news
stringlengths
299
12.4k
class
int64
0
2
Hyderabad, First Published 21, Sep 2018, 10:39 AM IST Highlights కేకే.నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి నీలాణిని విచారించడానికి సిద్ధం కాగా ఆమె పరారైంది. బుల్లితెర నటి నీలాణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నటి నీలాణి ప్రేమించి, సహజీవనం చేసిన సహాయ దర్శకుడు గాంధీలలిత్‌కుమార్‌తో గొడవ పడి వార్తల్లోకి ఎక్కెంది. అతను పెళ్లి చేసుకోమని వేధింపులకు గురిచేస్తున్నాడని మైలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాంధీలలిత్‌కుమార్‌ మనస్తాపానికి గురై ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేకే.నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి నీలాణిని విచారించడానికి సిద్ధం కాగా ఆమె పరారైంది. ఆ తరువాత చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి గాంధీలలిత్‌కుమార్‌ ఆత్మహత్యకు తాను కారణం కాదని, అతను తనను నుంచి డబ్బు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదు చేసింది. అయితే తన తమ్ముడి చావుకు నీలాణినే కారణం అని గాంధీలలిత్‌కుమార్‌ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.  నటి నీలాణి గురువారం స్థానిక ఆలపాక్కంలోని  ఇంట్లో దోమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె కేకే.నగర్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. read more news
0
Jakarta, First Published 29, Aug 2018, 10:16 AM IST Highlights ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత క్రీడాకారులు 9స్వర్ణ, 19 రజత, 22 కాంస్య పతకాలను సాధించారు. ఇలా మొత్తంగా 50 పతకాలు భారత ఖాతాలో చేరాయి.    ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత క్రీడాకారులు 9స్వర్ణ, 19 రజత, 22 కాంస్య పతకాలను సాధించారు. ఇలా మొత్తంగా 50 పతకాలు భారత ఖాతాలో చేరాయి.  ఇక పదకొండో రోజైన ఇవాళ పలు ఈవెంట్లలో భారత క్రీడాకారులు పోటీ పడనున్నారు. అందువల్ల ఆసియా క్రీడల్లో ఈ రోజు జరిగే ఈవెంట్స్ షెడ్యూల్ ఎలా ఉందో తెలుసుకుందాం.  ఈవెంట్స్ వివరాలు:    డైవింగ్:  మెడల్ కాంపిటీషన్  వాటర్ ఫోలో: ఈవెంట్ కాంపిటీషన్ అథ్లెటిక్: మెడల్ కాంపిటీషన్   బ్యాడ్మింటన్: ఈవెంట్ కాంపిటీషన్   బేస్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్  బౌలింగ్: మెడల్ కాంపిటీషన్     బాక్సింగ్: ఈవెంట్ కాంపిటీషన్  బ్రిడ్జ్: ఈవెంట్ కాంపిటీషన్    స్ప్రింట్: మెడల్ కాంపిటీషన్  సైక్లింగ్: ట్రాక్ మెడల్ కాంపిటీషన్     పెన్సింగ్: మెడల్ కాంపిటీషన్  జిమ్నాస్ఠిక్ (ట్రాంపోలైన్): మెడల్ కాంపిటీషన్ హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్  ఫీల్డ్ హాకీ: ఈవెంట్ కాంపిటీషన్ జూడో: మెడల్ కాంపిటీషన్ మార్షల్ ఆర్ట్స్ (జుజిట్స్): మెడల్ కాంపిటీషన్     మార్షల్ ఆర్ట్స్ ( సాంబో): మెడల్ కాంపిటీషన్        ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్ సెయిలింగ్: ఈవెంట్ కాంపిటీషన్    స్క్యాష్: ఈవెంట్ కాంపిటీషన్  టేబుల్ టెన్నిస్:ఈవెంట్ కాంపిటీషన్ టెన్నిస్: మెడల్ కాంపిటీషన్ సాప్ట్ టెన్నిస్: మెడల్ కాంపిటీషన్     తైక్వాండో: మెడల్ కాంపిటీషన్     వాలీబాల్:  ఇండోర్ ఈవెంట్ కాంపిటీషన్
2
CRICKET చాంపియన్‌ ట్రోఫీ కోసం భారత్‌ జట్టు ఎంపిక న్యూఢిల్లీ: చాంపియన్‌ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును బిసిసిఐ సోమవారం ఎంపిక చేసింది.కెప్టెన్‌గా కోహ్లీ,వైస్‌ కెప్టెన్‌గా రహానే,వికెట్‌ కీపర్‌గా ధోని,సెకండ్‌ కీపర్‌గా కేదార్‌ జాదవ్‌ ఎంపికయ్యారు. ఈ జట్టులో గంభీర్‌,హర్భజన్‌లకు నిరాశ ఎదురైంది. షమీ, రోహిత్‌శర్మ,శిఖర్‌ ధావన్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు.జట్టు పూర్తి వివరాలు ఇవిగో…. కోహ్లీ,ధావన్‌,రోహిత్‌,రహానే,ధోనీ,యువరాజ్‌,కేదార్‌ జాదవ్‌,హార్థిక్‌ పాండ్యా, అశ్విన్‌, జడేజా, షమీ,ఉమేశ్‌,భువనేశ్వర్‌,మనీశ్‌,బుమ్రా.చాంపియన్‌ ట్రోఫీ జూన్‌ 1 నుంచి 18 వరకు ఇంగ్లండ్‌ వేదికగా జరుగనుంది.ఈ టోర్నీలో భారత్‌ తన తొలి మ్యాచ్‌ జూన్‌ 4న చిరకాల ప్రత్యర్థి పాక్‌తో ఆడనుంది. ్ల్ణ్లగంభీర్‌ను ఎంపిక చేయకపోవడంపై విమర్శ ఐసిసి చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడే భారత జట్టులో వెటరన్‌ క్రికెటర్‌ గంభీర్‌ను ఎంపిక చేయకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిసిసిఐ సోమవారం చాంపియన్స్‌ ట్రోఫీకి 15 మందితో కూడిన కోహ్లీ సేనను ప్రకటిం చింది. గాయాలు,ఇతర కారణాల వల్ల జాతీయ జట్టుకు కొంత కాలం నుంచి దూరమైన రోహిత్‌ శర్మ, ధావన్‌, మనీశ్‌ పాండే తిరిగి ఎంపికయ్యారు. అయితే ఐపిఎల్‌లో అద్భుతమైన మెరు పులు మెరిపిస్తూ కోల్‌కతాను విజయాల బాటలో నడిపిస్తున్న గంభీర్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు.గంభీర్‌ను పక్కన పెట్టడంపై అతడిఅభిమానులు సెలక్టర్ల ఎంపికను ప్రశ్నిస్తున్నారు. బ్రింగ్‌ బ్యాక్‌ గంభీర్‌అనే హ్యాస్‌ ట్యాగ్‌తో ట్వీట్లవర్షం కురిపిస్తున్నారు. బిసిసిఐపై వ్యంగా స్త్రాలు సంధిస్తున్నారు. గంభీర్‌, రైనా, అక్షర్‌, కుల్‌దీప్‌, రిషబ్‌పంత్‌,దినేశ్‌ కార్తీక్‌,రాబిన్‌ ఉతప్ప తమ ఫామ్‌పై దురదృష్టం వ్యక్తం చేయాలంటూ కాంగ్రెస్‌ ఎంపి శశి థరూర్‌ ట్వీట్‌ చేశారు.గంభీర్‌ ఒక ఐపిఎల్‌ సీజన్‌లో 5000 పరుగులు చేస్తే బిసిసిఐ టీమిండియాకు ఎంపిక చేస్తుందనుకుంటా అని ఒక అభిమాని వ్యంగ్యంగా ట్వీట్‌ చేయడం గమనార్హం.
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV నెటిజన్ ట్వీట్.. ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య చిచ్చుపెట్టింది ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ వల్ల ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య చిచ్చు పెట్టింది. కంగనా రనౌత్, తాప్సిల మధ్య ఎప్పటినుంచో మనస్పర్ధలు ఉన్న సంగతి తెలిసిందే. Samayam Telugu | Updated: Sep 25, 2019, 10:45AM IST నెటిజన్ ట్వీట్.. ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య చిచ్చుపెట్టింది పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కంగనా రనౌత్, తాప్సిల మధ్య వివాదం. కంగన సోదరి రంగోలీ గతంలో తాప్సిపై చేసిన కామెంట్లు ఇప్పటికీ వేడి వేడిగానే ఉన్నాయి. మ్యాటర్ సీరియస్ అవ్వకూడదని తాప్సి మౌనంగా సహిస్తున్నారు. అయినా రంగోలీ నోటికొచ్చినట్లుగా కామెంట్లు చేస్తూ ఆమెను రెచ్చగొట్టారు. సర్లే అని తాప్సి మౌనం వహించారు. తాజాగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్ మళ్లీ వీరి మధ్య చిచ్చు పెట్టింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. తాప్సి, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సాండ్ కీ ఆంఖ్’. తుషార్ హీరానందని దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్‌ అనే ఇద్దరు మహిళా షార్ప్ షూటర్ల జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలో తాప్సి, భూమి 60 ఏళ్ల బామ్మల పాత్రలను పోషించారు. అయితే ట్రైలర్‌పై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘నాకు తాప్సి, భూమి పెడ్నేకర్‌ల నటన నచ్చింది. కానీ అవి బామ్మల పాత్రలు కాబట్టి నీనా గుప్తా, రమ్యకృష్ణలను ఎంపిక చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక్కడి నుంచి అసలు గొడవ మొదలైంది. ఈ నెటిజన్ ట్వీట్ చూసి మరో నెటిజన్ ట్వీ్ట్ చేశారు. ‘ముందు ఈ సినిమా కంగన రనౌత్‌కు దక్కింది. కానీ ఆమె మిమ్మల్ని తీసుకోవాలని దర్శకుడికి చెప్పారు’ అని. దాంతో తన సోదరి టాపిక్ వచ్చిందని వెంటనే రంగంలోకి దిగారు కంగన సోదరి రంగోలి. ‘ముందు ఈ సినిమా ఆఫర్ కంగనకు వచ్చింది. కానీ మిమ్మల్ని కానీ రమ్యకృష్ణను కానీ తీసుకోవాల్సిందిగా కంగన కోరింది. కానీ ఇప్పటికీ బాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శకుల ఆలోచనలు ఇంకా మారలేదు. మిమ్మల్ని తీసుకుంటే ఎక్కడ సినిమా ఆడదోనని యువ నటీమణులకు అవకాశం ఇచ్చారు. వృద్ధుల పాత్రల్లో యువ నటీనటులను తీసుకుంటే మన భారతదేశ చిత్ర పరిశ్రమ ఇలాగే ఉంటుంది. ఫెమినిజం పేరుతో సెక్సిజంను ప్రమోట్ చేస్తున్న బాలీవుడ్‌కు సిగ్గులేదు’ అని తాప్సిపై ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్ చేశారు. READ ALSO: ప్రియాంక చోప్రా: నా తండ్రి నీడను పెళ్లి చేసుకున్నాను దాంతో తాప్సికి ఒళ్లుమండింది. ఇంతకాలం మౌనంగా సహించిన తాప్సికి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. అందుకే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘మనం పాజిటివిటీని స్వీకరిద్దామా? లేక రిస్క్‌లు తీసుకునే ధైర్యం లేక ఎప్పుడూ నెగిటివిటీతోనే బతికేద్దామా? ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి భుజాలతో పాటు వెన్నెముక కూడా లేదా? కేవలం ఇద్దరు యువతులకు (కంగన, రంగోలీ)లకు మాత్రమే ఏదన్నా కొత్తగా ప్రయత్నించాలా? ‘సారాంశ్’ సినిమాలో అనుపమ్ ఖేర్ నటించిన పాత్ర గురించి ఎవ్వరూ ఎందుకు కామెంట్ చేయలేదు? సునీల్ దత్‌కు నర్గిస్ దత్ తల్లిగా నటించినప్పుడు ఆమెను ఎందుకు ప్రశ్నించలేదు? త్రీ ఇడియట్స్ సినిమాలో ఆమిర్ ఖాన్ కాలేజ్ కుర్రాడి పాత్రలో నటించినప్పుడు ఆయన్ను ఎందుకు ప్రశ్నించలేదు? ఈ ప్రశ్నలు, ఆరోపణలు అన్నీ మాకేనా? ఒకవేళ అదే నిజమైతే మేం చేస్తున్న ఈ విభిన్న ప్రయత్నాలను మీరు ఈ రకంగానైనా గుర్తించినందుకు ధన్యవాదాలు. త్వరలో మీకున్న సందేహాలన్నీ తీరిపోతాయి. ఈ దీపావళికి ‘సాండ్ కీ ఆంఖ్’ సినిమాతో పటాసులు పేల్చడానికి కాదు బుల్లెట్లు దించడానికి వస్తున్నాం’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు తాప్సి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
Oct 29,2015 ఇండిగో ఐపీఓకు పూర్తి సబ్‌స్క్రిప్షన్‌ ముంబయి: 'ఇండిగో ఎయిర్‌లైన్స్‌' మాతృసంస్థ 'ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌' సంస్థ పబ్లిక్‌ ఇష్యూనకు (ఐపీఓకు) మదుపరుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆఫర్‌ ముగింపునకు మరోరోజు మిగిలి ఉండగానే దాదాపు ఇష్యూనకు 1.3 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి ఆఫర్‌లో అందుబాటులో ఉంచి మొత్తం మూడు కోట్ల షేర్లకు గాను 3.86 కోట్ల మేర బిడ్లు లభించాయి. దీంతో ప్రయిమెరీ మార్కెట్‌ నుంచి ఇండిగో రూ.3,018 కోట్ల నిధులను సమీకరించడం దాదాపు ఫిక్స్‌ అయిపోయింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
Oct 19,2016 జెబ్రోనిక్స్‌ నుంచి సరికొత్త సౌండ్‌బార్‌ నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ జెబ్రోనిక్స్‌ మరో అత్యాధునిక సౌండ్‌బార్‌ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. 'వండర్‌బార్‌' పేరుతో దీనిని విపణిలోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధరను సంస్థ రూ.1616గా సంస్థ నిర్ణయించింది. సౌండ్‌ బార్‌ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దీనిని తాము మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు జెబ్రోనిక్స్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ దోషి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ సుదీర్ఘమైన ఆడియో ప్రొడక్టల విభాగంలో ఇదో అణిముత్యంగా నిలుస్తుందని తెలిపారు. ఈ బార్‌ రిమోట్‌ కంట్రోలతో రావడంతో పాటు బిల్ట్‌ ఇన్‌ ఎఫ్‌ఎమ్‌ రెడియో, హెడ్‌ఫోన్‌ ఫోర్ట్‌లు, 35 ఛానల్స్‌ వరకు స్టోర్‌ చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. అలాగే బ్లూటూత్‌ సౌకర్యం, స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్‌, టీవీ నుంచి మ్యూజిక్‌ స్ట్రీమ్‌ చేయడానికి అనుమతిస్తుందని వివరించారు. జెబ్రోనిక్స్‌ నుంచి ఈ సౌండ్‌ బార్‌కు ఏడాది వారెంటీ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రొడక్టు రిటైల్‌, ఆన్‌లైన్‌ స్టోర్లలో కూడా లభ్యమవుతుందని తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
internet vaartha 241 Views న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాతో డే అండ్‌ నైట్‌ తాము సిద్ధంగా లేమని దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ డివిలియర్స్‌ వెల్లడించాడు. కాగా వచ్చే నవంబర్‌లో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో దక్షిణాఫ్రికా పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో చివరిదైన మూడవ టెస్ట్‌ను డే అండ్‌ నైట్‌ ఫార్మాట్లో నిర్వహించాలను కుంటుంది క్రికెట్‌ ఆస్ట్రేలియా. అయితే ఈ ప్రతిపాదన పట్ల సపారీ ఆటగాళ్లు విముఖత చూపుతున్నారు. ఇప్పటికైతే డే అండ్‌ నైట్‌ టెస్టులు ఆడేందుకు మేం సిద్ధంగా లేము. తొలి డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ ఆడిన స్టీవ్‌ స్మిత్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లతోనూ ఆ అనుభవం గురించి మాట్లాడాం. రెండు జట్లలోని ఆటగాళ్లు ఈ ప్రతి పాదనకు వ్యతిరేకంగా ఉన్నారు. గులాబి బంతి మన్నిక, పిచ్‌పై చేసే మార్పులపై సందిగ్దతతో పాటు అనుమనాలు ఉన్నాయిఇ, ఒక్క ప్రాక్టీస్‌ మ్యాచ్‌తో మేం దానికి అలవాటు పడిపోలేం పైగా ఈ సిరీస్‌ తమకు ఎంతో ప్రధానం అని డివిలియర్స్‌ పేర్కొన్నాడు.
2
Mohali test match బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా మొహాలీలో మొదటి టెస్టు మ్యాచ్ లో రెండో రోజు ఆటను శుక్రవారం దక్షిణాఫ్రికా ప్రారంభించింది. TNN | Updated: Nov 6, 2015, 09:52AM IST మొహాలీలో మొదటి టెస్టు మ్యాచ్ లో రెండో రోజు ఆటను శుక్రవారం దక్షిణాఫ్రికా ప్రారంభించింది. గురువారం మ్యాచ్ ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 201 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎల్గర్, ఆమ్లా క్రీజులో ఉన్నారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని క్యురేటర్ చెప్పిన విషయమే నిజమైంది. స్పిన్నర్ అమిత్ మిశ్రాతో కోహ్లీ బౌలింగ్ చేయిస్తున్నాడు.
2
అలా చేయడం మానసిక రోగమంటున్న దీపిక Highlights ట్రిపులెక్స్ ప్రమోషన్ లో భాగంగా వీ స్కర్ట్ వేసుకున్న దీపిక ఆ డ్రెస్ లో వక్ష సంపద దాదాపుగా బయటపడ్డంత పనైంది సందట్లో సడేమియా అంటూ చక్కర్లు కొడుతున్న మార్ఫింగ్ ఫోటోలు ముంబైలో జరిగిన ట్రిపులెక్స్ మూవీ ప్రమోషన్ కోసం నెక్ స్కర్ట్ ధరించి అందర్నీ అబ్బురపరచింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే. ఇటీవల త్రిబుల్ ఎక్స్ ప్రమోషన్ లో భాగంగా లో నెక్ డ్రెస్ లో దర్శనం ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే . అయితే ఆ లోనెక్ డ్రెస్ లోంచి వక్ష ద్వయం బయటకి తొంగి చూస్తున్న సమయంలో రకరకాలుగా ఫోటోలు తీశారు ఫోటోగ్రాఫర్లు . ఆ ఫోటోలు సంచలనం సృష్టించగా తాజాగా మరో సంచలనానికి తెరలేచింది. కొంతమంది ఏకంగా దీపికా ఫోటోలను మరింతగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసారు కట్ చేస్తే ఆ ఫోటోలు దీపికా పడుకునే ని చేరాయి దాంతో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.   ఫోటోలను మార్ఫింగ్ చేసేవాళ్ల ని మానసిక రోగులు అని అంటోంది . ఎంతటి పెద్ద రోగాలకైనా సరే నయం చేయొచ్చు కానీ ఇలాంటి మానసిక రోగులకు మాత్రం నయం చేయడం కష్టమని ఘాటుగా స్పందిస్తోంది దీపికా . అసలు విషయం ఏమిటంటే ఆ వేడుకలో లోనెక్ డ్రెస్ జారిపోయి వక్ష ద్వయం దాదాపుగా బయట పడింది .దీపికా  డ్రెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకొంటే బాగుండేది .  Last Updated 25, Mar 2018, 11:53 PM IST
0
bollywood actor jackie shroff says he slapped anil kapoor 17 times for parinda film that released 30 years ago 17 సార్లు ఆ హీరో చెంప చెళ్లుమనిపించాను: Saaho నటుడు జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్ ఇండస్ట్రీలో ఎంతో మంచి ఫ్రెండ్స్. అలాంటిది... అనిల్‌ను ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 17 సార్లు చెంప ఛెళ్లుమనిపించాడట. అయితే నిజంగా కాదులెండి. సినిమా షూటింగ్‌లో భాగంగా అన్ని సార్లు కొట్టాల్సి వచ్చిందట. Samayam Telugu | Updated: Oct 31, 2019, 04:15PM IST <p>జాకీ ష్రాఫ్<br></p> ఓ హీరోను పట్టుకుని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 సార్లు చెంప చెళ్లుమనిపించాడట బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్. ఆ హీరో ఎవరో కాదు అనిల్ కపూర్. వీరిద్దరూ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో మంచి స్నేహితులు. అలాంటిది కొట్టుకునేంత గొడవ ఏమొచ్చింది అనుకుంటున్నారా? అవి అనిల్ కపూర్ షూటింగ్‌లో భాగంగా తిన్న తన్నులు. అనిల్, జాకీ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ నటించిన ‘పరిందా’ అనే సినిమా విడుదలై నవంబర్ 3కి 30 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అప్పటి రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను విడుదల చేశారు జాకీ ష్రాఫ్. Visit Site Recommended byColombia ‘ఓ సీన్‌లో నేను అనిల్ కపూర్‌ని కొట్టాల్సి ఉంది. ఎన్నిసార్లు చేసినా ఆ సీన్ పర్‌ఫెక్ట్‌గా వచ్చేది కాదు. దాంతో ఎక్కువ టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. అలా 17 సార్లు అనిల్‌ చెంప చెళ్లుమనిపించాను. చెప్పాలంటే ఫస్ట్ టేక్‌లోనే నేను అనిల్‌ను సరిగ్గా కొట్టాను. అనిల్ కూడా సరైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. డైరెక్టర్ షాట్ ఓకే చేశాడు. కానీ అనిల్ మాత్రం ఇంకో టేక్ ఇంకో టేక్ అంటూ నాచేత 17 సార్లు కొట్టించుకున్నాడు. ఇది గాల్లో కొట్టే సన్నివేశం కాదు. నేను అనిల్‌ను నిజంగానే కొట్టాలి. నాకేమో అన్నిసార్లు కొడుతుంటే బాధేసింది’ అంటూ అప్పటిరోజుల్ని గుర్తుచేసుకున్నాడు జాకీ. READ ALSO: సీఎం అవ్వాలంటూ స్టార్ హీరోకు ఫ్యాన్స్ రిక్వెస్ట్ అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ ఎన్నో సినిమాల్లో అన్నాతమ్ముళ్ల పాత్రల్లో నటించారు. అనిల్ కంటే జాకీ వయసులో చిన్నవాడు. కానీ చూడటానికి జాకీ పెద్దవాడిలా ఉండేవాడు. దాంతో ఎప్పుడూ అతనే అన్న పాత్రను పోషించేవాడు. ఇప్పటికీ అనిల్ కపూర్‌కు హీరోగా నటించే అవకాశాలు వస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే 60 ఏళ్ల వయసులోనూ అనిల్ 30 ఏళ్ల కుర్రాడిలా యవ్వనంగా మెరిసిపోతున్నారు. చివరిసారిగా అనిల్, జాకీ 2013లో వచ్చిన ‘షూటౌట్ ఎట్ వాడాలా’ సినిమాలో నటించారు. మళ్లీ వీరిద్దరూ ఎప్పుడు కలిసి నటిస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన సాహో సినిమాలో జాకీ ష్రాఫ్ ప్రభాస్ తండ్రిగా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. @AnilKapoor has always been a perfectionist when it comes to his shots. Here is @bindasbhidu sharing how it took 1… https://t.co/rfjSzOxRbh &mdash; Vidhu Vinod Chopra Films (@VVCFilms) 1572505021000
0
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV TRAI Report: 2017లో 9 శాతం తగ్గిన టెల్కోల ఆదాయం..! 2017లో దేశంలోని టెలికామ్ సంస్థల ఆదాయం దాదాపు 9 శాతానికి తగ్గినట్లు ట్రాయ్ తన నివేదికలో వెల్లడించింది. ఆదాయం 8.56 శాతం తగ్గి రూ.2.46 లక్షల కోట్లకు పరిమితమైందని తెలిపింది. అంతకు ముందు ఏడాది..అంటే 2016లో టెల్కో ఆదాయం రూ.2.79 లక్షల కోట్లుగా ఉంది. లైసెన్స్‌ ఫీజు ప్రభుత్వ రాబడిలోనూ గతేడాది 18.78 శాతం తగ్గుదల కనిపించింది. TNN | Updated: May 5, 2018, 04:10PM IST TRAI Report: 2017లో 9 శాతం తగ్గిన టెల్కోల ఆదాయం..! 2017లో దేశంలోని టెలికామ్ సంస్థల ఆదాయం దాదాపు 9 శాతానికి తగ్గినట్లు ట్రాయ్ తన నివేదికలో వెల్లడించింది. ఆదాయం 8.56 శాతం తగ్గి రూ.2.46 లక్షల కోట్లకు పరిమితమైందని తెలిపింది. అంతకు ముందు ఏడాది..అంటే 2016లో టెల్కో ఆదాయం రూ.2.79 లక్షల కోట్లుగా ఉంది. లైసెన్స్‌ ఫీజు ప్రభుత్వ రాబడిలోనూ గతేడాది 18.78 శాతం తగ్గుదల కనిపించింది. ఇదిలా ఉండగా.. ఇదే సమయంలో స్పెక్ట్రమ్‌ వాడకం ఛార్జీల్లో కూడా 32.81 శాతం క్షీణత ఉంది. టెలికం వినియోగదారులు పెరిగినప్పటికీ రెవెన్యూ మాత్రం తగ్గింది. 2016 ముగింపు నాటికి దేశంలో 115.17 కోట్లుగా ఉన్న వినియోగదారులు 2017 ముగింపు నాటికి 119.06 కోట్లకు చేరారని ట్రాయ్ ఈ నివేదికలో పేర్కొంది. వినియోగదారుల సంఖ్యలో ఏటా 3.38 శాతం పెరుగుదల ఉందని ట్రాయ్ తెలిపింది. పెరిగిన రిలయెన్స్ జియో ఆదాయం.. మిగతా టెలికామ్ సంస్థల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ...రిలయెన్స్ జియోమాత్రం లాభాలను గడిస్తూనే ఉంది. జియో ఆదాయం 2017లో రూ.7,466 కోట్లుగా నమోదైంది. ఇక ఇతర సంస్థల ఆదాయాలను పరిశీలిస్తే.. * 2016లో ఎయిర్‌టెల్ ఆదాయం రూ.48,880 కోట్లు ఉండగా 2017లో 24 % నష్టంతో రూ.36,922గా నమోదైంది. * వొడాఫోన్ ఆదాయం కూడా 24 % నష్టంతో రూ.26,308గా నమోదైంది. * ఐడియా ఆదాయం కూడా 23.17 % నష్టంతో రూ.22,616గా నమోదైంది. * బీఎస్‌ఎన్‌ఎల్ ఆదాయం 19.42 % నష్టంతో రూ.10,564గా నమోదైంది. * అన్నింటి కంటే అధికంగా ఎంటీఎన్‌ఎల్ ఆదాయం 30.76 % నష్టంతో రూ.1985గా నమోదైనట్లు ట్రాయ్ తన నివేదికలో తెలిపింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1
IDBI రిటైల్‌రంగానికి అత్యధిక ప్రాధాన్యం హైదరాబాద్‌, జూన్‌ 9: ఐడిబిఐ బ్యాంకు టర్నో వర్‌ వృద్ధికి గణనీయంగా కృషిచేస్తోందని, బ్యాంకు హైదరాబాద్‌జోన్‌ 13.7శాతం కస్టమర్లను పెంచుకోగలిగిందని బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి.సీతారాం పేర్కొన్నారు. బ్యాంకు కార్యకలాపాలను ఆయన మీడియాకు వివరిస్తూ ప్రస్తుతం కరెంటు ఖాతాలు, పొదుపుఖాతాల డిపాజిట్లు, రిటైల్‌ స్వల్పకాలిక డిపాజిట్లు 673.32కోట్లకు చేరాయని 43.4 శాతం వృద్ధిని సాధించామన్నారు అలాగే డిపాజిట్లపరంగా చూస్తే 391.56 కోట్లుగా ఉన్నాయని 25.20శాతంలక్ష్యాలు సాధించామన్నారు. రిటైల్‌ రుణపోర్టుఫోలియో 6.10శాతం వృద్ధితోఉందన్నారు. బ్యాంకుతాజాగా కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోందని, రిటైల్‌ఫోర్టు ఫోలియోకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరించారు. గతఏడాది బ్యాంకు అనేక సవాళ్లు ఎదుర్కొన్నదని, రానున్న కాలం లో మరింతగా బిజినెస్‌ పోర్టుఫోలియో పెంచుకుంటుందన్నారు. బ్యాంకు ఇటీవలే రిటైల్‌ అడ్వాన్సులపరంగా 43శాతంపెరిగాయని, గతఏడాది 33శాతం మాత్రమేఉండగా ఈసారి పెరిగా యన్నారు. కాసా డిపాజిట్లు కూడా 22శాతంపెరిగినట్లు సీతారామ్‌ వివరించారు. స్వల్పకాలిక డిపాజిట్లు కూడా 31శాతం నుంచి 32శాతానికిపెకరిగాయి. బ్యాంకు ఇటీవలేయుపిఐ యాప్‌ పేవిజ్‌, సోషల్‌ మీడియా బ్యాంకింగ్‌ ఫేస్‌బుక్‌ ఐఎంగేజ్‌ వంటివి ప్రవేశపెట్టామని సీతారామ్‌ వెల్లడించారు. కస్టమర్లకు డిజి టల్‌పాస్‌బుక్‌ ఎంపాస్‌బుక్‌ను ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌పై అందిస్తున్నట్లు వివరించారు. ప్రాధాన్యత లేని రంగా ల్లో బ్యాంకు తన నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకుంటుందని బ్యాంకు సిజిఎం బి.దాస్‌గుప్తా వెల్లడించారు. హైదరాబాద్‌ జోన్‌ కార్యకలాపాలు ఆశించినస్థాయిలో పెరిగాయని మరింత వృద్ధిని సాధిస్తామన్నారు.
