inputs
stringlengths
53
5.97k
targets
stringlengths
51
5.93k
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: మైదుకూరు డిఎస్పిని తిరంగ ర్యాలీకి ఆహ్వానించిన ఎన్జీవో
ఆజాదిక అమృత్ మహోత్సవాల్లో భాగంగా మైదుకూరు పట్టణంలోని పురవీధుల్లో 12. 08. 2022 శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు వనిపెంట రోడ్డు లోని అంకాలమ్మ గుడి వద్ద ప్రారంభమై కడప రోడ్డు లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు తిరంగ ర్యాలీ నిర్వహించుట కొరకుమైదుకూరు నియోజకవర్గంలోని స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు గురువారం మైదుకూరు డిఎస్పి శ్రీ వంశీధర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. మైదుకూరు పట్టణంలో జరుగు తిరంగ ర్యాలీ అనుమతి కోరుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: హిందుస్థాన్ పెట్రోలియం ఫ్లాంట్లో పేలుడు
హిందుస్థాన్ పెట్రోలియం ఫ్లాంట్లో గురువారం పెట్రోల్ ట్యాంకర్లలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఉత్తరప్రదేశ్ ఉన్నవోలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫ్లాంట్లోని వాల్వ్ లీక్ అవడంతో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా ట్యాంకర్ పేలడంతో ఫ్లాంట్లోకి సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా వారంతా బయటకు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. వెంటనే వారందర్ని అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ముందు జాగ్రత‍్త చర్యగా లక్నో-కాన్పూరు మార్గమధ్యంలో నడిచే రైళ్లను నిలిపివేశారు. అలాగే ఫ్లాంట్ సమీపంలోని నాలుగైదు కిలోమీటర్ల పరిధిలో అధికారులు హెచ‍్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రమాద తీవ్రత నేపథ్యంలో చుట్టుపక్కలున్న గ్రామాల్లోని వారిని అక్కడ నుంచి తరలించారు. హెచ్పీ పెట్రోలియం యాజమాన్యం కూడా ఫ్లాంట్లోని లీకేజీని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: ఏర్పడి పదిహేను సంవత్సరాలు చేసుకున్న తెలంగాణ విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం జరిగిన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తేజ పరిచే విధంగా చైతన్యవంతంగా మారాలని, ఆధునిక సమాజంలో టెక్నాలజీ గ్లోబలైజేషన్ అయిందని అన్ని విభాగాల విద్యార్థులు దాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. బడుగు బలహీన వెనుకబడిన మైనార్టీ పేద విద్యార్థులు కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఉన్నత విద్యా వంతులు గా తీర్చిదిద్దడానికి విశ్వవిద్యాలయాలను దేవాలయాలుగా మార్చి మీకు విద్యాబుద్ధులు అందిస్తుందని అన్నారు. నేటి సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు అయిన వారిలో తొంభై శాతం పేదవారేనని వారిని చూసి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. లక్ష్యసాధనతో చదివి ఉన్నత ప్రయోజనాలు సాధించి దేశ ప్రయోజనాలు కాపాడినవారవుతారని, ప్రతి ఒక్కరూ ఉన్నతమైన విజ్ఞానంతో పాటు చదువులు లక్ష్య సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పఢి పదిహేను సంవత్సరాలు గడుస్తున్నందున ఇక్కడ చదివే విద్యార్థులు ఎన్నో రంగాల్లో రాణించాలని తాను ఆకాంక్షిస్తున్నానని, దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల కంటే టాప్ టెన్ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే ఆలోచనలో అధ్యాపకులు ఉండాలని కోరారు. విశ్వవిద్యాలయాంలో అధ్యాపకులు నాణ్యమైన విద్యను అందించి సర్వోన్నత విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని అభిలషించారు. వివిధ విభాగాల్లో తెలంగాణ విశ్వవిద్యాలయం దాని అనుబంధ కళాశాలల సౌత్ క్యాంపస్ బిక్నూర్ లో విద్యా బోధన చేస్తున్న ఉత్తమ ఇరవై మంది అధ్యాపకులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేసి సన్మానించారు. ఈ సమావేశంలో తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కనకయ్య , జిల్లా అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, ఆర్డీవో రవి, ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ అన్ని విభాగాల అధిపతులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'ఘనంగా తెలంగాణ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: నిజామాబాద్: రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. రెంజల్ మండలం సాటాపూర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రహదారిపై వెళ్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదవశాత్తు బాలుడిని ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో బాలుడు మృతిచెందాడు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'ప్రైవేట్ బస్సు ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: గుండెపోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి మృతి
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి సోదరుడు, జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. పులివెందులలోని నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున వివేకానంద రెడ్డికి గుండెపోటు రావడంతో.తుదిశ్వాస విడిచారు. వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు. వివేకానందరెడ్డికి భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. వివేకానంద రెడ్డి కడప లోక్సభ స్థానం నుంచి 1999, 2004 లో రెండుసార్లు ఎన్నికయ్యారు. పులివెందుల నుంచి 1989, 1994 లో ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొంది.ప్రజలకు సేవలందించారు. 2009లో సెప్టెంబర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మండలి సభ్యుడిగా పనిచేశారు. 2010లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వివేకానంద రెడ్డి 2011 ఉప ఎన్నికలో వైఎస్ విజయమ్మపై పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కడప జిల్లాలో లింగాల కాలువను డిజైన్ చేశారు. లయన్స్ క్లబ్ ద్వారా సేవలందించారు. చాపాడు మండలం మద్దూరులో వివేకానంద రెడ్డి చివరిసారిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిన్న రాత్రి వరకు మద్దూరులో ప్రచారం నిర్వహించారు. మద్దూరు నుంచి నేరుగా పులివెందులకు వెళ్లారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: పెద్దపప్పూరు: సైబర్ నేరగాళ్లను నమ్మి మోస పోవద్దని ఎస్ఐ ఖాజాహుస్సేన్ అన్నారు. శనివారం ముచ్చుకోటలో గ్రామస్తులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీరు లక్కీ డ్రాలో గెలుపొందారని లక్షలాది రూపాయలు గెలుచు కున్నారని ఆ డబ్బు మీ బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే కొంత డబ్బు చెల్లించాలని ఆశ చూపెట్టి మోసం చేస్తారన్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఆధార్, బ్యాంకు ఖాతా నంబరు, ఓటీపీ చెప్పమని అడిగినప్పుడు పొరపాటున చెబితే బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం దోచేస్తారన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా గ్రామ సచివాలయ పోలీసుకు తెలియజేయాలని ఆయన గ్రామస్తులకు వివరించారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'సైబర్ నేరగాళ్లను నమ్మొద్దు: ఎస్సై ఖాజా హుస్సేన్'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం చేరుకున్నారు. చంద్రబాబుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగే 6వ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. కుప్పం పర్యటనలో ఆధునిక హార్టికల్చర్ క్లబ్ను చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్టులో భాగంగా పెదబంగారు నత్తంలో హార్టికల్చర్ క్లబ్ ఏర్పాటు చేశారు. అనంతరం చీలపల్లిలో ఎన్టీఆర్ గృహాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 6వ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జన్మభూమి-మాఊరులో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 10 శ్వేతపత్రాలను నేతలు క్లుప్తంగా వివరించనున్నారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీనివాసుని దర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఆదివారం రోజు శ్రీవారిని 87,022 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,187 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీకి రూ.3.40 కోట్ల ఆదాయం వచ్చింది.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: దేశ రాజధానిలో గత 24 గంటల్లో 126 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, కేసు పాజిటివిటీ రేటు 1.12 శాతం, బుధవారం ఢిల్లీ ప్రభుత్వ హెల్త్ బులెటిన్ ప్రకారం.దీంతో నగరంలో యాక్టివ్ కేసుల సంఖ్య 493కి చేరింది. కరోనా నుండి120 మంది కోలుకున్నారు, నగరంలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 18,38,972కి చేరుకుంది. కరోనా బారిన పడి ఒకరు మరణించాడు.నగరంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 26,155 కు చేరింది.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'ఢిల్లీ కరోనా అప్డేట్'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను రాయండి: ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. ఎన్నికల కవరేజీ కోసం వెళ్లిన ఓ బృందంపై మెరుపుదాడికి దిగడంతో జర్నలిస్టు సహా మరో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. దంతేవాడలోని ఆరాన్పూర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన జర్నలిస్టు అచ్యుతానంద సాహు. దూరదర్శన్లో కెమేరాపర్సన్గా పనిచేస్తున్నారు. ఎన్నికల కవరేజీలో భాగంగా ఆరాన్పూర్ వచ్చిన బృందంలో సాహు కూడా ఉన్నారు. ఇదే ఘటనలో మరికొందరు స్థానికులకు కూడా గాయాలైనట్టు చెబుతున్నారు. దాడిపై సమాచారం అందగానే స్థానిక ఎస్పీ నేతృత్వంలోని ఓ బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి తరలివెళ్లింది. వచ్చే నెలలో ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…. ఎన్నికలను వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు, అధికారులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'ఎన్నికల బృందంపై మావోయిస్టుల మెరుపుదాడి'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: చలి చంపేస్తోంది. వణికిస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా. చలితో ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణలో అయితే. ఆదిలాబాద్ జిల్లాలో 3.1 స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. భీంపూర్ మండలం అర్లీటీ గ్రామంలో 2.7 స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలికి తోడు ఈదురుగాలుల వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదే అర్లీటీ గ్రామంలో నిన్న 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇవాళ 2.7కు పడిపోయింది. మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈఏడాది కనిష్టంగా 4.4 స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'తెలంగాణలో చలి చంపేస్తోంది...'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగిన ఘటన ఢిల్లీలో జరిగింది. నేతాజీ సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలి ఇంట్లో 28 ఏళ్ల వ్యక్తి ప్రవేశించి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను దారుణంగా కొట్టి, బ్లేడుతో పెదవులను కోశాడు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఆకాశ్గా గుర్తించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ '85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్ స్టోర్రూమ్లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. బాంద్రా (ఇ) ప్రాంతంలోని ఖేర్వాడి పోలీస్ స్టేషన్లో మంటలు చెలరేగాయని, ఇందులో ఒక పోలీసు తీవ్రంగా గాయపడ్డాడని ముంబై ఫైర్ సర్వీస్ తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'ముంబై పోలీస్ స్టేషన్లో మంటలు... ఒక పోలీసుకు గాయాలు'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినం సందర్భంగా వార్వా నివాస్ సోమవారం మధురవాడ లోని ఐటీ సైజ్ లో హరిత అపార్ట్మెంట్స్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. ప్లాస్టిక్ మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మానవాళికి, జీవరాశి కి అత్యంత ప్రమాదకరం గా తయారయిందని చిత్ర పటాలు ప్రదర్శించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులు, సీసాలను శాస్త్రీయ పద్ధతిలో నాశనం చెయ్యాలి. కానీ అలా జరగకుండా మన దేశంలో 85% మిసమనజ్మెంట్ అవుతున్నది. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం, రోడ్ల పైన పారి వెయ్యడం జరుగుతున్నది. