకు రూ. 784.98 కోట్లు కేటాయించామన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'వార్షిక లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయండి'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: 19 రోజు కొనసాగుతున్న బహుజన రాజాధికారం యాత్ర
బిఎస్పి పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యాధికారం యాత్ర 19 రోజు నార్కెట్ పల్లి మండల కేంద్రంలో ప్రారంభమై ఏపీ లింగోటం, పోతినేని పల్లి గ్రామంలో కొనసాగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి గ్రామంలోని ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. యాత్రలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజల ను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి మేడి ప్రియదర్శిని, బహుజన సమాజ్ వాది పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: తమిళనాడు కరోనా అప్డేట్
తమిళనాడులో మంగళవారం 187 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి మరియు కరోనా కేసులు 35,91,043కి చేరుకున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది.ఈ రోజు ఎటువంటి మరణాలు సంభవించలేదు మరియు మొత్తం మరణాల సంఖ్య 38,048 వద్ద మారలేదు అని బులెటిన్ తెలిపింది.గత 24 గంటల్లో 390 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో మొత్తం 9,768 శాంపిళ్లను పరీక్షించగా, ఇప్పటి వరకు చేసిన పరీక్షల సంఖ్య 6,97,20,304కి చేరుకుందని బులెటిన్లో పేర్కొంది.
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించాలని ఆస్పత్రుల అసోసియేషన్ డిమాండ్
‘‘నెట్వర్క్ ఆస్పత్రులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఈ నెలాఖరులోగా బిల్లులు విడుదల చేయాలి. లేకుంటే మే 1వ తేదీ నుంచి ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు చేయలేం’’ అని ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ హెచ్చరించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో ఎంఎన్ హరీంద్రప్రసాద్కు ఈ మేరకు లేఖ రాసింది. నెట్వర్క్ ఆస్పత్రులన్నీ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్నాయని, చివరికి డాక్టర్లకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. కొంతకాలంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నెట్వర్క్ ఆస్పత్రులకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించడం లేదు. కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో అసోసియేషన్. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకు ఘాటు లేఖ రాసింది. 2022 జూలై తర్వాత ఉద్యోగుల హెల్త్స్కీమ్కు సంబంధించిన బిల్లులు చెల్లించలేదని పేర్కొంది. ఆగస్టు 2022 తర్వాత ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయలేదని తెలిపింది. కాగా అసోసియేషన్ లేఖ రాసిన విషయాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కొట్టిపారేసింది. తమకు ఎవరూ ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని, ఈ ప్రచారంలో నిజం లేదని పేర్కొంది.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: మామూళ్లు వసూలు చేస్తున్న కానిస్టేబుల్ పై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. వర్ధన్నపేట కానిస్టేబుల్ పై డీజీపీ విచారణకు ఆదేశించారు. ఇసుక ట్రాక్టర్ల యజమానుల నుంచి కానిస్టేబుల్ వసూళ్లు చేయడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన కానిస్టేబుల్ వసూళ్ల వ్యవహారంపై డీజీపీ ఆగ్రహించారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'కానిస్టేబుల్ మామూళ్ల వసూళ్లపై డీజీపీ సీరియస్'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: రష్యాకు ఉక్రెయిన్ బిగ్ షాకిచ్చింది. జఫ్రోజియా అణు విద్యుత్ కేంద్రాన్ని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంది. శుక్రవారం అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటించి అణు విద్యుత్ కేంద్రాన్ని 24 గంటల్లోనే తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దీంతో రష్యాకు ఎదురుదెబ్బ తగిలినట్టైంది. మరో వైపు రష్యా బలగాలను ప్రజలు, సైనికులు తిప్పికొడుతున్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'రష్యాకు షాకిచ్చిన ఉక్రెయిన్'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: గణేశ్ నిమజ్జనం సందర్భంగామద్యం దుకాణాలు బంద్
హైదరాబాద్ మహా నగరంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఈ మేరకునగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేస్తూ, 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని అన్నిమద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఈఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని, వారిపై కాసులు నమోదు చేయాలనీ ఆయా పోలీస్స్టేషన్ ఎస్హెచ్వోలు, అదనపు ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా మరో వైపు వినాయక నిమజ్జనం జరిగే ట్యాంక్ బాండ్ తో సహా పలు ప్రాంతాలలో భారీఎత్తున పోలీసులను ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: మే 3 నుంచి జరిగిన ఎన్కౌంటర్లలో 33 టెర్రరిస్టులు హతమయ్యారు : మణిపూర్ సీఎం
మే 3న మణిపూర్లో జాతి హింస చెలరేగినప్పటి నుంచి భద్రతా బలగాలతో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో కుకీ తీవ్రవాద సంస్థలకు చెందిన కనీసం 33 మంది "ఉగ్రవాదులు" మరణించారని ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ఆదివారం తెలిపారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో సమావేశం నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వివిధ జిల్లాల్లో పౌరులపై దాడులు చేస్తున్న కుకీ ఉగ్రవాదులపై భద్రతా బలగాలు అనేక జిల్లాల్లో భారీ కూంబింగ్ ఆపరేషన్లు ప్రారంభించాయని చెప్పారు. పౌరులకు వ్యతిరేకంగా అధునాతన ఆయుధాలను ఉపయోగిస్తున్న ఈ "ఉగ్రవాదులకు" వ్యతిరేకంగా ప్రతీకార మరియు రక్షణాత్మక కార్యకలాపాలలో, ఈ "ఉగ్రవాదులలో" 33 మంది వివిధ ప్రాంతాలలో మరణించారని మరియు కొంతమంది "ఉగ్రవాదులను" కూడా భద్రతా దళాలు అరెస్టు చేశాయని సింగ్ చెప్పారు. ముఖ్యంగా లోయ జిల్లాల్లోని పరిధీయ ప్రాంతాల్లో నిరాయుధ పౌరులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముఖ్యమంత్రి మీడియాకు తెలిపారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వ్యవస్థలో దేశానికే ఆదర్శంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రశ్నోత్తరాల సందర్భంగా ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ 2016లో కేంద్రం ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది అవార్డులు రాష్ట్రానిరద వచ్చాయని అన్నారు. ఈ పరిణామాన్ని అభినందించాల్సింది పోయి, మరో రకంగా మాట్లాడటం ప్రతిపక్షాలకు తగదని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను మరింత అధిగమించడానికి ప్రభుత్వం 'సింగిల్ డిజిట్' విధానాన్ని తీసుకువస్తుందని చెప్పారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8 అవార్డులూ రాష్ట్రానికే వచ్చాయి'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్తే చితక్కొట్టారు
అర్ధరాత్రి ప్రియురాలిని రహస్యంగా కలిసేందుకు వెళ్లిన వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. ఈ ఘటన యూపీలోని బలరామ్ పూర్ ప్రాంతంలో జరిగింది. సోనూ అనే వ్యక్తి తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్లగా గ్రామస్థులు స్తంభానికి కట్టేసి ఫ్యాంటు విప్పేసి చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో దాడి చేసిన 15 మందిపై కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: మరో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్ : ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం నుంచి నాలుగురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్టు బుధవారం హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఓ మోస్తరుగా ప్రారంభమై. తర్వాత భారీ వర్షాలుగా మారనున్నట్టు తెలిపింది. శుక్రవారం (ఈనెల 25) నుంచి 27వ తేదీవరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మిర్యాలగూడ, రామన్నపేట, కొణిజెర్లలో 4 సెంటీమీటర్ల చొప్పున, తల్లాడ, సదాశివనగర్, లింగంపేట, బాల్కొండ, నల్లగొండలో రెండు సెంటీమీటర్లు, సూర్యాపేట, కంపాసాగర్, దుమ్ముగూడెం, జూరాల, మెట్పల్లి, పర్వతగిరి, గాంధారి, చంద్రుగొండ, మహబూబ్నగర్ ప్రాంతాల్లో ఒక సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ పేర్కొన్నది.
