news
stringlengths
299
12.4k
class
int64
0
2
Hyderabad, First Published 9, Aug 2019, 2:36 PM IST Highlights తాజాగా సినీ నటుడు రాజేంద్రప్రసాద్ పృథ్వీకి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రాజేంద్రప్రసాద్ 'సీఎంని వెంటనే కలవడానికి సినీ నటులేం వ్యాపారవేత్తలు కాదు.. కళాకారులు సీఎంని కలవాలన్న నిబంధన ఏమీ లేదని' రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించడం విశేషం.  ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నికవ్వడం సినీ పరిశ్రమకి ఇష్టం లేదని.. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఎవరూ వెళ్లి మర్యాదపూర్వకంగా కలవలేదని ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీ కొన్ని కామెంట్స్ చేశాడు. పృథ్వీ చేసిన ఆరోపణలను ఇప్పటికే వైసీపీలో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి తప్పుబట్టాడు. తాజాగా సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కూడా పృథ్వీకి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రాజేంద్రప్రసాద్ 'సీఎంని వెంటనే కలవడానికి సినీ నటులేం వ్యాపారవేత్తలు కాదు.. కళాకారులు సీఎంని కలవాలన్న నిబంధన ఏమీ లేదని' రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించడం విశేషం. జగన్ సీఎంగా సెటిల్ అయిన తరువాత కలుస్తామని తెలిపారు. జగన్ తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని.. రెండు రాష్ట్రాల సీఎంలు సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగా ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు తాగునీరందించే ముఖ్యమంత్రి తమకు దేవుడని రాజేంద్రప్రసాద్ అన్నారు. జగన్ ని రేపు కలవాల్సివుందని కానీ ఇతర కారణాల వలన మరో రెండు మూడు రోజుల్లో కలవడానికి అవకాశమిచ్చారని రాజేంద్రప్రసాద్ చెప్పారు.  Last Updated 9, Aug 2019, 2:38 PM IST
0
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
1
యమన్ ట్రైలర్‌ని రిలీజ్ చేసిన వి. వి వినాయ‌క్ Highlights నకిలీ   సలీం  బిచ్చగాడు  వంటి హిట్‌ చిత్రాల్లో నటించిన విజయ్‌ ఆంటోని తాజాగా యమన్  చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజ‌య్ ఆంటోని యమన్‌ ట్రైలర్‌ని రిలీజ్  చేసిన ద‌ర్శ‌కుడు వి.వి వినాయ‌క్  జీవశంకర్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌, ద్వారక క్రియేషన్స్‌ పతాకాలపై మిర్యాల రవీందర్‌రెడ్డి ‘యమన్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఫాదర్‌ సెంటిమెంట్‌తో పొలిటికల్‌, యాక్షన్‌ ధ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం టీజర్‌ రిలీజ్‌ కార్యక్రమం జనవరి 25న హైదరాబాద్‌ రామానాయుడు ప్రివ్యూ ధియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై ‘యమన్‌’ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు.  ఇంకా ఈ కార్యక్రమంలో హీరో విజయ్‌ ఆంటోని, లైకా ప్రొడక్షన్స్‌ రాజా, ద్వారకా క్రియేషన్స్‌ అధినేత మిర్యాల రవీందర్‌రెడ్డి, సమర్పకులు మిర్యాల సత్యనారాయణ రెడ్డి, పాటల రచయిత భాషశ్రీ, ప్రముఖ నిర్మాత కాశీ విశ్వనాధ్‌, చిత్ర నిర్మాత రవీందర్‌రెడ్డి సోదరులు కృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ – ”విజయ్‌ ఆంటోని ఒక టెక్నీషియన్‌గా గుర్తింపు తెచ్చుకొని ఆర్టిస్టుగా ‘ సలీం’, ‘నకిలీ’, ‘బిచ్చగాడు’తో సూపర్‌హిట్స్‌ సాధించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఫాదర్‌ సెంటిమెంట్‌తో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ‘యమన్‌’ చిత్రాన్ని రూపొందించారు. బైలింగ్వల్‌ చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించాం. లైకా ప్రొడక్షన్‌ వంటి బిగ్‌ బ్యానర్‌లో అసోసియేట్‌ అయి తెలుగులో ఈ చిత్రాన్ని అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫిబ్రవరిలో శివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు. లైకా ప్రొడక్షన్స్‌ ప్రతినిధి రాజా మాట్లాడుతూ – ”లైకా ప్రొడక్షన్స్‌లో ఫస్ట్‌ ‘కత్తి’ చిత్రాన్ని నిర్మించాం. అది పెద్ద హిట్‌ అయింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ – శంకర్‌ల కాంబినేషన్‌లో ‘2.0’ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150′ చిత్రానికి కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించాం. ఆ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. ఈ బ్యానర్‌లో బిగ్‌ బడ్జెట్‌ చిత్రాలతో పాటు స్మాల్‌ బడ్జెట్‌ చిత్రాలు నిర్మించాలని అనుకున్నాం. విజయ్‌ ఆంటోని మంచి మిత్రుడు. డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ సక్సెస్‌ సాధిస్తున్నాడు.  జీవశంకర్‌ స్క్రిప్ట్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుండడంతో ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించాం. ఫాదర్‌ సెంటిమెంట్‌, పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ఎంజాయ్‌ చేసేవిధంగా ఈ చిత్రం ఉంటుంది” అన్నారు. రచయిత భాషాశ్రీ మాట్లాడుతూ – ”బిచ్చగాడు’, ‘భేతాళుడు’ చిత్రాలకు మాటలు, పాటలు రాశాను. ఆ రెండు చిత్రాలతో విజయ్‌ ఆంటోని గారితో మంచి ఫ్రెండ్‌షిప్‌ ఏర్పడింది. ఇప్పుడు ఈ ‘యమన్‌’ చిత్రానికి మాటలు, పాటలు రాశాను. అశోక్‌ చక్రవర్తి క్యారెక్టర్‌లో హీరో విజయ్‌ ఆంటోని పర్ఫామెన్స్‌ ఇరగదీశాడు. ధర్మ సంస్ధాపన కోసం ఆనాటి అశోకుడు శత్రువులను చీల్చిచెండాడాడు. ఈ ‘యమన్‌’ చిత్రంలో ఈ అశోకుడు ఎవర్ని శిక్షించాడు అనేది చిత్ర కధ. డెఫినెట్‌గా ఈ చిత్రం మంచి హిట్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను” అన్నారు. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ మాట్లాడుతూ – ”మదర్‌ సెంటిమెంట్‌తో రూపొందిన ‘బిచ్చగాడు’ చిత్రం బిగ్‌ హిట్‌ అయింది. ఇప్పుడు ఫాదర్‌ సెంటిమెంట్‌తో విజయ్‌ ఆంటోని చేసిన ‘యమన్‌’ చిత్రం కూడా ‘బిచ్చగాడు’ కంటే పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త డైరెక్టర్‌ ఎవరైనా కథచెప్పినా అందులో కొంచెం బాగున్నా ఆ డైరెక్టర్‌కి అన్ని ఫెసిలిటీస్‌ కల్పించి ఎంకరేజ్‌ చేస్తారు. అందుకు విజయ్‌ ఆంటోనిని అభినందిస్తున్నాను.  మ్యూజిక్‌ డైరెక్టర్‌గా భయపడి ఉండి వుంటే విజయ్‌ ఆంటోని హీరో అయి వుండేవాడు కాదు. కొత్త డైరెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్‌ చేస్తూ సినిమాలు చేస్తున్న విజయ్‌ ఆంటోనికి నా ధన్యవాదాలు. రవీందర్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు, సన్నిహితుడు. కథ నచ్చితే బడ్జెట్‌ గురించి ఆలోచించకుండా ఎంతైనా ఖర్చు పెట్టే నిర్మాత రవీందర్‌రెడ్డి. అతను నిర్మిస్తున్న ఈ ‘యమన్‌’ చిత్రం పెద్ద హిట్‌ కావాలి. లైకా ప్రొడక్షన్స్‌ వారు ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా చేశారు  తమిళ్‌లో ‘కత్తి’ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ‘రోబో-2’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆ చిత్రం కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. ‘యమన్‌’ చిత్రం లైకా ప్రొడక్షన్స్‌లో పెద్దహిట్‌ అవ్వాలి” అన్నారు.హీరో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ – ”వినాయక్‌గారు ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు తీశారు. రీసెంట్‌గా ‘ఖైదీ నంబర్‌ 150’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు. మా చిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేయడానికి వచ్చిన వినాయక్‌ గారికి నా థాంక్స్‌. ఇది నా ఆరవ చిత్రం. పొలిటికల్‌ రివెంజ్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో డబుల్‌ రోల్‌ క్యారెక్టర్స్‌ చేశాను.  వెరీ ఎంటర్‌టైనింగ్‌ అండ్‌ కమర్షియల్‌ మూవీ. డైరెక్టర్‌ జీవశంకర్‌ నేను ‘నకిలీ’ చిత్రం చేశాం. అది మంచి హిట్‌ అయింది. మళ్లీ మేమిద్దరం ‘యమన్‌’ చిత్రం చేస్తున్నాం. ఈ చిత్రానికి డైరెక్షన్‌తో పాటు అద్భుతమైన ఫొటోగ్రఫి అందించారు జీవ. ఈ చిత్రంలో 5 పాటలున్నాయి. నేనే మ్యూజిక్‌ చేశాను. త్వరలో ఆడియో రిలీజ్‌చేసి శివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. ఈ చిత్రానికి భాషశ్రీ అద్భుతమైన పాటలు, మాటలు రాశారు.  ప్రతిఒక్కరూ ఎంజాయ్‌ చేసేవిధంగా ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను అలరిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన లైకా ప్రొడక్షన్స్‌ రాజా, మిర్యాల రవీందర్‌రెడ్డి గారికి నా థాంక్స్‌” అన్నారు. Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0
Hyderabad, First Published 22, Oct 2018, 12:03 PM IST Highlights బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్, దీపిక పదుకొన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ జంట తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది. నవంబర్ 14, 15 తారీఖులలో తమ వివాహం జరగబోతుందంటూ ఆదివారం వెల్లడించారు.  బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్, దీపిక పదుకొన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ జంట తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది. నవంబర్ 14, 15 తారీఖులలో తమ వివాహం జరగబోతుందంటూ ఆదివారం వెల్లడించారు. ఈ ప్రకటనతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఇటలీలో లేక్ కోమోలో వీరి వివాహం ఘనంగా జరగనుంది. అయితే నవంబర్ 15నే వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి ఓ కారణం ఉందట. అదేంటంటే.. వీరిద్దరూ జంటగా నటించిన మొదటి సినిమా 'రామ్‌లీలా' సినిమా 2013లో నవంబర్ 15నే విడుదలైంది. ఈ సినిమాతోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తమని ఒకటి చేసిన ఈ సినిమాని గుర్తుచేసుకుంటూ సినిమా విడుదలైన రోజునే వివాహ తేదీని నిర్ణయించారని తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి రెండు పద్దతుల్లో జరగనుందని అంటున్నారు. దీపిక బెంగుళూరుకి చెందిన అమ్మాయి దీంతో దక్షిణ భారతీయ సంప్రదాయంలో ఒకసారి, రణవీర్ సింధీ కుటుంబంలో పుట్టడంతో సింధి సంప్రదాయంలో వివాహాలు జరపనున్నారు.   సంబంధిత వార్త..
0
Visit Site Recommended byColombia ఈ సందర్భంగా ఆ ఫొటో కింద ‘లీక్స్ స్టార్టెడ్’ అని రాసింది. అయితే, అందులో ఉన్న వ్యక్తి ఫోటోను పూర్తిగా కనిపించకుండా పెట్టింది. దీంతో, ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఆమెతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో వణుకు మొదలైంది. శ్రీరెడ్డి నిజంగానే లీకులు పెట్టిందా? లేదా వారిని భయపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నమా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. శ్రీరెడ్డి లీక్స్ అంటూ.. కావాలనే పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టంట్లు చేస్తోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. లీక్స్ ఇలా ముఖాలు కనిపించని సెల్ఫీలు పెట్టడం కాదని, తమిళనాడులో సంచలనం రేపిన సుచీ లీక్స్‌లాగ మొత్తం అందరి ఫొటోలు బయట పెట్టాలని వ్యాఖ్యానిస్తున్నారు. మనిషి ఎవడో తెలియకుండా ఫొటో పెట్టి లీక్ అంటావేంటి శ్రీరెడ్డి అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. శ్రీరెడ్డి ఇండస్ట్రీపై చేస్తున్న కామెంట్లపై నటి అపూర్వ తనదైన శైలిలో స్పందించారు. మీడియా ఆమెను బలి పశువును చేశారని, రేటింగ్స్ కోసం వాడుకుంటున్నారన్నారు. ఆమెకు కష్టమొస్తే ఇండస్ట్రీలో పెద్దలకు చెప్పుకోవాలేగానీ, ఇలా బయటపడకూడదని తెలిపారు. శ్రీరెడ్డి లీక్ చేసిన ఫొటో లింక్ (Sri Reddy/Facebook)   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
బ్యాంకు సిఇఒ చంద్రశేఖర్‌ ఘోష్‌ వచ్చే ఏడాది బంధన్‌ బ్యాంకు ఐపిఒ కోల్‌కత్తా, ఆగస్టు 25: మైక్రోఫైనాన్స్‌ సంస్థ నుంచి బ్యాంకుగా మారిన బంధన్‌ బ్యాంకు దేశవ్యాప్త కార్య కలాపాలకోసం విస్తరించేందుకు నిధులను సమీకరిస్తోంది ఇందుకోసం ఐపిఒకు రావాలని నిర్ణయించింది. ఇప్పటికే బ్యాంకు ఐపిఒ విధానాన్ని షురూచేసింది. ఆర్‌బిఐనుంచి సూత్రప్రాయంగా ఆమోదం పొంద గానే 2018 నుంచి ఐపిఒకు వస్తామని బ్యాంకు సిఇఒ చంద్రశేఖర్‌ ఘోష్‌ వెల్లడించారు. బ్యాంకు రెండో వార్షికోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెండు పూర్తి ఆర్థిక సంవత్సరాలు పూర్తయ్యాయని, త్వరలోనే ఐపిఒ విధానంతో ముందుకువస్తామని, ఇప్ప టికే ప్రారంభించినట్లు ఘోష్‌ వివరించారు. ప్రైవేటురంగం లోని ఈ బ్యాంకు ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు, ఇతర న్యాయసలహా సంస్థలను అన్వేషించే పనిలో ఉంది. మొత్తం పూర్తిస్థాయిలో 2018లో ఐపిఒజారీచేసి నిధులు సమీకరిస్తామని సిఇఒ చెప్పారు. అందరు వాటాదారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఐపిఒ తేదీలు, నిధుల సమీకరణ మొత్తం వివరాలు వెల్లడిస్తామని అన్నారు. బ్యాంకు నికరలాభం మొదటిత్రైమాసికంలో రూ.327 కోట్లుగా ఉంది. మొదటి రెండేళ్లలో బ్యాంకు 23,500 కోట్లు డిపాజిట్లు సమీకరించింది. 21వేల కోట్ల రూపాయలకుపైబడి రుణాలిచ్చింది. ఇప్పటివరకూ 840 శాఖలు, 383 ఎటిఎంలను ఏర్పాటుచేసింది. బంధన్‌బ్యాంకు ఆర్ధికసేవలతోపాటు బీమా, మ్యూచు వల్‌ఫండ్‌ ఉత్పత్తుల సేవలను కూడా ప్రారంభిస్తుందని ఎండి ఘోష్‌ వెల్లడించారు. రఘురామ్‌రాజన్‌ ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్నకాలంలో అప్పట్లో దరఖాస్తులుచేసిన సంస్థలన్నింటిలోను చూస్తే సూక్ష్మరుణ సంస్థలపరంగా ఒక్క బంధన్‌ ఫైనాన్స్‌కే రిజర్వుబ్యాంకు లైసెన్సు మంజూరుచేసిన సంగతి తెలిసిందే.
1
sumalatha 133 Views 1st-Test , india VS south africa , Rohit Sharma , vishakapatnam Rohit-Sharma విశాఖ: విశాఖలో జరుగుతున్న టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్లు దూకుడు ప్రదర్శించారు. తొలి రోజు రోహిత్ శర్మ సెంచరీతో అదరగొడితే రెండో రోజు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా సెంచరీతో సత్తా చాటాడు. అయితే.. 176 పరుగులు చేసి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళుతున్న రోహిత్ శర్మను కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో డీ కాక్ స్టంప్ ఔట్ చేశాడు. దీంతో రోహిత్ డబుల్ సెంచరీ మిస్ అయిందని అభిమానులు నిరాశ చెందారు. ఓపెనర్లు ఇద్దరూ 317 పరుగుల పటిష్ట భాగస్వామ్యాన్ని అందించారు. రోహిత్ ఔట్ అయిన అనంతరం పుజారా క్రీజులోకొచ్చాడు. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/business/
2
Hyderabad, First Published 5, Mar 2019, 6:10 PM IST Highlights గత కొన్ని నెలలుగా ఒకే ప్లేస్ లో జక్కన్న టీమ్ బిజీగా ఉంది. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న మల్టీస్టారర్ RRR హైదరాబాద్ లో వేసిన ఒక స్పెషల్ సెట్ లో రెండు షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి సారి ఈ బడా ప్రాజెక్ట్ షూటింగ్ పక్క రాష్ట్రాలకి తరలిపోతోంది.  గత కొన్ని నెలలుగా ఒకే ప్లేస్ లో జక్కన్న టీమ్ బిజీగా ఉంది. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న మల్టీస్టారర్ RRR హైదరాబాద్ లో వేసిన ఒక స్పెషల్ సెట్ లో రెండు షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి సారి ఈ బడా ప్రాజెక్ట్ షూటింగ్ పక్క రాష్ట్రాలకి తరలిపోతోంది.  40 రోజుల వరకు కలకత్తాలో షూటింగ్ నిర్వహించడానికి నెక్స్ట్ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నారు. గ్యాప్ లేకుండా ఇద్దరు హీరోలు అలాగే మరికొంత మంది నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ అయిపోగానే మళ్ళీ యధావిధిగా హైదరాబాద్ షెడ్యూల్ కి చిత్ర యూనిట్ రానుంది.  డివివి. దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాలో హీరోయిన్స్ గురించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక తారక్ ను బాలీవుడ్ మీడియాకు త్వరలోనే పరిచయం చేయాలనీ జక్కన్న ప్రణాళికలు రచిస్తున్నారు.    Last Updated 5, Mar 2019, 6:10 PM IST
0
Oct 18,2016 చమురు వ్యాపారంలో కొనసాగుతాం:ఎస్సార్‌ పనాజీ: ఎస్సార్‌ ఆయిల్‌లో సింహ భాగాన్ని ఇతర సంస్థలకు విక్రయించి న్పప్పటికీ తాము చమురు, సహజ వాయువు వ్యాపారం నుంచి వైదలగడం లేదని ఎస్సార్‌ గ్రూపు స్పష్టతనిచ్చింది. వాటా విక్రయం వల్ల సంస్థకు భారంగా మారిన సుమారు రూ.88,000 కోట్ల రుణం సగానికి తగ్గేందుకు దోహదపడనున్నట్టుగా ఎస్సార్‌ గ్రూపు డైరెక్టర్‌ ప్రశాంత్‌ రుయా తెలిపారు. విక్రయం ద్వారా లభించే నిధులను గ్రూపులోని ఇతర వ్యాపారాల స్థిరీకరణకు, వాటి వృద్ధికి దోహదం చేస్తుందని ఆయన అన్నారు. కార్పొరేట్‌ ఇండియా చరిత్రలోనే ఇది అతిపెద్ద రుణ తగ్గింపు చర్య అన్ని ఆయన వివరించారు. గ్రూపు నేతృత్వంలో పని చేస్తున్న బ్రిటన్‌లోని స్టాన్‌లో రిఫైనరీని తాము సొంతంగా నిర్వహించనున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ రిఫైనరీ బ్రిటన్‌ మార్కెట్‌లో 12 నుంచి 13 శాతం వాటాను కలిగి ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని 'కోల్‌ బెడ్‌ మిథేన్‌' (సీబీఎం) క్షేత్రాల అన్వేషణ ఇకపై కూడా కొనసాగుతుందని ఆయన వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV సిడ్నీ టెస్టు‌: టీమ్ ఎంపికపై డైలమాలో భారత్..! రోహిత్ శర్మ.. తన భార్య రితిక ఆదివారం ఓ పండంటి ఆడబిడ్డకి జన్మనివ్వడంతో భారత్‌కి వచ్చేశాడు. దీంతో.. అతను సిడ్నీ టెస్టుకి దూరంకానుండగా.. ఆ స్థానాన్ని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో భర్తీ చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. కానీ..? Samayam Telugu | Updated: Jan 1, 2019, 02:05PM IST సిడ్నీ టెస్టు‌: టీమ్ ఎంపికపై డైలమాలో భారత్..! ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచేందుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియా.. చివరి టెస్టు కోసం జట్టు ఎంపికపై తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. మెల్‌బోర్న్ వేదికగా గత ఆదివారం మూడో టెస్టులో.. సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న భారత్ జట్టు.. సీనియర్ ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్‌పై వేటు వేసి వారి స్థానంలో కొత్త ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, హనుమ విహారీలను ఆడించింది. అయితే.. ఈ జోడీలో మయాంక్ హిట్ అవగా.. హనుమ విహారి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒకే తరహాలో పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు. దీంతో.. అతడ్ని మళ్లీ మిడిలార్డర్‌లోనే ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభంకానున్న నాలుగో టెస్టులో తుది జట్టు ఎంపికపై భారత్ ముల్లగుల్లాలు పడుతోంది. రోహిత్ శర్మ.. తన భార్య రితిక ఆదివారం ఓ పండంటి ఆడబిడ్డకి జన్మనివ్వడంతో భారత్‌కి వచ్చేశాడు. దీంతో.. అతను సిడ్నీ టెస్టుకి దూరంకానుండగా.. ఆ స్థానాన్ని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో భర్తీ చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. అయితే.. రోహిత్ శర్మ స్థానం(మిడిలార్డర్)లో మళ్లీ విహారికే అవకాశం ఇవ్వాలని కొందరు అభిప్రాయపడుతుండగా.. నాలుగో టెస్టులోనూ అతడ్నే ఓపెనర్‌గా ఆడించాలని కూడా మరికొందరు చెప్పుకొస్తున్నారు. దీనికితోడు.. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సైతం చివరి రెండు టెస్టుల్లోనూ విహారి ఓపెనర్‌గా ఆడతాడని.. ఒకవేళ అతను విఫలమైనా తర్వాత సిరీస్‌లో అతనికి మిడిలార్డర్‌లో చాలినన్ని అవకాశాలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించేశాడు. దీంతో.. టీమ్‌లో హార్దిక్ పాండ్య రావడం మినహా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ గాయం నుంచి కోలుకుని అశ్విన్ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే.. అప్పుడు జడేజా స్థానంలో అతను జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మెల్‌బోర్న్ టెస్టులో ఆడిన భారత్ జట్టు ఇదే..! విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఆజింక్య రహానె (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ( వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
SONY  Head Prasanna Krishnan ప్రాంతీయభాషల్లో కూడా వివో ఐపిల్‌ ప్రసారం హైదరాబాద్‌: సోనీ, ఇఎస్‌పిఎన్‌ హెచ్‌డి ఛానెళ్లపై వివో ఐపిఎల్‌ 2017కోసం తెలుగు సమా చారం కూడా అందిస్తున్నట్లు ఛానెల్‌ స్పోర్ట్స్‌విబాగం హెడ్‌ ప్రసన్నకృష్ణన్‌ వెల్లడించారు. సీజన్‌10 కోసం జాతీయస్థాయి వ్యూహంలో భాగంగా బెంగాలి తమి ళం, తెలుగులో కస్టమైజ్డ్‌ స్థానిక భాషల ప్రచారం అందిస్తున్నట్లు సోనిపిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. వివో ఐపిఎల్‌ పది విజయ వంతమైన సంత్సరాల వేడుకగా దస్‌సాల్‌ ఆప్‌కేనామ్‌ శీర్షికన లీగ్‌పై వీడియో అద్భుత ప్రచా రం కూడా ఉంది. ఇందుకు ఆరు వీడియోప్రచా రాలు అందిస్తున్నట్లు వివరించారు. వివో ఐపిఎల్‌కు అధీకృత టెలివిజన్‌ బ్రాడ్‌కాస్టర్‌గా సోని పిక్చర్స్‌ ఎంపిక యఅఇందని, దేశంలో టోర్నమెంట్‌ ఫ్యాన్‌బేస్‌ను మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. వివో ఐపిఎల్‌ టోర్న మెంట్‌ వచ్చేనెల ఐదవ తేదీ సోనిసిక్స్‌, సోని ఇఎస్‌పిఎన్‌; సోనీ మాక్స్‌ఛానెల్స్‌లో వస్తుందని ప్రసన్నకృష్ణన్‌ వెల్లడించారు. తెలుగులో కామెం టేటర్లు వేణుగోపాల్‌, వెంకటపతిరాజు, చంద్ర శేఖర్‌ సుధీర్‌ మహావాడి, కళ్యాణ్‌కృష్ణ, సివెంకటేష్‌ లు నియమితులైనట్లు ప్రస్నన్న వెల్లడించారు.