1
ప్రియా వారియర్.. ఈ చిన్నదానికి ఇంతా క్రేజ్ ఎలా వచ్చిందంటే.. Highlights ప్రియా వారియర్.. ఈ చిన్నదానికి  ఇంతా క్రేజ్ ఎలా వచ్చిందో తెలుసా..? ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు ఇప్పుడీ పేరుతో ఇంటర్నెట్ లో జనాలు తెగ సెర్చ్ చేసి పారేస్తున్నారు ప్రియా వారియర్.. ఇప్పుడు ఈ చిన్నది ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది. కేవలం 26 సెకన్ల వీడియోతో ఈమె సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏళ్లకేళ్లు కష్టపడినా రానంత గుర్తింపు.. ఒక్క చిన్న వీడియోలో కనిపించిన ఎక్స్ ప్రెషన్స్ తో వచ్చేసింది.  ఒరు అడార్ లవ్ మూవీ ప్రమోషన్ కోసం సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా.. ఇందులో కనిపించిన ప్రియా వారియర్ ముఖంలో కనిపించిన భావాలు అందరినీ తెగ మెప్పించేశాయి. ఇలా పాపులర్ కావడానికి కారణం.. సోషల్ మీడియా వ్యాప్తి అని అంగీకరించాల్సిందే. ఇలా సడెన్ గా క్రేజ్ సంపాదించుకున్న గతంలోనూ కొందరు ఉన్నారు.  పాకిస్తాన్ లో అర్షద్ ఖాన్ అనే టీ విక్రేత గురించి గతంలో ఎవరికీ తెలియదు. కానీ ఈ నీలికళ్ల కుర్రాడు టీ పోస్తుండగా తీసిన ఒక ఫోటో నెట్ లోకి రావడం.. వైరల్ అయిపోవడం.. క్రేజ్ తెచ్చుకోవడం జరిగిపోయాయి.  రాబర్ట్ ఈ కెల్లీ అనే ఎనలిస్ట్ సడెన్ గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకోవడానికి కారణం ఓ వీడియో. ఈయన చాలా కార్యక్రమాల కోసం టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చి ఉండచ్చు కానీ.. వెనుకాల డోర్ ఓపెన్ చేసుకుని పిల్లలు రావడం.. ఈయన ఇబ్బందులు.. అర్ధాంగి పరుగెత్తుకుంటూ వచ్చి తీసుకెళ్లే వీడియో కారణంగా ప్రపంచం అందరికీ తెలిసిపోయాడు.  షారూక్ ఖాన్ తన మూవీ రయీస్ ప్రచారం కోసం చాలా ఊళ్లే తిరిగాడు. బోలెడన్ని ఫోటోలను తీసి.. సెల్పీలను తీసుకుని నెట్ లో పెట్టాడు. వీటిలో ఒకటి వైరల్ అయింది. ఇందుకు కారణం షారూక్ కాదు.. ఆ ఫోటోలో ముందు వరుసలో నుంచున్న ఓ అమ్మాయిని.. సడెన్ గా స్టార్ చేసేసింది సోషల్ మీడియా. సెల్ఫీ మై నే లే లీ ఆజ్ అంటూ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ పాడిన పాట యూట్యూబ్ లోకి రావడం ఆలస్యం వైరల్ అయిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన పూజా జైన్ అనే అమ్మాయిని అప్పటికప్పుడే స్టార్ చేసి పారేసింది.  పాకిస్తాని సింగర్ తాహెర్ షా కూడా ఇలాగే హఠాత్తుగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐ టు ఐ పాట కారణంగా 2013లోనే ఇతను సూపర్బ్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఫన్నీ యాంగిల్ లో అయినా సరే.. ఇతనికి సడెన్ గా లభించిన క్రేజ్ అంతా ఇంతా కాదు.  ఇంతకీ ఇలా వైరల్ గా మారేందుకు సీక్రెట్ ఏంటా అంటే.. వారు కూడా ఏం సమాధానం చెప్పలేరు.
0
మ‌హేష్ ర‌జ‌నీకాంత్ అభిమానుల‌కి ఇక పండ‌గే Highlights టాలీవుడ్ సూప‌ర్ స్టార్ హిరో  మ‌హేష్ బాబు టాలీవుడ్ బాలీవుడ్ కొలీవుడ్ లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్  ఇద్ద‌రు స్టార్ హిరోలు త్వ‌ర‌లోనే ఒకే వేదిక‌పై అభిమానుల‌ను అల‌రించ‌నున్నారు   స్టార్ వారసులను పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసే వేడుక తరహాలో తమిళనాట భారీగా ఆడియో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమానికి హైప్ తీసుకువచ్చేందుకు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ను వేడుకకు ఆహ్వానిస్తున్నారట. రజనీ హీరోగా తెరకెక్కుతున్న 2.0 సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ స్పైడర్ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో రజనీ, స్పైడర్ వేడుకలో పాల్గొనటం ఖాయంగా కనిపిస్తుంది. ప్రతినాయకులుగా తమిళ నటులు ఎస్ జె సూర్య, భరత్ లు నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కు రెడీ అవుతోంది. Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV లీగల్ చిక్కుల్లో అక్షయ్ కుమార్ 'జాలీ ఎల్ఎల్‌బీ-2' అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జాలీ ఎల్ఎల్‌బీ-2 సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న... TNN | Updated: Dec 25, 2016, 01:08AM IST అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జాలీ ఎల్ఎల్&zwnj;బీ-2 సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే, అంతకన్నా ముందే ఈ సినిమాకు లీగల్ ట్రబుల్స్ ఎదురయ్యాయి. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్&zwnj;లో ఓ చెప్పుల కంపెనీ పేరుని ప్రస్తావిస్తూ ఓ డైలాగ్ వుంది. అయితే, ఆ డైలాగ్&zwnj;తో తమ కంపెనీకి నష్టం చేకూరేలా సినిమా యూనిట్ వ్యవహరించింది అంటూ సదరు చెప్పుల కంపెనీ కోర్టులో పరువు నష్టం దావా వేసింది. 'జాలీ ఎల్ఎల్&zwnj;బీ -2' ట్రైలర్&zwnj;ని వెంటనే నిలిపివేయడంతోపాటు ఆన్&zwnj;లైన్&zwnj;లోంచి ట్రైలర్&zwnj;ని తొలగించాలని ఆ కంపెనీ డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలోనూ జరిగిన తప్పిదాన్ని ప్రస్తావిస్తూ క్షమాపణలు చెప్పాలని కంపెనీ ఆ పిటీషన్&zwnj;లో పేర్కొంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్&zwnj;తో కలిసి నరేన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాను సుభాష్ కపూర్ తెరకెక్కిస్తున్నాడు. ఫాక్స్ స్టార్ స్డూడియోస్, సహ నిర్మాత నరేన్ కుమార్, కంపెనీ డైరెక్టర్స్ దీపక్ జాకబ్, అమిత్ షా, మూవీ డైరెక్టర్ సుభాష్ కపూర్, నటులు అక్షయ్ కుమార్, అన్నూ కపూర్&zwnj;లకి నోటీసులు జారీ అయ్యాయి. ఈ పిటిషన్&zwnj;పై స్పందించడానికి నిరాకరించిన అక్షయ్ కుమార్.. దానిపై మాట్లాడటానికి తగిన వ్యక్తిని తాను కాను అని తప్పుకున్నాడు. నిర్మాతలే ఈ వివాదంపై స్పందిస్తారు అని జవాబిచ్చాడు అక్షయ్. మరో నటుడు అన్నూ కపూర్ అసిస్టెంట్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా... అన్నూ కపూర్&zwnj;కి ఈ విషయమే తెలీదని తెలిపాడు.
0
sandhya 368 Views 6.8% , DBS revise , economy growth economy growth న్యూఢిల్లీ: భారత్‌ ఆర్ధికవృద్ధి 2020 ఆర్ధికసంవత్సరంలో 6.8శాతం వరకూ మాత్రమే ఉంటుందని, ఆర్ధికవృద్ధిలో మందగమనం చోఒటుచేసుకుందని డిబిఎస్‌ బ్యాంకు విశ్లేషించింది. అంతకుముందు ఆర్ధికవృద్ధి 7శాతంగా ఉంటుందని అంచనావేసిన బ్యాంకు ఎగుమతుల్లో కొంత తిరోగమనం వాణిజ్యరంగం సవాళ్లతోకూడిన నడక వంటివి కొంత భారం అవుతాయని వెల్లడించింది. ప్రభుత్వ విధివిధానాలు కూడా కొంత తోడవుతాయని, మానిటరీపాలసీ ఎక్కువగా ప్రభావితంచేస్తుందని బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. భారతీయ రిజర్వుబ్యాంకు విధాన వైఖరి తటస్థవైఖరినుంచి కొంత సానుకూలంగా మారింది. దీనివల్ల కొంత నగదు ప్రభావం పెరుగుతుందని డిబిఎస్‌గ్రూప్‌ ఆర్ధికవేత్త రాధికారావు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 75 బేసిస్‌పాయింట్ల రెపోరేట్‌తగ్గిచడం వల్ల కొంతపరిస్థితుల్లో మార్పు వస్తుందన్నారు. వాస్తవ జిడిపి అంచనాలు 6.8శాతంవరకూ మాత్రమే ఉంటాయని బ్యాంకు వెల్లడించింది. డిమాండ్‌పరంగా ద్రవ్యోల్బణ సమస్యలు ఉంటాయని, కీలకద్రవ్యోల్బణం రిటైల్‌ద్రవ్యోల్బణం కొంతమేర దిగువకు రావచ్చన్న అంచనాలను వ్యక్తంచేసింది. కీలకద్రవ్యోల్బణం ఆరుశాతం సగటునుంచి మేనెలలో 4.2శాతంగా నిలిచింది. ప్రస్తుత ఆర్ధికవృద్ధి మందగమనం వల్ల ఈఏడాది మరింతగా వడ్డీరేట్ల కోత ఉంటుందని చెపుతున్నారు. ద్రవ్యోల్బణం 3.4 శాతంనుంచి 3.8శాతానికి వస్తుందని, ఆర్ధికవృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణ ప్రభావాలు కొంతకారణం అవుతాయని డిబిఎస్‌బ్యాంకు వెల్లడించింది. అంతర్జాతీయ ధోరణులు కూడా ఆర్‌బిఐ పాలసీకి కొంత కీలకం అవుతాయని వెల్లడించారు. అమెరికా ఫెడ్‌రిజర్వు యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకులతోపాటు ఇతర ఆసియా కేంద్ర బ్యాంకులు భారత్‌తోపాటు భవిష్యత్తులో కొంత సడలింపులు ఇవ్వక తప్పదని డిబిఎస్‌ బ్యాంకు ఆర్ధికవేత్తలు చెపుతున్నారు. ఇక ముడిచమురుధరలు గరిష్టస్థాయినుంచి కొంత దిగివచ్చాయి. అంతర్జాతీయ దిగుబడులు 2012 -2013తో పోలిస్తే భారత్‌ కొంతమెరుగుపడింది. ప్రస్తుతం భారత రూపాయి కొంత ఒత్తిడికి లోనవుతోంది. ద్రవ్యోల్బణం రెండంకెల్లో పెరిగే అవకాశం ఉందని అందువల్లనే రిజర్వుబ్యాంకుకు పాలసి విధాననిర్ణయం కొంత సవాళ్లతో కూడుకున్నదవుతుందని వెల్లడించారు. ద్రవ్యోల్బణం అంచనాల లక్ష్యానికి దిగువనే ఉన్నప్పటికీ రూపాయి కరెన్సీ మాత్రం మరింతగా క్షీణిస్తున్నదని, దీనివల్ల ఆర్ధికవృద్ధికోసం లోటు భర్తీకోసం అయినా 2020 ఆర్ధికసంవత్సరంలో మరో 50 బేసిస్‌పాయింట్లు వడ్డీరేట్ల కోత ఉంటుందని చెప్పారు. రానున్న కాలంలో రెపోరేటు 5.25శాతంగా ఉండవచ్చని డిబిఎస్‌బ్యాంకు ఆర్ధికవేత్త రాధికారావు వెల్లడించారు. తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/
1
sandhya 334 Views Flipkart , mega sale flipkart న్యూఢిల్లీ: ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ జూన్‌ 1 నుంచి మరో కొత్త ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ ఫ్లిప్‌స్టార్ట్‌ డేస్‌ పేరుతో నేటి నుంచి జూన్‌ 3 వరకు భారీ డిస్కౌంట్లు అందచేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ వస్తువులపైనే డిస్కౌట్లు ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. హెడ్‌సెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, పవర్‌ బ్యాంకులు, మొబైల్‌ కేస్‌లు తదితర వస్తువులపై 80 శాతం వరకూ డిస్కౌంట్‌ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. ఇక, సోనీ, జెబిఎల్‌ వంటి హెడ్‌సెట్లు, స్పీకర్లపై 70శాతం వరకు రాయితీ లభిస్తుంది. హెచ్‌పి, ఏసర్‌ తదితర ల్యాప్‌టాప్‌ల ధర రూ.13వేల నుంచిప్రారంభం కానుంది. పవర్‌ బ్యాంకులు, మొబైల్‌ కేస్‌లు, ఇతర మొబైల్‌ ఉపకరణాల ప్రారంభ ధర మినిమ§్‌ు రూ.99నుంచి ఉంటుందని సంస్థ తెలిపింది. మరోవైపు నోకాస్ట్‌ ఇఎంఐ, వారంటీ పొడిగింపు, ఎక్ఛేంజ్‌ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. 32 అంగుళా వ్యూ స్టార్‌ హెచ్‌డి టివి రూ.12499ధరకే కొనొచ్చు. తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/
1
ongs ఒఎన్‌జిసి నికరలాభం రూ.4340 కోట్లు ముంబయి, మే 28: ప్రభుత్వరంగంలోని ఆయిల్‌ నేచురల్‌గ్యాస్‌ కార్పొరేషన్‌ నికరలాభం ఆరుశాతం దిగజారి 4340 కోట్లుగా ఉంది. ఎక్కువ వ్యయ ప్రణాళికలే ఇందుకు కీలకమని సంస్థ భావిస్తోంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో వన్‌టైమ్‌ లాభాలను వీటిలో చూపించకపోవడం వల్ల గత ఏడాదికంటే లాభాలు తగ్గాయి. కంపెనీ మార్చిత్రైమాసికంలో నికరలాభం 4340కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన 4624.3 కోట్లకంటే ఆరుశాతం తగ్గింది. కంపెనీ మొత్తం రాబడులు 29శాతంపెరిగి 20,297.83 కోట్ల నుంచి 26,233.56 కోట్లకు చేరింది. మొత్తం ఖర్చులపరంగా చూస్తే 48శాతం పెరిగాయి. 20,696.46 కోట్లుగా ఉంది. గత ఏడాది 14,022.15 కోట్ల నుంచి గణనీయంగా పెగాయి. ఎక్కువ ఖర్చులతోపాటు కంపెనీ ఏకీకృత నికరలాభం ఒక్కసారి లాభం 389.82 కోట్లు గత ఏడాది కలిసొచ్చింది. ఒఎన్‌జిసి ఛైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డికె సరాఫ్‌ మాట్లాడుతూ 2444 కోట్లు బకాయిలు రాయిల్టీ రూపంలోను, 1944 కోట్లు పేరివిజన్‌ వల్ల ఖర్చులు పెరిగినట్లు వెల్లడించారు. అలాగే ముడిచమురు ధరలు పెరగడం మరొక కార ణం. నికరంగా టన్నుకు 54.91 డాలర్లు మాత్రమే విలువలు వచ్చాయి. అంతకుముందు త్రైమాసికం లో గతఏడాది 34.88డాలర్లు మాత్రమే అందా యి. ఒకవిధంగా రాబడులు పెరిగినట్లే భావించాలి. ఎంఆర్‌ఫిఎల్‌ డివిడెండ్‌తో కొంత లాభపడింది. బ్లూంబర్గ్‌ వార్తా సంస్థ 23మంది ఆర్థికవేత్తలను సర్వేచేస్తే 22,827.1 కోట్లు నికరరాబడులు, నికర లాభం 5074 కోట్లు వస్తుందని వెల్లడించారు. విభాగాల వారీగాచూస్తే కంపెనీ నదీగర్భం కార్య కలాపాలద్వారా 6413.87కోట్ల లాభాలు ఆర్జించిం ది. ఆన్‌షోర్‌ విభాగంలో నష్టాలు 1494.85 కోట్ల కు చేరాయి. గత ఏడాది ఇదేకాలంలో 119.22 కోట్లుగా ఉన్నాయి. పూర్తి సంవత్సరానికిగాను కంపె నీ నికరలాభం 59.2శాతంపెరిగి 20,497.86 కోట్లుగాఉంది. అంతకుముందుఏడాది 12,875.21 కోట్లుగా ఉంది. శుక్రవారం నిర్వహించిన బోర్డు సమావేశంలో కంపెనీ తుది విడత డివిడెండ్‌ ప్రతి ఐదురూపాయల షేరుపై రూ.0.80లుగా నిర్ణ యించింది. వాటాదారుల సమావేశం నుంచి ఆమో దం పొందాల్సి ఉంటుంది. ఇక జిఎస్‌టిపరంగా ఆయిల్‌ కంపెనీలు కొంత కలవరంవ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ముడిచమురు, సహజవాయువు కొన్ని దిగువ ప్రాంత ఉత్పత్తులను జిఎస్‌టినుంచి మినహాయించారు. ఇన్‌పుట్స్‌పై జిఎస్‌టి చెల్లిం చాల్సి ఉంటుంది. అయితే ఉత్పత్తిపై ఇన్‌పుట్‌క్రెడిట్‌ లు పొందలేరు. పెట్రోలియం గ్యాస్‌ మంత్రిత్వశాఖ ఇదే అంశంపై ఆర్థికశాఖకు లేఖరాసిందని జిఎస్‌టి మండలి, ఆర్థిక మంత్రిత్వశాఖపరిధిలో ఈ జిఎస్‌టిపై నిర్ణయంతీసుకోవాల్సిఉంటుందని షరాఫ్‌ వెల్లడించారు.
1
Suresh 80 Views bse కొరియా ఆందోళన ఉన్నా సానుకూలంగా ట్రేడింగ్‌ న్యూఢిల్లీ,సెప్టెంబరు 18: ఇటీవల కొద్ది రోజులుగా లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. కాగా ఉత్తర కొరియా ప్రభావం మార్కెట్లపై కనిపించినా నిలదొక్కుకున్నాయి.అమెరికాలో వచ్చిన తుఫాన్‌ క్రమంగా తగ్గడం,అంతర్జాతీయ వాతావా రణంలో మార్పుల వల్ల దేశీయంగా మార్కెట్లు సానుకూలంగా ట్రేడింగ్‌ నిర్వహించాయి.వివిధ స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో పాటు పారిశ్రామికోత్పత్తి, సిపిఐ ద్రవ్యోల్భణ గణాంకాలు మార్కెట్‌కు సానుకూలంగా ఉంటాయని అంచనాలతో కొనుగోళ్లు వూపందుకున్నాయి.దీంతో గత వారం మొదటి రోజు ట్రేడింగ్‌లో 10 వేల మైలురాయిని దాటిని నిష్టి తాజాగా 10.100 పాయింట్లకు చేరువైన సంగతి తెలిసిందే.మరో పక్క సెన్సెక్స్‌ మళ్లీ 32 వేల బెంచ్‌ మార్కెను దాటింది. గత సెషన్‌ జోరును కొనసా గిస్తూ,సెన్సెక్స్‌ఉదయం 32 వేల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైంది.మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ఆద్యంతం లాభాల్లో సాగిన సూచీ మార్కెట్‌ ముగిసే సమయానికి 276 పాయింట్లు ఎగబాకి 32,159 వద్ద స్థిరపడింది.అటు నిఫ్టీ కూడా నేడు లాభాల్లో ట్రేడ్‌ అయింది.అయితే 10,10 వద్ద ముగిసింది. ఏడు పాయింట్ల దూరంలో ఆగిపో యింది.ఈ క్రమంలో ట్రేడింగ్‌ 87 పాయింట్లు లాభపడ్డ నిప్టీ 10.093 వద్ద ముగిసింది.డాలర్‌తో రూపాయి మారకం విలువ 64.01గా కొనసాగింది. జాతీయ స్టాక్‌ఎక్స్చేంజ్‌లో భారత్‌ పెట్రోలియం, గెయిల్‌,టాటా మోటార్స్‌,బ్యాక్‌ ఆఫ్‌ బరోడా,సన్‌ ఫార్మా షేర్లు లాభపడగా,ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ విప్రో,హీరా మోటో,కార్స్‌, ఓఎన్‌జిసి, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ఇక మరో రెండు రోజుల అనంతరం కూడా ట్రేడింగ్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభ మయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో సూచీలు ఉత్సాహంగా ట్రేడింగ్‌ ఆరంభించాయి. సెన్సెక్స్‌్‌ 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అవుతుండగా,నిప్టీ 10,100 బెంచ్‌ మార్కెను దాటింది. చమురు కంపెనీల విక్రయాలతో గత సెషన్‌లో స్వల్ప లాభానికే పరిమి తమైన సెన్సెక్స్‌ ఉదయం 90 పాయింట్ల లాభంతో ఉత్సాహంగా ప్రారంభమైంది.ఫార్మా,ఆటోమొబైల్‌ రంగాల్లో షేర్ల అండతో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 123 పాయింట్లు ఎగబాకి 32,309 వద్ద నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 10,102 వద్ద ట్రేడ్‌ అయింది.డాలర్‌తో రూపాయి మారకం విలువ 64.11గా కొనసాగింది.సన్‌ ఫార్మా,డాక్టర్‌ రెడ్డీస్‌,లుషీన్‌,అరవిందో ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి.కాగా శనివారం మాత్రం ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం నేపథ్యంలో నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు ఎట్టకేలకు చివరల్లో కొంత వరకు కోలుకున్నాయి.అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ ఉదయం సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యాయి.దీనికి తోడ బ్యాంకింగ్‌ రంగాల షేర్లు రాణించకపోవడంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి.అయితే చివరలో కొనుగోళ్లు పెరగడంతో నష్టాల నుంచి గట్టెక్కాయి.సెన్సెక్స్‌ స్వల్పంగా లాభపడగా నిఫ్టీ తటస్థంగా ఉంది. ఉదయం 28 పాయింట్లు నష్టాపోయి 32,213 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ ఒకానొక దశలో 80 పాయింట్ల వరకూ కోల్పోయింది.అయితే చివరి గంటల్లో మధుపరులు పెట్టుబడుల వైపు ఆసక్తి చూపడంతో నష్టాల నుంచి కోలుకుంది.చివరకు స్వల్పంగా 31 పాయింట్ల వద్ద లాభపడి 32,273 వద్ద స్థిరపడింది.అటు నిష్టీ మాత్రం 1 పాయింట్‌ కోల్పోయి 10,085 వద్ద ముగిసింది.డాలర్‌తో రూపాయి మారకం విలువ 64.06గా కొనసాగుతుంది. సెన్సెక్స్‌ 61 పాయింట్ల నష్టంతో 32,180 వద్ద,నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 10,058 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 64.08గా కొనసాగుతుంది. టాటాస్టీల్‌,వేదాంత, సన్‌ఫార్మా, లుపిన్‌,ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, బిహెచ్‌ఇఎల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగి పుంజు కున్నాయి. బలహీనపడిన రూపాయి మారకం విలువ డాలర్‌తో రూపాయి మారకం విలువ కొంత బలహీ నపడింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ (పారెక్స్‌) మార్కెట్‌లో 7 పైసలు బలహీనపడి 64 రూపాయల దగ్గర ప్రారంభమైంది. దిగు మతులు, బ్యాంకర్లు డాలర్లను కొనుగోలు చేయడంతో రూపాయి విలువ బలహీనపడినట్లు ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడించారు.
1
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV `నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్‌` కత్తెరకు రెడీ అర్జున్ మ‌హి, అశ్విని జంట‌గా ర‌విచంద్ర క‌న్నికంటి ద‌ర్శకుడుగా ప‌రిచ‌యం అవుతున్న ‘ `నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్‌` మూవీ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావండంతో సెన్సార్‌కు రెడీ అయ్యింది TNN | Updated: Feb 20, 2017, 07:04PM IST అర్జున్ మ&zwnj;హి, అశ్విని జంట&zwnj;గా ర&zwnj;విచంద్ర క&zwnj;న్నికంటి ద&zwnj;ర్శకుడుగా ప&zwnj;రిచ&zwnj;యం అవుతూ.. శ్రీ మూవీ మేక&zwnj;ర్స్ ప&zwnj;తాకంపై ప్రొడ&zwnj;క్ష&zwnj;న్ నెం-1గా రిమ్మ&zwnj;ల&zwnj;పూడి వీర&zwnj;గంగాధ&zwnj;ర్ నిర్మిస్తున్న చిత్రం `నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్&zwnj;`. షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావండంతో సెన్సార్ కార్య&zwnj;క్ర&zwnj;మాలతో పాటు విడుద&zwnj;ల చేయ&zwnj;డానికి స&zwnj;న్నాహాలు చేస్తున్నారు. సంద&zwnj;ర్భంగా ద&zwnj;ర్శ&zwnj;కుడు ర&zwnj;విచంద్ర క&zwnj;న్నికంటి మాట్లాడుతూ...``ల&zwnj;వ్లీ యాక్ష&zwnj;న్ ఎంట&zwnj;ర్ టైనర్&zwnj;గా రూపొందిన మా చిత్ర ఆడియో ఇటీవ&zwnj;ల విడుద&zwnj;ల చేశాం. పాట&zwnj;లు విన్న&zwnj;వారంద&zwnj;రూ చాలా బావున్నాయంటున్నారు. ముఖ్యంగా మా పాట&zwnj;ల&zwnj;కు సోష&zwnj;ల్ నెట్ వ&zwnj;ర్స్క్ లో మంచి కాంప్లిమెంట్స్ ల&zwnj;భిస్తున్నాయి. ట్రైల&zwnj;ర్స్&zwnj;కు కూడా మంచి రెస్పాన్స్ వ&zwnj;స్తోంది. ల&zwnj;వ్ స్టోరీ చాలా ఫ్రెష్&zwnj;గా ఇంత&zwnj;కు ముందెన్న&zwnj;డు చూడ&zwnj;ని విధంగా ఉంటుంది. యూత్&zwnj;కు మాత్ర&zwnj;మే కాకుండా అన్ని వ&zwnj;ర్గాల ప్రేక్ష&zwnj;కుల&zwnj;కు న&zwnj;చ్చే చిత్రమిద&zwnj;న్నారు.