1
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: ఎరువుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కొల్లిపర మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్ ను వారం రోజులపాటు ఎరువుల లైసెన్సు సస్పెండ్ చేసినట్లు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కె వెంకటరావు వెల్లడించారు. ఎరువులకు సంబంధించి బిల్లులలో ఉన్న బ్యాచ్ నెంబర్లకి భౌతికంగా ఉన్న బస్తాల బ్యాచ్ నెంబర్లకి తేడాను గమనించామన్నారు. ఎవరైనా ఎరువులు నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'ఎరువుల దుకాణాల లైసెన్స్ సస్పెండ్'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: హర్యానాలో మరోసారి జాట్ ఆందోళనల టెన్షన్ మొదలైంది. రిజర్వేషన్ల కోసం జాట్ లు మరోసారి ఢిల్లీ వేదికగా ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఢిల్లీ-హర్యానా హైవేపై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో జాట్లు జాతీయ రహదారులను ముట్టడించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన సందర్భాలున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'ఢిల్లీ-హర్యానా హైవేపై భారీ బందోబస్తు ఏర్పాటు'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: కాప్రా: హైదరాబాద్ కుషాయిగూడ పరిధిలోని రాధిక సిగ్నల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న మహిళ పైనుంచి టిప్పర్ వెళ్లడంతో ఆమె దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఈసీఐఎల్లోని ఏపీపీఐఐసీ కాలనీకి చెందిన కోలాటి సరిత స్కూటీపై ఇంటికి వస్తుండగా రాధిక సిగ్నల్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ. స్కూటీని ఢీకొట్టింది. ఆమె తలపైనుంచి టిప్పర్ ముందు టైరు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సరిత ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త కోలాటి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టిప్పర్ డ్రైవర్ నరేందర్ అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. డ్రైవర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'స్కూటీపై వెళ్తున్న మహిళను ఢీకొట్టిన టిప్పర్'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: రాష్ట్రంలో లంచం లేనిదే ఏపనీ జరగడం లేదని, మన ప్రభుత్వం రాగానే లంచాలు లేని సంక్షేమ పాలన అందిస్తానని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని కొయ్యలగూడెంలో జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రతి గ్రామంలో మాఫియాను తీసుకొచ్చారన్నారు. బర్త్ సర్టిఫికెట్ కు లంచం… డెత్ సర్టిఫికెట్ కు లంచం ఇవ్వాల్సిందేనన్నారు. డ్వాక్రా, పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేయకుండానే చేశామని చెప్పుకున్నారని జగన్ అన్నారు. ప్రజలకు అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉంటామని అన్నారు. ఉచిత బోర్లు వేయిస్తామన్నారు. 9గంటల ఉచిత కరెంట్ ఇస్తానన్నారు. రాష్ట్రంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఏపని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిందేనన్నారు. పొదుపు సంఘాలకు చెల్లించాల్సిన బాకీలను ఎగ్గొట్టారన్నారు. మోసం చేయడంలో చంద్రబాబుకు ఎవరూ సాటిరారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబు ప్రజలు గుర్తొస్తారన్నారు. ఇప్పుడు మోసం చేసింది చాలదన్నట్లు మరోసారి మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'రైతన్నకు అండగా ఉంటాం : జగన్'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: ఆత్మరక్షణకు యుద్ధ విన్యాసాలు ఎంతో అవసరం
ఆత్మరక్షణకు యుద్ధ విన్యాసాలు ఎంతో ఉపయోగపడతాయని అనంతపురం డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. నగర శివారులోని ఆర్డీటీ క్రీడా మైదానంలో 4వజాతీయ కర్రసాము పోటీలను మంగళవారం డీఎస్పీ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రాచీన యుద్ధకళల్లో ఒక్కటైన కర్రసామును ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎ్సఏ చీఫ్ కోచ వెంకటరమణ, స్టేడియం మేనేజర్ శ్రీదేవి, జాతీయ కర్రసాము అసోసియేషన వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రమోహన, అధ్యక్షుడు రోసిబాబు, ముక్కోటి అంబికా సేవాట్రస్టు డైరెక్టర్ శివ, ఆ సంఘం సభ్యులు నాగరాజు, వన్నూర్, వాణి, మౌనిక పాల్గొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: గాజువాక గణేష్ నగర్ కొండపై కొలువై ఉన్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం లో విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ గోవిందమాంబ ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరణం రెడ్డి నరసింగారావు ప్రత్యేక ఆహ్వానితులుగా సిరసపల్లి నూకరాజు బాటా శ్రీనివాసరావు గుటూరు శంకర్రావు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివకోటి శ్రీనివాసరావు మహిళా ప్రధాన కార్యదర్శి తిరుమల రాణి ఆలయ కమిటీ సభ్యులు గణపతి పంతం బ్రహ్మం మరియు మాత గోవింద మాంబ కార్యక్రమ నిర్వాహకులు కాకుమాను వెంకట వేణు, కంచర్ల గౌరీశంకరాచారి దంపతులుఇతర మహిళ భక్తులు, భక్తులు పాల్గొన్నారు.శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మరియు మాత గోవింద మంబా కు పట్టు వస్త్రములు సమర్పించి విశేష పూజలు జరిపారు.ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కర్ణం రెడ్డి నరసింగరావు, శేషపల్లి నూకరాజు, బాటా శ్రీనివాసరావు గుంటూరు శంకర్రావు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు.అనంతరం జరిగిన సభ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు శివకోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పీ. ఎం విశ్వకర్మ కౌశల్ యోజన రాబోయే తరంలో మా జాతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కొనియాడారు.ముఖ్యఅతిథి కర్ణంరెడ్డి నరసిగ రావు మాట్లాడుతూ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞాన కర్త సుమారు 400 సంవత్సరంల క్రితమే ఆనాటి సామాజిక, సాంఘిక దురాచారాలపై పోరాటం చేసిన సంఘసంస్కర్త అయినటువంటి ధర్మపత్ని శ్రీ మాతా గోవింద మాంబ అమ్మవారు ఆరాధన మహోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం మనందరికీ శుభ పరిణామమే.ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షులు శివకోటి శ్రీనివాస్ రావు ప్రధాన కార్యదర్శి గిడిజాల పార్వతీశం ఆచారి , ఉపాధ్యక్షులు శివప్రసాద్ , అప్పలరాజు, రాయల లక్ష్మణ్, పక్కి కొండబాబు, తిరుమల రాణి ఉపాధ్యక్షురాలు భవ్య పలువురు సంఘ నాయకులు, గాజువాక స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి గుంటపల్లి ప్రసాద్, సుంత్యన గణపతి పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'ఘనంగా శ్రీ మాతా గోవింద మాంబ ఆరాధన ఉత్సవం'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: చెన్నై: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు చెన్నై చేరుకున్నారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివప్రసాద్ ను చంద్రబాబు పరామర్శించారు. శివప్రసాద్ ఆరోగ్యంపై వైద్యులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'మాజీ ఎంపీ శివప్రసాద్ ను పరామర్శించిన చంద్రబాబు'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా.బుధవారం జిల్లాలోని మహేశ్వరం మండలం గొల్లూరులో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రులు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. మిషన్ భగీరథ నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం అంశాల వారీగా గ్రామాభివృద్ధిపై సమీక్షించారు. గ్రామానికి మిషన్ భగీరిథ నీరు వస్తుందా? ట్రాక్టర్ గ్రామంలో ఎన్ని గంటల నుంచి తిరుగుతున్నది? డంపింగ్ యార్డు పని చేస్తున్నదా? తడి పొడి చెత్త వేరు చేసి ఎరువులు తయారు చేస్తున్నారా? ఎంత మేర ఆదాయం సమకూరుతుంది? వైకుంఠ ధామం పనిలోకి వచ్చిందా? వినియోగిస్తున్నారా? సంక్షేమ పథకాలు వస్తున్నాయా? వంటి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామం నుంచి బడి పిల్లల కోసం బస్ ను వేయిస్తామమని చెప్పారు. గొల్లూరులో మహిళలకు స్త్రీ నిధి కింద రూ.3 లక్షల వరకు నిధులు అందజేస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ. గ్రామానికి సంక్షేమ పథకాలు అన్నీ కలిపి కోటి రూపాయలను ప్రభుత్వం ఇస్తున్నది. గతంలో ఇలా ఎప్పుడైనా వచ్చిందా? గత ప్రభుత్వాలు ఏమి చేశాయి? ఈ ప్రభుత్వం ఏమి చేసింది? అనే విషయాన్ని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. 70 ఏళ్ల నుంచి కానిది ఎనిమిదేండ్లలో సాధించి చూపారని ఆయన ప్రశంసించారు.కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని సర్వ నాశనం చేశారు. కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఎంపీ కార్యక్రమంలో డాక్టర్ జి రంజిత రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'టీఆర్ఎస్ పాలనలోనే ప్రగతి పరుగులు : మంత్రి ఎర్రబెల్లి'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: సింగరేణిలో పేలుడు... నలుగురు మృతి