1
Hyd Internet 164 Views cricket australia cricket australia కొల్‌క‌త్తాః భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు రేపు ఈడెన్ గార్డెన్స్‌లో రెండో వ‌న్డే ఆడనున్నారు. ఈ క్ర‌మంలో వారికి బోజ‌నంలో బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధికారులు వడ్డించిన చికెన్ రుచించలేదు‌. చికెన్‌ను 73 డిగ్రీ సెంటిగ్రేడ్‌ వద్ద కాకుండా ఎక్కువగా వేడి చేయించవ‌ద్ద‌ని ఆస్ట్రేలియా ఆటగాళ్లు బెంగాల్‌ క్రికెట్ సంఘానికి చెప్పార‌ట‌. అయిన‌ప్ప‌టికీ చికెన్‌ను బాగా వేడి చేసేసి వడ్డించడంతో ఆసిస్ ఆట‌గాళ్లు అంస‌తృప్తి  వ్య‌క్తం చేశారు. ఈ విష‌యాన్ని వారు నిల‌దీసి అడ‌గ‌డంతో మ‌రోసారి ఇటువంటి పొర‌పాటు చేయ‌బోమ‌ని అధికారులు వారికి న‌చ్చ‌జెప్పారు. దీంతో  గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది.
2
internet vaartha 147 Views బెంగళూరు : టీమిండియా ప్రధాన కోచ్‌గా అనిల్‌ కుంబ్లే ఎంపిక తమ లాంటి యువ క్రికెటర్లకు ఎంతగానో లాభం చేకూరుస్తుందని కర్ణాటక ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ పేర్కొన్నాడు.  ఒక సలహాదారుడిగా,మరోవైపు కోచ్‌గా కుంబ్లే తమతో ఉండటం భారత జట్టు మరింత ముందుకు వెళ్లడానికి దోహదపడుతుందన్నాడు. అతని క్రికెట్‌ కెరీర్‌ అనుభవం తమతో షేర్‌ చేసుకునే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. నగరంలోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో కుంబ్లే సమక్షంలో త్వరలో వెస్టిండీస్‌కు పయనమయ్యే భారత జట్టు ప్రాక్టీస్‌ ఆరంభించింది. దీనిలో భాగంగా విండీస్‌ టూర్‌లో సభ్యుడైన కెఎల్‌ రాహుల్‌ బిసిసిఐ ఛానెల్‌తో మాట్లాడాడు. కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాడి సేవలు టీమిండియాకు లాభం చేకూరుస్తాయని, ప్రత్యే కంగా మా లాంటి యువ క్రికెటర్లు కుంబ్లే నుంచి చాలా నేర్చుకునే అవకాశం దక్కుతుంది. కాగా ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా కుంబ్లేను కలిసిన కొన్ని సందర్భాల్లోనే అతను మాతో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నాడు, టీమిండియా సభ్యులకు సొంత నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కుంబ్లే కల్పిస్తున్నాడు. అందుకు చాలా ఆనందంగా ఉంది. క్లిష్ట సమయాల్లో తప్ప మిగతా సందర్భాలలో మా నిర్ణయాలను మమ్మల్నే తీసుకోమంటున్నారు ఇది జట్టు సభ్యులు స్వేఛ్చగా ఆడటానికి ఉపయోగ పడుతుందని రాహుల్‌ వెల్లడించాడు.
2
జనగణమన రాసింది నేనే అని చెప్పిన పూరీ జగన్ Highlights డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న దర్శకుడు పూరీ జగన్ సిట్ కు తెలిసిన సమాచారమంతా ఇచ్చానన్న పూరీ జగన్  డ్రగ్స్ కాక దేశంలోని వంద సమస్యలపై జనగణమణ రాశానన్న పూరీ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న టాలీవుడ్ టాప్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాస్త రిలాక్స్ డ్ గా కనిపిస్తున్నారు. సిట్ విచారణలో సుదీర్థంగా పది గంటలకు పైగా విచారణ ఎదుర్కొన్న ఆయన.. తనకు డ్రగ్స్ అలవాటు అస్సలు లేదని స్పష్టం చేశారు. అసలు డ్రగ్స్ దందా చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. సిట్ విచారణలో చాలా ఖచ్చితంగా తనకు తెలిసిందంతా చెప్పానని తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో పేర్కొన్నారు. ఇక సిట్ నోటీసులు, విచారణ నేపథ్యంలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకునే అవకాశం తనకు దక్కిందన్నారు. తాను ఎన్నో కష్టాలు పడినా, ఎన్నో సార్లు మోసపోయినా చెడు అలవాట్లకు, తప్పుడు పనులకు లొంగలేదన్నారు. తాను చట్ట వ్యతిరేక పనులు చేసే మనిషిని కాదన్నారు. మనకు కష్టం వస్తే మన వెంట ఎవరూ నిలవరని, మనల్ని మనం నమ్ముకోవాలి తప్ప మరొకరిని నమ్ముకోవద్దని బలంగా నమ్ముతానని పూరీ అన్నారు. ఇక తాను బ్యాంకాక్ వెళ్లినప్పుడు కేవలం సినిమా స్క్రిప్ట్ రాసుకుంటానని పూరీ స్పష్టం చేశారు. ఇక డ్రగ్స్ లాంటి సమస్యలే కాక.. భారత దేశంలో సహజంగా కనిపించే వంద రకాల సమస్యలతో తాను జనగణమన అనే సినిమా రాసుకున్నానన్నారు పూరీ. త్వరలోనే జనగణ మణ సినిమాలో సమస్యలపై గళమెత్తుతానన్నారు. ఐ లవ్ ఇండియా అండ్ ఐ హేట్ ఇండియన్స్ అంటూ వుండే ట్యాగ్ లైన్ తో ఈ జనగణమణ సినిమా తెరకెక్కిస్తానన్నారు పూరీ. డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు వచ్చినపప్పుడు తనకంటే ఎక్కువ తన తమ్ముడు, కుటుంబ సభ్యులు బాధ పడ్డారని పూరీ చెప్పారు. అయితే విచారణ అనంతరం ఫ్యామిలీ కాస్త రిలాక్స్ డ్ గా వున్నారని పూరీ చెప్పారు. తాను తప్పు చేసి వుంటే సిట్ ఏ చర్యలైనా తీసుకోవచ్చని పూరీ స్పష్టం చేశారు. Last Updated 25, Mar 2018, 11:47 PM IST
0
అలా చూపించడంలో తప్పేముంది-పూనమ్ పాండే, ఇక వెబ్ లో అందాలు Highlights క్రికెట్ పై పిచ్చితో బట్టలిప్పేస్తానంటూ పూనమ్ పాండే సంచలనం అందాల ఆరబోత ఇలా వుండాలని తోటివాళ్లు  సరిగ్గా చూసుకోమని మరికొందరు కమెంట్స్ట అందాలున్నది అమ్ముకోవటానికే కదా అంటూ పూనమ్ సెట్రైస్ బాలీవుడ్ లో ఈ మద్య అడల్ట్ కంటెంట్ ఎక్కువ వున్న చిత్రాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలాంటి చిత్రాల్లో నటించడానికి బి గ్రేడ్ హీరోయిన్లు పోటీ పడి మరీ నటిస్తున్నారు.  ఇలాంటి వారిలో పూనమ్ పాండే ఒకరు. ఈ అమ్మడి పేరు సినిమాల్లో కన్నా సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అయ్యింది.  తన మత్తెక్కించే హాట్ ఫోటోలు, బోల్డ్ వీడియోలతో ఎంతో మంది అభిమానుల మతి పోగొట్టిన ఈ భామ, భారత జట్టు వరల్డ్ కప్ క్రికెట్ గెలిస్తే, న్యూడ్ ఫోటోలు దిగి కానుకగా పంపిస్తానని అప్పట్లో సంచలన ప్రకటనే చేసింది.     సంవత్సరంలో వచ్చే ప్రతి ఈవెంట్ కి తనదైన హాట్ వీడియోలు, ఫోటోలు ఏమాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా పోస్ట్ చేస్తుంది.  ఆ మద్య తెలుగు లో కూడా ఓ చిత్రంలో నటించిన పూనం పాండే తన అభిమానులకు ఓ తీపి కబురు చెప్పింది.    తన సెక్సీ ఫోటోలు, వీడియోలను వెతుక్కునే శ్రమ లేకుండా చేస్తానని చెబుతోంది.   గూగుల్ ప్లే స్టోర్ లో తన పేరిట ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చిన పూనమ్ పాండే, తన అందంపై తనకు నమ్మకముందని, అందాలున్నది అమ్ముకోవడానికేగా? అని గడుసుగా చెబుతోంది.     తనకు ఏ హీరోయిన్ పోటీ కాదని..తన అందాలు ఆరాదించే వారు., అభిమానించే వారు చాలా మంది ఉన్నారని అంటోంది.  అందాల ఆరబోతకు దిగే హీరోయిన్లకు, తనకు పోలికలే లేవని అంటోంది. వెండితెరపై వారు చేస్తున్నదే తాను సోషల్ మీడియాలో చేస్తున్నానని, అదేమీ తప్పు కాదని పూనమ్ చెబుతోంది.
0
Vaani Pushpa 126 Views mega package , NIRMALA nirmala minister న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చేవిధంగా కార్పొరేట్‌రంగానికి మంత్రి నిర్మలా సీతారామన్‌ మరికొన్ని ఉద్దీపనలు కల్పించారు. కార్పొరేట్‌రంగం ఇప్పటివరకూ చెల్లిస్తున్న పన్నును 22శాతానికి కుదించారు. మొత్తం సెస్సులు సుంకాలు అనీన కలిపితే 25.17శాతంగా ఉంటుంది. కొత్తగా ఉత్పత్తిరంగ కంపెనీలకు 15శాతం మాత్రమే పన్నులు ఉంటాయి. అయితే ఆ కంపెనీలు ఎలాంటి రాయితీలు,ప్రోత్సాహకాలను ఇకపై తీసుకునేందుకు అర్హత ఉండదు. జిఎస్‌టి మండలిసమావేశం సందర్భంగా గోవాకు వచ్చిన మంత్రి మీడియాకు ఆర్ధికరంగ ఉద్దీపనలను వివరించారు. కొత్తకంపెనీలకు 25శాతం, పాత కంపెనీలయితే 30శాతం చొప్పున చెల్లిస్తూ ఉండేవి. ఇపుడు ఆ పరిధిని తగ్గించారు. కొత్త కంపెనీలకు 15శాతం మాత్రమేనని వెల్లడించారు. కొత్తకంపెనీలకు పన్నురేటు 29.1శాతంగా అన్ని సుంకాలు సెస్సులు కలిపి ఉంటాయి. బేస్‌రేట్‌ మాత్రం 15శాతం మాత్రమే ఉంటుంది. కంపెనీ సహజంగానే సుమారు 17శాతంగా చెల్లించాల్సి ఉంటుంది. గోవాలో గనుల కార్యకలాపాలుప్రారంబం అయ్యాయని ఈ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులకు ఊతం ఇచ్చినట్లు వెల్లడించారు. కొత్త ఉద్దీపనల కారణంగా కేంద్ర ఖజానాపై 1.45 లక్షలకోట్లు భారం పడుతున్నదని మంత్రి వివరించారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలపరంగా విధించే సెస్సును ఇక పరిశోధనా సంస్థలు, ఇంక్యుబేటర్లపై కూడా విధించాలనినిర్ణయించారు. ఇక విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లకు పన్నురేటు 18.5శాతంనుంచి 15శాతానికి తగ్గించింది. సంపన్నులపై కార్పొరేట్‌ పన్నుతోపాటు ఎలాంటి సర్‌ఛార్జిలు ఉండవని వెల్లడించింది. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/
1
Apr 11,2018 15 నుంచి రాష్ట్రంలో ఈ-వే బిల్‌ అమలు న్యూఢిల్లీ: కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన వస్తుసేవల పన్నులో (జీఎస్టీ) భాగంగా అంతరాష్ట్ర సరుకు రవాణాపై అమలులోకి తేచ్చిన ఈ-వే బిల్లు విధానం వచ్చే ఆదివారం (15వ తేదీ) నుంచి తెలంగాణాతో సహా అయిదు రాష్ట్రాల్లో అమలులోకి రానుంది. జీఎస్టీ కౌన్సిల్‌ దీనికి సంబంధించి మంగళవారం ఒక ప్రకటనను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కేరళ, ఉత్తర్‌ ప్రదేశ్‌లతో పాటు ఈ-వే బిల్లు విధానం తెలంగాణాలోనూ అమలులోకి రానుందని తెలిపింది. కొత్త విధానం వల్ల పరిశ్రమలకు, వాణిజ్యానికి మేలు జరుగుతుందని సర్కారు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అంతరాష్ట్ర సరుకు రవాణాపై ఈ-వే బిల్లు విధానం ఈ నెల ఒకటో తేదీ నుంచి కర్ణాటకలో అమలవుతోంది. అయితే ఈ-వే బిల్లు విధానంపై ఇప్పటికే ట్రాన్స్‌పోర్టర్ల నుంచి పలు విమర్శలు వినవస్తున్నాయి. అయితే సర్కారు చెబుతున్న లెక్కల ప్రకారం ఏప్రిల్‌ 9వ తేదీ వరకు దాదాపు 63 లక్షల ఈ-వే బిల్లులు జారీ అయ్యాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కాన్పూర్‌లో టీమిండియాని ఓడిస్తాం: కివీస్ పుణె వన్డేలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకుని.. కాన్పూర్ వన్డేలో భారత్‌ని ఓడించి సిరీస్‌ చేజిక్కించుకుంటామని న్యూజిలాండ్ TNN | Updated: Oct 26, 2017, 02:56PM IST పుణె వన్డేలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకుని.. కాన్పూర్ వన్డేలో భారత్‌ని ఓడించి సిరీస్‌ చేజిక్కించుకుంటామని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ధీమా వ్యక్తం చేశాడు. గత ఆదివారం వాంఖడేలో జరిగిన తొలి వన్డేలో గెలిచిన న్యూజిలాండ్.. బుధవారం ముగిసిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో మూడు వన్డేల ఈ సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమమైంది. విజేత నిర్ణయాత్మక మూడో వన్డే కాన్పూర్ వేదికగా ఆదివారం జరగనుంది. ‘మా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పుణె వన్డేలో విఫలమయ్యారు. మ్యాచ్ ఆరంభంలోనే పేసర్లు భువనేశ్వర్, జస్‌ప్రీత్ బుమ్రా చక్కగా లెంగ్త్‌కి కట్టుబడి బౌలింగ్ చేశారు. దీంతో మా టాప్ ఆర్డర్ తడబడింది. ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. భారత్‌ లాంటి కఠినమైన ప్రత్యర్థిని ఓడించాలంటే మెరుగైన ప్రదర్శన చేయాలని మాకు తెలుసు. కానీ.. పుణె పిచ్‌ నుంచి మాకు సహకారం లభించలేదు. వాంఖడే విజయం తర్వాత.. పుణె వన్డేలో మాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ.. మేము వాటిని అందుకోలేకపోయాం. అయితే కాన్పూర్ వన్డేలో మాత్రం పుంజుకుని విజయం సాధిస్తాం’ అని కేన్ విలియమ్సన్ ధీమా వ్యక్తం చేశాడు.
2
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV Stock Market Today: 5 రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్ ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, విప్రో, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, గెయిల్, హీరో మోటొకార్ప్, బజాజ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. సన్ ఫార్మా దాదాపు 5 శాతం లాభపడింది. Samayam Telugu | Updated: Jan 22, 2019, 04:15PM IST హైలైట్స్ 134 పాయింట్ల నష్టంతో 36,444కు సెన్సెక్స్ 39 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 10,923 వద్ద ముగింపు సన్ ఫార్మా 5 శాతం ర్యాలీ, వేదాంత 3 శాతం డౌన్ దేశీ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. దీంతో ఇండెక్స్‌ల ఐదు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్‌ 134 పాయింట్లను కోల్పోయి 36,444 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 39 పాయింట్ల నష్టంతో 10,923 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 50 పాయింట్లు కోల్పోయి 27,482 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, హెవీవెయిట్‌ షేర్ల పతనం, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలు మార్కెట్‌ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. భారత్‌‌లో పెరుగుతున్న ద్రవ్యలోటుపై ఐఎంఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేయడం సైతం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ముఖ్యంగా మెటల్‌, ఐటీ, అటో, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 2.20 శాతం నష్టపోగా, ఫార్మా ఇండెక్స్‌ 2 శాతం లాభపడింది.
1
కనీస ఛార్జీలు అవసరం లేదు టెలికాం కంపెనీలకు ట్రా§్‌ు వివరణ ముంబయి, జూలై 22: టెలికాం సంస్థలకు ట్రా§్‌ు మరోషాక్‌ ఇచ్చింది. కాల్స్‌, డేటా వినియోగానికి కనీస ఛార్జీ లు విధించాలన్న టెలికాం సంస్థల వాదనను ట్రా§్‌ు తిరస్కరిం చింది. ప్రస్తుత పరిస్థితుల్లో కనీస ఛార్జీల అవసరం లేదని చెప్పింది. ఈమేరకు ట్రా§్‌ుఛైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ తననిర్ణయం ప్రకటించారు. టెలికాం రంగంలోని పలుసంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమా వేశం అనంతరం కనీనఛార్జీల విధింపుప్రస్తుత పరిస్థితుల్లో అనవసర మని ఆయన అన్నారు. రిలయన్స్‌జియో రాకతో నష్టాలు చవిచూసి న పలు టెలికాం కంపెనీలు ఆర్ధికంగా గట్టేక్కేందుకు కాల్స్‌,డేటాకు కనీస ఛార్జీలు విధించాలని కోరాయి. దీనిపై విచారణజరిపిన ట్రా§్‌ు కంపెనీల వాదనను తోసిపుచ్చింది. ఈ అంశంపై సుదీర్ఘంగా కసరత్తులు చేసామని తదుపరి వాదనకు అవకాశం లేదని స్పష్టంచేసింది. ఈసమావేశంలో కనీసఛార్జీలు ఉండాల్సిందేనని ఐడియాపట్టుబట్టగా ఆ వాదనను జియో తోసిపుచ్చింది. జియోరాకతో ఇతర ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌ కంపెనీలకు చమ టలు పట్టాయి. మరోవైపు ఇప్పటికే ఆర్థికంగా కుదలైన ఆయా టెలికాంకంపెనీలకు నేడు రిలయన్స్‌ అధి నేత ముఖేష్‌ అంబానీ మరోషాక్‌ ఇచ్చారు.ఉచితంగానే జియోఫోన్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించడంతో అన్ని టెలికాం కంపెనీలషేర్లు భారీగాపతనమయ్యాయి. అదేసమయంలో రిలయన్స్‌షేర్లు ర్యాలీతీసాయి.
1
Visit Site Recommended byColombia గుంటూరు జిల్లా ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రెస్‌మీట్ నిర్వహించిన జగన్.. జనసేనాని గురించి మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయం పవన్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ ప్రశ్నించారు. జగన్ మాట్లాడుతూ.. ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హోదా కోసం ఎన్నేళ్లలో ఏ ధర్నాలు చేశారు. ఏ దీక్షలు చేశారు. ఏం దీక్షలు చేశారు. ఢిల్లీలో ఏం ఒత్తిడి తీసుకువచ్చారు. ఇన్నేళ్లుగా చేసింది ఏంటంటే.. ఆరు నెలలకు ఒకసారి బయటకు వస్తాడు. ఓ ట్వీట్ చేస్తాడు. లేదంటే చంద్రబాబుకి అవసరం వస్తే.. ఆయన పిలిస్తే ఒక టూర్ పెడతాడు చంద్రబాబుకి మద్దతు తెలుపుతారు అన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలో సినిమా తక్కువ, ఇంటర్వెల్ ఎక్కువ అంటూ ఛలోక్తులు విసిరారు. మనం సినిమాకు పోతే ఇంటర్వెల్ 10 నిమిషాలు వస్తుంది. సినిమా రెండున్నర గంటలు వస్తుంది. కాని ఈయన రియల్ లైఫ్ సినిమాలో ఇంటర్వెల్ రెండున్నర గంటలు.. సినిమా 10 నిమిషాలు మాత్రమే. ఈ నాలుగేళ్ల నుండి మనం చూసిన సినిమా ఇదే అంటూ పవన్‌పై పంచ్‌లు పేల్చారు. పవన్ కళ్యాణ్ అనే మేధావి 2014న ఎన్నికల్లో బాబుకి, మోడీకి ఓటేయమని అడిగాడా లేదా? రాష్ట్రాన్ని ముంచాడా లేదా? రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటే ఈయన పాత్ర ఉందా లేదా?.. ఒక్క హోదా విషయంలోనే కాదు చంద్రబాబు రాష్ట్రానికి చేసిన అన్యాయాల్లో పవన్‌కు కూడా భాగస్వామ్యం ఉందన్నారు. బాబుతో జతకట్టి ఊరూరా తిరిగాడు వీళ్లకు ఓటేయండి అని... ఇప్పుడే ఈ మేధావి బాబు, బీజేపీ ముంచేశాయని అంటున్నాడు. కొత్త పార్టీ పెట్టి.. రాజకీయ లబ్ధికోసం బీజేపీ, బాబు రాష్ట్రానికి అన్యాయం చేశాయి అంటున్నాడు. ఇదీ ఈ మేధావి గారు ఇచ్చే సలహాలు.. ఇదీ ఈ మేధావి ఇచ్చే సలహాల్లో ఉన్న డెప్త్ అంటూ పవన్ కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు జగన్.
0
Visit Site Recommended byColombia ‘టీమిండియాకి ప్రతిభావంతమైన బౌలింగ్ లైనప్ ఉంది. ఆ జట్టు సీమర్స్‌కి స్వదేశంలో కంటే దక్షిణాఫ్రికా వాతావరణం బాగా అనుకూలిస్తుంది. అందుకే.. ఈ సిరీస్‌లో భారత బౌలర్లు ఎలాంటి ప్రదర్శన ఇస్తారోనని ఆసక్తి సర్వత్రా నెలకొంది. విదేశీ పిచ్‌ కాబట్టి.. బౌలింగ్‌లో లైన్ అండ్ లెంగ్త్‌ని వేగంగా అందుకోలేరు. కానీ.. ఒక్కసారి లయ అందుకుంటే మాత్రం.. సత్తాచాటగలరు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి వరల్డ్ క్లాస్ ప్లేయర్. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అతను చేసిన ప్రదర్శనని నేను స్వయంగా చూశాను. పట్టుదలతో కోహ్లి తాను అనుకున్నది సాధిస్తున్నాడు. మరికొంతకాలంగా అతని జోరు కొనసాగొచ్చు’అని కలిస్ వివరించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
internet vaartha 340 Views న్యూఢిల్లీ : దేశంలో యువతను ఎక్కువ ఆకట్టుకునేవిధంగా రూపిఒందించిన టిబుక్‌ ప్రీమియమ్‌ స్మార్ట్‌ఫోన్‌, టిఫోన్‌లను ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ఆవిష్కరించారు. తేలికపాటి 5.5 అంగుళాల స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌ పిసి తరహాలో అల్ట్రాబుక్‌ మార్కెట్‌లో వాటా పెంచుకోగలవని చెపుతున్నారు. తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా సచిన్‌ తెందూల్కర్‌ను నియమించుకున్నట్లు కంపెనీ వ్యవస్థాపక ఛైర్మన్‌ లింగారెడ్డి మహేష్‌ వెల్లడించారు. ఈకార్యక్రమంలో ఎండి రోహిత రాఠీ, సహవ్యవ స్థాపకుడు ఎండి నర్సిరెడ్డి తదితరులున్నారు. గాడ్జెట్‌ 360పై ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటిం చింది. స్మార్ట్రాన్‌ హైదరాబాద్‌, బెంగళూరుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆర్‌అండ్‌డి కార్యకలాపాలకు పదిమిలియన్‌ డాలర్లు వెచ్చించింది. వచ్చే రెండేళ్లలో 100 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. టిబుక్‌, టిఫోన్‌ వంటి వాటితోపాటు మరికొన్ని ఉత్పత్తులు విడుదలచేస్తామని కంపెనీ ప్రకటించింది. ఇంటెల్‌కోర్‌ ఎం ప్రాసెసర్‌తో పాటు విండోస్‌ 10 నిర్వహణ వ్యవస్థ టిబుక్‌పై ఉంది.
