link
stringlengths 41
231
| text
stringlengths 28
5k
|
---|---|
https://www.telugupost.com/top-stories/tdp-chief-chandrababu-is-politically-feared-he-cannot-make-any-political-decision-immediately-1363521 | తెలుగుదేశం పార్టీలో కోవర్టులున్నారు. వారిని ఏరివేస్తాం. పీకి పారేస్తాం. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన వరసగా సమీక్షలు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప ఏ ఒక్కదానిలో కనీస ప్రభావాన్ని తెలుగుదేశం పార్టీ చూపకపోవడంతో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకేముంది.. చంద్రబాబు కోవర్టులను గుర్తించి వారి జెండా పీకేస్తారనుకున్నారు. కానీ షరా మామూలే. ఆ సమీక్షలకే చంద్రబాబు వ్యాఖ్యలు పరిమితమయ్యాయి.రాజకీయ భయం....చంద్రబాబు కు రాజకీయంగా భయమెక్కువ. ఆయన ఏ రాజకీయ నిర్ణయమైనా వెంటనే తీసుకోలేరు. ఆ సంగతి చంద్రబాబును దగ్గరి నుంచి చూసిన వాళ్లకు తెలుసు. ప్రతి అంశాన్ని నానుస్తూ కాలమే సమాధానం చెబుతుందన్న రీతిలో చంద్రబాబు నిర్ణయాలు ఉంటాయి. అందునా ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ అసలు సాధ్యం కాదు. ప్రతి నాయకుడు అవసరం ఉంటుందని చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తారు. ఏరిపారేస్తానన్నారే?అందుకు కోవర్టుల ఏరివేత కార్యక్రమాన్ని చంద్రబాబు పక్కన పెట్టినట్లే కన్పిస్తుంది. మున్సిపల్ ఎన్నికల సమీక్ష సందర్భంగా నెల్లూరు ఇద్దరిపైనా, కుప్పంలో కొందరిపైనా చర్యలు తీసుకున్నారు తప్పించి ఎవరిపైనా ఎలాంటి చర్యలు చంద్రబాబు తీసుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కుక్క మూతి పిందెలను ఏరివేస్తానన్న చంద్రబాబు వారికే భయపడుతున్నట్లు అనిపించక మానదు. పార్టీలో ఇప్పటి వరకూ యాక్టివ్ గా లేని నేతలను కూడా చంద్రబాబు చర్యలకు దిగకపోవడం చర్చనీయాంశమైంది.ఆ ఊసే మరిచిపోయారా....?ప్రతి నియోజకవర్గం నుంచి కోవర్టుల లిస్టును తెప్పించుకుంటానని చెప్పిన చంద్రబాబు ఆ ఊసే మరిచిపోయారంటున్నారు. గత రెండేళ్లుగా పార్టీకి ఏమాత్రం ఉపయోగపడని నేతలను కూడా చంద్రబాబు పక్కన పెట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇప్పటికీ అధికార పార్టీకి కొందరు వత్తాసు పలుకుతున్నా, వారిపై ఫిర్యాదులు అందుతున్నా చంద్రబాబు మాత్రం పట్టించుకోవడం లేదు. మరి కోవర్టుల ఏరివేత ఎందాక వచ్చిందనేది ఆయనే చెప్పాల్సి ఉంటుంది. |
https://www.telugupost.com/movie-news/singer-mangli-car-was-pelted-with-stones-in-karnataka-1458753 | టాలీవుడ్ ఫేమస్.. మాస్ సాంగ్స్ సింగర్ మంగ్లీ కారుపై రాళ్లదాడి జరిగింది. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమానికి హాజరైంది మంగ్లీ. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్కుమార్, పునీత్ రాజ్కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలిరోజు కార్యక్రమంలో భాగంగా.. సింగర్ మంగ్లీ, కొందరు గాయకులు పాల్గొన్నారు.కార్యక్రమం ముగిశాక వస్తున్న గాయని మంగ్లీ కారుపై కొందరు రాళ్లదాడి చేశారు. అంతకుముందే మంగ్లీ పాటలు పాడి.. తన పని ముగించుకుని తిరిగి వెళ్లేటపుడు ఆమెను చూసేందుకు స్థానిక యువకులు మేకప్ టెంట్ లోపలికి వెళ్లారు. పోలీసులు అలెర్టై వారిని అడ్డుకున్నారు. ఒక సింగర్ తమను కనీసం కలిసేందుకు కూడా అనుమతించని కారణంగా ఆ యువకులే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు.కాగా.. కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపుర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లీ పాల్గొంది. ఆ సమయంలో కన్నడలో మాట్లాడాలని మంగ్లీని అక్కడి యాంకర్ అనుశ్రీ కోరారు. కానీ.. అక్కడున్న వారందరికీ తెలుగు వస్తుందని మంగ్లీ మాట్లాడలేదు. యాంకర్ బలవంతం చేయగా కన్నడలో ఒకటి, రెండు మాటలు మాట్లాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగ్లీ తీరుపై నెటిజన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. మంగ్లీ కన్నడ ఇండస్ట్రీకి వచ్చి 2 సంవత్సరాలు దాటిందని, ఆమెకి కన్నడ అర్థం కాదు? ఇక్కడకు వచ్చి కన్నడలో మాట్లాడటానికి భయపడే ఆమెకు కన్నడలో ఎందుకు అవకాశం ఇస్తారు? అని ఫైర్ అయ్యారు. |
https://www.telugupost.com/movie-news/rrr-update-193958/ | పాన్ ఇండియా రేంజ్ లో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలయికలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీపై భారీ క్రేజ్, అంచనాలు ఉన్నాయి. ట్రేడ్ లోనూ విపరీతమైన హైప్ ఉంది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ లుక్స్ చూసాక సినిమాపై విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇక సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 13 నే విడుదల చెయ్యాలని రాజమౌళి ఫిక్స్ అయ్యి ఉన్నాడు. అందుకే ఎన్టీఆర్ బర్త్ డే పోస్టర్ లో అక్టోబర్ 13 నే ఉంచేశారు. అయితే ఇప్పటికే అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్న ఆర్.ఆర్.ఆర్ పై జక్కన్న ఫాదర్, ఆర్.ఆర్.ఆర్ స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు మరిన్ని అంచనాలు పెరిగేలా చేసారు. తాజాగా అయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..మన సినిమా ఆర్.ఆర్.ఆర్ గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు.. ఆర్.ఆర్.ఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదైనా యాక్షన్ మూవీలో యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు ఫాన్స్ కుర్చీల మీదకెక్కి విజిల్స్ వెయ్యడం, చప్పట్లు కొట్టడం చేస్తారు. కానీ ఆర్.ఆర్.ఆర్ యాక్షన్ సన్నివేశాలు చూస్తే నాకు కన్నీళ్లు వచ్చేసాయి. నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది. అదే భావన ప్రేక్షకులు కూడా తప్పకుండా పొందుతారు.. ఆ విషయం నేను పక్కాగా చెప్పగలను. ఆర్.ఆర్.ఆర్ యాక్షన్ సీక్వెన్సెస్ ని కూడా ఫాన్స్, ఆడియన్స్ ఎమోషనల్ గా ఫీలవుతారు అంటూ విజయేంద్ర ప్రసాద్ గారు సినిమాపై ఇంకా అంచనాలు పెంచేశారు. |
https://www.telugupost.com/movie-news/యువ-దర్శకుడిని-పొగడ్తలతో-5177/ | తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవ్వటమే త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి పెద్ద దర్శకుడు తెరకెక్కించిన అఆ చిత్రంతో పరిచయమై ఆ చిత్ర విజయంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు తెలుగులో రెండవ చిత్రం అక్కినేని నాగ చైతన్య సరసన ప్రేమమ్ చిత్రంలో నటిస్తుంది. మలయాళ ప్రేమమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ తాను మలయాళ ప్రేమమ్ లో పోషించిన పాత్రనే తెలుగులోనూ పోషిస్తుంది.మళయాళ చిత్ర పరిశ్రమకు తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా వ్యత్యాసమే ఉంది అని అభిప్రాయపడింది అనుపమ పరమేశ్వరన్. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ వాతావరణానికి కూడా చాలా త్వరగా ఇమిడిపోయానని దానికి కారణం ప్రేమమ్ చిత్ర దర్శకుడు చందు మొండేటి నేనని చెప్పింది. "తెలుగులో పని చేస్తున్న రెండవ చిత్రమే అయినా ఏ ఇబ్బంది కలగలేదు. పూర్తిగా తెలుగు చిత్ర పరిశ్రమకు అలవాటు ఐపోయాను. చందు మొండేటి మొదట్లో నా ఇబ్బందిని గ్రహించి ఎంతో సౌకార్యమైన వాతావరణాన్ని కలిపించారు. మలయాళ ప్రేమమ్ లోని నా పాత్ర మేజిక్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది." అని చిత్ర విశేషాలు పంచుకుంది అనుపమ పరమేశ్వరన్.ప్రేమమ్ చిత్రం ఈ నెల 7 వ తారీఖున విడుదలకు సిద్ధం అవుతుంది. శర్వానంద్ చిత్రం శర్వానం భవతే చిత్రంలో కథానాయిక పాత్రలో కనిపించనుంది అనుపమ పరమేశ్వరన్. |
https://www.telugupost.com/movie-news/tanish-as-soldier-in-sarihaddhu-106109/ | మనిషికి, మనిషికీ.. దేశాలకు, ప్రాంతాలకు మధ్య కొన్ని హద్దులు ఉంటాయి. ఎవరి పరిధిలో వాళ్లున్నంత వరకూ అవి సరిగ్గానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ సరిహద్దులు అతిక్రమిస్తే సంఘర్షణ మొదలవుతుంది. దేశాలు, ప్రాంతాల మధ్య ఈ సరిహద్దు సంఘర్షణలు తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు.. ఒక్కోసారి అది జాతీయ సమస్యగానూ మారొచ్చు.. అలా మారకుండా చూసే శక్తి ఆర్మీ. సైనికుడు సరిహద్దుకు కాదు దేశానికే రక్షకుడు. ఇదే కాన్సెప్ట్ తో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తనీష్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. తనీష్ గత సినిమా ‘రంగు’తో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న కార్తికేయ ఈ చిత్రానికి దర్శకుడు. అంటే ‘రంగు’ కాంబినేషన్ రిపీట్ అవుతోందన్నమాట. రెండు భాషల్లో… నేషనలైజ్డ్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం టైటిల్ కూడా ‘సరిహద్దు’. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ విడుదల చేయబోతోన్న ‘సరిహద్దు’ మూవీ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభం కాబోతోంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రంలో తెలుగుతో పాటు హిందీ నటులు కూడా నటించనున్నారు. ప్రస్తుతం టైటిల్ తోనే ఆకట్టుకుంటోన్న ఈ టీమ్.. సినిమాకు సంబంధించిన వివరాలతో పాటు ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కు సంబంధించిన వివరాలను ఈ నెలాఖరులో తెలియజేయబోతున్నారు. |
https://www.telugupost.com/movie-news/బ్రహ్మాజీ-ఎవరిని-ట్రాప్-9240/ | నటుడు బ్రహ్మాజి ముఖ్యపాత్రలో, మహేంద్ర ఇ యమ్ యస్, కాత్యాయనిశర్మ, షాలు, నటీనటులగా,ప్రేమ కవితాలయ ఫిలిమ్స్ సంస్ధ నిర్మిస్తున్న "ట్రాప్" తెలుగు చిత్రం టైటిల్ ను, దానికి సంభంధమైన మోషన్ పోస్టర్ ను, దర్శకరత్న డా: దాసరి నారాయణరావు లాంచ్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ట్రాప్ చిత్రాన్ని డిశంబరు లో విడుదల చేసే ఆలోచన చేస్తున్నామని నిర్మాత ఆళ్ళ. స్వర్ణలత తెలియచేశారు. నిర్మాత మాట్లాడుతు దర్శకరత్న డా: దాసరి నారాయణరావు మా సినిమా లోగోను లాంచ్ చేయటం మా అదృష్టం అన్నారు.కొత్త నిర్మాతగా సినిపరిశ్రమలోకి అడుగు పెట్టాలంటే ఎలాంటి కధ తో సినిమా తీయాలో అలాంటి కధతోనే మేం వస్తున్నాం అని, త్వరలో మిగిలిన వివరాలు తెలియచేస్తాం అని నిర్మాత ఆళ్ళ స్వర్ణలత తెలియ చేశారు. దర్శకుడు వీ యస్ ఫణీంద్ర మాట్లాడుతూ బ్రహ్మాజి క్యారక్టర్ సినిమాకు హైలెట్ అవుతుందని చెప్పారు. మా నిర్మత స్వర్ణలత గారిని చూసినప్పుడు సినిమా పిచ్చి మగాళ్ళకే కాదు ఆడావాళ్ళకు కూడా ఇంతలా ఉంటుందా అనిపించింది నాకు, మాకు చాలా సపోర్ట్ ఇచ్చి టీంగా పని చేశారు,త్వరలో టీజర్ ను లాంచ్ చేయనున్నాం అని దర్శకుడు వీ యస్ ఫణింద్ర తెలిపారు.సినిమాకు మ్యూజిక్ : ఈశ్వర్ పెరావలి, కెమేరా : ప్రవీణ్. కే, ఎడిటర్: రామారావ్ జెపి, నిర్మత: ఆళ్ళ స్వర్ణలత, రచన, దర్శకత్వం: వీ యస్ ఫణీంద్ర. |