పెద్దపల్లి జిల్లాసింగరేణి ఒపెన్ కాస్ట్ 01 ప్రాజెక్టు లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఫేజ్ 2లో బ్లాస్టింగ్ కోసం పనులు నిర్వహిస్తుండగా ఈ పేలుడు జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలపై తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. పరేడ్ తో కూడిన వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించిందంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మెజారిటీ కోల్పోయారని మాజీ ముఖ్యమంత్రి బిజెపి నేత యెడ్యూరప్ప అన్నారు. రెబల్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశం లేదని ఆయన చెప్పారు. శాసనసభలో కుమారస్వామి విశ్వాసపరీక్ష రేపు జరుగనున్నది. ఈ విశ్వాస పరీక్షకు హాజరు కావాలా? వద్దా? అనేది రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేల ఇష్టమని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్న విషయాన్ని యెడ్యూరప్ప ఉటంకించారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'మెజారిటీ కోల్పోయిన కుమారస్వామి : యెడ్యూరప్ప'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: నిబంధనలను ఉల్లంఘిస్తున్నవారిపై కొరఢా ఝలిపిస్తున్న ఈడీ తాజా విదేశీ కంపెనీలపై నజర్ పెట్టింది. ఇదిలావుంటే స్వేచ్ఛా వాణిజ్యం పేరిట చైనా అనేక దేశాల మార్కెట్లను కబళిస్తోందన్న ఆందోళనలు ఎప్పటినుంచో ఉన్నాయి. పలు దేశాల మార్కెట్లలో స్థానిక కంపెనీలపై చైనా సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తూ చైనా వాణిజ్యాన్ని అంతకంతకు విస్తరిస్తున్నాయి. అయితే ఈ ముప్పును పసిగట్టిన భారత్ నిబంధనలు పాటించని చైనా కంపెనీలపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. సరిహద్దుల్లో చైనా బలగాలను ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో, ఈ డ్రాగన్ దేశం సాగిస్తున్న ఆర్థిక దండయాత్రను కట్టడి చేయడం కూడా అంతేముఖ్యమని భారత్ భావిస్తోంది. తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో చైనా కంపెనీలు తీవ్రస్థాయిలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న విషయం వెల్లడైంది. వందకు పైగా యాప్ లు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) కన్నుగప్పి భారత్ నుంచి చైనాకు వేల కోట్ల రూపాయలు చేరవేస్తున్నట్టు ఈడీ గుర్తించింది. భారత గడ్డపై కంపెనీలు ఏర్పాటు చేసి, డమ్మీ డైరెక్టర్లను నియమిస్తున్నారని ఈడీ వర్గాలు వెల్లడించాయి. కొంతకాలం తర్వాత చైనా వ్యక్తులు భారత్ కు వచ్చి ఈ కంపెనీల్లో డైరెక్టర్లుగా చేరుతున్నారని ఆ వర్గాలు వివరించాయి. అందుకు కొందరు చార్టర్డ్ అకౌంటెంట్లు సాయపడుతున్నారని ఆరోపించాయి. ఈ చైనా యాప్ లలో అత్యధికం లోన్ యాప్ లు, డేటింగ్ యాప్ లు, బెట్టింగ్ యాప్ లు ఉన్నాయని వెల్లడైంది. ఈ యాప్ లను చైనా నుంచి నియంత్రిస్తున్నట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. వీటిలో ఒక్క బెట్టింగ్ యాప్ లే రూ.1,300 కోట్ల మేర ఆదాయం రాబట్టాయని ఈడీ పేర్కొంది. రెండేళ్ల కిందట చైనా డేటింగ్, బెట్టింగ్ యాప్ లకు సంబంధించి హెచ్ఎస్ బీసీ బ్యాంకులోని రూ.47 కోట్లను స్తంభింపజేసిన ఈడీ. ఆ తర్వాత పేటీఎం, క్యాష్ ఫ్రీ, రేజర్ పే వంటి చెల్లింపుల యాప్ లపై దృష్టి సారించింది. ఈ కంపెనీలు తమ అత్యున్నత స్థాయి ఆర్థిక లావాదేవీలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)కి నివేదించకపోవడంపై అనుమానించింది. దీనికి సంబంధించి గత వారంలో రూ.17 కోట్లను స్తంభింపజేసింది.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'నిబంధనలు ఉల్లంఘిస్తున్న చైనా కంపెనీలపై ఈడీ కొరఢా'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: అకాల వర్షంతో రైతుల ఆవేదన
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున అకాల వర్షంతో అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత రాత్రి భారీ వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. గత పది రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వ చేసినప్పటికీ తూకం వేయకపోవడంతో తమకు నష్టం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన నియామకాలు
వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఎన్హెచ్ఎంలో వివిధ ప్రోగ్రాం కింద కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ పద్ధతిన వైద్య నిపుణులు, మెడికల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పోస్టుల భర్తీ కి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హతలు గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ నాగేశ్వ రరావు ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వెస్ట్గోదావరి.ఏపీ.జీవోవీ. ఐఎన్ లేదా ఏలూరు.ఏపీ.జీవోవీ.ఐఎన్ వెట్సైట్లలో పొందుపరిచిన దర ఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, విద్యార్హతల ఒకసెట్ ఫొటోస్టాట్ కాపీల ను జత చేసి ఏలూరు జిల్లా డీఎంహెచ్వో కార్యాలయంలో ఈ నెల 13 నుంచి 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా అందజేయాలని కోరా రు. పోస్టుల సంఖ్య పెంచేందుకు, తగ్గించేందుకు కలెక్టర్ అధక్షతన గల డీఎస్సీకి పూర్తి అధికారాలు ఉన్నాయని వివరించారు.
1
['tel']
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: మరో వివాదంలోో నందకుమార్ ...తాజాగా ఇంకో కేసు నమోదు
ఇటీవల ఎమ్మెల్యేల కోనుగోలు వ్యవహారంతో వెలుగులోకి వచ్చిన నందకుమార్ పై తాజాగా మరో కేసు నమోదయింది. పార్టీ మారాల్సిందిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ అలియాస్ నందుపై బంజారాహిల్స్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు బంజారాహిల్స్కి చెందిన రియల్టర్ సిందర్కర్ సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందకుమార్పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 2018లో వికారాబాద్ జిల్లా దోమ మండలం భోంపల్లి గ్రామంలో 12 ఎకరాల వ్యవసాయ భూమిని సతీష్కు నందకుమార్ మధ్యవర్తిగా ఉండి ఇప్పించాడు. భూమి కొనుగోలుకు సంబంధించి యజమానికి ఇవ్వాల్సిన మొత్తాన్ని సతీష్ అప్పట్లోనే చెల్లించాడు. అయితే భూమి ఇప్పించినందుకు నందుకుమార్కు సతీష్ కమిషన్ ఇస్తానని చెప్పాడు. కానీ తనకు కమిషన్ వద్దని, తన పేరుపై భూమి రాయాలని నందకుమార్ తనను పలుమార్లు బెదిరించినట్లు సతీష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నందకుమార్ బెదిరించడంతో తాను రూ.21 లక్షలు ఇచ్చానని, ఆ తర్వాత మళ్లీ బెదిరించడంతో మరో రూ.11 లక్షలు చెల్లించి తనను వదిలేయాలని, ఇంకోసారి బెదిరించవద్దని కోరానని సతీష్ చెబుతున్నాడు. కానీ రెండు నెలల క్రితం నందకుమార్ మళ్లీ తనకు ఫోన్ చేసి డబ్బులు కావాలని బెదిరించాడని సతీష్ పోలీసులు తెలిపాడు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, తాను డిప్యూటీ సీఎం కాబోతున్నానని చెబుతూ మరిన్ని డబ్బులు కావాలని బెదిరించినట్లు సతీష్ తన ఫిర్యాదుతో పేర్కొన్నాడు. సతీష్కు 2017లో తన స్నేహితుడి ద్వారా నందకుమార్ పరిచయం అయ్యాడు. ఫిలింనగర్ రోడ్డు నెంబర్ 1లో నందకుమార్ ఫిల్మీ జంక్షన్ పేరుతో హోటల్ నిర్వహించేవాడు. హోటల్ నిర్వహణ కోసం సతీష్ దగ్గర అప్పుడప్పుడు నందకుమార్ డబ్బులు తీసుకునేవాడు. అలా పలుమార్లు డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించేవాడు. అలా సతీష్కు నందకుమార్పై మరింత నమ్మకం ఏర్పడటంతో. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్గా మారిపోయారు. అలా నందకుమార్ మధ్యవర్తిగా ఉండి సతీష్కు 12 ఎకరాల భూమి ఇప్పించగా. అప్పటి నుంచి డబ్బుల కోసం తనను బెదిరించేవాడని సతీష్ చెబుతున్నాడు. 'ఇన్నాళ్లూ అతడు బెదిరించినా తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నందకుమార్ పట్టుబడిన తర్వాత అతడిపై చాలా కేసులు నమోదయ్యాయి. అతడు ప్రస్తుతం జైల్లో ఉండటంతో ధైర్యం తెచ్చుకుని ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశా' అని సతీష్ తెలిపాడు. సతీష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో నందకుమార్ ఉన్నారు.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: పసుపు పంటను ఈ నెలాఖరు వరకు కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు పసుపు తడిచిందని ఇన్నాళ్లు కొనుగోలు చేయని ప్రభుత్వం. పసుపు సేకరణపై జూన్ 1న ఇచ్చినట్టు చెప్తున్న జీవో ఇంతవరకు సంబంధిత శాఖలకు చేరలేదన్నారు. ఈ నెల 12వ తేదీ వరకే 20వేల టన్నుల పసుపు కొమ్ముల సేకరణ జరుగుతుందని జీవో ఇవ్వడం అసమంజసమని పేర్కొన్నారు. పసుపు సేకరణ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించి, రైతుల వద్ద ఉన్న మొత్తం సరుకు కొనుగోలు చేయాలని ఒక ప్రకటనలో ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'పసుపు రైతులని ఆదుకోవాలి'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: 15 మున్సిపాలిటీలు కైవసం