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం వలన ప్లాస్టిక్ వేస్ట్ గాల్లో చేరుతుంది. ఆ గాలి పీల్చుకుని మనం జబ్బులు తెచ్చుకుంటున్నాము. రోడ్లపై పారి వేసిన ప్లాస్టిక్ సంచులు, సీసాలు కాలువల్లో చేరి జామ్ చేస్తున్నాయి. దోమల కారక మవుతున్నాయి. కాలువల ద్వారా నదులలోనికి, సముద్రం లోనికి చేరి జీవరాశులకు హానికరం అవుతున్నాయి. జలచరాల ద్వారా మైక్రో ప్లాస్టిక్ కణాలు మన శరీరం లోనికి చేరి ప్రమాదకరం అవుతున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ భూమిలో కలిసి పోవడానికి 700 సంవత్సరాలు పడుతుంది. ఏటేటా ప్లాస్టిక్ వేస్ట్ పెరిగిపోతున్నది. నాశనం కావడం లేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ముఖ్యంగా సంచులు, సీసా లను స్ట్రిక్ట్ గా నిషేధించ వలసి ఉంది. ఈ దశలో జీవీఎంసీ వారు కఠినమైన నిర్ణయాలు చెయ్యవలసి ఉంది. నగర ప్రజలు గా మనం కూడా ప్లాస్టిక్ సంచులు, సీసాల వాడకాన్ని మానెయ్యాలి. వీటికి బదులుగా గుడ్డ సంచులు, జూట్ సంచులు వాడాలి. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని, మన జీవితాలను, మన భవిష్యత్ తరాన్ని, మనతో బాటు ఇతర జీవరాశులను రక్షించుకోవాలి. ఈ కార్యక్రమంలో వార్వా ప్రధాన కార్యదర్శి బి బి గణేష్, నివాస్ ప్రధాన కార్యదర్శి Pitta పిట్టా. నారాయణ మూర్తి మధురవాడ జోన్ అధ్యక్షుడు సిచ్ గోవింద రావు , హరిత గార్డెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎమ్. మాధవి రాణి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి. బుల్లి బాబు , తనూజ, పుష్ప లత, , సుదర్శన రావు, మాజీ కార్పొరేటర్ ఆర్ బాబూ రావు, శేషగిరిరావు, నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినం'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: సాయి ధరమ్ తేజ్-పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా లెక్క తేల్చేదాకా తగ్గేదేలే అని మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. విజయవాడలో ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘నేను చేసినవి ఆరోపణలే అయితే. వాస్తవాలు దాచాల్సిన అవసరం ఏముంది?. పవన్ రెమ్యునరేషన్ ఎంత? సినిమాకు పెట్టుబడి ఎంత? కలెక్షన్స్ ఎంత?. వాస్తవాలు చెప్పడానికి భయపడుతున్నాడా? లేదంటే దాస్తున్నాడా?. నిజాలు దాస్తున్నారంటే ఏదో ఉందనేగా అర్థం అని అంబటి అనుమానం వ్యక్తం చేశారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'పవన్ రెమ్యునరేషన్ ఎంత? సినిమాకు పెట్టుబడి ఎంత?'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరదనీరు వచ్చి చేరుతుంది. జలాశయం నిండుకుండలా జలకళను సంతరించుకుంది. శ్రీశైలం డ్యాం వరదనీటితో గరిష్ఠ స్థాయికి చేరువలో ఉంది. దీంతో జలాశయం 3 క్రస్ట్ గేట్లను కొద్దిసేపటి క్రితం మంత్రి అంబటి రాంబాబు ఎత్తారు. ఇన్ ఫ్లో రూపంలో ప్రస్తుతం 1,27, 980 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతుండగా. ఔట్ ఫ్లో 74,365 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే. ప్రస్తుతం 882.50 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా. ప్రస్తుతం 202.0439 టీఎంసీల నీరు ఉంది. మరోవైపు. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కాగా, శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 882.50 అడుగులకు చేరుకుంది. దీంతో. శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'ఎత్తనున్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రెండు ఉద్యమాల లక్ష్యం ఒక్కటేనని పుడమిని కాపాడుతూ, ప్రకృతి, పర్యావరణం ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరికీ తెలియజెప్పటమేనని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని, మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలని ఆయన స్పష్టం చేసారు. తన ప్రపంచ పర్యటనలో భాగంగా తెలంగాణాలోకి ప్రవేశించగానే భారీ పచ్చదనం ఆకర్షించిందని అన్నారు. వ్యవసాయంలో రసాయనాల వాడకంతో నేల తల్లి జీవం కోల్పోతోందని, రానున్న తరాలకు ఇది పెనుముప్పు కాబోతోంది అన్నారు సద్గరు జగ్గీ వాసదేవ్. పుడమికి, మట్టికి ప్రత్నామ్నాయం లేదని, వీలైనంతగా కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఐదవ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను హైదరాబాద్ లో సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రారంభించారు. సేవ్ సాయిల్ ఉద్యమాన్ని చేపట్టి ప్రపంచ యాత్ర చేస్తున్న సద్గురు హైదరాబాద్ మీదుగా బెంగుళూరు పయనమయ్యారు. మార్గ మధ్యలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ విడతను శంషాబాద్ సమీపంలోని గొల్లూరు అటవీ ప్రాంతంలో సద్గురు స్వయంగా మొక్కలను నాటి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ తో పాటు, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, దండే విఠల్ పాల్గొని మొక్కలు నాటారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వం సాధించిన పచ్చదనం పెంపు విజయాలను సద్గురుకు వివరించారు. అంతే కాకుండా ఎంపీ సంతోష్ చిన్న వయసులో పెద్ద బాధ్యత తీసుకున్నారన్నారు సద్గురు వాసుదేవ్. తక్కువ వయసులో పెద్ద కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని సద్గరు ప్రశంసించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం కావడం పూర్వజన్మ సుకృతమని, సద్గురు ఆశీస్సులు అందుకోవడం మర్చిపోలేని సందర్మమని ఎంపీ సంతోష్ కుమార్ స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో, దేశమంతా హరిత భావజాలం వ్యాపింపచేయాలని నాలుగేళ్ల క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టామని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. ఐదో యేట అడుగు పెట్టిన తమను వెన్నంటి ప్రోత్సహిస్తూ, గ్రీన్ ఇండియా తరపున చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. సద్గురు ఆశీస్సులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందుకోవటం అపురూప ఘట్టంగా భావిస్తున్నామని సంతోష్ కుమార్ తెలిపారు. త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలు తీసుకుంటామని అన్నారు. గొల్లూరు ప్రాంతంలో క్షీణించిన అటవీ ప్రాంతంలో భారీగా చెట్లను పెంచి, చిక్కని పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ ను అటవీ శాఖ సహకారంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టింది. మొదటి దశలో ఇప్పటికే సుమారు తొమ్మిది వందల ఎకరాల అటవీ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అటవీ పునరుద్దరణ పనుల్లో భాగంగా, ఐదవ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒకేసారి పదివేల పెద్ద మొక్కలను నాటారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'రెండు ఉద్యమాల లక్ష్యం ఒక్కటే: సద్గురు జగ్గీ వాసుదేవ్'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: పూణేలో శుక్రవారం 7,166 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి,దీంతో కరోనా కేసులు మొత్తం 13,88,687 కు చేరుకుంది, అయితే 12 మరణాలు 19,429 కు పెరిగాయని అధికారి తెలిపారు.పూణె నగరంలో 3,374, పింప్రి చించ్వాడ్లో 2,261, ప్రాంతాల్లో 1,205, కంటోన్మెంట్ పరిధిలో 98 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'పూణేలో 7,166 కరోనా కేసులు నమోదు'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: బాలికపై అఘాయిత్యం... కోర్టు సంచలన తీర్పు
అత్యాచారం, ఆపై హత్య చేసిన కేసులో త్రిపురలోని ఖోవై జిల్లా కోర్టు సంచలన తీర్పిచ్చింది. తెలియమురా ప్రాంతానికి చెందిన నాలుగున్నరేళ్ల చిన్నారిపై గతేడాది ఫిబ్రవరిలో కాళీచరణ్ అనే వ్యక్తి అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు తాజాగా నివేదికను కోర్టుకు సమర్పించారు. విచారణ అనంతరం కాళీచరణ్ను దోషిగా నిర్ధారించిన కోర్టు మరణశిక్ష విధించింది.ఖోవై జిల్లా మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి.
1
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: రాత్రి 11 గంటల తర్వాత మద్యం అమ్మొద్దు: సైబరాబాద్ పోలీసు కమిషనర్
హైదరాబాద్: రాత్రి 11 గంటల తర్వాత మద్యం అమ్మొద్దని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బార్లు రాత్రి 12 గంటలు, వైన్స్లు రూ.11 గంటలకు మూసివేయాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. కమిషనరేట్ పరిధిలో ఉన్న బార్లు, పబ్ల యాజమాన్యాలతో సీపీ నిన్న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం వ్యాపారులకు పలు సూచనలను చేశారు. వైన్స్ షాపులు, బార్ లు, పబ్లలో రాత్రి 11 గంటల తర్వాత మద్యాన్ని విక్రయిస్తే నేరం కింద పరిగణిస్తామని హెచ్చరించారు. వైన్స్ షాపులు 11 గంటలకు మూసివేయాల్సిందేనన్నారు. కాగా బార్లు, పబ్లలో రాత్రి 11 తర్వాత భోజనానికి సంబంధించిన విక్రయాలు జరుపుకోవచ్చని తెలిపారు. వీటి నిర్వహణకు కూడా యాజమాన్యాలు ట్రేడ్ లైసెన్స్, లిక్కర్ లైసెన్స్, పోలీసు నుంచి అనుమతులను తప్పనిసరిగా పొందాలన్నారు. వీటిలో ఏ అనుమతి లేకపోయినా చర్యలు తప్పవన్నారు. మొదటిసారి నిబంధనలను ఉల్లంఘించే వారిని పోలీసు కమిషనర్ లేదా స్థానిక పోలీసు స్టేషన్లో హాజరుపరుస్తారు. రెండోసారి ఉల్లంఘనలు మించితే కనీసం 3 రోజుల శిక్ష తప్పదన్నారు. ఆ తర్వాత కూడా ఉల్లంఘనలు జరిగితే వారి లైసెన్స్ రద్దుకు సంబంధిత శాఖలకు సిఫార్సు చేస్తామని తెలిపారు. కావునా మద్యం వ్యాపారులందరూ నిబంధనలను పాటించాలని సీపీ పేర్కొన్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: అనేక రోగాలను తగ్గించే గుణాలు కలబందలో ఉన్నాయి. శరీరంలో విష పదార్థాలను కలబంద తొలగిస్తుంది. షుగర్ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లకు ఇది ఎంతో మేలు చేస్తుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధ పడేవాళ్లకు కలబంద రసం ఉపశమనం కలిగిస్తుంది. కలబంద గుజ్జు తినడం వల్ల కీళ్లు దృఢంగా తయారవుతాయి. గాయాలు, పుండ్లను కలబంద తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. మలబద్దకం ఉండేవారు దీనిని వాడితే ఫలితం ఉంటుంది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'కలబంద గుజ్జుతో లాభాలివే'.
2
['tel']
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: కోమటిరెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై చర్యలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం సమయంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్కు గాయమైన ఘటన వీడియో ఫుటేజీలను అసెంబ్లీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా ఈ ఘటనపై మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ. కాంగ్రెస్ సభ్యులు కావాలనే గొడవ చేశారన్నారు. సీఎం కేసీఆర్ ముందుగానే తమను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. బడ్జెట్ సమావేశాల నుంచి బహిష్కరణకు గురవ్వాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. సభలో జరిగిన ఘటనకు సబంధించిన వీడియోలు పరిశీలిస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వినుకొండ పట్టణ బిజెపి అధ్యక్షుడు మేడం రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందు ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ గారు లైవ్ లో ఉపన్యాసం విన్నారు. అనంతరం 11 గంటలకు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి శివయ్య స్తూపం సెంటర్ వరకు శోభాయాత్ర ర్యాలీ నిర్వహించారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'బీజేపీ శోభాయాత్ర ర్యాలీ'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: బీజేపీలో చేరిన మెట్రో మ్యాన్ శ్రీధరన్
మలప్పురం: కేరళకు చెందిన టెక్నోక్రాట్, మెట్రోమ్యాన్ శ్రీధరన్ అధికారికంగా బీజేపీలో చేరారు. గత రాత్రి కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ సమక్షంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విజయ్ యాత్ర పేరుతో సురేంద్రన్ రాష్ట్రంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా గురువారం రాత్రి చంగరాంకులంలో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సురేంద్రన్ మెట్రోమ్యాన్గా ప్రసిద్ధి చెందిన శ్రీధరన్కు పూలమాలవేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీధరన్ మాట్లాడుతూ ఇద తన జీవింలోని అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటని చెప్పారు. తనను బీజేపీలోకి ఆహ్వానించిన శ్రీధరన్కు ధన్యవాదాలు తెలిపారు. కాగా తాను బీజేపీలో చేరనున్నట్లు శ్రీధరన్ గత వారమే ప్రకటించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ కూడా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: అమలాపురం : పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను అంబాజీపేట హై స్కూల్ గ్రౌండ్ లో ఈ రోజు ప్రారంభించారు. అడిషనల్ ఎస్పీ, ట్రైబల్ కోఆర్డినేటర్ మోకా సత్తిబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దేహదారుఢ్య పరీక్షలకు ఉభయగోదావరి, విశాఖ , విజయనగరం జిల్లాల నుంచి దాదాపు 600 మంది హాజరయ్యారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'పోలీసు అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: భర్త కు రెండంగుల వెనుక భార్య ఎందుకు నడుస్తుందో చెప్పిన స్మృతి ఇరానీ