0
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV 49 రోజుల తర్వాత తొలి సినిమా విడుదల! కొన్నాళ్లుగా తమిళ సినిమాలు ఏవీ విడుదల కాకుండా నిర్వహించిన బంద్ నిన్న రాత్రితో పూర్తి అయ్యింది Samayam Telugu | Updated: Apr 19, 2018, 05:39PM IST ఎట్టకేలకూ తమిళ చిత్రపరిశ్రమలో స్ట్రైక్ ముగిసింది. కొన్నాళ్లుగా తమిళ సినిమాలు ఏవీ విడుదల కాకుండా నిర్వహించిన బంద్ నిన్న రాత్రితో పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో తమిళనాట మళ్లీ తమిళ సినిమాల హడావుడి మొదలుకానుంది. మొత్తం 49 రోజుల పాటు తమిళ చిత్రపరిశ్రమ బంద్ నడిచింది. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత అక్కడి సినిమాలు మళ్లీ విడుదల అవుతున్నాయి. సుదీర్ఘ బంద్ తర్వాత విడుదల అవుతున్న తమిళ సినిమా ‘మెర్క్యూరీ’. ఇది ఇప్పటికే ఇతర చోట్ల విడుదల అయ్యింది. ఇది బేసిక్ గా మూకీ సినిమా. కాబట్టి దీన్ని ఫలానా భాష సినిమా అని చెప్పడానికేం లేదు. అయితే తమిళ వెర్షన్ మాత్రం ఇంకా విడుదల చేయలేదని నిర్మాతలు ప్రకటించారు. ఈ వారంలో ఈ సినిమాను విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఈ విధంగా బంద్ తర్వాత విడుదల అవుతున్న సినిమాగా నిలుస్తోందిది. బంద్ రోజులలో విడుదల కాకుండా ఆగిన సినిమాలకు రానున్న రెండు మూడు వారాలూ అవకాశం ఇవ్వాలని తమిళ నిర్మాతల మండలి ప్రకటించింది. విడుదల ఆగిన సినిమాలను వరసగా విడుదల చేసుకోవాలని, బంద్ తో నిమిత్తం లేకుండా ఏప్రిల్ చివరి రెండు వారాల్లో విడుదల చేయాలనుకున్న సినిమాలను మరి కొన్నాళ్లు వాయిదా వేయాలని తీర్మానించింది. దీని ప్రభావం వల్ల రజనీకాంత్ ‘కాలా’ వాయిదా కొంత వాయిదా పడనుంది. ఏప్రిల్ ద్వితీయ పక్షంలో విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను మే మొదటి వారంలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
0
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2
sumalatha 170 Views bse , NSE , stock market SENSEX DOWN ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ ఏకంగా 624 పాయింట్లు పతనమై 36,958 వద్ద, నిఫ్టీ 184 పాయింట్లు దిగజారి 10,926 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా యస్‌బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా విలువ కోల్పోయాయి. మరోపక్క హెవీవెయిట్‌ షేరు రిలయన్స్‌ 10శాతానికి పైగా లాభపడ్డా మార్కెట్‌ పతనాన్ని ఆపలేకపోయింది. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/sports/
1
Hyd Internet 247 Views pujara pujara కోల్‌కత్తా: భారత్‌-శ్రీలంకల మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వర్షం అడ్డంకితో మధ్య మధ్యలో ఆగుతూ సాగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్ల ధాటికి టపాటపా వికెట్లను కోల్పోతున్న భారత జట్టు ఏడేళ్ల నాటి చెత్త రికార్డుకు చేరువైంది. శ్రీలంక బౌలర్‌ లక్మల్‌ ధాటికి భారత్‌ 30పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్‌ ఇలా 30పరుగుల్లోపు నాలుగు కీలక వికెట్లను కోల్పోవడం స్వదేశంలో ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అంతకుముందు 2010లో అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో భారత్‌ 15పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయింది.
2
Jio ఆర్‌జియో నుంచి జియోటివి హైదరాబాద్‌: 4జి ఎల్‌టిఇ సేవలతో టెలి కాం రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ముఖేష్‌ అంబానీ రిలయన్స్‌జియో ఇన్ఫోకామ్‌ నుంచిమరో సంచలన వార్త వస్తోంది. మేనెల నుంచి దేశవ్యాప్తంగా జియోటివి సేవలు ప్రారంభిస్తామని ప్రకటించింది. డైరెక్ట్‌టు హోం సేవల రంగంలోకి ప్రవేశిస్తూ ఇప్పటికే సెట్‌ టాప్‌ బాక్సులను సిద్ధంచేసింది. ఈ సెట్‌టాప్‌ బాక్స్‌లలో ఇంటర్నెట్‌ అను సంధానిత సేవలు కూడా అందు తాయి. జియో ఇప్పటికే జియోటివి సేతల కోసం ప్రధాననగరాల్లో పనులు ప్రారంభించింది. జియో వివరాలను బట్టిచూస్తే టిడిహెచ్‌ధర రూ.1800లుగా ప్రకటిం చింది. డిటిహెచ్‌ బుకింగ్స్‌ను ఏప్రిల్‌ నుంచే ప్రారంభి స్తున్నది. ప్రారంభం మేనెలలో ఉంటుందని అంచనా. అతి తక్కువగా టిడిహెచ్‌లో రూ.180లుగా ఉంటా యని ఆర్‌జియో సిబ్బంది చెపుతున్నారు. ఇప్పటికే టెలికాం రంగంలో ఇతర కంపెనీలకు కంటిమీద కును కులేకుండాచేస్తున్న జియోకొత్తగా ప్రారంభించే డిటిహెచ్‌ తో మరింత సంచలనం సృష్టిస్తుందని అంచనా.
1
Suresh 306 Views మలింగ రికార్డుబ్రేక్‌ చేసిన డేన్‌బ్రావో మొహలీ: టి20 క్రికెట్‌ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన శ్రీలంక ఆటగాడు మలింగ రికార్డును విండీస్‌ ఆల్‌రౌండర్‌ డేనబ్రావో బ్రేక్‌ చేశాడు. 229 వికెట్లతో మలింగ అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా ఇవాళ తాజాగా ఐపిఎల్‌లో గుజరాత్‌ లయన్స్‌ తరపున బ్రావో పంజాబ్‌ జట్టుపై ఆడుతూ 300 వికెట్ల మైలురాయిని చేరువై మలింగ రికార్డును బద్దలు కొట్టాడు.
2
పడకేసిన కీలక రంగాల ఉత్పత్తి - ఏప్రిల్‌లో 2015 ప్రధాన రంగాల పనితీరు - ఏప్రిల్‌లో వృద్ధి 0.4 శాతానికే పరిమితం - వడ్డీ రేట్ల తగ్గింపుపై పెరిగిన ఆశలు న్యూఢిల్లీ : వరుసగా రెండో మాసంలోనూ కీలక రంగాల వృద్ధి రేటు పడిపోయింది. ఎనిమిది ప్రధానమైన రంగాలు కలిగిన ఈ ప్రాధాన్యత రంగాల వృద్ధి రేటు ఈ ఏడాది ఏప్రిల్‌లో 0.4 శాతానికి పరిమితమయ్యింది. దీంతో దేశీయ తయారీ రంగం పుంజుకోవడంపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ ఎనిమిది కీలక రంగాలు మొత్తం పారిశ్రామికోత్పత్తి సూచీలో 38 శాతం వాటా కలిగి ఉన్నాయి. కేవలం ఒక్క బొగ్గు రంగమే మెరుగైన ప్రగతిని కనబర్చింది. స్టీల్‌ రంగం యథాతథంగా 0.6 శాతంగా నమోద య్యింది. ఈ రెండు రంగాలు మాత్రమే సానుకూ లంగా నమో దయ్యాయి. మరో ఆరు పరిశ్రమలు ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్ట్స్‌, ఎరువులు, సిమెంట్‌, విద్యుత్‌ ప్రతికూలతను ఎదుర్కున్నాయి. 2014 ఇదే ఏప్రిల్‌ మాసంలో ఈ ఎనిమిది రంగాలు ఏకంగా 5.7 శాతం వృద్ధిని కనబర్చాయి. 2015 మార్చిలో 0.1 శాతం వృద్ధితో సరిపెట్టుకున్నాయి. గత ఏప్రిల్‌లో విద్యుత్‌ ఉత్పత్తి 1.1 శాతానికి పడిపో యింది. మార్చిలో ఈ రంగం 1.7 శాతంగా చోటు చేసుకుంది. క్రితం ఏప్రిల్‌లో సహజ వాయువు 3.6 శాతానికి, రిఫైనరీ 2.9 శాతానికి, ముడి చమురు 2.7 శాతం, సిమెంట్‌ 2.4 శాతం, ఎరువులు 0.04 శాతం చొప్పున వృద్ధితో సరిపెట్టుకున్నాయి. 2015-16 తొలి మాసంలోనే కీలక రంగాల వృద్ధి రేటు పడిపోవడం విస్మయం కలిగిస్తోందని కేర్‌ రేటింగ్‌ ఎజెన్సీ చీఫ్‌ ఎకనామిస్ట్‌ మడన్‌ సబ్నవిస్‌ పేర్కొన్నారు. ఇప్పటికే పడిపోయిన పారిశ్రామికోత్పత్తి సూచీ గణంకాలు, ద్రవ్యోల్బణం కొంత నియంత్రణలో ఉందన్న సూచీల నేపధ్యంలో రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జూన్‌2న ఆర్‌బిఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. దేశంలో పారిశ్రామికోత్పత్తి సూచీలో మాంద్యం, వరుసగా రెండో మాసంలోనూ కీలక రంగాల ఉత్పత్తి పడిపోవడంతో ప్రధాని మోడీ తలపెట్టిన మేక్‌ ఇన్‌ ఇండియాకు ప్రధాన సవాల్‌ను విసురుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
రారండోయ్ వేడుక చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ గ్యాలరీ First Published 23, May 2017, 6:53 PM IST రారండోయ్ వేడుక చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ గ్యాలరీ రారండోయ్ వేడుక చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ గ్యాలరీ రారండోయ్ వేడుక చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ గ్యాలరీ రారండోయ్ వేడుక చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ గ్యాలరీ రారండోయ్ వేడుక చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ గ్యాలరీ రారండోయ్ వేడుక చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ గ్యాలరీ రారండోయ్ వేడుక చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ గ్యాలరీ రారండోయ్ వేడుక చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ గ్యాలరీ Recent Stories
0
Oct 26,2019 6 లక్షల వ్యాపారులతో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ జట్టు న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ పేమెంట్‌ వేదిక అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2017 నుంచి ఇప్పటి వరకూ భారత్‌లో 6 లక్షల మంది వ్యాపారులతో జత కట్టినట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా ప్రముఖ పట్టణాలతో అమెరికా కార్డు సభ్యుల సంఖ్య మరింత పెరిగిందని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్లోబల్‌ మర్చంట్‌ సర్వీసు హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ అనురాగ్‌ గుప్తా పేర్కొన్నారు. దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగిన నేపథ్యంలో తమ కార్డుల వినియోగం మరింతగా పుంజుకుందన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
తొలి వన్డేకు అనూహ్య స్పందన   న్యూఢిల్లీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా,ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌కు క్రికెట్‌ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది.కాగా వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన టీమిండియా,ఇంగ్లండ్‌ మధ్య తొలి వన్డే మ్యాచ్‌ టికెట్లన్సీహాట్‌ కేకుల్లా అమ్ముడైనట్లు మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం(ఎంసిఎ) ప్రకటించింది.షెడ్యూల్‌ ప్రకారం టీమిండియా,ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి వన్డే పుణేలోని గహుంజేలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో జరుగనుంది.మ్యాచ్‌ జరుగడానికి ముందు నెల రోజుల ముందు అంటే డిసెంబర్‌ 15న టికెట్లు అమ్మకాలు ప్రారంభించగా కేవలం 12 రోజుల్లోనే టికెట్లన్సీ అమ్ముడైనట్లు ఎంసిఎ వెల్లడించింది. అఫ్‌లైన్‌,ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించే టికెట్లన్సీ అమ్ముడైనట్లు ఎంసిఎ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది.కాగా తొలి వన్డేలో 37,406 సీటింగ్‌ సామర్థ్యం ఉన్న ఈ స్టేడియం మొత్తం పూర్తిగా నిండిపోనుంది.సుమారు మూడు సంవత్సరాల తరువాత వన్డే మ్యాచ్‌ జరుగనుండటంతో అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభించింది.పుణేలో చివరి సారి అక్టోబరు 13,2013న టీమిండియా,ఆస్ట్రేలియా మధ్య వన్డే జరిగింది.దీంతో చాలా రోజుల తరువాత వన్డే జరుగనుండటంతో టికెట్ల అమ్మకాలు ప్రారంభించిన తొలి రోజు నుంచి స్థానికులు వాటిని కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.కాగా టీమిండియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మూడు వన్డేలు,మూడు టి20లలో సిరీస్‌ జరుగనుంది.కాగా తొలి వన్డే జనవరి 15న ప్రారంభం అవుతుండగా రెండవ వన్డే జనవరి 19న కటక్‌,మూడవ వన్డే కోల్‌కతాలో జనవరి 22న జరుగనుంది.వన్డే సిరీస్‌ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య మూడు టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా జనవరి 26న తొలి టి20 కాన్పూర్‌లో జరుగుతుండగా,రెండవ టి20 కాన్పూర్‌,మూడవ టి20 బెంగళూరులలో జరుగనున్నాయి.
2
-  అంచనాలు తప్పిన ఫలితాలు - 20 శాతం మేర పతనతమైన లాభాలు న్యూఢిల్లీ: దేశంలోని మూడో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను చేరుకోలేకపోయాయి. టెలికాం విభాగపు దెబ్బతో 2018 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో (క్యూ4)లో విప్రో నికర లాభాలు 20.5 శాతం తగ్గి రూ.1,800.80 కోట్లుకు పరిమితమైయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.2267 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అంతకు ముందు ఏడాది మార్చి త్రైమాసికంలో విప్రో సంస్థ రూ.2,132 కోట్ల లాభాలు ప్రకటించే అవకాశం ఉందని థామ్సన్‌ రాయిటర్స్‌ అంచనా వేసింది. పలు విశ్లేషణ సంస్థలు కూడా ఇదే స్థాయిలో ఆశించాయి. కాని తాజా ఫలితాలు నిరుత్సాహపర్చాయి. ముఖ్యంగా తమ టెలికాం కంపెనీ క్లయింట్లు దివాలా ప్రక్రియకు వెళ్లడం విప్రో ఫలితాలపై ఒత్తిడి తీసుకువచ్చినట్టుగా ఆ కంపెనీ పేర్కొంది. కాగా ఆ టెలికాం కంపెనీల పేర్లు వెల్లడించడానికి సంస్థ అంగీకరించలేదు. మార్చి త్రైమాసికంలో విప్రో సంస్థ ఆదాయం 4.9 శాతం తగ్గి రూ.14,304 కోట్లకు పరిమితమయ్యింది. 2016-17 ఇదే నాలుగు త్రైమాసికంలో రూ.15,045 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. 2017-18లో మొత్తంగా విప్రో నికర లాభాలు 6 శాతం తగ్గి రూ.8,003 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో మొత్తం ఆదాయం 1.7 శాతం తగ్గి రూ.57,035 కోట్లుగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.1 డివిడెండ్‌ అందించడానికి ఆ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. 2017 డిసెంబర్‌ ముగింపు నాటికి 1,10,000 మిలియన్‌ షేర్లు బైబ్యాక్‌ పూర్తియింది. బుధవారం బీఎస్‌ఈలో విప్రో షేర్‌ 0.05 శాతం పెరిగి రూ.287.20 వద్ద ముగిసింది. దేశీయ టెలికాం రంగంలో కొత్త సంస్థరాకతో చాలా టెలికాం కంపెనీలు బోర్డు తిప్పేస్తూ వస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం పోటీ సంస్థలకే పరిమితమైన ఈ దెబ్బ తాజాగా ఐటీ సంస్థలకూ కూడా సోకడం గమనార్హం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
ఆ బిల్ల్లుల్లోనే మార్కెట్ల భవిత నవతెలంగాణ, వాణిజ్య విభాగం                  ఈ నెల 4తో ప్రారంభమయ్యే వారంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లను ప్రధానంగా భూసమీకరణ, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లులు ప్రభావితం చేయనున్నాయి. ఈ వారంలో పార్లమెంట్‌లో ఈ బిల్లుపై చర్చలు జరగడంతో పాటు ఆమోదానికి రానున్నాయి. దీంతో మదుపర్ల మొత్తం దృష్టి ఈ బిల్లులపైనే ఉంది. గత మాసం తయారీ రంగ ప్రగతిపై వివిధ ప్రయివేటు ఎజెన్సీలు వెల్లడించే అంచనాలు మార్కెట్లకు కీలకం కానున్నాయి. అదే విధంగా గత జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో పలు కార్పొరేట్‌ కంపెనీలు ఆర్ధిక ఫలితాలు ప్రభావితం చేయనున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ, ఇతర ప్రపంచ దేశాల పరిణామాలు మార్కెట్ల కదలికలను మార్చనున్నాయి. సెన్సెక్స్‌ 426 పాయింట్లు నష్టం ఏప్రిల్‌ 30తో ముగిసిన గత వారంలో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ ఏకంగా 426.63 పాయింట్లు లేదా 1.55 శాతం దిగజారి 27,011 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 124 పాయింట్లు లేదా 1.49 శాతం పతనమై 8,181.50 వద్ద స్థిరపడింది. ప్రధానంగా విదేశీ మదుపర్ల లాభాలపై పన్నులు చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు తోడు పలు కార్పొరేట్‌ కంపెనీల గత క్యూ4 ఫలితాలు మార్కెట్లను నిరాశకు గురి చేశాయి. ఈ నేపథ్యంలోనే నష్టాలు చవి చూశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ సూచీ 0.18 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 0.58 శాతం చొప్పున తగ్గాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
రాజమౌళి కి ఏం పని లేదా.. రంగస్థలం సెట్స్ కు పదే పదే వెళ్తున్నాడు.. రీజన్ Highlights రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో మూవీకి రంగం సిద్ధం ఈ మూవీ లో కొన్ని సీన్స్ కోసం రంగస్థలం సెట్స్ అందుకే పదే పదే రంగ స్థలం సెట్స్ కు రాజమౌళి రామ్ చరణ్ తో రంగస్థలం మూవీని పూర్తి చేసేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయిపోగా.. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్.. మరోవైపు ప్రమోషనల్ వర్క్ జోరుగా సాగుతున్నాయి. రంగస్థలం అంటే ఓ ఊరిపేరు అనే విషయం ఇప్పటికే దర్శకుడు చెప్పేశాడు. ఇప్పుడీ రంగస్థలం ఊరికి దర్శక ధీరుడు రాజమౌళి వచ్చాడు.  తన అసిస్టెంట్స్ తో కలిసి.. మొత్తం రంగస్థలం ఊరంతా తిరిగేశాడు. ఈ సమయంలో సుకుమార్ కూడా పక్కనే ఉన్నాడు. రంగస్థలం చిత్రం కోసం వేసిన ఊరు సెట్ లోని ప్రతీ అంగుళాన్ని పరిశీలించాడు రాజమౌళి. జక్కన్న ఇక్కడకు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓసారి వచ్చాడు. ఆ సమయంలో కూడా ప్రతీ డీటైలింగ్ ను మెచ్చుకున్నాడు. 30 ఏళ్ల క్రితం జ్ఞాపకాలను తిరిగి చూపించిన సుకుమార్ ను తెగ పొగిడేశాడు రాజమౌళి. ఇప్పుడు మళ్లీ తన యూనిట్ తో కలిసి రంగస్థలం ఊరిలో చక్కర్లు కొడుతున్నాడు.    రాజమౌళి ఇలా రంగస్థలం గ్రామానికి ఇన్ని సార్లు ఎందుకు వస్తున్నాడనే ఆసక్తి అంతటా కనిపిస్తోంది. బహుశా తను తీయబోయే తర్వాతి సినిమాకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ సెట్ ను ఉపయోగించుకునేందుకు.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాడని.. అందుకే ఇన్నిసార్లు రంగస్థలంకు వస్తున్నాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి. Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0
MS Dhoni would never block way for Youngsters, Sehwag Counters Laxman కుర్రాళ్ల అవకాశాలకు ధోని అడ్డం పడడు: సెహ్వాగ్ మహేంద్రసింగ్ ధోనీపై వీవీఎస్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారీ లక్ష్యం ముందుండగా ధోని నెమ్మదిగా బ్యాటింగ్‌ చేయడంపై లక్ష్మణ్, అగార్కర్ సహా పలువురు మాజీలు విమర్శలు చేశారు. TNN | Updated: Nov 7, 2017, 09:53AM IST మహేంద్రసింగ్ ధోనీపై వీవీఎస్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. న్యూజిలాండ్&zwnj;తో రెండో టీ20లో భారీ లక్ష్యం ముందుండగా ధోని నెమ్మదిగా బ్యాటింగ్&zwnj; చేయడంపై లక్ష్మణ్, అగార్కర్ సహా పలువురు మాజీలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. టీ20ల నుంచి ధోనీ తప్పుకోవాలని, కుర్రాళ్లకు అవకాశమివ్వాలని వాళ్లు ఆరోపించారు. అయితే.. ఈ అభిప్రాయంతో సెహ్వాగ్ విభేదించాడు. &lsquo;భారత్&zwnj;కు ఇప్పటికీ ధోని కావాలి, అది టీ20ల్లో అయినా సరే. వన్డేలైనా సరే. అతడు సరైన సమయంలోనే నిష్క్రమిస్తాడు. యువ ఆటగాళ్ల అవకాశాలకు అతడు అడ్డం పడడు&rsquo; అని వీరూ అన్నాడు. పనిలో పనిగా ధోనికి కూడా కొన్ని సూచనలు చేశాడు. జట్టులో తన పాత్రేంటో ధోని తెలుసుకోవాలని, భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ప్రారంభం నుంచే జోరందుకోవాలని సెహ్వాగ్ అన్నాడు.
2
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV GST: జీఎస్టీ పరిధిలోకి గ్యాస్..? సహజవాయువును జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు రావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ధరలు అదుపులో ఉంచవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. Samayam Telugu | Updated: Jun 8, 2018, 10:03PM IST సహజవాయువును జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు రావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ధరలను అదుపులో ఉంచవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముడి చమురు, సహజ వాయువు, విమానయాన ఇంధనం, డీజిల్, పెట్రోల్‌ లాంటి ఐదు వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. జీఎస్టీ జాయింట్ సెక్రటరీ ధీరజ్ రాస్తోగి ఈ విషయాన్ని ప్రకటించారు. రాబోయే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నాటికి ఇందులో లాభనష్టాలను బేరీజు వేసుకుని కేంద్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ పక్రియ అమలుకు ఎలాంటి గడువును ఇంకా నిర్ణయించలేదని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రోల్ భారీ ఆదాయ వనరుగా ఉంది. ఇప్పుడు పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ప్రభుత్వాల ఆదాయంలో కోత పడుతుంది. మరోవైపు.. జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించే దిశగా జీఎస్టీ మండలి చర్యలు చేపట్టింది.
1
ధరల్ని పట్టించుకోకుంటే ఎలా! - అందుకే వృద్ధి కోసం వడ్డీరేట్లు తగ్గించలేదు: ఉర్జిత్‌ ముంబయి: వృద్ధి రేటును నిలబెట్టుకొనే ప్రయత్నంలో ధరల పెరుగుదలను పట్టించుకోకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడం సరికాదని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అభిప్రాయపడ్డారు. ఇటీవల సమావేశమైన పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన సమర్థించుకున్నారు. సోమవారం పటేల్‌ ఇక్కడ ఒక వార్తా పత్రిక వారితో మాట్లాడుతూ వృద్ధిరేటును పెంపొందించడమే ఎంపీసీ ప్రతీ పథకం పరమావధి అని అన్నారు. ఇటీవలి కాలంలో వృద్ధి మందగించడంతో ఆర్‌బీఐ వడ్డీరేట్లు సవరిస్తుందన్న భావన చాలా వర్గాల్లో వ్యక్తమైందని ఆయన అన్నారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల మూలంగా కుంగిన వృద్ధిని నిలబెట్టుకొనేందుకు ద్రవ్యోల్బణాన్ని పక్కనబెట్టి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని తాము భావించినట్టుగా తెలిపారు. తమ తాజా అంచనాల ప్రకారం మూడు లేదా నాలుగో త్రైమాసికాల్లో వృద్ధి పుంజుకోని 7 శాతానికి ఎగువన నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం కోసం పాకులాడుతూ వృద్ధిని వదిలేయకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యతా తమపైన ఉందని ఆయన వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
Nandan Nelekani నాకు మొదట ఉద్యోగం ఇచ్చింది నారాయణమూర్తే!:  ఇన్ఫోసిస్‌ నీలేకని బెంగళూరు, ఆగస్టు 27: ఇన్ఫోసిస్‌ సహ వ్యవ స్థాపకులు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి తనకు మొట్టమొదట ఉద్యోగం ఇచ్చారని కొత్త సిఇఒ నందన్‌ నీలేకని గుర్తుచేసుకున్నారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంపెనీకి ఎనిమిదేళ్లు దూరంగా ఉన్న కాలంలోనే ఆయన ఆధార్‌ప్రాజెక్టుకు పనిచేసారు. నారాయణమూర్తి మంచి దూరదృష్టి ఉన్న వ్యక్తి అని ఐఐటి బాంబే నుంచి గ్రాడ్యుయేట్‌ అయిన తర్వాత 1980లో తనకు ఉద్యోగం వచ్చిందన్నా రు. పాట్ని కంప్యూటర్స్‌లో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేరానని ఆయన గుర్తుచేసుకున్నారు. పదేళ్లపాటు సిఇఒగా పనిచేసిన ఈ కంపెనీలో తదనంతరం ప్రభుత్వ ఆధార్‌ప్రాజెక్టుకు బాధ్యతలు స్వీకరించా ల్సి రావడంతో రాజీనామా చేశానన్నారు. 2002 నుంచి 2007 వరకూ సిఇఒగా పనిచేసిన నీలేకని వైస్‌ఛైర్మన్‌గా పనిచేసారు. తదనంతరం 2009 లో కంపెనీని వీడి ఆధార్‌ప్రాజెక్టుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్లలో నూరుశాతం విశ్వా సం నింపడమే తన లక్ష్యమని ఆయన అన్నారు.
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV విప్రో లాభం అదుర్స్.. బోనస్‌ ధమాకా! కంపెనీ అలాగే వాటాదారులకు ఒక్కో షేరుకు రూపాయి (50 శాతం) మధ్యంతర డివిడెండును ప్రకటించింది. డివిడెండ్‌ చెల్లింపునకు ఈ నెల 30 తేదీని రికార్దు తేదీగా నిర్ణయించింది. Samayam Telugu | Updated: Jan 19, 2019, 08:54AM IST హైలైట్స్ క్యూ3 లాభం రూ. 2,544 కోట్లు; 32 శాతం అప్‌ ఆదాయంలో రూ. 10% వృద్ధి ప్రతి మూడు షేర్లకు ఒకటి రెండేళ్లలో రెండోసారి బోనస్‌ ఇష్యూ 50 శాతం మధ్యంతర డివిడెండు దేశీ మూడో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆకట్టుకునే ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం సుమారు 31.8 శాతం ఎగిసి రూ.2,544.5 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ.1,930 కోట్లు. మరోవైపు కంపెనీ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.13,669 కోట్ల నుంచి రూ.15,059 కోట్లకు చేరింది. కీలకమైన ఐటీ సర్వీసుల విభాగం ఆదాయాలు త్రైమాసికాల వారీగా (సీక్వెన్షియల్‌) చూస్తే 1.8 శాతం వృద్ధితో 2,046.5 మిలియన్‌ డాలర్లుగా (దాదాపు రూ. 14,555 కోట్లు) నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో డాలర్ల మారకంలో చూస్తే ఐటీ సేవల వ్యాపార విభాగం ఆదాయాలు సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన సుమారు 2 శాతం వృద్ధి సాధించవచ్చని విప్రో అంచనా వేస్తోంది. ఇది 2,047 మిలియన్‌ డాలర్ల నుంచి 2,088 మిలియన్‌ డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని తెలిపింది.
1
sumalatha 174 Views bse , LIC Housing Finance , NSE LIC న్యూఢిల్లీ: ఈరోజు ఎన్‌ఎస్‌ఈలో జరిగిన ఒక ‘బ్లాక్‌ డీల్‌’్చ్వ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. సాధారణంగా 5లక్షల వాటాలు కానీ, రూ.5కోట్లకు మించిన విలువైన షేర్లను కానీ ఒకే లావాదేవీలో చేతులు మారిస్తే దానిని బ్లాక్‌ డీల్‌ అంటారు. ఈ డీల్‌లో ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు సంబంధించిన 7.7శాతానికి సమానమైన 3.9కోట్ల షేర్లు రూ.431 వద్ద చేతులు మారాయి. ఫిడిలిటీ మేనేజ్‌మెంట్‌ సంస్థ కూడా షేర్లను విక్రయించినట్లు తెలిపింది. ఈ డీల్‌ మొత్తం విలువ రూ.1,261 కోట్లుగా ఒక ఆంగ్లవార్తా సంస్థ పేర్కొంది. కొనుగోలుదార్ల పేర్లను మాత్రం బయటపెట్టలేదు. బీఎస్‌ఈ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఫెడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌కు జూన్‌ 30నాటికి దీనిలో 3.41శాతం వాటా ఉంది. దీంతోపాటు బ్యాంక్‌ ఆప్‌ మస్కట్‌ ఇండియా ఫండ్‌, గవర్నమెంట్‌ పెన్షన్‌ ఫండ్‌కు 2.28, 1.83శాతం వాటాలు ఉన్నాయి. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV 'దంగల్' లేటెస్ట్ లుక్‌తో అదరగొట్టిన అమీర్ ఖాన్ బాలీవుడ్‌లో మిస్టర్ పర్‌ఫెక్షనిస్టుగా పేరున్న అమీర్ ఖాన్ ప్రస్తుతం దంగల్ సినిమా షూటింగ్‌లో బిజీగా TNN | Updated: Jun 13, 2016, 10:24PM IST బాలీవుడ్‌లో మిస్టర్ పర్‌ఫెక్షనిస్టుగా పేరున్న అమీర్ ఖాన్ ప్రస్తుతం దంగల్ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటివరకు ఓల్డర్ వెర్షన్ పాత్రకి సంబంధించిన అవతారంలో కనిపించిన అమీర్ ఖాన్ తాజాగా యంగర్ వెర్షన్ పాత్రకి సంబంధించిన లుక్‌లో దర్శనమిచ్చాడు. అమేజింగ్ ఫిట్‌నెస్‌తో కనిపించిన అమీర్ ఖాన్ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మహవీర్ ఫోగత్ అనే రెజ్లర్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ మార్చుతున్న గెటప్స్, అతడి బాడీ షేప్ చూస్తోంటే అమీర్ ఖాన్‌ని అందుకే నిజంగా మిస్టర్ పర్‌ఫెక్ట్ అని అంటున్నారేమో అని అనిపిస్తోంది కదూ!! చేస్తున్న పాత్రలో లీనమవడమేకాకుండా.. అచ్చం అలాగే కనిపించడం కోసం అమీర్ ఖాన్ తీసుకునే శ్రద్ధే అతడిని మిస్టర్ పర్‌ఫెక్షనిస్టుని చేసింది.