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతున్నది. ఇప్పటికే వైసీపీ 15 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. మాచర్ల, పిడుగురాళ్ల, పులివెందుల, పుంగనూరు, డోన్, ఆత్మకూరు, పలమనేరు, కనిగిరి, కొవ్వూరు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకున్నది. మిగతా మున్సిపాలిటీల్లో కూడా వైసీపీ హవా కనిపిస్తోంది. మెజారిటీ మున్సిపాలిటీల్లోని వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత కొనసాగుతోంది.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను రాయండి: చంద్రయాన్-3 విజయవంతం సందర్భంగా ధర్మవరం పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ విద్యార్థులు వినూత్న శైలిలో ఇస్రో వారికి అభినందనలు తెలియజేశారు. పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి నిర్మలా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇస్రో సైంటిస్టులను స్పూర్తిగా తీసుకొని విద్యార్థులందరూ భవిష్యత్తులతో గొప్ప గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రాంగణమంతా 'జయహో ఇస్రో. 'జయహో భారత్' అనే నినాదాలతో మారుమ్రోగింది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'ఇస్రో సైంటిస్టులకు వినూత్నశైలిలో అభినందనలు'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: జగన్పై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ పై మెగాస్ఠార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైరా మూవీ సందర్భంగా జగన్ ఇచ్చిన అతిథ్యాన్ని తాను ఎప్పటికి మరిచిపోలేనని చిరంజీవి అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ తీసుకున్న నిర్ణయాలకు చిరు మద్దతిచ్చారు. వైఎస్ కుటుంబంతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని. సాక్షి దినపత్రిక ప్రారంభోత్సవంలో తాను పాల్గొన్నానని చిరంజీవి తెలిపారు. అంతేకాదు సాక్షి ఛానెల్లో జరిగిన పలు అవార్డు ఫంక్షన్లకు కూడ తాను హాజరయ్యాయని. ఆ సమయంలో వైఎస్ భారతి ఇచ్చిన గౌరవం తనను చాలా ఆకట్టుకుందని చిరంజీవి అన్నారు. ఇక జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం వచ్చిందని. కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోయాయని. అదే సమయంలో జగన్ ను ఫోన్ చేసి అభినందించినట్లు తెలిపారు. ఇక తాను నటించిన సైరా మూవీని పలువురు నాయకులకు చూపించాలని అనుకున్నానని అన్నారు. అదే క్రమంలో సీఎం జగన్ అపాయింట్ మెంట్ అడిగినట్లు మెగాస్ఠార్ తెలిపారు. అయితే జగన్ తనను ఆఫీస్ కు పిలుస్తారేమో అనుకున్నానని. ఊహించని విధంగా తనను ఇంటికి పిలిచారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. సైరా విడుదలైన తరువాత సతీసమేతంగా జగన్ ఇంటికి వెళ్లారు చిరు. ఆ సందర్భంగా జగన్ దంపతులు తమకు ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిలేనని చిరంజీవి అన్నారు. ఇక పిలుపు వస్తే వైసీపీలోకి వెళతారా…? అన్న ప్రశ్నకు మెగాస్టార్ తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని. కానీ ఎవరూ మంచి చేసినా అభినందిస్తానని స్పష్టం చేశారు. మూడు రాజధానుల కాన్సెప్ట్ తనకు నచ్చిందని. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నానని. అందుకే ఆ ప్రతిపాదనకు తాను మద్దతు ఇచ్చాచని చిరంజీవి అన్నారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నమోదు చేసిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కు కొన్ని రోజుల ముందు టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు వ్యక్తులు యత్నించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు తాజాగా ఆ స్టేను ఎత్తి వేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చంటూ హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను పెండింగ్ లో పెట్టింది. మొయినాబాద్ పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ లో ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దిశగా రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ లు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుగానే పోలీసులకు సమాచారం అందజేయగా. నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే నిందితుల కస్టడీకి తొలుత ఏసీబీ కోర్టు నిరాకరించగా. పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల రిమాండ్ కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు. కేసు దర్యాప్తుపై మాత్రం స్టే విధించింది. తాజాగా దర్యాప్తుపై స్టేను హైకోర్టు ఎత్తివేసింది. నిందితుల రిమాండ్ కు కూడా పోలీసులు ట్రయల్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు కీలక మలుపు... స్టే ఎత్తేసిన హైకోర్టు'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: 'హీరో ఎక్స్ పల్స్' ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభం
మోటార్ సైకిల్స్, స్కూటర్లకు సంబంధించి ప్రపంచపు అతిపెద్ద తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ తన అధునాతన మోటార్ సైకిల్ ఎక్స్ పల్స్ 200 ఫోర్ వాల్వ్ ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభించింది. మొదటి బ్యాచ్ విక్రయాలు పూర్తయిన నేపథ్యంలో రెండో బ్యాచ్ విక్రయాల కోసం బుకింగను ఆమోదించడం ప్రారంభించింది. వెల రూ. 130, 150 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ), తిరుగులేని కొనుగోలు అనుభూతిని అందించే కంపెనీ ఆన్లైన్ విక్రయ వేదిక అషాప్ పై రూ. 10 వేలు అడ్వాన్స్ మొత్తం చెల్లించడం ద్వారా దీనిని బుక్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా హీరో మోటో కార్ప్ సేల్స్, ఆఫ్టర్ సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ మాట్లాడుతూ, ఉత్కృష్ట సాంకేతికత, ఆధునిక డిజైన్, విలక్షణ అప్పీల్ లో హీరో ఎక్స్ ప్లస్ 200 ఎప్పుడూ సాటిలేని అనుభూతిని అందిస్తుందని చెప్పారు.
1
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీలోని 4 వ వార్డులో గల సాయిబాబా మందిరంలో కార్తీక మాసం పురస్కరించుకుని గురువారం కోటి దీపాల ఆరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాగా ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'కోటి దీపోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: శఠగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు. గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తారు. ఆలయ పూజారి శఠారిని తీసుకువచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహ బుద్ధులు నశిస్తాయని చెబుతారు. అంతే కాదు శఠగోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలని పండితులు చెబుతారు. భగవంతుడి పాదాల చెంత మన కోరికలు. శఠగోపాన్ని కొన్ని ప్రాంతాలవారు శఠగోపం, శడగోప్యం అని అంటారు. భక్తులు దేవాలయంలో ప్రదక్షిణలు చేసి దర్శనమయ్యాక తీర్థం, శఠగోపం తీసుకుంటారు. శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైనవాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది. వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి. ఇది తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచుతారు. శఠగోపం పెట్టినప్పుడు మన కోరికలను తలచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లవుతుంది. శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా అర్ధం. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది అందరి భావన. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు. సైన్స్ పరంగా ఎన్నో ఫలితాలు? శఠగోపం తలమీద పెట్టించుకోవడం వలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా ఎన్నో ఫలితాలు కలుగుతాయి. శఠగోప్యమును తలమీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్., దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బయటకెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి. శఠగోపం మీద స్వామి / అమ్మవారి పాదాలుంటాయి. అంటే మనం కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే శఠగోప్యము. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది. దేవాలయంలో దర్శనమయ్యాక తీర్థం, శఠగోప్యం తప్పక తీసుకోవాలి. చాలమంది దేవుడి దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చకచకా వెళ్ళి ఏకాంత ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి శఠగోప్యం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుంచి దూరంగా ఉంటామని తలస్తూ తలవంచి తీసుకోవటం మరో అర్థం. సహజంగా చిల్లర లేకపోవటం వల్ల చాలామంది శఠగోపం పెట్టించుకోకుండా వేదిలేస్తుంటారు. అలా చేయకుండా శఠగోపం పెట్టించుకొని భగవంతుని పాదాలవద్ద మన కోరికను మనసులో చెప్పుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇకనుంచి మీరు కూడా ఎప్పుడైనా దేవాలయానికి వెళ్లినప్పుడు శఠగోపం ఖచ్చితంగా పెట్టించుకోండి.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'శఠగోపం వెనక దాగివున్న రహస్యం?'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: మట్టి ఎద్దుల అమావాస్య పూజలు
గద్వాల్ జిల్లా కేటిదొడ్డి మండలంలోని కుచినెర్లలో బుధవారం మట్టి ఎద్దుల అమావాస్య పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రామకృష్ణ నాయుడు, సర్పంచ్ హైమావతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్ర మానికి శ్రీగురు శంబులింగేశ్వర స్వామి హజరై మట్టితో తయారు చేసిన ఎద్దులను గ్రామంలోని ఊరేగించారు. అనంతరం గ్రామంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: మేడ్చల్ జిల్లా మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్ధంతి సందర్భంగా, సైనిక్పురి చౌరస్తాలో ఉన్న వారి విగ్రహానికి కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ అధ్యక్షులు పిట్టల శ్రీను, ఉపాధ్యక్షులు ఉపేందర్రెడ్డి, ఎస్ ఆర్ ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, చెన్నా రెడ్డి, శివ, రాజు, మహేష్, శంకర్రావు, నరేష్, ధరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: జనసేనాని పోటీ ఎక్కడి నుంచో?