భారత సంప్రదాయం ప్రకారం భర్త ముందు నడిస్తే అతడికి కాస్త వెనుకగా భార్య నడుస్తుంది. దీనికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో భాష్యం చెప్పారు. మన దేశ సంప్రదాయం ప్రకారం భర్తకు రెండడుగులు వెనుకగా భార్య నడవాలన్నది దైవ నిర్ణయం. అందుకు బలమైన కారణం ఉంది. భర్త దారితప్పినా వెనకున్న భార్య సరిదిద్దే వీలుంటుంది. అతడు సమతౌల్యం కోల్పోయినా అతడ్ని తిరిగి దారిలో పెట్టగల శక్తి స్త్రీకి ఉంటుంది. ఈ కారణంగానే భర్త వెనుకే భార్య ఉంటుంది అంటూ నిర్వచించారు. ప్రస్తుతం స్మృతి వ్యాఖ్యలకు చెందిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: తెలంగాణ క్యాబినెట్ కొత్త ఆర్డినెన్స్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ పదవులను ఆఫీసు ఆఫ్ ప్రాఫీట్ పరిధి నుంచి మినహాయిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. జీతాలు, పెన్షన్ చెల్లింపులు, అనర్హత తొలగింపు చట్ట సవరణ కూడా చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. గతంలో ఒక ప్రజాప్రతినిధి మరో లాభదాయమైన పదవి చేపడితే వారిని అనర్హులుగా ప్రకటించేందుకు వీలుంది. కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం ఇకపై ఒక ప్రజాప్రతినిధి రెండు పదవులను నిర్వహించవచ్చు. రెండు చోట్లా జీతం, భత్యం, ఇతర ఆర్థికపరమైన లాభాలను కూడా పొందడానికి అవకాశం లభించనుంది. టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వివిధ కార్పొరేషన్ పదవులను అప్పగించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని రైతు సమన్వయ సమితి చైర్మన్గా నియమించారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'ప్రజాప్రతినిధి రెండు పదవులను నిర్వహించవచ్చు: కొత్త ఆర్డినెన్స్'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం, నిర్దేశిత దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం పడుతుంది.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'సర్వదర్శనానికి 24 గంటల సమయం'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: డ్రోన్ను మింగేయాలనుకున్న మొసలి
నీటి మడుగులో తమకు కనిపించిన ఏనుగును అయినా మొసళ్లు మింగేస్తాయి. అయితే అలాంటి ఓ మొసలిని కొందరు ఆట పట్టించారు. ఓ సరస్సులో మొసలిని చిత్రీకరించేందుకు కొందరు డ్రోన్ కెమెరాను పంపించారు. తన వద్దకు వచ్చిన డ్రోన్ కెమెరాను ఆ మొసలి నిశితంగా పరిశీలించింది. తినే వస్తువు అనుకుని మింగేయాలనుకుంది. దానిని కొంచెం పైకి తీసుకెళ్లగా అమాంతంగా మొసలి కూడా పైకి ఎగిరింది. తినడానికి విఫలయత్నం చేసింది. దీనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే జంతువులను ఇబ్బంది పెట్టడం సరికాదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: పోలింగ్కు గంట ఎక్కువ సమయం: సీఈసీ
ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల్లో ఓటింగ్ కోసం సమయం పెంచుతున్నట్లు సీఈసీ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇటీవల సూచన చేసింది. ఎన్నికలకు సంబంధించి పరిశీలించాని కోరింది. దీంతో సీఈసీ సుశీల్ చంద్రా ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై రివ్యూ చేసి. మీడియాతో మాట్లాడారు.హైకోర్టు సూచనతో అన్నీ పార్టీలు, ప్రతినిధులతో సంప్రదింపులు జరిపామని వెల్డించారు. ఎన్నికను మాత్రం నిర్దేశిత సమయంలోనే నిర్వహిస్తామని తెలిపారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం కొవిడ్ ప్రొటొకాల్ పాటించి ర్యాలీలు తీయాలని కోరారు. రిజిస్టర్ చేసుకోండి,రూ.1000 విలువ చేసే అమెజాన్ వోచర్లు పొందండి అన్నీ ఓటింగ్ బూతులలో వీవీప్యాట్ అమలు చేస్తారు. లైవ్ వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తారు. లక్ష ఓటింగ్ బూతులలో పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉచిత హామీలు ఇవ్వొద్దని కోరారు. జనవరి 5వ తేదీన ఓటర్ల తుది జాబితా ఇస్తామని సీఈసీ తెలియజేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే వారందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేస్తామని తెలిపారు. 5 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేసింది. కరోనా వచ్చిన వారు కూడా ఓటు వేసే సౌకర్యం కల్పించారు. పోలింగ్ బూతులలో ఓటర్ల సంఖ్యను తగ్గిస్తామని సీఈసీ వివరించారు. యూపీలో ఒక్కో పోలింగ్ బూతులో 1500 నుంచి 2 వేల వరకు ఓటర్లు ఉంటారని వివరించారు. 18-19 ఏళ్ల వయస్సు గల ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి సర్కిల్లో ఉండే ఇషా కుమారుడు సుహాన్ డెంగ్యూ జ్వరంతో గురువారం మృతి చెందాడు. శుక్రవారం పుట్టపర్తి మున్సిపాలిటీలో విష జ్వరాలు ప్రబలుతున్నాయని రెండు నెలల క్రితం 11 నెలల చిన్నారి ఇలాగే మృతి చెందిందని ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, వైద్య అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'పుట్టపర్తి: విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టండి'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్యానుయేల్ మెక్రాన్ మరోమారు విజయం
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్యానుయేల్ మెక్రాన్ విజయం సాధించారు. దీంతో ఆయన వరుసగా రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి మరీన్ లీ పెన్పై మెక్రాన్ గెలుపొందారు. కిందటిసారి కూడా మెక్రాన్ మరీన్ లీ పెన్పైనే విజయం సాధించడం విశేషం. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం మెక్రాన్కు రెండో రౌండ్లో 58.55శాతం ఓట్లు రాగా. లీపెన్కు 41.45 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకూ ఫ్రాన్స్లో రెండోసారి అధ్యక్షులుగా ఇద్దరు మాత్రమే ఎన్నికయ్యారు. తాజాగా, మెక్రాన్ కూడా వారి సరసన చేరారు. రెండు దశాబ్దాల తర్వాత పదవిలో ఉన్న అధ్యక్షుడు మళ్లీ ఎన్నికల్లో గెలవడం ఇదే మొదటిసారి. సగం కంటే ఎక్కువ ఓట్లను మెక్రాన్ సాధించినా. ఈ ఎన్నికలు ప్రజల మధ్య స్పష్టమైన విభజనను తేటతెల్లం చేశాయి. ఇక, మెక్రాన్ రెండోసారి అధికారంలోకి వచ్చినా అనేక సవాళ్లు ముందున్నాయి. ముఖ్యంగా జూన్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగున్నాయి. తన ఆశయాలకు అనుగుణంగా దేశంలో పలు సంస్కరణలు చేపట్టాలంటే పార్లమెంట్లో మెజారిటీ చాలా కీలకం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించపోతే ఇబ్బందులు తప్పవు. ఎన్నికల్లో విజయం తర్వాత మెక్రాన్ ఈఫిల్ టవర్ సమీపంలోని డి మార్స్ వద్ద వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ప్రసగించారు. తీవ్రవాద భావజాలం కలిగిన ప్రత్యర్థికి మద్దతు ఇచ్చిన ఓటర్ల ఆగ్రహాన్ని తాను పరిగణనలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లు మాదిరిగా కాకుండా పాలన కొత్తగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘స్వదేశీయులలో చాలా మంది తీవ్రవాదులకు ఓటు వేయడానికి దారితీసిన కారణాలు, విభేదాలకు సమాధానం కనుగొనాలి. ఇది నా బాధ్యత. నా చుట్టూ ఉన్న వారి బాధ్యత’’ అని వ్యాఖ్యానించారు. ఇక, ఎన్నికల్లో గెలిచిన మెక్రాన్కు ప్రత్యర్థి మరీనా లీ పెన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ. తన ఓటమిని అంగీకరించారు. అయితే, రాజకీయాల నుంచి నిష్క్రమించబోనని తెలిపారు. తాను ఫ్రెంచ్ను ఎప్పటికీ వదులుకోను, జూన్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నానని చెప్పారు. ఈ ఫలితాలు అద్భుతమైన విజయానికి ప్రతీక అని ఆమె వ్యాఖ్యానించారు. 2017 ఎన్నికల్లో మెక్రాన్, పెన్లు తలపడగా. ఆయనకు 66 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు పోటీపడి పెన్ ఓటమి చవిచూశారు. తండ్రి జీన్-మేరీ లే పెన్ వారసత్వం నుంచి బయటపడేందుకు మరీన్ సంవత్సరాలుగా కృషి చేశారు. అయితే, అతివాద, జాత్యహంకార వైఖరిని ఆమె పార్టీ ఎప్పటికీ వదిలిపెట్టలేదని విమర్శకులు స్పష్టం చేశారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ట్రంప్కి షాకిచ్చిన పోలాండ్ అధ్యక్షుడి భార్య
జీ20 సదస్సులో భాగంగా పోలాండ్ పర్యటనలో వున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు దాదాపు ఓ చేదు అనుభవం ఎదురైనంత పనైంది. పోలాండ్ రాజధాని వార్సాకి చేరుకున్న సమయంలో పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్, ఆయన భార్యను కలుసుకున్న సందర్భంగా ట్రంప్ మొదట ఆండ్రేజ్కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే సరిగ్గా అదే సమయంలో ఆండ్రేజ్ పక్కనే వున్న పోలాండ్ ప్రథమ మహిళ అగట కార్న్హౌషర్ కూడా ముందుకు రావడం గమనించిన ట్రంప్ ఆమె తనవైపే వస్తుందనుకుని ఆమెకి షేక్హ్యాండ్ ఇవ్వడానికి చేయి ముందుకు చాచారు. కానీ అగట మాత్రం ముందుగా వెళ్లి ట్రంప్ భార్య మెలానియాకు షేక్హ్యాండ్ ఇచ్చారు. తనని దాటుకుని వెళ్లి తన భార్యకి షేక్హ్యాండ్ ఇచ్చిన అగటవైపే అదోలా చూస్తూ నిలబడటం ట్రంప్ వంతయింది. కానీ వెంటనే మళ్లీ అగట వెనక్కి తిరిగి తనకి కూడా షేక్హ్యాండ్ ఇవ్వడంతో కాస్త తేరుకుని అక్కడి నుంచి నిష్క్రమించాడు ట్రంప్. ట్రంప్ రాకని తమ కెమెరాల్లో బంధించేందుకు సిద్ధంగా వున్న కెమెరాలు ఇక్కడ ట్రంప్కి ఎదురైన ఈ విచిత్ర అనుభవాన్ని సైతం తమ కెమెరాళ్లో పదిలపర్చుకున్నాయి. ఇప్పుడు అదే వీడియో ఇంటర్నెట్లో సైతం వైరల్ అయిపోయింది.
1
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. 14 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉభయసభల్లో అర్థవంతమైన చర్చలకు విపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: విద్యాశాఖలో లోటుపాట్లు జరగకూడదు
స్కూళ్లుకు వస్తున్న విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉందని, దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం విద్యాశాఖపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ. స్కూళ్లుకు వస్తున్న విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలన్న సీఎం, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది, - దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలి. పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుంది. అయినా పిల్లలు బడికి రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తారు అని అన్నారు.
1
['tel']
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రమైన రణస్థలంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొందూరు మండలం బాణాంకు చెందిన ముకుందరావు, బొత్స లక్ష్మమ్మ విశాఖపట్నం వైపు నుంచి వెళ్తున్న ద్విచక్ర వాహనంపై వస్తూ. ఎదురుగా వెళ్తున్న బస్సును ఓవర్ టేక్ చేయబోయి. డివైడర్ ఢీకొట్టారు. ద్విచక్ర వాహనంపై వెనక వైపు కూర్చొని ఉన్న వృద్ధురాలు లక్ష్మమ్మ తల ద్విచక్ర వాహనం వెనుక టైరు కిందపడి, మొండెం నుంచి వేరు పడింది. దీంతో అక్కడ హృదయవిదారకర వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు దుర్మరణం'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: టీడీపీ మినీ మేనిఫేస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేతలు
తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా, కమ్మవారిపల్లె పంచాయతీలోని కమ్మవారిపల్లె, తురకపల్లె, మిట్టమీదపల్లె, గోర్లపల్లె, తదితర గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి మినీ మేనిఫేస్టోను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. టీడీపీ హయాంలోనే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందిందన్నారు.జగన్ ప్రభుత్వంలో మహిళలు, యువత అన్నివిధాలా మోసానికి గురయ్యారన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తామన్నారు.
1
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: సుప్రీంకోర్టు తీర్పుతోనైన కాంగ్రెస్కు కనువిప్పు కలగాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. రాఫెల్పై సుప్రీం తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సుప్రీం తీర్పు రాహుల్కు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. అవినీతి, కుంభకోణలకు పాల్పడిన చరిత్ర కాంగ్రెస్దే అని విమర్శించారు. అధికారం కోసం కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. నాలుగున్నరేళ్లుగా కేంద్రంలో పారదర్శక పాలన కొనసాగిందన్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు ఉన్నాయన్నారు. డిసెంబర్ 24న తెలంగాణలో అమిత్ షా పర్యటన ఉంటుందని తెలిపారు. డిసెంబర్ చివరి వారం లేదా జనవరిలో తెలంగాణలో మోదీ పర్యటిస్తారని లక్ష్మణ్ చెప్పారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'సుప్రీంకోర్టు తీర్పుతోనైనా కాంగ్రెస్కు కనువిప్పు కలగాలి : లక్ష్మణ్'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: భైంసాలో నకిలీ నోట్ల కలకలం
నిర్మల్ జిల్లా భైంసా లో నకిలీ నోట్ల కలకలం రేపింది. సోమవారం ఓ బాలుడు ప్రవీణ్ అనే కూరగాయల వ్యాపారి దగ్గర 500 రూపాయల నోటు ఇచ్చి 20 రూపాయల కూరగాయలు కొనుగోలు చేసి 480 రూపాయలు తీసుకెళ్ళాడు మళ్ళీ కాసేపటికే మరో 500 రూపాయల నోటు తీసుకొని వచ్చి మళ్ళీ కూరగాయలు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు 500 రూపాయల నోటు పై అనుమానం వచ్చి బాలుడు ని ప్రశించే లోపు పరారు అయ్యాడు దీనిపై ప్రవీణ్ అనే వ్యాపారి పోలీసులకు పిర్యాదు చేశారు దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
1
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: పిల్లలకు రక్షణగా కొవిడ్ టీకా...!