https://www.telugupost.com/crime/constable-was-attacked-by-man-under-the-influence-of-alcohol-incident-took-place-at-machilipatnam-in-krishna-district-1344172 | మద్యం మత్తులో కానిస్టేబుల్ పై మందుబాబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జరిగింది. మద్యం సేవించి అత్తగారింట అల్లరి చేస్తున్న వ్యక్తిపై 100కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. మద్దెలకృష్ణ అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించడాన్ని పోలీసులు చూశారు. వెంటనే అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించగా.. వాగ్వాదానికి దిగాడు.మద్యం మత్తులో....దాంతో పోలీసులు - మద్దెల కృష్ణకు మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన కృష్ణ పక్కనే ఉన్న ఇటుకరాయి తీసి కానిస్టేబుల్ శ్రీనివాస్ తలపై కొట్టాడు. దాంతో కానిస్టేబుల్ తలకు తీవ్రగాయమవ్వగా.. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ కృష్ణను అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలివ్వడంతో.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. |
https://www.telugupost.com/movie-news/సల్మాన్-ఆవేశంగా-దూసుకొస్-46629/ | బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా గతంలో తెరకెక్కిన ‘ఎక్ థా టైగర్’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం 'టైగర్ జిందా హై’. అప్పట్లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘ఎక్ థా టైగర్’ చిత్రం ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇప్పుడు తాజాగా అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టైగర్ జిందా హై’ చిత్రంలో మాజీ ప్రేమ జంట సల్మాన్ఖాన్, కత్రినాకైఫ్ లు జంటగా నటిస్తున్నారు. ట్యూబ్ లైట్ తో భారీగా బెబ్బతిన్న సల్మాన్ ఖాన్ ఈ చిత్రంపై భారీ ఆశలుపెట్టుకున్నాడు. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఈ దీపావళి కానుకగా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ‘టైగర్ జిందా హై’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో 'దెబ్బతగిలిన పులిలా ఎవ్వరూ వేటాడలేరు' అన్న డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది.ఇక ఈ ఫస్ట్ లుక్ లో సల్మాన్ ఖాన్ సగం మొహాన్ని మిషన్ గన్ కప్పేస్తుండగా... మిగతా సగం మొహం ఎంతో ఆవేశంతో, ఆక్రోశమైన చూపుతో సల్మాన్ భలేగా కనిపిస్తున్నాడు. చేతిలో మిషన్ గాన్ తో సల్మాన్ ఖాన్ అందంగానూ... ఆవేశంతోనూ కనబడుతున్నాడు. మరి ఈ సినిమాతో మరోసారి సల్మాన్ ఖాన్ కోట్లు కొల్లగొట్టేలాగే కనబడుతున్నాడు. ఇక ఈ ఫస్ట్ లుక్ తోపాటు 'టైగర్ జిందా హై’ చిత్రానికి విడుదల తేదీని కూడా రివీల్ చేసింది చిత్ర బృందం. డిసెంబర్ 22 న 'టైగర్ జిందా హై’ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది. |
https://www.telugupost.com/movie-news/animal-movie-heroine-rashmika-mandanna-instagram-followers-are-more-than-pushpa-allu-arjun-1507906 | నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం నార్త్ టు సౌత్ క్రేజీ హీరోయిన్ అయిపోయారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ప్రతి పరిశ్రమలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్నారు. రీసెంట్ గా రణబీర్ కపూర్ 'యానిమల్'లో హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. పుష్పతో నార్త్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న రష్మిక.. యానిమల్ తో ఓ రేంజ్ ఫాలోయింగ్ అందుకుంటున్నారు. దీంతో రష్మిక సోషల్ మీడియా ఫాలోవర్స్ లిస్ట్ పెరుగుతూ వెళ్తుంది.ప్రస్తుతం రష్మిక ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 40 మిలియన్స్ పైకి చేరుకుంది. సౌత్ హీరోయిన్స్ లో రష్మిక అత్యధిక ఫాలోవర్స్ తో ఇన్ స్టాగ్రామ్ నెంబర్ వన్ గా నిలిచారు. ఈమె తర్వాతి స్థానంలో సమంత 30 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. సౌత్ హీరోల్లో అల్లు అర్జున్ అత్యధిక ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. శ్రీవల్లి 40 మిలియన్స్ ఫాలోవర్స్ ని సంపాదించుకుంటే.. పుష్ప 23 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. ఈ విషయంలో శ్రీవల్లి పుష్పని మించిపోయింది అనే చెప్పాలి. బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వానీ, జాన్వి కపూర్ కూడా రష్మిక కంటే తక్కువ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) ఇందువల్లే రష్మిక నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ని తన సొంతం చేసుకున్నారు. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2లో చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు తెలుగులో.. ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో అనే రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. అలాగే తమిళంలో ధనుష్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఆ చిత్రాన్ని తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న గర్ల్ ఫ్రెండ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి మొదలైంది. అల్లు అరవింద్, దర్శకుడు మారుతి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/ఎస్-3-వరల్డ్-వైడ్-క్లోసింగ-28785/ | ప్రాంతం షేర్ (కోట్ల లో)నైజాం 3 .50సీడెడ్ 2 .20వైజాగ్ 1 .30ఈస్ట్ గోదావరి 0 .90వెస్ట్ గోదావరి 0 .60క్రిష్ణ 0 .80గుంటూరు 1 .10నెల్లూరు 0 .40కర్ణాటక 4 .20కేరళ 4.10తమిళనాడు 26 .40రెస్ట్ ఆఫ్ ఇండియా &రెస్ట్ ఆఫ్ వరల్డ్ 13 .90వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్ 59 .40 |
https://www.telugupost.com/movie-news/ప్రభాస్-తదుపరి-చిత్రం-ఆల-19087/ | 2013 లో విడుదలైన మిర్చి నాటి నుంచి నేటి వరకు బాహుబలి చిత్రంలో తాను చేసిన ద్విపాత్రాభినయం కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన శరీరంతో చేసిన కసరత్తులు అన్నీ ఇన్నీకావు. ఒక వైపు శివుడి పాత్ర మరో వైపు అమరేంద్ర బాహుబలి పాత్ర ల మధ్య తన నటనతో పాటు తన శరీరంలోనూ వ్యత్యాసం చూపించటానికి ప్రభాస్ చాలానే శ్రమించాడు. ఇక బాహుబలి చిత్రం నుంచి ప్రభాస్ కి విముక్తి కలగటానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఇక బాహుబలి చిత్రీకరణ తుది దశకు చేరటంతో ప్రభాస్ తన తదుపరి చిత్రంగా రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ కి చేయబోయే చిత్రం సంక్రాంతి పండుగ అనంతరం ముహూర్తం జరుపుకుని, ఫిబ్రవరి నెలలో రెగ్యులర్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని ఆశించారు ప్రభాస్ అభిమానులు. బాహుబలి చిత్రంలోని పాత్రలకు అనుగుణంగా శరీర బరువు బాగా పెంచిన ప్రభాస్ తన తదుపరి చిత్రం కోసం సుమారు 20 కిలోలు తగ్గాల్సి ఉండటంతో ప్రత్యేక ఫిసికల్ ట్రైనర్ ని నియమించుకుని రానున్న రెండు నెలలలో తన శరీర బరువు తగ్గించే ప్రయత్నాలు మొదలెట్టనున్నాడు యంగ్ రెబెల్ స్టార్. అయితే 20 కిలోల బరువు తగ్గటం సాధారణమైన విషయం కాదు. దీనికి చాలా సమయమే పడుతుంది. అందుకే యూవీ క్రియేషన్స్ వారు ఈ నెలలో జరుపుకోవాల్సిన ముహుర్తాన్ని మార్చి నెలకి వాయిదా వేశారట. రెగ్యులర్ షెడ్యూల్ తాలూకా వివరాలు ఇంకా తెలియరాలేదు. చూస్తుంటే ఈ ఏడాది ఆఖరికి కూడా సుజిత్ రెండవ చిత్రం విడుదల అయ్యే అవకాశాలు కనిపించటం లేదు. |
https://www.telugupost.com/movie-news/shriya-saran-remuneration-79971/ | ఒకప్పుడు హీరోయిన్ శ్రియ టాలీవుడ్ లో స్టార్ హీరో దగ్గర నుండి యంగ్ హీరోస్ దాకా అందరితో నటించి గ్లామర్ పరంగా మంచి పేరు అండ్ ఇమేజ్ తెచ్చుకుంది. రీసెంట్ గా ఈ అమ్మడు తన ప్రియుడుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో అంత ఈమె ఇంకా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసినట్లే అనుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆమె సినిమాల్లో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.లేటెస్ట్ గా ఈమె అందరిని షాక్ కి గురి చేస్తూ ఓ సినిమాను ఒప్పుకుంది. ఈమెకు మంచి క్రేజ్ ఉండటంతో ఓ లేడి ఓరియెంటెడ్ సినిమాకు ఓకే చెప్పింది. సినిమాటోగ్రాఫర్ సుజన డైరెక్షన్ లో సినిమాను ఒకే చేసింది శ్రియ. ఆల్రెడీ ఆమెతో చర్చలు జరిగాయని, కథ నచ్చడంతో ఒకే చెప్పినట్టు తెలుస్తుంది.అయితే శ్రియ ఈ సినిమా కోసం ఏకంగా 50 లక్షలు డిమాండ్ చేసిందట. ఒకేసారి ఇంత అడగటం.. ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే మరి ఈ అమ్మడు అడిగినంత మేకర్స్ ఇస్తారో లేదో చూడాలి. పెళ్లికి ముందు కన్నా పెళ్లి తర్వాత ఇంతలా డిమాండ్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. |
https://www.telugupost.com/movie-news/parasuram-range-increased-159042/ | దర్శకుడు పరశురామ్ రేంజ్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చెయ్యడమే. ఇంతకుముందు సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం సినిమాలు చేసిన పరశురామ్ కి గీత గోవిందం అనేది పరశురామ్ కూడా ఎక్సపెక్ట్ చెయ్యని బ్లాక్ బస్టర్ అవడంతో పరశురామ్ స్టార్ హీరోల కోసం కాదు కేవలం మహేష్ తో సినిమా కోసమే తెగ వెయిట్ చేసాడు. కానీ మహేష్ మాత్రం పరశురామ్ కి చుక్కలు చూపించాడు. దానితో పరశురామ్ చేసేది లేక మళ్ళీ మీడియం హీరో నాగ చైతన్య తో సినిమా ఓకె చేసుకున్నాడు. కానీ మల్లి మహేష్ పిలిచేసరికి చైతు సినిమా పక్కనెట్టేసి పరశురామ్ మహేష్ కథపై వాలిపోయాడు. ఆ దెబ్బకి పరశురామ్ రేంజ్ మారిపోవడం పారితోషకం పెరిగిపోవడం అన్ని చకచకా జరిగిపోయాయి. చైతు తో అయితే పరశురామ్ కి ఓ 7 కోట్లయినా అందుకునేవాడు. ఎందుకంటే గీత గోవిందం బ్లాక్ బస్టర్ గనక. కానీ మహేష్ తో అనేసరికి పరశురామ్ పారితోషకం 10 కోట్లకి పెరిగిపోయింది. మరి మహేష్ తో సినిమా అంటే దర్శకుడికి ఓ రేంజ్ ఉండాలి. అందుకే పరశురామ్ కి నిర్మాతలు అంతిస్తున్నారు. పరశురామ్ కూడా సర్కారు వారి పాటకి 10 కోట్లు కొట్టేస్తున్నాడు. మరి ఆ రేంజ్ హిట్ మహేష్ కి కూడా ఇస్తేనే పరశురామ్ రేంజ్ మరింతగా పెరిగేది. ఇప్పటివరకు టైటిల్ అండ్ మహేష్ బ్యాక్ టాటూ లుక్ అయితే ఓకె. |
https://www.telugupost.com/movie-news/ntr-biopic-jr-ntr-role-80157/ | ఎన్టీఆర్ బయోపిక్ లో తాను నటించడం లేదని ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్...ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటించడంపై స్పందించారు. గతంలో ఐపీఎల్ ప్రమోషన్స్ సమయంలో అడిగినప్పుడు చెప్పిందే ఇప్పుడూ తన సమాధానమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి తనకు ఎటువంటి పిలుపూ రాలేదని, ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే చెబుతానని పేర్కొన్నారు. తన తాత పాత్రలో నటించే అంతస్థాయికి తాను ఇంకా చేరలేదని అన్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. |