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. పోలింగ్కు ఇంకా నెల రోజుల గడువు సైతం లేకపోవడంతో నియోజకవర్గాల్లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు అంశంపై కసరత్తులో రాజకీయ పార్టీలు తలమునకలయ్యాయి. తెదేపా 130 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రేపో, ఎల్లుండో ఆ జాబితా విడుదల చేయనుంది. మరోవైపు, మొత్తం జాబితాను ఒకేసారి విడుదల చేసేందుకు వైకాపా వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రత్యామ్నాయం తామేనంటూ తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్న జనసేన ఇప్పటికే ఇద్దరు లోక్సభ అభ్యర్థుల జాబితాను వెల్లడించగా. త్వరలోనే అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేయనుంది. వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేనాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలుత అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించినా. ఏ నియోజకవర్గం నుంచి అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఏడాది క్రితం ఆయన ఉత్తరాంధ్రలోని ఏదో ఒక జిల్లా నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత పవన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించినా పోటీపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాది ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ ఇక్కడి నుంచే పోటీ చేస్తానేమో అంటూ వ్యాఖ్యానించారు. కానీ ఆ తర్వాత పవన్ పోటీకి సంబంధించిన ఎలాంటి విషయమూ బయటకు రాలేదు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో పవన్ పోటీ చేసే స్థానంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. విశాఖ జిల్లా గాజువాక పేరు కూడా తెరపైకి వచ్చింది. పిఠాపురం లేదా విశాఖ జిల్లా గాజువాక నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్ ఎక్కడి నుంచి పోటీచేస్తారనే ఉత్కంఠకు మరికొద్ది రోజుల్లోనే తెరపడనుంది.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోన మండలంలో ఇసుక అక్రమ తరలింపు ఆగడం లేదు. వేట్లపాలెం రోడ్డులో లారీలతో ఇష్టారీతిన అనుమతుల్లేకుండా తరలిస్తున్నారు. వేట్లపాలెం నుంచి అడవిపేటకు రూ. 80లక్షలతో ఇటీవల తారురోడ్డు వేశారు. లారీలు ఇసుక లోడుతో తిరగడంతో రోడ్డు త్వరగా పాడయ్యేలాఉంది. దీనిపై గత నెలలో రామస్వామితోట సమీపంలో గ్రామస్థులు లారీలను అడ్డుకున్నారు. అంతకుముందు సెబ్ అధికారులు కేసు నమోదు చేశారు. ఇసుక తరలింపు మాత్రం ఆగలేదు. లారీలపై యథేచ్ఛగా ఇసుకను మితి మీరిన వేగంతో తరలిస్తున్నారు. దీనిపై పలువురు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'తూర్పు గోదావరి జిల్లాలో యథేచ్ఛగా ఇసుక తరలింపు'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: విశాఖలో సంచలనం సృష్టించిన దిశా కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు హత్యలో నలుగురికిపైగా వ్యక్తులు పాల్గొన్నట్లు అంచానకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితురాలు వసంత, ఆమె సోదరి మంజులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దివ్యను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అత్యంత పాశవికంగా దివ్య హత్య నిందితులు దివ్య కాళ్లు, చేతులను కట్టేసి పెద్ద అట్లకాడతో అత్యంత పాశవికంగా ఒళ్లంతా వాతలు పెట్టినట్లు గుర్తించారు. బాధితురాలకి గుండు కొట్టించి, కనుబొమ్మలను సైతం తొలగించారు. దాదాపు ఐదారు రోజులపాటు భోజనం కూడా పెట్టకుండా చిత్రహింసలు పెట్టారు. ఒళ్లంతా గాయాలు చేసి అయిదారు రోజులు ఆహారం పెట్టకపోవడంతో దివ్య మరణించింది. మృతురాలి శరీరంపై 33 గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. హత్య చేసిన రోజే మృతదేహాన్ని తరలించడానికి నిందితులు ప్రయత్నం చేశారు. రాత్రి అంతిమయాత్ర వాహన యాజమాని నాయుడును సంప్రదించారు. ఎంత డబ్బైనా ఇస్తామని, శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలించాలని ఒత్తిడి చేశారు. దివ్య శరీరంపై గాయాలను గమనించిన నాయుడు పోలీసులకు విషయాన్ని తెలిపాడు. ఫోర్త్ టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలతోనే? దివ్యను తన ఇంట్లోనే ఉంచి వసంత అనైతిక కార్యకలాపాలకు ఉపయోగించి డబ్బు సంపాదించేది. ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య ఆర్ధిక విషయాల్లో విభేదాలు తలెత్తాయి. దీంతో వసంత నుంచి బయటకి వెళ్లిపోవాలని దివ్య నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో దివ్యపై కక్ష పెంచుకున్న నిందితులు క్రూరంగా హత్యచేసినట్లు తెలస్తోంది.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'దిశ కేసులో సంచలన నిజాలు'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: రాష్ట్రంలో ఇంకా ఒమిక్రాన్ రాలేదు : మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో ఒమిక్రాన్ వస్తే ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీకాల విషయంలో ప్రజలు నిరాసక్తత పనికిరాదని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ తప్పక రెండు డోసులు తీసుకోవాలని. కరోనా జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ఓల్డ్ బోయిన్ పల్లిలో ఇంటింటికీ తిరుగుతూ రెండో డోసు టీకాపై అవగాహన
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: ఆంధ్రప్రదేశ్లోనూ పార్టీ పెట్టాలని కోరుతున్నారని తెరాస ప్లీనరీ సందర్భంగా ఆపార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. దీనిపై నిన్న మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇవ్వగా. పేర్ని నాని, కేసీఆర్ వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా రేవంత్ రెడ్డి స్పందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో మరోసారి స్పందించారు.తెలంగాణలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అందుకే ఓ ఐపీఎస్ అధికారి రాజీనామా చేసి మరీ పార్టీ పెట్టారని, మరి కొన్ని పార్టీలు కూడా వచ్చాయని మంత్రి వ్యాఖ్యానించారు. ఏపీలో 151 స్థానాలు వచ్చిన తర్వాత శూన్యత ఎక్కడుందని మంత్రి ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల గుండెల్లో ఎక్కడా శూన్యత లేదన్నారు. మరోవైపు నదీ జలాల వినియోగం విషయంలో కేసీఆర్ మాట తప్పారని మంత్రి వ్యాఖ్యానించారు. దిండి - పాలమూరు ప్రాజెక్టు నుంచి తాగునీరు పేరుతో సాగుకు మళ్లించారని ఆయన ఆరోపించారు. ఏపీకి కేటాయించిన నీటిలో అదనంగా చెంచాడు నీళ్లు కూడా వినియోగించుకోబోమని ఎప్పుడో చెప్పామని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంత దూరమో. విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా అంతే దూరమని గమనించాలన్నారు. నిత్యం రాజకీయాల్లో ఉండాలనుకునే రేవంత్రెడ్డి వంటి వాళ్లు సంచలనాల కోసం ఏ అంశంపై అయినా ట్వీట్లు చేస్తారని పేర్ని నాని అన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'తెలంగాణలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయ : పేర్ని నాని'.
2
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: కర్ణాటకలో మూడో ఓమిక్రాన్ కేసు నమోదు
దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ వచ్చిన తర్వాత కర్ణాటకలో కోవిడ్ యొక్క ఓమిక్రాన్ వేరియంట్ యొక్క మూడవ కేసును నివేదించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె సుధాకర్ ఆదివారం తెలిపారు.దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వస్తున్న 34 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేట్ చేసి చికిత్స అందిస్తున్నారు. 5 ప్రైమరీ, 15 సెకండరీ కాంటాక్ట్లను గుర్తించామని, శాంపిల్స్ను పరీక్ష కోసం పంపామని తెలిపారు.