1
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Neena Gupta: సినిమాలో నన్ను, రమ్యకృష్ణని తీసుకోవచ్చుగా? తాప్సి, భూమి పెడ్నేకర్ నటించని ‘సాండ్ కీ ఆంఖ్’ సినిమా చిత్రబృందంపై మండిపడుతున్నారు నటి నీనా గుప్తా. తన వయసు పాత్రల్లోనైనా తనను ఎంపిక చేసుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. Samayam Telugu | Updated: Sep 24, 2019, 01:59PM IST Neena Gupta: సినిమాలో నన్ను, రమ్యకృష్ణని తీసుకోవచ్చుగా? హీరోయిన్లు అమ్మల పాత్రల్లో నటించడానికే భయపడుతుంటారు. ఎక్కడ తమ కెరీర్ ఆ పాత్రలకే పరిమితం అయిపోతుందోనని. కానీ బాలీవుడ్ నటులు తాప్సి, భూమి పెడ్నేకర్ మాత్రం ఏకంగా 60 ఏళ్ల బామ్మల పాత్రల్లో నటించడానికి ముందుకొచ్చారు. అలా వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో ‘సాండ్ కీ ఆంఖ్’ సినిమా తెరకెక్కింది. తుషార్ హీరానందని సినిమాకు దర్శకత్వం వహించారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మహిళా షార్ప్ షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్‌ల జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. READ ALSO: Bigg Boss 13: నాతో ప్రాబ్లమ్ ఉంటే నన్ను బ్యాన్ చేయండి: సల్మాన్ సోమవారం సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ ట్రైలర్‌పై ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో ఈ సినిమా చిత్రబృందం చిక్కుల్లో పడింది. ‘నాకు తాప్సి, భూమి పెడ్నేకర్‌ల నటన నచ్చింది. కానీ అవి బామ్మల పాత్రలు కాబట్టి నీనా గుప్తా, రమ్యకృష్ణలను ఎంపిక చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది’ అని నెటిజన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందుకు నీనా గుప్తా స్పందిస్తూ.. ‘నాకూ అదే అనిపించింది. కనీసం మా వయసుకు తగ్గ పాత్రల్లోనైనా మమ్మల్ని ఎంపిక చేసుకోండయ్యా’ అని మండిపడ్డారు. ఈ ట్వీట్ చూసిన మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘ముందు ఈ సినిమా కంగన రనౌత్‌కు దక్కింది. కానీ ఆమె మిమ్మల్ని తీసుకోవాలని దర్శకుడికి చెప్పారు’ అని అన్నారు. ఈ ట్వీట్‌పై కంగన సోదరి రంగోలీ స్పందిస్తూ.. ‘నీనా జీ ముందు ఈ సినిమా ఆఫర్ కంగనకు వచ్చింది. కానీ మిమ్మల్ని కానీ రమ్యకృష్ణను కానీ తీసుకోవాల్సిందిగా కంగన కోరింది. కానీ ఇప్పటికీ బాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శకుల ఆలోచనలు ఇంకా మారలేదు. మిమ్మల్ని తీసుకుంటే ఎక్కడ సినిమా ఆడదోనని యువ నటీమణులకు అవకాశం ఇచ్చారు. వృద్ధుల పాత్రల్లో యువ నటీనటులను తీసుకుంటే మన భారతదేశ చిత్ర పరిశ్రమ ఇలాగే ఉంటుంది. ఫెమినిజం పేరుతో సెక్సిజంను ప్రమోట్ చేస్తున్న బాలీవుడ్‌కు సిగ్గులేదు’ అని మండిపడ్డారు. నీనా గుప్తా, రంగోలీ ఇలా అనడంలో తప్పు లేదు. సినిమాలో నటించిన తాప్సి, భూమిలది కూడా తప్పు లేదు. ఎందుకంటే వారికి కాన్సెప్ట్ నచ్చి సినిమాకు ఒప్పుకున్నారు. READ ALSO: సాండ్ కీ ఆంఖ్ ట్రైలర్: ఇద్దరు బామ్మలు.. గురిచూసి కొడితే బుల్లెట్ దిగాల్సిందే ఇక్కడ తప్పంతా ‘సాండ్ కీ ఆంఖ్’ దర్శకుడు, నిర్మాతది. సినిమాలో బామ్మలదే ప్రధాన పాత్ర అయినప్పుడు వారి వయసువారినే తీసుకోవాలి కానీ హీరోయిన్లు ఎంపిక చేసుకోవడమేంటో. నిజానికి వారి పాత్రల్లో నీనా గుప్తా, రమ్యకృష్ణ నటించి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. దీపావళికి విడుదల కానున్న ‘సాండ్ కీ ఆంఖ్’ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటోందో చూడాలి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
ind vs ban 1st t20: shikhar dhawan, washington sundar take india to 148/6 భారత్‌తో తొలి టీ20లో బంగ్లా టార్గెట్ 149 భారత్ ఇన్నింగ్స్‌ని కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆరంభించగా.. ఆఖరి రెండు ఓవర్లలో కృనాల్‌ పాండ్య , వాషింగ్టన్ సుందర్ భారీ షాట్లు ఆడి మెరుగైన స్కోరు అందించారు. Samayam Telugu | Updated: Nov 3, 2019, 08:59PM IST India's Shikhar Dhawan ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఆశించిన మేర దూకుడుగా ఆడలేకపోయారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (41: 42 బంతుల్లో 3x4, 1x6) మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగలిగింది. భారీ అంచనాల మధ్య తొలి మ్యాచ్ ఆడిన యువ పవర్ హిట్టర్ శివమ్ దూబే (1) తేలిపోయాడు. Visit Site Recommended byColombia మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (9: 5 బంతుల్లో 2x4) తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు బాది ఔటైపోయాడు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ (15: 17 బంతుల్లో 2x4) బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమై వికెట్ చేజార్చుకోగా.. శ్రేయాస్ అయ్యర్ (22: 13 బంతుల్లో 1x3, 2x6) సిక్స్ కొట్టే ప్రయత్నంలో ఔటైపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (27: 26 బంతుల్లో 3x4) 19వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచినా.. ఆశించిన మేర పరుగులు రాబట్టలేకపోయాడు. కానీ.. చివరి రెండు ఓవర్లలో కృనాల్‌ పాండ్య (15 నాటౌట్: 8 బంతుల్లో 1x4, 1x6), వాషింగ్టన్ సుందర్ (14 నాటౌట్: 5 బంతుల్లో 2x6) భారీ షాట్లు ఆడి మెరుగైన స్కోరుని టీమ్‌కి అందించారు.
2
TCS రూ.16వేల కోట్ల టిసిఎస్‌ షేర్ల బైబాక్‌! ముంబై: సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టిసిఎస్‌ తన బోర్డు సమావేశంలో మొత్తం షేర్ల బైబాక్‌కు ఆమోదం తెలిపింది. మొత్తం 5,61,40,351 ఈక్విటీషేర్లను కొనుగోలుచేసేందుకు టిసిఎస్‌ బోర్డు సోమవారం ఆమోదించింది. వీటి విలువ 16వేల కోట్ల రూపాయలు విలువ ఉంటుంది. మొత్తం కంపెనీ అధీకృత మూలధనంలో 2.85శాతంగా ఉంది. ప్రతి వాటాకు ప్రస్తుతం 2850 రూపాయలు ధరగా ఉంది. కంపనెఈ వాటాదారులు కంపెనీ ప్రమోటర్లు ప్రస్తుత సంస్థాగత వాటాదారుల వివిధ వర్గాల నిష్పత్తి ఆధారంగా జరుగుతుంది. స్టాక్‌ ఎక్ఛేంజి విధానాలను అనుసరిస్తూ టెండర్‌ ఆఫర్‌ మార్గంలో షేర్లను బైబాక్‌ చేస్తుంది. సెబి బైబాక్‌ సెక్యూరిటీస్‌ నియమనిబంధనల చట్టం 1998 ప్రకారం జరుగుతుందని, కంపెనీల చట్టం 2013 నిబంధనలకు లోబడి కొనుగోళ్లు ఉంటా యని టిసిఎస్‌ ప్రకటించింది. అయితే ఈ బైబాక్‌కు సంబంధించి సలహాఫీజులు, బహిరంగ ప్రకటన ప్రచురణ ఖర్చులు, ముద్రణ పంపిణీఖర్చులు వంటివి వీటిలో కలపదని కంపెనీ ప్రకటించింది. టిసిఎస్‌ వాటాలు 4.08శాతం పెరిగి 2506.50 రూపాయల చొప్పున కొనసాగింది. 2004లో కంపనీ జాబితా అయిన తర్వాత బైబాక్‌ మొట్టమొదటిసారి కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు మాత్రం భారతీయ ఐటికంపెనీలు బైబాక్స్‌, డివిడెండ్లు ఎక్కువకాలం ప్రకటించి తమ సంపదను పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. వీటికితోడు టిసిఎస్‌ ప్రస్తుత సిఇఒ చంద్రశేఖరన్‌కు ఇదే చివరి బోర్డు సమావేశం అని భావించాలి. అతిత్వరలోనే ఆయన టాటాసన్స్‌బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో టిసిఎస్‌ షేర్ల బైబాక్‌ ప్రకటించడం కార్పొరేట్‌ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
1
‘కపిల్‌ దేవ్‌ ఎక్కడికెళ్లినా ఫాలో అవుతా’ ‘83’ సినిమాపై రణ్‌వీర్‌ సింగ్‌ ముంబయి: లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ ఎక్కడికి వెళ్లినా నీడలా ఆయన్ని ఫాలో అవుతానని అంటున్నారు బాలీవుడ్ ‌నటుడు రణ్‌వీర్‌ సింగ్‌. 1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో టీమిండియా ప్రపంచ కప్‌ సాధించిన నేపథ్యంలో ఓ బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘83’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం తాను ఎలా సన్నద్ధమవుతున్నాడో వివరిస్తూ ఓ ఆంగ్ల మీడియాతో రణ్‌వీర్‌ ఆసక్తికర విషయాలను తెలిపారు. ‘కపిల్‌ దేవ్‌ నీడలా మారాలనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్లినా ఫాలో అవుతూ ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటా. బౌలింగ్‌, బ్యాటింగ్‌ తీరు ఎలా ఉండేదో  తెలుసుకుంటా. ఓ సినిమా కోసం నేను ఇలాంటి కసరత్తు ఎప్పుడూ చేయలేదు. ఇదే తొలిసారి. ఎందుకంటే.. ఇది మన టీమిండియా విజయకేతనానికి సంబంధించిన చిత్రం. ఒకరి బయోపిక్‌లో నటించబోతున్నందుకు ఆ వ్యక్తితోనే సమయం గడపాలనుకుంటున్నాను’ అని వెల్లడించారు. ‘83’ సినిమాకు కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్‌ గవాస్కర్‌ పాత్రలో తహీర్‌ రాజ్‌ భాసిన్‌, అప్పటి టీమిండియా మేనేజర్‌ మాన్‌ సింగ్‌ పాత్రలో పంకజ్‌ త్రిపాఠి, క్రికెటర్లు సందీప్‌ పాటిల్‌ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్‌ పాటిల్‌, శ్రీకాంత్‌ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్‌ కిర్మాణి పాత్రలో సాహిల్‌ ఖట్టర్‌, బల్వీందర్‌ సింగ్‌ పాత్రలో అమ్మీ విర్క్‌, మొహీందర్‌ అమర్‌నాథ్‌ పాత్రలో సకీబ్‌ సలీం నటిస్తున్నారు. 2020 ఏప్రిల్‌ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. Tags :
0
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV బాలీవుడ్ నటుడి కన్నుమూత బాలీవుడ్ నటుడు సయీద్ జాఫ్రీ(86) అనారోగ్యంతో కన్నుమూశారు. TNN | Updated: Nov 16, 2015, 08:01PM IST బాలీవుడ్ నటుడు సయీద్ జాఫ్రీ(86) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జాఫ్రీ ఆదివారం మృతిచెందినట్లు ఆయన సమీప బంధువు షాహీన్ అగర్వాల్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. జాఫ్రీ శకం ముగిసిందంటూ ఆమె చేసిన పోస్ట్ బాలీవుడ్‌ని దిగ్భాంతికి గురిచేసింది. శత్రంజ్ కే ఖిలాడీ, రామ్ తేరీ గంగా మైలీ వంటి చిత్రాలు జాఫ్రీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. శత్రంజ్ కే ఖిలాడీ సినిమాలో జాఫ్రీ చేసిన సపోర్టింగ్ క్యారెక్టర్ ఆయనకి ఫిలింఫేర్ అవార్డుని కూడా సంపాదించిపెట్టింది.
0
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV టాస్ గెలిచిన ధోనీ.. ఛేజింగ్‌కే మొగ్గు! రెండో వన్డేలో ఛేజింగ్‌లో తడబడినప్పటికీ ధోనీ మాత్రం మొహాలీ వన్డేలోనూ ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు. TNN | Updated: Oct 23, 2016, 01:33PM IST టాస్ గెలిచిన ధోనీ.. ఛేజింగ్‌కే మొగ్గు! న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత కెప్టెన్ ధోనీ మరోసారి టాస్ నెగ్గాడు. ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో ఛేజింగ్‌లో తడబడి ఓటమిపాలైనప్పటికీ కీలకమైన మూడో వన్డేలోనూ లక్ష్యసాధనకే అతడు మొగ్గు చూపాడు. ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, రెండో వన్డేలో కివీస్ గెలుపొందింది. ఢిల్లీ వన్డేలో విజయంతో విలియమ్సన్ సేన ఈ టూర్లో తొలిసారిగా బోణీ చేసింది. మొహాలీ వన్డే కోసం న్యూజిలాండ్ ఓ మార్పు చేసింది. మైదానంలో పచ్చిక ఉండటంతో స్పిన్నర్ డెవ్‌సిచ్ స్థానంలో నీషామ్‌ను తుది జట్టులోకి తీసుకుంది. జ్వరంగా కారణంగా సురేష్ రైనా ఈ వన్డేలోనూ బరిలో దిగడం లేదు. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్, న్యూజిలాండ్ చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీలుగా నిలిచాయి. దీంతో మొహాలీ వన్డే కీలకంగా మారనుంది. మొహాలీలో భారత్ ఇప్పటి వరకూ 13 వన్డే మ్యాచ్‌లు ఆడగా.. ఎనిమిదింటిలో నెగ్గి, ఐదు మ్యాచ్‌లలో ఓడింది. మొహాలీలో మూడు మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ రెండింట్లో నెగ్గి, ఒక మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈ వేదికపై భారత్, కివీస్ జట్లు వన్డేల్లో తలపడటం ఇదే తొలిసారి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
News Room 365 WATCH LIVE TV బిగ్ బీ అంటే ఎందుకంత కోపం ? బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునేకి బిగ్ బి అమితాబ్ అంటే ఎందుకంత కోపం ? TNN | Updated: Jul 24, 2015, 09:05PM IST బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునేకి బిగ్ బి అమితాబ్ అంటే ఎందుకంత కోపం ? ఆయన్ని చూస్తేనే ఆమె పక్కకు తప్పుకుంటోందెందుకు ? బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పికు లో తనకు తండ్రిగా నటించిన బిగ్ బీకి ఆమె ఎందుకు అంత దూరంగా వుండాలనుకుంటోంది ? ఇప్పుడు బాలీవుడ్ లో ఎవరి నోట విన్నా ఇవే సందేహాలు. అందుకు కారణం ఆమె వ్యవహరశైలే అని తెలుస్తోంది.. పికు సినిమా సక్సెస్ మీట్ సెలెబ్రేట్ చేసుకున్న దీపికా... ఆ పార్టీకి అందరినీ ఆహ్వానించింది కానీ బిగ్ బీని పిలవలేదు. ఆ తర్వాత ఇదే విషయమై ఆమెని మీడియా వివరణ కోరగా.. పొరపాటున మర్చిపోయానని, ఆ తప్పు చేసినందుకు ఇప్పటికీ తనని తాను క్షమించుకోలేకపోతున్నానని చెప్పింది. దీంతో ఇక సమస్యకి ఫుల్ స్టాప్ పడిందనుకుంటుండగానే.. మళ్లీ ఇంతలోనే ఆమె ఓ సినిమాకు సైన్ చేసినట్లే చేసి నో చెప్పింది. ప్రముఖ ఆన్ లైన్ మీడియా డీఎన్ఏ కథనం ప్రకారం విజయ్ కృష్ణ ఆచార్య సినిమాలో నటించడానికి అంగీకరించిన దీపికా.. ఆ తర్వాత నో చెప్పింది. అయితే తన తర్వాత అదే సినిమాకు బిగ్ బీ కూడా సైన్ చేయడమే ఆమె ఈ ఆఫర్ ని తిరస్కరించడానికి ప్రధాన కారణం అని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ మీడియా ప్రముఖంగా చెప్పుకుంటున్న ఈ గాసిప్స్ పై దీపికా ఈసారి ఏమని స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి.
0
Hyd Internet 122 Views Ashok Leyland Ashok Leyland హైదరాబాద్‌: కమర్షియల్‌ వాహనాలను రూపొందించే అశోక్‌లేలాండ్‌ సంస్థ మరో వాహనాన్ని హైదరాబాద్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘దోస్త్‌ పేరిట రూపొందించిన ఈ లైట్‌ కమర్షియల్‌ వెహికల్‌ వ్యాపార రంగంలో విజయవంతం అవుతుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సుమారు 2 నుంచి 3.5 టన్నుల సామర్థ్యం కలిగిన వాహనం. హైదరాబాద్‌ షోరూంలో మార్కెట్‌ ధర రూ.5.4లక్షలు ఉంటుందని ప్రతినిధులు తెలిపారు. రెండేళ్ళ వారెంటీతో ఈ దోస్త్‌ వాహనం లభిస్తుంది. ఈ తరహా వాహనాలతో పోల్చుకుంటే 7శాతం లోడింగ్‌ స్థలం కూడా ఎక్కువగా ఉంటుందని ప్రతినిధులు వెల్లడించారు. మార్కెటల్లో తమ సంస్థకు చెందిన సుమారు 17లక్షల వాహనాలు సేవలందిస్తున్నాయని ఆ సంస్థ ప్రెసిడెంట్‌ నితిన్‌ సేత్‌ తెలిపారు.
1
సిట్ విచారణకు హాజరైన ముమైత్ ఖాన్ Highlights డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన ముమైత్ ఖాన్ సిట్ కార్యాలయానికి చేరుకున్న ముమైత్ డ్రగ్స్ తో ముమైత్ కు, టాలీవుడ్ కు వున్న లింక్స్ పై సిట్ ఆరా డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న ఐటమ్ బాంబ్ ముమైత్ ఖాన్ సిట్ విచారణకు హాజరైంది. ఉదయం 9.45 నిమిషాలకే సిట్ కార్యాలయానికి చేరుకుంది ముమైత్. తన వెంట బిగ్ బాస్ షో ప్రతినిధులు కారులో సిట్ ఆఫీస్ వరకు వచ్చారు. ఇక సిట్ విచారణలో ముమైత్ మరింత సమాచారం వెల్లడిస్తుందని, కెల్విన్ తో వున్న సంబంధాలపైనే కాక మరింత సమాచారం లభిస్తుందని సిట్ భావిస్తోంది. ప్రస్థుతం బిగ్ బాస్ హౌజ్ లో పార్టిసిపెంట్ గా వున్న ముమైత్ ప్రత్యేక అనుమతితో సిట్ విచారణకు హాజరైంది. Last Updated 26, Mar 2018, 12:02 AM IST
0
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2
Suresh 158 Views కోహ్లీ, నెహ్రాలపై యువరాజ్‌ వ్యాఖ్య ముంబై: మనకు తెలిసిన కోహ్లీ ఒక రన్‌ మిషన్‌,అంతకు మించి టార్గెట్‌ను చేధించడంలో మొనగాడు.కాగా క్రీజులో అడుగుపెట్టాడంటే ఎంత పెద్ద టార్గెట్‌ అయినా అలుపు సొలుపు లేకుండా ఛేదించగలడు.అయితే టీమ్‌ ఇండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ కోహ్లీ గురించి ఎవరికీ తెలియని ఒక విషయం వివరిం చాడు.అదేంటంటే కోహ్లీ చాలా పిసినారి అని.ప్రస్తుతం టీమ్‌ ఇండియా జట్టు మొత్తం కోహ్లీనే అందరి కంటే పెద్ద పిసినారి అని కామెంట్‌ చేశాడు యువరాజ్‌.ఆ తరువాత పిసినారి స్థానం నెహ్రాది అని వివరించాడు. క్రికెటర్స్‌ అంతా కలిసి బయటకు వెళ్లినపుడు జేబులో నుంచి పర్స్‌ బయటకు తీయడానికి వెనకాడేవాడట కోహ్లీ.కాగా అతని చేత డబ్బులు బయటకు తీయించడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చేదని వెల్లడించాడు యువరాజ్‌.ఇన నెహ్రా అయితే తనకు ఫ్యామిలీ ఉంది కాబట్టి తాను ఎక్కువగా ఖర్చు పెట్టలేనని అర్థం చేసుకోవాలని చెప్పేవాడని,ఒక రేడియో కార్యక్రమంలో పాల్గొన సందర్భంగా టీమ్‌ ఇండియా క్రికెటర్ల గురించి ప్రస్తావిస్తూ కోహ్లీ, నెహ్రా ఇద్దరూ పిసినారే అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు యువరాజు. అయితే ఇదంతా సరదాగా మాత్రమే జరిగిందని పేర్కొన్నాడు.ఇక తనకంటే సీనియర్లయిన క్రికెటర్లలోనూ పిసినారులు చాలానేఉన్నారని వెల్లడించిన యువరాజ్‌ వాళ్ల పేర్లు బయట పెట్టడానికి మాత్రం ఇష్టపడలేదు.