కరోనా బారి నుంచి పిల్లలకు రక్షణగా కొవిడ్ టీకా అందుబాటులోకి రానుంది. ఈక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చిన్నారుల వివరాలను సేకరించేందుకు కసరత్తు ఆరంభించారు. 18 ఏళ్లలోపు ఉన్న వారి వివరాలను విభాగాల వారీగా సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో 2 నుంచి 18 ఏళ్ల మధ్య ఎంత మంది ఉన్నారన్న విషయం రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత రెండు నెలలుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. జిల్లాలో గరిష్ఠంగా 23కి మించి కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారి సంఖ్య ప్రస్తుతం 20కి మించడం లేదు. భద్రాద్రి జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో ప్రస్తుతం 19 మంది మాత్రమే చికిత్స పొందుతుండగా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో 13 మంది ఇన్పేషంట్లుగా ఉన్నారు. మణుగూరు, అశ్వారావుపేట, ఇల్లెందు సీహెచ్సీల్లో సున్నా స్థాయికి చేరింది. వందల సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షల నమూనాల సేకరణ జరుగుతున్నా గడిచిన వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఒకటి, రెండు కేసులు మాత్రమే వెలుగు చూస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియతో కొంత వరకు కొవిడ్ ప్రభావం తగ్గినా తప్పనిసరిగా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభించిన టీకా పంపిణీ చాలా వరకు కరోనా కట్టడికి దోహదం చేసింది. జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సిన్ను అందించేందుకు, అపోహలను తొలగించేందుకు చేపట్టిన ప్రయత్నాలన్నీ సత్ఫలితాలిచ్చాయి. జిల్లా జనాభా 14, 01, 639 మంది కాగా, 0-18 ఏళ్లలోపు వారు 4, 98, 559 మంది, 18 ఏళ్ల పైబడిన వారు 9, 03, 086 మంది ఉన్నారు. ఇందులో 8, 36, 272 మంది మొదటి డోసు స్వీకరించారు, రెండో డోసు 2, 18, 513 మంది స్వీకరించారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129 సూరారం డివిజన్ పరిధిలోని సూరారం మెయిన్ రోడ్డు వద్ద టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన్నె రాజు గారి పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, రావుల శేషగిరి రావు, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, విజయ్ రామ్ రెడ్డి మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు
సత్తెనపల్లి మండలం గుజ్జర్లపూడి గ్రామంలో 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ. 5సంవత్సరాల కాలంలో 6వ సారి జన్మభూమి కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జన్మభూమి కార్యక్రమంలో చేసిన అభివృద్ధి పనులు చెప్పడంతో పాటు చేయవలసిన పనులు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.ఒక్కరోజూ మీరు వేసిన ఓటుకు 18వందల రోజులు మీకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరుగుతుందని స్పీకర్ కోడెల అన్నారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: కర్నూలు సిటీ లో అక్రమ నిర్మాణాల పేరుతో కేసీ కెనాల్ వెంట ఉన్న ఇళ్ల తొలగింపు
కర్నూలు సిటీ లో అక్రమ నిర్మాణాల పేరుతో కేసీ కెనాల్ వెంట ఉన్న ఇళ్లను పోలీసులు తొలగిస్తున్నారు. దానితో పోలీస్ లు అక్కడి ప్రాంతం వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనితో కర్నూలు సిటీ లోని బంగారుపేటలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాలోని బంగారుపేటలోని కేసీ కెనాల్ వెంట ఉన్న ఇళ్లను అక్రమ నిర్మాణాల పేరుతో పోలీసులు తొలగిస్తున్న నేపథ్యంలో ఈ గొడవ జరిగింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లతో ప్రతిదాడి చేశారు. ఈ దాడిలో సీఐ, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: మాణిక్యాల రావు మరణం ప్రచారం వైసీపీ పనే
మాజీమంత్రి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగడం కలకలం రేగింది. మంగళవారంమాణిక్యాలరావు శ్రద్ధాంజలి, రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి అంటూ ఫేస్ బుక్, వాట్సప్ లలో కొందరు అసత్య ప్రచారానికి తెరలేపారు. పైగాఈ సమాచారం ఓ టీవీ చానెల్ లోనూ వచ్చిందంటూ మరో తప్పుడు ప్రచారం చేయడంతో ఇదినిజమనుకుని ఆందోళన చెందినఆయన అభిమానులుమాణిక్యాలరావు కార్యాలయానికిఫోన్లు చెయ్యడంతో పాటుగా నేరుగా వచ్చి విషయం తెలుసుకున్నారు. ఇటీవలపైడికొండల మాణిక్యాలరావు ముఖ్యమంత్రి జగన్ పైనా ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలోవైసీపీ పార్టీ సోషల్ మీడియాకి చెందిన కొందరుబ్రేకింగ్ వచ్చినట్లుగా సృష్టించి ఫేస్ బుక్ లో పెట్టారాణిబీజేపీ నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు. సదరు ఛానల్ కిఈ వార్త విషయమై కోరితేవాళ్ళు ప్రచారం చేయలేదని తెలిపారని. ఈతప్పుడు ప్రసారం చేసిన వ్యక్తులువైసీపీ పార్టీ నేతల ప్రోత్సాహంతో సామజిక మీడియా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మరో వైపుతనపై వచ్చిన తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించిన మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు, తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్టేషన్లో బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదుచేశారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: కూల్చి పారదొబ్బడానికి ఇదేమన్నా సినిమా సెట్టింగా?
ఇప్పటం గ్రామంలో అక్రమ ప్రహరీలు కూలిస్తే ప్రభుత్వాన్ని కూల్చాలా? అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు. ఇప్పటం గ్రామాన్ని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ సందర్శించిన సందర్భంగా ఒక ఉన్మాదిలా, బరి తెగించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చిపారదొబ్బండి అని కూడా అన్నారు. అంటే ఆయన ఎంత ఫ్రస్టేషన్లో ఉన్నాడో, ఎంత అవివేకంగా ఉన్నాడో, ఎంత అర్థరహితంగా ఉన్నాడో ఆ ఒక్క మాటతోనే అర్ధం అవుతుంది. గత నెల 17వ తేదీన కూడా దాదాపు అలాగే మాట్లాడాడు. కూల్చి పారదొబ్బడానికి ఇదేమన్నా సినిమా సెట్టింగా? షూటింగ్ కాగానే కూల్చి వేయడానికి. ఇది ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం. అది ప్రజలకు మాత్రమే ఉంది. కానీ ఆ ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉంది. ఆలోగానే చంద్రబాబు సహకారంతో ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఒక ఉన్మాదిలా పవన్ మాట్లాడుతున్నాడు అని అంబటి ధ్వజమెత్తారు.
1
['tel']
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: రైతులతో బలవంతంగా భూసేకరణ ఒప్పందం చేయించడం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్ హైకోర్టు అనంతగిరిసాగర్ రిజర్వాయర్ కోసం ప్రభుత్వం రైతులతో బలవంతంగా భూసేకరణ ఒప్పందం చేయించడం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. పునరావాసం, పునర్నిర్మాణం పథకం పిటిషనర్లకు లభించకుం డా అధికారులు చేయడం చట్ట వ్యతిరేకమ ని వెల్లడించింది. ‘120 మంది నుంచి భూ మి తీసుకున్నప్పుడు ఉన్న ధర ప్రకారం పరిహారాన్ని తిరిగి నిర్ణయించి చెల్లించాలి. ఇప్పటికే చెల్లించిన పరి హారాన్ని పిటిషనర్ల నుంచి వసూలు చేయకూడదు. అధికారుల బలవంతంతో చేసిన ఒప్పందానికి పిటిషనర్లు కట్టుబడి ఉండక్కర్లేదు. పిటిషనర్లు ఆర్ఆర్ ప్యాకేజీ పొందడానికి అర్హులు’ అని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా, ఒప్పంద పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించి అర్ధరాత్రి తమను దౌర్జన్యంగా అధికారులు ఇళ్ల నుంచి ఖాళీ చేయించారంటూ సిద్ది పేట జిల్లా చిన్నకొండూరు మండలం అ ల్లిపురం, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామాలకు చెందిన 120 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన కోర్టు. ఒప్పంద పత్రాలపై పిటిషనర్లతో బలవంతంగా సంతకాలు చేయించడం చె ల్లదని, ఆ ఒప్పందానికి పిటిషనర్లు కట్టుబడి ఉండాల్సిన అవసరంలేదని తేల్చిచెప్పింది. అధికారులు వ్యవహరించిన తీరు చట్ట వ్యతిరేకంగా ఉందని ఆక్షేపించింది. సమీపంలోని లింగారెడ్డిపల్లిలో ఎకరాకు రూ. 13 లక్షలు చొప్పున చెల్లించిన ప్రభుత్వం. తమ భూములకు మాత్రం రూ.6.5 లక్షలు చెల్లించడం అన్యాయమని పిటిషనర్లు లేవనెత్తిన ముఖ్యమైన అంశానికి అధికారుల నుంచి జవాబు లేదంది. ఎకరాకు రూ.6.5 లక్షలు చెల్లిస్తామని పిటిషనర్లతో ఒప్పం దం చేసుకోడానికి కారణాలు చెప్పలేదని, భూపరిహారంపై ఇతరత్రా ఆధారాలు కూ డా చూపలేదని తెలిపింది. అయినా ధర విషయంలో జిల్లా కమిటీ తీర్మానం, మార్కె ట్ ధర ఎంత ఉందో కూడా ప్రభుత్వం చె ప్పలేదని అభిప్రాయపడింది. పిటిషనర్లు ఆర్ఆర్ ప్యాకేజీ, భూమి ఇతరత్రా చట్ట ప్రకారం లభించాల్సిన హక్కులను ఎందుకు వదులుకున్నారో, వాటికి ప్రభుత్వం ప్ర త్యామ్నాయం ఏం ఇస్తోందో కూడా ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో ప్రస్తావించలేదని ధర్మాసనం తప్పుపట్టింది. కేసు విచారణ సందర్భం గా అడ్వొకేట్ జనరల్ వ్యవహారశైలిని ధర్మాసనం తప్పుపట్టింది. 4 పిటిషన్లల్లో రెండింటిలో కౌంటర్ వేసి మరో రెండింటిని స మయం మించి పోయినా దాఖలు చేయలే దు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట రిజర్వాయర్కు నీటిని విడుదల చేయాల్సిన కారణంగా పిటిషనర్లను అత్యవసరంగా విచారించాలని ఏజీ కోరారు. తీరా ప్రధాన న్యాయమూర్తి ధ ర్మాసనం మే 11 నుంచి 17 వరకూ లేకపోయేసరికి రోస్టర్ విధానంలో తమ ముందుకొచ్చిన రిట్పై విచారణ అత్యవసరం కాద ని ఏజీ చెప్పారు. ఫైళ్లను చదవలేదని చెప్పి విచారణను వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు పూర్తయిన తర్వాత రోజు మే 14న వా దనలు వినిపిస్తామని ఏజీ చెప్పారు. తీరా 14న ఏజీ లాక్డౌన్ ఎత్తేసే వరకూ వాయిదా వేయాలని మెమో దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సహా అన్ని హైకోర్టులు వీడియో కాన్ఫరెన్స్లోనే కేసుల్ని విచారిస్తున్నాయి. ఏజీ కూడా ఇదే హైకోర్టులోని ఇతర కోర్టు ల్లో ప్రభుత్వ న్యాయవాదులను పక్కన కూర్చొబెట్టుకుని వాదనలు వినిపించారు. ఈ కేసులో మాత్రం వినిపించలేదు. దీనిపై ధ ర్మాసనం స్పందిస్తూ. ‘రోస్టర్ పద్ధతిలో కే సు తమ ముందుకు వచ్చేసరికి వాదనలు అత్యవసరం కాదని ఏజీ చెప్పడం సరికా దు. భూసేకరణ కేసుల్లో 6మాసాల్లోగా ఉ త్తర్వులు జారీ చేయాలన్న చట్ట నిబంధనల మేరకు తీర్పు వెలువరిస్తున్నాం. వీరం దరికీ ఖర్చులుగా ప్రభుత్వం రూ.2 వేలు చొప్పున చెల్లించాలి’ అని స్పష్టం చేసింది.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: యువతి అదృశ్యం... పోలీసులకు ఫిర్యాదు
ఏలూరు శనివారంపేటకు చెందిన ఒక యువతి డిగ్రీ చదువుతూ ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటి నుండి బయటకు వెళ్లిన యువతి మరల ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆ యువతి తండ్రి తెలిసిన చోటల్లా అంత వెతికినా యువతి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: దేశంలో ప్రింట్ మరియు పబ్లిషింగ్ పరిశ్రమ యొక్క రిజిస్ట్రేషన్ను నియంత్రించే ప్రస్తుత చట్టాన్ని భర్తీ చేసే బిల్లును రాజ్యసభ గురువారం ఆమోదించింది. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023 వాయిస్ ఓటుతో ఆమోదించబడింది.ఈ బిల్లు ప్రస్తుతం ఉన్న ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ (PRB) చట్టం, 1867 స్థానంలో ఉంది. పీరియాడికల్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు పబ్లిషర్లపై విచారణ మరియు జైలుశిక్షకు సంబంధించిన నిబంధనలను తొలగించడానికి మరియు పత్రికల నమోదు ప్రక్రియను సులభతరం చేయడానికి ఉద్దేశించిన PRP బిల్లుకు కేంద్ర మంత్రివర్గం గత నెలలో ఆమోదం తెలిపింది.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లును ఆమోదించిన రాజ్యసభ'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: కుటుంబ కలహాల నేపథ్యంలో వేరుగా ఉంటున్న భార్యపై భర్త మరికొందరు దాడికి పాల్పడిన ఘటన గురువారం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక కంభంపాలెంకు చెందిన కోటేశ్వరరావు గుండాలఆదుకు చెందిన ప్రభావతి దంపతులు. ప్రభావతి కొంతకాలంగా విజయవాడలో ఉంటున్నారు. డ్వాక్రా రుణానికి సంబంధించి నరసరావుపేట లోని బ్యాంకు వద్దకు రాగా విషయం తెలుసుకున్న కోటేశ్వరరావు మరో తొమ్మిది మందితో కలిసి వచ్చి తనపై దాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'భార్యపై భర్త, మరికొందరు దాడి'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: వ్యవసాయం దండగ కాదు, పండగని నమ్మే పార్టీ కాంగ్రెస్ : దామోదర రాజనర్సింహ
రైతు సుభిక్షంగా ఉండాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ నేత దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ కనీస మద్దతు ధర, మార్కెట్ వ్యవస్థలు మూసి వేయడమే ఈ వ్యవసాయ బిల్లుల ఉద్దేశ్యమని విమర్శించారు. వ్యవసాయం దండగ కాదు, పండగని నమ్మే పార్టీ తమదని అన్నారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం దేశ వ్యాప్తంగా నిరసలు కొనసాగుతాయని చెప్పారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రెండు కోట్ల మంది సంతకాలు సేకరించి నవంబరు 14న రాష్ట్రపతికి అందజేస్తామని రాజనర్సింహ అన్నారు. వ్యవసాయ బిల్లులకు టీఆర్ఎస్ పార్టీ కూడా పరోక్షంగా మద్దతు ఇచ్చిందని విమర్శించారు. బీజేపీ, ఎన్డీఏ విధానాలకు టీఆర్ఎస్ మొదటి నుంచి పరోక్ష మద్దతు తెలుపుతుందన్నారు. ఈ మూడు బిల్లుల అమలు వలన వ్యవసాయ మార్కెట్లు ఉండవని, బడాబాబుల కోసమే మోదీ ప్రభుత్వం ఈ బిల్లులు తెచ్చిందని ఆరోపించారు. రైతు మద్దతు ధరకు ఈ చట్టం వలన రక్షణ ఉండదన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని రాజనర్సింహ తెలిపారు. రెండు రోజుల్లో దుబ్బాక అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ప్రజల ఆశీస్సులుంటే దుబ్బాకలో తామే గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పక్క పార్టీ వారికి కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం తనకు తెలియదని, కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని రాజనర్సింహ వ్యాఖ్యానించారు.