0
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ‘అదేనువ్వు అదేనేను’: మహేష్‌బాబు మేనల్లుడి సినిమా ప్రారంభం ‘అదేనువ్వు అదేనేను’ చిత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. పూజాకార్యక్రమాలు నిర్వహించి తొలి షాట్‌ను చిత్రీకరించారు. Samayam Telugu | Updated: Oct 18, 2018, 12:20PM IST ‘అదేనువ్వు అదేనేను’: మహేష్‌బాబు మేనల్లుడి సినిమా ప్రారంభం సూపర్ స్టార్ మహేష్‌బాబు మేనల్లుడు, ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తోన్న ‘అదేనువ్వు అదేనేను’ చిత్రం ద్వారా ఆయన సినీ రంగంలోకి అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా శశి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ భామ నభా నతేష్ ఈ చిత్రంలో అశోక్ సరసన నటిస్తోంది. ఈ చిత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. పూజాకార్యక్రమాలు నిర్వహించి తొలి షాట్‌ను చిత్రీకరించారు. See Pics: ‘అదేనువ్వు అదేనేను’ మూవీ లాంచ్ ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి తొలి షాట్‌కు క్లాప్‌నిచ్చారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్ చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్ తల్లిదండ్రులు గల్లా రామచంద్రనాయుడు, గల్లా అరుణ కుమారి.. జయదేవ్ భార్య గల్లా పద్మావతితో పాటు ఘట్టమనేని మంజుల, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
Investment ఇన్వెస్టర్లకు నిరాశమిగిల్చిన తొలిత్రైమాసికం ముంబయి, ఆగస్టు 22: భారత్‌ కార్పొరేట్‌రంగంలో నీరసించిన తొలిత్రైమాసిక ఫలితాలతో ఈ ఏడాది కూడా మందకొడి ఫలితాల ఏడాదిగానే నమోదవుతోంది. నికరంగా 1.5శాతం మాత్రమే వృద్ధి ఉంటుందని కోటక్‌ సంస్థాగత సెక్యూరిటీస్‌ తన నివేదికలో ఉటంకించింది. నిఫ్టీ 50 కంపెనీలు నికర ఆదాయంలో 8.4శాతం క్షీణించాయి. దీనివల్ల ఆర్థికవ్యవస్థలో క్షీణిస్తున్న ధోరణులు వెలుగులోనికి వచ్చాయి. అంతేకాకుండా మరో మందగమన సంవత్సరంగా ఈ ఏడాది నమోదవుతుందని కోటక్‌ అంచనావేసింది. జూన్‌త్రైమాసికంలో నిఫ్టీ 50సూచి సంస్థల లాభాలు 8.4శాతం క్షీణించాయి. అంచనాలు 1.8శాతం కంటే భారీగా క్షీణత నమోదయిం ది. ప్రస్తుత ఆర్థికసంవత్సరం నికరలాభాలునిఫ్టీ 50 సూచి కంపెనీల్లో కేవలం 1.5శాతం మాత్రమే పెరుగు తాయని , బ్యాంకులు, ఐటి ఫార్మారంగాల్లో ఎక్కువ క్షీణత నమోదయిందని వెల్లడించింది. దేశీయంగా ఆటో, వినియోగరంగ ఉత్పత్తులు,ఫార్మా రంగాల్లో జిఎస్‌టి అమలువల్ల కొంత అమ్మకాల ఒత్తిడిపెరింగింది. దీనితో కంపెనీలకు లాభ దాయకత తగ్గింది. ఇక బిఎస్‌ఇ 30, నిఫ్టీ 50 సూచీల్లోని కంపె నీల వృద్ధి 1.5శాతం, 8.4శాతంగా ఉంది. తొలిత్రైమాసికంలో అంచనాలకంటే భారీగా తగ్గిందని కోటక్‌ వివరించింది. 2017 -18 ఆర్థికసంవత్సరంలో నికరలాభాలు కూడా ఏమాత్రం ఆశా జనకంగా లేవు. దీన్నిబట్టిచూస్తే నిఫ్టీ కంపెనీలు 1.5శాతం మాత్ర మే వృద్ధిసాధిస్తాయని అంచనా. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి అమలు వంటి వాటివల్ల మరింతగా తగ్గే అవకాశంఉందని కోటక్‌ సెక్యూరి టీస్‌ అంచనావేసింది. ప్రభుత్వ వ్యయం కొంత జిడిపి వృద్ధికి బాటలువేసే అవకాశం ఉంది. వినియోగ వ్యయం పెరిగి, ఉపాధి పెరిగినా, పెట్టుబడులు పెరిగినా కొంత వృద్ధి ఉంటుందని లేనిపక్షంలో అసంఘటిత రంగం మరింత చిక్కుల్లో ఉంటుందని అంచనావేసింది. ప్రస్తుతం స్టాక్‌ విలువలు మరింత వ్యయభరితంగా ఉన్నాయి. నిఫ్టీ 21 రెట్లు ఎక్కువ ట్రేడింగ్‌ చేసింది. ప్రతి వాటాకు షేర్లు 17రెట్లు పెరిగాయని అంచనావేసిం ది. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో పటిష్టమైన రికవరీ ఉంటుందని, అలాగే సమస్యలు కూడా ఉంటాయని అంచనావేసింది. ప్రపంచ వ్యాప్తంగాను, దేశీయంగాను స్థూల ఆర్ధిక పరిస్థితులు కొంత సానుకూలంగానే ఉంటాయని, అయితే రాబడులు మాత్రం మార్కెట్‌ పనితీరుకు కీలకం అవుతాయని కోటక్‌ అంచనావేసింది.
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. మ్యాచ్ మధ్యలో వర్షంరాగా.. అప్పటికే మ్యాచ్ తమిళనాడు‌కి చేజారిపోయింది. Samayam Telugu | Updated: Oct 25, 2019, 05:28PM IST విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక విజయ్ హజారే ట్రోఫీ విజేతగా కర్ణాటక నిలిచింది. తమిళనాడుతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక జట్టు వీజేడీ పద్ధతిలో 60 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 253 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కర్ణాటక జట్టు 23 ఓవర్లు ముగిసే సమయానికి 146/1తో నిలవగా.. వర్షం రావడంతో మ్యాచ్‌ని అంపైర్లు నిలిపివేశారు. దాదాపు అరగంటకిపైగా వేచి చూసిన అంపైర్లు.. వర్షం తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతిలో కర్ణాటకని విజేతగా ప్రకటించారు. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు జట్టులో.. ఓపెనర్ అభినవ్ ముకుంద్ (85: 110 బంతుల్లో 9x4), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ బాబా అపరిజిత్ (66: 84 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. అయితే.. సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్ (0), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (11), విజయ్ శంకర్ (11), రవిచంద్రన్ అశ్విన్ (8) తక్కువ స్కోరుతోనే సరిపెట్టడంతో.. తమిళనాడు 49.5 ఓవర్లలో 252 పరుగులకి ఆలౌటైంది. కర్ణాటక జట్టులో బౌలర్ అభిమన్యు మిథున్ ఐదు వికెట్లు పడగొట్టగా.. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది. విజయ్ హజారా ట్రోఫీ ఫైనల్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా మిథున్ రికార్డ్ నెలకొల్పాడు. లక్ష్య ఛేదనలో కర్ణాటక ఓపెనర్ దేవదూత్ (11) ఆరంభంలోనే ఔటవగా.. అనంతరం వచ్చిన మయాంక్ అగర్వాల్ (69 నాటౌట్: 55 బంతుల్లో 7x4, 3x6)తో కలిసి ఓపెనర్ కేఎల్ రాహుల్ (52 నాటౌట్: 72 బంతుల్లో 5x4) నిలకడగా ఆడాడు. రెండో వికెట్‌కి అజేయంగా 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రాహుల్- మయాంక్ జోడీ.. వర్షంతో మ్యాచ్‌‌ని నిలిచే సమయానికి 146/1తో కర్ణాటక జట్టుని తిరుగులేని స్థితిలో నిలిపింది.
2
ఇంటర్నెట్ లో బీప్ లేకుండా బూతులు.. ఇకపై కుదరదా..? Highlights బీప్ లేకుండా బూతు డైలాగులను వాడుతున్నారు. ఇప్పుడు వెబ్ సిరీస్ కు కూడా సెన్సార్ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది వెండితెరకు, బుల్లితెరకు సెన్సార్ తప్పనిసరి. దీంతో అశ్లీలత, హింస చూపించాలనుకునే దర్శకులు వెబ్ సిరీస్ బాట పడుతున్నారు. ఇంటర్నెట్ లో ప్రసారమయ్యే ఈ వెబ్ సిరీస్ కు ఇప్పటివరకు సెన్సార్ సమస్యలు లేవు. దీంతో అందులో చూపించే కంటెంట్ కు నియంత్రణ లేకుండా పోతుంది. కనీసం ఒక లిమిట్స్ అనేవి పెట్టుకోకుండా.. స్వేచ్చ పేరుతో శ్రుతిమించిన అశ్లీలత, హింసను చూపిస్తున్నారు. బీప్ లేకుండా బూతు డైలాగులను వాడుతున్నారు. ఇప్పుడు వెబ్ సిరీస్ కు కూడా సెన్సార్ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ కంటెంట్ పై నియంత్రణ లేని కారణంగా మేకర్స్ అదుపుమీరి బూతులను, అశ్లీలతను చూపిస్తున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. అలా అని వారి స్వేచ్చను హరించే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. తాజాగా విడుదలైన 'సాక్రెడ్ గేమ్స్' వెబ్ సిరీస్ కూడా  వివాదాలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో దివంగత రాజీవ్ గాంధీను తిట్టారని, కొన్ని విషయాలను వక్రీకరించి చూపించారని ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఇప్పుడు అధికారులు తీసుకున్న నిర్ణయం కారణంగా త్వరలోనే ఈ బూతు డైలాగులకు బీప్ పడబోతుందని తెలుస్తోంది.
0
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పాక్ సింగర్ అద్నాన్ సమీకి భారత పౌరసత్వం పాకిస్థాన్‌కి చెందిన ప్రముఖ సింగర్ అద్నాన్ సమీకి భారత పౌరసత్వాన్ని కల్పిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. TNN | Updated: Dec 31, 2015, 09:50PM IST పాకిస్థాన్‌కి చెందిన ప్రముఖ సింగర్ అద్నాన్ సమీకి భారత పౌరసత్వాన్ని కల్పిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1, 2016 నుంచి అద్నాన్‌కి భారత పౌరసత్వం వర్తించనున్నట్లు కేంద్ర హోంశాఖ అధికారవర్గాలు తెలిపాయి. అక్టోబర్ 6న అందుకున్న మూడు నెలల పొడిగింపు వీసాపైనే అద్నాన్ భారత్‌లో వుంటున్నాడు. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో పుట్టిన అద్నాన్.. 2001లో మార్చి 13న తొలిసారిగా భారత్ వచ్చారు. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో వున్న భారత హై కమిషన్ వద్ద పొందిన ఒక సంవత్సరం కాలపరిమితగల విజిటింగ్ వీసాపై భారత్ వచ్చిన అద్నాన్ అప్పటి నుంచి ఇక్కడే వుండిపోయారు. ఎప్పటికప్పుడు తన వీసాని పొడిగింపచేసుకుంటూ భారత్‌లో వుంటున్న అద్నాన్‌కి ప్రస్తుతం పాకిస్థానీ పాస్‌పోర్టు గడువు కూడా ముగిసింది. దీంతో తాను భారత్‌లోనే నివసించేందుకు అవకాశం కల్పించాల్సిందిగా వేడుకుంటూ ఈ ఏడాది మే 26న అద్నాన్ కేంద్ర హోంశాఖకి దరఖాస్తు చేసుకున్నాడు. అద్నాన్ విజ్ఞప్తిపై మానవతా దృక్పథంతో స్పందించిన కేంద్ర హోంశాఖ అతడికి జనవరి 1 నుంచి భారత పౌరసత్వం వర్తిస్తుందంటూ ఆదేశాలు జారీచేసింది.
0
గ్లోబల్‌ విలీనాలు, కొనుగోళ్లు 3.1లక్షల కోట్ల డాలర్లు   న్యూఢిల్లీ, డిసెంబరు 29: అంతర్జాతీయంగా వివిధ సంస్థల్లో కొనుగోళ్లు, విలీనాలు మొత్తం 3.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. 2007వ సంవత్స రం తర్వాత మూడోసారి భారీ ఎత్తున ఈ లావా దేవీలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది కంటే 22 శాతం ఈ లావాదేవీలుపెరిగాయి. మెర్జర్‌ మార్కెట్‌ గ్లోబల్‌ సంస్థ అంచనాలను చూస్తే రాజకీయంగా నెలకొన్న అనూహ్యపరిణామాలు అంతర్జాతీయంగా విలీనం కొనుగోళ్ల కార్యకలాపాలను పెంచాయి. మొత్తం 16,194 డీల్స్‌ జరిగితే వాటి విలువ 3.1 లక్షలకోట్లు డాలర్లుగా ఉంది. ఒక్క 2007 సంవ త్సరంలో మాత్రమే 3.7 లక్షల కోట్ల డాలర్ల విలు వైన విలీనాలు, కొనుగోళ్లు జరిగాయి. కార్పొరేట్‌ రంగచరిత్రలో ఇదే అత్యంత భారీ కొనుగోళ్లుగా ఆర్థికనిపుణులు చెపుతారు. అక్టోబరునెలలో ఈ కొనుగోళ్లు విలీనాల విలువ 454.3 బిలియన్‌ డాల ర్లుగా ఉంది. మొత్తం 1362 డీల్స్‌జరిగాయి. నెలవారీగాచూస్తే 2007 మేనెల తర్వాత ఇదే అత్యంత ఎక్కువమొత్తం జరిగిన లావాదేవీలుగా నిలుస్తాయి. 2007 మేనెలలో 546.7 బిలియన్‌ డాలర్లుగా నిలిచింది. 2016 సంవత్సరంలో 38కి పైగా భారీ లావాదేవీలు జరిగాయి. వాటి విలువ ఒక్కొక్కటి పదిబిలియన్‌ డాలర్లకుపైబడి ఉంటుం ది. మొత్తంగాచూస్తే వీటి లావాదేవీల విలువ 911.5 బిలియన్‌ డాలర్లుగా నిలిచింది. అలాగే మొత్తంగా గత ఏడాది ఈ తరహా పెద్ద డీల్స్‌ 57 వరకూ జరిగాయి. మొత్తం 1.5 లక్షలకోట్ల డాలర్లు గా ఉన్నాయి. అయితే రానున్న ఆర్థిక సంవత్సరం మాత్రం అనిశ్చితితో ఉంటుందని మెర్జర్‌ మార్కెట్‌ అంచనా వేసింది. బ్రెగ్జిట్‌ సంప్రదింపులు ప్రారం భం కావడం, అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌ బాధ్య తలు స్వీకరించడం, ఫ్రెంచ్‌, జర్మనీ ఎన్నికలు వంటి వి కొంత ఈ మార్కెట్‌కు అనిశ్చితిని పెంచుతాయని చెప్పవచ్చు. వివిధ రంగాలపరంగా విద్యుత్‌, యుట ిలిటీ, మైనింగ్‌రంగాల్లో 582.8 బిలియన్‌ డాలర్లు విలువైన కొనుగోళ్లు విలీనాలు జరిగాయి. మొత్తం 1351 డీల్స్‌ జరిగాయి. తదనంతరం పారిశ్రామిక రసాయనాలు 3056 డీల్స్‌తో 498.5 బిలియన్‌ డాలర్లు మొత్తం జరిగింది. టెక్నాలజీరంగపరంగా 2115 డీల్స్‌లో మొత్తం 401.4 బిలియన్‌ డాలర్లు చేతులుమారాయి. చైనా డీల్‌ మేకర్లు 242 డీల్స్‌ లో పాల్గొన్నారు. మొత్తం 171 బిలియన్‌ డాలర్లు ఆసియా బయటి ప్రాంతంలో కొనుగోళ్లు జరిపారు. అంతకుముందు సంవత్సరం రికార్డు విలువలతో పోలిస్తే 3.5 రెట్లు ఎక్కువే. ఏడాది చివరిలో అమెరికాపరంగాచూస్తే భారీ డీల్స్‌ జరిగాయి. ఎటిఅండ్‌టి, టైమ్‌వార్నర్‌, లెవెల్‌3/సెంచురి లింక్‌, ఎనర్జీ ట్రాన్స్‌ఫర్‌/సునుకో వంటి కంపెనీలు భారీ విలువలతో డీల్స్‌ నడిపాయనే చెప్పాలి.
1
Dec 01,2017 సర్కారు సంస్కరణలకు అంతం లేదు! న్యూఢిల్లీ: దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అవసరమైన సంస్కరణల విషయంలో తమ ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. గురువారం హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిఫ్‌ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్మాణాత్మక సంస్కరణలకు ముగింపనదే ఉండదని ఆయన పేర్కొన్నారు. పది శాతం వృద్ధి రేటును సాధించడం సవాళ్లతో కూడుకున్న పనేనని అన్నారు. 'గత మూడేళ్లుగా దేవ జీడీపీ వ ద్ధి 7-9శాతంగా నమోదు అవుతూ వస్తోందని అన్నారు. అయితే 10 శాతం వద్ధి సాధించడమనేది అతిపెద్ద సవాలేనని పేర్కొన్నారు. ఇది ఒక్క దేశీయ పరిణామాలపైనే కాకుండా అంతర్జాతీయ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది' అని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో పన్ను విధానాల్లో మార్పులు దేశ ఆదాయంపై ఆధారపడి ఉంటుందన్నారు. జీఎస్టీ విషయమై జైట్లీ ఈ వేదికపై మాట్లాడుతూ 12శాతం, 18శాతం పన్ను శ్లాబులను విలీనం చేసే సంకేతాలిచ్చారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
Suresh 80 Views it return ఐటిఆర్‌ గడువుదాటితే రూ.5వేలు జరిమానా న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఆదాయపు పన్నురిట ర్నులు దాఖలుచేసేందుకు పొడిగించిన గడు వు కూడా పూర్తయింది. శనివారం ఒక్కరోజే చివరి తేదీ కావడంతో రిటర్నులు దాఖలులో ఆన్‌లైన్‌కు రద్దీపెరిగింది. చివరినిమిషంలో పెరిగిన ఆన్‌లైన్‌ ట్రాఫిక్‌ రద్దీకి వెబ్‌సైట్‌క్రాష్‌ అవుతున్న దృష్ట్యాఐటి శాఖ మరో ఐదురోజులు గడువు పొడిగించింది. ఐదులక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారు పన్నురిటర్నులు దాఖలుచేసుకునే అవకాశం ఉంది. జాప్యం జరిగితే అసెస్సింగ్‌ అధికారికి రూ.5వేల వరకూ జరిమానా అపరాధ వడ్డీతో సహా వసూలు చేసే అధికారాలున్నాయి. ఆన్‌లైన్‌ ఫైలింగ్‌ద్వారా ఆదాయపు పన్ను రిటర్నులు మరింత సులభతరం అయ్యాయి. ఐటిఆర్‌ను ఆన్‌లైన్‌ దాఖలుచేసేందుకు రెండు విధానాలున్నాయి. ఒక విధానంలో దర ఖాస్తును డౌన్‌లోడ్‌చేసుకుని ఆఫ్‌లైన్‌లో పూర్తిచేసి సేవ్‌చేసుకోవాలి. కొత్తగా ఒక ఎక్స్‌ఎంఎల్‌ఫైల్‌ను తయారుచేసుకుని వాటిని అప్‌లోడ్‌చేయాలి. రెండోవిధానంలో ఐటిఆర్‌ ఆన్‌లైన్‌లోనే పూర్తిచేసి సబ్‌మిట్‌ బటన్‌ నొక్కాలి. రెండో విదానం ఐటిఆర్‌ వన్‌, ఐటిఆర్‌4లకు మాత్రమే వర్తింపచేసారు. ఆధార్‌నెంబరును పాన్‌నంబరుతో లింకుచేయడం ద్వారాపన్ను చెల్లింపుదారు తప్పనిసిరిగా ఐటిఆర్‌ను జూలై ఒకటవ తేదీనాటికి దాఖలుచేయాల్సిఉంటుం ది. జూలై 31వ తేదీలోపు కానివారు ఆగస్టు ఐదు లోపే ఆధార్‌ పాన్‌ లింకింగ్‌ను చేసుకోవాలి. లేని పక్షంలో ఈనెల 31వ తేదీవరకూ కూడా లింక్‌చేసేం దుకు ఐటిశాఖ గడువు పొడిగించింది.ఇ-ఫైలింగ్‌ రిటర్నుల దరఖాస్తులకోసం ఇటీవల ఆధార్‌నంబరు కాని, ఆధార్‌కోసం దరఖాస్తుచేసిన ఇఫైలింగ్‌ వెబ్‌ సైట్‌ రసీదు కాని జతచేయాల్సి ఉంటుంది. ఆధార్‌ పాన్‌ లింకేజి పూర్తికానిపక్షంలో ఐటిశాఖ రిటర్ను లను ప్రాసెస్‌చేసేందుకు వీలుండదని హెచ్చరిం చింది. ఈ ఏడాది ఐటిశాఖ పన్ను చెల్లింపుదారుల ను నగదు డిపాజిట్లు మొత్తం బ్యాంకుల్లో ఉన్నవాటి ని వెల్లడించాలని కోరింది. ఇవన్నీ కూడా రెండు లక్షలకుపైబడి ఉన్నవి మాత్రమే. పెద్దనోట్ల రద్దు తర్వాత అంటేనవంబరు 9 నుంచి డిసెంబరు 30 చివరితేదీ లోపు ఉన్నవాటికి వీటిని అమలుచేయా ల్సి ఉంటుంది. హచ్‌ఆర్‌ఎ ప్రయోజనాలు క్లెయిం చేయడంలో పన్ను చెల్లింపుదారులు మరింత అప్ర మత్తంగా ఉంటారని, హెచ్‌ఆర్‌ఎ క్లెయిమ్‌లను నిశి తంగా పరిశీలించాలని నిపుణులు చెపుతున్నారు. ఫారమ్‌16లో క్లెయిం కనిపించకపోతే పన్ను రిటర్నుల్లో కనిపించాల్సి ఉంటుందని అన్నారు. ఇఫైలింగ్‌ ఐటిర్‌ను ఈ ఏడాదే పూర్తిగా మార్చేశారు. ఆదాయపు పన్నుశాఖ కొత్త ఫారాలను ఐటిఆర్‌కు రూపకల్పనచేసింది. ఒకేపేజీ ఫారమ్‌ ఐటిఆర్‌-1 సహజ్‌ వంటివి ప్రవేశపెట్టింది. జీతాలు, పెన్షన్‌, ఒక స్థిరాస్థి కొనుగోలు వంటి ఆదాయం ఉన్న వారికి ఈ ఫారంవర్తిస్తుంది. పన్నుశాఖపరంగా కొన్ని కాలమ్‌లను కూడా ఎత్తివేసింది. ఐటిఆర్‌ను నివేదిం చిన తర్వాత వాటిని సంపూర్ణంగా పరిశీలించాలి. ప్రస్తుత పన్నుచట్టాలకు అనుగుణంగా ఈ రిటర్ను ఉన్నదీలేనిదీ పరిశీలించాలి. ఒకసారి ఇపైలింగ్‌ జరిగిన ఐటిఆర్‌ ఆదాయపు పన్నుశాఖ వీటినిఐటిఆర్‌-విపేరిట రిజిస్టరు ఇమెయిల్‌ ఐడికి పంపిస్తుంది. వెరిఫికేషన్‌ పూర్తి అయిన తర్వాత వాటిని తిరిగి పన్నులశాఖకు పంపించాలి. ఆన్‌లైన్‌ తనిఖీ విధానం మరింత సులభతరం అయింది. ఆధార్‌ ఒటిపి ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ విధానాల్లోను ఇతర పద్ధతుల్లో కూడా ఉన్నట్లు అంచనా. సకాలం లో ఐటిఆర్‌లు దాఖలుచేయడం ఎంతోమంచిదని, ఆగస్టు ఐదవ తేదీ తుదిగడువు దాటితే వడ్డీపై జరి మానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అదనపు పన్ను డిమాండ్‌ను జారీచేస్తే అపరాధ వడ్డీతోసహా చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఐదవ తేదీ తుదిగడువునుదాటిపోతే గతఏడాదికి మనం ఐటిఆర్‌ దాఖలుచేయలేకపోయామనికాదు. వెనువెంటనే ఆల స్యంగా మార్చి 2018వరకూ ఐటిఆర్‌ను దాఖలు చేయవచ్చు. అయితే దీనివల్ల కొన్ని పన్నుప్రయోజ నాలు నష్టపోవాల్సి ఉంటుంది. మూలధన నష్టాలు ముందు సంవత్సరానికి బదిలీచేయడం వంటివి ఉండవు. ఐటిచట్టం సెక్షన్‌ 271ఎఫ్‌ప్రకారం అసె స్సింగ్‌ అధికారి రిటర్నుల్లో జాప్యానికి రూ.5వేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. చివరి తేదీ కావడంతో ఆదాయపు పన్నుశాఖ క్షేత్రస్థాయి కార్యాలయాలన్నీ అర్ధరాత్రి వరకూ పనిచేస్తాయి. సీనియర్‌ సిటిజన్లకు ఐదులక్షల వరకూ ఉన్నవారికి ఐటిఆర్‌లు దాఖలు చేసుకోవచ్చు. 80 ఏళ్లకుపైబడి, వారి ఆదాయం ఐదులక్షలలోపు ఉంటే వారు ఇఫైలింగ్‌ చేయాల్సినపనిలేదు. 80ఏళ్లకుపైబడిన వారు వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఐదులక్షల ఆదాయం మించనివారు ఎలాంటి రిఫండ్‌ క్లెయించేయనివారు ఐటిఆర్‌-1(సహజ్‌) లేదా ఐటిఆర్‌-4(సుగమ్‌)ను లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించింది.
1
ZEN MOBILE జెన్‌మొబైల్స్‌ నుంచి అడ్మయిర్‌ స్మార్ట్‌ఫోన్‌ హైదరాబాద్‌: జెన్‌ మొబైల్స్‌ కంపెనీ కొత్తగా 5749 రూపా యల ధరలో అడ్మయిర్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదలచేసింది. నాన్‌స్టాప్‌ వినోదం, సెల్ఫీలు వేగంగా అప్‌లోడ్‌చేసే సౌకర్యంతోపాటు 22 భారతీయ భాషల్లో ట్విన్‌ వాట్సాప్‌ ఫీచర్లతో వస్తోంది. 5అంగుళాల టచ్‌స్క్రీన్‌, 1.3గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ప్రాసెసర్‌ వన్‌జిబిరామ్‌, 16జిబి రామ్‌ను 32జిబివరకూ విస్తరిం చుకోవచ్చు. షాంపేన్‌, మెటాలిక్‌గ్రే, 2500 ఎంఎహెచ్‌ బ్యాటరీతో వస్తోం ది. వేగవంతమైన 4జి నెట్‌వర్క్‌తో జెన్‌మొబైల్‌ మరిన్ని అత్యాధునిక ఫీచర్లన్నీ ఉన్నాయి. 22 ప్రాంతీయ భాషలను సైతం సపోర్టుచేస్తుంది.