2
Nov 04,2015 ఐఓసీ నష్టాలు రూ.329 కోట్లు      న్యూఢిల్లీ: చమురు ధరలు పడిపోవడంతో ప్రభుత్వ రంగం చమురు సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసి) నష్టాలను మూట గట్టుకుంది. 2015-16 జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో సంస్థ రూ.329 కోట్ల నష్టాలను నమోదు చేసుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ ఏకంగా రూ.898.46 కోట్ల నికర నష్టాలు చవి చూసింది. చమురు ధరల క్షీణత వల్లే క్రితం క్యూ2లో కంపెనీ టర్నోవర్‌ రూ.1,11,663 కోట్ల నుంచి రూ.85,385 కోట్లకు దిగజారిందని కంపెనీ పెర్కొంది. కాగా మంగళవారం బీఎస్‌ఈ లో ఐఓసీ షేర్‌ విలువ 1.18 శాతం పెరిగి రూ.401.45 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అశ్విన్‌ రికార్డుకి వికెట్ దూరంలో చాహల్ భారత మణికట్టు స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ టీ20 ఫార్మాట్‌లో అరుదైన రికార్డుల్ని నెలకొల్పుతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక TNN | Updated: Dec 24, 2017, 04:12PM IST అశ్విన్‌ రికార్డుకి వికెట్ దూరంలో చాహల్ భారత మణికట్టు స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ టీ20 ఫార్మాట్‌లో అరుదైన రికార్డుల్ని నెలకొల్పుతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత అందుకున్న చాహల్.. సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌ రికార్డుకి ఒక వికెట్ దూరంలో నిలిచాడు. వాంఖడేలో ఆదివారం రాత్రి శ్రీలంకతో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. గత శుక్రవారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో చాహల్ 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. 2016లో రవిచంద్రన్ అశ్విన్ 23 వికెట్లతో ఒక ఏడాదిలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కగా.. తాజాగా చాహల్ 11 మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లతో ఆ రికార్డుని సమం చేశాడు. వాంఖడేలో చాహల్ మరొక వికెట్ తీస్తే.. ఒక ఏడాదిలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవనున్నాడు. చాహల్ తర్వాత స్థానంలో అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ 17 వికెట్లతో ఉన్నాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
Mar 24,2017 ప్రాంతీయ ఉనికిపై సోనీపిక్చర్స్‌ దృష్టి నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: తెలుగు ఫీడ్‌ ద్వారా తమ ప్రాంతీయ ఉనికిని బలోపేతం చేసుకోవాలని సోనీపిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా నిర్ధేశించుకుంది. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ బిజినెస్‌ హెడ్‌ ప్రసన్న కృష్ణన్‌ మాట్లాడుతూ సోనీ ఇఎస్‌పీఎన్‌, సోనీ ఇఎస్‌పీఎన్‌ హెచ్‌డీ ఛానెల్స్‌పై వీవో ఐపీఎల్‌ 2017 కోసం తెలుగు ఫీడ్‌ ద్వారా ప్రాంతీయ ఉనికి బలోపేతంపై దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. గత సంవత్సరంలో 361 మిలియన్‌ వీక్షకులను సంపాదించుకుందన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి అనుహ్యమైన స్పందన లభిం చిందన్నారు. వీవో 2017 కోసం తెలుగు ఫీడ్‌ను అనుసంధానించడం కొనసాగిస్తున్నామన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
హిట్లరే పోయాడు... ఈ బీజేపీ ఎంత?: ప్రకాష్ రాజ్ Highlights సర్వ ధిక్కార ధోరణి ఎంతో కాలం ఉండదు తప్పుడు హామీలతో ప్రజలను బీజేపీ మభ్యపెడుతోంది మతతత్వాన్ని పెంచి పోషిస్తోంది బీజేపీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ధ్వజమెత్తారు. తప్పుడు హామీలతో దేశ ప్రజలను బీజేపీ మభ్యపెడుతోందని మండిపడ్డారు. సర్వ ధిక్కార ధోరణి అనేది కొన్ని రోజుల వరకు మాత్రమే పరిమితమని... ఎంతో కాలం కొనసాగదని చెప్పారు. హిట్లర్ లాంటి వారి ఆధిపత్యమే కూలిపోయిందని... ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంత అంటూ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే గంగానదిని స్వచ్ఛంగా మారుస్తామంటూ బీజేపీ చెప్పిందని... అధికారంలోకి వచ్చాక కొంతమేర పనులు చేపట్టి, ఆ తర్వాత చేతులు దులిపేసుకుందని విమర్శించారు. మతత్వాన్ని పెంచి పోషిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. దక్షిణ కన్నడలోని మంజేశ్వరలో ఉన్న శాంతి సేనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.  Last Updated 25, Mar 2018, 11:51 PM IST
0
Suresh 183 Views భారత్‌లో 240కి రీనాల్డ్‌ బ్రాండ్‌ నెట్‌వర్క్‌ న్యూఢిల్లీ  రీనాల్ట్‌ ఇండియా భారత్‌లో తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్టు ప్రకటించింది.. ఈ ఏడాది చివరినాటికి 240 కేంద్రాలకు పైగా ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం తమ బ్రాండ్‌ డీలర్‌షిప్‌ కేంద్రాలు 208 వరకూ ఉన్నాయని వీటిని 240కి పెంచుతున్నట్టు కంపెనీ వివరించింది.. ఈ ఏడాది మార్కెట్‌ చాలా ఐదు శాతంగా ఉంటుందని, టెస్ట్‌డ్రైవ్‌, విక్రయానంతర సేవలు, డెలివరీ వంటి అన్ని విభాగాల్లో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా సేవలు ఉంటాయని ప్రకటించింది.. అంతేకాకుండా రేనాల్ట్‌ స్టోర్‌ కొత్త తరం డాలర్‌షిప్‌ ఔట్‌లెట్లుగా మారుస్తోంది.. చెన్నై సమీపంలోని ఒరుగడమ్‌ తయారీ కేంద్రంలో సాలీనా 4.80 లక్షల యూనిట్లను రీనాల్ట్‌ ఇండియా ఉత్పత్తిచేస్తోంది. భారత్‌ మార్కెట్లలో ఏడుమోడల్స్‌ అందిస్తున్నామని , ప్రీమియం సెడాన్‌, లగ్జరీ ఎన్‌యువి కొలెన్‌, ప్రీమియం కాంపాక్ట్‌ కార్‌ పల్స్‌, సెగ్మెంట్‌బ్రేకర్‌ ఎస్‌యువి డస్టర్‌, సెడాన్‌ స్కాలా, ఎంపివి లాడ్జీ కొత్తగా రేనాల్ట్‌ క్విట్‌ వంటివాటిని భారత మార్కెట్‌కు చేరవచేసినట్టు రీనాల్ట్‌ కార్పొరేట్‌ ప్రతినిధి జతిన్‌ అగర్వాల్‌ వివరించారు.
1
India vs New Zealand: Jasprit Bumrah is a thinking bowler, says Ravi Shastri బుమ్రా మరోసారి ప్రూవ్ చేశాడు: రవిశాస్త్రి మ్యాచ్‌ గమనానికి అనుగుణంగా బౌలింగ్ చేయడంలో భారత్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సిద్ధహస్తుడని జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. TNN | Updated: Nov 8, 2017, 04:19PM IST మ్యాచ్‌ గమనానికి అనుగుణంగా బౌలింగ్ చేయడంలో భారత్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సిద్ధహస్తుడని జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. న్యూజిలాండ్‌తో మంగళవారం రాత్రి జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 9 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడంతో భారత్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా మ్యాచ్‌ని 8 ఓవర్లకి కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో కివీస్ 61/6కే పరిమితమైంది. ‘జస్‌ప్రీత్ బుమ్రా నుంచి అసాధారణ ప్రదర్శన‌ని మూడో టీ20లో చూశాం. అతను తన అస్త్రాలన్నీ ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్‌‌పైకి ప్రయోగించాడు. మ్యాచ్‌ గమనానికి అనుగుణంగా బంతిని విసిరేముందు తను తెలివిగా ఆలోచిస్తానని మరోసారి బుమ్రా నిరూపించాడు. చివర్లో 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో భారత్ జట్టుపై ఒత్తిడిలేదని నేను చెప్పను. కానీ.. రెండు మూడు బంతుల్లోనే మ్యాచ్ స్వరూపం మారిపోయే అవకాశం ఉన్నందున జట్టు ఫీల్డింగ్ ఎలాంటి తప్పిదాలు చేయకుండా జాగ్రత్తపడింది. 67 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోగలమని భారత్ విశ్వసించింది’ అని రవిశాస్త్రి వివరించాడు.
2
Hyderabad, First Published 22, Oct 2018, 10:25 AM IST Highlights ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారులో ప్రయాణిస్తుండగా ఓ యాక్సిడెంట్ జరిగింది. ఆయన ప్రయాణిస్తోన్న కారు ఓ బైక్ ని ఢీ కొట్టడంతో ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారులో ప్రయాణిస్తుండగా ఓ యాక్సిడెంట్ జరిగింది. ఆయన ప్రయాణిస్తోన్న కారు ఓ బైక్ ని ఢీ కొట్టడంతో ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సికింద్రాబాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తోన్న సురేష్ బాబు కారు, అదుపుతప్పి యాక్సిడెంట్ చేసినట్లు తెలుస్తోంది. కారు ఢీ కొట్టడంతో బైక్ పై వెళ్తున్న దంపతులు, వారి మూడేళ్ల చిన్నారి కిందపడిపోయారు. వారి గాయాలు బలంగా తగలడంతో స్థానికులు వెంటనే హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తరువాత దగ్గుబాటి సురేష్ బాబు మరో వాహనాన్ని తెప్పించుకొని అక్కడ నుండి వెళ్లిపోయినట్లు సమాచారం.
0
Suresh 95 Views ఇన్ఫోసిస్‌కు  పురోహిత్‌ గుడ్‌బై! బెంగళూరు, సెప్టెంబరు 19: ఇన్ఫోసిస్‌ సిఇఒగా విశాల్‌సిక్కా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉన్న త స్థాయి పదవుల్లో ఉన్నవారు ఒకొక్కకరుగా వెళ్లి పోతున్నారన్న అపవాదులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఏడో అత్యున్నతస్థాయి కీలక ఎగ్జిక్యూటివ్‌ గా భావిస్తున్న సంజ§్‌ు పురోహిత్‌ ఇన్ఫోసిస్‌నుంచి వైదొలుగుతున్నారు. సిక్కా పురోహిత్‌ను అమెరికా లోని కన్సల్టింగ్‌ విభాగానికి బదిలీచేసి తిరిగి జూలైలో భారత్‌కు రప్పించడమే కీలకంగా భావిస్తు న్నారు. రాజేష్‌కృష్ణమూర్తిని ఆయనస్థానంలో నియ మించారు. అంతకుముందు కృష్ణమూర్తి ఎనర్జీ, యుటిలిటీ విభాగాన్ని పర్యవేక్షించారు. ఇన్ఫోసిస్‌ అధికారప్రతినిధి ఆయన నిష్క్ర మణాన్ని ధృవీకరించారు. ఇన్ఫోసిస్‌కు ఇటీ వల దీర్ఘకాలిక గరిష్ట మార్జిన్‌ ఉన్న కాంట్రా క్టులు రాబట్టడంలో సవాళ్లు ఎదుర్కొంటు న్నది. జూరిచ్‌ కేంద్రంగా ఉన్న లోడ్‌స్టోన్‌ కంపెనీని కొనుగోలు చేసినప్పటికీ ఇటీవలే కొన్ని కాంట్రాక్టులు, కన్సల్టింగ్‌ సంస్థలు ఇన్ఫోసిస్‌కు దూరం అవుతున్నాయి. గడచిన రెండేళ్లలో ఇన్ఫోసిస్‌ సంజ§్‌ు జలోనా, మైఖేల్‌ రేహ్‌, శాంసన్‌ డేవిడ్‌, మనిష్‌ టాం డన్‌, రోనాల్డ్‌ హాఫ్నర్‌,అనూప్‌ ఉపాధ్యా§్‌ులు కంపె నీ నుంచి వైదొలిగారు. వీరిలో ముగ్గురిని సిక్కా తాను సిఇఒగా చేరిన తర్వాత ఇన్ఫోసిస్‌కు తీసుకు వచ్చారు.
1
చిరంజీవి లాంటి హీరోతో చేయడం క్రేజీ ఫీలింగ్-కాజల్ Highlights అందంతో, అభినయంతో తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్పీలో సుస్థిర స్థానం సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే అగ్హర నటీమణిగా ఎదిగి మెగాస్టార్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసి తనకు సాటిలేదని నిరూపించింది కాజల్. మెగాస్టార్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కాజల్ ఖైదీకి ఎసెట్ అయిందనే ప్రశంసలు పొందింది. ఖైదీ నెంబర్ 150 మెగా కలెక్షన్స్ సాధిస్తున్న నేపథ్యంలో కాజల్ తో చిట్ చాట్.. చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150లో న‌టించటంపై ఫీలింగ్? లెజెండ్ చిరంజీవి గారితో పనిచేయ‌డం ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని అనుభూతి. వెరీ నైస్ ప‌ర్స‌న్...చిరంజీవి గారితో న‌టించ‌డం అనేది మాట‌ల్లో చెప్ప‌లేను. అద్భుత‌మైన ఫీలింగ్. మెగా హీరోలు చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్...ల‌తో న‌టించారు క‌దా..! ఈ మెగా హీరోల్లో ఎవ‌రు బెస్ట్ అనిపించారు..? ఎవ‌రితో న‌టించ‌డం క‌ష్టం అనిపించింది..? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డం కాస్త క‌ష్ట‌మే. ఒక‌టి మాత్రం చెప్ప‌గ‌ల‌ను నా ఫేవ‌రేట్ హీరో చిరంజీవి గారే బెస్ట్. ఈ సినిమాలో మీ క్యారెక్ట‌ర్ చాలా చిన్నదైనా చేయ‌డానికి కార‌ణం..? ఓరిజిన‌ల్ మూవీ క‌త్తి చూసాను. ఇందులో నా క్యారెక్ట‌ర్ చిన్న క్యారెక్ట‌రే. అయితే...కొన్ని సినిమాలు మ‌న కోసం చేయాలి. కొన్ని సినిమాలు ప్రేక్ష‌కుల కోసం చేయాలి. అలా...ఈ సినిమాని ప్రేక్ష‌కుల కోసం చేసా. ఈ సినిమాలో హీరోయిన్ గా మిమ్మ‌ల్నే ఎంచుకోవ‌డానికి కార‌ణం ఏమిటి అనుకుంటున్నారు..? ఈ ప్ర‌శ్న వినాయ‌క్ గార్ని అడ‌గాలి (న‌వ్వుతూ..) కార‌ణం ఏదైనా స‌రే న‌న్ను సెలెక్ట్ చేసినందుకు వెరీ హ్యాపీ. చిరంజీవితో డ్యాన్స్ చేయ‌డం ఎలా అనిపించింది..? చిరంజీవి గారు అమేజింగ్ డ్యాన్స‌ర్. ఆయ‌న‌తో డ్యాన్స్ చేయ‌డం కోసం హార్డ్ వ‌ర్క్ చేసాను. ఆయ‌న నాకు డ్యాన్స్ విష‌యంలో కొన్ని టిప్స్ ఇచ్చారు. చిరంజీవి గారితో వ‌ర్క్ చేస్తూ చాలా నేర్చుకున్నాను. చ‌ర‌ణ్ ని ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా చూసారు ఇప్పుడు ప్రొడ్యూస‌ర్ క‌దా..! నిర్మాత చ‌ర‌ణ్ గురించి..? చ‌ర‌ణ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ‌స్ట్ వెంచ‌ర్ ఈ భారీ ప్రాజెక్ట్ చేయ‌డం హ్య‌పీ. చాలా ఫ్రొఫిషిన‌ల్ గా ఈ మూవీని ప్రొడ్యూస్ చేసారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. చిరంజీవితో సెట్స్ లో ఉన్న‌ప్పుడు ఎక్కువగా ఏ విష‌యాల గురించి డిష్క‌స్ చేసేవారు...? చిరంజీవి గారితో వండ‌ర్ ఫుల్ ఎక్స్ పీరియ‌న్స్..ఎక్కువుగా ప్రొఫెష‌న్ గురించే మాట్లాడుకునేవాళ్లం. ఫుడ్, ట్రావెలింగ్ గురించి మాట్లాడేదాన్ని. లాస్ట్ ఇయ‌ర్ మీరు న‌టించిన జ‌న‌తా గ్యారేజ్, ఇప్పుడు ఖైదీ నెం 150 100 కోట్లకు పైగా వ‌సూలు చేయ‌డం ఎలా ఫీల‌వుతున్నారు..? జ‌న‌తా గ్యారేజ్ లో నేను స్పెష‌ల్ సాంగే చేసాను. అయినా జ‌న‌తా గ్యారేజ్ అంత క‌లెక్ట్ చేసినందుకు నాకు క్రెడిట్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐటం సాంగ్స్ చేయ‌డానికి రెడీనా..? ఐటం సాంగ్స్ కోసం ప్ర‌త్యేకించి ప్లాన్స్ ఏమీ లేవు. గ్రేట్ ఆఫ‌ర్ వ‌స్తే ఆలోచిస్తాను. ల‌క్ష్మీ క‌ళ్యాణంతో కెరీర్ ప్రారంభించారు...ఇంత‌కీ మీ క‌ళ్యాణం ఎప్పుడు..? నా వ‌య‌సు 30 ఏళ్లే. త్వ‌ర‌లో చేసుకుంటాను అయితే ప్ర‌స్తుతం ఆ ఆలోచ‌న లేదు. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..? రానా హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా చేస్తున్నాను. ఆత‌ర్వాత అజిత్ తో ఓ మూవీ, విజ‌య్ తో ఓ మూవీ చేస్తున్నాను. Last Updated 25, Mar 2018, 11:55 PM IST
0
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV సాహా స్థానంలో దినేశ్ కార్తీక్‌కి ఛాన్స్..? అఫ్గానిస్థాన్‌తో జూన్ 14 నుంచి జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కి గాయం కారణంగా దూరమైన టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్థానంలో దినేశ్ Samayam Telugu | Updated: Jun 2, 2018, 12:45PM IST సాహా స్థానంలో దినేశ్ కార్తీక్‌కి ఛాన్స్..? అఫ్గానిస్థాన్‌తో జూన్ 14 నుంచి జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కి గాయం కారణంగా దూరమైన టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్థానంలో దినేశ్ కార్తీక్‌కి సెలక్టర్లు అవకాశం ఇవ్వనున్నారా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సాహా.. కోల్‌కతాతో మ్యాచ్‌లో గాయపడ్డాడు. అతని కుడిచేతి బొటనవేలు విరిగింది. దీంతో.. సాహా స్థానంలో అఫ్గానిస్థాన్‌తో టెస్టుకి ఎవరిని ఎంపిక చేయాలా..? అని సెలక్టర్లు ఆలోచిస్తున్నారు. రేసులో పార్థీవ్ పటేల్, రిషబ్ పంత్ నిలిచినప్పటికీ.. దినేశ్ కార్తీక్‌వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ అఫ్గాన్‌పై టెస్టులో కార్తీక్ మెరుగ్గా రాణిస్తే.. త్వరలో జరగనున్న ఇంగ్లాండ్ పర్యటనకి కూడా అతడ్ని కొనసాగించాలని సెలక్టర్లు భావిస్తున్నారు.
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV 'అరకురోడ్‌లో' టీజర్ లాంచ్! రామ్ శంకర్, నికేషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా | Updated: Feb 15, 2016, 06:30PM IST 'అరకురోడ్‌లో' టీజర్ లాంచ్! రామ్ శంకర్, నికేషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'అరకురోడ్‌లో'. ఈ సినిమా టీజర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా.. ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ''సినిమా టీజర్, పోస్టర్స్ కొత్తగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పాడు. రామ్ శంకర్ మాట్లాడుతూ.. ''వాసుదేవ్ నేను మంచి ఫ్రెండ్స్. మంచి సినిమా తీసే సత్తా గల దర్శకుడితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదొక యాక్షన్, థ్రిల్లర్ మూవీ. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ ప్రారంభించాం. మరో ఇరవై రోజుల్లో చిత్రీకరణ పూర్తయ్యింది. నిర్మాతలకు ఇది మొదటి సినిమా. మంచి విజయాన్ని సాధించి అందరికి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను'' అని అన్నారు. దర్శకుడు వాసుదేవ్ మాట్లాడుతూ.. ''ఇదొక యాక్షన్, థ్రిల్లింగ్ సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫిబ్రవరి 12న సినిమా రెండో షెడ్యూల్ మొదలుపెట్టాం. షూటింగ్ పూర్తి చేసి మే చివరి వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. నన్ను నమ్మి సపోర్ట్ చేస్తోన్న నిర్మాతలకు ధన్యవాదాలు'' అని చెప్పారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
Jewellery ధర తగ్గిన పసిడి ధర న్యూఢిల్లీ: మూడురోజులపాటు పెరిగిన పసిడిధరలు తాజాగా పదిగ్రాములకు 125 రూపాయలు తగ్గి 29,275 రూపాయలుగా ఉన్నాయి. గురువారం మార్కెట్లలో అంతర్జాతీయధోరణుల ప్రభావానికి బంగారంధరలు తగ్గాయి. వీటికితోడు స్థానిక రిటైలర్ల నుంచి కూడా కొనుగోళ్లు మందగించాయి. అదే దారిలో వెండిధరలు కూడా కొనసాగాయి. కిలో ఒక్కింటికి రూ.100తగ్గి రూ.42,500గా కొనసాగాయి. పారిశ్రామికయూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడమే మూలం. విదేశాల్లో నెలకొన్న నీరసించిన ధోరణులు, స్థానిక జ్యుయెలర్ల నుంచి డిమాండ్‌ మందగిం చడం వంటివి బంగారంధరలు తగ్గడానికి కార ణం అయ్యాయని నిపుణుల అంచనా. అంతర్జా తీయంగా కూడా బంగారంధరలు 0.13శాతం దిగజారి ఔన్స్‌ ఒక్కింటికి 1253.30 డాలర్లుగా నిలిచాయి. వెండిధరలు కూడా 0.25శాతం తగ్గి18.22 డాలర్లుగా కొనసాగాయి. దేశరాజ ధాని పరిసర ప్రాంతాల బులియన్‌ మార్కెట్లలో 99.9 కేరట్లు, 99.5 కేరట్ల బంగారం 125 రూపాయలు తగ్గి 29,275 రూపాయలు, 29,125 రూపాయలుగా కొనసాగాయి. గడచిన మూడు రోజుల్లో రూ.340 పెరిగిన ధరలు ఒక్కసారిగా తగ్గింది. సవర్లలో చూస్తే ఎనిమిది గ్రాముల బంగారం ధరలు రూ.24,400లుగా నడిచింది. ఇక వెండిధరలు కిలోఒక్కింటికి రూ.100 తగ్గి రూ.42,500గా నడిచింది. వారంవారంపంపిణీకిందచూస్తే రూ.185తగ్గి రూ.42,240కుచేరింది. వెండినాణేలపరంగా చూస్తే ప్రతి వందనాణేల కొనుగోళ్లకు 71 వేలు, విక్రయాలకు 72 వేలు చొప్పున ధరలు నడిచాయి.
1
Suresh 206 Views వాటాలను విక్రయించిన ప్రమోటర్లు ముంబై: గత రెండున్నర నెలల్లో తమ వాటాలను విక్రయించారు ప్రైవేటు రంగానిక చెందిన ప్రమోటర్లు.. వీరు రూ.5 వేల కోట్లు సేకరించారు. మొత్తం అయిదు కంపెనీల ప్రమోటర్లు వాటిలో ఇన్ఫోసిస్‌, ఐచర్‌ మోటార్స, పేజ్‌ ఇండస్ట్ట్రీస్‌, జాబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్‌, క్యాస్ట్రాల్‌ ఇండియాలు తమ వాటాలను విక్రయించి రూ.5,750 కోట్ల సేకరించాయని స్టాక్‌ ఎక్స్ఛేంజీలు పేర్కొన్నాయి.
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఐటం సాంగ్స్‌కి నా ఫిగర్ సూట్ అవదు - రాశి ఖన్నా ఐటం సాంగ్స్ చేయడం మీకు ఇష్టమేనా అని హీరోయిన్లని అడిగినప్పుడు వాళ్ల నుంచి వచ్చే సమాధానాలు ఊహించడం కొంచెం కష్టమే.. | Updated: Oct 3, 2016, 08:18PM IST ఐటం సాంగ్స్ చేయడం మీకు ఇష్టమేనా అని హీరోయిన్లని అడిగినప్పుడు వాళ్ల నుంచి వచ్చే సమాధానాలు ఊహించడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఐటం సాంగ్స్ అంటే చాలామంది హీరోయిన్లకి, వాటిపట్ల ఆడియెన్స్‌కి వున్న అభిప్రాయమే వేరు. అందుకే అప్పుడప్పుడు హీరోయిన్లని ఇరుకున పడేయాలని అడిగే ప్రశ్నల్లో ఈ 'ఐటంసాంగ్' కూడా ఒకటి. తాజాగా హైపర్ మూవీ సక్సెస్‌తో హైపర్ మీదున్న రాశి ఖన్నాకి కూడా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. హైపర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశిఖన్నా ఐటంసాంగ్స్ గురించి చెబుతూ... "నా బాడీ ఐటంసాంగ్స్‌కి సూటయ్యే టైప్ కాదు' అంటూ నిర్మోహమాటంగా సమాధానం ఇచ్చింది. నా ఫిగర్ ఐటంసాంగ్స్‌కి సూట్ కాకపోయినా అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను " అని వివరించింది రాశిఖన్నా. ఎలాగూ ఐటంసాంగ్స్‌కి తాను రెడీ అంటూ సిగ్నల్ ఇచ్చింది కనుక ఇకపై ఎవరైనా ఆ ఆఫర్‌తో రాశిఖన్నా తలుపు తడతారేమో చూడాలి మరి!