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: అక్కడ ఒక్క రోజే 6 లక్షలకు పైగా కరోనా కేసులు
కరోనా కథ ముగిసినట్టేనంటూ ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేస్తోంది మహమ్మారి. ఒకవైపు చైనాలో కేసుల సంఖ్య రెండేళ్ల గరిష్ఠానికి చేరుకోగా మరోవైపు దక్షిణ కొరియాలో భారీగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. బుధవారం ఆ దేశంలో 4 లక్షల కొత్త కేసులు నమోదు కాగా ఒక్క రోజులోనే 55 శాతానికి పైగా కేసులు పెరిగాయి. గురువారం 6,21,328 కొత్త కేసులు వెలుగు చూశాయి. కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ ఈ మేరకు గణంకాలు విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 429 మంది కరోనాతో మరణించినట్టు ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,50,592కు చేరింది. అంతకుముందు రోజు 293 మంది కరోనాకు బలయ్యారు. రోజువారీ కొత్త కేసులన్నవి వైద్య నిపుణుల అంచనాల కంటే ఎక్కువగా ఉన్నాయి. మార్చి మధ్య నాటికి కరోనా కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. గరిష్ఠంగా 2,70,000 వరకు కేసులు రావచ్చని భావించగా దానికి రెట్టింపు దాటిపోయాయి. కేసుల సంఖ్య భారీగా నమోదైనా. రానున్న రోజుల్లో భౌతిక దూరం సహా అన్ని రకాల సామాజిక నియంత్రణలను ఎత్తివేయాలన్న ప్రణాళికలను పక్కన పెట్టే ఉద్దేశ్యం ఏదీ సర్కారుకు లేదని తెలుస్తోంది.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: కృష్ణా జిల్లా అవనిగడ్డలో భారీ వర్షం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా ఆరు గంటల పాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు జలదిగ్బంధంలో చిక్కు కోగా రెవెన్యూ కార్యాలయం, సబ్ ట్రెజరీ, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఎస్ ఎస్ కార్యాలయాల్లో వరద నీరు అడుగు మేర నిలిచాయి.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: విశాఖకు రాజధాని అంటూ వైసీపీ నేతలు చేయిస్తున్నబలవంతపు ఉద్యమమని ఏపీకి మూడు రాజధానులపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన. నిజానికి ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధాని కావాలన్న కోరిక లేదన్నారు. విశాఖకు రాజధాని అంటూ చేయిస్తున్నది వైసీపీ నేతలు చేయిస్తున్నబలవంతపు ఉద్యమమని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామంటే విశాఖ ప్రజలు స్పందించారని, కానీ రాజధాని కోసం ఎవరూ స్పందించడం లేదని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రమే కాదని, వైసీపీ నేతలు కూడా విశాఖకు రాజధానిని కోరుకోవడం లేదన్నారు. విశాఖకు రాజధాని కావాలని మూడేళ్లుగా రాజీనామా చేయని నేతలు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని హర్షకుమార్ ప్రశ్నించారు. వాస్తవంగా చెప్పాలంటే నేతలు తమంతట తాము రాజీనామా చేయడం లేదని, ముఖ్యమంత్రి జగన్ వారితో ఆ పని చేయిస్తున్నారని అన్నారు. విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదాపై పెదవి విప్పనివారు మూడు రాజధానుల గురించి రాజీనామా చేస్తున్నామంటే ప్రజలు నమ్మబోరన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకే ఒక్కరాజధానికి కట్టుబడి ఉందని, నాన్ పొలిటికల్ జేఏసీతో తాము కలిసేది లేదని హర్షకుమార్ తేల్చి చెప్పారు. పనిలో పనిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పైనా హర్షకుమార్ విరుచుకుపడ్డారు. ఆయనేదో పెద్ద సంస్కరణవాదిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టిన కేసీఆర్ జాతీయ పార్టీ ఎలా పెట్టారని నిలదీశారు. కేసీఆర్ లాంటి సంకుచిత భావాలున్న నేత రాణించిన దాఖలాలు దేశ చరిత్రలోనే లేవని హర్షకుమార్ పేర్కొన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'వైసీపీ నేతలు చేయిస్తున్నది బలవంతపు ఉద్యమం: హర్ష కుమార్'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా కొమ్మినేని
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదాతో నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా కొమ్మినేని రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం అభంగపట్నంలో దళితులపై దాడి చేసిన బీజేపీ నేత భరత్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 25 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న భరత్రెడ్డిని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నిజామాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల రోజులుగా భరత్రెడ్డి కోసం నిజామాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. మొరం తరలింపును అడ్డుకున్నారని దళిత వ్యక్తులైన లక్ష్మణ్, రాజేశ్వర్లను భరత్రెడ్డి అపహరించిన విషయం విదితమే. ఇటీవల బాధితులను స్వస్థలానికి పోలీసులు చేర్చారు. బాధితుల ఫిర్యాదుతో భరత్రెడ్డిని పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'దళితులపై దాడి చేసిన భరత్రెడ్డి అరెస్ట్'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: దేశంలో రోజురోజుకు కొన్ని ప్రాంతాల్లో మతోన్మాద శక్తులు పెరిగిపోతున్నాయని, చివరికి విద్యా సంస్థలలోకి కూడా చొరపడుతున్నాయంటూ బిజెపి నాయకులు మండిపడ్డారు. గుంటూరు సిటీలోని లక్ష్మీ థియేటర్ లో, గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో కొన్ని విధ్వంసక శక్తులు రాజకీయ లబ్ది కోసం విద్యాసంస్థలలో ఎన్నడూ లేని విధంగా, డ్రస్ కోడ్ విషయంలో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఒక విద్యార్ధిని అల్లాహుకు అక్బర్ అంటే తప్పులేదు. ఒక విద్యార్థి జై శ్రీరామ్ అంటే తప్పు అంట అని కర్ణాటక రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే నేతలు అంటున్నారని, గుంటూరు జిల్లా బిజెపి అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'మతోన్మాద శక్తులపై బీజేపీ నాయకులు ఫైర్'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: నిద్రలేవగానే ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది
నిద్రలేవగానే ఇంట్లో వారితో నవ్వుతూ మాట్లాడితే అది ఆ రోజంతా మీ మూడ్ను ఉత్సాహంగా మారుస్తుంది. నిద్రలేవగానే టీ, కాఫీ కంటే గ్లాస్ నిమ్మరసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. నిద్రలేవగానే ఫోన్స్ వాడకుంటే మీకు కాస్త ప్రశాంతత లభిస్తుంది. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లు మూసుకుని ఊపిరి బాగా పీల్చి వదిలితే శ్వాసక్రియ బాగుంటుంది. రోజూ ఒకే సమయానికి నిద్ర లేస్తే ఎంతో బెటర్.