1
Jun 18,2015 100 కోట్లకు.. హలో.. హలో      న్యూఢిల్లీ : భారత్‌లో మొత్తం టెలికం వినియోగదారుల సంఖ్య 100 కోట్లకు చేరువలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ ముగింపు నాటికి 99.97 కోట్ల టెలికం ఖాతాదార్లు నమోదయ్యారని టెలికం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రారు) వెల్లడించింది. మార్చి ముగింపు నాటికి 99.64 కోట్ల ఖాతాదార్లున్నారు. ఏప్రిల్‌ 2015 నాటికి పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల సంఖ్య 58.01 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 41.95 కోట్లకు చేరారు. గత ఏప్రిల్‌ ముగింపు నాటికి వైర్‌లెస్‌ వినియోగదారుల సంఖ్య 97.33 కోట్లు, వైర్‌లైన్‌ ఖాతాదార్ల సంఖ్య 2.63 కోట్లుగా ఉంది. గత ఏప్రిల్‌లో 31 లక్షల మంది మొబైల్‌ నెంబర్‌ పొర్టిబిలిటీకి దరఖాస్తు చేసుకున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
Visit Site Recommended byColombia `నేను తొలిసారిగా నటించిన సినిమా రషెస్ చూసినప్పుడు నాకు సిగ్గనిపించింది. నేను తెర మీద అస్సలు బాలేను. నా హెయిర్‌ స్టైల్‌ కూడా ఆకట్టుకునేలా లేదు. నానా పటేకర్‌, అమృత సింగ్‌, జూహీ చావ్లా లాంటి స్టార్స్‌ ముందు నా నటన తేలిపోతుంది. అయితే ఆ సమయంలో జూవీ చావ్లా, అజీజ్‌లు ప్రస్తుతం నువ్వు చూసింది నెగెటివ్‌, పాజిటివ్‌ వచ్చాక బెటర్‌గా అనిపిస్తుంది అంటూ నాకు ధైర్యం చెప్పారు` అని గుర్తు చేసుకున్నాడు షారూఖ్‌. `ఓ దిగువ మధ్య తరగతి అనాథ కుర్రాడు గ్లామర్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టడం, సినీ నటుడిగా ఎదగటం, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవటం లాంటి సంఘటనలు కేవలం కలల్లోనే జరుగుతుంటాయి. నేను ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ ఊహించలేదు. నేను ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాను. కొన్ని సందర్భాల్లో స్టార్‌లా బిహేవ్‌ చేసినా.. చాలా వరకు నన్ను నేను స్టార్‌గా భావించను. కానీ నా ప్రఫెషన్‌ను మాత్రం నేను ప్రేమిస్తాను` అన్నాడు షారూఖ్‌. Also Read: నీతులు చెప్పడమే కాదు.. పాటిస్తున్న దర్శకుడు ఫౌజీ, సర్కస్‌ లాంటి టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న షారైఖ్‌ 1992లో దీవానా సినిమాలో వెండితెరకు పరిచయం అయ్యాడు. దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్‌ తో పాగల్‌ హై, కల్‌ హోనా హో, కబీ ఖుషీ కబీ గమ్‌ లాంటి సినిమాలో కింగ్‌ ఆప్ రోమాన్స్‌గా పేరు తెచ్చుకున్నాడు షారూఖ్‌. వరుస బ్లాక్‌ బస్టర్‌లతో బాలీవుడ్‌ మార్కెట్ స్టామినాను పెంచి సూపర్‌ స్టార్‌గా, బాద్‌షాగా పేరు తెచ్చుకున్నాడు. సూపర్‌ స్టార్ ఇమేజ్‌ అందుకున్న తరువాత ప్రయోగాల బాట పట్టిన షారూఖ్‌.. చక్‌ దే ఇండియా, రావన్‌, స్వదేశ్‌, రాయిస్‌, ఫ్యాన్ లాంటి ప్రయోగాలు చేశాడు. అయితే ఒకటి రెండు సినిమాలు తప్ప రూట్ మార్చిన తరువాత షారూఖ్‌ చాలా వరకు ఫెయిల్ అయ్యాడు. ప్రస్తుతం ఎక్కువగా నిర్మాణ రంగం మీద దృష్టి పెట్టిన షారూఖ్‌ సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లను కూడా నిర్మిస్తున్నాడు.
0
Hyderabad, First Published 15, Mar 2019, 9:36 AM IST Highlights క్రితం సంవత్సరం భారీ అంచనాలతో, బడ్జెట్ తో రిలీజైన  'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రం దారుణమైన పరాజయం పాలవ్వడం  బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్  ఆలోచనలో పడేసింది. క్రితం సంవత్సరం భారీ అంచనాలతో, బడ్జెట్ తో రిలీజైన  'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రం దారుణమైన పరాజయం పాలవ్వడం  బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్  ఆలోచనలో పడేసింది. దాంతో వెంటనే ఏ సినిమా చేయాలి..ఏది వర్కవుట్ అవుతుందనే విషయమై  అమీర్ ఖాన్ తన టీమ్ లో గత కొంతకాలంగా చర్చలు చేస్తున్నరు. ఎన్నో కథలు విన్నారు. కానీ  వెంటనే ఏదో ఒక సినిమా కమిటయ్యి... చేసేందుకు ఆయనకు ధైర్యం చాలడం లేదు. ఈ నేపధ్యంలో ఓ హాలీవుడ్ చిత్రం రైట్స్  తీసుకున్నారు. ఆల్రెడీ ప్రపంచం అంతా మెచ్చుకున్న చిత్రాన్ని రీమేక్ గా చేసేందుకు సిద్దపడుతున్నట్లు సమాచారం. హాలీవుడ్‌లో విజయం సాధించిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ చిత్రం హిందీ రీమేక్‌ హక్కుల్ని అమీర్‌ కొనుగోలు చేశారట. టామ్‌ హాంక్స్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. అప్పట్లో ఈ చిత్రం భారీ విజయం సాధించడమే కాదు ఆరు ఆస్కార్‌ పురస్కారాలను కూడా గెలుచుకుంది.   అమీర్ ఖాన్ స్వయంగా రైట్స్ తీసుకున్నాడని రీమేక్ చేసి హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమీర్ ఖాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉండటంతో ఇలా అందరికీ తెలిసిన ఓ రీమేక్ చేస్తే అంతర్జాతీయ మార్కెట్ లో బిజినెస్ కు ఇబ్బంది అవుతుందని, ఆ రీమేక్ వద్దని ట్రేడ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయట. అయినా ఫారెస్ట్ గంప్ కోసం పూర్తిగా తన లుక్ మార్చుకుని  ఆ కథని మన నేటివిటిలోకి మార్చి  త్వరలో ప్రారంభించబోతున్నారని వినికిడి.  Last Updated 15, Mar 2019, 9:36 AM IST
0
Jul 31,2017 జియోకు పోటీగా ఐడియాఫోన్‌! - గూగుల్‌,ఫేస్‌బుక్‌, వాట్సాప్‌తో పాటు పలు యాప్స్‌తో అందుబాటులోకి.. - వాడకందారుకు ఇంటర్‌నెట్‌ స్వేచ్ఛనిÛస్తూ పలు సదుపాయాలు.. - ధర సుమారు రూ.2,500 - ఆపరేటర్‌నూ మార్చుకొనే అవకాశం! ముంబయి: రిలయన్స్‌ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని నిలిచేందుకు గాను దేశంలోని టెలికాం సంస్థలు వివిధ పథకాలను ఎత్తుకుంటున్నాయి. తాజాగా రిలయన్స్‌ జియో సంస్థ మార్కెట్లోకి ఉచితంగా 4జీ అధారిత ఫీచర్‌ఫోన్‌ను తీసుకురానున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తమ సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న 2జీ, 3జీ వినియోగదారులను నిలుపుకొనేందుకు గాను ఐడియా సెల్యులార్‌ కూడా మొబైల్‌ఫోన్ల వార్‌లోకి దిగింది. తాము చౌకగా ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా ప్రకటించింది. రిలయన్స్‌ జియోలో కేవలం రిలయన్స్‌ ఆపరేటర్‌కు సంబంధించిన వివిధ యాప్స్‌కు మాత్రమే పరిమితం కానుండగా.. ఐడియా తీసుకురానున్న కొత్త మొబైల్‌లో ఇతర సంస్థల యాప్స్‌ను సైతం వినియోగించుకునే వెసులుబాటును కల్పించనున్నట్టు సమాచారం. 'నెట్‌ వినియోగంలో అందరికీ అన్ని విషయాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. వినియోగదారులు ఇష్టపడే, ఎంపిక చేసుకునే అన్ని యాప్స్‌ వాడుకునే వెసులుబాటును వారు (జియో) కల్పించడం లేదు. కొన్ని ఎంపిక చేసిన యాప్స్‌ ఇచ్చినా అన్నీ పనిచేయకపోవచ్చు. కేవలం వినియోగదారులను బలవంతంగా వారి యాప్స్‌ను మాత్రమే వినియోగించుకునేలా చేస్తున్నారు' అని ఐడియా సెల్యులార్‌ ఎండీ హిమాన్షు కపానియా తెలిపారు. జియో ఫోన్‌ కన్నా కొంచెం ఎక్కువ ధరకు మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ను తీసుకొచ్చేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంపెనీ సన్నాహలు చేస్తోంది. ఈ ఫోన్‌లో వినియోగించే యాప్స్‌ విషయంలో వినియోగదారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని కంపెనీ తెలిపింది. 'కొత్త ఫోన్‌.. వినియోగదారులకు పూర్తి స్వేచ్ఛనిస్తుంది. చివరకు టెలికాం ఆపరేటర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం కూడా వారికి అవకాశం కల్పిస్తున్నాం. గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ సహా అన్ని ముఖ్యమైన యాప్స్‌ను వారు వినియోగించుకోవచ్చు' అని కపానియా వెల్లడించారు. ఐడియా తీసుకొస్తున్న ఈ ఫోన్‌ ధర సుమారు రూ.2,500 వరకూ ఉంటుందని, అయితే ఎలాంటి సబ్సిడీ ఉండదని తెలిపారు. జియో ఫోన్‌ ఉచితంగా ఇస్తున్నా, సెక్యురిటీ డిపాజిట్‌ కింద రూ.1500 కట్టాల్సి ఉంటుందని సంస్థ గుర్తు చేసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV బిగ్ బాస్: ఆ ముగ్గురిలో వెళ్లిపోయేది ఎవరో! సోమవారం నుంచి శుక్రవారం వరకు బిగ్ బాస్ షోపై ప్రేక్షకుల అభిప్రాయాలు ఎలా ఉన్నా శనివారం వచ్చే సరికి మాత్రం ఆసక్తి పెరిగిపోతుంది. TNN | Updated: Aug 6, 2017, 10:23AM IST సోమవారం నుంచి శుక్రవారం వరకు బిగ్ బాస్ షోపై ప్రేక్షకుల అభిప్రాయాలు ఎలా ఉన్నా శనివారం వచ్చే సరికి మాత్రం ఆసక్తి పెరిగిపోతుంది. కారణం ఎన్టీఆర్. శని, ఆదివారాలు ఎన్టీఆర్ వచ్చి చెప్పే విషయాలతో పాటు నాలుగు రోజులపాటు హౌజ్&zwnj;మేట్స్ చేసిన కొంటె, చిలిపి చేష్టలను ప్రేక్షకులకు వివరిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. ఈ శనివారం కూడా షో చాలా ఆసక్తికరంగా నడిచింది. ఈసారి ఎలిమినేషన్ జోన్&zwnj;లోకి మొత్తం ఆరుగురిని బిగ్ బాస్ నామినేట్ చేసిన విషయం తెలిసిందే. వారిలో ధనరాజ్, శివ బాలాజీ, మహేష్ కత్తి, సమీర్, కల్పన, ముమైత్ ఖాన్ ఉన్నారు. అయితే వీరిలో ముగ్గురు సేఫ్ జోన్&zwnj;లోకి వెళ్లిపోయినట్లు శనివారం ఎపిసోడ్&zwnj;లో ఎన్టీఆర్ ప్రకటించారు. ధనరాజ్, శివ బాలాజీ, మహేష్ కత్తి సేఫ్ జోన్&zwnj;లోకి వెళ్లిపోయారు. ఇక మిగిలింది.. కల్పన, సమీర్, ముమైత్. వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో ఆదివారం తెలిసిపోతుంది. ఇదిలా ఉండగా.. శనివారం ఎపిసోడ్&zwnj;లో హౌజ్&zwnj;మేట్స్&zwnj;కి ఎన్టీఆర్ పెట్టిన టాస్క్ అదిరింది. బిగ్ బాస్ ఓ 20 రకాల లక్షణాలను చీటీలపై రాసి వాటిని ఓ గాజు బౌల్&zwnj;లో ఉంచారు. వాటిలోని చీటీలను హౌజ్&zwnj;మేట్స్ ఒక్కొక్కరిగా తీసి చీటి మీద రాసి ఉన్న లక్షణాన్ని గట్టిగా చదవాలి. ఆ లక్షణం అక్కడున్నవారిలో ఎవరికి ఉందని అనుకుంటున్నారో వారి ముఖం మీద చీటీని చించి, దానికి కారణం కూడా చెప్పాలి. ఈ టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగింది.
0
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV షమీ ఫోన్ నా దగ్గర లేకపోయుంటే..? షమీకి అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేసిన అతడి భార్య మరోసారి అతడిపై విమర్శలు గుప్పించింది. TNN | Updated: Mar 11, 2018, 06:50PM IST షమీ ఫోన్ నా దగ్గర లేకపోయుంటే..? టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై అతడి భార్య ఫిర్యాదు చేయడంతో కోల్&zwnj;కతా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన భర్తకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన హసీన్ జహాన్ .. అతడు పాకిస్థాన్&zwnj;కు చెందిన అమ్మాయిని పెళ్లాడాడని, ఫిక్సింగ్&zwnj;కు పాల్పడ్డాడని సంచలన కామెంట్లు చేసింది. వేరే అమ్మాయిలతో షమీ చాటింగ్ చేసిన వివరాలను ఆమె ఫేస్&zwnj;బుక్&zwnj;లో పోస్టు చేసింది. ఆదివారం మీడియా ముందుకు వచ్చిన హసీన్ మరోసారి షమీపై విమర్శలు గుప్పించింది. షమీ మొబైల్ ఫోన్ దొరక్కపోతే అతడు నాకు ఇప్పటికే విడాకులు ఇచ్చేవాడని హసీన్ చెప్పింది. తప్పును ఒప్పుకోమని కోరాను. చాలా కాలంగా అతణ్ని బతిమాలాను. నా దగ్గర అతడి ఛాటింగ్ వివరాలున్న ఫోన్ లేకపోతే షమీ ఉత్తరప్రదేశ్ పారిపోయి ఉండేవాడని జహాన్ తెలిపింది. మీడియా కూడా షమీకే మద్దతు పలుకుతోందని జహాన్ ఆవేదన వ్యక్తం చేసింది. తన లాయర్లు బీసీసీఐతో మాట్లాడతారని చెప్పిన ఆమె.. ఇప్పటికే షమీ తన తప్పును ఒప్పుకుంటే.. కలిసి ఉంటానని చెప్పింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2
అంచనాలు చేరని ఐటీసీ - లాభం రూ.2361 కోట్లు న్యూఢిల్లీ : వివిధ రకాల ఉత్పత్తులను అందించే ఐటిసి గ్రూపు క్రితం మార్చితో ముగిసిన త్రైమాసికం ఆర్ధిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోయింది. గత జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ఈ కంపెనీ నికర లాభాలు స్వల్పంగా 3.65 శాతం పెరిగి రూ.2,361.18 కోట్లకు చేరాయి. కోల్‌కత్తా కేంద్రంగా పని చేస్తోన్న ఈ కంపెనీ 2013-14 ఇదే క్యూ4లో రూ.2,278.01 కోట్ల లాభాలు సాధించింది. గత క్యూ4లో కంపెనీ అమ్మకాలు 0.47 శాతం పెరిగి రూ.9,188.25 కోట్లకు చేరాయి.               గత క్యూ4లో ఈ కంపెనీ ఎఫ్‌ఎంసిజి వ్యాపారం రెవెన్యూ 3.23 శాతం పెరిగి రూ.4,210.7 కోట్లకు చేరింది. సిగరేటేతర వ్యాపారం 10.88 శాతం రాణించి రూ.2,566.51 కోట్లుగా నమోదయ్యింది. క్రితం ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రతి షేర్‌పై రూ.6.25 డివిడెండ్‌ అందించాలని ఆకంపెనీ బోర్డు నిర్ణయించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
Alester ఇంగ్లండ్‌తో సిరీస్‌కు అలెస్టర్‌ కుక్‌ సిద్ధం న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో అయిదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది.కాగా అలెస్టర్‌ కుక్‌ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు బలంగా కనిపిస్తుంది.ఇంగ్లండ్‌ జట్టుకు కెప్టెన్‌ అలెస్టర్‌ కుక్‌ కొండంత అండ.అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌ లోని అలెస్టర్‌ కుక్‌ భారత్‌పైనే అరంగేట్రం చేయడం విశేషం.సరిగ్గా పదేళ్ల క్రితం నాగ్‌పూర్‌లోని విసిఎ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కుక్‌ టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.అప్పుడు కుక్‌ వయసు 21 సంవత్సరాలు.ఆ టెస్టు మ్యాచ్‌లో కుంబ్లే, హర్భజన్‌ సింగ్‌ లాంటి దిగ్గజాల బౌలింగ్‌ను సులువురు ఎదుర్కొని తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ,రెండవ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.ఆనాడు ఇంగ్లండ్‌ జట్టు పరాజయం చెందకుండా గొడలాగా అడ్డుపడిన అలెస్టక్‌ కుక్‌ ఇప్పుడు భారత పర్యటకు వచ్చిన ఇంగ్లండ్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.ఇటీవల ఇంగ్లండ్‌ తరుపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లాడిన రికార్డుని కూడా సొంతం చేసుకున్నాడు.అంతేనా టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌ జట్టు తరుపున మ్యాచ్‌లతో పాటు పరుగులు,సెంచరీలు కూడా తన పేరిట నమోదు చేశాడు.ఈ పదేళ్లలో ఎంతో మంది ఇంగ్లండ్‌ టెస్టు జట్టులోకి వచ్చారు,వెళ్లారు. కానీ కుక్‌ మాత్రం ఇంగ్లండ్‌ జట్టుకు ఒక మూల స్థంబంలా నిలబడ్డాడు. ఇంగ్లండ్‌ తరపున అత్యధిక మ్యాచ్‌లు 135 ఆడిన ఆటగాడిగా అలెక్‌ స్టివార్ట్‌ 133 మ్యాచ్‌లు రికార్డును ఇటీవలే ముగిసిన బంగ్లాదేశ్‌ పర్యటనలో కుక్‌ అధిగమించాడు.దీంతో పాటు ఇంగ్లండ్‌ క్రికెట్‌ చరిత్రలో గూచ్‌,అథర్టన్‌ లాంటి ఎంతో మంది దిగ్గజ ఓపెనర్ల రికార్డులను సైతం కుక్‌ అధిగమించాడు.
2
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి చెంగల్‌పట్టిలో అతిపెద్ద 'మెడిపార్క్‌' Thu 06 Oct 06:07:37.208215 2016 న్యూఢిల్లీ: దేశీయంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్సహిం చడంతో పాటు ఈ విభాగ ంలో విదేశీ దిగుమతులను తగ్గించే దిశగా కేంద్ర క్యాబినెట్‌ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 'వైద్య పర Thu 06 Oct 06:07:43.323702 2016 వాణిజ్య విభాగం Thu 06 Oct 06:07:49.442429 2016 వాణిజ్య విభాగం మూడు రోజుల లాభాలకు తెర Thu 06 Oct 06:07:59.121481 2016 ముంబయి: వరుసగా మూడు రోజులు నుంచి రాణించిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల బాట పట్టాయి. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల నేపథ్యంలో గత మూడు సెషన్లలో భారీగా పెరిగిన మార్కెట్లలో మ గృహ, వాహన రుణాలు మరింత చౌక! Wed 05 Oct 05:05:30.984751 2016 ముంబయి: పండుగల సీజన్‌లో 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్‌బీఐ) దేశ ప్రజలకు అద్భుత కానుకను అందుబాటులోకి తెచ్చింది. కీలక వడ్డీరేటులో పావు శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల ప్రభావం స్వల్పమే Wed 05 Oct 05:05:37.768014 2016 న్యూఢిల్లీ: భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఇటీవల జరిపిన లక్షిత దాడుల్లాంటి చర్యల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగి ప్రభావం చాలా స్వల్పమేనని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నార రూ.888లకే దేశీయ విమానయానం Wed 05 Oct 05:05:44.030295 2016 న్యూఢిల్లీ : దేశీయ విమానయాన రంగ సంస్థ అయిన స్పైస్‌జెట్‌ ప్రత్యేక పండుగ ఆఫర్‌ను మంగళవారం ప్రకటించింది. ప్రయాణికులకు ఒకవైపు దేశీయ ప్రయాణానికి (అన్ని కలుపుకొని) 31 ఏండ్ల కనిష్టానికి బ్రిటన్‌ పౌండ్‌! Wed 05 Oct 05:05:49.487871 2016 లండన్‌: 'బ్రెగ్జిట్‌' ప్రణాళిక అమలులో భాగంగా ఐరోపా సమాజం నుంచి బ్రిటన్‌ వైదొలగే విషయమై చర్యలు మొదలుకానున్నాయన్న భయాందోళన నేపథ్యంలో బ్రిటిష్‌ పౌండ్‌ మంగళవారం దారుణంగా భారత్‌ వృద్ధి బలంగా ఉంది: ప్రపంచ బ్యాంకు Wed 05 Oct 05:05:55.030856 2016 న్యూయార్క్‌: ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర మందగమన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్‌ బలమైన వృద్ధిని నమోదు చేయగలుగుతుందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. ప్రపంచం మొత్తంలో కేవలం నాలుగు రోజుల్లోనే లిస్టింగ్‌! Wed 05 Oct 05:06:01.751434 2016 ముంబయి: మార్కెట్‌ నియంత్రణ సంస్థ 'సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా' (సెబీ) పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన సంస్థలను మార్కెట్లో నమోదు చేసేందుకు తీసుకుంటున్న సమయాన్ని న యుద్ధవిమానాల సంస్థతో రిలయన్స్‌ గ్రూపు జట్టు Tue 04 Oct 05:32:35.866789 2016 న్యూఢిల్లీ: దేశీయ రక్షణ రంగ వ్యాపారంపై కన్నేసిన 'రిలయన్స్‌ గ్రూపు' (రిలయన్స్‌ అడాగ్‌ గ్రూపు) ఈ దిశగా వస్తోన్న ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. ఇటీవలే అత్యాధునిక 'ర వడ్డీరేట్ల ఊహల్లో ర్యాలీ Tue 04 Oct 05:32:41.725529 2016 ముంబయి: 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్‌బీఐ) మంగళవారం నిర్వహించనున్న పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించనుందన్న అంచనాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం పరుగులు పెట్ ఉద్యోగాలు అంతా సులువుకాదు! Tue 04 Oct 05:32:47.754979 2016 హైదరాబాద్‌: ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్య, నైపుణ్యాలతో భవిష్యత్తులో కొత్త కొలువులను సంపాదించుకోవడం, ఉన్న ఉద్యోగాలను నిలుపుకోవడం అంత సులువు కాదని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస చిన్న పట్టణాలకు బీపీవో కేంద్రాలు Tue 04 Oct 05:32:54.570065 2016 న్యూఢిల్లీ: దేశంలోని చిన్న నగరాల్లో ఏర్పాటు చేయదలచిన 'బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌' (బీపీవో) యూనిట్లలో ఏర్పాటు చేయదలచిన దాదాపు 9000 సీట్లకు కేంద్ర ప్రభ గాయత్రి చేతికి భారీ ప్రాజెక్టు Tue 04 Oct 05:33:00.088678 2016 న్యూఢిల్లీ: ప్రముఖ మౌలిక వసతుల కంపెనీ 'గాయత్రీ ప్రాజెక్ట్స్‌' బీహార్‌కు చెందిన భారీ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఈ కంపెనీ బీహార్‌లోన యప్‌టీవీ ప్రచారకర్తగా మహేష్‌బాబు Tue 04 Oct 05:33:05.97286 2016 హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రముఖ ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ప్రసారాల వేదిక యప్‌టీవీకి బ్రాండ్‌ ప్రచారకర్తగా వ్యవహరించ నున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఇందు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రాపర్టీ షో, రుణ మేళా.. Mon 03 Oct 05:06:07.25282 2016 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దసరా, దీపావళి పండుగల సందర్భంగా గృహ రుణాలకు ప్రాసెసింగ్‌ చార్జీలు లేకుండా, వడ్డీని కూడా 9.40 శాతంతో అర్హులైన వారికి తక్షణమే రుణాలు అందజేస్తున్నట ధరలు పెంచే యోచనలో టాటామోటార్స్‌.. Mon 03 Oct 05:06:12.640346 2016 న్యూఢిల్లీ:దేశంలోఅంతకంతకు పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చు కారణంగా ప్రస్తు తం వున్న వాహన ధరలను ఇప్పటికే పలు కార్ల సంస్థలు సవరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే..ఇప్పుడు ఎన్‌ఎండీసీలో స్వచ్ఛభారత్‌... Mon 03 Oct 05:06:18.201966 2016 నవతెలంగాణ,వాణిజ్యవిభాగం : నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని అదివారం గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించారు. క్లీనర్‌ రూ.65,250 కోట్లు! Sun 02 Oct 07:36:20.375459 2016 న్యూఢిల్లీ: నల్లధనం వెల్లడిలో సరికొత్త రికార్డు నమోదైంది. నాలుగు మాసాల గడువుతో సర్కారు అందుబాటులోకి తెచ్చిన 'ఆదాయ వెల్లడి పథకం-2016' (ఐడీఎస్‌)నకు దేశ వ్యాప్తంగా అనూహ్య స్ అమ్మో.. హైదరాబాద్‌! Sun 02 Oct 07:36:25.233987 2016 'ఆదాయ వెల్లడి పథకం' కింద పన్ను పరిధిలోకి రాని ఆదాయాన్ని ప్రకటించిన వారి జాబితాలో హైదరాబాద్‌ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం అరుంధతీ పదవీ కాలం పొడిగింపు Sun 02 Oct 07:36:30.441727 2016 న్యూఢిల్లీ: 'భారతీయ స్టేట్‌ బ్యాంక్‌' (ఎస్‌బీఐ) అధినేత్రి అరుంధతి భట్టాచార్య పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు సర్కారు పొడిగించింది. వాస్తవానికి అరుంధతి పదవీకాలం సెప్టెంబరు 30త ఎస్‌బీహెచ్‌ జౌళి సంచుల వితరణ Sun 02 Oct 07:36:34.994003 2016 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: 'ప్రపంచ వృద్ధుల దినోత్సవం'ను పురస్కరించుకొని శనివారం 'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌' (ఎస్‌బీహెచ్‌) వృద్ధులకు జౌళి సంచులను వితరణ చేసింది. తినుబండారాల వ్యాపారుల వాటా.. రూ.50 కోట్ల పైమాటే! Sun 02 Oct 07:36:41.423606 2016 ముంబయి: దాదాపు నాలుగు నెలల గడువుతో ప్రారంభమైన 'ఆదాయ వెల్లడి పథకం-2016' (ఐడీఎస్‌) శుక్రవార అర్ధరాత్రితో ముగిసింది. అయితే ఈ పథకం కింద పలు ఆశ్చర్యకరమైన అభివృద్ధికి ఊతమిస్తుంది: మోడీ Sun 02 Oct 07:36:59.558346 2016 న్యూఢిల్లీ: 'ఆదాయ వెల్లడి పథకం' (ఐడీఎస్‌) ద్వారా దాదాపు రూ.62,250 కోట్ల మేర పన్ను పరిధిలోకి రాని ఆదాయం వెల్లడి కావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.