https://www.telugupost.com/movie-news/ismart-girls-out-of-puri-connects-159195/ | పూరి జగన్నాధ్ – ఛార్మి కలిపి జాయింట్ గా పూరి కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసి.. దాని ద్వారా హీరోయిన్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు. అందులో కొంతమంది క్లిక్ అయితే మరికొంతమంది అడ్రస్ లేకుండా పోతున్నారు. అయితే గత ఏడాది రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాని చేసిన పూరి అండ్ ఛార్మి లు నిధి అగర్వాల్ – నాభ నటేష్ ని హీరోయిన్స్ గా ఫైనల్ చేసి హాట్ హాట్ గ్లామర్ గా వాళ్ళని చూపించి వాళ్ళని. ఇస్మార్ట్ హిట్ లో భాగం చేసారు. దానితో వారికీ బాగా క్రేజ్ వచ్చేసింది. ఇక ఛార్మి – పూరి పూరి కనెక్ట్స్ కి ఫిదా అయ్యి… నాభ నటేష్ – నిధి అగర్వాల్ లు ఇద్దరూ పూరి కనెక్ట్స్ ద్వారా ఫెమస్ అవుదామని ఒప్పందం చేసుకున్నారట. ఇస్మార్ట్ శంకర్ హిట్ కి ముందు నిధి కి కానీ, నాభ కి కానీ పెద్ద హిట్స్ అయితే లేవు. ఇస్మార్ట్ హిట్ అందుకున్నాక పూరి కనెక్ట్స్ లో జాయిన్ అయ్యి.. వారి ద్వారా అవకాశాలు అందిపుచ్చుకుందామని పూరి ఇంకా ఛార్మి లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే తాజాగా నాభ నటేష్, నిధి అగర్వాల్ లు ఇద్దరూ పూరి కనెక్ట్స్ నుండి బయటికొచ్చినట్టుగా ఓ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. నిధి అగర్వాల్ రానా దగ్గుబాటి నిర్వహిస్తున్న క్వీన్ తో ఒప్పందం చేసుకుందని… అలాగే నాభ నటేష్ కూడా ఓ మేనేజర్ ని పెట్టుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళకి మేనేజర్ గా వ్యవహరించిన హరినాథ్ ద్వారా నాభ అవకాశాలు వెతుక్కుంటుందట. మరి ఇస్మార్ట్ హిట్ తర్వాత నాభ కి, నిధి కెరీర్ కానీ ఓ వెలుగు వెలగలేదు. చిన్న చిన్న అవకాశాలతోనే సర్దుకోవాల్సి రావడంతోనే నిధి, నాభ లు ఇలా పూరి కి, ఛార్మికి షాకిచ్చారని చెబుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/రాంగ్-టైమింగ్లో-నారా-రో-9265/ | బాణం చిత్రం నుంచి తన నట జీవితంలో అనేక వైవిధ్యాలను కోరుకుంటూ ప్రయాణం చేస్తున్న నారా రోహిత్, ఒడి దుడుకులు ఎదుర్కొంటు కెరీర్ నెట్టుకొస్తున్న సమయంలో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జ్యో అచ్చుతానంద విజయం ఊపిరి పోసింది. కుటుంబ ప్రేక్షకులు ఆ చిత్రం పై బాగా ఆసక్తి చూపటంతో ప్రతి పంపిణీదారుడు లాభాల బాట పట్టారు. నారా రోహిత్ గత చిత్రాలలో కొన్ని కేవలం ఒక వర్గ ప్రేక్షకులకే పరిమితం అవటం వలన అతని ఖాతాలో సోలో మినహా మరే చిత్రం పూర్తి స్థాయి కమర్షియల్ సక్సెస్ గా చేరలేకపోయాయి.చాలా సంవత్సరాల నుంచి చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోని చిత్రంగా శంకర మిగిలిపోయింది. నారా రోహిత్, రెజినా నాయకానాయికలు గా నటించారు. ఇటీవల విడుదలై విజయం పొందిన జ్యో అచ్చుతానంద లో కూడా రెజినా ఒక ముఖ్య భూమిక పోషించింది. దీనినే అదనుగా చేసుకుని ప్రచారం చేసి శంకర చిత్రం విడుదల కు ఈ శుక్రవారం ముహూర్తం పెట్టారు. ఇలా చిత్రీకరణ జరుపుకుని విడుదల ఆలస్యం ఐన అనేక చిత్రాలు పరాజయం పొందటం మనం చూస్తూనే వున్నాం.జ్యో అచ్చుతానంద విజయాన్ని ప్రచారంగా వాడుకుని విడుదల చేస్తున్న శంకర నారా రోహిత్ కి మళ్లీ చేదు అనుభవాలు మిగులుస్తుందో లేక విజయం సాధించి రోహిత్ ని ఆదుకుంటుందో చూడాలి. సినీ పండితులు మాత్రం శంకర విడుదల నిర్మాతకి లాభదాయకం అవ్వొచ్చు కానీ హీరో కి ఇబ్బందికరమే అని అభిప్రాయం పడుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/మరో-బైయోపిక్-లో-నటించనున-30398/ | ప్రస్తుతం ఇండియన్ ఫిలిమ్స్ లో సక్సెస్ రేట్ ఎక్కువగా వున్న జోనర్ చారిత్రాత్మక చిత్రాలు, బైయోపిక్స్. విద్య బాలన్ వంటి ప్రముఖ కథానాయిక ది డర్టీ పిక్చర్ అంటూ ప్రముఖ డాన్సర్, నటి సిల్క్ స్మిత పాత్రని వెండితెరపై పోషించి మెప్పించిన నాటి నుంచి బాలీవుడ్ లో ఈ బయోపిక్ సినిమాల ట్రెండ్ ఊపందుకుంది. రెండు సంవస్చరాల క్రితం బాలీవుడ్ లో ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేరీకోమ్ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన అందాల భామ ప్రియాంక చోప్రా గత కొంత కాలంగా బాలీవుడ్ కి దూరంగా హాలీవుడ్ అవకాశాలతో బిజీగా ఉంటుంది. క్వాన్టికో టెలి సిరీస్ తో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రియాంక చోప్రా వచ్చే నెల 26 న తాను నటించిన హాలీవుడ్ చిత్రం బేవాచ్ తో ప్రేక్షకుల ముందుకి వస్తుంది.ప్రస్తుతం బేవాచ్ ప్రచార కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటున్న ప్రియాంక చోప్రా ఈ చిత్రం విడుదల తరువాత కల్పనా చావ్లా బైయోపిక్ గా తెరకెక్కనున్న చిత్రంలో కల్పనా చావ్లా పాత్ర పోషించనుంది. గెట్ వే అనే నిర్మాణ సంస్థ ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నిర్మాణ రంగంలో అడుగు పెట్టనుంది. ప్రియా మిశ్రా అనే నూతన దర్శకురాలు ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం కాబోతోంది. 2003 లో కొలంబస్ స్పేస్ షిప్ ప్రమాదవ శాత్తు పేలిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది కల్పనా చావ్లా. అత్యధికంగా 31 రోజుల 14 గంటల 54 నిమిషాల పాటు స్పేస్ లో గడిపి రికార్డు సాధించిన ఘనత కల్పనా చావ్లా కి వుంది. మరి ఈ కొత్త దర్శక నిర్మాతల చిత్రానికి ప్రియాంక చోప్రా ఎప్పటి నుంచి డేట్స్ ఇస్తుందో చూడాలి. |
https://www.telugupost.com/crime/telangana-inter-first-year-results-were-released-by-inter-board-officials-on-thursday-december-16th-1344250 | తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను డిసెంబర్ 16వ తేదీ, గురువారం ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 49 శాతం ఫస్టియర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 51 శాతం మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారు. ఫస్టియర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో చాలా మంది.. ఫెయిల్ అవ్వడాన్ని జీర్ణించుకోలేక మనోవేదనకు గురవుతున్నారు. మంచి మార్కులతో పాస్ అవుతాం అని ఖచ్చితమైన హోప్ ఉన్న విద్యార్థులు తక్కువ మార్కులు రావడాన్ని తట్టుకోలేకపోతున్నారు.ఆత్మహత్య....అలా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల్లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లాలోని గాంధీనగర్ కాలనీకి చెందిన జాహ్నవి ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతోంది. గురువారం విడుదలైన మొదటి సంవత్సరం ఫలితాల్లో జాహ్నవికి మార్కులు తక్కువ వచ్చాయి. దాంతో మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. జాహ్నవి ఆత్మహత్యతో గాంధీనగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. |
https://www.telugupost.com/movie-news/అల్లరి-మహేష్-లు-ఒకే-చిత్ర-28992/ | గత ఏడాది విడుదలైన ఫ్రెంచ్ చిత్రం ఇన్ టచబుల్స్ రీమేక్ ఊపిరి ప్రేక్షకులని ఎమోషనల్ గా కనెక్ట్ చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, కార్తీ లు హీరోలుగా మల్టీ స్టారర్ సినిమాగా, పైగా తెలుగు రాష్ట్రాలలో మార్కెట్ వున్న నాగార్జున, తమిళనాట మార్కెట్ వున్న కార్తీ లని హీరోల పాత్రకి ఎంచుకుని దర్శకుడు వంశి పైడిపల్లి ఈ రీమేక్ చిత్రాన్ని రెండు భాషలలో వైయబుల్ ప్రాజెక్ట్ గా మలిచాడు. ఈ చిత్రం అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయవలసిన సినిమా కథనంపై దృష్టి పెట్టిన వంశి పైడిపల్లి పీవీపీ సంస్థ కి చేయవలసిన సినిమాని వైజయంతి మూవీస్ కి చేస్తున్నరన్న ఆరోపణలు ఎదుర్కొని నిర్మాతల మండలి లో పీవీపీ పెట్టిన కేసు లో నిందితుడుగా ఉండగా, పెద్దల చొరవతో ఎలాంటి వివాదం పెరగకుండా కేసు సుఖాంతం ఐయ్యింది.చలసాని అశ్విని దత్-దిల్ రాజు ల ఉమ్మడి నిర్మాణంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి వంశి పైడిపల్లి ఇప్పటికే పూర్తి స్థాయి కథనం సిద్ధం చేసుకున్నాడట. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు తో పాటు కామెడీ ఇమేజ్ వున్న యంగ్ హీరో పాత్ర ఒకటి కీలకం కావటంతో ఆ పాత్ర కోసం అల్లరి నరేష్ ని సంప్రదించారట వంశి పైడిపల్లి. అయితే ఇప్పటికి ఇంకా మురగదాస్ చిత్రం పూర్తి కాకపోవటంతో వచ్చే నెల లో సెట్స్ పైకి వెళ్లనున్న కొరటాల శివ-మహేష్ బాబు ల చిత్రం షెడ్యూల్స్ లో వచ్చే మార్పులపై స్పష్టత లేదు. ఆ చిత్రాలు పూర్తయిన తరువాత వంశి పైడిపల్లి కి సినిమా చేస్తాడు మహేష్ బాబు. మరి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళటానికి ఎనిమిది నెలలు పట్టే అవకాశం వుంది. పైగా సరైన షెడ్యూల్ డేట్స్ ఇంకా ఖరారు కాలేదు. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లెనాటికి అల్లరి నరేష్ కాల్ షీట్స్ సర్దుబాటు చేయగలిగితే ఆ పాత్రకి అల్లరి నరేష్ ఖాయం అవుతాడట. |
https://www.telugupost.com/andhra-pradesh/telugu-desam-party-national-spokesperson-kommareddy-pattabhiram-stopped-appearing-after-the-alliances-victory-1548406 | తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూటమి విజయం సాధించిన తర్వాత కనిపించడం మానేశారు. దాదాపు రెండు నెలల నుంచి ఆయన పెద్దగా వినిపించడం లేదు. కనిపించడం లేదు. పార్టీ అధికారంలో లేనప్పడు ఏ నేత అప్పటి అధికార పార్టీపై విమర్శలు చేసేందుకు వెనుకాడినప్పుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఒక్కరే తన మాటలతో ివిరుచుకుపడేవారు. అంతేకాదు ఆయన ప్రతి రోజూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి అధికార పార్టీని చీల్చిచెండాడేవారు. అలాంటి పట్టాభి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయిస్తున్నట్లు కనపడుతుంది.విపక్షంలో ఉన్నప్పుడు...కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చేసిన పదునైన విమర్శలతో నాటి అధికార వైసీీపీకి ఆయన శత్రువుగా మారారు. ఆయన ఇంటిపై దాడులు కూడా జరిగాయి. పట్టాభి కొన్ని కేసుల్లో అరెస్టయి రాజమండ్రి జైలుకు వెళ్లి వచ్చారు. ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. మాటలు పడ్డారు. గాయపడ్డారు. అయినా టీడీపీ విషయంలో వెనక్కు తగ్గలేదు. చంద్రబాబు నాయుడు స్వయంగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటికి వచ్చి మరీ ఆయనను పరామర్శించి వెళ్లారు. మిగిలిన సీనియర్ నేతలు అందరూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ పట్టాభి అంతా తానే అయి కేంద్ర పార్టీ కార్యాలయంలో తన వాయిస్ ను బలంగా వినిపించే వారు. అప్పుడప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ లో మాత్రం కనిపిస్తున్నారు. కీలక పదవి?అయితే కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కు అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన పదవి వస్తుందని అందరూ భావించారు. రేపు చంద్రబాబు భర్తీ చేయబోయే పోస్టులలో పట్టాభికి ఖచ్చితంగా ఒక పదవి వస్తుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. యువకుడు కావడం, మంచి వాగ్దాటి ఉండటంతో పట్టాభికి మంచి పదవినే చంద్రబాబు కట్టబెట్టే అవకాశాలున్నాయంటున్నారు. అందుకోసమే పట్టాభి వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు పార్టీ అగ్రనాయకత్వం నుంచి పట్టాభికి సంకేతాలు అందినట్లు చెబుతున్నారు. అది కూడా కీలకమైన క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పదవిని చంద్రబాబు పట్టాభి కోసం సిద్ధం చేసినట్లు అంటున్నారు.ఆచితూచి...పదవిలోకి వచ్చిన తర్వాత కొంత ఆచితూచి మాట్లాడాలని, తక్కువగా మాట్లాడి ఎక్కువ పనులు చేయాలని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు మంత్రులు విపక్షానికి కౌంటర్లు ఇస్తుండటంతో ఇక తనకు పెద్దగా పనిలేదని ఆయన భావిస్తున్నారు. దీంతో పాటు పదవి వచ్చేంత వరకూ ఒకింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి అంశం పై కూడా ఆయన పెద్దగా స్పందించడం లేదంటున్నారు. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పదవి కోసమే వెయిట్ చేస్తున్నారని తెలిసింది. కొద్ది రోజులలోనే పట్టాభి తిరిగి యాక్టివ్ అవుతాడంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/అతగాడు-నిర్మించనున్న-తొల-19464/ | నేటి తరం నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా చిన్న వయసులోనే ప్రపంచ సినిమా ద్వారా కావాల్సిన అనుభవాన్ని కూడకట్టుకుని అనేక క్రాఫ్ట్స్ లో ప్రావీణ్యం కనపరుస్తూ ముందుకు దూసుకు పోతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజని కాంత్ అల్లుడు ధనుష్ హీరోగా, నిర్మాత గా, గాయకుడిగా నిరూపించుకున్నారు. ఆయన విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తమిళ తెలుగు ప్రేక్షకులకే కాక రాంజన, షమితాబ్ వంటి బాలీవుడ్ చిత్రాలతో వైవిధ్యభరితమైన నటన కనపరిచి ఉత్తరాది సినిమా ప్రేక్షకులకు కూడా బాగా చేరువ అయ్యాడు. మరో వైపు ధనుష్ గాయకుడిగా పాడిన వై దిస్ కొలవెరి పాటతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తో పాటు తాను నిర్మించిన తమిళ చిత్రం కాక ముట్టాయి అంతర్జాతీయ ఫిలిం ఫెస్ట్ లలో ప్రదర్శనలకు సైతం ఎంపిక ఐయ్యి కథ ల పట్ల ధనుష్ కి వున్న ప్రత్యేక అభిరుచికి పట్టం కట్టింది.కాగా నేటి వరకు ధనుష్ ఇతర పెద్ద హీరోల తో సినిమాలు నిర్మించలేదు. ఇప్పుడు ఆ లోటు కూడా తీర్చుకోవటానికి సిద్ధపడుతున్నాడు. తమిళం లో తుపాకీ, కత్తి వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ఎ.ఆర్.మురగదాస్-విజయ్ ల కాంబినేషన్ లో రానున్న మూడవ చిత్రానికి ధనుష్ నిర్మాత గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే భైరవ చిత్రీకరణ పూర్తి చేసి అట్లీ దర్శకత్వంలో మరో చిత్రాన్ని స్టార్ట్ చేయబోతున్న విజయ్, మురగదాస్ ప్రస్తుతం మహేష్ బాబు తో చేస్తున్న చిత్రం పూర్తయ్యే లోపు ఆ చిత్రం పూర్తి చేసుకుని ధనుష్ కి తన కాల్ షీట్స్ కేటాయించటానికి ప్రణాళిక వేసుకున్నాడు విజయ్. మరో మూడు నెలలో మహేష్ బాబు చిత్రం పూర్తి చేయనున్న మురగదాస్ అనంతరం ధనుష్ నిర్మాణంలో విజయ్ నటించబోయే చిత్రానికి స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టి ఈ ఏడాది దీపావళి పండుగ సమయానికి చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని సమాచారం. |
https://www.telugupost.com/movie-news/poonakalu-loading-song-out-from-waltair-veerayya-1455079 | మెగాస్టార్ చిరంజీవి - శృతిహాసన్ జంటగా.. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా నుండి ఈ రోజు (డిసెంబర్ 30) సాయంత్రం చిరంజీవి - రవితేజపై చిత్రీకరించిన సాంగ్ ను విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచగా.. పూనకాలు లోడింగ్ అంటూ వచ్చిన పోస్టర్.. నిజంగానే పూనకాలు తెప్పించేసింది. ఇక తాజాగా పూనకాలు లోడింగ్ సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పాట మెగా మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిపోనుంది.డీఎస్పీ సంగీతం అందించిన ఈ పాటలో.. చిరంజీవి- రవితేజలు కాంట్రాస్ట్ లుక్ కనిపిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కు రెండ్రోజుల ముందే.. డీఎస్పీ న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. |
https://www.telugupost.com/movie-news/prabhas-john-abraham-193928/ | లాక్ డౌన్ కారణంగా ఆదిపురుష్ సెట్స్ నుండి నేరుగా హైదరాబాద్ కి వచ్చేసిన ప్రభాస్ షూటింగ్స్ ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారి షూటింగ్స్ మొదలయ్యాయి అంటే ప్రభాస్ అటు రాధేశ్యామ్ సాంగ్ చిత్రీకరణ తోనూ, ఇటు సలార్ మూవీ షూటింగ్ తోనూ, మరోపక్క ఆదిపురుష్ షూటింగ్ తో బిజీ అవుతాడు. ఊపిరాడకుండా షూటింగ్స్ చెయ్యాల్సిందే. సలార్ కోసం రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ రెడీ అయ్యాయి. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ ఫినిష్ చేసి సలార్ కోసం దిగిపోతాడు. అయితే ప్రభాస్ సలార్ మూవీలో సిక్స్ ప్యాక్ బాడీ తో యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తాడని అంటున్నారు. అలాగే సలార్ లో చాలామంది విలన్స్ తో ప్రభాస్ తలపడాల్సి వస్తుంది అని, దాని కోసమే సలార్ డైరెక్టర్ ఒక్కో భాష నుండి ఒక్కో విలన్ ని ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీ నుండి ఓ విలన్ అఫీషియల్ గా ఎంపిక చేసాడు ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు మెయిన్ విలన్ ని బాలీవుడ్ నుండి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. బాలీవుడ్ నుండి జాన్ అబ్రహం ని ప్రభాస్ కి పవర్ ఫుల్ విలన్ గా, సలార్ కి నెగెటివ్ షేడ్స్ ఉన్న నటుడిగా తీసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియా టాక్. మరి ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేయబోతున్నాడని, ఫాదర్ రోల్ లో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా పవర్ ఫుల్ లుక్స్ లో కనిపిస్తాడని అనడంతో సినిమాపై మరింత హైప్ పెరిగిపోతుంది. |
https://www.telugupost.com/movie-news/మెగా-హీరోల-సరసన-అప్పట్లో-6277/ | మలయాళ భామలు, మళయాళ చిత్రాలలో పేరు తెచ్చుకున్న భామలకు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎర్ర తివాచి పరిచి స్వాగతిస్తుంది. ఆ కోవలోనే తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది కీర్తి సురేష్. మద్రాస్ వాసి ఐన కీర్తి సురేష్ ముందుగా మళయాళ చిత్రాలతో వెండితెరకు పరిచయం ఐయ్యింది. ఎక్కువ ఆర్భాటాలు లేని పక్కింటి అమ్మాయిగా కనిపించే కీర్తి సురేష్ తన సహజ అందాలతోనే కాక నటనతోనూ నేను శైలజ, రైల్ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని సరసన నేను లోకల్ చిత్రంలో నటిస్తుంది.దువ్వాడ జగన్నాథంతో పాటు లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషలలో చెయ్యబోతున్న చిత్రానికి ఎప్పటి నుంచో కీర్తి సురేష్ పేరు చర్చల్లో ఉంది. ఇప్పుడు లింగుస్వామి బృందం కీర్తి సురేష్ పేరును ఖరారు చేసింది. తెలుగులో పెద్ద నటుల సరసన అందులోనూ మెగా ఫ్యామిలీ హీరోతో నటించటం కీర్తి సురేష్ కి ఇదే తొలిసారి. కానీ కీర్తి సురేష్ ఐన తల్లి మేనకకు మెగా స్టార్ చిరంజీవితో కలిసి నటించిన అనుభవం ఉంది. చిరంజీవి నటించిన పున్నమి నాగు చిత్రంలో మేనక చిరుతో కలిసి నటించారు.మళ్లీ ఇప్పుడు చిరు మేనల్లుడుతో అలనాటి నటి మేనక పుత్రిక నటిస్తుండటం విశేషం. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న నేను లోకల్ చిత్రానికి నిర్మాణ భాగస్వామి ఐన ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీర్తి తాజా తమిళ చిత్రం రెమో ని తెలుగులో అదే పేరుతో అనువదించి విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. |
https://www.telugupost.com/movie-news/f-2-collections-5-days-106195/ | ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో రామ్ చరణ్ వినయ విధేయ రామ తప్ప మిగిలిన మూడు సినిమాలకి మంచి టాకే వచ్చాయి. సంక్రాంతి సీజన్ లో చివరిగా రిలీజ్ అయిన ఎఫ్ 2 చిత్రం ప్రేక్షకాదరణ పొంది సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ ఎక్కువయ్యారు. 5 రోజులకు గాను ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 25.83 కోట్లు వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో 32.10 కోట్లు కలెక్ట్ చేసి స్ట్రాంగ్ గా ఉంది. వరుణ్ – వెంకీ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఇక ఏరియా వైజ్ వివరాలు మీ కోసం… ఏరియా 5 రోజుల షేర్ (కోట్లు) నిజాం 8.97 సీడెడ్ 3.40 నెల్లూరు 0.84 కృష్ణ 2.30 గుంటూరు 2.33 వైజాగ్ 3.15 ఈస్ట్ గోదావరి 3.10 వెస్ట్ గోదావరి 1.74 మొత్తం ఏపీ, తెలంగాణ 25.83 కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా 1.95 ఓవర్సీస్ 4.32 5 రోజుల వరల్డ్ వైడ్ షేర్ 32.10 |
https://www.telugupost.com/movie-news/pawan-rana-185017/ | గత నెల ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ – రానా కాంబోలో అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ షూటింగ్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఏకే రీమేక్ షూటింగ్ స్టార్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ – రానా కాంబో సీన్స్ చిత్రీకరణ జరుగుతుంది. అయితే రానా పవన్ కళ్యాణ్ తో చెయ్యడానికి కాస్త మొహమాట పడి ఇబ్బంది పడుతున్నా కూడా పవన్ కల్యాణే.. లేదూ నువ్వు ఇలా చెయ్యి నేను ఇలా చేద్దాం అని చెప్పి రానా ని ఎంకరేజ్ చేస్తూ పవన్ – రానా సీన్స్ ని పూర్తి చేస్తున్నారట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంతేకాదు ఈ సినిమా టైం లో రానా చేస్తున్న సినిమాల డీటెయిల్స్ అన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకోవడం కాస్త ఆశ్చర్యకరమైన విషయం. మరి పవన్ కళ్యాణ్ తో ఈ ఏకే రీమేక్ తో పాటుగా హీరో రానా అరణ్య అలాగే విరాట పర్వం మూవీస్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రానా ప్రెజెంట్ మూవీస్ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ సెట్స్ లో ఇన్ని డిఫ్రెంట్ ఫిలిమ్స్, ఇంత డిఫ్రెంట్ జోనర్స్ లో ట్రై చేస్తున్న రానాని అభినందించి నేను నీకు ఫ్యాన్ ని అయ్యిపోయాను. నాకు ఇలాంటి ఆపర్చ్యునిటీ దొరకలేదు. యువర్ సీరియస్లీ టూ గుడ్, ఒక పెరఫార్మెర్ గా నువ్వు బాగా చేస్తున్నావ్ అంటూ రానాని అభినందించిన పవన్ కళ్యాణ్ నేను నీకు పెద్ద అభిమానిని అనగానే రానా పడి పడి నవ్వడమే కాదు.. సర్ మీరు నాకు ఫ్యాన్ ఏంటి సర్.. లేదబ్బా నేను నీకు నిజంగా ఫ్యాన్ ని అని పవన్ చెప్పడంతో రానా తెగ నవ్వేసాడట. |
https://www.telugupost.com/andhra-pradesh/gorantla-buchaiah-chowdary-slams-ysrcp-government-1366461 | విజయవాడ : సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిందని విమర్శించారు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో గోరంట్ల మాట్లాడుతూ.. ఏపీలో ప్రాజెక్టుల పనులపై నీలినీడలు కమ్ముకున్నాయన్నారు. పోలవరం పనులు ఎందుకు జరగడం లేదు ? ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ ఎందుకు అమలు చేస్తున్నారు? అని ఆయన నిలదీశారు.పోలవరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు ఎందుకు సాధించలేకపోతున్నారు? అని గోరంట్ల బుచ్చయ్చ చౌదరి జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. గత పథకాలకే పేర్లు మార్చి సంక్షేమానికి ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప.. ప్రాజెక్టు పనులపై వైసీపీ మంత్రులకు ఏమాత్రం అవగాహ లేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ రాష్ట్ర స్థితిగతుల గురించి కనీసం ఆలోచన చేయడం లేదని విమర్శించారు. కేవలం ఓట్ల గురించి మాత్రమే జగన్ ఆలోచిస్తున్నారని, ఇంత అవినీతి, అసమర్థ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని ప్రజలు చెప్పుకుంటున్నారని గోరంట్ల పేర్కొన్నారు.పోలవరంపై చేతులైతేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం. టిడిపి ఎమ్మెల్యే @GORANTLA_BC మీడియా సమావేశం, ప్రత్యక్ష ప్రసారం. https://t.co/XjTlXiigqI— Telugu Desam Party (@JaiTDP) April 24, 2022 |