1
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త. భార్య చేతులు నరికేశాడు. దీంతో బాధితురాలిని భోపాల్ లోని హమిదియ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే. రణ్ధీర్ అనే వ్యక్తి రెండు నెలల క్రితం ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన 15 రోజులకే అతడు తన భార్యను అనుమానించడం మొదలెట్టాడు. ఆమె ఎవరితో మాట్లాడినా అభ్యంతరం చెప్పేవాడు. ఈ క్రమంలో సోమవారం కట్టెలు తీసుకురావాలనే సాకుతో భార్యను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లిన రణధీర్. మార్గమధ్యంలో గొడ్డలితో తన భార్య చేతులను నరికి పారిపోయాడు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పందించలేదు. ప్రస్తుతం ఆమెను తన మామ చూసుకుంటున్నారు. కోడలిపై ఘాతుకానికి పాల్పడ్డ కుమారుడిని ఇక చేరదీయనని ఆయన పేర్కొన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'పెళ్లై 2 నెలలే... భార్య చేతులు నరికిన భర్త'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: తమిళనాడు అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు రాజ్యసభ నుండి వాకౌట్ చేశారు. నిన్న లోక్ సభలో ఆమోదం పొందిన ఈబీసి రిజర్వేషన్ బిల్లు ఈరోజు రాజ్యసభకు రాగా ఉదయం నుండి ఈ బిల్లుపై చర్చ జరుగుతుంది. ఈబీసీ బిల్లును వ్యతిరేకించిన ఏఐఏడీఎంకే సభ్యులు సభను వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'రాజ్యసభ నుండి అన్నా డీఎంకే ఎంపీల వాకౌట్'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: పారా వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో స్వర్ణం
స్విట్లర్లాండ్లోని బాసెల్ వేదికగా జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించి భారత బ్యాడ్మింటన్ కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేసిన పీవీ సింధుకు భారతావని మొత్తం నీరాజనాలు పలుకుతోంది. ఈ క్రమంలో 36 ఏళ్ల నిరీక్షణకు పీవీ సింధు తెరదించడంతో పాటు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గిన తొలి మహిళ బ్యాడ్మింటన్ ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. ఇలా యావత్ భారతావని సింధు విజయాన్ని ఆస్వాదిస్తూ తన్మయత్వంతో మునిగిపోయిన అదే ఆదివారం. అదే వేదికగా జరిగిన పారా బ్యాడ్మింటన్ టోర్నీలో మరో భారత అథ్లెట్ స్వర్ణం సాధించింది. తన పేరు మానసి జోషి. మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ పారుల్ పామర్ను మట్టికరిపించి తొలిసారి పారా వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ టైటిల్ను సొంతం చేసుకుంది.కాగా, పారా బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొన్న భారత అథ్లెట్లు మొత్తం 12 పతకాలను సాధించారు. ఇక్కడ విశేషం ఏంటంటే మానసి జోషి సైతం గోపీచంద్ అకాడమీలోనే శిక్షణ తీసుకుంది. పీవీ సింధు మాదిరే పారా బ్యాడ్మింటన్ అథ్లెట్లకు కూడా ఘన స్వాగతం లభించింది. అనంతరం పతకాలు నెగ్గిన షట్లర్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజుని కలిశారు. ఈ క్రమంలో పురుషుల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించి ప్రమోద్ భగత్కు, మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించి మానసి జోషిలకు రిజుజు రూ.20 లక్షల నగదు బహుమానం అందించారు.మానసి జోషి స్వర్ణం సాధించడం వెనుక పెద్ద కష్టమే ఉంది. ముంబైలో 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మానసి జోషి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఎముకలు విరిగిపోవడంతో పాటు ఆమె ఎడమ కాలు తెగిపడింది. ప్రమాదం జరిగిన మూడు గంటల అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. పది గంటల పాటు ఆమెకు ఆపరేషన్ నిర్వహించిన చివరకు ఆమె ప్రాణాలను కాపాడారు. అయితే ఆమె కాలు మాత్రం తిరిగి అతికించే అవకాశం లేదని చెప్పారు. గ్యాంగ్రీన్ సోకిన కారణంగా దానిని తొలగించామని చెప్పారు. అయితే ఆ విషాదం నుంచి తేరుకున్న మానసి నాలుగు గోడలకే పరిమితం కావాలనుకోలేదు. ఈ క్రమంలో దాదాపు ఏడాది తర్వాత కృత్రిమ కాలుతో నడవడం ప్రారంభించిన మానసి బ్యాడ్మింటన్పై ఆసక్తితో ఆట సాధన చేశారు. అదేవిధంగా స్కూబా డైవింగ్లో కూడా మెళకువలు నేర్చుకున్నారు. పారా ఆసియా గేమ్స్లో ఎంపిక కాలేదు. ఆ తర్వాత మరింత పట్టుదలతో బ్యాడ్మింటన్లో రాణించారు. 2014లో పారా ఆసియా గేమ్స్తో అంతర్జాతీయ క్రీడల్లో ప్రవేశించిన మానసి శరీరంలో ఒక భాగం కోల్పోయినంత మాత్రాన జీవితంలో ఇక ఏమీ సాధించలేమనే భావనను దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చాంపియన్గా నిలిచి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.టోర్నీలో స్వర్ణం నెగ్గడంపై మానసి మాట్లాడుతూ "ప్రపంచ చాంపియన్ అనిపించుకోవడం ఎంతో గర్వంగా ఉంటుంది. అయితే ఈ విజయం నాకు అలవోకగా దక్కలేదు. ఎన్నో సవాళ్లను అధిగమించి స్వర్ణం దక్కించుకున్నా. ఎంతో మంది క్రీడాకారులు ఇలాంటి క్షణం కోసం నాలాగే ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. కెనడియన్ ఓపెన్లో నేను పారుల్(ఇండియా) చేతిలో ఓటమి చవిచూశా. అందుకే ఈ పోటీలకు మానసికంగా సన్నద్ధమయ్యా. ఫిట్నెస్తో పాటు ఆట తీరుపై మరింత దృష్టి పెట్టాను. ఎంతో మంది గొప్ప క్రీడాకారులు అసాధారణ విజయాలు సాధించిన ఇదే వేదికపై నేను కూడా నా కలను సాకారం చేసుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది" అని చెప్పారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: కొడుకు కోసం వెతికిన తండ్రికి నిరాశ... అసలు ఎం జరిగిందంటే...!
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి కనకదుర్గమ్మ వారధి 16 వ నంబరు జాతీయ రహదారిపై గత ఏడాది డిసెంబర్ 27 న గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన వ్యక్తి విశాఖపట్టణంలోని సీతమ్మధారకు చెందిన బంగారురాజు ( 30 ) గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన మేరకు డిసెంబర్ 26వ తేదీన విశాఖ నుంచి బంగారురాజు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చారు. కొంతకాలంగా ఆయనకు భార్యతో వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె మంగళగిరికి వచ్చేసినట్లు తెలుసుకున్నారు. ఆమెను ఒక్కసారి కలిసి వెళదామని డిసెంబర్ 27 న అమ్మవారి దర్శనానంతరం మంగళగిరి వెళ్లారు. ఆమె కనిపించకపోవడంతో అక్కడే ఉన్న తన బావమరిదిని కలిసి అమ్మవారి ప్రసాదం ఇచ్చి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలో తాడేపల్లి చేరుకున్న బంగారురాజును బైపాస్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందారు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి నాలుగు రోజుల తర్వాత మృతదేహాన్ని పూడ్చి వేశారు. ఇదిలా ఉండగా ఇంటి నుంచి వెళ్లిన బంగారురాజు నాలుగు రోజులైనా తిరిగి రాకపోవడంతో విశాఖలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో అతడి తండ్రి కొండలరావు ఫిర్యాదు చేశారు. అనంతరం తన బంధువుతో కలిసి విజయవాడకు వెళ్లి పరిసర ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో విచారిస్తూ పోలీసు కంట్రోల్ రూమ్ లోని ఓ అధికారిని కలిశారు. అతని వద్ద తన కొడుకు మృతదేహం ఫొటో ఉండటం చూసి బోరున విలపించారు. వివరాలు సేకరించి అక్కడి నుంచి తాడేపల్లి పోలీసులను ఆశ్రయించగా మృతుడి సంచి, ఇతర వస్తువులు చూపించారు. మృతదేహం ఖననం చేసిన ప్రదేశానికి తండ్రి కొండలరావును తీసుకువెళ్ళి చూపించారు. తండ్రి కొండలరావు కుమారిడికి ఇష్టమైన అల్పాహారం, తాగునీరు ఉంచి బరువెక్కిన గుండెతో నివాళులర్పించారు. పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగించే తన కొడుకు లేడనే విషయాన్ని వృద్ధుడైన తండ్రి కొండలరావు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని తెలుసుకోమని పోలీసులను కోరగా, జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు లేనందున ప్రయోజనం లేకుండా పోయిందని ఆ వృద్ధ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన మంత్రి
మహబూబాబాద్ : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్య అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా వల్ల పాఠశాలల ప్రారంభం ఆలస్యమవుతున్నందున. విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. ఈ పాఠ్యపుస్తకాలను వినియోగించుకుని బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా ఉన్న పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. జిల్లాలో 94 శాతం పాఠ్య పుస్తకాలు ఇప్పటికే వచ్చాయని, మిగిలినవి కూడా వెంటనే వస్తాయని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.కరోనా మహమ్మారి తగ్గగానే ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించడం, అక్కడ విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా సహకరించి, నివారణ చర్యలు పాటించాలన్నారు. కరోనా నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో సరైన్ ఆన్ లైన్ వసతులు లేకుండా విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందన్నారు. దీనిని నివారించేందుకే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని, టీ – సాట్, లోకట్ టీవీల ద్వారా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు.రాష్ట్రంలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు సీఎం కేసీఆర్ ఈచ్ వన్ టీచ్ వన్ అనే గొప్ప కార్యక్రమాన్ని పెట్టారని, ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములై నిరక్షరాస్యతను నిర్మూలించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీచైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, స్థానిక అధికారులు, నేతలు పాల్గొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ఏసీబీ దాడుల్లో పట్టుపడ్డ విఆర్ఓ
విశాఖ జిల్లా అనకాపల్లి, కసింకోట మండల రెవెన్యూ ఆఫీస్ లో ఏసిబి దాడులు నిర్వహించారు .భూమి ఆన్లైన్ చేయడానికి రైతు నుండి రెండు వేలు లంచం తీసుకుంటుండగా తాళ్లపాలెం ఇన్చార్జి విఆర్ఓ రాజేష్ పట్టుపడ్డాడు