1
రూ.1026.30 కోట్ల ఆదాయాన్ని అర్జించిన ఏపీ ట్రాన్స్‌కో PNR| 2010-11 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ ట్రాన్స్‌కో 1026.30 కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జించినట్టు ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ అజరు జైన్ వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఏపీ ట్రాన్స్‌కో 2010-11 ఆర్థిక సంవత్సరంలో రూ.1026.30 కోట్ల ఆదాయాన్ని సాధించింద్నారు. రూ.106 కోట్ల నికరలాభాన్ని పొందిందన్నారు. వచ్చే నాలుగేళ్ళల్లో రూ.5,900 కోట్లు ఖర్చుచేసి కొత్తగా 169 సబ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్థిక సంవత్సరంలో రూ.1093 కోట్ల వ్యయంతో 60 నూతన సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. మరో రూ.1172 కోట్ల వ్యయంతో ఇరిగేషన్‌ పథకాలకు సంబంధించి ఇంకో 36 సబ్‌ స్టేషన్లను నిర్మిస్తామన్నారు. 2009-10 సంవత్సరంలో రూ.885.29 కోట్ల ఆదాయాన్ని ట్రాన్స్‌కో పొందిందని, 2010-11 నాటికి ఈ ఆదాయంలో రూ.141 కోట్ల మేరకు వృద్ధి సాధించిందన్నారు. 11,829 మెగావాట్ల మేరకు పీక్‌ డిమాండ్‌లో ఉత్పత్తి సాధించి రికార్డు నెలకొల్పినట్లు ఆయన చెప్పారు. సంబంధిత వార్తలు
1
Hyderabad, First Published 4, Sep 2019, 3:44 PM IST Highlights స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ నుంచి వచ్చిన ఎన్నో మాస్ చిత్రాలు అలరించాయి. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్ లో వివి వినాయక్ ఒకరు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, చిరంజీవి, వెంకీ, రవితేజ లాంటి టాప్ హీరోలందరికీ వినాయక్ సూపర్ హిట్స్ అందించారు.  స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ నుంచి వచ్చిన ఎన్నో మాస్ చిత్రాలు అలరించాయి. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్ లో వివి వినాయక్ ఒకరు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, చిరంజీవి, వెంకీ, రవితేజ లాంటి టాప్ హీరోలందరికీ వినాయక్ సూపర్ హిట్స్ అందించారు. అలాంటి వివి వినాయక్ కు కూడా ఓ సందర్భంలో ఇండస్ట్రీని వదిలేద్దామని అనిపించిందట.  ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కించిన 'రాగాల 24 గంటల్లో' చిత్ర మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో వివి వినాయక్ పాల్గొన్నారు. వినాయక్ మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి తనకు మంచి మిత్రుడు అని వినాయక్ తెలిపారు. కెరీర్ ఆరంభంలో చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం మద్రాసులో ఉన్న సమయంలో.. ఇక తాను ఇండస్ట్రీలో కొనసాగలేనని అనిపించింది. ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా.  ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన సలహా తనలో నమ్మకాన్ని పెంచిందని వివి వినాయక్ అన్నారు. చిత్ర పరిశ్రమలో నీవు చాలా సాధించగలవు అని చెప్పారు. ఇక 'రాగాల 24 గంటల్లో' చిత్రం గురించి మాట్లాడుతూ.. టైటిల్ వినగానే రేడియోలో వచ్చే వార్తలు గుర్తుకు వచ్చాయి.  మంచి స్క్రిప్ట్ ఉంటే శ్రీనివాస్ రెడ్డి సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తారు. డమరుకం చిత్రమే అందుకు ఉదాహరణ అని వినాయక్ తెలిపారు. ఈ చిత్రంలో ఇషా రెబ్బా, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రఘు కుంచె ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.  Last Updated 4, Sep 2019, 3:44 PM IST
0
"సలామ్" కోహ్లీ Highlights ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ సందర్భంగా అత్యంత విపత్కర పరిస్థితుల్లో సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తిస్తున్నారు నెటిజన్లు.  ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ సందర్భంగా అత్యంత విపత్కర పరిస్థితుల్లో సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తిస్తున్నారు నెటిజన్లు. సహచరులు ఒక్కొక్కరిగా వెనుదిరుగుతున్నా కోహ్లీ మొత్తం పట్టుదలగా ఆడి జట్టు కెరీర్‌లో 22వ సెంచరీ సాధించడంతో పాటు జట్టును ఇన్నింగ్స్ గండం నుంచి గట్టెక్కించాడు. మైదానంలో అతని ఆటను చూసిన భారత అభిమానులతో పాటు టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్‌లతో పాటు మహ్మద్ కైఫ్, సురేశ్ రైనాలు కోహ్లీని అభినందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. నిన్నటి నుంచి కోహ్లీ హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియా నిండిపోయింది.   A very important knock by @ImVkohli . Lovely way to set up the Test series. Congrats on your Test hundred. #ENGvIND — Sachin Tendulkar (@sachin_rt) 2 August 2018   A brilliant hundred from Kohli. Scored more in this first innings than he did in 10 innings in 2014. Added 99 so far with Shami, Ishant and Yadav , who have scored 8 between them. #ENGIND pic.twitter.com/POeNkl9Oip — Virender Sehwag (@virendersehwag) 2 August 2018 Last Updated 3, Aug 2018, 11:56 AM IST
2
Hyderabad, First Published 8, Apr 2019, 4:19 PM IST Highlights ఖుషి సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసి సౌత్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు ఎస్ జె.సూర్య ఇప్పుడు నటుడిగా బిజీ అవుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - విజయ్ లతో తో ఖుషి(తెలుగు - తమిళ్) సినిమా చేసిన సూర్య మహేష్ నాని సినిమాను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.  ఖుషి సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసి సౌత్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు ఎస్ జె.సూర్య ఇప్పుడు నటుడిగా బిజీ అవుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - విజయ్ లతో తో ఖుషి(తెలుగు - తమిళ్) సినిమా చేసిన సూర్య మహేష్ నాని సినిమాను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.  దర్శకుడిగా అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న సూర్య కొమరం పులి సినిమా ద్వారా గట్టిగా దెబ్బతిన్నాడు. ఆ తరువాత మళ్ళీ డైరెక్టర్ గా పెద్దగా మెప్పించలేకపోయాడు. అయితే నటుడిగా మాత్రం సూర్య బాగానే క్లిక్కవుతున్నాడు. సినిమాల రిజల్ట్ సంబంధం లేకుండా జనాల్లో మంచి విలన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.  మహేష్ స్పైడర్ - విజయ్ మెర్సల్ సినిమాల్లో విలన్ గా బాగా పాపులర్ అయిన సూర్య ఇప్పుడు సూపర్ స్టార్ రజిని కాంత్ సినిమాలో సరికొత్త విలన్ గా కనిపించబోతున్నాడు. మురగదాస్ దర్శకత్వం వహించబోయే సూపర్ స్టార్ పొలిటికల్ డ్రామా త్వరలోనే స్టార్ట్ కానుంది. సంగీత దర్శకుడిగా అనిరుద్ కూడా సెలెక్ట్ అయ్యాడు. మరి ఆ సినిమాలో ఎస్ జె సూర్య ఎలాంటి రూపంతో కనిపిస్తాడో చూడాలి.  Last Updated 8, Apr 2019, 4:19 PM IST
0
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV మా పనులు మానుకోలేం: పాండ్యతో డేటింగ్‌పై నటి ఎల్లీ హార్దిక్‌ పాండ్య బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై ఎల్లీ స్పందించింది. TNN | Updated: Feb 11, 2018, 08:44PM IST టీమిండియా నయా ఆల్&zwnj;రౌండర్ హార్దిక్&zwnj; పాండ్య బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్&zwnj;తో డేటింగ్&zwnj;లో ఉన్నాడంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హార్దిక్&zwnj; సోదరుడు కృనాల్&zwnj; పాండ్య వివాహ వేడుకకు హాజరైన ఎల్లీ.. హార్దిక్&zwnj; పక్కనే నిలబడి ఫొటో దిగడంతో ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. తాజాగా ఈ విషయంపై ఎల్లీ స్పందించింది. &lsquo;ఇప్పుడు నేనేం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నా గురించి వాళ్లు ఏమన్నా అనుకోనివ్వండి. ప్రతి విషయంలో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటివరకు నా గురించి అనేక తప్పుడు వార్తలు రాశారు. హార్దిక్&zwnj;తో డేటింగ్&zwnj;లో ఉన్నానంటూ వస్తున్న వదంతులపై స్పందిస్తే.. నాకు నేనే మరిన్ని పుకార్లు సృష్టించుకున్నట్లు అవుతుంది&rsquo; అని ఎల్లీ పేర్కొంది.
2
internet vaartha 160 Views న్యూఢిల్లీ : మిస్టర్‌ కూల్‌ ధోనీ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నాడు. టెస్ట్‌ మ్యాచ్‌ల కోసం వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన టీమిండియా వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ధోనీ ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. ట్రాక్‌పై చిరుతను తలపించే పరుగుతో ప్రపంచ రికార్డులను అలవోకగా బద్దలు కొడుతున్న జమైకా స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ గురించి తెలియని క్రీడాభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాగే టీమిండియాలో కూడా ఉస్సేన్‌ బోల్ట్‌ ఉన్నాడని, ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగిసిన టి20 ప్రపంచ కప్‌తో అభిమానులకు తెలిసింది.బెంగళూరు వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.అనంతరం చేధనకు దిగిన బంగ్లాదేశ్‌ విజయానికి చివరి 3 బంతుల్లో 2 పరుగులు అవసరమయ్యాయి.క్రీజులో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఉండటంతో భారత్‌ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు.కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్‌ హార్థిక్‌ పాండ్యా సమీకరణాల్ని ఒక బంతికి రెండు పరుగులుగా మార్చాడు. దీంతో ఉత్కంఠ తారా స్థాయికి చేరుకుంది.బంగ్లా ఒక పరుగు చేస్తే మ్యాచ్‌ డ్రా అవుతుంది. కాగా రెండు పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. స్ట్రెక్‌ ఎండ్‌లో ఉన్న బంగ్లా బ్యాట్స్‌మెన్‌ షవగతి చివరి బంతి బ్యాట్‌కు తాకకపోయినా పరుగు తీసి మ్యాచ్‌ను డ్రాగా ముగించాలని, మరో ఎండ్‌లో ఉన్న ముస్తఫిజూర్‌తో కలిసి అప్పటికే పరుగు కోసం సగం దూరం వచ్చేశాడు. దీంతో పరుగు ప్రమాదాన్ని పసిగట్టిన భారత కీపర్‌ ధోనీ బంతని అందుకుని మెరుపు వేగంతో పరుగెత్తుకుని వచ్చి వికెట్ల వద్దకు చేరుకున్నాడు. దీంతో ముస్తఫిజూర్‌ రనౌట్‌తో ఆశ్చర్యపోవడం బంగ్లాదేశ్‌ వంతైంది. గెలుపు సంబరాల్లో టీమిండియా మునిగిపోయింది.మ్యాచ్‌ ముగిసిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో భారత్‌ ఉస్సేన్‌ బోల్ట్‌ ధోనీ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపించారు.కొందరైతే ఉస్సేన్‌ బోల్ట్‌ కంటే ధోనీ పరుగు వేగంగా ఉందంటూ కితాబిచ్చేశారు కూడా.తాజాగా భారత టెస్టు జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లడంతో విశ్రాంతి తీసుకుంటున్న ధోనీ పిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నాడు. ఇటీవల జిమ్‌లో కాళ్లకు సంబంధించిన కసరత్తులు అనంతరం దిగిన ఒక ఫోటోను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోను చూసిన అభిమానులు ఉస్సేన్‌ బోల్ట్‌తో పోల్చుతూ కామెంట్లు పెడుతున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించేందుకు 2014లోనే టెస్టులకు ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.
2
హైదరాబాద్ నడిరోడ్డుపై తాగుబోతుల భీభత్సం Highlights నలుగురు యువతులు, నలుగురు యువకులు హైదరాబాద్ న‌గ‌రంలోని కొందరు తాగుబోతులు అర్థరాత్రి భీభత్సం సృష్టించారు. తాగిన మైకంలో వాహనాన్ని నడుపుతూ నిత్యం రద్దీగా వుండే ఖైరతాబాద్ విద్యుత్ సౌద ఎదుట వీరంగం సృష్టించారు. అడ్డందిడ్డంగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమయ్యారు.  ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  అర్థరాత్రి సమయంలో కొందరు మందుబాబులు మద్యం మత్తులో స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తున్నారు. అయితే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కూడా పుల్లుగా తాగేసి ఉండటంతో ఖైరతాబాద్ ప్రాంతంలో వాహనం అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. మితిమీరిన వేగంతో వెళ్లి గా ఫుట్‌పాత్  పై గల గోడను ఢీకొట్టారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువతులు, నలుగురు యువకులకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా వాహనం అతివేగంగా దూసుకురావడం చూసి భయాందోళనకు గురయ్యామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ ప్రాంతంలో అర్థరాత్రి కావ‌డం, ఫుట్‌పాత్ పై ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది.  ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ పాటికే ప్రమాదానికి కారణమైన యువకులు,యువతులు అక్కడి నుండి పారిపోయారు. దీంతో వెహికిల్ నెంబర్ ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
0
Aug 08,2018 ఒడిదుడుకుల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. ముంబయి : వివిధ పరిణామాల మధ్య మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒడిదుడుకులకు గురైయ్యాయి. తుదకు సెన్సెక్స్‌ నష్టపోగా, నిఫ్టీ స్వల్ప లాభంలో నమోదయ్యింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 26 పాయింట్లు తగ్గి 37,877కు పడిపోయింది. 37,849 వద్ద మొదలైన సూచీ ఓ దశలో 37,877 గరిష్ట స్థాయిని తాకగా, మరో దశలో 37,587 కనిష్ట స్థాయికి పడిపోయింది. నిఫ్టీ 2.35 పాయింట్లు పెరిగి 11,389 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌-30లో టాటా స్టీల్‌ 3.61 శాతం, ఆసియన్‌ పెయింట్‌ 1.63 శాతం, ఎన్‌టిపిసి 1.31 శాతం, వేదాంతా 1.25 శాతం చొప్పున అధికంగా పెరిగిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. మరోవైపు ఆసియన్‌ పోర్ట్సు 6.49 శాతం, కోల్‌ ఇండియా 2.63 శాతం, ఎస్‌బిఐ 1.47 శాతం, ఒఎన్‌జిసి 1.24 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
Hyd Internet 116 Views Sachin Tendulkar Sachin Tendulkar ముంబాయిః మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ సరిగ్గా 28 ఏళ్ల క్రితం ఇదే రోజున (1989, నవంబర్‌ 15) టెస్టు అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో చేసింది తక్కువ పరుగులే ఐనా ఆ తర్వాత అతను తిరగరాసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ‘ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న లిటిల్‌ మాస్టర్‌ పునరాగమనం చేసిన ప్రతిసారీ తన బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు. సచిన్‌ తొలి మ్యాచ్‌ను చిరకాల శత్రువు పాకిస్థాన్‌తో దిగ్గజాల మధ్య ఆడటం విశేషం. ఈ సిరీస్‌ కోసం కృష్ణమాచారి శ్రీకాంత్‌ సారథ్యంలో టీమిండియా పాక్‌లో పర్యటించింది. తొలి టెస్టు కరాచీలో నవంబర్‌ 15న ప్రారంభమైంది. ఇదే మ్యాచ్‌లో చురకత్తుల్లాంటి బంతులు విసిరే వకార్‌ యూనిస్‌ అరంగేట్రం చేశాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 409 పరుగులు చేసింది. ఆ జట్టు సారథి ఇమ్రాన్‌ఖాన్‌ (109 నాటౌట్‌) శతకంతో చెలరేగాడు. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 262 పరుగులే చేసింది. 41 పరుగులకే 4 వికెట్లు నష్టపోయిన స్థితిలో సచిన్ క్రీజులోకి అడుగు పెట్టాడు. 24 బంతులాడి 15 పరుగులు చేశాడు. అందులో రెండు సొగసైన కవర్‌డ్రైవ్‌లు ఉన్నాయి. వకార్‌ యూనిస్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో స‌చిన్ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత రవిశాస్త్రి (45), కపిల్‌దేవ్‌ (55), కిరణ్‌మోరె (58) పోరాడి జట్టును ఫాలోఆన్‌ గండం నుంచి గట్టెక్కించారు. పాక్‌ రెండో ఇన్నింగ్స్‌ను 305/5కు డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో సచిన్‌కు బ్యాటింగ్‌ ఇవ్వలేదు. సంజయ్‌ మంజ్రేకర్‌ (113), నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధు (85) సాయంతో ఐదు సెషన్ల పాటు టీమిండియా ఆడటంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 303/3తో నిలిచింది. వేల పరుగులు చేసిన క్రికెట్‌ దేవుడి ప్రస్థానం అలా మొద‌లై 200 టెస్టులు 15,921 పరుగులు 51 శతకాలు 463 వన్డేలు 18,426 పరుగులు 49 శతకాలు ఇలా కొన‌సాగింది.
2
i love to watch to rohit batting from other end: kohli రోహిత్ బ్యాటింగ్‌ చేస్తుంటే.. చూస్తుండిపోతా: కోహ్లి రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తా. అతడు ఆడుతుంటే అలాగే చూస్తుండి పోతా... TNN | Updated: Oct 30, 2017, 03:05PM IST కివీస్&zwnj;తో జరిగిన మూడో వన్డేలో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లి శతకాలతో చెలరేగారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్&zwnj;కు 230 పరుగులు జోడించారు. కీలక మ్యాచ్&zwnj;లో వీరిద్దరూ రాణించడం, బుమ్రా ఆఖరి ఓవర్లలో మెరవడంతో భారత్ కివీస్&zwnj;పై చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. రోహిత్, కోహ్లి జోడి వన్డేల్లో 200కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మ్యాచ్ అనంతరం వీరిద్దరూ సరదాగా ముచ్చటించారు. ఓపెనర్&zwnj;గా జట్టుకు మంచి స్కోరు అందించడానికి తాను ప్రయత్నిస్తానని చెప్పిన రోహిత్.. విరాట్ దూకుడుగా ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడని చెప్పాడు. ఈ మ్యాచ్&zwnj;లో రనౌట్ అయ్యే ప్రమాదం తప్పాక ఇద్దరం బాగా బ్యాటింగ్ చేశామని చెప్పాడు. కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం బావుంటుందని చెప్పాడు.
2
Jan 26,2016 ఎవరేడి ఇండిస్టీస్‌ లాభాలు రూ.17 కోట్లు న్యూఢిల్లీ : ఎవరేడీ ఇండిస్టీస్‌ 2015-16 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 10.56 శాతం వృద్ధితో రూ.16.95 కోట్ల లాభాలు సాధించింది. 2014-15 ఇదే క్యూ3లో రూ.15.33 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. గత క్యూ3లో ఈ కంపెనీ ఆదాయం 324.13 కోట్లకు తగ్గింది. ఇంతక్రితం క్యూ3లో ఇది రూ.325.41 కోట్ల ఆదాయం నమోదు చేసుకుంది. చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌక బ్యాటరీల భారత ఉత్పత్తులను దెబ్బతీస్తున్నాయని ఎవరేడీ ఇండిస్టీస్‌ ఒక్క ప్రకటనలో పేర్కొంది. సోమవారం బిఎస్‌ఇలో ఎవరేడీ ఇండిస్టీస్‌ షేర్‌ 4.45 శాతం తగ్గి 252.45 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
అదరగొట్టిన థైరోకేర్‌ - 49 శాతం ప్రీమియంతో లిస్టయిన కంపెనీ ముంబయి: డయోగ్నాస్టిక్స్‌ సేవల సంస్థ థైరోకేర్‌ టెక్నాలజీస్‌ సోమవారం మార్కెట్లో లిస్టయింది. తొలి రోజే ఈ స్టాక్‌ మదుపరులకు మంచి లాభాలను పంచింది. ఈ స్టాక్‌ ఎన్‌ఎస్‌ఈలో ఇష్యూ ధర రూ. 446 కంటే కూడా దాదాపు 49 శాతం ప్రీమియంతో రూ.665 వద్ద లిస్టయింది. బీఎస్‌ఈలో రూ.662 వద్ద తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. దాదాపు 30.6 లక్షల షేర్లు చేతులు మారాయి. రూ.480 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ప్రాథమిక మార్కెట్లోకి అడుగుపెట్టిన థైరోకేర్‌ ఇష్యూకు మదుపరుల నుంచి దాదాపు 73 శాతం స్పందన లభించిన సంగతి తెలిసిందే. సంస్థ ప్రతిపాదిత ఈ ఐపీఓకు రూ.420-446 ధరల శ్రేణిని ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్‌ఈలో ఈ స్టాక్‌ రూ.172.10 (39 శాతం) మేర లాభపడి రూ.618.10 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV బాల్ ట్యాంపరింగ్.. స్మిత్ విషయంలో మరో ట్విస్ట్! క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదిపిన బాల్ ట్యాంపరింగ్ వివాదంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. Samayam Telugu | Updated: Apr 1, 2018, 11:27AM IST బాల్ ట్యాంపరింగ్.. స్మిత్ విషయంలో మరో ట్విస్ట్! బాల్ ట్యాంపరింగ్ వివాదం క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదిపింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ , బాన్‌క్రాఫ్ట్‌లపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం వెలుగులోకి రాగా.. దీని సూత్రధారి డేవిడ్ వార్నర్ అనే వార్తలు వెలువడ్డాయి. అయితే ట్యాంపరింగ్ ప్లాన్ గురించి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు పూర్తిగా తెలీదని క్రికెట్ ఆస్ట్రేలియా అంతర్గత విచారణలో తేలినట్లు ఫెయిర్‌ఫాక్స్ మీడియా తెలిపింది. రివర్స్ స్వింగ్ కోసం బంతిని రెండుసార్లు శాండ్ పేపర్‌తో రుద్దినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా విచారణలో తేలింది. కానీ బంతిని మార్చాల్సి రావాల్సినంతగా దాని కండీషన్ దెబ్బతినలేదని అంపైర్లు అభిప్రాయపడ్డారు. ‘స్మిత్‌కు బాల్ ట్యాంపరింగ్ జరుగుతుందని తెలుసు. తన అయిష్టతను తెలిపినప్పటికీ.. ట్యాంపరింగ్ ప్రయత్నాలను అడ్డుకోలేదు. బంతిని ఎలా ట్యాంపరింగ్ చేయబోతున్నారో అతడికి ముందుగా తెలీదు. బాన్‌క్రాఫ్ట్ శాండ్ పేపర్‌తో బంతిని రుద్దుతూ బిగ్ స్క్రీన్‌పై చిక్కేంత వరకూ స్మిత్‌కు ఆ ప్లాన్ గురించి పూర్తిగా తెలియద’ని ఫెయిర్‌ఫాక్స్ మీడియా వెల్లడించింది. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం స్మిత్‌కు బాల్ ట్యాంపరింగ్ ప్లాన్ ముందే తెలుసని, దాన్ని అడ్డుకోలేదని భావించింది. ఈ వార్తల నేపథ్యంలో బాల్ ట్యాంపరింగ్ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
మెదక్‌లో అత్యాధునిక బస్సుల తయారీ - సిద్ధమైన 'డెక్కన్‌ ఆటో' యూనిట్‌ - 250 కోట్లతో ప్రపంచ స్థాయిలో ప్లాంట్‌ - రేపు సీఎం చేతుల మీదుగా ప్రారంభం - మేటి బస్సుల తయారీకి చిరునామాగా తెలంగాణ - నవతెలంగాణతో సంస్థ ప్రధాన సలహాదారు బాలాజీ రావు నవతెలంగాణ- వాణిజ్య విభాగం తెలంగాణ మరో ఆటో పరిశ్రమకు వేదిక కానుంది. 'డెక్కన్‌ ఆటో లిమిటెడ్‌' మెదక్‌ జిల్లా కొడకంచి గ్రామంలో సుమారు రూ.250 కోట్ల వ్యయంతో ప్రపంచ స్థాయి సమీకృత బస్సు తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఏడాదికి సుమారు 3000 బస్సుల తయారీ సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు కొరోనా సంస్థ డైరెక్టర్‌, డెక్కన్‌ ఆటో సంస్థ ప్రధాన సలహాదారు బాలాజీ రావు నవతెలంగాణకు తెలిపారు. అత్యాధునిక హంగుళతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో దేశీయ మార్కెట్‌తో పాటు ఆసియా, ఆఫ్రికా వంటి విదేశీ మార్కెట్లకు అవసరమైన బస్సులను ఎగుమతి చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. సంస్థ ఛైర్మన్‌గా ఎం.ఎస్‌ఆర్‌. ప్రసాద్‌కు పుణె కేంద్రంగా పని చేస్తున్న 'కొరోనా' బస్సు తయారీ కంపెనీలో కీలక వాటా ఉందని ఆయన తెలిపారు ఆ అనుభవంతోనే తెలంగాణ ప్లాంటును విస్తరించనున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్లాంటుకు 'ఆటోమొటీవ్‌ రిసెర్చ్‌ ఆసోసియేషన్‌' (ఆరియా) గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. చైనాకు చెందిన ఆటో సంస్థ జోంగ్టాంగ్‌తో డెక్కన్‌ ఆటోకు సాంకేతిక భాగస్వామ్యాం ఉందని ఆయన అన్నారు. ఈ ప్లాంటకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం (11న) ప్రార ంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. రెండు బ్రాండ్లలో బస్సుల తయారీ.. డెక్కన్‌ ఆటో లిమిటెడ్‌ సంస్థ మెదక్‌ ప్లాంటులో రెం డు బ్రాండ్లతో బస్సులను త యారు చేయనుందని బాలాజీ రావు వివరిం చారు. విలాసవంతమైన బస్సులను 'డెక్కన్‌' బ్రాండ్‌తోనూ, సాధరణ సిటీ, స్లీపర్‌ క్లాస్‌ బస్సులను 'కొరోనా' బ్రాండుతోను అందు బాటులోకి తేనున్నట్లుగా ఆయన వివరి ంచారు. పుణె కార్పొరేషన్‌ ఇచ్చిన 25 బస్సుల తయారీని కూడా ఇక్కడి ప్లాంటులోనే తయారు చేయనున్నట్లుగా ఆయన వివరించారు. మొదటి దశలో 3000 బస్సులను తాము లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఏడాది కాలంలో దీనిని రెెండింతలు చేసే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న ఆరేళ్లలో ఈ సంఖ్యను 6000 బస్సులకు పెంచాలని సంస్థ యోచిస్తోంది. ప్రపంచస్థాయి ప్రమాణాలు.. హైదరాబాద్‌కు 40 కి.మి. దూరంలోని మెదక్‌ జిల్లా కొడకంచిలో దాదాపు 75 ఎకరాల విస్తీర్ణంలో 'డెక్కన్‌ ఆటో' సంస్థ ఈ సమీకృత బస్సు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఇందులో అత్యాధునిక నాణ్యత పరీక్షలను నిర్వహించేలా ఆధునిక ఏర్పాటు ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. 8 మీటర్ల నుంచి మొదలుకొని 18 మీటర్ల పొడవు గల బస్సులను ఇక్కడ తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది సంస్థలో 400 మంది ఉద్యోగులు అవసరమవుతారని, 2017 నాటికి ఈ సంఖ్య 700కు చేరుతుందని ఆయన అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
మార్కెట్లోకి రూ ఆఫ్జా కొత్త - 'ప్యూజన్‌' పానీయాలు నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: దేశంలోని హెల్త్‌, వెల్‌నెస్‌ విభాగంలో అగ్రగామి కంపెనీ అయినా హమ్‌దర్ద్‌ లేబొరేటరస్‌ ఇండియా తమ బ్రాండ్‌ రూ ఆఫ్జాలో కొత్త 'ఫ్యూజన్‌' శీతల పానియాలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రెడీ టు డ్రింక్‌ పండ్లరసాల ఆధారిత పానీయాలను బుధవారం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు కంపెనీ చీఫ్‌ అమ్మకాలు, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ మన్సూర్‌ అలీ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రూ ఆఫ్జా ప్యూషన్‌ పేరిట ఐదు రకాల శీతల పానీయాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ ఉత్పత్తులను అభివృద్ధి చేశామన్నారు. ఫ్రెషింగ్‌ లెమన్‌, ఆరెంజ్‌, జ్యూసీ మ్యాంగో, ఎక్సైటింగ్‌ పైనాపిల్‌ అండ్‌ ఆరెంజ్‌, లూసియస్‌ లిచి అనే ఐదు రకాల్లో ఈ పానీయాలు లభిస్తాయన్నారు. ఆధునిక టెట్రాప్యాక్‌ అసెప్టిక్‌ ప్యాకేజింగ్‌లో ఉండే 200 మిల్లి లీటర్ల ప్యాక్‌ ధర 20 రూపాయలుగా నిర్ణయించామన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఈ ఉత్పత్తులను పైలట్‌ ప్రాజెక్టు కింద అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ ఉత్పాదన ఆవిష్కరించిన మొదటి నెలలోనే 9 లక్షల మేరకు ప్రాథమిక విక్రయాలను సాధించినట్టు అలీ వెల్లడించారు. క్రితం ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధితో రూ.700 కోట్ల టర్నోవర్‌ నమోదు చేశామన్నారు. ఇందులో 12 శాతం ఎగుమతుల ద్వారా సమకూరిందన్నారు.Q మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
Hyderabad, First Published 1, May 2019, 4:58 PM IST Highlights బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.  బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. దేశభక్తి చిత్రాల్లో ఎక్కువగానే కనిపించే ఈ నటుడు ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్ లో మాత్రం కనిపించలేదు.  బాలీవుడ్ లో చాలా మంది సినీ తారలు ఓటేసి, సిరా చుక్కతో ఫోటో దిగి పోస్ట్ చేస్తుంటే అక్షయ్ మాత్రం కనిపించలేదు. అతడి భార్య ట్వింకిల్ కూడా ఓటేసింది కానీ అక్షయ్ ఓటేయలేదు. పోలింగ్ కి కొన్నిరోజులముందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాలిటిక్స్ కి సంబంధించి ఇంటర్వ్యూ చేసిన అక్షయ్ కుమార్ ఓటు వేయకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మోదీ.. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్య కల్పించాలంటూ ట్విట్టర్ లో విజ్ఞప్తి చేస్తూ ట్యాగ్ చేసిన వారిలో అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడు. ఆ సమయంలో మోదీ ట్వీట్ కి బదులిస్తూ.. ఓటు ఎంతో శక్తివంతమైనదని, దానిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అక్షయ్ చెప్పుకొచ్చారు. కానీ పోలింగ్ రోజు మాత్రం  కనిపించలేదు. మంగళవారం నాడు ఆయన ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొని బయటకి వచ్చిన సమయంలో మీడియా సభ్యులు కొందరు.. ఓటు ఎందుకు వేయలేదని ప్రశ్నించగా.. వదిలేయండి అంటూ సమాధానం చెప్పకుండా అక్కడ నుండి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
0
budget మౌలికవనరుల రంగానికి 3.96లక్షల కోట్లు న్యూఢిల్లీ, : అందుబాటులో పక్కాగృహాలు అందరికి కల్పించేలక్ష్యంతో గృహావసరాలు ఎక్కువగా ఉన్న నిరుపేదలు, అల్పాదాయ వర్గాలవారికి 1,84లక్షల కోట్లు కేటాయిం చింది. అంతేకాకుండా మహిళలు, చిన్న పిల్లలకు కూడా సంక్షేమపథకాలు అమలుచేస్తోంది. కుష్టువ్యాధిని 2018 కల్లా నిర్మూలించాలని, 2025 కల్లా క్షయనిర్మూలన, ఎస్‌సికులాలకు కేటాయింపులు పెంచి 52,393 కోట్లు, ఎస్‌టి కులాలకు 31,920కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రత్యేకించి మౌలికవనరుల రంగానికి 64 వేల కోట్లు కేటాయించింది. రోడ్లు, జాతీయ రహదారులుకు ఎక్కువ మొత్తం కేటాయించింది. అలాగే ఎయిర్‌పోర్ట్సు అథా రిటీ ఆఫ్‌ఇండియా చట్టానికి సవరణలు తెచ్చి భూవన రులను తనఖాపెట్టి ఆదాయవనరులు సమీకరించేం దుకు నిర్ణయించింది. రవాణారంగానికి రెండులక్షల కోట్లు కేటాయించింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటర్నెట్‌ సౌకర్యం విస్తృత పరిచేందుకు వీలు గా భారత్‌ నెట్‌ కేటాయింపులను పదివేల కోట్లకు తెచ్చిం ది. మొత్తం ఇన్‌ఫ్రా కేటాయింపులు 3.96 లక్షలకోట్లుగా చేసింది. రవాణారంగంలో కీలకమైన మూలధన వ్యయం, రైల్వే అభివృద్ధికి 1.31 లక్షల కోట్లుగా నిర్ణయించింది. మొత్తం 3500 కిలోమీటర్ల రైల్వేలైన్లు నిర్మించాలని, పర్యాటకరంగ వృద్ధికి మరింతగా రైళ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. 500 స్టేషన్లను మరింతగా ఆధునీకరించి 2019 నాటికి బయోటాయిలెట్లను నిర్మించాలని సూచించింది. అంతేకాకుండా ఐఆర్‌సిటిసి బుకింగ్స్‌కు సేవాఛార్జీలు రద్దుచేసింది. కొత్త మెట్రోరైల్‌ విధానం రానున్నది. రవాణాసంస్థల సౌజన్యంతో రైల్వేలు క్షేత్రస్థాయికి నిత్యావసర వస్తువుల రవాణా కనెక్టివిటీని పెంచాలని నిర్ణయించింది. ఇక గ్రామీణ ఆర్ధికాభివృద్ధికి నీటిపాదరుల నిధులు 40వేల కోట్లకు పెంచింది. 2018 మే ఒకటవ తేదీనాటికి నూరుశాతం గ్రామీణ విద్యు దీకరణ పూర్తిచేసేలక్ష్యంతో ఉన్నట్లు జైట్లీ బడ్జెట్‌ పద్దులు చెపుతున్నాయి. వ్యవసాయ రుణపరపతిని పదిలక్షల కోట్ల కు పెంచుతూ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 10 మిలి యన్ల కుటుంబాలను పైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఉన్నట్లు ప్రకటించింది. 50వేల గ్రామపంచాయితీలలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది. సూక్ష్మనీటిపారుదల రంగం కోసం నాబార్డు సాయంతో ప్రాథమికంగా ఐదువేల కోట్ల కార్పస్‌ను ఏర్పాటు చేసింది. పదిమిలియన్ల పక్కా గృహాలను పేదలకోసం వచ్చే ఏడాదిలోపే అందచేయాలని లక్ష్యంనిర్దేశించింది. గ్రామీణ, వ్యవసా య, అనుబంధరంగాలకు కొత్త బడ్జెట్‌లో 1,87,223కోట్లు కేటాయింపులు చేసింది. గతఏడాది కంటే 24శాతంపెంచింది. జాతీయ ఉపాధి హామీ పథకా నికి కేటాయింపులు పెంచి 38,500 కోట్ల నుంచి 48వేల కోట్లకు పెంచింది.