https://www.telugupost.com/movie-news/మే-ని-కబ్జా-చేసారుగా-61171/ | మార్చ్ మొదటివారంలో విద్యార్థులంతా తమ తమ పరీక్షల హడావిడిలో మునిగిపోయి సినిమాల ఊసెత్తే సమస్యే లేదు. అందుకే దర్శక నిర్మాతలు తమ సినిమాలను మార్చ్ ఎండ్ నుండి జూన్ ఫస్ట్ వీక్ వరకు విడుదలకు ప్లాన్ చేసి వేసవి సెలవులని క్యాష్ చేసుకుంటారు. మరో రెండు రోజుల్లోనే మార్చ్ నెల స్టార్ట్ కాబోతుంది. మొదటి మూడు వారాల్లోనూ సినిమా లేవి విడుదలకావడంలేదు. కానీ మార్చ్ చివరినుండి భారీ బడ్జెట్ సినిమాల్తో వేసవి సెలవులకి వెలకమ్ చెబుతున్నారు. మార్చ్ చివరిలో మెగా హీరో రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో బోణి చేస్తుండగా.. ఆ తర్వాత ఏప్రిల్ లో నాని కృష్ణార్జున యుద్ధం, మహేష్ భరత్ అనే నేను, రజినీకాంత్ కాలా సినిమాలు సందడి చేయనున్నాయి. మరి భరత్ అనే నేను నిర్మాతలు, నా పేరు సూర్య నిర్మాతలు రాజి పడడంతో అనుకున్న డేట్ కి మహేష్ ఒక వారం ముందుకి, అల్లు అర్జున్ ఒక వారం వెనక్కి జరిగి సమస్యని పరిష్కరించుకున్నాయి. అల్లు అర్జున్ మే మొదట్లోనే అంటే మే 4 నే తన నా పేరు సూర్యని థియేటర్స్ లోకి దింపుతున్నాడు. ఇక మే మొత్తం అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలే ఆక్రమించినట్లుగా తెలుస్తుంది. ముందుగా అల్లు అర్జున్ నా పేరు సూర్యతో థియేటర్స్ లోకి దిగడం.. మరో రెండు వారాలు మరే ఇతర సినిమా థియేటర్స్ లోకి రాకుండా గీత ఆర్ట్స్ వారు చూసుకోవడంతో వదలకుండా.... మళ్ళీ గీత ఆర్ట్స్ బ్యానర్ లో విజయ్ హీరోగా తెరకెక్కిన ట్యాక్సీ వాలాను మే 18 న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.అటు వక్కంతం వంశి డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా వస్తున్న నా పేరు సూర్య మీద ఎన్ని అంచనాలున్నాయో... అర్జున్ రెడ్డి తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ దేవరకొండ ట్యాక్సీ వాలా సినిమాపై అంతే అంచనాలున్నాయి. రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 18న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరి ఈ సినిమాకి కూడా గీతవారు మరో రెండు వారలు థియేటర్స్ లోనే ఉంచుతారు. అలా మే మొత్తం నా పేరు సూర్య, ట్యాక్సీ వాలతో గీత ఆర్ట్స్ వారు కబ్జా చేసేస్తారన్నమాట |
https://www.telugupost.com/movie-news/star-heros-donation-152100/ | కరోనా కల్లోలానికి స్టార్ హీరోస్ అంతా చేతనైన సాయం చేస్తున్నారు. హోమ్ క్వారంటైన్ లో ఇంటిపట్టునే ఉంటున్న హీరోస్ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు వీలైనంతగా సహాయం చేస్తున్నారు. ఫస్ట్ నితిన్ రెండు రాష్ట్రాలకు తలో 10 లక్షల సహాయం చెయ్యగా తర్వాత ఒక్కొక్కరిగా తమతమ సహాయాన్ని ప్రకటిస్తున్నారు హీరోలు. స్టార్ హీరోలు ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు.ఓ పక్క ఎవరేంతిస్తున్నారో చూసుకుని హీరోల ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. కరోనా వైరస్ వలన అతలాకుతలం అవుతున్న స్టేట్స్ కి హీరోల సహాయం మాత్రం మరవలేనిది. కానీ ఫాన్స్ మాత్రం మా హీరోలు గొప్ప అంటే మా హీరోలు గొప్ప అంటూ రెచ్చిపోతున్నారు. మహేష్ బాబు కోటి విరాళం ఇవ్వగా.. పవన్ కళ్యాణ్ రెండు కోట్లు, రామ్ చరణ్ 75 లక్షలు, ఎన్టీఆర్ 75 లక్షలు, ప్రభ్స్ కూడా భారీ విరాళం ప్రకటించగా… దర్శకులు కూడా చెరో పదిలక్షలు విరాళాలు ప్రకటిస్తున్నారు. మరి గొప్పగా పబ్లిసిటీ కోసమా..లేదా నిజంగా మనస్ఫూర్తిగా హీరోల విరాళాలు ఉన్నాయో కానీ ఫాన్స్ మాత్రం మా హీరోలు చూడండి అందరి కన్నా ఎక్కువ విరాళం ఇచ్చారు అంటూ రెచ్చిపోతూ గొడవలు స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే ఒకరిని చూసి ఒకరు పోటీపడి విరాళాలు ప్రకటించడం చూస్తే ఇదంతా పబ్లిసిటీ స్టెంట్ లగే అనిపిస్తుంది కొంతమందికి. మరోపక్క తమిళనాట హీరోలంతా భారీ విరాళాలు ప్రకటిస్తే..లోకనాయకుడు కమల్ హాసన్ ఏకంగా తన ఇంటిని హాస్పిటల్ గా మర్చేస్తానని ప్రకటించారు. నిజంగా హీరోలంతా పబ్లసిటీ కోసం చేశారనుకోవడం కంటే…. ఇలాంటి సమయాల్లో మేమున్నాం అంటూ ముందుకు రావడం గ్రేట్. సినిమాల్లోనే హీరోయిజం చూపించే హీరోలంతా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేమున్నాం అంటూ ముందుకు రావడం మాత్రం నిజంగా హీరోయిజమనే చెప్పాలి. |
https://www.telugupost.com/movie-news/samantha-not-to-act-in-mahasamudram-movie-169231/ | అజయ్ భూపతి కలల ప్రాజెక్ట్ మహా సముద్రం సినిమాపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి ఈ సినిమాని మొదలెట్టబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ముందు నుండి హీరోయిన్ స్థానంలో సమంత పేరు వినిపిస్తుంది. మహాసముద్రం నాగ చైతన్య దగ్గరకు వెళ్ళినప్పుడు నుండి సమంతనే హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది. మధ్యలో సమంత చెయ్యనంది అంటే… కాదు అజయ్ భూపతి వాళ్ళే సమంత ని వద్దనుకున్నారు. ఇది సమంత కె చాలా అవమానం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అసలు సమంత ని సంప్రదించారో లేదో ఆమె ఏమన్నదీ ఎవరికీ క్లారిటీ లేదు. అయితే తాజాగా మహాసముద్రం లో శర్వానంద్ తో పాటుగా మరో హీరో సిద్దార్ధ్ కూడా నటించబోతున్నాడని ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న వార్త కాస్త ఇప్పుడు అధికారికం అయ్యింది. అయితే ఈ సినిమాలో అజయ్ వాళ్ళు అడిగినా సమంత చేయకపోవడానికి కారణం సిద్ధర్ధే అనే టాక్ మొదలయ్యింది. ముందు నుండి అజయ్ భూపతి సెకండ్ హీరోగా సిద్ధునే అనుకుంటున్నాడట. అందుకే సమంత చెయ్యను అని చెప్పింది అంటుంటే.. సిద్దార్ధ్ ని తీసుకోవాలనే ఆలోచన రాగానే సమంత నే అజయ్ భూపతి టీం ఈ సినిమాలో వద్దనుకుందట. ఎందుకంటే గతంలో సమంత – సిద్దార్ద్ లవ్ లో ఉన్నారని.. తర్వాత బ్రేకప్ అయ్యాక సమంత డిప్రెషన్ లో ఉండగానే చైతు ప్రేమే ఆమెని మాములు మనిషిని చేసింది అని అంటుంటారు. సమంత కూడా ఒకొనొక సందర్భంలో సిద్దు పేరు ఎత్తకుండా నా కెరీర్ లో, నా లైఫ్ లో ఓ వరస్ట్ సిట్యువేషన్ ఉంది.. ఆ టైం లో చాలా బాధపడ్డాను, ఓ వ్యక్తి నన్ను మోసం చేసాడు. కానీ చైతు తో పరిచయం నన్ను కోలుకునేలా చేసింది అని చెప్పింది. మరి ఇదంతా చూస్తుంటే మహాసముద్రం లో సమంత చెయ్యననేది సిద్దు నటిస్తున్నాడన, లేదంటే అజయ్ భూపతి వాళ్లే సమంతని ఇబ్బంది పెట్టడం ఎందుకని వద్దనుకున్నారా? అనేది మాత్రం ఎప్పటికి సస్పెన్స్. |
https://www.telugupost.com/movie-news/prabhas-mumbai-plans-184388/ | ప్రభాస్ కెరీర్ బాహుబలికి ముందు, బాహుబలికి వెనక అని మాట్లాడుకుంటే.. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా లెవల్ ని మెయింటింగ్ చేస్తున్నాడు. బాహుబలి తర్వాత సాహో లాంటి భారీ ప్రాజెక్ట్ చేసాడు. సాహో తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా లిస్ట్ తెలిసిందే. రాధేశ్యామ్ షూటింగ్ ఫినిష్ అయ్యి.. జులై 30 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ప్రభాస్ అటు సలార్ షూటింగ్, ఇటు ఆదిపురుష్ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు. ప్రస్తుతం సలార్ షెడ్యూల్ ఒకటి పూర్తి చేసి ఆదిపురుష్ కోసం ముంబై లో మకాం పెట్టాడు. ప్రభాస్ ఇప్పుడు హైదరాబాద్ – ముంబై అంటూ తిరగక్కర్లేదు. అన్నీ పాన్ ఇండియా మూవీస్ కాబట్టి ఎక్కువగా ముంబైలోనే ఉండాలి. అందుకే ముంబైలో ఓ ప్లాట్ కోనేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లుగా సోషల్ మీడియా టాక్. కేవలం ప్రభాస్ ఫోకస్ సినిమాల మీదే లేదు. బిజినెస్ విషయంలోనూ ప్రభాస్ పావులు కదుపుతున్నట్టుగా లేటెస్ట్ టాక్ ఉంది. ప్రభాస్ ముంబై వేదికగా వ్యాపారం మొదలు పెట్టె యోచనలో ఉన్నాడట. అందుకే ఏకంగా ముంబైకి మకాం మార్చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ముంబైలోనే ఎక్కువగా గడుపుతున్న ప్రభాస్ హోటల్ రూమ్స్ కి కోట్లు ఖర్చుపెట్టడం ఎందుకు అని.. ముంబై లోని ఖరీదైన ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చెయ్యడానికి రెడీ అయ్యాడట. ప్రస్తుతం ప్రభాస్ టీమ్ ముంబై లో ప్రభాస్ కోసం ఖరీదైన ప్లాట్ వేటలో ఉందట. ఆదిపురుష్ తర్వాత నాగ్ అశ్విన్ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రభాస్ ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. |
https://www.telugupost.com/crime/gun-misfired-in-kautala-police-station-of-asifabad-district-in-this-accident-rajini-kumar-died-1447171 | ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో గాయపడిన రజనీకుమార్ మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే కానిస్టేబుల్ మృతి చెందారు.2021 బ్యాచ్ కుచెందిన రజనీకుమార్ ఉదయం గన్ శుభ్రపరుస్తుండగా మిస్ ఫైర్ అయిందని చెబుతున్నారు. రజనీకుమార్ గుడిపేట 13వ బెటాలియన్ లో పనిచేస్తున్నారు. ఆయన స్వగ్రామం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి.మరణించడంతో...కానిస్టేబుల్ మరణించడంతో జిల్లాలోని పోలీసు శాఖలో విషాదం నెలకొంది. బుల్లెట్ గొంతులోకి దిగడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే లోపే కానిస్టేబుల్ మరణించారు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఘటన పై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/anu-glamour-show-89620/ | గ్లామర్ షో చేయకపోతే అవకాశాలు తగ్గుతాయి అనుకుందేమో అందుకే గ్లామర్ షో కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. కెరీర్ స్టార్టింగ్ లో ఇందుకు నో చెప్పిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ గత కొంతకాలం నుండి ఫ్లాపులు చవి చూస్తుంది. ఇలాంటి టైంలో గిరి గీసి కూర్చుంటే కరెక్ట్ కాదని గుర్తించడమే కాకుండా నిత్య మీనన్ లాంటి హీరోయిన్స్ కనుమరుగు అయిపోయిన సంగతి గ్రహించి.. గ్లామర్ మీటర్ ను పెంచడానికి రెడీ అంటుంది. మరీ నార్త్ అమ్మాయిలలా చిన్నచిన్న బట్టల్లో కనిపించకపోయినా.. అచ్చమైన తెలుగు అమ్మాయిని తలపించేలా గ్లామర్ ను చూపించబోతుంది. లేటెస్ట్ గా అను నటించిన 'హలో గురూ ప్రేమకోసమే' టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లో అను నడుము షోకి ఫ్యాన్స్ మొత్తం ఫిదా అయిపోయారు. చీర కట్టుకుని కుర్చుని తల ఆరేసుకుంటూ వెనక నుండి తన నడుమును హీరో రామ్ కు చూపించింది.ఇక నో చెప్పదా..?దీంతో అనుపమకి వస్తోన్న రెస్పాన్స్ చూస్తోంటేనే అనులో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశర్యపోతున్నారు. చిన్న టీజర్ తోనే ఇలా అందరి మతి పోగొడితే మరి సినిమాలో ఏం మాయ చేస్తుందో చూడాలి. దీనినిబట్టి అను వచ్చే సినిమాల్లో కూడా గ్లామర్ కు నో చెప్పను అని చెప్పకనే చెప్పుతుంది. చూద్దాం ఈ గ్లామర్ షోకి మరిన్ని అవకాశాలు వస్తాయేమో. |