0
Hyderabad, First Published 1, Nov 2018, 9:56 AM IST Highlights ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పాటలను ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్స్ వాడుకోవడంతో అతడు ఫైర్ అయ్యాడు. తన పాటలు ఇతరులు  వినియోగించకుండా.. స్టే విధించాలని కోరుతూ 2014లో దాఖలు కేసు దాఖలు చేశారు. అయితే ఈ కేసు రద్దు చేశారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.  ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పాటలను ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్స్ వాడుకోవడంతో అతడు ఫైర్ అయ్యాడు. తన పాటలు ఇతరులు  వినియోగించకుండా.. స్టే విధించాలని కోరుతూ 2014లో దాఖలు కేసు దాఖలు చేశారు. అయితే ఈ కేసు రద్దు చేశారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ఇళయరాజా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ''2010లో ఎకో సంస్థ, యాజమాన్యంపై నేను పోలీసులకు సమర్పించిన ఫిర్యాదు మేరకు పోలీసులు కొన్ని సీడీలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన తీర్పు ఇటీవల వచ్చింది. ఇందులో న్యాయమూర్తి ఎకో సంస్థపై దాఖలైన క్రిమినల్ చర్యలను మాత్రమే రద్దు చేశారు. నా పాటల కాపీ రైట్స్ కి సంబంధించి ప్రస్తావించలేదు. అయితే కొందరు పనిగట్టుకొని కావాలని ఈ కేసు రద్దు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ కేసు విచారణ తుదితీర్పు కోసం వేచి చూస్తున్న నేపధ్యంలో.. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేయొద్దు'' అంటూ కోరారు.  Last Updated 1, Nov 2018, 9:56 AM IST
0
మధు శాలిని ఫోటో షూట్ గ్యాలరీ First Published 23, Jun 2017, 3:39 PM IST మధు శాలిని ఫోటో షూట్ గ్యాలరీ మధు శాలిని ఫోటో షూట్ గ్యాలరీ మధు శాలిని ఫోటో షూట్ గ్యాలరీ మధు శాలిని ఫోటో షూట్ గ్యాలరీ మధు శాలిని ఫోటో షూట్ గ్యాలరీ మధు శాలిని ఫోటో షూట్ గ్యాలరీ మధు శాలిని ఫోటో షూట్ గ్యాలరీ మధు శాలిని ఫోటో షూట్ గ్యాలరీ మధు శాలిని ఫోటో షూట్ గ్యాలరీ మధు శాలిని ఫోటో షూట్ గ్యాలరీ మధు శాలిని ఫోటో షూట్ గ్యాలరీ మధు శాలిని ఫోటో షూట్ గ్యాలరీ Recent Stories
0
2nd T20I: India beat Australia by 27 runs to seal series in Melbourn ఆస్ట్రేలియాపై టీం ఇండియా గెలుపు 27 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీం ఇండియా సిరిస్ విజేతగా ఆవిర్భవించింది. TNN | Updated: Feb 4, 2016, 09:48AM IST ఆస్ట్రేలియా గడ్డపై టీం ఇండియా మరోమారు జూలు విదిల్చింది. రెండో టీ20 మ్యాచ్ లో కూడా విజృంభించి ఆడింది. 27 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరిస్ విజేతగా ఆవిర్భవించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా మూడు వికెట్లను కోల్పోయి 184 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (60) , విరాట్ కోహ్లీ (59) టీం ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. 185 పరుగుల లక్ష్యంతో తరువాత బ్యాటింగుకు దిగిన ఆస్ట్రేలియన్లు లక్ష్య సాధనలో తడబడ్డారు. భారత బౌలర్లు వారిని బాగా కట్టడి చేయడంతో 157 పరుగుల వద్ద కుప్పకూలారు. ఈ మ్యాచ్ విజయంతో భారత జట్టు 2-0 తేడాతో ఆధిక్యంతో నిలిచింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరిస్ లో ఘోరపరాజయంతో తలకు బొప్పి కట్టించుకున్న టీం ఇండియా , ఈ టీ20 మ్యాచ్ లో చెలరేగి ఆడటం ద్వారా తన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.
2
HDFC హెచ్‌డిఎఫ్‌సి చిల్లర్‌యాప్‌పై యుపిఐ సేవలు ముంబై: ప్రైవేటురంగంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు తాజాగా ఎన్‌పిసిఐ రూపొందించిన యుపిఐ ప్లాట్‌ఫామ్‌పై లావాదేవీలను ప్రారంభించింది. తన చిల్లర్‌యాప్‌ను ఇందుకు వినియోగిస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు యుపిఐ చిల్లర్‌లో అందుబాటులోకి తెచ్చింది. బ్యాంక్‌ మొబైల్‌ యాప్‌ను గతంలోనే విడుదలచేసిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు తాజాగాయుపిఐను కూడా చిల్లర్‌పై అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల 44 బ్యాంకులతో డిజిటల్‌ లావాదేవీ లు నిర్వహించుకునే సదుపాయం ఏర్పడింది. భారత్‌లోనే మొదటిసారి మల్టీబ్యాంక్‌ చెల్లింపుల యాప్‌ను ప్రారంభించిన హెచ్‌డిఎఫ్‌సి ఇప్పటికి ఐఎంపిఎస్‌ విధానంలో 11 బ్యాంకు లతో లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటునిచ్చింది. నెలవారీ లావాదేవీలుఈవిధానంలో రూ.500 కోట్లకు పెరిగాయి. యుపిఐ చిల్లర్‌ యాప్‌విధానంలో స్టార్టప్‌ బేస్‌ మూడురెట్లు పెరుగుతుందని, 33 బ్యాంకుల కస్టమర్లు ఇపుడు ఈయాప్‌ను అనుసంధానించుకోవచ్చన్నారు. ప్రస్తుతం రెండు లక్షలమంది కస్టమర్లు చిల్లర్‌ యాప్‌ను వినియోగిస్తున్నట్లు బ్యాంకు డిజిటల్‌ హెడ్‌ నితిన్‌ ఛుగ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిల్లర్‌ సిఇఒ సహవ్యవ స్థాపకులు సోనిజా§్‌ు ఇతర హెచ్‌డిఎఫ్‌సి సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.
1
Also Read: బ్యాంక్ బంపరాఫర్.. కస్టమర్లకు 71 లీటర్ల పెట్రోల్/డీజిల్ ఉచితం! దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.71.76 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా స్థిరంగా రూ.65.14 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర స్థిరంగా రూ.77.45 వద్దనే ఉంది. డీజిల్ ధర కూడా రూ.68.32 వద్ద నిలకడగా కొనసాగింది. Also Read: ఎస్‌బీఐ బంపరాఫర్.. 70 లీటర్ల పెట్రోల్/డీజిల్ ఉచితం! అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.71 శాతం పెరుగుదలతో 62.82 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.82 శాతం పెరుగుదలతో 57.87 డాలర్లకు చేరింది.
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ‘అ’ అక్షరంతో అల్లరి నరేష్ కూతురి పేరు ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కు అందాల పాప పుట్టిన సంగతి తెలిసిందే. TNN | Updated: Dec 5, 2016, 02:40PM IST ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కు అందాల పాప పుట్టిన సంగతి తెలిసిందే. మరి ఆ పాపకి నరేష్ ఏం పేరు పెట్టాడు? ఈ సందేహం మీకొచ్చే ఉంటుంది. అభిమానుల సందేహం తీర్చేందుకు నరేష్ ట్విట్టర్లో తన పాప పేరు ప్రకటించాడు. ‘అయానా ఇవిక’ అని పేరు పెట్టాడు. అలాగే పాప ఫోటోని కూడా పోస్టు చేశాడు. పాప భలే ముద్దుగా ఉంది. ఫోటోలో కూతురిని చూసి మురిసిపోతున్న అల్లరి నరేష్, అతని భార్య విరూప కూడా ఉన్నారు. వీరిద్దరూ గతేడాది మేలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరలో వీరికి పాప పుట్టింది. Presenting Ayana Evika Edara, our life :) pic.twitter.com/8AbbP2iNld
0
Suresh 99 Views iffco ఇఫ్కో-బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కోబ్రాండెడ్‌ డెబిట్‌కార్డులు న్యూఢిల్లీ,మే 26: సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎరువుల తయారీ కర్మాగారం ఇఫ్కో తాజా గా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో జతకలిసి కోబ్రాండెడ్‌ డెబిట్‌కార్డులు జారీచేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇందుకు సంబంధించి రెండు సంస్థలు ఎంఒయు చేసుకున్నాయి. ఈ కార్డులసాయంతో రైతులు వ్యవ సాయానికి అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు వంటివి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రధాని నరేంద్రమోడీ డిజిటల్‌ ఇండియా పథకాన్ని మరింత విజయవంతంచేసే లక్ష్యంతో ఈ టైఅప్‌ ఏర్పాటు చేసుకున్నట్లు రెండు సంస్థలు ప్రకటించాయి. ఈ స్కీం కింద బరోడా బ్యాంకులో రైతు ఒక ఖాతాను ప్రారంభింస్తారు. ఆధార్‌కార్డు సాయంతో ఖాతా రూ.100తో ప్రారంభమవుతుంది. వెనువెంటనే రైతుకు ఇఫ్కో,బిఒబి కోబ్రాండెడ్‌ డెబిట్‌ కార్డు అందుతుంది. ఈకార్డుసాయంతో 2500 వర కూ కొనుగోళ్లు చేసుకోవచ్చు. నెలరోజులపాటు ఎలాం టి వడ్డీచెల్లింపులు అవసరంలేదు. ఇఫ్కో బిఒబి కార్డు లను మీరట్‌లో మొత్తం 51మంది రైతులకు లాంఛ నంగా అందచేసారు. ఇఫ్కో హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ ఆర్‌పిసింగ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎండి పిఎస్‌ జయ కుమార్‌ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈకార్డులసాయంతో రైతులు వడ్డీలేకుండా రూ.2500వరకూ కొనుగోళ్లు చేసుకోవచ్చని, అయితే సకాలంలో చెల్లిస్తే బ్యాంకుమరింతగా ఆదుకుం టుందని ఆర్‌పిసింగ్‌ వెల్లడించారు. విత్తనాలు, ఎరువులు, బయోఎరువులు, ఆగ్రో రసాయనాలు, ఇతర పౌష్టిక ఎరువుల గుళికలు వంటివి కొనుగోలుచేసుకోవచ్చు. బ్యాంకు పరిధిలో అమలయ్యే నగదు రహిత లాబాదేవీలపై ఖాతాదారులకు అవగాహనపెంపొందిస్తామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎండి జయకుమార్‌ వెల్లడించారు. ప్రాథమికంగా రెండులక్షల కోబ్రాండెడ్‌ డెబిట్‌కార్డులు జారీచేస్తామన్నారు. తొలివిడతగా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో జారీ అవుతాయని, ఆతర్వాత మలిదశలో దేశవ్యాప్తంగా అమలవుతుందన్నారు. ఈ కార్డులు ఇఫ్కో ఉత్పత్తులు కొనుగోళ్లకు వీలవుతాయని రైతులు గుర్తించాలి.
1
internet vaartha 81 Views హైదరాబాద్‌ : దేశంలో అగ్రగామి శానిటరీ వేర్‌కంపెనీ హెచ్‌ఎస్‌ఐఎల్‌ కొత్తశ్రేణి వాటర్‌ ప్యూరిఫయర్లను మార్కెట్‌కు తెచ్చింది. మూన్‌బౌ పేరిట ఈ కొత్త నీటిశుద్ధి యంత్రాలకు భారత్‌లో మంచి డిమాండ్‌ఉంటుందని ప్రకటించింది. ఒషేనస్‌ప్రీమియం, ఒషేనస్‌ అకేలోస్‌ప్రీమియం, అకేలస్‌, ఎజిల్‌ ధరలు రూ.12990నుంచి రూ.26,990వరకూ ఉన్నాయి. కంపెనీ ప్రెసిడెంట్‌ రాకేష్‌ కౌల్‌ మాట్లాడు తూ మార్కెట్‌లో ఈ కొత్త యంత్రాలకు అత్యధిక వృద్ధిరేటు ఉంటుందని అంచనా. గడచిన ఆగస్టునెలలో విడుదల చేసిన నీటిప్యూరిఫయర్లు నాలుగువేల రిటైల్‌ ఔట్‌లెట్లలో ఉన్నాయనిఅన్నారు. ఇ-కామర్స్‌, మోడ రన్‌ ట్రేడ్‌ తదితర ఆఫ్‌లైన్‌ స్టోర్లలో కూడా విక్రయాలు జరుపుతున్నట్లు వివరించింది. నీటిశుద్ధియంత్రాల మార్కెట్‌లో 20శాతం వృద్ధిని నమోదుచేస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా తమ విస్తృత నెట్‌వర్క్‌ తో కొత్త మూన్‌బౌయంత్రాలు మరింతమార్కెట్‌ వాటా సాధిస్తామన్నారు. తాజాగా మెట్రోనగరాలతో పాటు ఒకమోస్తరు నగరాలు, రెండు, మూడోశ్రేణి నగరాల్లో కూడా విక్రయాలు నిర్వహిస్తామని రాకేష్‌కౌల్‌ వివరించారు. ఆర్‌ఒ ఆధారిత టెక్నాలజీనమూనాలను ఆవిష్‌కరించామని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిం పు దశలో యువి గ్రావిటీ ఆధారిత నీటిశుద్ధి యంత్రాలను మార్కెట్‌కు తెస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్‌ఒ ఆధారిత నీటిశుద్ధి యంత్రాలు అత్యాధునిక హెక్సాప్యూర్‌ టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు తెలిపారు. అత్యంత స్వఛ్ఛమైన సురక్షితమైన ఆరోగ్యకరమైన తాగునీటికిభరోసా అందించడంతో మంచి డిజైన్లతో వస్తున్నట్లు తెలిపారు. గతఏడాది హిందూస్థాన్‌ శానిటరీ వేర్‌ మూన్‌బౌ వాయుశుద్ధియంత్రాలు, హింద్‌ వేర్‌ అట్లాంటిక్‌ వాటర్‌ హీటర్లను విడుదల చేసామని మార్కెట్‌లో పటిష్టంగా ఉన్నట్లు వివరించారు.
1
sumalatha 192 Views Jio Fiber , Mukesh Ambani , RELIANCE , RIL AGM 2019 Mukesh Ambani ముంబయి: రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. జియో నుంచి నాలుగు రకాల బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. సెప్టెంబర్ 5న జియో ఫైబర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ముఖేష్ ప్రకటించారు. జియో హోం బ్రాడ్‌బ్యాండ్‌లో భాగంగా సెకనుకు 1జీబీ స్పీడ్‌తో 100 జీబీ ఇంటర్నెట్, ఉచిత ల్యాండ్‌లైన్ సౌకర్యం, వీడియో కాన్ఫరెన్స్, యూహెచ్‌డీ సెటాప్ బాక్స్‌ను అందించనున్నట్లు తెలిపారు. ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సేవలను అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. అనంతరం జియో ఫైబర్‌ ఫీచర్లను ఇషా, ఆకాశ్ అంబానీ వివరించారు. జియో సెట్‌టాప్‌ బాక్సు ద్వారా ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాల్‌ సేవలు ఉచితంగా చేసుకోవచ్చని వెల్లడించారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని, 2020 జనవరి 1 నుంచి జియో కమర్షియల్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. జియో గిగా ఫైబర్‌ ద్వారా సోషల్‌ గేమింగ్‌ పేరుతో మల్టిపుల్‌ గేమింగ్‌ సేవలను అందించనున్నట్లు వెల్లడించారు. మిక్స్‌డ్‌ రియాలిటీ పేరుతో సరికొత్త వర్చువల్‌ రియాలిటీ సేవలు అందిస్తామని తెలిపారు. జియో ఫైబర్‌ విశేషాలు.. •జియో ఫైబర్‌ ద్వారా 100 ఎంబీపీఎస్‌ నుంచి 1 జీబీపీఎస్‌ వరకు డేటా • ప్రజలందరికీ అందుబాటు ధరల్లో జియో సేవలు. జియో ఫైబర్‌ సేవలు నెలకు రూ. 700 నుంచిరూ. 10వేల వరకు ఉంటాయి • ప్రీమియం జియో ఫైబర్‌ కస్టమర్లు సినిమా విడుదలైన రోజే తమ ఇంట్లో చూసుకోవచ్చు. ఖజియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోగగా పిలిచే ఈ సేవలను 2020 మధ్యలో అందుబాటులోకి తీసుకొస్తాం • జియో ఫైబర్‌ ద్వారా భారత్‌లోని ఏ టెలికాం ఆపరేటర్‌కైనా ఇంటి నుంచే ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ఈ ఉచిత సేవలు జీవితకాలం ఉంటాయి •ప్రారంభ ఆఫర్‌ కింద ఫరెవర్ వార్షిక ప్లాన్‌ తీసుకునే జియో ఫైబర్‌ కస్టమర్లు హెచ్‌డీ/ 4కే ఎల్‌ఈడీ టీవీ, సెట్‌టాప్‌ బాక్సును ఉచితంగా తీసుకోవచ్చు • జియో నుంచి నెలకు రూ. 500తో అమెరికా, కెనడాకు అపరిమిత కాలింగ్‌ ప్యాకేజీ తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV బాహుబలి2 క్లైమాక్స్ 30 నిమిషాలా.. మరి మూవీ! 'బాహుబలి ది కంక్లూజన్' కు సంబంధించిన ఒక్కో వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. TNN | Updated: Apr 11, 2017, 09:25PM IST 'బాహుబలి ది కంక్లూజన్' కు సంబంధించిన ఒక్కో వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడనే వార్త అభిమానులను ఆకట్టుకుంటుంటే రానా భళ్లాలదేవుడిగా తన విశ్వారూపం చూపించబోతున్నాడని తెలిసి సినిమా ఎలా ఉండబోతుందో అనే ఎగ్జైట్మెంట్ అందరిలోనూ కలుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నిడివి ఎంత అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. బాహుబలి పార్ట్ 1 సినిమా దాదాపు మూడు గంటలసేపు సాగింది. అందులో ఇరవై నిమిషాలు క్లైమాక్స్ వార్ ఎపిసోడ్ ఉంటుంది. ఇప్పుడు బాహుబలి2 రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు. రెండు గంటల 50 నిమిషాల నిడివితో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. అంత పెద్ద సినిమా అయినా చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించామని చెబుతున్నారు. ఈ మేరకు రన్ టైమ్ లాక్ చేయడానికి చాలా కసరత్తే చేయాల్సివచ్చినట్లుగా మేకర్స్ తెలియబరిచారు. పార్ట్1 కంటే పార్ట్2 లో యుద్ధ సన్నివేశాలు భీకరంగా ఉండనున్నాయి. ఈ విషయం ఇది వరకు జక్కన్న వెల్లడించారు. ఒక్క క్లైమాక్స్ ఎపిసోడ్ ముప్పై నిమిషాలు ఉంటుందట. మూడు గంటల వ్యవధి గల సినిమాలో గంటన్నర పాటు యుద్ధ సన్నివేశాలే ఉంటాయని సమాచారం.
0
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV గ్రామీణులను పెళ్లాడిన బాలీవుడ్ భామలు! కుర్రకారుకు గుండె బద్దలయ్యే వార్త.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనాక్షి సిన్హాలకు పెళ్లైపోయింది. TNN | Updated: Sep 1, 2016, 02:09PM IST కుర్రకారుకు గుండె బద్దలయ్యే వార్త.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , సోనాక్షి సిన్హాలకు పెళ్లైపోయింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన రాకేశ్ చంద్ర, సాధు లాల్, రమేశ్ చంద్రలను వీరు పెళ్లాడారు. ఏంటి ఇదంతా నిజమేనా అని మీకు సందేహం కలుగుతోందా..? అయితే అసలు విషయంలోకి రండి. ఫరూఖాబాద్ ఆహార, ప్రజా సరఫరాల శాఖ వెబ్‌సైట్‌లో ఈ ముగ్గురు ముద్దుగుమ్మలకు పెళ్లైనట్లు పొందుపరిచారు. అంతేకాకుండా వీరి భర్తల పేర్లు తెలుపుతూ రేషన్ కార్డులు జారీ చేశారు. వీరితో పాటు దర్శక నిర్మాత ఆదిత్య చోప్రా భార్య, నటి రాణీ ముఖర్జీకి కూడా మళ్లీ పెళ్లి చేసేశారు. ఫరూఖాబాద్ జిల్లాలోని సాహెబ్‌గంజ్ గ్రామానికి చెందిన వ్యక్తి భార్య రాణీగా తెలుపుతూ రేషన్ కార్డును జారీ చేశారు. ఈ విషయాన్ని కొంతమంది సామాజిక కార్యకర్తలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విషయం బయటకొచ్చింది. కొందరు మోసగాళ్లు కావాలనే ఈ నకిలీ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ‘అంత్యోదయ’ పథకం కింద కార్డులు జారీ చేశారు. ఆసక్తికర విషయమేమిటంటే, ఈ నకిలీ రేషన్ కార్డుల కోసం రాణీకి జనరల్ కేటగిరీలో.. జాక్వెలిన్, రాణీ, సోనాక్షిలకు వెనుకబడిన తరగతుల విభాగంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ హీరోయిన్ల వార్షిక ఆదాయం రూ. 18000గా మోసగాళ్లు దరఖాస్తులో పొందుపరిచారు. మోసాన్ని గ్రహించిన అధికారులు నాలుక కరుచుకుని తప్పును సరిదిద్దారు.
0
sumalatha 136 Views bse , NSE , stock market stock market ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు మందకొడిగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.26 సమయంలో సెన్సెక్స్‌ 161 పాయింట్లు , 36,899 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 10,905 వద్ద ట్రేడవుతున్నాయి. సెబీ పలు నిబంధనల్లో మార్పులు తీసుకురావడంతో మార్కెట్‌ జాగ్రత్తగా స్పందిస్తోంది. తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos/
1
Hyderabad, First Published 28, Jun 2019, 6:21 PM IST Highlights కార్తికేయ ప్రస్తుతం అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో 'గుణ 369' చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరక్కుతోంది.  ఆర్ఎక్స్ 100 చిత్రం చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంతో హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, దర్శకుడు అజయ్ భూపతి ఫేమస్ అయిపోయారు. కార్తికేయ ప్రస్తుతం అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో 'గుణ 369' చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరక్కుతోంది. తాజాగా దర్శకుడు అర్జున్ జంధ్యాల గుణ 369 చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. తెలుగులో కథాబలం ఉన్న చిత్రాలు రావడం లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. వారందరికీ సమాధానం చెప్పే విధంగా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. టీజర్ విడులయ్యాక అందరూ హీరోయిన్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారని దర్శకుడు తెలిపారు.  హీరోయిన్ పేరు 'అనఘ'. టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న మరో కేరళ బ్యూటీ. సాయి పల్లవి, నిత్యామీనన్, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి మలయాళీ ముద్దుగుమ్మలంతా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అనఘ కూడా టాప్ రేంజ్ కు వెళుతుంది అని అర్జున్ తెలిపారు.  గుణ 369 చిత్రం విడుదలయ్యాక అందరూ కార్తికేయ, అనఘ మధ్య రొమాన్స్ గురించే మాట్లాడుకుంటారు. గ్లామర్ విషయంలో అనఘ ఎక్కడా రాజీ పడలేదు. కమర్షియల్ హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలన్నీ అనఘలో ఉన్నాయని తెలిపారు.   Last Updated 28, Jun 2019, 6:21 PM IST
0
Hyderabad, First Published 4, Aug 2019, 5:20 PM IST Highlights దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొత్త అవతారం ఎత్తబోతున్నారు. తెలుగు ప్రేక్షకులకు రాఘవేంద్రరావు 100కి పైగా చిత్రాలని అందించారు. త్వరలో రాఘవేంద్రరావు నిర్మాతగా ఓ ఆసక్తికర చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నాగ శౌర్య, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొత్త అవతారం ఎత్తబోతున్నారు. తెలుగు ప్రేక్షకులకు రాఘవేంద్రరావు 100కి పైగా చిత్రాలని అందించారు. త్వరలో రాఘవేంద్రరావు నిర్మాతగా ఓ ఆసక్తికర చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నాగ శౌర్య, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబందించిన వార్తలు సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  ఈ చిత్రాన్ని ముగ్గురు క్రేజీ డైరెక్టర్స్ తెరకెక్కిస్తారట. జాగర్లమూడి క్రిష్, అనిల్ రావిపూడి, బివిఎస్ రవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మూడు కథలు ఉంటాయట. ఈ మూడు కథలకు కామన్ గా ఓ రిలేషన్ ఉంటుంది. రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ చిత్రంలో మరో ముగ్గురు హీరోయిన్లుగా కూడా నటించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం అనుష్క నిశ్శబ్దం చిత్రంలో నటిస్తోంది. భాగమతి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క మళ్ళీ సినిమాలతో బిజీ అవుతోంది.
0
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఇంగ్లాండ్‌లో టీమిండియా పర్యటన ఖరారు..! ఇంగ్లాండ్‌లో భారత్ జట్టు పర్యటన ఖరారైంది. 2019 ప్రపంచకప్‌కి ఇంగ్లాండ్‌ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో వచ్చే TNN | Updated: Sep 5, 2017, 05:02PM IST ఇంగ్లాండ్‌లో భారత్ జట్టు పర్యటన ఖరారైంది. 2019 ప్రపంచకప్‌కి ఇంగ్లాండ్‌ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జులై నుంచి అక్కడ టీమిండియా దాదాపు రెండు నెలల పాటు పర్యటించనుంది. సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా భారత్ మూడు టీ20, మూడు వన్డేలతో పాటు ఐదు టెస్టులను ఆతిథ్య జట్టుతో ఆడనుంది. జులై 3న టీ20తో ఆరంభమయ్యే ఈ సిరీస్ సెప్టెంబరు 11 వరకు కొనసాగనుంది. ‘భారత్‌, ఇంగ్లాండ్ మధ్య వచ్చే ఏడాది జరిగే ఐదు టెస్టుల సిరీస్‌ అంతర్జాతీయ క్రికెట్‌కే హైలెట్‌గా మారనుంది. రెండు బలమైన జట్ల మధ్య జరిగే ఈ పోటీకి అభిమానుల నుంచి పెద్ద సంఖ్యలో ఆదరణ కూడా లభించొచ్చు’ అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈవో టామ్ హరీసన్ ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది భారత్‌లో పర్యటించిన ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. అయితే.. సొంతగడ్డపై మాత్రం ఇంగ్లాండ్ టెస్టుల్లో ఏ జట్టుకైనా సవాల్ విసరగలదు.