1
హోమ్ క్రీడలు తొలిసారి టాప్-10లో బుమ్రా తొలిసారి టాప్-10లో బుమ్రా August 28, 2019,   3:00 PM IST Share on: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో తనదైన శైలిలో విరుచుకుపడి  భారత్‌కు ఘన విజయాన్ని అందించిన స్టార్‌ పేసర్‌ బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. తాజాగా ప్రకటించిన జాబితాలో బుమ్రా.. తొమ్మిది స్థానాలు మెరుగుపరుచుకుని ఏడో స్థానంలో నిలిచాడు. టాప్‌-10లోకి రావడం బుమ్రాకు ఇదే తొలిసారి. వేగంగా 50 వికెట్లు సాధించిన భారత పేసర్‌గా కూడా బుమ్రా ఘనత సాధించిన సంగతి తెలిసిందే. ఇక, బ్యాట్స్‌మెన్‌ జాబితాలో టీమిండియా కెప్టెన్ కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సంబంధిత వార్తలు
2
GOLD రెండునెలల్లో 8.8బిలియన్‌ డాలర్ల పసిడి దిగుమతి న్యూఢిల్లీ,జూన్‌ 19: దేశంలో బంగారం దిగుమతులు గడచిన రెండునెలల్లో 8.8బిలియన్‌ డాలర్ల విలు వైన పసిడి దిగుమతిజరిగింది. గత ఏడాది ఆరు నెలల్లో జరిగిన దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం ఒక్క ఏప్రిల్‌ మేనెలల్లోనే జరిగాయి. నల్లధనం కట్టడికి ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణతో డిమాండ్‌ తగ్గినా, కరువు పరిస్థితులు అలు ముకున్నా, 42రోజుల జ్యుయెలర్ల సమ్మెఉన్న ప్పటికీ బంగారం దిగుమతులు పెరిగాయి. బంగారు ఆభరణాలపై ఒకటిశాతం ఎక్సైజ్‌ సుంకం ప్రవేశపెట్టడంతో జ్యూయెలర్ల తీవ్ర నిరసన వ్యక్తంచేసనిన సంగతి తెలిసిందే. 2013-14 సంవత్సరం తర్వాత మొదటి సారిగా పసిడి దిగుమతులు పెరిగాయి. బంగా రం ధరలు కూడా 2013 కంటే ఎక్కువగా ఉన్నాయి. 2013లో భారత్‌ 14.4 బిలియన్‌ డాలర్ల పసిడి దిగుమతి చేసుకుంది. దిగుమతులు భారీస్థాయిలో పెరగడంతో ఆనాటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం దిగుమతులపై ఆంక్షలు ప్రకటిం చారు. 2017-18 ఆర్థికసంవత్సరం మొదటిరెండు నెలల్లో కూడా భారీగా పెరిగాయి. గత ఆర్థికసంవ త్సరం రెండునెలల్లో 78 టన్నుల బంగారం దిగు మతి అయింది. విలువలపరంగా బంగారం దిగుమ తులు ముడిచమురుతర్వాత అథ్యధిక స్థానంలో ఉన్నాయి. 2016-17మధ్యకాలంలో ప్రభుత్వ విధా నాలతో కనీసం 20శాతం దిగుమతులు తగ్గాయి.చ భారత్‌ గత ఏడాది 780 టన్ను లబంగారం దిగు మతి చేసుకుంది. అంతకుముందు 2015-16 ఆర్ధికసంవత్సరంలో 968 టన్నులు దిగుమతులు జరిగాయి. తిరిగి 2017 ప్రారంభం నుంచి దిగుమ తులు పెరిగాయి. మార్చినెలలో కనీసం 120 టన్నుల బంగారం దిగుమతులు జరిగాని అంచనా. ఒక్క ఫిబ్రవరినెలలోనే వందటన్ను ల బంగారం దిగుమతి జరిగింది. ప్రస్తుత కేలండర్‌ సంవత్సరంలో పసిడిడిమాండ్‌ పెరుగుతుందని ప్రపంచ పసిడిమండిసైతం అంచనా వేసింది. అయితే జిఎస్‌టి అమలు ద్వారా స్వల్పకాలంలో కొంత ఒడిదుడుకులు తప్పవని కొత్త పన్నులవిధానానికి అలవాటు పడేందుకు కొంతసమయం పడుతుందని వివరించింది. ఉత్పత్తిదారులకు పన్నులభారం కారణంగా కొంత రిటైల్‌ధరలు కూడాపెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉత్పత్తిదారులకు మూలధన సమస్యలు తలెత్తుతాయి. రిటైల్‌ వర్తకు లకు సైతం ఇదే పరిస్థితి ఉంటుందనిఅంచనా వేసారు.
1
Hyderabad, First Published 24, Sep 2018, 1:55 PM IST Highlights నటి శిల్పా శెట్టి సిడ్నీ విమానాశ్రయంలో తనకు జాతి వివక్ష అనుభవం ఎదురైన విషయాన్ని వెల్లడించారు. ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని తెలుపుతూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది.  నటి శిల్పా శెట్టి సిడ్నీ విమానాశ్రయంలో తనకు జాతి వివక్ష అనుభవం ఎదురైన విషయాన్ని వెల్లడించారు. ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని తెలుపుతూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. మెల్ బోర్న్ వెళ్లడానికి సిడ్నీ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు శిల్పా శెట్టి. అక్కడ మెల్ అనే ఉద్యోగిని చెకింగ్ కౌంటర్ వద్ద ఉండగా శిల్ప ఆమె వద్దకు వెళ్లింది. శిల్ప వద్ద రెండు బ్యాగులు ఉండగా.. ఒకటి ఓవర్ వెయిట్ ఉందని సదరు ఉద్యోగిని అభ్యంతరం వ్యక్తం చేసింది. సగానికి పైగా ఖాళీగా ఉన్న బ్యాగ్ ఓవర్ వెయిట్ అని చెప్పడంతో నటి షాక్ తిన్నారు.  ఓవర్ వెయిట్ ఉన్న లగేజీని చెక్ చేసే కౌంటర్ వద్దకి శిల్పని తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది వెయిట్ చెక్ చేయకుండానే.. ఓవర్ వెయిట్ అని తేల్చేశారు. స్కానర్ ద్వారా కాకుండా స్వయంగా పరిశీలిస్తే విషయం అర్థమవుతుందని నటి ఆ సిబ్బందిని కోరారు. చెకిన్ కౌంటర్ క్లోజ్ అవ్వడానికి మరో 5 నిమిషాలు మాత్రమే సమయం ఉండడంతో.. త్వరగా చెక్ చేయాలని చెప్పినా సిబ్బంది స్పందించలేదు. చివరికి మరో కౌంటర్ వద్దకు వెళ్లగా.. బ్యాగ్ ఓవర్ వెయిట్ లేదని సిబ్బంది చెప్పడంతో శిల్ప ఊపిరి పీల్చుకున్నారు. చర్మం రంగును బట్టి ప్రయాణికులతో ప్రవర్తించవద్దు. ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కాంటాస్ ఎయిర్‌వేస్ వారికి సూచించారు.  Last Updated 24, Sep 2018, 1:55 PM IST
0
Suresh 133 Views టెలికంలో ముఖేష్‌ సంచలనం ముంబై: డిజిటిల్‌ ఇండియాకు రిలయెన్స్‌అధినేత ముఖేష్‌ అంబానీ తనదైశ శైలిలో భాగస్వామి అయ్యారు. తన కస్టమర్లకు వాయిస్‌ కాల్స్‌ను పూర్తిగా ఉచితం చేశారు. అంతేకాకుండా రోమింగ్‌ చార్జీలను కూడ ఎత్తివేశారు.. దేశంలో కెల్లా అత్యంత సంపన్నుడైన ముఖేష్‌ అంబానీ తన కంపెనీ వాటాదారుల సమావేశంలో పలు అంశాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా 4జి నెట్‌వర్క్‌ ను విస్తరింపజేయనున్నారు. జియో ఇన్ఫోకామ్‌ టారిఫ్‌లను రిలయెన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ గురువారం ప్రకటించారు. ప్రదానిమోడీ ప్రవేశపెట్టిన డిజిటల్‌ ఇండియాకు జియోను అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. భారత్‌లో ఇకపై గాంధీగిరీకి బదులు డేటా గిరీ రానుందని ఆయన ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. తమ టెలికం సంస్థ జియో ద్వారా ఉచిత వాయిస కాల్స్‌తోపాటు డేటాను అందించనున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం 70 శాతం ఆదాయాన్ని వాయిస్‌ కాల్స్‌తోనే సంపాదిస్తున్న ఆయా సంస్థలకు అంబానీ గట్టి షాక్‌ ఇచ్చినట్టు భావిస్తున్నారు. కాగా జియో ఉచిత వాయిస్‌ కాల్స్‌ ఆఫర్‌తో తమ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశం ఉండటంతో ఇతర టెలికం సంస్థలు కూఐడ వాయిస్‌ కాల్స్‌ చార్జీలను భారీగా తగ్గించే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయని పరిశీలకులు భావిస్తున్నారు.
1
Mumbai, First Published 9, May 2019, 6:14 PM IST Highlights ఒకప్పుడు దేశీయ టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్).. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి దివాళా దశకు చేరుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌కామ్ దివాలా అభ్యర్థనను నేషనల్ కంపెనీ లా  ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) అంగీకరించింది.    ఒకప్పుడు దేశీయ టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్).. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి దివాళా దశకు చేరుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌కామ్ దివాలా అభ్యర్థనను నేషనల్ కంపెనీ లా  ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) అంగీకరించింది.    ఎస్బీఐ సహా పలు బ్యాంకులకు ఆర్‌కామ్ దాదాపు రూ.50వేల కోట్ల వరకు అప్పులు చెల్లించాల్సి ఉంది. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంస్థ రుణాలు చెల్లించలేని పరిస్థితికి దిగజారింది. దీంతో దివాలా పెట్టేందుకు కంపెనీ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. దీనిపై గురువారం మరోసారి విచారణ జరిపిన ట్రైబ్యునల్.. కంపెనీ దివాలా ప్రక్రియకు  అనుమతినిచ్చింది.  సంస్థ బోర్డును రద్దు చేసి కొత్త దివాలా పరిష్కార నిపుణుడిని నియమించింది. రుణదాతల కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎస్బీఐ నేతృత్వంలోని 31 బ్యాంకుల కన్సార్టియంకు అనుమతిచ్చింది.  ఇక దివాలా ప్రక్రియలో 357 రోజులు(మే 30, 2018 నుంచి ఏప్రిల్ 30, 2019) కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్‌కామ్ కోరగా.. ట్రైబ్యునల్ ఇందుకు అంగీకరించింది.  ఇదివరకే దాఖలైన దివాలా పిటిషన్‌పై నేషనల్ కంపెనీ లా అప్పెలట్ ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఈ 357 రోజుల కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్‌కామ్ కోరింది. ఇందుకు ట్రైబ్యునల్ ఒప్పుకుంది.  ఈ కేసులో తదుపరి విచారణను మే 30 నాటికి వాయిదా వేసింది. ఆలోగా కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్రస్తుత దివాలా పరిష్కార నిపుణుడిని ఆదేశించింది. కాగా, గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు సతమతమవుతున్న ఆర్‌కామ్ రెండే క్రితం సేవలను కూడా నిలిపేసింది.  Last Updated 9, May 2019, 6:14 PM IST
1
City Group వడ్డీరేట్లు తగ్గాల్సిందే న్యూఢిల్లీ, డిసెంబరు 4: భారతీయ రిజర్వు బ్యాంకు తనద్రవ్యవిధానపరపతి సమీక్షలో 25బేసిస్‌ పాయింట్లు వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచ నాలుపెరిగాయి. ఆర్థికవృద్ధి మందగించే ప్రమాదం ఉన్నందున ద్రవ్యోల్బణం దిగివచ్చి సానుకూలం అయినందున వడ్డీరేట్లు తగ్గుతాయని సిటీగ్రూప్‌ నివేదిక ఉటంకించింది. అంతర్జాతీయ ఆర్థికసేవల సంస్థ తన తాజా నివేదికలో జిడిపి వృద్ధి ఏడు శాతం మించదని రెండోత్రైమాసికం కంటే తక్కువ వృద్ధి నమోదవుతుందని ఆయన అన్నారు. డిసెం బరు పాలసీసమీక్షలో ముఖ్యంగా పెద్దనోట్లరద్దు ప్రభా వాన్ని ఆర్‌బిఐ పరిగణనలోనికి తీసుకుంటుందని సిటీ గ్రూప్‌ అంచనావేసింది. ఈనెల 7వతేదీ ఆర్‌బిఐ విధా న సమీక్ష ఉంటుంది. ఈపర్యాయం జిడిపి వృద్ధిపై పెద్దనోట్ల రద్దుప్రభావం అధికంగా ఉంటుందని సిటీ గ్రూప్‌ అంచనావేసింది. ఈఆర్థికసంవత్సరంలో జిడిపి వృద్ధి 7,2శాతంగా మాత్రమే ఉండ వచ్చని అంచనా వేసింది. భారత్‌ జిడిపి సెప్టెంబరుత్రైమాసి కంలో 7.3శాతంగాఉంది. ఆర్‌బిఐ తన వార్షికజిడిపి వృద్ధిరేటును 7.6శాతం నుంచి సవరించే అంచనాలున్నాయి. 25బేసిస్‌ పాయింట్ల రెపోరేట్‌ వృద్ధి రానున్న కాలంలో సమస్యలు తగ్గిస్తుందని సిటీగ్రూప్‌ అంచనా వేసింది.
1
సినీ నటుడు సచిన్‌ చేతికి మాల్యా విల్లా - రూ.73 కోట్లకు కొనుగోలు ముంబయి: ప్రముఖ పారిశ్రామిక వేత్త లిక్కర్‌డాన్‌ విజరు మాల్యాకు చెందిన గోవాలోని విలాసవంతమైన విల్లా ఎట్టకేలకు అమ్ముడుపోయింది. సినీ నటుడు, పారిశ్రామికవేత్త సచిన్‌ జోషి దానిని రూ.73 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఈ విల్లాను బ్యాంకులు ఇంతకుముందు మూడుసార్లు వేలానికి పెట్టినా నిరాశే ఎదురైంది. పలు బ్యాంకుల నుంచి దాదాపు రూ.9 వేల కోట్ల రుణాలను తీసుకున్న మాల్యా వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్యాకు చెందిన కొన్ని ఆస్తులను బ్యాంకులు జప్తు చేశాయి. రుణ రికవరీలో భాగంగా గోవాలో ఉన్న మాల్యా విల్లాను వేలానికి పెట్టాయి. అరేబియా సముద్రానికి ఆనుకొని ఉన్న ఈ విల్లాలో సకల సౌకర్యాలున్నాయి. గోవా వెళ్లినప్పుడల్లా మాల్యా దీనిలో బస చేసేవారు. అయితే తొలిసారి రూ.85.29 కోట్లు, రెండోసారి రూ.81 కోట్లు, మూడోసారి రూ.73 కోట్ల కనీస ధరకు వేలానికి పెట్టినా దానిని కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో సంప్రదింపుల ప్రక్రియ ద్వారా విల్లాను చివరి ధర(రూ.73 కోట్లు)కు సచిన్‌ జోషికి అమ్మేందుకు బ్యాంకులు అంగీకరించాయి. ఈ విషయాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ) చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య కూడా ధ్రువీకరించారు. ఈ విల్లాను బ్యాంకులు గతేడాది మేలో జప్తు చేశాయి. జేఎమ్‌జే గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు వైస్‌ చైర్మెన్‌ హోదాలో సచిన్‌ జోషి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV బాక్సింగ్ రింగ్‌లో భారత్, చైనా యుద్ధం! డొక్లాం ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారత బాక్సర్ విజేందర్ సింగ్, చైనాకు చెందిన జుల్పికర్‌తో బాక్సింగ్ పోరులో తలపడనున్నాడు. TNN | Updated: Aug 4, 2017, 11:33AM IST భారత్, చైనా మధ్య డోక్లాం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. డోక్లాం నుంచి భారత బలగాలు వెనక్కి మళ్లాలని డ్రాగన్ పదే పదే హెచ్చరిస్తుండటం.. మన ఆర్మీ ఏ మాత్రం లక్ష్య పెట్టకపోవడంతో.. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం లేదు. ఓ దశలో ఇరు దేశాల మధ్య పరిమిత యుద్ధం జరిగే అవకాశం ఉందేమో అనిపించింది. చిన్న వివాదం కోసం రెండు పెద్ద దేశాలు బలప్రదర్శనకు దిగకపోవచ్చు. కానీ బాక్సింగ్ రింగ్&zwnj;లో మాత్రం భారత్, చైనా తలపడనున్నాయి. అర్థం కాలేదా..? ప్రొఫెషనల్ బాక్సర్&zwnj;గా తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న విజేందర్ సింగ్ , చైనాకు చెందిన జుల్పికర్ మైమైతియాలితో బాక్సింగ్ రింగ్&zwnj;లో తలపడనున్నాడు. ముంబైలో శనివారం వీరిద్దరి మధ్య బాక్సింగ్ పోటీ జరగనుంది. ప్రొఫెషల్ బాక్సర్&zwnj;గా 8 సార్లు తలపడిన విజేందర్ ఓటమి అనేది లేకుండా ముందుకు సాగుతున్నాడు. శనివారం జరగనున్న మ్యాచ్&zwnj;&zwnj;లో చైనా బాక్సర్&zwnj;ను మట్టికరిపించాలని విజేందర్ తహతహలాడుతున్నాడు. చైనా వస్తువులు మన్నిక తక్కువ. అవి ఎక్కువ కాలం మన్నలేవంటూ.. తనతో పోటీలో చైనా బాక్సర్ ఎక్కువసేపు నిలువలేడంటూ పరోక్షంగా జుల్పికర్&zwnj;కు చురకలు అంటించాడు. ఈ మ్యాచ్&zwnj;ను వీక్షించేందుకు సచిన్ టెండుల్కర్ లాంటి దిగ్గజాలను ఆహ్వానించాడు. మరోవైపు 2014లో ప్రొఫెషనల్ బాక్సర్&zwnj;గా మారిన జుల్పికర్ కూడా డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ మిడిల్ వెయిట్ ఛాంపియన్ అయిన విజేందర్&zwnj;తో అమీతుమీకి సిద్ధపడుతున్నాడు. విజేందర్&zwnj;పై గెలిచేందుకు శక్తి మేర ప్రయత్నిస్తానని చెప్పాడు. భారత్, చైనా మధ్య డోక్లాం వివాదం గురించి మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. స్పందించేందుకు నిరాకరించాడు. రాజకీయాలు, క్రీడలకు సంబంధం లేదని బదులిచ్చాడు.
2
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV క్రికెటర్లూ ఆ లీగ్‌లో ఆడొద్దండి : బీసీసీఐ బీసీసీఐ నుంచి సరైన అనుమతి లేకుండా నిర్వహించనున్నఇండియన్ జూనియర్ ప్రీమియర్ లీగ్ TNN | Updated: Sep 11, 2017, 08:47PM IST బీసీసీఐ నుంచి సరైన అనుమతి లేకుండా నిర్వహించనున్నఇండియన్ జూనియర్ ప్రీమియర్ లీగ్ ( ఐజేపీఎల్ )&zwnj;&zwnj;లో క్రికెటర్లు ఎవరూ ఆడకూడని బోర్డు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి 29 వరకు ఈ లీగ్ జరగనుంది. ఐసీసీ అకాడమీ గ్రౌండ్&zwnj;లోనే ఈ మ్యాచ్&zwnj;లు జరగనున్నాయి. ఇటీవల లీగ్ ఆరంభోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు ఐసీసీ లోగోని కూడా వినియోగించారు. కానీ.. తాజాగా బీసీసీఐ తమ క్రికెటర్లని లీగ్&zwnj;కి పంపబోమని చెప్పడంతో నిర్వాహకులు షాక్&zwnj;కి గురయ్యారు. బీసీసీఐ వద్ద రిజస్టర్ చేసుకున్న క్రికెటర్లు.. వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోషియేషన్&zwnj;కి చెందిన అండర్-16, అండర్-19 ఆటగాళ్లు కూడా ఇక టోర్నీలో పాల్గొనేందుకు వీలులేదని.. అసోషియేషన్లు ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బోర్డు ఆదేశించింది. చిత్రంగా.. ఈ టోర్నీకి భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ భారత్ తరఫున ప్రచారకర్తగా ఉండటం విశేషం. ఇలాంటి టోర్నీలను ప్రోత్సహిస్తూ.. భారత క్రికెటర్లని పంపితే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) కళ ఎక్కడ తప్పుతుందోనని బీసీసీఐ ఆందోళన చెందుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆటగాళ్లకి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
2
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV లండన్ ఒలింపిక్స్‌.. రజత ‘యోగం’ లేనట్లే! లండన్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్ దత్ సాధించిన కాంస్య పతకం సిల్వర్ మెడల్‌గా అప్‌గ్రేడ్ కాబోదని ఐఓసీ స్పష్టం చేసింది. TNN | Updated: Oct 25, 2016, 01:06PM IST లండన్ ఒలింపిక్స్&zwnj;లో యోగేశ్వర్ దత్&zwnj; సాధించిన కాంస్య పతకం రజతంగా అప్&zwnj;గ్రేడ్ అయ్యే అవకాశాలు లేవని ఐఓసీ స్పష్టం చేసింది. నాలుగేళ్ల క్రితం లండన్&zwnj;లో జరిగిన ఒలింపిక్స్&zwnj;లో రెజ్లర్ యోగేశ్వర్ దత్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఆ ఒలింపిక్స్&zwnj;లో 60 కేజీల ఫ్రి స్టయిల్ రెజ్లింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ నెగ్గిన రష్యా రెజ్లర్ బెసిక్ కుదుకోవ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలింది. దీంతో అతడు పతకాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఫలితంగా యోగేశ్వర్&zwnj;దత్&zwnj;కు వెండి పతకం దక్కుతుందని భావించారు. 2013లో జరిగిన ఓ కారు యాక్సిడెంట్లో కుదుకోవ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ రష్యన్ రెజ్లర్ ఇప్పటికే మరణించిన కారణంగా అతడిపై విచారణ నిలిపేయాలని ఒలింపిక్ కమిటీ నిర్ణయించింది. ఫలితంగా యోగేశ్వర్&zwnj; పతకం అప్&zwnj;గ్రేడ్ కాకుండా నిలిచిపోయింది. కుదుకోవ్ మరణానికి ముందే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అతడికి డోప్ టెస్ట్ నిర్వహించింది. ఒలింపిక్స్&zwnj;లో పాల్గొనడానికి ముందు కుదుకోవ్ వద్ద నుంచి సేకరించిన శాంపిళ్లను ఈ ఏడాది రష్యన్ రెజ్లింగ్ ఫెడరేషన్ పరీక్షించింది. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు ఈ టెస్టులో తేలింది. శాంపిల్స్ సేకరించిన నాటి 8 ఏళ్ల వరకు డోపింగ్ టెస్ట్ కోసం మళ్లీ పరీక్షలు నిర్వహించే వీలుండగా, 2015లో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఆ గడువును మరో రెండేళ్లు పొడిగించింది. గతంలో యోగశ్వర్&zwnj; సాధించిన పతకం అప్&zwnj;గ్రేడ్ అవుతుందని సూచనప్రాయంగా వార్తలు వెలువడ్డాయి. తనకు ఆ వెండి పతకం అక్కర్లేదని, కుదుకోవ్ తల్లిదండ్రుల దగ్గర్నుంచి అతడి జ్ఞాపకాలను లాగేసుకోనని.. యోగేశ్వర్ ఇప్పటికే స్పష్టం చేశాడు. రియోలో తొలి రౌండ్లోనే వెనుదిరిగి నిరాశ పర్చిన యోగేశ్వర్ దత్.. ప్రస్తుతం అకాడమీ ఏర్పాట్లకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు.