https://www.telugupost.com/movie-news/bellamkonda-srinivas-seetha-movie-2-122768/ | దర్శకుడు తేజ సీత అనే కథను రాసుకుని ‘నేనే రాజు నేనే మంత్రి’ టైంలో కాజల్ అగర్వాల్ కి ఆ కథని వినిపించాడు. ఆ కథని నేనె చేస్తా.. ఎవరికీ చెప్పొద్దని మరీ కాజల్.. తేజతో సీత సినిమా చేసింది. మరి హీరోయిన్ ని హైలెట్ చేస్తూ హీరోని డమ్మి చేసే సినిమాల్లో నటించేందుకు ఎలాంటి హీరో కూడా ఇంట్రెస్ట్ చూపడు. అలాగే సీత కథను చాలామంది హీరోలు రిజెక్ట్ చేసారంటూ స్వయానా దర్శకుడు తేజనే చెప్పాడు. మరి అలాంటి కథను బెల్లంకొండ ఎలా ఒప్పుకున్నాడో అని చాలామంది పెదవి విరిచారు. నిజంగానే నిన్న విడుదలైన సీత సినిమా చూసిన ఎవ్వరైనా… ఇలాంటి కథని చెయ్యడానికి ఏ హీరో ముందుకు రాడు… కానీ బెల్లంకొండ ఎలా ఒప్పుకున్నాడో అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. మరి సీత కథలో ముందునుండి అనుకున్నట్టుగా హీరోయిన్ కాజల్ హైలెట్. కనీసం హీరోకి విలన్ కి ఉన్న ఇంపార్టెన్స్ కూడా ఈ సినిమాలో లేదు. ప్రాధాన్యత లేని పాత్రలో హీరో హీరోయిన్ కాజల్ తో సమానమైన రోల్ సోను సూద్ కొట్టేసాడు. సోను సూద్ విలనిజం ముందు హీరో బెల్లంకొండ తేలిపోయాడు. ఇప్పటివరకు బోలెడంత డబ్బు పోసి హీరోయిజాన్ని చూపించిన బెల్లంకొండ శ్రీనివాస్ మొదటిసారి తన హీరోయిజాన్ని పక్కనపడేశాడు. సీత సినిమా చూస్తున్నంత సేపు బెల్లంకొండ శ్రీనివాస్ డమ్మీగానే కనిపిస్తాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హావభావాలు, అతడి నటన చూసి ప్రేక్షకుడికి నవ్వు ఆగదు. ఈ సినిమాలో తన డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రెషన్ ల మీద బాగా దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది కానీ అది వర్కౌట్ అవ్వలేదు. కాజల్ నటన, ఆకర్షణ ముందు బెల్లంకొండ పూర్తిగా తేలిపోయాడు. అసలు ఎప్పుడూ హీరోయిజం చూపిస్తూ మాస్ గా కనబడే ఈ హీరో మొదటిసారి ఇలా ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్ర చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. |
https://www.telugupost.com/movie-news/nandamuri-balakrishna-hindupuram-mla-telugudesam-party-32-205840/ | అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే లో నందమూరి బాలకృష్ణ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబుతో ఇంటర్వ్యూ సందర్భంగా టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ తర్వాత ఎందుకు చేపట్టలేదని అడిగారు. అందుకు బాలయ్య సమాధానమిస్తూ అప్పట్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటూ వారసత్వ రాజకీయాలు నడిచేవని, వారసత్వ రాజకీయాలను విమర్శించే మనమే పార్టీ పగ్గాలు చేపడితే బాగుండదని తీసుకోలేదన్నారు. లోకేష్ విషయంపై….? ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబుకు ఎందుకు మద్దతిచ్చారని అన్న మోహన్ బాబు ప్రశ్నకు ఆయన అనుభవం, రాజకీయాలను ఆకళింపు చేసుకున్న విధానం తనకు నచ్చిందన్నారు. అయితే మోహన్ బాబు ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు వారసుడిగా లోకేష్ ఎందుకని అనుకంుటున్నారన్న ప్రశ్న అడగలేదు. బాలయ్య సమాధానం చెప్పలేదు. రాజకీయాలపై తనకున్న అభిప్రాయాన్ని బాలకృష్ణ కుండబద్దలు కొట్టారు. |
https://www.telugupost.com/movie-news/షాకింగ్-ధరకి-రంగస్థలం-శా-35452/ | రామ్ చరణ్ - సమంత జంటగా తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985 ' శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. పక్కా పల్లేటూరి వాతావరణంలో తెరకెక్కుతున్న ఈ పల్లెటూరి ప్రేమ కథ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టుకోబోతుంది. హైదరాబాద్ లో పాతకాలపు సెట్ ఒకటి.... కోట్ల రూపాయలతో ఆర్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. దాదాపు 70 కోట్ల పైబడే పెట్టుబడి ఎక్కుతున్న ఈ చిత్రానికి సంబందించిన శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం అందుతుంది.'రంగస్థలం 1985 ' శాటిలైట్ హక్కులు భారీ రేటు పలికినట్లు.... ఆ రేటు 16 కోట్లకు ఫిక్స్ అయినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇంకా ఆఛానల్ వారితో అగ్రిమెంట్స్ పూర్తి కాలేదని చెబుతున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాలకు ఇంత అధిక మొత్తంలో శాటిలైట్ ధర పలకడం అంటే రికార్డే మరి. ఇక ఈ చిత్రానికి ఇంత భారీ ధర పలకడానికి కారణం డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని 1980 లో ఫ్రెష్ లవ్ స్టోరీ తో విభిన్న కథాంశంతో తెరకెక్కించడమే వలెనే ఇంత రేటు పలికిందని అంటున్నారు . |
https://www.telugupost.com/movie-news/ఆ-గెస్ట్-ఎవరు-43700/ | ఒకప్పుడు బాలీవుడ్ లో బుల్లితెర మీద రియాలిటీ షోలకు బాలీవుడ్ ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఇప్పటికి అక్కడ సల్మాన్ హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో టాప్ 1 లోనే వుంది. అదే షోని ఇప్పుడు తెలుగు, తమిళంలో టాప్ స్టార్స్ హోస్టింగ్ గా నిర్వహిస్తుంది స్టార్ మా యాజమాన్యం. తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా బిగ్ బాస్ తెరకెక్కుతుంటే, తెలుగులో టాప్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తుంది. ఎన్టీఆర్ హోస్ట్ అంటే ఈ షో మీద విపరీతమై ఆసక్తి అందరిలో కలగడమే కాదు... టీఆర్పీ రేటింగ్స్ లో స్టార్ మా దూసుకుపోవడమే కాదు... నెంబర్ 1 గా కూడా అవతరించింది. ఇక మధ్యలో ఆ టీఆర్పీ రేటింగ్స్ అటు ఇటు అయినా లాస్ట్ ఎపిసోడ్స్ లో బిగ్ బాస్ షో మీద మళ్ళీ క్రేజ్ పెరిగేలా చేశారు. అసలు ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 2 రోజులు బిగ్ బాస్ షో మీద ఎనలేని క్రేజ్ ఉంటుంది. ఎన్టీఆర్ చేసే పెరఫార్మెన్సు, అల్లరి, ఎనర్జీతో బిగ్ బాస్ షోని రక్తి కట్టించాడు. అలాగే బిగ్ బాస్ షో కి వచ్చి టాలీవుడ్ హీరోలు తమ సినిమాల ప్రమోషన్ చేసుకోవడం కూడా బిగ్ బాస్ షోకి గల క్రేజ్ ని తెలియజేస్తుంది. విజయ్ దేవరకొండ, రానా, తాప్సి, అల్లరి నరేష్, సునీల్ వంటి తారలు తమ సినిమాల ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్ కి వచ్చివెళ్లారు. ఇకపోతే ఇప్పుడు బిగ్ బాస్ షో మొదలయ్యి 60 రోజులు కావొస్తుంది. ఇంకో 10 రోజుల్లో ఈ షో పూర్తి కానుంది. ఈ షోలో ఇప్పుడు ఉన్న 6 గురు పార్టిసిపేట్స్ బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 లక్షల కోసం పోటీపడుతున్నారు. ఇక బిగ్ బాస్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అంతా శివ బాలాజీ బిగ్ బాస్ విన్నర్ అవుతాడా? లేకుంటే నవదీపా.. లేకుంటే హరితేజనా ... అలాగే అర్చన, ఆదర్శ్, దీక్షలలో ఎవరు బిగ్ బాస్ ప్రైజ్ మనీ తన్నుకుపోతారో అని ఎదురు చూస్తున్నారు.అలాగే బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం ఎలిమినేషన్ లో ఎవరు బయటికి వెళ్ళిపోతారు? అంతేకాకుండా బిగ్ బాస్ షో ఎండింగ్ ఎపిసోడ్ ని బిగ్ బాస్ నిర్వాహకులు ఎలా ప్లాన్ చేస్తున్నారో? అంటూ ఒకటే క్యూరియాసిటీతో ఉన్నారు. ఇక బయట వినబడుతున్న టాక్ బట్టి ఈ నెల 24న జరగబోయే ఫైనల్ ఎపిసోడ్ లో విన్నర్ ని అనౌన్స్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేయబోతున్నారట బిగ్ బాస్ షో నిర్వహాకులు. అయితే స్పెషల్ గెస్ట్ గా స్పైడర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న మహేష్ బాబుని షో నిర్వాహకులు సంప్రదించగా మహేష్ ఆ రిక్వెస్ట్ ని సున్నితంగా తిరస్కరించాడట. మరి బాక్సాఫీసు వద్ద బిగ్ బాస్ హోస్ట్ ఎన్టీఆర్ జై లవ కుశతో.... మహేష్ బాబు స్పైడర్ తో పోటీపడుతున్నారు. అది మనసులో ఉంచుకుని మహేష్ రానన్నాడో ఏమోగానీ.... మరోపక్క జై లవ కుశతో స్పైడర్ కూడా పోటీపడుతోంది కదా మరి అలాంటప్పుడు మహేష్ ని తీసుకొచ్చి బిగ్ బాస్ లో కూర్చోబెడితే ఏం బావుంటుందని.. అందుకే ఎవరైనా వేరే సీనియర్ స్టార్ ని చూడమన్నట్లుగా ఎన్టీఆర్ కూడా షో నిర్వాహకులకు చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి చూద్దాం ఈ నెల 24 న బిగ్ బాస్ షో స్టేజ్ మీదకి ఇద్దరు స్టార్స్ ఎలా సందడి చెయ్యబోతున్నారో.... అందులో ఒకటి ఎన్టీఆర్ అల్లరి తెలుసు, మరి మరొకరు ఎవరు అంటూ అందరిలో పిచ్చ ఆసక్తి ఏర్పడింది. |
https://www.telugupost.com/movie-news/రామ్-చరణ్-కి-విలన్-గా-తగుల-52965/ | రామ్ చరణ్-సుకుమార్ కలయికలో తెరెకెక్కుతున్న రంగస్థలం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని... ప్రస్తుతం పాటల చిత్రీకరణలో బిజీగా వుంది. పూర్తి స్థాయి పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో రామ్ చరణ్ చిట్టి బాబు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రంగస్థలం ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ లుక్ అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తరువాత రామ్ చరణ్... బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఒక మూవీ లో నటించనున్నాడు.బోయపాటి - రామ్ చరణ్ సినిమాకి పూజ కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఇదిలా ఉంటే బోయపాటి డైరెక్టన్ లో వచ్చే సినిమాలన్నీ పక్క మాస్ చిత్రాలుగానే ఉంటాయి. ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్స్ కి, ఫైట్ సీన్స్ కి అస్సలు కొదవ ఉండదు. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ తో రూపొందిస్తున్న సినిమా లో ఫైట్ సీన్స్ బ్రహ్మాండంగా ఉంటాయట. అయితే ఈ సినిమా లో రామ్ చరణ్ కి విలన్ గా బాలీవుడ్ హీరో అయిన వివేక్ ఒబెరాయ్ ని తీసుకురాబోతున్నాడట బోయపాటి.మరి బాలీవుడ్ నుండి రామ్ చరణ్ కోసం బోయపాటి విలన్ ని గట్టిగానే సెట్ చేసాడు అని అర్ధం అవుతుంది. అలాగే ఈ సినిమా కోసం రామ్ చరణ్ త్వరలో లుక్ కూడా చేంజ్ చేస్తాడు అని సమాచారం అందుతుంది. |
https://www.telugupost.com/top-stories/andhra-pradesh-bjp-will-be-in-trouble-others-are-preparing-to-leave-the-party-1463026 | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. సోము వీర్రాజు కారణంగానే తాను రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. అయితే ఆయన తర్వాత పార్టీని ఎవరు వీడతారన్న చర్చ ప్రస్తుతం ఏపీ బీజేపీలో జోరుగా సాగుతుంది. ఏపీ బీజేపీలో కొందరి మాట చెల్లుబాటు అవుతున్నందున ఇక అందులో కొనసాగేందుకు కొందరు నేతలు ఇష్టపడటం లేదు. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని భావించి అందులోనే ఇమడలేక, అవస్థలు పడుతూ ఇబ్బందులు పడుతూ కొనసాగుతున్న వారు ఇక గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్నారని తెలిసింది.ీవీరి పెత్తనంతోనే...ప్రధానంగా సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, పార్టీ సహ ఇన్ఛార్జి సునీల్ దేవధర్ లు పార్టీపై పెత్తనం చేస్తున్నారంటున్నారు. వచ్చే ఎన్నికలలో పార్టీని విజయం దిశగా తీసుకెళ్లాల్సిన నేతలు తమ సొంత అజెండాను అమలు చేస్తున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అధినాయకత్వం కూడా ఈ ముగ్గురి మాటలనే విశ్వసిస్తుంది. వారినే నమ్ముతుంది. వారు చెప్పిందే చేస్తుంది. అందుకే కన్నా వర్గానికి చెందిన వారిని పార్టీ పదవుల నుంచి సోము వీర్రాజు తొలగించినా అధినాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు. సోము వీర్రాజు తొలి నుంచి పార్టీలో ఉండటం, ఆర్ఎస్ఎస్ నుంచి పార్టీలోకి రావడంతో ఆయనకు హైకమాండ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది.టీడీపీతో పొత్తు లేదని...ఇది గమనించిన మిగిలిన నేతలు సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగానే టీడీపీ అప్పటి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ లు బీజేపీలోకి వచ్చారు. ఇప్పుడు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ల రాజ్యసభ పదవీ కాలం పూర్తయింది. వారికి బీజేపీ మరోసారి రాజ్యసభ ఇచ్చే అవకాశం కన్పించడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో బీజేపీ హైకమాండ్ కూడా ఉంది. ఢిల్లీ స్థాయిలో ఎంత లాబీయింగ్ చేసినా ఫలితం కన్పించడం లేదు. అధినాయకత్వం నుంచి సానుకూలత కూడా లేదు. వారానికి ఒకరు...ఈ నేపథ్యంలోనే టీజీ వెంకటేష్, సుజనా చౌదరి తిరిగి టీడీపీ గూటిలోకి చేరతారన్న ప్రచారం జరుగుతుంది. సీఎం రమేష్ కు మరికొంత కాలం రాజ్యసభ పదవి ఉండటంతో ఆయన ఇప్పుడిప్పుడే బీజేపీకి రాజీనామా చేయరంటున్నారు. వీరిద్దరితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన మరికొందరు నేతలతో పాటు అనంతపురం, కడప జిల్లాలకు చెందిన నేతలు కూడా రేపో మాపో టీడీపీలో చేరనున్నారని తెలిసింది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోతున్నారని చెబుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23, 24 తేదీల్లో టీడీపీలో చేరే అవకాశముంది. ఆ తర్వాత వారానికి ఒక నేత బీజేపీని వీడి తిరిగి సైకెలెక్కేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. |