2
Rupees రూ.64 వేల కోట్ల కార్పొరేట్‌ నిధుల సమీకరణ ముంబయి, మే 18: భారతీయ కంపెనీలు ఏప్రిల్‌నెలలో రూ.64వేలకోట్లు నిధు లు సమీకరించాయి. కార్పొరేట్‌ బాండ్ల రూపంలోనే ఎక్కువ సమీకరణ జరిగిం ది. గతఏడాదితో పోలిస్తే 55శాతం పెరిగిందని అర్ధం అవుతోం ది. ఎక్కువగా రుణాల చెల్లింపులకు, బిజినెస్‌ప్రణాళికల విస్త రణకు ఈ నిధులను వినియోగిస్తున్నాయి. గత ఆర్థిక సంవ త్సరం మొత్తం ఇదేరూటులో 6.41 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లు సమీకరించాయి. తాజా గణాంకాలను బట్టిచూస్తే సెబి అందించిన వివరాలప్రకారం రూ.63,819కోట్ల రూపాయ లు ఏప్రిల్‌నెలలో సమీకరించాయి. 2016 ఏప్రిల్‌నెలలో 41,079కోట్లకంటే ఈ మొత్తం పెరిగింది. మార్చినెలలో సంస్థ లు 85,633 కోట్లు సమీకరించాయి. బజాజ్‌ కేపిటల్‌ సీనియర్‌ ఉపాధ్య క్షుడు లోక్‌ అగర్వాలాల ఎక్కువ నిధులు రాబట్టుకున్నారు. తక్కువ వడ్డీకే ఎక్కువ నిధులు సాధించారు. రుణసమీకరణ భారీగా జరగడానికి కారణం వడ్డీరేట్లు తగ్గడమేనని తేలింది. ప్రైవేటు, పబ్లిక్‌ బాండ్ల జారీద్వారా కార్పొరేట్‌ కంపెనీలు ఈ నిధులు సమీకరిస్తాయి. మొత్తం 301 బాండ్ల ఇష్యూ ద్వారా ఏప్రిల్‌లో నిధులు సమీ కరిస్తే గత ఏడాది 314 ఇష్యూలు జారీ అయ్యా యి. డెట్‌ ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్స్‌లో సంస్థలు సెక్యూరిటీలు లేదా బాండ్లువంటి స్కీంలను సం స్థాగత ఇన్వెస్టర్లకు జారీచేసి నిధులు సమీ కరిస్తారు. మార్కెట్లలో తక్కువవడ్డీకే రుణాలు లభించేకాలంలో విదేశీవాణిజ్యరుణాలను సైతం కార్పొరేట్లు సమీకరిస్తుంటాయి. ప్రస్తుతం తక్కువ వడ్డీరేట్లు చెలామణిలో ఉండటంతో కంపెనీలన్నీ ప్రైవేటుప్లేస్‌మెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి.
1
Visit Site Recommended byColombia నిర్మాతగానే కాకుండా.. ఈ సినిమా హీరో నితిన్ తో పవన్ కు ప్రత్యేక అనుబంధం ఉంది ఈ నేపథ్యంలో.. పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. నితిన్ తో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించాడు. తను వరస ఫ్లాఫుల్లో ఉన్న వేళ ‘ఇష్క్’ సినిమా ఆడియో విడుదల వేడుకకు తనను నితిన్ ఫ్యామిలీ ఆహ్వానించిందని పవన్ తెలిపారు. ఇక ఈ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ రావడం ఓకే కానీ, దర్శకుడు త్రివిక్రమ్ ఫంక్షన్ కు హాజరు కాకపోవడం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం అవుతోంది. ఈ సినిమాతో త్రివిక్రమ్ కు కూడా సంబంధం ఉంది. దీనికి కథను అందించింది ఆ దర్శక,రచయితే. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు త్రివిక్రమ్ కూడా వస్తాడనే ప్రచారం జరిగింది. అయితే ఆయన మాత్రం కార్యక్రమంలో కనిపించలేదు. చల్ మోహన్ రంగా.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫొటోలు   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
Jaitley మీరే సొంతంగా నిధులు సమకూర్చుకోండి న్యూఢిల్లీ, జూన్‌ 13: రాష్ట్రాల్లో రుణమాఫీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే సొంతంగా నిధులు సమకూర్చుకోవాలని, నిధులు సమీకరించుకుని మాఫీలు అమలుచేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల్లో ఆక్కడి ప్రభుత్వాలు రుణమాఫీలను ప్రకటించిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రభుత్వరంగబ్యాంకుల పనితీరును సమీక్షించిన ఆర్థికమంత్రి రుణమాఫీలు ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తాయన్న బ్యాం కర్ల వాదనను పరిగణనలోకి తీసుకుని సొంతంగా నిధులు తెచ్చుకోవా లని సూచించారు. రైతులనుంచి భారీఎత్తున రుణమాఫీలకు డిమాండ్‌ పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రప్రభుత్వాలు రుణమాఫీలకు తమ సొంత వనరులనుంచే అమలుచేసుకోవాల్సి ఉంటుందని, కేంద్రం నుంచి ఎలాంటినిధులు అందబోవనిఅన్నారు. ఇలాంటి పథకాలతో ముందుకు వచ్చే రాష్ట్రాలకు గతంలో కూడా ఒకపర్యాయం స్పష్టంగా చెప్పామని రాష్ట్రాలు రుణమాఫీలకు సొంతవనరులు సమకూర్చుకోవాల్సిందేనని కేంద్రంనుంచి నయాపైసా సాయం అందబోదని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేరుకునిపోతున్న రుణబకాయిలపై ఆర్ధిక మంత్రి సోమవారం సమీక్ష చేసారు. బ్యాంకింగ్‌ రంగంలో మొత్తం 6 లక్షల కోట్లకుపైగా రానిబాకీలుంటే వాటిలోప్రభుత్వరంగ బ్యాంకులవద్దనే 5.2లక్షల కోట్లకుపైగా ఉన్నట్లు అంచనా. వీటికితోడు రుణమాఫీలు ప్రకటిస్తే బ్యాంకుల్లో మొండిబకాయిలు మరింతగా పెరుగుతాయని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రుణాలను సన్న, చిన్నకారు రైతులకు రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. పదిరోజుల పాటు పెద్ద ఎత్తున ఉద్యమించిన రైతుల డిమాండ్‌కు ఎట్టకేలకు మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కూడా ఇదేవిధమైన నిరసనను రైతాంగం నుంచి ఎదుర్కొన్నారు. అయితే అక్కడి ముఖ్యమంత్రి రుణమాఫీ డిమాండ్‌ను పరిశీలించి న్యాయంచేస్తామని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అనూహ విజ యం సాధించడానికి అసలుకారణం వ్యవసాయ రుణాలమాఫీయేనని చెపుతున్నారు. మొత్తం రూ.30వేల కోట్ల విలువైనరుణాలను అక్కడి ప్రభుత్వం రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే ఎన్ని కల అజెండాల్లో ప్రకటించి అనూహ్య విజయం సాధించిందని పరిశీల కులు అంచనా. రుణమాఫీ యుపి వంటి పెద్దరాష్ట్రాలే అమలుచేస్తుం డగా తమకుసైతం కావాలని మహారాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్య ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల రైతాంగం డిమాండ్‌ చేయడం మొదలుపెట్టింది. దీనిపై బ్యాంకర్లపై అదనపుభారం పెరిగి మూలధన వనరులకు సైతం కష్టంఅవుతుందన్న అంచనాలున్నాయి. రుణమాఫీలకు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఇప్పటికే ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ స్పష్టంచేసి రాష్ట్రాలు తమతమ బడ్జెట్‌లలో కొంత కేటాయింపులు చేసుకుంటే తప్ప బ్యాంకింగ్‌ రంగం నుంచి ఎలాంటి సాయం ఉండబోదని అన్నా రు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు రుణమాఫీలు ప్రకటించిన ప్పటి నుంచి బ్యాంకింగ్‌ రంగం ఈ మాఫీల మాయాజాలంపై నిప్పులు చెరుగుతోంది. గత ఆర్‌బిఐగవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ నుంచి ఎస్‌బిఐ ఛైర్‌పర్సన్‌ అరుంధతీభట్టాచార్య, ప్రస్తుత గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌లు సైతం రుణమాఫీలు ఆయా రాష్ట్రాల సొంతబాధ్యతపై అమలుచేసుకోవచ్చని స్పందించారు. దేశంలోనే తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలపరంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వాలు రుణమాఫీలను ప్రకటించి దశలవారీగా అమలుచేసాయి. ఇదే పంథాను అనుసరించిన ఉత్తరాది రాష్ట్రాల్లో అధికార బిజెపి అనూహ్య విజయం సాధించింది. మిగిలిన రాష్ట్రాలు ఇదే పంథా అనుసరిస్తే ఆర్థిక వ్యవస్థలో క్రమశిక్షణ లోపిస్తుందని, దానివల్ల ఎగవేత భావం పెరిగిపోతుందని, తద్వారా బ్యాంకులకు వడ్డీలు సైతం చెల్లించలేనిపరిస్థితుల్లోరైతులు మరింతగా అప్పుల పాలవుతారనిబ్యాంకర్లు భయపెడుతూ వచ్చారు. బడా కార్పొ రేట్లను వేల కోట్లు రుణాలను రద్దుచేస్తున్న బ్యాంకర్లను ప్రభుత్వం కూడా సమర్ధిస్తూ వస్తోందని, ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు ఒరగ బెట్టేదేమీఉండదని, అందువల్లనే న్యాయం కోసం రోడ్డెక్కాల్సి వచ్చిం దంటూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రైతులు నిరసన గళం విప్పారు.
1
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కోహ్లీ నెం.1 ర్యాంక్‌కి కివీస్ కెప్టెన్ ఎసరు..? భారత్ జట్టు మే నెలలో ఆరంభంకానున్న ప్రపంచకప్‌ ముగిసే వరకూ టెస్టు మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకపోగా.. న్యూజిలాండ్ జట్టు ఈ నెలలోనే శ్రీలంకతో రెండు టెస్టులను ఆడనుంది. ఈ నేపథ్యంలో.. కోహ్లీ నెం.1 ర్యాంక్‌ చేజారే ప్రమాదం కనిపిస్తోంది. Samayam Telugu | Updated: Mar 4, 2019, 08:09PM IST కోహ్లీ నెం.1 ర్యాంక్‌కి కివీస్ కెప్టెన్ ఎసరు..? హైలైట్స్ ఏడాదికాలంగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో కొనసాగుతున్న కోహ్లి కోహ్లీకి చేరువగా వచ్చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఆడుతున్న భారత్ ప్రపంచకప్‌ వరకూ టెస్టులకి టీమిండియా దూరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నెం.1 ర్యాంక్‌కి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాడు. గత ఏడాది దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ల్లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా విలియమ్సన్ అతనికి చేరువగా వచ్చేశాడు.
2
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV రూ. 4999కే రెడ్ మీ 5ఏ, విక్రయాలు ప్రారంభం! చైనాకు చెందిన షియోమీ సంస్థ రూపొందించిన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ 5ఏ గురువారం నుంచి తొలిసారిగా భారత మార్కెట్లో విక్రయాలు ప్రారంభించింది. TNN | Updated: Dec 7, 2017, 12:29PM IST షియోమీ సంస్థ రూపొందించిన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ ‘రెడ్ మీ 5ఏ’ అమ్మకాలు గురువారం ప్రారంభమయ్యాయి. గతవారమే ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఫ్లిప్‌కార్ట్, మి.కామ్, మీ హోమ్ స్టోర్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. తొలి 50 లక్షల యూనిట్లకు షియోమీ సంస్థ రూ. 1000 డిస్కౌంట్ ఇస్తోంది. 2 జీబీ ర్యామ్/ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీనికి అదనంగా రిలయన్స్ జియో రూ. 1000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. జియో ఇస్తోన్న ఆఫర్ ఏడాది తర్వాత ఉపయోగించుకునే వీలుంది. డిసెంబర్ 7న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం అయ్యాయి. రెడ్ మీ 5ఏ డ్యూయల్ సిమ్‌ను సపోర్ట్ చేస్తుంది. అండ్రాయిడ్ నౌగాట్‌, ఐదు అంగుళాల తాకే తెర, క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్ తదితర ఫీచర్లున్నాయి. 2 జీబీ, 3 జీబీ వేరియంట్లలో ఈ మొబైల్ లభిస్తోంది. 13 మెగాఫిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాఫిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఆకట్టుకునే ఫీచర్లున్నాయి.
1
Suresh 126 Views ఐపిఎల్‌లో తొలి హ్యాట్రిక్‌ వికెట్‌ బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో బెంగళూరు బౌలర్‌ శామ్యూల్‌ బద్రీ సంచలనం సృష్టించాడు. ముంబయిఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ ముగ్గురిని వరుస బంతుల్లో ఔట్‌ చేసి ఈ సీజన్‌లో హ్యాట్రిక్‌ వికెట్‌ నమోదు చేశాడు.బద్రీ వేసిన మూడవ ఓవర్‌ తొలి బంతిని ఢిపెన్స్‌ ఆడిన పార్థీవ్‌ రెండవ బంతికి షార్ట్‌ ఎక్స్‌ట్రా కవర్‌లో ఉన్న క్రిస్‌ గేల్‌ చేతికి చిక్కాడు.పుట్‌ టాస్‌గా వేసిన మూడవ బంతిని అప్పుడే క్రీజులోకి వచ్చిన మెక్లెనగన్‌ భారీషాట్‌ ఆడాడు.లాంగాన్‌లో మన్‌దీప్‌ చేతికి చిక్కాడు. నాలుగవ బంతికి పామ్‌లో లేని ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జిరో పరుగుల వద్ద క్లీన్‌ బౌల ్డయ్యాడు.దీంతో ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్‌ వికెట్‌ నమోదు చేసిన బౌలర్‌గా బద్రీ రికార్డు సృష్టిం చాడు.బద్రీ దెబ్బకు మూడవ ఓవర్‌లో జిరో,వికెట్‌,వికెట్‌,1 లెగ్‌ బై,జిరో గా నమోదైంది.అంతకు ముం దు ఓవర్‌ అయిదవ బంతికి బిన్నీ బౌలింగ్‌లో జోస్‌ బట్లర్‌ గేల్‌ చేతికి చిక్కాడు.ఈ అద్భుత ప్రదర్శనతో ముంబయి మూడు ఓవర్లకే 4 వికెట్లు కోల్పోయి 8 పరుగులతో కష్టాల్లో పడింది. ==========
2
Hyderabad, First Published 15, Sep 2019, 1:29 PM IST Highlights నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి ఈ చిత్రం మంచి స్పందన రాబట్టుకుంటోంది. నాని కామెడీ టైమింగ్ ప్రేక్షకులని బాగా అలరిస్తోంది. విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.  నాని గ్యాంగ్ లీడర్ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసే విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. తొలిసారి వీరి కాంబినేషన్ లో చిత్రం రాబోతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పెన్సిల్ పార్థసారధి అనే ఫన్నీ రైటర్ గా నాని ఈ చిత్రంలో నటించాడు.  సరదాగా సాగిపోయే రివేంజ్ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సినీ క్రిటిక్స్ లో ఈ చిత్రంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినా కూడా నానికి ఉన్న క్రేజ్ తో గ్యాంగ్ లీడర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 4.5 కోట్ల షేర్ రాబట్టింది.  సినిమాపై పాజిటివ్ టాక్ పెరుగుతుండడంతో శనివారం కూడా అదిరిపోయే వసూళ్లు నమోదయ్యాయి. శనివారం రోజు బాక్సాఫీస్ వద్ద పట్టు నిలుపుకుంటూ 3.5 కోట్ల షేర్ రాబట్టింది. దీనితో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో గ్యాంగ్ లీడర్ చిత్ర వసూళ్లు 8 కోట్ల షేర్ కు చేరాయి. దీనితో నాని మ్యాజిక్ ఆడియన్స్ పై బాగానే పనిస్తోందని అంటున్నారు. నైజాంలో 3 కోట్లు, సీడెడ్ లో 98 లక్షలు, గుంటూరులో 72 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 76 లక్షల షేర్ ని ఈ చిత్రం సాధించింది.  ఇక ఆదివారం రోజు శనివారం కంటే అధిక వసూళ్లు నమోదవుతాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మంచి వసూళ్లతో నడుస్తున్న ఈ చిత్రం వీకెండ్ లో సాధించే వసూళ్ళని బట్టి విజయంపై ఓ అంచనాకు వచేయెచ్చు.  Last Updated 15, Sep 2019, 1:29 PM IST
0
మంత్రి హరీష్‌రావు... 'ఇద్దరి మధ్య 18' Highlights ఇద్దరి మధ్య 18 ఆడియో విడుదల చేసిన మంత్రి హరీష్ రావు ఆడియో రిలీజ్ వేడుకలో పాల్గొన్న జీవిత రాజశేఖర్, ఎన్.శంకర్,మంత్రి మహెందర్ ఇద్దరి మధ్య 18కి సంగీతం అందించిన ఘంటాడి కృష్ణ ఎస్‌.ఆర్‌.పి విజువల్‌ పతాకంపై సాయితేజ పాటిల్‌ సమర్పణలో రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరిసత్తి ప్రధానపాత్రలో నటించిన, నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్‌ పాటిల్‌ నిర్మించిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం 'ఇద్దరి మధ్య 18'. ఈ చిత్ర బిగ్‌ సీడీని తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీవిత, ఎన్‌. శంకర్‌, మల్కాపురం శివకుమార్‌, చిత్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌, దర్శకుడు నాని ఆచార్య, సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ, చిత్ర కథానాయకుడు రాంకార్తీక్‌, బిత్తిరిసత్తి, కెమెరామెన్‌ జి.ఎల్‌. బాబు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..'రాజకీయాలలో పేరొందిన శివరాజ్‌ పాటిల్‌ ఈ చిత్రం ద్వారా సినీ రంగంలో కూడా మంచి పేరు పొందాలని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..' అన్నారు.   చిత్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌ మాట్లాడుతూ..మా చిత్ర ఆడియోని ఆవిష్కరించిన తెలంగాణ మంత్రి వర్యులు హరీష్‌రావుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అన్ని కమర్షియల్‌ హంగులతో ఈ చిత్రాన్ని యూత్‌ని ఆట్టుకునే అంశంతో, ఒక చక్కని మెసేజ్‌తో దర్శకుడు నాని ఆచార్య తెరకెక్కించారు. ఘంటాడి కృష్ణ అందించిన పాటలు ప్రేక్షకులని మెప్పిస్తాయి. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము..అన్నారు.  సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ..ఇది నా 50వ చిత్రం. సంగీత దర్శకుడిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ నాకు ఈ చిత్రంతో ప్రారంభం అవుతుందని, ఈ సినిమా మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు..అని అన్నారు.  రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి, బిత్తిరిసత్తి, రవిప్రకాష్‌, శివన్నారాయణ, బాబీలహరి, జబర్ధస్త్‌ కు చెందిన రఘు, రాము, అప్పారావు, చిట్టిబాబు, చమ్మక్‌చంద్ర మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, ఎడిటింగ్‌: మార్తాండ్‌. కె. వెంకటేష్‌, కెమెరా: జిఎల్‌.బాబు, కొరియోగ్రఫీ: నిక్సన్‌ డిక్రూజ్‌, భాను, గణేష్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, పాటలు: కందికొండ, వరికుప్పల యాదగిరి, రామ్‌ పైడిశెట్టి, చిలుకరెక్క గణేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శివకుమార్‌, కో-డైరెక్టర్‌: జి. భూపతి, సమర్పణ: సాయితేజ పాటిల్‌, నిర్మాత: శివరాజ్‌ పాటిల్‌, స్టోరీ, డైరెక్షన్‌: నాని ఆచార్య. Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అనుష్క‌పై రకుల్ సంచలన కామెంట్స్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే మొదటిగా వినిపించే పేరు రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఆమె స్టార్ హీరోయిన్ అనుష్కపై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. TNN | Updated: Dec 7, 2016, 03:19PM IST Rakul Preet Singh Sensational Comments On Anushka ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే మొదటిగా గుర్తొచ్చేపేరు రకుల్ ప్రీత్ సింగ్ . ఈమె టాలీవుడ్‌లో మెరుపుతీగ అయిపోయింది. అది ఎంతలా అంటే ‘ఒక్కసారి నటించిపోవమ్మా డేట్స్ అడ్జస్ట్ చేసుకుని’ అని నిర్మాతలు ఆమెకోసం వెయిట్ చేసేంతగా. రకుల్ ప్రీత్‌సింగ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఏ విషయంలో కూడా చాలా ఆచీ తూచీ మాట్లాడుతూ వచ్చేది కానీ తెలుగులో స్టార్ హీరోలు మహేష్ బాబు, రాంచరణ్ నటిస్తూనే యంగ్ హీరోలు సాయిధరమ్ తేజ్, నాగచైతన్యల సరసన నటిస్తుండటంతో ఈ భామకు విపరీతమైన క్రేజ్ వచ్చేయడంతో అమ్మడికి డిమాండ్ పెరిగిపోయింది. దీంతో రకుల్ ఏం మాట్లాడినా చెల్లుతుందనే భావనతో మిగతా హీరోయిన్స్‌ని లెక్కచేయడంలేదట. తాజాగా స్టార్ హీరోయిన అనుష్కపై షాకింగ్ కామెంట్స్ చేయడంతో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. స్టార్ హీరోయిన్ అనుష్క‌ మీదే సెటైర్లు వేసింది. మోడ్ర‌న్ గ‌ర్ల్‌గా వెండితెర పై రంగులు పూస్తున్నారు క‌దా.. ‘అరుంధ‌తి, రుద్రమదేవి, దేవ‌సేన’ లాంటి క్యారెక్ట‌ర్ల‌లో న‌టించే ఛాన్స్ వ‌స్తే మీరు అంగీక‌రిస్తారా? అన్న ప్రశ్నకు అమ్మ‌డు షాకింగ్ సమాధానం ఇచ్చింది. అలాంటి క్యారెక్టర్లు వేయాలంటే అనుష్కకు మాత్రమే సెట్ అవుతుందని అలాంటి ఫిజిక్ తనకు లేదని ఆ పాత్రలు వేసేంత వయసు కూడా తనకు రాలేదని సమాధానం ఇచ్చింది. అనుష్కను ఆంటీని చేస్తూ.. త‌న ఏజ్ మోడ్ర‌న్ గ‌ర్ల్‌, ల‌వ‌ర్‌గా చేయ‌డానికి సూట్ అవుతుంద‌ని కానీ, అలాంటి పాత్రలు కొందరే చేయాలని ర‌కుల్ చెప్పుకొచ్చింది. అనుష్కని టార్గెట్‌ చేస్తూ ఈ యంగ్ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం రేపాయి. అనుష్క ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లైనా.. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా అనేక లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. హీరోయిన్ అన్నాక కేవలం కొన్ని పాత్రలకే పరిమితం అయిపోతే ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలాంటి పాత్ర వచ్చినా వాటిని చేసి మెప్పించాలే తప్ప వయసుతో పోల్చి కించపర్చవద్దని రకూల్‌కి అర్థం అయ్యి ఉండదని విమర్శిస్తున్నారు అనుష్క ఫాన్స్.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
Tean india శ్రీలంక, బంగ్లాతో భారత్‌ ముక్కోణపు టి20 సిరీస్‌ న్యూఢిల్లీ: శ్రీలంకలో మార్చి 2018లో జరిగే ముక్కోణపు టి20 సిరీస్‌లో టీమిండియా ఆడనుంది.ఆతిథ్య శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్‌తో కలిసి టీమిండియా ముక్కోణపు సిరీస్‌లో పాల్గొంటుంది.ఇదిలా ఉంటే శ్రీలంక కూడా వచ్చే సంవత్సరం భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉంది.ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక 3 టెస్టులు,5 వన్డేలు,2 టి20 మ్యాచ్‌లు భారత్‌తో ఆడనుంది.అయితే ఈ పర్యటనలకు సంబంధించి అధికారికంగా నిర్ణయం వెలువడాల్సి ఉంది.ఈ ఏడాది ఫిబ్రవరి లో జరిగే ఐసిసి సమావేశంలో బిసిసిఐకి మద్దతుగా శ్రీలంక బోర్డు నిలిచిన సంగతి తెలిసిందే.కాగా ప్రస్తుతం బంగ్లాదేశ్‌ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది.రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు అక్కడికి వెళ్లింది.ఇప్పటికే ముగిసిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ 259 పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో పరాజయం చెందింది.ప్రస్తుతం బంగ్లాదేశ్‌,శ్రీలంక జట్ల మధ్య రెండవ టెస్టు జరుగుతుంది.
2
Suresh 210 Views సెమీఫైనల్‌లో భారత్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ టి20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. దీంతో భారతజట్ట్టు వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈనెల 31న ముంబైలో జరిగే రెండో సెమీఫైనల్‌ జరగనుంది. ఇదిలా ఉండగా ఈనెల 30న జరిగే మొదటి సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్టు తలపడనున్నాయి.