2
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2
Oct 29,2016 ఎస్‌బీహెచ్‌ నిర్వహణ లాభాలు 36% వృద్ధి నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌లోని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) నిర్వహణ లాభాలు 36.30 శాతం పెరిగి రూ.1,101.18 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.807.88 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. కాగా క్రితం క్యూ2లో బ్యాంకు రూ.776.64 కోట్ల నికర నష్టాలు చవి చూసింది. 2015-16 ఇదే త్రైమాసికంలో రూ.375.31 కోట్ల నికర లాభాలు సాధించింది. గత క్యూ2లో బ్యాంకు నికర వడ్డీపై ఆదాయం 1.38 శాతం తగ్గి రూ.1111.56 కోట్లుగా నమోదయ్యింది. ఇతర ఆదాయం 73.30 శాతం పెరిగి రూ.569.97 కోట్లకు చేరింది. బ్యాంకు మొత్తం ఆదాయం రూ.2,53,411 కోట్లుగా నమోదయ్యింది. అడ్వాన్సులు 6.60 శాతం పెరిగి రూ.1,12,249 కోట్లుగా, డిపాజిట్లు 7.20 శాతం వృద్ధితో రూ.1,40,489 కోట్లకు చేరాయి. సెప్టెంబర్‌ ముగింపు నాటికి మొత్తంగా 1932 శాఖలకు విస్తరించింది. ఇందులో తెలంగాణలో 774 శాఖలు, ఆంధ్రప్రదేశ్‌లో 434 శాఖల చొప్పున కలిగి ఉంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్! First Published 12, Mar 2019, 9:55 AM IST 'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్ 'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్ 'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్ 'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్ 'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్ 'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్ 'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్ 'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్ 'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్ Recent Stories
0
రూ.3,500 కోట్ల బైబ్యాక్‌: హెచ్‌సీఎల్‌ - షేరు ఒక్కింటికి రూ.1,000 చెల్లింపు - 17% ప్రీమియంతో తిరిగి కొనుగోలు - గురువారమే రికార్డు తేదీగా చర్యలు న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో బైబ్యాక్‌ సీజన్‌ కొనసాగుతోంది. దిగ్గజ ఐటీ కంపెనీలు ఒక్కొక్కటిగా షేర్ల బైబ్యాక్‌ను ప్రకటిస్తూ వస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కూడా వచ్చి చేరింది. కంపెనీ పెయిడప్‌ క్యాపిటల్‌లో దాదాపు 16.39 శాతానికి సమానమైన రూ.3,500 కోట్ల విలువైన షేర్లను తాము బైబ్యాక్‌ చేయనున్నట్టుగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. ప్రస్తుత మార్కెట్‌ ట్రేడింగ్‌ రేటు కంటే కూడా దాదాపు 17% అధిక ప్రీమియంతో.. షేరు ఒక్కింటికి రూ.1000 చొప్పున చెల్లించి వాటాలను తిరిగి కొనుగోలు చేయనున్నట్టుగా సంస్థ తెలిపింది. బుధవారం సంస్థ షేరు దాదాపు రూ.892.35 దరిదాపుల్లో కదలాడుతూ కనిపించింది. దామాషా పద్ధతిలో టెండర్‌ ఆఫర్‌ విధానంలో కంపెనీ ఈ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టనుంది. ఈ విషయాన్ని సంస్థ మార్కెట్‌ నియంత్రణ సంస్థకు తెలిపింది. ఈ బైబ్యాక్‌ ఆఫర్‌నకు గురువారాన్ని సంస్థ (మే 25ను) రికార్డు తేదీగా నిర్ణయించి ఈక్విటీ వాటాదారులకు 'లెటర్‌ ఆఫ్‌ ఆఫర్‌'ను పంపినుంది. బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రారంభ, ముగింపు తేదీలకు సంబంధించి వాటాదారుల అనుమతులు ఇప్పటికే లభించినప్పటికీ సంస్థ ఆ తేదీలను మాత్రం వెల్లడించలేదు. పుస్తకాల్లో అధిక మొత్తంలో నగదు నిల్వలను కలిగి ఉన్న సంస్థలు వాటిని వివిధ రూపాల్లో వాటాదారులకు అందించే ప్రయత్నాల్లో భాగంగా బైబ్యాక్‌ను ప్రకటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌తో సహా కాగ్నిజెంట్‌ సంస్థలు బైబ్యాక్‌తో పాటు భారీ డివిడెండ్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
పది గంటల్లో 10 లక్షల అమ్మకాలు - 'బిగ్‌ బిలియన్‌ డేస్‌'కు అపూర్వ స్పందన న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ మంగళవారం నంచి మొదలు పెట్టిన 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' ఆన్‌లైన్‌ విక్రయాలకు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అయిదు రోజులపాటు అందుబాటులో ఉండనున్న 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' అమ్మకాలకు అపూర్వ స్పందన లభిస్తున్నట్లు వెల్లడించింది. అమ్మకాలు మొదలుపెట్టిన కేవలం 10 గంటల సమయంలో దాదాపు 10 లక్షల మేర వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించినట్లు సంస్థ పేర్కొంది. పాద రక్షలు, పురుషుల దుస్తులు, యాక్సెసరీస్‌ వంటి విభాగాల్లోనైతే దాదాపు సెకనుకు సగటున 25 వస్తువులు అమ్ముడుపోయినట్లుగా వివరించింది. అమ్మకాలు మొదలైన కొన్ని గంటల సమయంలోనే యాప్‌ క్రాష్‌ అయినప్పటికీ ఫ్లిప్‌కార్ట్‌ మెరుగైన అమ్మకాలను నమోదు చేయడం విశేషం. గత రెండు రోజుల నుంచి దాదాపు 16 లక్షల మంది తమ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లుగా సంస్థ తెలిపింది. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై వంటి మెట్రో నగరాల నుంచి లుధియానా, లక్నో వంటి మెట్రోయేతర నగరాల నుంచి ఎక్కువగా అర్డర్లు లభించినట్లు ఫ్లిఫ్‌కార్ట్‌ తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
బ్యాంకుల నిరర్ధక ఆస్తులే భారత్‌కు సవాల్‌ - ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్త మౌరిస్‌ ఆబ్స్‌ ఫెల్డ్‌ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరునే ప్రదర్శిస్తోందని 'అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ' (ఐఎంఎఫ్‌) ముఖ్య ఆర్థికవేత్త మౌరిస్‌ ఆబ్స్‌ ఫెల్డ్‌ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంక్షిష్ట ఆర్థిక పరిస్థితుల్లో భారత్‌ మాత్రమే ఆశాదీపంగా అగుపిస్తోందని ఆయన అభివర్ణించారు. అయితే భారత దేశానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెరిగిపోతున్న నిరర్థక ఆస్తులు వృద్ధికి ప్రధాన సవాల్‌గా నిలుస్తున్నట్లు తెలిపారు. చైనా సైతం వృద్ధి బాటలో పయనిస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు తగ్గుతుండటం భారత్‌ పరిస్థితిని మెరుగుపరిచే అంశాలుగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
CHAINA CURRENCY111 220 బిలియన్‌ డాలర్లకు చేరిన రానిబాకీలు బీజింగ్‌: చైనా రానిబాకీలు మొత్తంగా చూస్తే గత ఏడాది 220 బిలియన్‌డాలర్లకు చేరా యి. ప్రాదేశిక ప్రభుత్వాలే ఎక్కువగా వీటికి కారణం అన్నట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థ నివేదికలు స్పష్టంచేస్తు న్నాయి. మౌలిక వనరులు పెంపొందించుకోవాలన్న తాపత్రయమే రానిబాకీలను పెంచిందని బ్యాంకింగ్‌ రంగ నివేదికలు స్పష్టంచేసాయి. మొత్తం 1794 బ్యాంకులుంటే వాటిలో 90 శాతం వరకూ రానిబాకీల వసూళ్లకు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ పటిష్టంగా లేదు. ప్రభు త్వరంగంలోని అధికార వార్తాపత్రిక గ్జిన్‌ హువా చైనా బ్యాంకింగ్‌ అసోసియేషన్‌, ప్రైస్‌ వాటర్‌కూపర్స్‌ రూపొందించిన నివేదికను విశ్లేషించింది. వాణిజ్యబ్యాంకుల్లో రానిబాకీలు 220 బిలియన్‌డాలర్లు అదే చైనా కరెన్సీ యువాన్‌లో చూస్తే 1.5లక్షల కోట్లుగా ఉన్నా యి. మూడోత్రైమాసికం చివరినాటికి 18.3 బిలియన్‌ యువాన్‌లు మరింత పెరిగాయి. సుమా రు 78శాతం బ్యాంకర్లు తమ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ ను పెంచుకుంటున్నాయి. 61శాతం సర్దుబాటు బిజినెస్‌ ప్లాట్‌ఫామ్‌ను వృద్ధి చేసుకుంటున్నట్లు ఉటంకించింది. పట్టణ మౌలికవనరుల ప్రాజెక్టులకే చైనాలో ఎక్కువ రుణపరపతి అందింది. తర్వాత వైద్యరంగానికి ఎక్కువ రుణాలు జారీ అయ్యాయి. ఎక్కువ రానిబాకీల్లో అధికశాతం ప్రాదేశిక ప్రభు త్వాల నుంచే అందాల్సి ఉంది. తమ అభివృద్ధిని మరింతగా పెంచుకోవాలన్న తాపత్రయంతో ఈ ప్రభుత్వాలు మౌలికవనరులకోసం అత్యధిక రుణా లు తీసుకున్నట్లు సర్వేలో తేలింది. చైనా బ్యాం కులు రుణపరపతితోపాటే అసెట్‌మేనేజ్‌మెంట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ను కూడా నిర్వహిస్తాయి. సిరిసంపదలు ఎక్కువ ఉన్న వ్యక్తులు, చిన్న వ్యాపా రాలు, ప్రభుత్వ శాఖలు వంటివి వీటికి కీలకమైన గ్రూప్‌లుగా ఉంటాయి. గత ఏడాది ఐఎంఎఫ్‌కు చెందిన సీనియర్‌ ఉద్యోగి ఒకరు పెరుగుతున్న కార్పొరేట్‌ రుణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేనిపక్షం లో రుణభారం మరింత పెరుగు తుందని హెచ్చరించారు. చైనా సంస్కరణల్లో అత్యంత కీలకమై నది ముందు కార్పొరేట్‌ రుణ భారం తగ్గించుకోవడమేనని లేని పక్షంలో తీవ్రస్థాయి ఆర్థిక సమస్య లు ఉత్పన్నం అవుతాయని ఐఎం ఎఫ్‌ మొదటి డిఫ్యూటీ ఎండి డేవిడ్‌లిప్టన్‌ వెల్లడించారు. మొత్తం జిడిపిలో225శాతంగాఉందని కార్పొ రేట్‌ రుణభారం 145శాతం వాటాతో ఉందని, అత్యం త తీవ్రస్థాయిలో ఉందని హెచ్చరించింది. అంతే కాకుండా చైనా కార్పొరేట్‌రుణభారం తీవ్రంగా పరిగ ణించాలని లిప్టన్‌ ఆదేశ పాలకులను హెచ్చరించారు.
1
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బంతిని చూడలేకపోయిన బ్యాట్స్‌మెన్.. సూరీడి దెబ్బకు మ్యాచ్ నిలిపివేత! సూర్య కిరణాలు ఆటగాళ్ల కళ్లలో పడటం వల్ల మ్యాచ్ నిలిపేయడం ఎప్పుడైనా చూశారా. భారత్, న్యూజిలాండ్ తొలి వన్డేకు భానుడు కాసేపు ఆటంకం కలిగించాడు. ఎండ కారణంగా బ్యాట్స్‌మెన్ బంతిని చూడలేకపోవడంతో మ్యాచ్ ఆపేశారు. Samayam Telugu | Updated: Jan 23, 2019, 02:06PM IST బంతిని చూడలేకపోయిన బ్యాట్స్‌మెన్.. సూరీడి దెబ్బకు మ్యాచ్ నిలిపివేత! హైలైట్స్ సూర్య కిరణాలు ఆటగాళ్ల కళ్లలో పడటం వల్ల మ్యాచ్ నిలిపేయడం ఎప్పుడైనా చూశారా..? భారత్, న్యూజిలాండ్ తొలి వన్డేకు భానుడు కాసేపు ఆటంకం కలిగించాడు. ఎండ కారణంగా బ్యాట్స్‌మెన్ బంతిని చూడలేకపోవడంతో మ్యాచ్ ఆపేశారు. సూరీడి కారణంగా మ్యాచ్ ఆగిపోవడం ఎప్పుడైనా చూశారా? భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఈ కారణంగానే ఆగిపోయింది. ఎండ తీవ్రత కారణంగా బంతిని సరిగా గుర్తించడం బ్యాట్స్‌మెన్‌కు కష్టమైంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారిగా మ్యాచ్‌ను కాసేపు నిలిపేశారు. ఆటగాళ్ల భద్రత, వడదెబ్బ తగిలే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఫీల్డ్ అంపైర్ షాన్ జార్జ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భానుడు భగభగలాడుతూ.. సూర్య కిరణాలు ఆటగాళ్ల కళ్లలోకి పడుతుండటంతో ఆటగాళ్లు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం గమనించిన అంపైర్లు కాసేపు మ్యాచ్ నిలిపేశారు. గతంలో దేశవాళీ క్రికెట్లో మాత్రమే ఎండ తీవ్రత కారణంగా మ్యాచ్‌లను నిలిపేసిన ఘటనలు ఉన్నాయి. సూర్య కిరణాలు నేరుగా బ్యాట్స్‌మెన్ కళ్లలో పడకుండా ఉండటం కోసం పిచ్‌లను ఉత్తరం-దక్షిణ దిశల్లో రూపొందిస్తారు. కానీ తొలి వన్డే జరిగిన మెక్‌లీన్ పార్కులో పిచ్ తూర్పు-పడమర దిశల్లో ఉంది. దీంతో ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 157 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ను శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ సాయంతో గెలిపించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV వన్డేల్లో ఇంగ్లండ్ సరికొత్త రికార్డ్ అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ జట్టు సరికొత్త రికార్డును నెలకొల్పింది. TNN & Agencies | Updated: Aug 31, 2016, 03:40PM IST అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ జట్టు సరికొత్త రికార్డును నెలకొల్పింది. మంగళవారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 444 పరుగులు చేసి శ్రీలంక పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును తుడిచిపెట్టింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ అలెక్స్ హేల్స్ వీర విహారం చేశాడు. ఇతను 122 బంతుల్లో 171 పరుగులు (22 ఫోర్లు, 4 సిక్సులు) చేయడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. అలెక్స్ తో పాటు జో రూట్ (85), బట్లర్ (90), మోర్గాన్ (57) రాణించడంతో ఇంగ్లండ్ రికార్డు స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 42.4 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లండ్ 169 పరుగుల భారీ విజయాన్ని నమోదుచేసింది. అలాగే ఐదు వన్డేల సిరీస్ ను ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, శ్రీలంక 2006లో నెదర్లాండ్స్ పై 443 పరుగులు చేసి రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు దీన్ని ఇంగ్లండ్ బ్రేక్ చేసింది.
2
internet vaartha 175 Views హైదరాబాద్‌ : పండుగ సీజన్లను పురస్కరించుకుని టాటా గ్రూప ఆభరణాల సంస్థ తనిష్క్‌ కొత్తగా శుభమ్‌ కలెక్షన్‌ను విడుదల చేసింది. భారతీయ దేవాలయాల సాంప్రదాయాలను ఈ డిజైన్లలో పొందుపరిచింది. 100కుపైగా ఆభరణాలు నెక్లెస్‌లు, పెద్దపెద్ద హారాలు, జుంకీలు, గాజులు పెండెంట్స్‌ వంటివి ఉన్నాయి. కస్టమర్లకు 25శాతం వరకూ ఆభరణాల తయారీ ఛార్జీలపై రాయితీని అందించడంతో పాటు వజ్రాభరణాల బిల్లు మొత్తంలో 25 శాతం రాయితీ అందిస్తున్నట్లు తనిష్క్‌ జనరల్‌ మేనే జర్‌ దీపికా తివారి వెల్లడించారు. అందమైన దీపావళి, దసరాల కోసం ఈ కొత్త కలెక్షన్‌ను కస్టమర్ల కోసం సొంత తయారీ కేంద్రం నుంచే ఉత్పత్తి చేశామన్నారు.
1
Hyderabad, First Published 13, Mar 2019, 12:15 PM IST Highlights మహేష్ తో అనుకున్న సినిమా ముందుకు వెళ్లలేదు. ఊహించని విధంగా అల్లు అర్జున్ తో సినిమా ముందుకు వచ్చింది. అలాగని అది వెంటనే ప్రారంభమయ్యే పరిస్దితి కనపడటం లేదు.  మహేష్ తో అనుకున్న సినిమా ముందుకు వెళ్లలేదు. ఊహించని విధంగా అల్లు అర్జున్ తో సినిమా ముందుకు వచ్చింది. అలాగని అది వెంటనే ప్రారంభమయ్యే పరిస్దితి కనపడటం లేదు. ఏదో ఎనౌన్సమెంట్ అయితే వచ్చింది కానీ టైమ్ పట్టేటట్లు ఉంది. మరి ఈ గ్యాప్ లో ఏం చేయాలి. సుకుమార్ ముందున్న ప్రశ్న ఇది. ఓ క్రియేటివ్ పర్శన్ గా ఆ గ్యాప్ ని భరించటం కష్టమే..అందుకే ఆయన..తన రూట్ ని మార్చాలని డిసైడ్ చేసుకున్నారు.  బాలీవుడ్ కు వెళ్లి అక్కడ ఇండస్ట్రీని ఏలాలనేది సౌత్ హీరోయిన్స్ కల అయితే, సౌత్ డైరక్టర్స్ కు అక్కడ సినిమా దర్శకత్వం వహించి హిట్ కొట్టాలనేది కోరిక. సుకుమార్ కు కూడా అలాంటి కోరిక ఉందట. ఆయనకు ఓ హిందీ సినిమా డైరక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆ మధ్యన సుకుమార్.. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అండతో ..బాలీవుడ్ స్టార్స్ అయిన ఖాన్స్ ని కలసి కథ చెప్దామనుకున్నారు. అయితే ఆ తర్వాత మహేష్ తో సినిమా స్క్రిప్టు బిజీలో పడిపోయి ఆ ఆలోచనను ప్రక్కన పెట్టేసారు. ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా అనుకున్నా అది లేటు అయ్యేటట్లు ఉంది. త్రివిక్రమ్ తో బన్ని సినిమా పూర్తయ్యాకే సుకుమార్ సినిమా స్టార్ట్ అయ్యేది. దాంతో ఈ గ్యాప్ లో బాలీవుడ్ ట్రైల్స్ వేస్తే..అల్లు అర్జున్ తో సినిమా పూర్తయ్యే నాటికి ఓ కొలిక్కి వస్తుందని సుకుమార్ భావిస్తున్నారట.  దాంతో  సుకుమార్‌  పూర్తిగా బాలీవుడ్‌ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తను తీసిన సినిమాల్లో  హిట్ ని అక్కడ రీమేక్ చేయాలని భావిస్తున్నారట. విజయేంద్రప్రసాద్ ఆ సినిమాని సమర్పించనున్నారు. నాన్నకు ప్రేమతో సినిమా రీమేక్ అయ్యే అవకాసం ఉందని సమాచారం.  ఈ మేరకు రెండు మూడు సార్లు బోంబేకి కూడా వెళ్లివచ్చారని సమాచారం.. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఖాన్‌ త్రయాన్ని కలుసుకుని తన  సినిమాల స్టోరీ లైన్స్ చెప్పే పనిలో ఉన్నారంటున్నారు.  అంటే మరో తెలుగు దర్శకుడు బాలీవుడ్ లో విజయ పతాకం ఎగరవేయబోతున్నాడన్నమాట.  Last Updated 13, Mar 2019, 12:15 PM IST
0
New Delhi, First Published 18, Mar 2019, 11:12 AM IST Highlights అత్యుత్తమ బ్రాండ్‌గా ‘టాటా గ్రూప్’ నిలిచింది. తర్వాతీ స్థానాల్లో జియో సాయంతో రిలయన్స్.. భారతీ ఎయిర్ టెల్ నిలిచాయి. తొలిసారి బిగ్ బజార్ చోటు దక్కించుకున్న  బ్రాండ్స్‌లో ఒకటి. టాటా తనిష్క్, రాయల్ ఎన్ ఫీల్డ్, బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్ శరవేగంగా బ్రాండ్ విలువ పెంచుకున్న సంస్థలుగా నిలిచాయి. దేశవ్యాప్తంగా అత్యుత్తమ బ్రాండ్‌గా ‘టాటా’ నిలిచింది. సంచలనాలు నెలకొల్పినా.. పరిస్థితుల ప్రభావంతో లీడర్‌గా దూసుకొచ్చినా.. సంప్రదాయంగా అత్యుత్తమ సేవలను వినియోగదారులకు అందించే సంస్థలకే అత్యుత్తమ బ్రాండ్ లభిస్తుందనడంలో సందేహం లేదు. దేశ వ్యాప్తంగా అత్యుత్తమ బ్రాండ్ల జాబితాలో టాటా.. ఆ తర్వాత జాబితాలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. మూడో స్థానంలో సునీల్ మిట్టల్ సారథ్యంలోని భారతీ ఎయిర్ టెల్ నిలిచాయ. అంటే వీటి సామర్థ్యం ఏమిటో విడిగా చెప్పనక్కర్లేదు.  బ్రాండ్‌ కన్సల్టెన్సీ ఇంటర్‌బ్రాండ్‌ సంస్థ విడుదల చేసిన 40 అత్యుత్తమ ఇండియన్‌ బ్రాండ్‌ జాబితాలో టాటా దేశంలోనే సర్వోత్తమ బ్రాండ్‌గా ఎంపికైంది. రెండో స్థానంలో రిలయెన్స్‌,మూడో స్థానంలో ఎయిర్‌టెల్‌  ఉన్నాయి.  2018లో ఆయా సంస్థలకు ఉన్న ఆదరణ, మార్కెటింగ్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్రాండ్లలో ఈ ఏడాది తుది జాబితాను ఖరారు చేశారు. టాప్‌టెన్‌లో మూడు బ్యాంకులు ఉండటం విశేషం. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ (మూడో ర్యాంకు) ఎస్బీఐ (ఆరో ర్యాంకు) ఉన్నాయి. ఇక రిటైల్ దిగ్గజం బిగ్‌బజార్‌ మొదటిసారి ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నది. రిటైల్ దిగ్గజం బిగ్ బజార్ బ్రాండ్‌ విలువ 2,686 కోట్లుగా నిర్ణయించారు. ఇక భారతీయ ఎయిర్‌టెల్‌ బ్రాండ్‌ విలువ 32,235 కోట్లు కాగా, టాటా బ్రాండ్‌ వ్యాల్యూ 2018 లో ఆరుశాతం లాభాలు ఆర్జించింది. ఈ గ్రూపులో ఐటీ కంపెనీ  టీసీఎస్‌ ప్రధానపాత్ర పోషించింది.  అలానే రిలయెన్స్‌ ఇండిస్టీ బ్రాండ్‌ వ్యాల్యూ కూడా 12 శాతం అధికంగా నమోదుచేసుకున్నది. రిలయన్స్ జియో వల్ల ఎక్కువ లాభపడింది. మరోవైపు ఎయిర్‌టెల్‌ బ్రాండ్‌ విలువ 13 శాతం తక్కువగా నమోదైంది.  జాబితాలో ఎంపిక చేసిన 40 బ్రాండ్ల విలువ గణనీయంగా పెరిగినట్టు వెల్లడైంది. కాగా 27 శాతం సర్వీస్‌ సెక్టార్‌ నుంచి లాభాలు నమోదు చేయగా, 10శాతం మేర ఆటోమొబైల్‌ రంగనుంచి ఉన్నట్టు నిర్వాహకులు గుర్తించారు. ఇక ఇంటర్‌ బ్రాండ్ల వారీగా జాబితాలోకి బిగ్‌బజార్‌, డీమార్ట్‌ సంస్థలు చేరాయి. ప్రస్తుతం బిగ్‌ బజార్‌ 33 వ స్థానంలో నిలిచింది. దీని బ్రాండ్‌ వ్యాల్యూ 2,686 కోట్లు, డీమార్ట్‌ 37 వ ర్యాంకును దక్కించుకున్నది. దీని బ్రాండ్‌ వ్యాల్యూ 2,015గా నిర్ధారించారు. ఇక ఎయిర్ టెల్ తర్వాత ఎల్ఐసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, మహీంద్రా గ్రూప్, ఐసీఐసీఐ బ్యాంక్, గోద్రేజ్ సంస్థలు టాప్ టెన్‌లో నిలిచాయి. టాప్ టెన్‌లో స్థిర పడిన బ్రాండ్ల విలువ.. టాటా రూ. 78,722 కోట్లు, ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌  రూ. 42,826 కోట్లు, సునీల్ మిట్టల్ సారథ్యంలోని భారతీ ఎయిర్‌టెల్‌ రూ. 32,235 కోట్లతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒక్కటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బ్రాండ్ విలువ రూ. 29,963 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ బ్రాండ్ రూ. 28,095 కోట్లు, అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ విలువ రూ. 25,620 కోట్లుగా నమోదైంది.  ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ బ్రాండ్ వాల్యూ రూ. 24,367 కోట్లు, బహుళ సంస్థల సమ్మేళనం మహీంద్రా గ్రూప్‌ వాల్యూ రూ. 18,389 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ విలువ రూ. 16,993 కోట్లు, గోద్రేజ్‌ బ్రాండ్ వాల్యూ రూ. 16,897 కోట్లుగా నమోదైంది.  టాప్ - 40 బ్రాండ్ల విలువ 5.2 శాతం పెరిగి రూ.50.03 బిలియన్లకు ఎగసింది. ఫైనాన్సియల్ సర్వీసెస్  27 శాతం, ఆటోమొబైల్ సంస్థలు 10 శాతం బ్రాండ్ వాల్యూ పెంచుకున్నాయి. ఇక నెరోలాక్ పెయింట్స్ 39వ స్థానంలో నిలిచింది.  ఆటోమొబైల్ రంగం సగటున 16 శాతం బ్రాండ్ విలువ పెంచుకున్నది. రాయల్ ఎన్ ఫీల్డ్, బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్, హీరో, మారుతి సుజుకి, మహీంద్రా గ్రూప్ సంస్థలు సగటు కంటే ఎక్కువ ప్రగతి సాధించాయి.  టాటా ‘తనిష్క్’, రాయల్ ఎన్ ఫీల్డ్, కొటక్, బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్ శరవేగంగా బ్రాండ్ విలువ పెంచుకున్న సంస్థలు. రిలయన్స్ గ్రూప్, కెనరా బ్యాంక్ ఈ ఏడాది ఆసక్తి పెంచాయి. లగ్జరీ బ్రాండ్ వస్తువుల విలువ 42 శాతం పెరిగింది.
1
Visit Site Recommended byColombia దాంతో పూనమ్ దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. ‘నా ఆలోచనల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. మీ ఆలోచనలన్నీ ఊహాగానాలే. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పెయిడ్ మీడియా వర్గాలు సొమ్మలు చేసుకోవాలని అనుకుంటున్నాయి. నేను చెప్పిన మాటపై నిలబడే వ్యక్తిని. మీరు మీ ఊహా ప్రపంచంలోనే ఉండండి. మీలాంటివారిపై నాకు జాలేస్తుంటుంది. గాడ్ బ్లెస్’ అని పూనమ్ పేర్కొంది. పూనమ్ చేసే ట్వీట్లకు స్పందించి అనవసరంగా ఆమెకు ప్రచారం కల్పిస్తున్నారని పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నోటికొచ్చినట్లు చేసే ట్వీట్లకు అసలు స్పందించకపోవడమే మంచిదని అంటున్నారు. ఏమైనా గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న పూనమ్ కౌర్.. తన ఒక్క ట్వీట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. READ ALSO: యాంకర్‌కు లిప్ కిస్ ఇచ్చిన స్టార్ నటి.. వీడియో వైరల్ గతంలో పూనమ్ పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఎన్నో ఆరోపణలు చేసింది. త్రివిక్రమ్ తనకు ముందు ‘అఆ’ సినిమాలో అవకాశం ఇస్తానన్నారని కానీ ఇవ్వలేదని ఆరోపించింది. అసలు పూనమ్ ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశిస్తూ చేసిందో ఎందుకు చేసిందో తనకే తెలియాలి. ఇప్పుడు ఆమె చేతిలో సినిమాలు కూడా లేవు. కనీసం ఈ రకంగా ట్వీట్లు చేస్తే అయినా పాపులారిటీ వస్తుందని ప్రయత్నిస్తున్నట్లుంది. కానీ సినిమా రంగానికి చెందిన ఆమె రాజకీయాల్లో తలదూర్చకపోవడమే మంచిదని పలువురు నెటిజన్లు సూచనలు ఇస్తున్నారు.
0
why aishwarya rai bachchan said no to chiranjeevi`s 151 అందుకే ఐశ్వర్యా రాయ్ చిరుకి నో చెప్పిందా ? తాము అవతలి వాళ్ల మనసు నొప్పించకుండా ఏదైనా సినిమాకు నో చెప్పాలంటే, కొన్నిసార్లు హీరోయిన్స్... TNN | Updated: Sep 4, 2017, 09:31PM IST తాము అవతలి వాళ్ల మనసు నొప్పించకుండా ఏదైనా సినిమాకు నో చెప్పాలంటే, కొన్నిసార్లు హీరోయిన్స్ ముందుండే మార్గాల్లో ఒకటి ఉన్నట్టుండి పారితోషికం పెంచడమేనట. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా 'సైరా నరసింహా రెడ్డి' విషయంలో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కూడా అదే ఎత్తుగడ ప్రయోగించినట్టుంది అంటున్నాయి సినీవర్గాలు. కెరీర్ ఊపుమీదున్నప్పుడు రజినీకాంత్&zwnj;తో రోబో సినిమా చేసిన ఐష్ ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్&zwnj;లో ఎంచుకుంటున్న సినిమాలనిబట్టి చూస్తే, ఆమెకి సీనియర్ హీరోల సరసన నటించడం ఇష్టం లేదని అర్థమవుతోంది అంటున్నారు కొంతమంది. మాధవన్&zwnj;తో ఓ సినిమా సైన్ చేయడానికి నో చెప్పిన ఐష్ అదే సమయంలో రాజ్ కుమార్ రావ్, రణ్&zwnj;బీర్ కపూర్ లాంటి యంగ్ హీరోలతో సినిమాలకి సైన్ చేయడం వెనుక వున్న మతలబు ఆ ఏజ్ ఫ్యాక్టరే అనేది వారి అభిప్రాయం. అందుకే మెగాస్టార్ లాంటి స్టార్ హీరోకి అలా నో చెబితే బాగుండదనుకుందో ఏమో కానీ తెలివిగా రూ. 9 కోట్ల పారితోషికం డిమాండ్ చేసి మరీ వారితోనే నో చెప్పించుకునేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
0