1
['tel']
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 28వ తేదీన అమరావతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులు మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులకు క్షమాపణ చెప్పి చంద్రబాబు రాజధానిలో అడుగు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. రైతు అభిప్రాయ సేకరణ ద్వారా రభస సృష్టించి మాపై కేసులు పెట్టించి గత ప్రభుత్వ స్ధానిక ఎమ్మెల్యే భయపెట్టారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మా చుట్టూ తిరిగి మాకు బొమ్మలు చూపించారు. గత మూడేళ్ళలో అన్నీ తాత్కాలికమే. ఒక్క మంచి పని జరగలా. మాకు అన్యాయం జరిగింది. గత ప్రభుత్వంలో మేము మోసపోయాం.చంద్రబాబు రాజధానిలో అడుగుపెట్టే ముందు మాకు గతంలో ఇచ్చిన హామీల విషయంపై సమాధానం చెప్పి రావాలి. ఉచిత వైద్యం, విద్య, ప్లాట్ల పంపిణీ పెద్ద గోల్మాల్ జరిగింది. మాజీ మంత్రి నారాయణ కమీషన్ల కక్కర్తి వలనే రోడ్లు, ఇతర కన్ స్ట్రక్షన్స్ అన్నీ అసంపూర్ణంగా జరిగాయి. రాజధాని అభివృద్ధి విషయంలో టీడీపీ నేతలకు కు ఎంతెంత కమిషన్లు అందాయో చెప్పాలి. రాజధానికి భూములు వైసిపి నేతలు ఇచ్చారే తప్ప టిడిపి నేతలు వాళ్ళు భూములివ్వలేదు. రాజధానిలో 9 వేల ఎకరాలు గత టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు కొన్నారు. మా కిచ్చిన ప్లాట్ల మధ్యలో 25 లక్షల గజాలు హోల్డ్లో ఎందుకు పెట్టారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. రైతులకు సమాధానం చెప్పకుండా రాజధానిలో ఎలా పర్యటిస్తారో చూస్తాం. గతప్రభుత్వం అసైన్డ్ భూములకు ఎందుకు తక్కువ ప్యాకేజ్ ఇచ్చారు. చంద్రబాబు రాజధానిలో పర్యటించాలంటే దళితులకు క్షమాపణ చెప్పాల్సిందే. లేదంటే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. చంద్రబాబు 28న రాజధాని ప్రాంతానికి రావొద్దని సూచిస్తున్నామని రాజధాని ప్రాంత వాసులు, రైతులు హెచ్చరిస్తున్నారు.మూడు సంవత్సరాలులో ఫ్లాట్స్ అభివృద్ధి చేస్తామన్న అప్పటి ప్రభుత్వం ఎందుకు చేయలేదని వారు ప్రశ్నించారు. ఇంకా రాజధాని అమరావతిలో నిర్మించేందుకు పూర్తి మద్దతు తెలిపారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'అమరావతిలో చంద్రబాబు ఎలా పర్యటిస్తారో చూస్తాం... రైతుల హెచ్చరిక'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: విజయవాడ, సూర్య బ్యూరో : రాష్ర్టంలో చదువుకునే వైద్య విద్యార్ధులకు, మహిళాలకు వసతి గహలు తక్కువుగా ఉన్నాయని, వారికీ మరింత మెరుగైన మౌళిక సదుపాయాల కల్పనలో భాగంగా పెద్ద ఎత్తున వసతి గహాల నిర్మాణం చేపడుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సిద్దార్ధ వైద్య కళాశాల ఆవరణలో యుజి విద్యార్థులకు, సీనియర్ రెసిడెన్స్ కోసం 20 కోట్లతో నిర్మించ తలపెట్టిన వసతి గహాల సముదాయ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ సిద్ధార్థ వైద్య కళాశాలలో 550 మంది విద్యార్ధునులు చదువుకొంటున్నట్లు మంత్రి తెలిపారు. వసతి గహ నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడకూడదని, నిర్మాణ పనులు 16 నెలలు లోపు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు మంత్రి సూచించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రూ.150 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటి బ్లాక్ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదివే యూజీ విద్యార్ధులకు ట్యాబ్స్ ఇచ్చామన్నారు. ప్రభుత్వాసుప్త్రులలో ప్రసవాలు పెరిగేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, బేబి కిట్స్తో పాటు మదర్ కిట్ ఇస్తున్నామన్నారు. త్వరలో మహా ప్రస్ధానం కార్యక్రమంను ప్రారంభిస్తున్నామని టెండర్లు పిలిచినట్టు మంత్రి తెలిపారు. ప్రభుత్వాసుప్త్రులలో శానిటేషన్ గతంలో కంటే ప్రస్తుతం మెరుగుపడిందన్నారు. ప్రభుత్వాసుప్త్రులలోని వార్డులలో 7రోజులు 7 రంగుల బోర్డరు అంచుతో బెడ్గషీట్స్ మారుస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని ప్రభుత్వాసుప్త్రులలో ‘‘పేషంట్ ఇజ్ అల్టిమెట్’’ అను ఆర్ధం వచ్చేలా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని అకాడమిక్ డిఎమ్ఇ బాబ్జీని మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశించారు
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'వైద్య విద్యార్థులు, మహిళలకు 20 కోట్లతో వసతి గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో మల్లం బావి దగ్గర ఏర్పాటు చేస్తున్న నూతన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి శనివారం రోజు సన్ రైజర్స్ అసోసియేషన్ తరపున 30116/- రూపాయలను (అక్షరాల 30 వేల 116 రూపాయలు) చత్రపతి శివాజీ విగ్రహ కమిటీకి అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పి జె బాబు మరియు సభ్యుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ రాములు యాదవ్, ఆకుల వెంకటయ్య, సూర చంద్ర శేఖర్, సాయిల్ యాదవ్, నరేంద్ర సాగర్, పెంటన్న యాదవ్, పి శ్రీనివాసులు, పి వినోద్ సాగర్, పి నరేష్ కుమార్, రమేష్ సాగర్, సంతోష్ కుమార్, శంకర్ యాదవ్, శివకుమార్, ఫోటో స్టూడియో రాజు, ఆప్టికల్ మురళి, రంజిత్ రెడ్డి, చిన్ని శంకర్, ఆటో రాములు, కదిర శీను, పెద్ద నరసింహ, గుంత రమణ, గుంత కిరణ్ పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'చత్రపతి శివాజీ విగ్రహా ఏర్పాటుకు విరాళం'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: తెలంగాణలో అతిపెద్ద ద్వారపాలక శిల్పం ఇదే
తెలంగాణలోనే అతిపెద్ద ద్వారపాలక శిల్పాన్ని సిద్దిపేట జిల్లాలో గుర్తించారు. నారాయణరావుపేట మండలంలోని మల్యాల పొలాల్లో ఈ శిల్పాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. ఈ శిల్పం విష్ణు ద్వారపాలకుడైన విజయుడిదని, కళ్యాణి చాళుక్యుల తొలి కాలమైన క్రీ.శ.10వ శతాబ్దికి చెందిందని తెలిపారు. ఇది భూమిపై 6 అడుగులు, లోపల 3 అడుగుల పొడవు, 9 అంగుళాల మందంతో ఉందని తెలిపారు
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: హైదరాబాద్: కేసీఆర్కు దుర్బుద్ధి పుట్టి ప్రభుత్వాన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యానించారు. గతంలో అనేకసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు ప్రజల కోసం మరోసారి ఎందుకు వెళ్లకూడదన్నారు. నగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన. కేసీఆర్ పోవాలంటే ఎన్నికలు రావాలన్నారు. భస్మాసుర హస్తం కేసీఆర్ చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రజలకు మేలు జరగాలంటే . దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ప్రభుత్వాన్నీ రద్దు చేసుకోమని చెప్పాలన్నారు. ప్రజల కష్టాలను చూసి తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారన్నారు. కానీ మరోరకమైన లబ్ధి జరిగి కేసీఆర్ కుటుంబంతో పాటు ఇతర రావులకు మేలు జరుగుతోందన్నారు. తాను సోనియాగాంధీ మనిషినని. కాంగ్రెస్ పార్టీ బిడ్డనని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు తక్కువ సమయంలో అత్యంత గౌరవమైన బాధ్యత ఇచ్చారన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడంలో అందరూ భాగస్వామ్యం కావాలని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'నేను సోనియాగాంధీ మనిషిని: రేవంత్ రెడ్డి'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: తెలంగాణలో ఆదివారం మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 నిమిషాల వరకు వైన్స్ షాపులు తెరిచి ఉంటాయని ఓ సర్క్యూలర్ వైరల్ అవుతుంది. ఇది తెలంగాణ ఎక్సైజ్ శాఖ జారీ చేసిన ఉత్వర్వులు అంటూ ఆ న్యూస్ సోషల్ మీడియలో హల్చల్ చేస్తుంది. ఇది నిజమే అనుకున్న మందు బాబులు దానిని తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ ఫేక్ సర్క్యూలర్ తయారు చేసిన వారి పై కేసు పెట్టేందుకు ఆబ్కారీ అధికారులు సిద్దమవుతున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ వారు హెచ్చరిస్తున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'వైన్స్ షాపులు ఓపెన్ అంటూ ఫేక్ మెసేజ్'.
2
['tel']
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: స్పీకర్ గా తమ్మినేని ఏకగ్రీవ ఎన్నిక
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఆముదాలవలన ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవం ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి తమ్మినేని నామినేషన్ వేయగా మద్దతుగా ముప్పై మంది సభ్యులు బలపరిచారు. నామినేషన్ గడువు ముగియగా తమ్మినేని ఏకగ్రీవ ఎన్నికయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ గా బాధ్యతలను చేపట్టనున్నారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: హైకోర్టు సంచలన తీర్పు...
ఇస్లామిక్ చట్టం ప్రకారం యుక్త వయసు మైనర్ ముస్లిం బాలిక తన ఇష్టం మేరకు పెళ్లి చేసుకునే హక్కు ఉందని పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. ఇస్లామిక్ చట్టంలోని ఆర్టికల్ 195ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. పునరుత్పత్తి దశకు రాని మైనర్లు వాళ్ల గార్డియన్ల ద్వారా వివాహ బంధంలోకి అడుగుపెట్టవచ్చని తెలిపింది. యుక్త వయసు మైనర్లు మాత్రం తమ ఇష్టం మేరకు గార్డియన్ అనుమతి ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకోవచ్చు అని ఆ ఆర్టికల్లో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది.పంజాబ్కు చెందిన ఓ ముస్లిం జంట వేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ అల్కా సరిన్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. 37 ఏళ్ల వ్యక్తి, 17 ఏళ్ల అమ్మాయి గత నెల 21న పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ల పెళ్లి ఇష్టం లేని కుటుంబ సభ్యులు తమను బెదిరిస్తున్నారని, వాళ్ల నుంచి రక్షణ కల్పించాలని ఈ జంట కోర్టును ఆశ్రయించింది. అమ్మాయి మైనర్ అయినా కూడా ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ పెళ్లి చెల్లుతుందని తీర్పు చెప్పిన కోర్టు. వాళ్లకు రక్షణ కల్పించాలని మొహాలీ ఎస్ఎస్పీని ఆదేశించింది.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 12,680 సర్పంచి పదవులకు 1,12,460 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా 16.7 శాతం సర్పంచి పదవులకు, 126.4 శాతం వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయని వెల్లడించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. విపరీతమైన చలిలోనూ అందరూ ఉత్సాహంగా పంచాయతీ ఎన్నికలు పాల్గొని విజయవంతం చేశారన్నారు. ఒక్క టెండరు ఓటు పడినా పరిశీలకుల అనుమతితోనే ఓట్ల లెక్కింపు చేపట్టాలని స్పష్టం చేశామని వివరించారు. నాలుగు చోట్ల టెండర్ ఓటు వల్ల రీపోలింగ్కు వెళ్లినట్టు చెప్పారు. ఒకచోట ఏకగ్రీవం కోసం వేలం జరిగినట్లు గుర్తించి ఎన్నిక రద్దు చేశామన్నారు. అభ్యర్థులు, అధికారులు, ఓటర్ల కోసం తెలుగులోనూ బుక్లెట్స్ ప్రచురించి ఇచ్చామన్నారు. వెబ్సైట్ ద్వారా 5000 జీబీకి పైగా డేటాను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'సర్పంచి పదవులకు ఎన్నికలు పూర్తి'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: నందవరం మండలంలో బయట పడిన సొరంగం…
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని నందవరం మండలం ముగతి గ్రామం నందు గ్రామ నడిబొడ్డున ఉన్న గ్రామ చవిడి దగ్గర సుమారు 40 అడుగుల మేర స్వరంగం బయటపడింది. ఆ స్వరంగం దాదాపు మూడు తరాల క్రితందై ఉండొచ్చని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ స్వరంగం లో ఏమి ఉందొ అని చూడటానికి చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వస్తుండడంతో ఆ ప్రాంతం అంత పర్యాటక వాతావరణాన్నితలపిస్తోంది. ఈ స్వరంగం సమాచారం అందుకున్న పోలీసులు సిఐ మహేశ్వరరెడ్డి, ఎసై వేణుగోపాల్ రాజ్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని సొరంగాన్ని పరిశీలించారు. దీని పై పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందిస్తామన్నారు.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: భద్రతకు, భరోసాకు మారుపేరు, ప్రశాంతతకు చిరునామా తెలంగాణ: కేటీఆర్ ట్విట్
పోలీస్ సురక్షా దినోత్సవం సంద్భంగా పోలీసుల సేవలను కొనియాడుతూ. భద్రతకు, భరోసాకు మారుపేరు, ప్రశాంతతకు చిరునామా తెలంగాణ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో శాంతి భద్రతల నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలను ఉపయోగిస్తూ దేశానికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా పటిష్టమైన శాంతిభద్రతల నిర్వహణతో పెట్టుబడులకు ఆకర్షణీయమైన రాష్ట్రంగా తెలంగాణ పేరుగాంచిందంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్. పోలీసు వ్యవస్థని పూర్తిగా అధునీకరించి, అవసరాల మేర పునర్వ్యవస్థీకరించి. ఆధునిక హంగులతో కూడిన కొత్త వాహనాలతో పోలీసింగ్ని తెలంగాణ సర్కార్ మరింత పటిష్టపరించిందని కేటీఆర్ తెలిపారు. పోలీసు నియామకాలను భారీగా పెంచి ఫ్రెండ్లీ పోలీసింగ్తో ముందుకు సాగుతుందన్నారు. అలాగే. కమీషనరేట్లు, కొత్త పోలీస్ స్టేషన్ల పెంపు, సరికొత్త జిల్లా ఎస్పీ కార్యాలయాల భవనాలతో పోలీసు వ్యవస్థ ముఖచిత్రమే మారిపోయిందని చెప్పుకొచ్చారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ 'షీ టీమ్స్', 'షీ క్యాబ్స్' వంటి వినూత్న ఆలోచనలతో ఆడబిడ్డల రక్షణకి భరోసానిస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. తద్వారా పోకిరీల ఆగడాలు అరికట్టడంలో గణనీయమైన ఫలితాలు సాధించింది. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన షీ టీమ్స్ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. నిఘా వ్యవస్థని పటిష్టం చేస్తూ. రాష్ట్రవ్యాప్తంగా సీసీటీవీ కవరేజీని పెంచింది తెలంగాణ ప్రభుత్వం. నేర నియంత్రణలో, నేరస్తుల్ని పట్టుకోవడంలో ఈ సీసీటీవీలు ఇతోధికంగా సాయపడుతున్నాయి. ఒక వైపు ప్రజల్లో తాము సురక్షితంగా ఉన్నామన్న నమ్మకాన్ని నింపుతూ, మరో వైపు నేరాలకు పాల్పడే వాళ్లకు నేరం చేస్తే పోలీసులకు దొరికిపోతామనే భయాన్ని కలిగిస్తున్నాయి. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సీసీటీవీల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేసింది తెలంగాణ సర్కారు. ప్రపంచంలో అత్యధిక సిసిటీవీలతో పటిష్టమైన శాంతిభద్రతల నిర్వహణ చేస్తున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రభాగాన ఉంది.
1
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: చెత్తపన్ను ఎందుకు కట్టాలంటూ విశాఖ జిల్లాలో నిలదీసిన మహిళలకు ఏ సమాధానం చెప్పాలో తెలియక జారుకున్న పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే ఆదీప్‍రాజ్‍. కాకిగోల చేయోద్దంటూ మహిళలపై చిరాకుపడిన జోనల్ కమిషనర్. అడ్డమైన పన్నులతో పిండేస్తూ. తిరిగి మా పైనే కోప్పడతారా అంటోన్న ప్రజలు. అని టీడీపీ పార్టీ , ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా ద్వారా వీడియో రూపంలో తెలియచేసారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'చెత్త పన్ను మేము కట్టం అంటున్న విశాఖ వాసులు'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: విద్యార్థినికి తాళికట్టబోయి చివరికి...