1
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తనదేనని భరోసా
శ్రీశైలం నియోజకవర్గంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న పథకాలను వివరించారు. బుక్లెట్లు పంపిణీ చేశారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటి వద్ద ప్రజలు వారికి స్వాగతం పలికారు. గతంలో తాము ఎదుర్కొన్న సమస్యలను, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మేళ్లను వివరించారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలతో తాము పొందిన లబ్ధి గురించి తెలిపారు. ఈ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని గ్రామస్తులు చెబుతున్నారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కరివేన గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి మూడేళ్ల సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఆరా తీసి, ఏయే పథకాలతో ఎంత లబ్ధి పొందారో వివరిస్తూ.సీఎం వైఎస్ జగన్ స్వతహాగా రాసిన లేఖను, నవరత్నాల బుక్లెట్ను అందించారు. ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ సహాయాన్ని తెలియ చేస్తూ, ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఎమ్మెల్యే ముందుకు సాగారు. అర్హత ఉండి ఇంకా ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అర్హులకు సకాలంలో సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తనదేనని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే సందర్శిస్తున్న ప్రతీ గడపలో ప్రజలను పేరు పెట్టీ మరీ పలకరిస్తూ మన అందరి ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహర్ రెడ్డికి మీ దీవెనలు అందించాలని, మరో సారి ఆశీర్వదించి సీఎం గా గెలిపించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న మన అందరి పాలనకు మద్దతుగా ఫోన్ నంబర్ 8296082960 కి మిస్డ్ కాల్ చేయించి ప్రభుత్వ సంక్షేమ పాలనకు ప్రజల వద్ద నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలంటే భాజపాతోనే సాధ్యం : కిషన్రెడ్డి
తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలంటే భాజపాతోనే సాధ్యమని భాజాపా నేత కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన రోజును ప్రభుత్వం జరపకపోవడం దారుణమని తెలిపారు. తెరాస నేతలు ఉద్యమ సమయంలో ఒకలా…అధికారంలో మరోలా ప్రవర్తిస్తున్నారన్నారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: ఏపీ శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. కేశవ్ అన్న శీనప్ప కుమార్తె వివాహం ఈ నెల 23న అనంతపురంలో ఘనంగా జరగనుంది. వీరి ఇంట చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్న తొలి వివాహం కావడంతో, అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతపురంలోని బళ్లారి బైపాస్ సమీపంలోని ఎంవైఆర్ ఫంక్షన్ లో పెళ్లి జరగనుంది. గత 10 రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అనంతపురంలోని రామ్ నగర్ లో గల నివాసంలో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. పెళ్లి కుమారుడు ఓ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు. ఈ పెళ్లికి వీవీఐపీలు, వీఐపీలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎస్పీలు వెంకట్రావు, నర్సింగప్ప, టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడులతో కలసి పెళ్లి ఏర్పాట్లను కేశవ్ నిన్న పరిశీలించారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'పయ్యావుల కేశవ్ ఇంట ప్రారంభమైన పెళ్లిసందడి'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని చందా నగర్ లో చోటుచేసుకుంది. పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 18 లో నివాసం ఉంటున్న నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు గత స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన గల కారణాలు తెలియాల్సి ఉంది.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: కాటా సుబ్బారావుకు హైకోర్టులో ఊరట
కుండబద్దలు' పేరిట ఓ యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్న కాటా సుబ్బారావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేయగా, ఏపీ హైకోర్టు నేడు స్టే ఇచ్చింది. మూడు రాజధానుల అంశంలో 'కుండబద్దలు' సుబ్బారావు సీఎం జగన్, రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డిలపై కుట్ర పూరితంగా వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై ఆయనపై అనంతపురం జిల్లా గుమ్మగట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిపై 'కుండబద్దలు' సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించగా నేడు విచారణ జరిగింది. మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదించారు. ఎమ్మెల్యేపై అసత్యప్రచారాలు చేస్తున్నారని ఒక కార్యకర్త ఫిర్యాదు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కేసుపై పూర్తిస్థాయి స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్కు ఘనస్వాగతం పలకాలి: కేసీఆర్
హైదరాబాద్: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ రేపు హైదరాబాద్కు వస్తున్నందున ఆయన పర్యటననువిజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 4న ఉదయం హైదరాబాద్కు చేరుకొనే కోవింద్కు మంత్రులు, ఎంపీలు విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు కేకే, జితేందర్రెడ్డి ఆయనను స్వాగతించనున్నారు. మధ్యాహ్నం జలవిహార్లో తెరాస నేతల సమావేశానికి కోవింద్ హాజరవుతారు. తెరాస రామ్నాథ్ కోవింద్కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
1
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: కానిస్టేబుల్ రాతపరీక్షలో గందరగోళం నెలకొంది. 'సీ' సిరీస్ బుక్ లెట్ వచ్చిన అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఓఎంఆర్ షీట్ కొచ్చన్ బుక్ లెట్ కోడ్ బబుల్ కోసం 1 నుంచి 5 నంబర్లుంటాయి. కోడ్ ను బట్టి ఓఎంఆర్ షీట్ లో బబుల్ చేయాలి. కానీ 'సీ' సెట్ బుక్ లెట్ వచ్చిన అభ్యర్థులకు ఇచ్చిన క్యూబీ కోడ్ లో 6వ అంకె ఉంది.దీనిపై ఇన్విజిలేటర్లను ప్రశ్నించగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, పరీక్ష అయితే రాయండని సూచించారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'కానిస్టేబుల్ పరీక్షలో గందరగోళం!'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు భద్రతను తొలగించడంపై ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు సోమవారం మీడియా ముఖంగా మండిపడ్డారు. పెగాసన్, ఫోన్ ట్యాపింగ్ వంటి విషయాలపై ఆధారాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే పయ్యావులకు సెక్యూరిటీని తొలగించారని ఆయన ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా వ్యవహరిస్తే జగన్ పాదయాత్ర పేరుతో రోడ్లపై తిరిగేవారా అని ప్రశ్నించారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'ప్రశ్నిస్తే భద్రతను తొలగిస్తారా?: అచ్చెన్నాయుడు'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: స్టూడెంట్స్ తో సినిమా టికెట్లు, మటన్ కొట్టిస్తారా? : దేవినేని
రైతులకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు. ఈ నెల 18వ తేదీ నంచి రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళవారం మైలవరం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులకు గోరంత ఇచ్చి. కొండంత ఇచ్చినట్లుగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలన్నీ. బోగస్ కేంద్రాలని చెప్పారు. గత సంవత్సరం అమ్మిన ధాన్యం డబ్బులను ఇప్పటికీ ఇవ్వలేదని మండిపడ్డారు. రైతుల కష్టాలను పక్కనబెట్టి. పోలవరం ఏమయిందని కన్నబాబు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా. అని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు కనీసం వరద సాయం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి నదులన్నింటినీ తీసుకెళ్లి బోర్డుల చేతిలో పెట్టేశారని ధ్వజమెత్తారు. కేసుల భయంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి నోరు మెదపడం లేదన్నారు. ఈ 28 నెలల్లో ఏం ఉద్దరించారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 15లక్షల మంది కౌలు రైతులుంటే 41వేల మందినే చూపించారన్నారు. కరెంటు బిల్లుల రూపంలో రూ.11వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపి. దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చదువుకున్న వాళ్ళతో సినిమా టికెట్లు, మటన్ కొట్టిస్తారా. కాలేజీలు తనఖా పెట్టి అప్పులు తెస్తారా. అంటూ ఫైర్ అయ్యారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి పరాభవం తప్పదని ఆయన హెచ్చరించారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపైన కేటీఆర్ ఆగ్రహం,ఫోన్ చేసి మరీ అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అందులోనూ అధికార పార్టీలో అసంతృప్తులు తీసుకుంటున్న నిర్ణయాలతో సమీకరణాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. అందరికంటే ముందుగానే బీఆర్ఎస్ అధిష్ఠానం అభ్యర్థుల జాబితాను ప్రకటించగా. టికెట్ ఆశించి భంగపడ్డ ముఖ్యనేతలు, సిట్టింగులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే. వాళ్లందరినీ బుజ్జగించే పనిలో పడ్డారు ముఖ్య నేతలు. అయితే. అధిష్ఠానం నాలుగు స్థానాలను హోల్డ్లో పెట్టగా. అందులో జనగామ పరిస్థితి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జనగామలో సిట్టింగ్ అయిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై భూకబ్జా ఆరోపణలుండగా, ఆ టికెట్ను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆశిస్తున్నట్టు సమాచారం. వీరితో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ నియోజకవర్గంలో ఎవరికి వారు తమ బలగాలను పెంచుకునేందుకు. తమ అనుచరులతో విడివిడిగా సమావేశమవుతున్నారు. ఇటు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నేరుగా జనాల్లోకి వెళ్లి ప్రచారం చేసుకుంటుంటే. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రం కార్యకర్తలతో భేటీ అవుతూ బలం కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే. హైదరాబాద్లో ఓసారి పల్లాను కలిసేందుకు వచ్చిన జనగామ కార్యకర్తలు ముత్తిరెడ్డికి అడ్డంగా దొరికిపోగా. ఈ విషయాన్నే నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అదొక్కటే కాకుండా బయటకు తెలవకుండా చాలా భేటీలు జరుగుతున్నట్టు సమాచారం. అయితే. ఈ విషయం ఇప్పుడు మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్ ఇప్పటికే. వాళ్లతో విడివిడిగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇంతలోనే. జనగామ మండలం నిడిగొండలో ఓ కల్యాణ మండపంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్గీయులు రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నర్మెట్ట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా హాజరయ్యాయి. కాగా. హైదరాబాద్ పల్లా రాజేశ్వర్ రెడ్డి బయలుదేరగా. ఈ విషయం తెలిసిన కేటీఆర్ వెంటనే ఫోన్ అందుకుని కాల్ చేశారు. ఏం పల్లా అన్నా. గిట్లే ఉంటదా. గిదేనా పద్ధతి. ఇలా చేయటం ఏ మాత్రం కరెక్ట్ కాదు. అంటూ తన అసహనాన్ని మొత్తం వెల్లగక్కినట్టు తెలుస్తోంది. ఆ సమావేశానికి మాత్రం హాజరుకావొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక పల్లా రాజేశ్వర్ రెడ్డి సమావేశానికి వెళ్లకుండా వెనక్కి వచ్చేశారు. ఇదిలా ఉంటే. అక్కడ సమావేశానికి రమ్మని చెప్పి అర్ధాంతరంగా వస్తలేనని చెప్పటంతో అక్కడికి చేరుకున్న కార్యకర్తలంతా అసహనం వ్యక్తం చేశారంటా. అయితే. జనగామ అభ్యర్థిని ప్రకటించే వరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి గానీ, ముత్తిరెడ్డి గానీ శ్రేణులతో రహస్య సమావేశాలు నిర్వహించవద్దని కేటీఆర్ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: అమరావతి అభివృద్ధి సంస్థ ద్వారా 16 ప్యాకేజీలకు ఇప్పటికే టెండర్లు పిలిచామని, మరో రెండింటికి పిలవాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఆర్డీఏ పనులకు కూడా టెండర్లు పిలిచామని చెప్పారు. ముఖ్యమంత్రి నివాసం, సచివాలయం, ఇతర ముఖ్య భవనాలకు 15 రోజుల్లోపు డిజైన్లు పూర్తి చేస్తామని అన్నారు. అక్టోబర్ 11, 12, 13 తేదీల్లో లండన్లో అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లపై వర్క్షాప్ నిర్వహిస్తున్నామని, దీనికి సినీ దర్శకుడు రాజమౌళి కూడా హాజరవుతారని నారాయణ అన్నారు. అక్టోబర్ 25న లండన్లో పర్యటించి డిజైన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'లండన్ లో వర్క్ షాప్ కు రాజమౌళి హాజరవుతారు: మంత్రి నారాయణ'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: గ్రామాల్లో నీటి ఎద్దడి పట్టించుకోని సిఎం : యెడ్యూరప్ప
రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో మంచినీటి ఎద్దటి నెలకొందని బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు బిఎస్ యెడ్యూరప్ప అన్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి నీటి సమస్యను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కుమారస్వామి గ్రామాల్లోని స్కూళ్లకు వెళుతూ అక్కడ బస చేస్తూ రాజకీయ డ్రామా ఆడుతున్నారని యెడ్యూరప్ప అన్నారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: సుదీర్ఘ వివాదం తర్వాత సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఐపీఎస్ సర్వీసుకు ఇచ్చిన రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఇవాళ తిరస్కరించింది. తిరిగి డ్యూటీలో చేరాలని హోం శాఖ ఆయన్ని ఆదేశించింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఒక వేళ ఆయన కొత్త విధుల్లో చేరితే. సాయంత్రమే వీడ్కోలు తీసుకుని ఇంటికెళ్లాలి. ఎందుకంటే ఆయన సర్వీసు నేటితో ముగుస్తుంది. సీబీఐలో అంతర్గతంగా తలెత్తిన వివాదంతో కొన్ని నెలలుగా డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా పరస్పరం అవినీతి ఆరోపణలకు దిగారు. దీంతో అర్ధరాత్రి వేళ వారిద్దరినీ లీవ్ పై పంపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత తాత్కాలిక డైరెక్టర్ గా మాలకొండయ్యను నియమించింది. దీంతో తనను కేంద్రం బలవంతంగా సెలవుపై పంపిందంటూ అలోక్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం, మళ్లీ బాధ్యతల్లో చేరే అవకాశం కోర్టు ఇవ్వడం, ఆ తర్వాత సెలక్ట్ కమిటీ ఆయన్ని తొలగించడం చకచకా జరిగిపోయాయి. సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగించాక… సివిల్ డిఫెన్స్, హోం గార్డ్స్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా ఆయన్ని కేంద్రం నియమించింది. ఆ బాధ్యతలు తీసుకునేందుకు అలోక్ వర్మ నిరాకరించారు. ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఏకంగా తన ఐపీఎస్ సర్వీసుకే రాజీనామా చేశారాయన. జనవరి మొదట్లో అలోక్ రాజీనామా చేశారు. దాన్ని పరిశీలించిన కేంద్ర హోం శాఖ ఇవాళ తిరస్కరించింది. తిరిగి డ్యూటీలో చేరాలని ఆదేశించింది. అయితే కొసమెరుపు ఏంటంటే ఒకవేళ ఆయన ఇవాళ విధుల్లో చేరినా. రేపటి నుంచి మళ్లీ ఆఫీసుకు వెళ్లే పనిలేదు. ఎందుకంటే ఆయన సర్వీసు నేటితో ముగుస్తుంది. 2019 జనవరి 31న ఆయన పదవీ విరమణ చేయాల్సిన రోజు. అంటే ఇవాళ అలోక్ డ్యూటీలో చేరితే… వీడ్కోలు కార్యక్రమంతో సాయంత్రం ఇంటికెళ్లొచ్చన్నమాట !
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'అలోక్ వర్మ రాజీనామా తిరస్కరించిన కేంద్రం'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: హైబీపీతో ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయి. వేరుశనగ, బాదం, వాల్నట్స్, జీడిపప్పు వంటివి తినడం వల్ల హైబీపీ ముప్పు నుంచి జాగ్రత్త పడొచ్చు. వీటిలో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి, బీపీ, డయాబెటిస్ను అదుపులో ఉంచుతాయి. ముఖ్యంగా హైబీపీ ఉన్న వారు రోజూ గుప్పెడు నట్స్ తింటే దివ్యౌషధంలా పని చేస్తాయి.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'హై బీపీని నియంత్రించే ఆహారమిదే'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: పరీక్షలు పాత పద్ధతిలోనే కొనసాగించాలి: ఎస్ఎఫ్ఐ
ఓయూ పరిధిలో త్వరలో జరుగబోయే బీఈడీ సెమిస్టర్ పరీక్షల్లో ప్రశ్నాపత్రం పాత పద్ధతిలో కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఓయూ కమిటీ ఆధ్వర్యంలో పరీక్షల విభాగం నియంత్రణ అధికారి ప్రొ.శ్రీరాం వెంకటేష్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రశ్నాపత్రం కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉండడం వల్ల తెలుగు మీడియం విద్యార్థులకు నష్టం జరుగుతుందని అన్నారు. తెలుగు మీడియంలోనే పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కొరినట్లు ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు.
1
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: హైదరాబాదులో వార్డుల పాలనా పద్ధతిని బీఆర్ఎస్ సర్కార్ తీసుకురాబోతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తామని తెలిపారు. వార్డు కార్యాలయంలో 10 మంది అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇంఛార్జీగా ఉంటారని తెలిపారు. సిటిజెన్ ఫ్రెండ్లీగా జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాలు ఉంటాయని చెప్పారు. ప్రతి వార్డు కార్యాలయం మరో వార్డు కార్యాలయంతో అనుసంధానం అవుతాయని అన్నారు. పాలన వికేంద్రీకరణతో పౌరులకు వేగంగా పరిపాలన ఫలితాలు అందుతాయని చెప్పారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'హైదరాబాదులో వార్డుల పాలనా పద్ధతి'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: కోల్కతాలోని టాప్సియా ప్రాంతంలోని పాదరక్షల గోడౌన్లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.మంటలను గమనించిన స్థానికులు అప్రమత్తమై అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'కోల్కతాలోని పాదరక్షల గోడౌన్లో అగ్నిప్రమాదం'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: పిల్లల చదువే తల్లిదండ్రులకు ఆస్తి
పిల్లల చదువే తల్లిదండ్రులు ఆస్తి అని జిల్లా సమగ్ర శిక్షప్రాజెక్టు అధికారి అంబవరం ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కడప నగరంలోని ప్రాథమిక పాఠశాల, మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ ఎన్నో విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టిందని చెప్పారు. జిల్లా ఉప విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి, ఎస్టియు టీచర్స్ అసోసియేషన్ కోశాధికారి ఇలియాస్బాష, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నివాళులర్పిస్తున్నాను అని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. జగన్ రెడ్డి పోలీసులను వాడుకోవడమే కాదు, ఆదుకోవడం కూడా నేర్చుకోండి. కోవిడ్ సమయంలో కర్తవ్య నిర్వహణలో చనిపోయిన పోలీసు కుటుంబాలకు ఇస్తామన్న రూ.10 లక్షల సాయం ఎవరికైనా ఇచ్చారా? వీక్లీ ఆఫ్, సరెండర్ లీవ్స్, టిఎ, డిఎ, ఫిట్మెంట్, జిపిఎఫ్ డబ్బులు, పోలీసు సంక్షేమ నిధులు వంటి బూటకపు హామీల్లో ఏదైనా నెరవేర్చారా? జగన్ రెడ్డి ధన దాహంతో, అధికార దాహంతో చేసే తప్పుడు పనులకు వత్తాసు పలుకుతున్న పోలీసులకు ప్రగాఢ సానుభూతి. ఈ నిరంకుశ ప్రభుత్వంలో పాలకులను, వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను నిజాయితీగా ఎదుర్కుంటూ పనిచేస్తున్న, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్న పోలీసులకు, అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు మరియు సెల్యూట్ అని తెలియజేసారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'పోలీసులను వాడుకోవడమే కాదు, ఆదుకోవడం కూడా నేర్చుకోండి'.
2
['tel']