https://www.telugupost.com/movie-news/tollywood-to-bollywood-stars-list-who-invited-ayodhya-shri-ram-mandir-inauguration-ceremony-1511619 | Ayodhya : రామజన్మ భూమి అయోధలో రామ్ మందిర్ ప్రారంభోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 2024 జనవరి 24న రామమందిర ప్రారంభోత్సవం జరగనుందని తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా ఈ ప్రారంభోత్సవం జరగబోతుందట. ఈ ఆలయ పూర్తి పనులు ఫిబ్రవరి లోపు పూర్తి చేసి భక్తుల సందర్శనార్థం కోసం తీసుకు రానున్నారట. ఇక ఈ రామ మందిర్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు చాలా మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఈక్రమంలోనే ఇండియాలోని పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా ఆహ్వానాలు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ నుంచి ఐదుగురు స్టార్స్, తెలుగు, తమిళ్, కన్నడ నుంచి ఇద్దరు ఇద్దరు స్టార్స్, మలయాళం నుంచి ఒక స్టార్ అతిథిగా హాజరుకాబోతున్నారు. మరి ఆ స్టార్ ఎవరెవరో ఓ లుక్ వేసేయండి.బాలీవుడ్ పరిశ్రమ నుంచి అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, టైగర్ ష్రాఫ్ అతిథులుగా వెళ్ళబోతున్నారు. ఇక టాలీవుడ్ నుంచి చిరంజీవి, ప్రభాస్ గెస్టులుగా హాజరుకాబోతున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి మామాఅల్లుళ్లు రజినీకాంత్, ధనుష్ అతిథులుగా వెళ్ళబోతున్నారు. ఇక కన్నడ పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగిన యశ్, రిషబ్ శెట్టి గెస్టులుగా వెళ్లనున్నారు. మలయాళం నుంచి మోహన్ లాల్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారని సమాచారం.ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ లిస్టులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక వివరాలు వచ్చే వరకు ఎదురు చూడాలి. అయితే ఇప్పుడు బయటకి వచ్చిన లిస్టు చూసిన సౌత్ ఆడియన్స్.. బాలీవుడ్ నుంచి ఐదుగురికి, మలయాళ ఇండస్ట్రీ నుంచి ఒక్కరికే ఆహ్వానం పంపడం అనేదానిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/prashanth-neel-comments-about-prabhas-salaar-movie-in-his-recent-interview-1510363 | Prashanth Neel : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్ పార్ట్ 1 ఈ నెల 22న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న ప్రశాంత్ నీల్.. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అక్కడ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి ఉన్న ఓ సమస్య వలనే సలార్ ని కూడా అలా చిత్రీకరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటి..? సలార్ ని ఎలా చిత్రీకరించారు..?ప్రశాంత్ నీల్ తన కెరీర్ లో ఇప్పటి వరకు డైరెక్ట్ చేసింది కేవలం మూడు సినిమాలే. ఉగ్రమ్, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 చిత్రాలు తరువాత ఇప్పుడు సలార్ సిరీస్ తో వస్తున్నారు. అయితే ఈ అన్ని సినిమాలను గమనిస్తే.. డార్క్ మోడ్ లో కనిపిస్తాయి. ఎక్కువ కలర్స్ లేకుండా మట్టి, మసితో డార్క్ గా సినిమాలు కనిపిస్తుంటాయి. ఇలా డార్క్ గా చూపించడానికి గల కారణం తనకి ఉన్న ఒక సమస్యే అని ప్రశాంత్ నీల్ తెలియజేశారు. తనకి కలర్ OCD (Obsessive compulsive disorder) సమస్య ఉందట.తనకి ఎక్కువ కలర్స్ ఉంటే నచ్చదట. అందుకనే తన సినిమాలో కనిపించే లొకేషన్స్, కాస్ట్యూమ్స్, ఫ్రేమ్స్ అన్ని డార్క్ మోడ్ లోనే ఉంటాయని చెప్పుకొచ్చారు. కాగా సలార్ తరువాత ఎన్టీఆర్ తో చేయబోయే NTR31 అనౌన్స్ పోస్టర్ ని కూడా బ్లాక్ థీమ్ లోనే రిలీజ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇదే ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. 'కేజీఎఫ్లో చేసిన తప్పులే సలార్లో కూడా చేశాను' అంటూ చెప్పుకొచ్చారు.ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే.. "కేజీఎఫ్ విషయంలో నేను ఫైనల్ కట్ రెడీ చేసిన తరువాత దానిని ఒకసారి చూసి.. ఏమన్నా చేంజస్ చేయాలా అని తెలుసుకోవడానికి సమయం కేటాయించలేకపోయాను. సలార్ లో కూడా అదే తప్పుని రిపీట్ చేశాను. అయినాసరి నేను ఆ ఫైనల్ కట్ పై ఆనందం గానే ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.Captain of the Ship in the Action 😎❤️🔥#PrashanthNeel #Salaar #SalaarCeaseFireOnDec22 pic.twitter.com/cwHOTD28LI— Sunith Shetty (@Spoonja__) December 19, 2023 |
https://www.telugupost.com/movie-news/allu-arjun-next-movie-in-line-115848/ | నా పేరు సూర్య సినిమా తరువాత అల్లు అర్జున్ ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేయలేదు. మరి లేట్ అవుతుందనేమో వరుస బెట్టి సినిమాలు ఓకే చేస్తున్నాడు బన్నీ. త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అలానే సైలెంట్ గా సుకుమార్ తో ఓ సినిమా ఓకే చేసేసాడు. ఈ రెండింటి మధ్యలో మరో సినిమాకు ఓకె చెప్పేసాడు. అది కూడా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉండడం విశేషం. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా ఉండబోతుంది. స్క్రిప్ట్ మొత్తం విన్న బన్నీ వెంటనే ఓకే చేసేసాడట. ఈ సినిమాను వేణు శ్రీరామ్ టేక్ ఓవర్ చేస్తున్నాడు. లైన్ లో మరిన్ని సినిమాలు ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ సినిమాల తరువాత వేణు శ్రీరామ్ ఈ స్క్రిప్ట్ మీద చాలాకాలం నుండి వర్క్ చేస్తున్నాడు. సుకుమార్ ప్రాజెక్టు లేట్ అవుతుంది కాబట్టి, బన్నీ ఆ గ్యాప్ లో ఈ సినిమాను ఫినిష్ చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంటే అప్పుటివరకు సుకుమార్ ఆగాల్సిందేనా? ఇవే కాకుండా విక్రమ్ కుమార్ తో ఒక సినిమా, మురుగదాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. |
https://www.telugupost.com/movie-news/tollywood-new-movie-trailer-and-teaser-updates-1506453 | ఈరోజు టాలీవుడ్ లో వరుస అప్డేట్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. సాంగ్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అంటూ కొత్త సినిమాలు సందడి చేశాయి. ఇంతకీ ఈరోజు రిలీజ్ అయిన ఆ అప్డేట్స్ ఏంటి..?కన్నడ ఇండస్ట్రీ నుంచి గత ఏడాది ఒక చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా హిట్టుని అందుకున్న 'కాంతార' మూవీకి కొనసాగింపుగా మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. కాంతారకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఆ గ్లింప్స్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తుంది.నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం 'హరోంహర'. జ్ఞానసాగర్ ద్వారకా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 1980'స్ బ్యాక్డ్రాప్ లో ఒక పీరియాడిక్ రూరల్ గ్యాంగ్స్టార్ చిత్రంగా రూపొందుతుంది. మాళవిక శర్మ ఈ సినిమాలో సుధీర్ బాబుకి జోడిగా కనిపించబోతున్నారు. నేడు ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. మరి ఆ ట్రైలర్ వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.ఇక సిద్దు జొన్నలగడ్డని సింగల్ నైట్ లో స్టార్ చేసేసిన 'డీజే టిల్లు'కి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టిల్లు స్క్వేర్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ నుంచి సాంగ్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా సెకండ్ సాంగ్ 'రాధికా' రిలీజ్ చేశారు.కొన్నాళ్ల నుంచి ఒక్క హిట్టు కోసం కష్టపడుతున్న నితిన్.. కొంత కాలం నుంచి ప్లాప్ల్లో ఉన్న రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీతో కలిసి చేస్తున్న సినిమా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ పాత్రలో ఆడియన్స్ ని నవ్వించబోతున్నారు. నేడు రిలీజ్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.అలాగే కళ్యాణ్ రామ్ నటిస్తున్న 'డెవిల్' మూవీ నుంచి కూడా సాంగ్ ని రిలీజ్ చేశారు. బ్రిటిష్ టైం పీరియడ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక సాంగ్ రిలీజ్ చేయగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇప్పుడు మరో సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. |
https://www.telugupost.com/movie-news/alia-bhatt-surprisingly-got-a-chance-in-rrr-movie-here-is-the-interesting-story-1466592 | RRR.. ఇప్పుడీ పేరు ప్రపంచమంతా వినిపిస్తోంది. దర్శకుడు రాజమౌళి ప్రీ ఇండిపెండెన్స్ కథగా తెరకెక్కించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేయడంతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రల్లో కనిపించి.. తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. వీరికి జంటగా అలియా భట్, ఒలీవియా మోరిస్ లు నటించారు.తాజాగా.. అలియాభట్ ఓ ఇంటర్వ్యూలో తాను RRR సినిమాలో సీత పాత్రకి ఎలా ఎంపికైందీ చెప్పింది. బాహుబలి తర్వాత రాజమౌళిని అలియాభట్ ఒక ఎయిర్ పోర్టులో చూసిందట. ఆయనతో కలిసి సినిమా చేసే అవకాశం వస్తుందేమోనన్న చిన్న ఆశతో ఆయనతో మాట్లాడేందుకు దగ్గరకు వెళ్లిందట. రాజమౌళికి తనని తాను పరిచయం చేసుకుని మాటల్లో మాటగా మీతో కలిసి పనిచేయాలని ఉందంటూ మనసులో మాట చెప్పింది. ఆ మాటలు పూర్తవగానే రాజమౌళి.. ఆల్రెడీ నేను నీ కోసం ఒక పాత్ర రాసుకున్నా, త్వరలో నేనే నిన్ను సంప్రదించాలని అనుకుంటున్నా అని చెప్పాడట. ఆ తర్వాత కొన్నాళ్లకి రాజమౌళి RRR తో అలియాని సంప్రదించడం, ఆమె ఆ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సీతగా అలియా ఎలా నటించిందో అందరికీ తెలిసిందే.ఇకపోతే.. మరికొద్దిగంటల్లో ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా ప్రారంభం కానుంది. RRRలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్లకు ఎంపికైంది. ఈ పాటకు ఆస్కార్ అవార్డు దక్కుతుందన్న ఆశతో.. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు రాజమౌళి, కీరవాణి, సెంథిల్, ఎన్టీఆర్, రామ్ చరణ్, సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తదితరులు ఇప్పటికే అమెరికాకు చేరుకున్నారు. ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటను రాహుల్, కాలభైరవ లైవ్ లో పాడనున్నారు. |