2
Hyd Internet 75 Views stock markets ends with profits stock market ముంబాయి: బుధవారం స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆర్‌బీఐ విధాన పరపతి సమీక్ష నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఆరంభం నుంచే స్టాక్‌మార్కెట్లు లాభాల బాటలో పయాణించాయి. అయితే వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకోవడంతో సూచీలు కాస్త జోరు తగ్గించినప్పటికీ చివరికి లాభాలను దక్కించుకున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 174 పాయింట్లు లాభపడి 31,672 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 9,915 వద్ద ముగిసింది.
1
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Gold Rate: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు . ఒకవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం, మరోవైపు అమెరికా - చైనా మధ్య నెలకొన్నొ వాణిజ్య యుద్దం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. Samayam Telugu | Updated: Sep 25, 2018, 01:43PM IST Gold Rate: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు దేశవ్యాప్తంగా బంగారం ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గి.. ప్రస్తుతం రూ.32,160 వద్ద కొనసాగుతోంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం అతిస్వల్పంగా రూ.10 పెరిగి రూ.30,160 వద్ద కొనసాగుతోంది. ఒకవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం, మరోవైపు అమెరికా - చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్దం నేపథ్యంలో బంగారం ధరలు దిగొచ్చాయి. వెండి ధరలు కూడా పతనమయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే రూ.90 తగ్గిన 100 గ్రాముల వెండి ధర ప్రస్తుతం రూ.4,020 వద్ద కొనసాగుతోంది. దీంతో సోమవారం కిలో వెండి ధర రూ.41,100 పలకగా..మంగళవారం రూ.40,110గా ట్రేడ్ అవుతోంది. సెప్టెంబరు 25న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు నగరం 22 కారెట్ల బంగారం ధర 24 కారెట్ల బంగారం ధర చెన్నై
1
bit coin value reduced 50% this year upto now 50 శాతం ప‌త‌న‌మైన బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ పతనం కొనసాగుతోంది. కొత్త ఏడాది మొదలు నుంచి ప్రారంభమైన బిట్ కాయిన్ పతనం ఇప్పటి వరకూ 50 శాతం వరకూ విలువ కోల్పోయింది. మార్చి 30 నాటికి బిట్ కాయిన్ ఆసియాలో 7000 డాలర్ల స్థాయి దిగువన పతనమైంది. హాంకాంగ్ లో ట్రేడవుతున్న బిట్ కాయిన్ 6912 డాలర్ల వద్ద కనిష్ట స్థాయికి పతనమైంది. Samayam Telugu | Updated: Apr 1, 2018, 03:09PM IST క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ పతనం కొనసాగుతోంది. కొత్త ఏడాది మొదలు నుంచి ప్రారంభమైన బిట్ కాయిన్ పతనం ఇప్పటి వరకూ 50 శాతం వరకూ విలువ కోల్పోయింది. మార్చి 30 నాటికి బిట్ కాయిన్ ఆసియాలో 7000 డాలర్ల స్థాయి దిగువన పతనమైంది. హాంకాంగ్ లో ట్రేడవుతున్న బిట్ కాయిన్ 6912 డాలర్ల వద్ద కనిష్ట స్థాయికి పతనమైంది. దీంతో బిట్ కాయిన్ గరిష్ట స్థాయి నుంచి 50 శాతం పతనాన్ని నమోదు చేసుకుంది. అలాగే మరికొన్ని క్రిప్టోకరెన్సీలైన రిపుల్, లైట్ కాయిన్ లు సైతం తమ శుక్రవారం ట్రేడింగ్ లో విలువను కోల్పోయాయి. ముఖ్యంగా మేజర్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ బిట్ కాయిన్ పేమెంట్స్ నుంచి దూరమవ్వడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ప్రముఖ సోషల్ మీడియా పోర్టల్ రెడ్డిట్ ఇకపై క్రిప్టో కరెన్సీ చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. అలాగే ట్విట్టర్, ఫేస్ బుక్, గూగుల్ సంస్థలు సైతం బిట్ కాయిన్ అడ్వర్టయిజ్ మెంట్లను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించాయి. అంతేకాదు అమెరికాలోని ప్రముఖ బ్యాంకులన్నీ కూడా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా బిట్ కాయిన్ కొనుగోళ్లను నిలిపేశాయి. ఈ కారణాలతో బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టో కరెన్సీలన్నీ తిరోగమన బాట పట్టాయి.
1
ఇగో చిత్రం ప్రారంబోత్సవ గ్యాలరీ First Published 2, Jul 2017, 1:33 PM IST ఇగో చిత్రం ప్రారంబోత్సవ గ్యాలరీ ఇగో చిత్రం ప్రారంబోత్సవ గ్యాలరీ ఇగో చిత్రం ప్రారంబోత్సవ గ్యాలరీ ఇగో చిత్రం ప్రారంబోత్సవ గ్యాలరీ ఇగో చిత్రం ప్రారంబోత్సవ గ్యాలరీ ఇగో చిత్రం ప్రారంబోత్సవ గ్యాలరీ ఇగో చిత్రం ప్రారంబోత్సవ గ్యాలరీ ఇగో చిత్రం ప్రారంబోత్సవ గ్యాలరీ ఇగో చిత్రం ప్రారంబోత్సవ గ్యాలరీ ఇగో చిత్రం ప్రారంబోత్సవ గ్యాలరీ Recent Stories
0
నెలాఖరుకి 'శతమానం భవతి' షూటింగ్ పూర్తి Highlights ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి".నవంబర్ 28 కి పాటల తో సహా షూటింగ్ పూర్తి చేసుకుని, చిత్ర బృందం హైదరాబాద్ చేరుకుంటుంది.  ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి".  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి 2017 కి విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే.   ప్రస్తుతం గోదావరి జిల్లా అమలాపురం లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం టాకీ పార్ట్ నవంబర్ 18 కి పూర్తి అవుతుంది. నవంబర్ 28 కి పాటల తో సహా షూటింగ్ పూర్తి చేసుకుని, చిత్ర బృందం హైదరాబాద్ చేరుకుంటుంది.    " శతమానం భవతి  తాతా మనవళ్ల  మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. చిత్రం షూటింగ్ నెలాఖరు కి పూర్తవుతుంది. డిసెంబర్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని, జనవరి లో సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుంది ", అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.       ఈ చిత్రం లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.    ఈ చిత్రానికి దర్శకత్వం : సతీష్ వేగేశ్న , ఎడిటింగ్ మధు , సినిమాటోగ్రఫి సమీర్ రెడ్డి, సంగీతం మిక్కీ జె మేయర్, నిర్మాతలు : రాజు , శిరీష్  Last Updated 25, Mar 2018, 11:57 PM IST
0
India Batting భారత్‌ 321-6 చాంపియన్స్‌ ట్రోఫీలోభాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది.. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టినభారత్‌ తొలి వికెట్‌కు 138 పరుగులు చేసింది.. ఓపెనర్లు రోహిత్‌శర్మ (78), శిఖర్‌ ధావన్‌ (125), శుబారంభం చేశారు.. 138 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ పెవిలియన్‌ చేరాడు.. దీంతో బ్యాట్‌ పట్టిన కోహ్లీ డకౌట్‌గా తిరిగి వచ్చాడు..అనంతరం యువరాజ్‌ (7), హార్ధిక ్‌పాండ్య (9) వచ్చిన కాసేపటికే వెనుదిరిగారు.. ధోనీ (63) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.. చివరి ఓవర్‌లో ధోనీ రనౌట్‌గా వెనుదిరిగాడు.. కేదార్‌ జాధవ్‌ 25 పరగులతో నాటౌట్‌గా నిలిచాడు.. దీంఓత శ్రీలంకకు 322 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.. బౌలింగ్‌లోమలింగ్‌ రెండు వికెట్లు, లక్ష్మల్‌ పరేలా , ప్రదీప్‌, గునరట్న చెరో వికెట్‌ పడగొట్టారు.
2
Hyderabad, First Published 1, Mar 2019, 12:52 PM IST Highlights బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ పై కౌశల్ ఆర్మీ ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలపై స్పందించిన కౌశల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఆధారాలతో సహా మీడియా ముందుకొచ్చాడు.  బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ పై కౌశల్ ఆర్మీ ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలపై స్పందించిన కౌశల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఆధారాలతో సహా మీడియా ముందుకొచ్చాడు. ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఆశ్చర్యానికి గురి చేశాయి. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత అభిమానులు ఎక్కడకి పిలిస్తే అక్కడకి వెళ్లాననిమ చాలా మందిని కలిసి వచ్చానని.. అయితే దీనిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకున్నారని కౌశల్ చెప్పాడు. కొందరు కౌశల్ ఆర్మీ సభ్యులు కౌశల్ ని అభిమానించే అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించినట్లు చెప్పారు. కౌశల్ ని కలిసే ఛాన్స్ కావాలంటే తమకి న్యూడ్ ఫోటోలు పంపాలని కౌశల్ ఆర్మీ సభ్యులు కొందరు అమ్మాయిలను వేధించారట. ఈ విషయం కౌశల్ కి తెలియడంతో వారిని మందలించాడట. దీంతో వారు కౌశల్ కి వ్యతిరేకంగా మారి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, నిజాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా చానెళ్లు వారితో చర్చలు  నిర్వహిస్తున్నారని కౌశల్ చెప్పారు. అలానే పవన్ కళ్యాణ్ పై తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు.  Last Updated 1, Mar 2019, 12:52 PM IST
0
Apr 22,2015 మైక్రోమాక్స్‌ నుంచి కాన్వస్‌ స్పార్క్‌                 న్యూఢిల్లీ : ప్రముఖ దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ మైక్రోమాక్స్‌ తాజాగా మార్కెట్లోకి కాన్వస్‌ స్పార్క్‌ 3జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.4,999గా నిర్ణయించింది. తొలుత ఈ మొబైల్‌ను కేవలం స్నాప్‌డీల్‌లో మాత్రమే విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. వారం తర్వాత రిటైల్‌ మార్కెట్లో విక్రయాలకు ఉంచుతామని మైక్రోమాక్స్‌ సిఇఒ వినీత్‌ తనేజా పేర్కొన్నారు. ప్రతి ఏడాది 7 కోట్ల మంది భారతీయులు తమ స్మార్ట్‌ఫోన్లను అప్‌గ్రేడ్‌ చేసుకుంటున్నారన్నారు. స్పార్క్‌ 900 మెగాహెడ్జ్‌, 2100 మెగాహెడ్జ్‌ల 3జికి మద్దతు చేస్తుంది. 1.3 గిగాహెడ్జ్‌ క్వార్డ్‌కోర్‌ ప్రాసెసర్‌, 4.7 అంగుళాల క్యూహెచ్‌డి డిస్‌ప్లే, 1జిబి ర్యామ్‌ దీని ప్రత్యేకతులగా ఉన్నాయి. 2000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, 32 జిబి మెమోరీ విస్తరణ, ఆండ్రాయిడ్‌ లొల్లిపొప్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లతో దీన్ని అభివృద్ధి చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
Read More: కోహ్లీ డకౌట్.. కెరీర్‌లో తొలిసారి ‘డబుల్’ డక్ ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 37 వద్ద ఈరోజు బ్యాటింగ్‌ని కొనసాగించిన మయాంక్ అగర్వాల్.. 183 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సీనియర్లు రోహిత్ శర్మ (6), విరాట్ కోహ్లీ (0) విఫలమైనా.. చతేశ్వర్ పుజారా (54), అజింక్య రహానె (86)తో కలిసి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన మయాంక్ అగర్వాల్ టీమిండియాని తిరుగులేని స్థితిలో నిలిపాడు. ప్రస్తుతం మయాంక్‌తో పాటు క్రీజులో రవీంద్ర జడేజా (13 బ్యాటింగ్) ఉండగా.. భారత్ జట్టు 101.1 ఓవర్లు ముగిసే సమయానికి 374/4తో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైన నేపథ్యంలో.. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 224 పరుగులు. IND vs BAN 1st Test LIVE Score బోర్డు కోసం క్లిక్ చేయండి..! భారత్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన ఓపెనర్ల జాబితాని పరిశీలిస్తే..? వీరేంద్ర సెహ్వాగ్ ఆరు డబుల్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. సునీల్ గవాస్కర్ మూడు ద్విశతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో మాన్కండ్, వసీమ్ జాఫర్, మయాంక్ అగర్వాల్ సంయుక్తంగా రెండు డబుల్ సెంచరీలు ఉన్నారు. Read More: బంగ్లాపై టెస్టులో రోహిత్ శర్మ టీ20 షాట్.. ఔట్   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV యూపీఐ ద్వారా... అమెజాన్ పేమెంట్స్! అమెజాన్ ఇండియా యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) ద్వారా నగదు చెల్లింపు సేవలను అందుబాటులోకి తెచ్చింది. TNN | Updated: Feb 6, 2018, 01:58PM IST అమెజాన్ ఇండియా పేమెంట్లను ఇకపై యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) ద్వారా కూడా చెల్లించవచ్చు. దీనిద్వారా రూ.10,000 వరకు లావాదేవీలు చేసే అవకాశం ఉంది. అమెజాన్ మొబైల్ యాప్‌కు మాత్రమే ఇది వర్తిస్తోంది. అమెజాన్ డెస్క్‌టాప్ సైట్ ద్వారా షాపింగ్ చేసేవారికి ఈ సదుపాయం ఉండదు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్ వాటి ఈకామర్స్ సైట్ల ద్వారా యూపీఐ నగదు చెల్లింపు సేవలను అందిస్తున్నాయి. యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేయదలచినవారు మొదటగా అమెజాన్ ఇండియా మొబైల్‌ అప్లికేషన్‌లోకి వెళ్లాలి. నగదు చెల్లింపు చేసే క్రమంలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ ఆప్షన్స్‌తోపాటు యూపీఐ ఆప్షన్ కూడా ఉంటుంది. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు చెల్లించవచ్చు.
1
స్మార్ట్‌ఫోన్లపై రూ.2600 క్యాష్‌బ్యాక్‌! - అమెజాన్‌తో జట్టుకట్టిన ఎయిర్‌టెల్‌ ముంబయి: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారులను వీలైనంత ఎక్కువ స్థాయిలో తమ గొడుగు కిందకు తెచ్చుకొనే యత్నాల్లో భాగంగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిరల్‌టెల్‌ శుక్రవారం గొప్ప ముందడుగు వేసింది. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌తో భారతీ ఎయిర్‌టెల్‌ చేతులు కలిపింది. వ్యూహాత్మక భాగస్వాములుగా ఈ రెండు సంస్థలు కలిసి బడ్జెట్‌ ధరల్లో భారతీయులకు స్మార్ట్‌ఫోన్లను తీసుకురానున్నట్లు శుక్రవారం వెల్లడించాయి. దేశంలో ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్‌ వినియోగించని భారతీయులు లక్షల మంది ఉన్నారని, వారందరినీ దృష్టిలో ఉంచుకొనే అతి తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్లను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇరు సంస్థలు వెల్లడించాయి. ఈ 4జీ స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ.3,999 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించాయి. ఈ సందర్భంగా భారతీ ఎయిర్‌టెల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ వాణి వెంకటేష్‌ మాట్లాడుతూ.. అమెజాన్‌ ఇండియాతో భాగస్వామ్యం భారత్‌లో మరింత తమ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. 'మేరా పెహలా స్మార్ట్‌ఫోన్‌ ప్లాన్‌'లో భాగంగా తాము ఈ చౌక స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించిటనట్టుగా ఆయన వివరించారు. దీంతో పాటు ఇరు కంపెనీలు భాగస్వాములుగా మారిన నేపథ్యంలో 65 స్మార్ట్‌ఫోన్లపై రానున్న రోజుల్లో రూ.2,600 వరకూ క్యాష్‌ బ్యాక్‌ను అందించనున్నట్లు ఎయిర్‌టెల్‌ సంస్థ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో తెలిపింది. ఇందులో శాంసంగ్‌ సహా, వన్‌ ప్లస్‌, షామీ, హానర్‌, ఎల్‌జీ, లెనోవో, మోటో తదితర ఫోన్లు ఉన్నాయి. వినియోగదారులు 36 నెలల పాటు ఎయిర్‌టెల్‌ నుంచి రూ.2000 క్యాష్‌బ్యాక్‌ను.. మరో రూ.600లను రూ.169తో అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌పై రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా లభించనుందని ఎయిర్‌టెల్‌ బీఎస్‌ఈ వెల్లడించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
yuvraj singh shares video of the most bizarre dismissal in the history of cricket ఇలా అవుటవడం బహుశా చూసి ఉండరు! ఒకే ఓవర్లో రెండు బంతుల్ని ఆడకుండా వదిలేస్తే బ్యాట్స్‌మెన్ అవుటవడం ఎప్పుడైనా చూశారా? గల్లీ క్రికెట్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుతున్నప్పుడు .. TNN | Updated: Nov 14, 2017, 09:30PM IST ఒకే ఓవర్లో రెండు బంతుల్ని ఆడకుండా వదిలేస్తే బ్యాట్స్‌మెన్ అవుటవడం ఎప్పుడైనా చూశారా? గల్లీ క్రికెట్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుతున్నప్పుడు ఇలాంటి రూల్స్ ఓకేగానీ, అంతర్జాతీయ మ్యాచ్‌లో ఇలాంటి నిబంధనల గురించి విన్నారా? పదేళ్ల క్రితం ఓ ఛారిటీ మ్యాచ్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. యువరాజ్ సింగ్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. అలా అంపైర్ ఎందుకు అవుటిచ్చాడో తెలియక నెటిజన్లు బుర్ర పీక్కున్నారు. బంతి బ్యాట్ అంచుకైనా తాకకుండానే, ఫీల్డర్లెవరూ అపీల్ చేయకుండానే అవుటివ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. ఇలా ఎందుకు జరిగిందో క్రికెట్ స్టాటిషియన్ ఒకరు దానికి సమాధానం ఇచ్చారు. ఒకే ఓవర్లో రెండు బంతుల్ని బ్యాట్స్‌మెన్ ఆడకుండా వదిలేస్తే అవుట్ అనే నిబంధనను 2007లో జరిగిన ఛారిటీ మ్యాచ్‌లో విధించారని తెలిపాడు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం అంతకు ముందు ఓవర్ చివరి బంతికి బ్యాట్స్‌మెన్ అవుటయ్యాడని, కానీ అప్పుడు అవుట్ ఇవ్వలేదని, మరుసటి ఓవర్ తొలి బంతి వేశాక అంపైర్ అవుటిచ్చాడని చెబుతున్నారు. For all those asking... This match was played for charity in 2007. The rules for this match was that if a batsman leaves two balls, which are playable, without playing a shot in the same over, the umpire can declare you out. And that's what happened in this case! pic.twitter.com/iZA1C3sT72
2
షాక్..! శ్రీరెడ్డి కి కేంద్రం నుండి ఊహించని మద్దతు Highlights షాక్..! శ్రీరెడ్డి కి కేంద్రం నుండి ఊహించని మద్దతు శ్రీరెడ్డి నెల రోజుల పోరాటానికి చాలా మద్దతు ఇస్తూనే ఉన్నా కొంత మంది ఆమెను ఇంకా తప్పుపడుతూనే ఉన్నారు. టాలీవుడ్ లోగుట్టును మెల్లమెల్లగా యయటపెడుతూ కొంతకాలంగా టాలీవుడ్ ప్రముఖలుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇటీవలే హైదరాబాద్ ఫిల్మిం ఛాంబర్ ముందు అర్ధనగ్నంగా నిలబడ్డ విషయం తెలిసిందే. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ టాలీవుడ్ వెంటనే మా అసోసియేషన్ వారు ప్రెస్ మీట్ పెట్టి శ్రీరెడ్డి కి మెంబర్ షిప్ మరియు సినిమా అవకాశాలు కూడా ఇవ్వకూడదని తెలియచేశారు. దీంతో తనకు మద్దతుగా ఒక్కరు కూడా రాలేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే శ్రీరెడ్డి పోరాటానికి ఊహించని మద్దతు లభించింది. శ్రీరెడ్డి ఆరోపణలను ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. సమస్య పరిష్కార యంత్రాంగం లేకపోవడం పెద్ద లోటు అని మానవ హక్కుల సంఘం అంటోంది. తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై… తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసారశాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు ఇష్యూ చేసింది. సినిమాల్లో నటించకుండా ఆంక్షలు విధించడం… శ్రీరెడ్డి హక్కులకు భంగం కలిగించడమేనని ఎన్‌హెచ్‌ఆర్సీ అభిప్రాయపడింది. Last Updated 12, Apr 2018, 4:26 PM IST
0
TWO WHEELERS నోట్లరద్దుతో దెబ్బతిన్న టూవీలర్‌ మార్కెట్‌ న్యూఢిల్లీ, జనవరి 3: పెద్దనోట్లరద్దుతో దేశంలో ద్విచక్ర వాహనాల కంపెనీలకు అమ్మకాలు పడి పోయాయి. గ్రామీణప్రాంతంలో నగదు సంక్షోభం మరింత ఎక్కువ కావడంతో మార్కెట్‌ మొత్తం దెబ్బ తిన్నది. హీరోమోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, టివిఎస్‌ మోటార్‌ కంపెనీ వంటివి డిసెంబరులో తక్కువ అమ్మకాలు నమోదుచేశాయి. నవంబరునెలలో ఉన్న క్షీణతనే డిసెంబరులో కొనసాగించాయి. ఈ ప్రభా వం నుంచి కోలుకునేందుకు మరో రెండు, మూడు నెలలు పడుతుందని అంచనా. దేశంలోనే అతిపెద్ద టూవీలర్‌ తయారీసంస్థగా నిఇచిన హీరోమోటో కార్ప్‌ 33.91శాతం మొత్తం డిసెంబరు విక్రయాల్లో దిగజారినట్లు గుర్తించింది. గత ఏడాది 4,99,665 యూనిట్లకుగానుఈ ఏడాది 3,30,202 యూనిట్లు మాత్రమే విక్రయించింది.బజాజ్‌ ఆగో కూడా దేశీయ బైక్‌ విక్రయాలు11శాతం దిగజారాయి. 1,20,322 యూనిట్ల నుంచి 1,06,665 యూనిట్లుగా ఉంది. చెన్నై కేంద్రంగా ఉన్నటివిఎస్‌ మోటార్‌ కంపెనీ దేశీయ టూవీలర్‌ విక్రయాలు 8.76శాతం దిగ జారాయి. 1,53,413 యూనిట్లకు పడిపోయాయి. గత ఏడాది డిసెంబరులో 1,68,160 యూనిట్లు విక్రయించింది. బైక్‌ విక్రయాలు కూడా 18.54 శాతం పడిపోయాయి. 71,435 యూనిట్లనుంచి 58,18 యూనిట్లకు పడిపోయాయి. టివిఎస్‌ స్కూటర్లు 55,536 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది 65,025యూనిట్లుగా ఉంది. 14.59ఆతం దిగజారింది. కేవలం పెద్దనోట్ల రద్దువల్లనే గ్రామీణ ప్రాంతాలనుంచి ఎక్కువ విఘాతం కలిగిందని నిపు ణులు అంచనా వేస్తున్నారు. ఆటోమొబైల్‌రంగం లెక్కలప్రకారంచూస్తే గ్రామీణప్రాంతాల నుంచి 50శాతం బైక్‌ల కొనుగోళ్లు ఉంటాయి. ఎంట్రీలెవెల్‌ బైక్‌లు ఎక్కువ ఉంటాయి. ఆటోమొబైల్‌రంగ సంస్థ సియామ్‌ అంచనాలనుచూస్తే 12,43,251 యూని ట్లుగా ఉన్నాయి. 13,20,552 యూనిట్లు గత ఏడాది విక్రయిస్తే ఈ ఏడాది 5.85శాతం తగ్గాయి. మోటారు సైకిళ్ల విక్రయాలు కూడా 8,66,696 యూనిట్లనుంచి 7,78,178 యూనిట్లకు పడి పోయాయి. 10.21శాతం క్షీణించాయి. ఇక స్కూట ర్ల విక్రయాలు కూడా పట్టణ ప్రాంతాల్లోకూడా దెబ్బ తిన్నాయి. 3,96,204 నుంచి 3,88,692 యూనిట్లకు పడిపోయాయి. 1.85శాతం క్షీణిం చింది. పెద్దనోట్ల రద్దుకు ముందు అక్టోబరులో టూ వీలర్‌ విక్రయాలు 8.72శాతంపెరిగి 18,00,672 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది 16,56,304 యూనిట్లకంటే 8.72శాతంపెరిగా యి. మోటార్‌సకిళ్ల విక్రయాలు కూడా 7.37శాతం పరిగి అక్టోబరులో 11,44,516 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే స్కూటర్‌ విక్రయాలు కూడా అక్టో బరులో 5,25,138 యూనిట్లనుంచి 5,68,410 యూనిట్లకు పెరిగాయి. 8.24శాతం వృద్ధిచూస్తే నవంబరు,డిసెంబరునెలల్లో పూర్తిగా పడిపోయా యి. పండగసీజన్‌కావడంతో విక్రయాలకు మద్దతు వచ్చింది. పెద్దనోట్ల రద్దు కారణంగా డీలర్లవద్ద నిల్వ లు పేరుకున్నాయి. ప్రస్తుతం కంపెనీలుసైతం ఉత్ప త్తిని తగ్గించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. గ్రామీణ డిమాండ్‌పై ప్రత్యేకించి టూవీలర్‌ రంగంపై గ్రామీణ మార్కెట్‌ తీవ్రప్రభావం చూపించింది.