ఇటీవలే రాజమహేంద్రవరంలో జూనియర్ కాలేజీలో ఓ బాలికకు మరో విద్యార్థి తాళికట్టిన ఘటన సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఇష్యూనే అయ్యింది. ఆ ఘటన మరువక ముందే అదే తూర్పుగోదావరి జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. రాయవరం హైస్కూల్లో ఓ బాలిక మెడలో తాళి కట్టేందుకు మరో యువకుడు సాహసించడం సంచలనంగా మారింది. బాలిక మెడలో ఒక యువకుడు తాళి కట్టే ప్రయత్నం చేయడంతో ఆమె అన్నయ్య అడ్డుకోవడంతో అతడు పరారయ్యాడు.వివరాల్లోకి వెళ్తే ఏఎస్ఐ పి. వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం అనపర్తి మండలంలోని మహేంద్రవాడకు చెందిన పదోతరగతి బాలిక యథావిథిగా పాఠశాలకు హాజరైంది. తరగతులు ప్రారంభం కాకముందే అనపర్తి మండలంలోని కొప్పవరానికి చెందిన సత్తి శివారెడ్డి(23) అనే యువకుడు మైనర్ బాలికకు తాళి కడతానంటూ తరగతిలోకి ప్రవేశించాడు. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన విద్యార్థులు, బాలిక తమ్ముడు కేకలు వేస్తూ యువకుడిని అడ్డుకుని నెట్టివేశారు. కేకలు విని ఉపాధ్యాయులు రావడం గమనించిన యువకుడు తాళిబొట్టును పడేసి ద్విచక్రవాహనంపై పారిపోయాడు.సమాచారం అందుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలికనే వివాహం చేసుకుంటానంటూ యువకుడు గత రెండు నెలలుగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్దలు మందలించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులకు బాలిక తండ్రి ఫిర్యాదులో తెలిపాడు. పోలీసులు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ యువకుడు బాలిక ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్నకు యత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాయవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: మతాల మధ్య సామరస్యం కాపాడటం ఎంతో అవసరం: నూతన డీజీపీ
మతాల మధ్య సామరస్యం కాపాడటం ఎంతో అవసరమని నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి డీజీపీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తానని అన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఎన్నో ఆకాంక్షలు ఉంటాయని చెప్పారు. ఒక కానిస్టేబుల్ తప్పు చేసినా మొత్తం పోలీసు వ్యవస్థపైనే ఆరోపణలు వస్తాయని అన్నారు. మతాల మధ్య సామరస్యం కాపాడటం ముఖ్యమని చెప్పారు. చిన్న పొరపాటు కూడా జరక్కుండా గౌతమ్ సవాంగ్ ఎంతో బాగా విధులను నిర్వర్తించారని అన్నారు. పోలీసు వ్యవస్థకు టెక్నాలజీని అందించారని కొనియాడారు. సవాంగ్ సామర్థ్యం చూసే ఆయనకు ముఖ్యమంత్రి మరో కీలక బాధ్యతను అప్పగించారని చెప్పారు. 1992 బ్యాచ్కు చెందిన రాజేంద్రనాథ్రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఆయన 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా విధుల్లో చేరారు. జిల్లాలో పలు బాధ్యతలను నిర్వహించిన తర్వాత విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పని చేశారు. విశాఖ, విజయవాడ పోలీస్ కమిషనర్ గా పని చేశారు. హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పని చేశారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: ఛత్తీస్గఢ్ : రాయ్పూర్లోని ఓ రైల్వేస్టేషన్లోని కారు పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగాయి. ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పార్కింగ్లో ఉన్న కార్లన్నీ కాలి బూడిదయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'రాయ్పూర్ రైల్వేస్టేషన్లో మంటలు'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: మరో ఐదేళ్లు పదవి దక్కుతుందని ఆశించి మూడు నెలల ముఖ్యమంత్రి పదవీ యోగాన్ని త్యాగం చేసినా ఐదు సీట్లు కూడా రాకుండానే రాజకీయాల్లోంచి అవుటయిపోయారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. లగడపాటి, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వాళ్లు అయినా గౌరవంగా నిష్క్రమించగలిగారు కానీ సమైక్యాంధ్రను విభజిస్తారా మీ పదవి వద్దు మీ పార్టీ వద్దు అని సీఎం పదవికి - పార్టీ సభ్యత్వానికి రాజీ నామా చేసినా ఏపీ ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డిని నమ్మలేదు. ఆనాటి పరిణామాలు అలాంటివి. స్వీయ తప్పిదాల వల్ల కాంగ్రెస్ నిర్ణయాల వల్ల అసంకల్పితంగా అజ్జాత వాసంలోకి వెళ్లిపోయిన ఈ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత తర్వాత కొంతకాలానికి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరారు. అయినా యాక్టివ్ గా వ్యవహరించలేదు. మరోవైపూ కాంగ్రెస్ క్రమంగా పతనం అవుతూ రావడంతో ఇక ఆయన పార్టీని పట్టించుకోవడం మానేసి రాజకీయ అజ్జాతంలో కొనసాగుతున్నారు. తాజాగా ఆయన పేరు మళ్లీ రాజకీయ తెరపై వినిపిస్తోంది. బీజేపీ నేత ఎమ్మెల్సీ మాధవ్ మాజీ సీం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఆయన బీజేపీలోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలుగు ప్రజలు బీజేపీలో కొన్ని సంచలన చేరికలు చూడబోతున్నారని ప్రకటించిన మాధవ్ అందులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరును మచ్చుకు బయటపెట్టారు. ఇంకా చేరాల్సిన పెద్ద తలకాయలు చాలా ఉన్నాయని ప్రస్తుతానికి కిరణ్ బీజేపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నారని వెల్లడించారు. ఇదిలా ఉండగా. ముఖ్యమంత్రి వంటి కీలక పదవిలో కూర్చోవడమే కిరణ్ యాక్టివ్ రాజకీయాల్లో లేకపోవడానికి కారణమైంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో బీజేపీ యాక్టివ్ గాలేదు. కాంగ్రెస్ శూన్యం. ఇక మిగిలినవి ప్రాంతీయ పార్టీలు. వాటిలో ఒక మాజీ ముఖ్యమంత్రికి స్థానం ఉండదు. ఎందుకంటే అయితే మంత్రి లేదంటే ఎంపీ.అవ్వాలి. అందుకే ఎటూ దిక్కుతోచక ఆయన వేచిచూసే ధోరణి అవలంబించారు. చివరకు ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలని చేస్తున్న ప్రయత్నాల్లో ఆయనకు ఒక అవకాశం దొరికినట్లయ్యింది. కీలక నేత కావడంతో అవసరమైతే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా పనికొస్తాడని భావించిన బీజేపీ ఆయనను సంప్రదించి ఉండొచ్చు. ఆ క్రమంలో మాధవ్ అంత ధైర్యంగా ఈ పేరును ప్రకటించారు. అయితే మాధవ్ ప్రకటనపై కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల నుంచి ఖండన గాని సానుకూలత గానీ ఇంకా రాలేదు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'ఏపి బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థి దొరికినట్లేనా?'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: కస్టమ్స్ విభాగంలో లంచాధికారులు సీబీఐకి చిక్కారు. బషీర్బాగ్ జీఎస్టీ భవన్లో సీబీఐ మెరుపు దాడులు చేసింది. ఇద్దరు అధికారులు సీబీఐకు అడ్డంగా దొరికిపోయారు. కస్టమ్స్ అండ్ యాంటీ విజన్ వింగ్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సురేష్ కుమార్, ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కిషన్ పాల్ సీబీఐ దాడుల్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. బిల్స్ మెంటినెన్స్ చేయని షాపులు, పలు కంపెనీలు తనిఖీలు చేసిన ఈ ఇద్దరు అధికారులు లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై పలువురు బాధితుల ఫిర్యాదుల ఆధారంగా సీబీఐ సోదాలు చేపట్టింది. దొరికిన ఇద్దరు అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలపై సీబీఐ అధికారులు కూపీ లాగుతున్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'సీబీఐ మెరుపు దాడులు... కస్టమ్స్ లో సీబీఐకి చిక్కిన లంచాధికారులు'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: అనుమతులతోనే చవితి వేడుకలు
వినాయక చవితి వేడుకలకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని విజయనగరం జిల్లా, పాలకొండ డీఎస్పీ జీవీ కృష్ణారావు సూచించారు. గణేష్ విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్లు, మండపాల ఏర్పాటుకు ఐదు గానీ, అంతకంటే ఎక్కువ మంది సభ్యులు కమిటీగా ఏర్పడి వారి వివరాలు పోలీస్స్టేషన్లో తెలియజేయాలన్నారు. అగ్నిమాపక, విద్యుత్ శాఖల అనుమతి తప్ప నిసరని అన్నారు. విగ్రహం ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. రాత్రి వేళల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు కాపలా ఉండాలన్నారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ఎపిలో మోడీ పర్యటన వాయిదా?
న్యూఢిల్లి : ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వాయిదా పడే అవకాశం ఉంది. జనవరి 6వ తేదీన మోడీ ఎపిలో పర్యటించాల్సి ఉంది. అయితే అదే రోజు కేరళలోనూ ప్రధాని పర్యటించనున్నారు. దీనితో ఎపిలో పర్యటన వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారు. సమయం సరిపోకపోవడం వల్లే ప్రధాని పర్యటన వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు రాష్ట్ర బిజెపి నాయకులకు సమాచారం అందించారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: ఓ వీడియో పోస్ట్ చేసినందుకు ఓ వ్యక్తి కటకట్టాల పాలయ్యాడు. వివరాలలోకి వెళ్లితే.బస్టాండ్లో జరిగిన పెళ్లికి తోటి విద్యార్థులు సాక్షులుగా నిలిచారు. ఈ పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరంలో జరిగిందీ ఘటన. ఇక్కడి బస్టాండ్ వద్ద పాఠశాల యూనిఫాంలో ఉన్న ప్లస్ టు చదువుతున్న విద్యార్థిని మెడలో పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి తాళి కట్టాడు. సహచర విద్యార్థులు వారిపై అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. బస్టాండ్లో అమ్మాయి కూర్చుని ఉండగా అబ్బాయి తాళి కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్తా పోలీసుల దృష్టికి చేరింది. దీంతో వారు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలల సంక్షేమ అధికారి రమ్య నేతృత్వంలో ఈ ఘటనపై అధికారుల బృందం విచారణ జరుపుతోంది. ఇదిలావుంటే విద్యార్థుల పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన బాలాజీ గణేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'ఆ వీడియో పోస్ట్ చేశాడు...కటకటాల పాలయ్యాడు'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కొలరాడో రాష్ట్రం డెన్వర్లోని ఓ పాఠశాలలోకి చొరబడిన ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులకు పాల్పడింది తోటి విద్యార్థులే అయి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరొకరు కూడా ఈ కాల్పుల్లో పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. అమెరికాలో తుపాకీ విష సంస్కృతి మళ్లీ కోరలు చాస్తోంది. గత నెల రోజులుగా దేశంలో ఎక్కడో ఓ చోట కాల్పుల ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. ఇటీవల ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే వెస్ట్ బాల్టిమోర్, శాండియోగోలోనూ దుండగులు కాల్పులకు దిగడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'అమెరికాలో కాల్పులు... విద్యార్థి మృతి'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: సిఎస్పై చంద్రబాబు ఫైర్
టీటీడీ వివాదంలో సీఎస్ తనకు చెప్పకుండానే ఎలా కమిటీ వేస్తారని నిలదీసారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు . ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని విస్మరించి అధికారులే సొంతంగా కమిటీలు ఎలా ఏర్పాటు చేసుకుంటారని ప్రశ్నించారాయన. సిఎస్ ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వాన్ని విస్మరిస్తున్నారని, ఎన్నికల కమీషన్ అన్ని బాధ్యతలూ తనకే ఇచ్చినట్టు వ్యవహరిస్తున్న సిఎస్ టీటీడీ విషయంలో తప్పు చేయని ఈవోను సీఎస్ ఎలా తప్పు పడతారని నిలదీసారు. విచారణ కమిటీ వేసి దానిని రాటిఫికేషన్ కోసం తనకు పంపడం వెనుక ఉద్దేశమేంటని, తనని కేవలం రాటిఫికేషన్ చేయడానికే ఉన్నట్టు సిఎస్ భావిస్తున్నారా? అని మండి పడ్డారు చంద్రబాబు
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: కాన్పూర్: భారతీయ దళిత్ పాంథర్స్ పార్టీకి చెందిన నేతలు రక్తంతో ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్లకు లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాల నిరోధక చట్టాన్ని నీరుగార్చే సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ వీళ్లు ఈ లేఖ రాశారు. భారత్ బంద్ సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన దళితులకు వీళ్లు నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేస్తే ముందస్తు అరెస్ట్లు చేయకూడదంటూ ఈ చట్టంలో యాంటిసిపేటరీ బెయిల్ను సుప్రీంకోర్టు చేర్చింది. దీనిపై దేశవ్యాప్తంగా దళిత సంఘాలు పెద్ద ఎత్తు నిరసన తెలిపాయి. చట్టాన్ని నీరుగార్చకూడదని, యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశాయి. భారత్ బంద్కు పిలుపునివ్వగా అదికాస్తా హింసాత్మకంగా మారి. దేశవ్యాప్తంగా పది మంది చనిపోయారు. ఈ చట్టాన్ని నీరుగార్చే ఉద్దేశం తమకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. వెంటనే సుప్రీంకోర్టులో రీవ్యూ పిటిషన్ దాఖలు చేసినా. తమ ఆదేశాలపై స్టే విధించడానికి కోర్టు నిరాకరించింది. పది రోజుల తర్వాత దీనిపై మరోసారి విచారణ జరపనుంది.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'ప్రధాని మోదీకి రక్తంతో లేఖ!'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: భవానీని అప్పగించడంలో ట్విస్ట్... పోలీస్ స్టేషన్కు చేరిన వివాదం
నాలుగేళ్ల వయసులో తప్పిపోయిన భవానీని తల్లిదండ్రులకు అప్పగించడంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. భవానీని తల్లిదండ్రుల వద్దకు పంపించేందుకు పెంచిన తల్లిదండ్రులు జయమ్మ-జీవరత్నం అభ్యంతరం తెలిపారు. వచ్చినవారు అసలైన తల్లిదండ్రులని నిర్ధారణ కావాలని. అప్పుడే తనను వారి వద్దకు పంపుతామని జయమ్మ చెప్పారు. అందుకోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. భవానీ అభీష్టంతోనే తల్లిదండ్రుల వద్దకు పంపిస్తామని వెల్లడించారు. భవానీని అప్పగించే విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. పోలీసుల సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు. వచ్చినవారే నిజమైన తల్లిదండ్రులని నిర్ధారణ అయ్యాకే అప్పగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు భవానీ మాత్రం తన తల్లిదండ్రుల వద్దకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇందుకోసం ఏ పరీక్షలకైనా సిద్ధమేనని వెల్లడించారు. అప్పుడప్పుడు జయమ్మ వద్దకు కూడా వస్తానని చెప్పారు. కాగా, వంశీ, కృష్ణకుమారి దంపతుల ఇంట్లో భవానీని పనిలో పెట్టాలనే ఉద్దేశంలో జయమ్మ ఆమెను వారివద్దకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఇంటి యజమాని వంశీ. భవానీ వివరాలను ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని తెలిపిన భవానీ తల్లిదండ్రుల పేర్లు, అన్నల పేర్లను, గుర్తున్న చిన్ననాటి సంగతులను చెప్పారు. ఆ వివరాలను, భవానీ ఫొటోను వంశీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. శనివారం ఆ పోస్ట్ను చూసిన భవానీ అన్న. వంశీని సంప్రదించాడు. 13 ఏళ్ల తరువాత తమ బిడ్డ ఆచూకీ తెలిసి భవానీ తల్లిదండ్రులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు.