1
ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ (వీడియో) Highlights రైజర్స్‌ రయ్‌..రయ్‌.. ఐపీఎల్‌-11 ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక‍్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ పైచేయి సాధించింది.  బ్యాటింగ్‌లో అదరగొట్టిన రషీద్‌ ఖాన్‌ (10 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 34 నాటౌట్‌), బౌలింగ్‌ (3/19)లో ఎప్పటిలాగే చెలరేగి జట్టుకు ఆపద్బాంధవుడిగా మారాడు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 14 పరుగుల తేడాతో నెగ్గి ఫైనల్లో అడుగుపెట్టింది. బ్యాటుతో కేవలం 10 బంతుల్లో 34 పరుగులు సాధించాడు.. 150కి పరిమితమవుతుందనుకున్న సన్‌రైజర్స్‌ ఏకంగా 174 పరుగులతో ఇన్నింగ్స్‌ ముగించింది. బంతితో 4 ఓవర్లేసి 19 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.. అలవోకగా గెలిచేలా కనిపించిన నైట్‌రైడర్స్‌ ఓటమి ఉచ్చులో చిక్కుకుంది. ఇవి చాలదన్నట్లు ఫీల్డింగ్‌లోనూ పాదరసంలా కదిలి రెండు ముఖ్యమైన క్యాచ్‌లను అందుకున్నాడు, ఒక రనౌట్లోనూ భాగస్వామి అయ్యాడు. ఇదీ ఐపీఎల్‌-11 రెండో క్వాలిఫయర్లో రషీద్‌ ఆల్‌రౌండ్‌ జోరు సాగిన తీరు. Last Updated 26, May 2018, 10:32 AM IST
2
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఇకపై షియోమీ వాట్సాప్‌ సేవలు..! మొబైల్ తయారీ సంస్థ షియోమీ తన వినియోగదారుల కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ‘ఎంఐ బన్నీ’ పేరిట ఉన్న కాంటాక్ట్ ద్వారా షియోమీ ఈ సేవలను ప్రారంభించింది. TNN | Updated: Feb 5, 2018, 06:31PM IST ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ తన వినియోగదారుల కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే బిజినెస్ వాట్సాప్ యాప్‌ను రూపొందించిన ఈ సంస్థ ఇదే యాప్‌ ద్వారా తన మొబైల్ వినియోగదారులకు సేవలు అందించనుంది. వాట్సాప్‌లో ‘ఎంఐ బన్నీ’ పేరిట ఉన్న కాంటాక్ట్ ద్వారా షియోమీ తన వాట్సాప్ సేవలను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా భారత్‌లో ఉన్న షియోమీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆ సంస్థ నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే షియోమీ వాట్సాప్ సేవలు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ సమయంలోనే వినియోగదారులు తమ సమస్యలను వాట్సాప్‌లో తెలిపేందుకు అవకాశం ఉంటుంది. షియోమీ వాట్సాప్ సేవలు పొందాలంటే ముందుగా +91 7760944500 ఫోన్ నంబర్‌ను కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేసుకోవాలి. వాట్సాప్ ఓపెన్ చేసి పైన తెలిపిన కాంటాక్ట్ నంబర్‌కు ' Xiaomi ' అని మెసేజ్ పెట్టాలి. దీంతో యూజ‌ర్‌కు వెల్‌కం అంటూ మెసేజ్ వ‌స్తుంది. తర్వాత వినియోగదారుడి పేరు, ఉంటున్న ప్రాంతం వివరాలను మెసేజ్ చేయాలి. దీంతో వినియోగదారులకు సమీపంలోని షియోమీ కస్టమర్ సర్వీస్ వివరాలు వస్తాయి. ఒకవేళ వినియోగదారుడు షియోమీ వాట్సాప్ సేవలు వద్దనుకుంటే 'STOP' అని ఓ మెసేజ్‌ను సంబంధిత నెంబరుకు వాట్సాప్ మెసేజ్ చేస్తే సరిపోతుంది. దీంతో షియోమీ వాట్సాప్ సేవలు ఆగిపోతాయి. ప్రస్తుతం ఈ వాట్సాప్ సేవలు ప్రయోగదశలోనే ఉన్నందున వినియోగదారులు పూర్తిస్థాయిలో సేవలు పొందలేరు. త్వరలోనే పూర్తిస్థాయి సేవలతో అందుబాటులోకి వస్తాయని షియోమీ సంస్థ ప్రకటించింది.
1
PAN పాన్‌నంబరుకు గడువు పెంపు న్యూఢిల్లీ: ఆదాయపు పన్నుశాఖ బ్యాంకు ఖాతాలను పాన్‌నంబరుతో అనుసంధానం చేసేం దుకుగాను మరో మూడునెలలపాటు గడువునిచ్చిం ది. పన్నుల ఎగవేతను అరికట్టేందుకు భారీ ఎత్తున కార్యాచరణ ప్రారంభించిన ఐటిశాఖ పాన్‌తోపాటు ఆధార్‌ను కూడా తప్పనిసరిచేసింది. ఈ గడువు జూన్‌ 30వ తేదీవరకూ ఇస్తున్నట్లు ప్రకటించింది. పన్నుల ఎగవేతదారులను నిరోధించేందుకు ఫారం-60ని అందచేయాల్సి ఉంటుంది. అందరు ఖాతాదారులు విధిగా అనుసరించాలి. పాన్‌నెంబరు లేదా ఫారం60ని సమర్పించేందుకు బ్యాంకులకు గడువు వాస్తవానికి గత ఫిబ్రవరి 28వతేదీతో ముగి సింది. పన్నుశాఖ ఈ నెల ఐదవ తేదీ ఈ గడువును జూన్‌ 30వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటిం చింది. ఆదాయపు పన్నుచట్టం ప్రకారంచూస్తే ఎవరైతే పాన్‌నంబరు లేదా ఫారం 60ని దాఖలు చేయలేదో వారందరూ విధిగా జూన్‌ 30వ తేదీ లోపు అందచేయాల్సి ఉంటుంది. పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం ప్రతి లావాదేవీకి ఆధార్‌, పాన్‌కార్డును నిర్బంధం చేసింది. 2.5 లక్షల పొదుపుఖాతాల డిపాజిట్లు, కరెంటు ఖాతాలకు 12.50లక్షల వరకూ పరిమితం చేసింది. ఒక్క రోజులోనే 50వేల రూపా యల డిపాజిట్లను కూడా పరిశీలించేందుకు నిర్ణయించింది. మొత్తంగాచూస్తే 15 లక్షల కోట్ల రద్దయిన నోట్లు బ్యాంకులకు డిపా జిట్‌అయ్యాయి. వీటన్నింటినీ పరిశీలన కోసం బ్యాంకులు విధిగా ఖాతాదారుల నుంచి పాన్‌నంబరు లేదా ఫారం60ని అంద చేయాల్సి ఉంటుందని ఐటిశాఖ ఆదేశించింది.
1
బాహుబలి2 మూవీ రివ్యూ( కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడి అభిప్రాయం మాత్రమే) Highlights బాహుబలి2 మూవీ రివ్యూ( కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడి అభిప్రాయం మాత్రమే) తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ఉన్న బాహుబలి ఫ్యాన్స్ అంటే... దేశమంతా అమితాసక్తితో ఎదురుచూస్తున్న ‘బాహుబలి 2’  ఎలా ఉండబోతోంది. ఈ ప్రశ్నకు మరికొద్ది గంటల్లో సమాధానం రానుంది. ఈ రాత్రి బాలీవుడ్‌ ప్రముఖుల కోసం ముంబైలోనూ ప్రీమియర్‌ షో వేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టాక్‌ బయటకు వచ్చింది. ‘బాహుబలి 2’ అద్భుతంగా ఉందని ఈ సినిమాను వీక్షించిన కేంద్ర సెన్సార్‌ బోర్డు సభ్యులు వెల్లడించారు. బాహుబలి మొదటి భాగం కంటే ఎంతో గొప్పగా, మెరుగ్గా ఉందని సెన్సార్‌ బోర్డు సభ్యుడొకరు ‘డీఎన్‌ఏ’ పత్రికతో చెప్పారు. ‘మొదటి భాగంతో పోలిస్తే బాహుబలి 2 ఎక్కువసేపు ఉంటుంది. దాదాపు మూడు గంటలపాటు సాగుతుంది. ఉత్కంఠభరితంగా సాగే కథనంతో మనకు సమయమే తెలియదు. సింగిల్‌ ఫ్రేమ్‌, షాట్‌, డైలాగుల్లో ఒక్క పదం కూడా కట్‌ చేయలేదు. ఒక్క కట్‌ కూడా చెప్పలేదు. పోరాట సన్నివేశాలు చాలా బాగా తీశారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్‌ కంటే సూపర్‌గా ఉన్నాయి. ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 8 కంటే కూడా బాగున్నాయి. ప్రేక్షకులు తప్పకుండా హ్యాపీగా ఫీలవుతార’’ని తెలిపారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయాన్ని ప్రేక్షకులకు వదిలేయాలని, ఇది ఆడియన్స్‌ ను ఆశ్చర్యచకితులను చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రభాస్‌, రానా పోటీపడి నటించారని ప్రశంసించారు. ‘రెండు సింహాలు దీటుగా తలపడినట్టు వీరిద్దరూ నటించారు. కొన్ని సన్నివేశాల్లో కంటతడి కూడా పెట్టిస్తారు. అది స్క్రీన్ పైనే చూడాలన్నారు. ఈసారి ఇద్దరూ సమానంగా ఆకట్టుకుంటార’ని వివరించారు. Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV దిల్ రాజుకి హీరో దొరికేశాడోచ్! 'శతమానంభవతి' చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సతీష్ వెగ్నేస ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా దిల్ రాజు తన బ్యానర్‌లో నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. TNN | Updated: Nov 14, 2017, 08:48PM IST ఈ ఏడాదిలో వరుసగా ఐదు హిట్ సినిమాలు అందుకున్న నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం తను నిర్మించిన ఆరో చిత్రం 'ఎంసిఏ'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎప్పటినుండో దిల్ రాజు 'శ్రీనివాస కళ్యాణం' సినిమా చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. 'శతమానంభవతి' చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సతీష్ వెగ్నేస ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా దిల్ రాజు తన బ్యానర్‌లో నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. కథ మొత్తం సిద్ధమయింది. సెట్స్ పైకి వెల్లడమే ఆలస్యం. అయితే దిల్ రాజుకి హీరో మాత్రం దొరకడం లేదు. రాజ్ తరుణ్, సాయి ధరం తేజ్ వంటి హీరోల పేర్లు వినిపించినప్పటికీ ఎవరిని ఖరారు చేయలేదు. రీసెంట్‌గా ఎన్టీఆర్ పేరు కూడా వినిపించింది. కానీ ఏది వర్కవుట్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం దిల్ రాజుకి హీరో దొరికినట్లు తెలుస్తోంది. నితిన్ హీరోగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను తెరకెక్కించబోతున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇటీవల 'లై' చిత్రంతో నిరాశ పడ్డ నితిన్ ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన తరువాత దిల్ రాజు బ్యానర్‌లో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0
Hyderabad, First Published 5, Nov 2018, 1:52 PM IST Highlights కోల్ కతా వేధికగా ఆదివారం భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ నిర్దేశించిన స్కోరు తక్కువగా ఉన్నప్పటికీ.. దానిని ఛేదించడానికి టీం ఇండియా బాగానే కష్టపడింది కోల్ కతా వేధికగా ఆదివారం భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ నిర్దేశించిన స్కోరు తక్కువగా ఉన్నప్పటికీ.. దానిని ఛేదించడానికి టీం ఇండియా బాగానే కష్టపడింది. ఈ మ్యాచ్ గెలుపోటములు పక్కనపెడితే.. వెస్టిండీస్ క్రికెటర్లు చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. మొదట టాస్ గెలిచిన కెప్టెన్  రోహిత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. విండీస్‌ వరుసగా వికెట్లను కోల్పోయింది. అయితే బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో హెట్‌మైర్‌తో కోఆర్డినేషన్ సరిగా లేకపోవడంతో  షై హోప్‌ రనౌటయ్యాడు. హోప్‌ ఆడిన షాట్‌ను ఫార్వార్డ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కేఎల్‌ రాహుల్‌ అందుకున్నాడు.  కానీ అతను విసిరిన త్రో కీపర్‌ పైనుంచి వెళ్లిపోయినా పక్కనే ఉన్న మనీశ్‌ పాండే దానిని చక్కగా అందుకున్నాడు. దీంతో అయోమయానికి గురైన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లు ఇద్దరూ  ఒకేవైపుకు పరుగెత్తారు. అనంతరం పాండే సునాయాసంగా రనౌట్‌ చేయడంతో హోప్‌ పెవిలియన్‌ బాట పట్టాడు.  ఇలా ఇద్దరూ ఒకేవైపు పరిగెత్తడంతో సోషల్ మీడియాలో వెస్టిండీస్ క్రికెటర్లపై జోకులు వేస్తున్నారు. రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇది క్రికెట్ బాస్.. రన్నింగ్ రేస్ కాదూ అంటూ.. కొందరు ఛలోక్తులు విసురుతున్నారు.  Last Updated 5, Nov 2018, 1:52 PM IST
2
internet vaartha 129 Views న్యూఢిల్లీ : ఐటి సేవల సంస్థ కాగ్నిజెంట్‌ సోమవారం డిసెంబరు త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. నికరలాభాల్లో 16.7శాతం వృద్ధిని ప్రక టించింది. 423.4 మిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు అంచనా. గత ఏడాది ఇదే కాలంలో 362.9 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అమెరికా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ భారత్‌లో ఎక్కువ ఉద్యోగులున్నారు. తన రాబడుల అంచనా 3.23 బిలియన్‌ డాలర్లు రెండో త్రైమాసికంలో సాధిస్తే 17.9శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో 2.74 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2015నాటికి నికరలాభం 13.2శాతం పెరిగి 1.62 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. రాబడులు 21శాతం పెరిగి 12.42 బిలియన్‌ డాలర్లని కంపెనీ ప్రకటించింది. కాగ్నిజెంట్‌ నాలుగో త్రైమాసికంలో రాబడులు 3.23 బిలియన్‌ డాలర్లుగా ఉండవచ్చని అంచనా. 2015 చివరినాటికి 12.41డాలర్లు రావచ్చని అంచనా వేసింది. 2016 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాబడులు 9.9నుంచి 14.3శాతంగా ఉంటాయని అంచనా వేసింది. 2015 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 13.65 బిలియన్‌ డాలర్ల నుంచి 14.20 బిలియన్‌ డాలర్లుగా ఉంటాయని అంచనా.
1
nibia నుబియా నుంచి రెండు కెమేరాల స్మార్ట్‌ఫోన్‌ న్యూఢిల్లీ, జూన్‌ 8: స్మార్ట్‌ స్లయిలిష్‌ ఫోన్‌తయారీ సంస్థ నుబియా కొత్త డ్యూయల్‌ సెల్ఫీకేమేరా లున్న స్మార్ట్‌ఫోన్‌ జడ్‌17ను భారత్‌లో విడుదల చేసింది. వెనుకభాగంలో రెండు 13 ఎంపి కెమే రాలు, ముందువైపు 16ఎంపికేమేరాతో నుబియా ఫోన్లు ఉన్నాయి. నుబియాకు జె17 మినీ సోని కెమేరాలు కస్టమైజ్డ్‌ సోని లైట్‌మోనోసెన్సార్‌ ట్రూకలర్‌ ఆర్‌జిబి సెన్సార్‌తో ఉంటాయి. నియోవిజన్‌6 సాప్ట్‌ వేర్‌తో లభిస్తాయి. నుబియా జె 17 మినీ కెమేరా అనేది ప్రొ, నార్మల్‌మోడ్స్‌లోనే కాకుండా 16 విభిన్న మోడళ్లు అందిస్తుంది. 64బిట్‌ఆక్టాకోర్‌ క్వాల్‌ కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 652 ప్రాసెసర్‌తో 4 జిబిరామ్‌, 64జిబి రామ్‌సపోర్టుతో రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్నది. 5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తోంది. కంపెనీ కంట్రీహెడ్‌ ఎరిక్‌హూ మాట్లాడుతూ నుబియా ప్రతి ఉత్పత్తి భారత్‌లో మంచి వాటా సాధించిందని, ప్రస్తుత నుబియా జడ్‌17ను భార త్‌లో రూ.19,999లకు అందిస్తున్నట్లు వెల్లడిం చారు. అమెజాన్‌డాట్‌ఇన్‌పై ఈనెల12వతేదీ నుంచి అందుబాటులో ఉంటుందని ఎరిక్‌హూ తెలిపారు.
1
పవన్ నన్ను ఎప్పటికి వదలడు... ఆ నమ్మకం నాకు ఉంది Highlights పవన్ నన్ను ఎప్పటికి వదలడు... ఆ నమ్మకం నాకు ఉంది  న‌చ్చావులే సినిమా ద్వారా సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన మాధ‌వీల‌త ఆ త‌రువాత అడ‌పా ద‌డ‌పా సినిమా అవ‌కాశాలు వ‌చ్చినా చివ‌ర‌కు వెండి తెర‌కు దూర‌మైన విష‌యం తెలిసిందే.ఇదిలా ఉండ‌గా ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్ర‌సార‌మైన కామెడీ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న మాధ‌వీ ల‌త జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై త‌న‌కున్న ప్రేమ‌ను మ‌రోసారి చాటుకుంది. అయితే, అదే ప్రోగ్రామ్‌లో మాధ‌వీల‌త‌తోపాటు హైప‌ర్ ఆది కూడా పాల్గొన్నాడు. ప్రోగ్రామ్‌లో భాగంగా మాధ‌వీ ల‌త‌కు హైప‌ర్ ఆది ల‌వ్ ప్రపోజ్ చేశాడు.  అయితే, ఎంత‌కీ మాధ‌వీ ల‌త హైప‌ర్ ఆదికి రెస్పాండ్ కాక‌పోవడంతో.. ఒక్క హ‌గ్ ఇస్తే ప‌డిపోతావ్ అంటూ హైప‌ర్ ఆది అన‌డంతో.. ఒక్క‌సారిగా స్పందించిన మాధ‌వీ ల‌త నేను ఒక్క ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మాత్ర‌మే హ‌గ్ ఇస్తా, మ‌రెవ్వ‌రికీ కూడా నేను హ‌గ్ ఇవ్వ‌ను అంటూ స‌మాధాన‌మిచ్చింది. అంతేకాకుండా, ప‌వ‌న్ క‌ల్యాన్‌ను ప్రేమించే వాళ్లు కోట్ల మంది అమ్మాయిలు ఉన్నారన్న హైప‌ర్ ఆది ప్ర‌శ్న‌కు మాధ‌వీల‌త స్పందిస్తూ.. కృష్ణుడ్ని రాథా మాత్ర‌మే కాదు, గోపికలంద‌రూ కూడా ప్రేమించారు అంటూ స‌మాధాన‌మిచ్చింది. అంతెందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికీ నా ప‌క్క‌నే ఉన్నాడు.. నాకు మాత్ర‌మే క‌నిపిస్తున్నాడు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌న్నెప్ప‌టికీ మోసం చేయ‌డు అంటూ మాధ‌వీల హైప‌ర్ ఆదికి స‌మాధాన‌మిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. Last Updated 21, May 2018, 11:02 AM IST
0
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV David Warner: ఐపీఎల్‌లోకి డేవిడ్ వార్నర్ మళ్లీ వచ్చేస్తున్నాడు..! పదేళ్ల ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటి వరకూ 114 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్ మొత్తం 4,014 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు.. 36 అర్ధ శతకాలు ఉండగా.. అతని ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 402 ఫోర్లు, 159 సిక్సర్లు ఉండటం విశేషం. Samayam Telugu | Updated: Mar 13, 2019, 06:44PM IST David Warner: ఐపీఎల్‌లోకి డేవిడ్ వార్నర్ మళ్లీ వచ్చేస్తున్నాడు..! హైలైట్స్ మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌లు మొదలు నిషేధం కారణంగా గత ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికీ దూరమైన డేవిడ్ వార్నర్ మార్చి 28న ముగియనున్న నిషేధం గడువు మార్చి 29న రాజస్థాన్‌తో తలపడనున్న సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ మళ్లీ ఐపీఎల్‌లోకి పునరాగమనం చేయబోతున్నాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. మార్చి 28 నుంచి ఈ ఓపెనర్ మ్యాచ్‌లు ఆడేందుకు మార్గం సుగుమమైంది. గత ఏడాది దక్షిణాఫ్రికాలో బాల్ టాంపరింగ్‌కి పాల్పడిన డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది నిషేధం విధించగా.. ఆ గడువు మార్చి 28తో ముగియనుంది. ఇప్పటికే విడుదలైన ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం.. మార్చి 29న రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. .@davidwarner31 is back and he has a special message for you. Presenting the #500ForYou offer for our first home g… https://t.co/1ZhFipjfhP — SunRisers Hyderabad (@SunRisers) 1552282955000 పదేళ్ల ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటి వరకూ 114 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్ మొత్తం 4,014 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు.. 36 అర్ధ శతకాలు ఉండగా.. అతని ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 402 ఫోర్లు, 159 సిక్సర్లు ఉండటం విశేషం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
- నెస్లే భారత్‌లో అంతర్భాగం - పాలోత్పత్తులు, చాక్లెట్లు, కన్ఫెక్షనరీ రంగాల్లో విస్తరిస్తాం - నెస్లే ఇండియా కొత్త అధినేత సురేష్‌ నారాయణన్‌ న్యూఢిల్లీ: మ్యాగి నూడిల్స్‌ త్వరలోనే మళ్లీ భారత్‌లోని రిటైల్‌ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని నెస్లే ఇండియా సంస్థ కొత్త అధినేత సురేష్‌ నారాయణన్‌ తెలిపారు. గత 30 ఏళ్ల చరిత్రలో నెస్లే సంస్థ మొట్టమొదటి సారిగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నష్టాలను మూటగటు ్టకోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అధికారికంగా తమ పదవిని చేపట్టిన నారాయణన్‌ (55) విలేఖరులతో మాట్లాడుతూ మ్యాగీని ప్రజలకు అందుబాటులో ఉంచడమే తన మొదటి కీలక కర్తవ్యమని ఆయన అన్నారు. వీటితో పాటు భారత్‌లో మరింత విస్తరించేందుకు నష్ట నివారణకు గాను తాము పాలు, పాలోత్పత్తులు, చాక్లెట్లు, కన్ఫెక్షనరీలతో పాటు ఇతర రంగాలపై కూడా దృష్టి పెట్టినట్లుగా ఆయన వివరించారు. ఆయా రంగాలలో కొత్త ఉత్పత్తులను తీసుకు వచ్చేందుకు గల అవకాశాలను తాము అన్వేషి స్తున్నట్లుగా ఆయన తెలిపారు. నెస్లే ఈ దేశంలో భాగమని ఆయన అన్నారు. గత వంద సంవత్సరాలుగా తాము ఇక్కడ ఉంటూ ఇక్కడి చట్టాలు, అధికారిక వర్గాలను గౌరవిస్తూ వస్తున్నామని ఆయన అన్నారు. అయితే ఎంత కాలంలో మ్యాగీ తిరిగి మార్కెట్లకు వచ్చేది నిర్దిష్టంగా ఇక్కడ వెల్లడించలేదు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని నిషేధాన్ని సవాలు చేస్తూ తాము న్యాయం కోసం వేచి చూస్తున్నట్లుగా ఆయన తెలిపారు. నిషేధం కారణంగా సంస్థ హోల్‌సేల్‌ విభాగం నిర్వీర్యంగా తయారైందని అన్నారు. చాలా మంది ఉపాధికి విఘాతం కలిగినట్లు తెలిపారు.మ్యాగీ నిషేధం కారణంగా జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి నెస్లే ఇండియా సంస్థ రూ.64.40 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. నెస్లేకు పూర్వవైభవాన్ని తేవడానికి గాను తాము ప్రచార వ్యయాన్ని బాగా పెంచనున్నట్లుగా తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1