1
['tel']
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: తానా బ్యాక్ప్యాక్ చైర్మన్గా మన్నే సత్యనారాయణ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బ్యాక్ప్యాక్ చైర్మన్గా మన్నే సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం (జీడబ్ల్యూటీసీఎస్) అధ్యక్షులుగా ఉన్నారు. సంఘం విధి విధానాలకు అనుగుణంగా పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామని సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. అమెరికాలోని వివిధ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రస్తుతం 10 లక్షల బ్యాగుల పంపిణీ లక్ష్యంగా నిర్ణయించుకున్నామని ఆయన వివరించారు.
1
['tel']
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: వైసీపీ నేతలు మూర్ఖంగా ఆరోపణలు చేస్తున్నారు : బోండా ఉమా
వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఓట్ల గల్లంతు అంటూ ఆరోపణలు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ… వైసీపీది దివాళాకోరుతనం రాజకీయం అని. సానుభూతిపరుల ఓట్ల తొలగింపు ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఓట్ల తొలగింపు, నమోదు ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారాయన. వైసీపీ నేతలు మూర్ఖంగా ఆరోపణలు చేస్తున్నారని బోండా ఉమా అన్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: కర్ణాటక క్రికెట్ జట్టు కెప్టెన్గా టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. ఇంటర్ జోనల్ అండర్-14 టోర్నీలో కర్ణాటక జట్టుకు అన్వే నాయకత్వం వహిస్తాడు. వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ అన్వాయ్ ఇటీవలి కాలంలో అనూహ్యంగా రాణిస్తున్నాడు మరియు కెప్టెన్గా నియమితుడయ్యాడు. ద్రవిడ్ పెద్ద కొడుకు, అన్వయ్ అన్న సమిత్ ద్రవిడ్ కూడా క్రికెటర్గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'కర్ణాటక క్రికెట్ జట్టు కెప్టెన్గా రాహుల్ ద్రవిడ్ కొడుకు'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ విజృంభించే ప్రమాదముంది జాగర్త
వాతావరణం చల్లగా ఉంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ విజృంభించే ప్రమాదముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అప్పర్ రెస్పిరేటరీ, బ్యాక్టీరియాలు, ఆర్ఎన్ఏ, స్వైన్ఫ్లూ, రైనో వైరస్, ఎడినోవాలు సోకే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. ముక్కే వీటి నుంచి రక్షణ కల్పిస్తుందని స్టార్ ఆస్పత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ టీఎన్జే రాజేశ్ స్పష్టం చేశారు. చలి కారణంగా బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో ఎవరైనా దగ్గినా. తుమ్మినా. వైర్సలు గాల్లోనే ఉంటాయని, అవి ఇతరుల్లోకి సులభంగా వెళ్తాయని చెప్పారు. ‘‘ఏదైనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించాలంటే. ముక్కు ద్వారానే మార్గం ఉంటుంది. వాటిని సమర్థంగా ఎదుర్కొనే రక్షణ యంత్రాంగం ముక్కులో ఉంటుంది. అయితే. ఉష్ణోగ్రత సాధారణం కంటే 4.4 డిగ్రీలు తగ్గితే. ముక్కులోని రక్షణ వ్యవస్థ బలహీనపడుతుంది. మాస్కులు, మఫ్లర్లు, వాడడం వల్ల ముక్కులో వెచ్చదనం నిలకడగా ఉంటుంది. రక్షణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది’’ అని ఆయన వివరించారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: పారికర్ బెడ్రూమ్లో రాఫేల్ దస్తావేజులు
న్యూఢిల్లీ: రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన దస్తావేజులు గోవా సీఎం మనోహర్ పారికర్ బెడ్రూమ్లో ఉన్నాయని ఆ రాష్ట్ర మంత్రి విశ్వజిత్ రాణే ఓ ఫోన్ కాల్లో వెల్లడించినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. దానికి సంబంధించిన ఆడియోను కూడా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రతినిధి సుర్జేవాలా ఇవాళ మీడియాతో వెల్లడించారు. పారికర్ మాటల్లో నిజం ఉందని, ప్రధాని మోదీ దీనికి సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గత వారం జరిగిన క్యాబినెట్ మీటింగ్లో. రాఫేల్ ఫైల్స్ గురించి పారికర్ ప్రస్తావించారని, అవి తన బెడ్రూమ్లో ఉన్నట్లు చెప్పారని మంత్రి రాణే తెలిపారు. ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. రాఫేల్ డీల్కు సంబంధించిన సీక్రెట్లు పారికర్ వద్ద ఉన్నాయి కాబట్టే ఆయన ఆరోగ్యం సరిగా లేకున్నా సీఎం పదవి నుంచి తొలగించడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అయితే రాఫేల్పై కాంగ్రెస్ అబద్ధాలు చెబుతున్నదని బీజేపీ విమర్శించింది. 36 రాఫేల్ విమానాల కోసం ఫ్రాన్స్తో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే వాటి తయారీని రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు అప్పగించింది. ఆ డీల్లో భారీ కుంభకోణం జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. Manohar Parrikar , Rafale Deal , Parikar Bedroom , Goa Minister , Vishwajit Rane , Audio Clip , Congress ,
1
['tel']
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: పోలవరంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి: వెలగపూడి సచివాలయంలో పోలవరంపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. పోలవరాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ సంస్థలతో ఎప్పటికప్పుడు సమావేశమై సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
1
['tel']
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: ముగిసిన గన్నవరం పంచాయతీ
సీఎం జగన్ దగ్గర గన్నవరం పంచాయితీ ముగిసింది. వైసీపీలోకి వంశీ రాకను యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో యార్లగడ్డ వెంకట్రావు కలిశారు. సుధీర్ఘ చర్చ అనంతరం పార్టీ బలోపేతానికి పనిచేయాలని యార్లగడ్డ వెంకట్రావుకు జగన్ సూచించారు. ఈ భేటీలో యార్లగడ్డకు తన రాజకీయ భవిష్యత్తుపై జగన్ హామీ ఇచ్చినట్లు సమచారం. దీంతో వెంకట్రావు మెత్తపడినట్లు తెలుస్తోంది. పార్టీ సమావేశం తర్వాత పేర్నినాని, కొడాలి నాని, యార్లగడ్డ వెంకట్రావు ఒకే కారులో వెళ్లిపోయారు. గన్నవరం పంచాయతీకి జగన్ ముగింపు పలకడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చకున్నాయి.ఇటీవల తనను రాజకీయంగా ఎదుర్కోలేక యార్లగడ్డ వెంకట్రావు, రవికుమార్ అనే వైసీపీ సానుభూతిపరుడితో కలిసి తనపై. ఇళ్ల పట్టాలు ఫోర్జరీ చేశారంటూ ఫిర్యాదు చేశారని వంశీ ఆరోపించారు. ఇళ్ల పట్టాల కాపీని తహసీల్దార్ మెయిల్కు రవికుమార్ పంపగా ఆ కాపీని తహసీల్దార్ పోలీసుస్టేషన్లో ఇచ్చి తనపై ఫిర్యాదు చేశారని వల్లభనేని తెలిపారు. పోలీసులు కూడా ఎలాంటి విచారణ లేకుండా కేసు నమోదు చేశారని వివరించారు.ఇందులో కుట్ర కోణం దాగుందని, పూర్తి ఆధారాలను తాను సేకరించానని వాటిని గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేస్తానని వంశీ వెల్లడించారు. యార్లగడ్డను టార్గెట్ చేస్తూ ఆరోపణలను గుప్పించిన వంశీ, ఆయనతో కలిసి వైసీపీలో సమైక్య రాగం ఆలపిస్తారా? లేక వేరు కుంపట్లతో వైసీపీకి తలనొప్పి అవుతారో వేచి చూడాల్సిందేనని చెబుతున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్లడం ఖరారు కావడంతో గన్నవరం నుండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఒడిన యార్లగడ్డ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ఇంటి వద్ద ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. వంశీ వైసీపీలోకి వస్తే తన భవిష్యత్తేమిటని యార్లగడ్డ వాపోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన ఒక ఫార్ములాను అమలుచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాత్రమే పార్టీలోకి రావాలని వంశీకి కండిషన్ పెట్టాడు. వంశీకి రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేసినట్టు నిన్న రాత్రి నుంచే వార్తలు వస్తున్నాయి. వంశీ రాజీనామాతో ఖాళీ అయ్యే గన్నవరం సీటును యార్లగడ్డకు ఇవ్వనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇరువురినీ కూడా జగన్ ఒప్పించారు. గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు వంశీ చేతిలో స్వల్ప తేడాతో మాత్రమే ఓటమి చెందాడు. ఇప్పుడు వంశీ రాజీనామా చేస్తే ఖాళీ అయ్యే గన్నవరం నుండి మరో మారు యార్లగడ్డ వెంకట్రావు బరిలోకి దిగనున్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: విజయవాడ : నగరంలో తెరుచుకొని రైతు బజార్లు. నగరంలోని పలు ప్రాంతాల్లో రైతు బజార్లకు వచ్చి నిరాశతో వెను తిరిగిన వినియోగదారులు.కనీసం సమాచారం ఇవ్వకుండా మూసి వేయడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన నగర వాసులు.రోడ్ల పై వెలిసిన కూరగాయల స్టాల్స్.అధిక ధరలతో వినియోగదారుల ను దోచుకుంటున్న వ్యాపారులు
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'నగరంలో తెరుచుకొని రైతు బజార్లు'.
2
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: లాక్డౌన్ సమయంలో నిత్యావసరాలను, మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో 4 జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్లు రంగంలోకి దిగాయి. సివిల్ సప్లై, లీగల్ మెట్రాలజీ, డ్రగ్ కంట్రోల్, ఫుడ్ ఇన్స్పెక్షన్ బృందాలు పోలీసులతో కలిసి నగరంలోని పలు సూపర్ మార్కెట్లు, హోటళ్లు, మెడికల్ షాపులు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, కూరగాయల మార్కెట్లు, చికెన్ సెంటర్లు, స్వీట్ షాపులు, కిరాణా దుకాణాల్లో తనిఖీలో నిర్వహించాయి. అధిక ధరలకు విక్రయించడం, పరిశుభ్రత పాటించకపోవడం, నిబంధనలు పాటించని ఎనిమిది మంది వ్యాపారులపై కేసులు నమో దు చేశారు. వారి నుంచి రూ. 40 వేలు జరిమానా వసూలు చేశారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'నిత్యావసరాల ధరలు పెంచారని 8 మందిపై కేసు'.
2
['tel']