https://www.telugupost.com/movie-news/is-vijay-sethupathi-part-of-pushpa-2-know-the-answer-1433720 | పుష్ప సినిమా భారీ విజయం సాధించాక.. రెండో భాగాన్ని అంతకు మించిన స్థాయిలో రూపొందించాలని చిత్ర బృందం భావిస్తోంది. అందుకే పుష్ప-2 లో భారీ తారాగణాన్ని దించాలని అనుకుంటున్నారని.. భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని భావిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాలో పలువురు స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారనే కథనాలు కూడా వినిపిస్తూ వచ్చాయి. పుష్ప-2 లో దక్షిణాదిలోనే బిజీ యాక్టర్ అయిన విజయ్ సేతుపతి కూడా భాగమయ్యాడనే ప్రచారం సాగుతోంది. దీనిపై ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. విజయ్ సేతుపతి పీఆర్వో ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. '' షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో మాత్రమే ఆయన నటిస్తున్నారని.. మరే సినిమాలో ఆయన నటించడంలేదని'' తెలిపాడు. విజయ్ ఫొటోను కూడా షేర్ చేశాడు. దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్గా మారింది.హిందీ చిత్రాల వరుస పరాజయాల మధ్య, ఇప్పుడు బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ మాత్రమే హిట్ అందించగలడని భావిస్తూ ఉన్నారు. హిందీ చిత్ర పరిశ్రమను ఫ్లాప్ల నుండి షారుఖ్ ఖాన్ మాత్రమే కాపాడగలడని అంటున్నారు. స్పై థ్రిల్లర్ అయిన 'పఠాన్', మాస్ ఎంటర్టైనర్ 'జవాన్', సోషల్ కామెడీ 'డుంకీ' అనే మూడు భారీ చిత్రాలలో షారుఖ్ ఖాన్ నటిస్తూ ఉన్నాడు. ఈ సినిమాలతో ఫ్లాపుల్లో షారుఖ్ ఖాన్ కూడా హిట్స్ అందుకుంటాడని భావిస్తూ ఉన్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న జవాన్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ మాస్ ఎంటర్టైనర్లలో ఒకటిగా ఉండబోతోంది. ఈ సినిమాలో రానా దగ్గుబాటిని తీసుకోవాలని అనుకున్నారు కానీ.. షెడ్యూల్ సమస్యల కారణంగా మేకర్స్ విజయ్ సేతుపతిని ప్రధాన విలన్ పాత్ర చేయాలని కోరినట్లు తెలుస్తోంది. |
https://www.telugupost.com/movie-news/దెబ్బకి-దెయ్యం-వదిలింది-30519/ | హీరోయిన్ అంజలి ఈ మధ్యన హర్రర్ చిత్రాలమీద పడింది. స్టార్ హీరోల పక్కన అవకాశాలు రాక ఇలా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో కాలక్షేపం చేస్తుంది. గీతాంజలి చిత్రంతో హర్రర్ కామెడీకి శ్రీకారం చుట్టిన అంజలి తదుపరి చిత్రం చిత్రాంగద లో కూడా ఇలా హర్రర్ యాక్షన్ చేసి జనాల్ని భయపెట్టింది. ఇప్పుడు జనాలు భయపడడం ఏమోగానీ అంజలి దెయ్యాలుకు తెగ భయపడిపోతుందట. వరుసగా దెయ్యాల చిత్రాల్లో నటించడం వలనో మరేదన్న కారణమో తెలియదు గాని ఈ దెయ్యాల భయంతో అంజలి ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి పారేసిందట.అంజలి గత కొన్ని రోజులుగా హైద్రాబాద్ లోని గచ్చిబౌలిలోని ఒక అపార్ట్ మెంట్ లో ఉంటుంది. అయితే అక్కడ ఏవో అతీత శక్తులు ఉన్నట్టు అవి తనని భయపెడుతున్నట్లు నమ్ముతుంది. రాత్రి పూట తన ఇంటి చుట్టూ ఎవరో తురుగుతున్నట్లు... ఏవో విచిత్రమైన శబ్దాలు రావడం వంటివి చాలా కాలం నుండి జరుగుతున్నాయట. వీటన్నిటికీ భయపడిన అంజలి ఇల్లు ఖాళీ చేసి వేరే చోటికి మారిపోయిందట. ఇల్లు ఖాళీ చెయ్యడమేమో గాని ఇకపై హర్రర్ చిత్రాలలో నటించకూడదని కూడా ఫిక్స్ అయ్యిందట అంజలి. ఇలాంటి భయాలతోనే అంజలి రెండు మూడు ఆఫర్స్ ని తిరస్కరించిందని చెబుతున్నారు. పాపం అంజలిని దెయ్యాలు బాగానే భయపెట్టాయి. |
https://www.telugupost.com/movie-news/మరోసారి-హైలెట్-అయ్యాడు-41121/ | టాలీవుడ్ లో కమెడియన్స్ కి ఒకప్పుడు కొదవే లేదు. అల్లు రామలింగయ్య తరంలో బోలెడుమంది కమెడియన్స్ వుండేవారు. ఆ తర్వాత బ్రహ్మ్మనందం వచ్చాడు. ఆయన టైం లోనే ఎమ్మెస్ నారాయణ, మల్లికార్జునరావు, ధర్మవరపు సుబ్రమణ్యం, ఏవీఎస్ వంటి కమెడియన్స్ టాలీవుడ్ ని ఏలేశారు. ఆ తర్వాత సునీల్, ఆలీ వంటి వారు కూడా కమెడియన్స్ గా కొన్నాళ్ళు తమ హవా టాలీవుడ్ లో కొనసాగించినప్పటికీ.... ఆ తర్వాత సునీల్ హీరోగా మారడం, ఆతర్వాత సప్తగిరి వంటివారు కొన్నాళ్ళు హాస్యంతో సందడి చేసినా ఎక్కువకాలం కమెడియన్స్ గా మనలేకపోయారు. ఇక బ్రహ్మనందం చాలా కాలమే టాలీవుడ్ లో కమెడియన్ గా ఉన్నపటికీ ఆయన హవా ఇప్పుడు ప్రెజెంట్ సినిమాల్లో కనబడడంలేదు. అయితే ఒక్కసారిగా బ్రహ్మీ ని టాలీవుడ్ డైరెక్టర్స్ పక్కన పెట్టేసారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం పృద్వి, వెన్నెల కిషోర్ వంటివారు కమెడియన్స్ గా టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. కానీ పృద్వి కామెడీ కూడా రొటీన్ గా అయిపోవడంతో ఆయన కూడా సినిమాల్లో ఎన్నాళ్ళో నిలబడే పరిస్థితి లేదు. ఇక ప్రస్తుతం వెన్నెల కిషోర్ మాత్రం సినిమాల్లో మంచి జోరు చూపిస్తున్నాడు. అలాగే వెన్నెల కిశోర్ కి తోడు జబర్దస్త్ కమెడియన్స్ కాస్త చెయ్యందిస్తున్నా... వెన్నెల కిశోర్ మాత్రం తనదైన శైలిలో కామెడీతో ఆకట్టుకుంటున్నాడు. మంచి మంచి అవకాశాలతో సినిమాల్లో తనకిచ్చిన పాత్రకి 100 పెర్సెంట్ న్యాయం చేసే దిశగా పయనిస్తున్నాడు. మొన్నటికి మొన్న 'అమితుమీ' చిన్న చిత్రంగా విడుదలై వెన్నెల కిషోర్ కామెడీతోనే ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఆ సినిమాలో నటించిన నటీనటులు అవసరాల శ్రీనివాస్ మిగిలిన వారికంటే వెన్నెల కిశోర్ కామెడికే పెద్ద పీట వేశారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు తాజాగా వెన్నెల కామెడీ 'ఆనందో బ్రహ్మ' తో మరోసారి హైలెట్ అయ్యింది. ఈ సినిమాలో చెవుడు, రేచీకటి ఉన్న వ్యక్తిగా కిషోర్ చేసిన హార్రర్ కామెడీకి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 'ఆనందో బ్రహ్మ' ఫస్ట్ హాఫ్ చాలా చప్పగా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం వెన్నెల కిషోర్ రాకతోనే కొంచెం పైకి లేస్తుంది. ఆ తర్వాత షకలక శంకర్ కి వెన్నెల కిషోర్ తోడవడంతో ఓ ఇరవై నిమిషాల పాటు నవ్వులే నవ్వులు. ఆ ఇరవై నిమిషాల ఎపిసోడే సినిమాకు హైలెట్. ఈ సినిమా హిట్ తో వెన్నెల ఇక కమెడియన్ గా టాప్ ప్లేస్ లోకి వెల్లదనడంలో ఎటువంటి సందేహం లేదు. |
https://www.telugupost.com/movie-news/బాలయ్య-ఇక-ఛాన్స్-ఇవ్వడేమ-46572/ | బోయపాటి శ్రీను, బాలకృష్ణ తో తెరక్కేకించిన 'సింహ, లెజెండ్' సినిమాలతో టాప్ డైరెక్టర్ అయ్యాడు. అందుకే మరోసారి బాలయ్యని తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే కసితో బాలయ్య చుట్టూతా తిరుగుతానే ఉన్నాడు. కానీ బాలకృష్ణ మాత్రం బోయపాటి తన చుట్టూ ప్రదక్షిణాలు చేసినా కూడా అస్సలు పట్టించుకోవడంలేదు. తన సినిమాలను వేరే వేరే దర్శకులతో తెరకెక్కించేస్తూ బోయపాటిని పక్కన పెట్టేసాడు. బోయపాటి శ్రీను కూడా బాలయ్య కోసం ఎదురు చూసి చూసి ఇక తప్పక చిన్న హీరో బెల్లంకొండ శ్రీనివాస తో 'జయ జానకి నాయక' సినిమాని తెరకెక్కించి ఒక మాదిరి హిట్ అందుకున్నాడు.ఆ సినిమా చేసాక అయినా బాలయ్య ఛాన్స్ ఇస్తాడేమో అనుకుంటే... మళ్ళీ బోయపాటికి బాలయ్య హ్యాండ్ ఇచ్చాడు. దెబ్బకి బోయపాటి.... చిరుతో సినిమా చేద్దామనుకున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఈసారి చిరు కొడుకు రామ్ చరణ్ ని కలిసి కథ వినిపించి సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. ఇక చరణ్ కూడా సుకుమార్ తో రంగస్థలం పూర్తయ్యాక కొరటాలతో కమిట్ అయ్యాడు కానీ... ఆ సినిమా ప్రస్తుతానికి పట్టాలెక్కేలా కనబడం లేదు. ఎందుకంటే మహేష్ తో 'భరత్ అనే నేను' సినిమా సంక్రాతి నుండి ఏప్రిల్ కి వెళ్లిపోవడంతో కోరటాల అప్పటివరకు ఖాళీ అవ్వడు. అందుకే చరణ్ కూడా బోయపాటి తో సినిమా చెయ్యడానికి మొగ్గుచూపాడంటున్నారు.ఇక బాలయ్య కూడా 102 సినిమాని కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తుంటే... 103 వ సినిమాని ఎన్టీఆర్ బయోపిక్ ని తేజ దర్శకత్వంలో చెయ్యడానికి రెడీగా ఉండడంతో బోయపాటి కూడా చరణ్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇక బోయపాటి - చరణ్ కలయికలో తెరకెక్కే సినిమాని త్వరితగతిన పూర్తి చేసెయ్యాలనే ఆలోచనలో ఆ దర్శకుడు, హీరో ఉన్నారు. ఇక రంగస్థలం కంప్లీట్ కాగానే అంటే డిసెంబర్ లో చరణ్ - బోయపాటి సినిమా సెట్స్ మీదకెళ్ళి.. వచ్చే దసరానాటికి పూర్తి చేసి విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఆ ఇద్దరు ఉన్నారట. |
https://www.telugupost.com/crime/daughters-family-attack-on-son-in-law-family-members-one-women-died-1345060 | సన్నగా మొదలైన వర్షం.. చిలికి చిలికి గాలి, వానగా పెరిగిన మాదిరిగానే భార్యా భర్తల మధ్య జరిగిన గొడవ ప్రాణాలు తీసేంతవరకూ వెళ్లింది. దంపతుల మధ్య గొడవ రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. భార్య తరపు కుటుంబీకులు, భర్త తరపు కుటుంబీకులపై కత్తులతో దాడికి తెగబడ్డారు. కళ్లలో కారం కొట్టి.. కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఒక మహిళ మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నిడమానూరు మండలం బొక్కమంతల పహాడ్ లో చోటుచేసుకుంది. ఐదేళ్ల క్రితమే వివాహంవివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా నిడమానూరు మండలం బొక్క మంతల పహాడ్ కు చెందిన కమతం భిక్షమయ్య, అచ్చమ్మ దంపతుల కుమారుడైన శివన్నారాయణకు.. అదే గ్రామానికి చెందిన జిల్లపల్లి సూర్యనారాయణ - యశోద దంపతుల కుమార్తె శ్యామలతో ఐదేళ్ల క్రితం వివాహమయింది. ప్రస్తుతం నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. కాగా.. శివన్నారాయణ వృత్తిరీత్యా హైదరాబాద్ లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండేవాడు. కరోనా కారణంగా స్వగ్రామానికి తిరిగివచ్చిన అతను.. ప్రస్తుతం వారికున్న 10 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు.పెళ్లైన నాటి నుంచే గొడవలుఇదిలా ఉండగా.. పెళ్లైన నాటి నుంచి ఆ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మధ్య మధ్యలో పెద్ద మనుషులు సర్దిచెప్పి పంపినా.. ఎలాంటి మార్పు లేదు. గొడవలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మంగళవారం ఉదయం శ్యామల తన తల్లికి ఫోన్ చేసి జరిగిన గొడవ గురించి చెప్పి.. ఏడ్చింది. కూతురు ఏడుస్తుండటం భరించలేని సూర్యనారాయణ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన కూతుర్ని వేధిస్తున్న వాడిని వదిలిపెట్టనంటూ తల్లి, తల్లి, శ్యామల అన్న కలిసి శివన్నారాయణ ఇంటికెళ్లారు. తమతో తీసుకెళ్లిన కారాన్ని శివన్నారాయణ, అతని తండ్రి భిక్షమయ్య, తల్లి అచ్చమ్మ, నానమ్మ కళ్లల్లో జల్లారు. అనంతరం కత్తులతో వారిపై దాడిచేశారు.ఈ దాడిలో శివన్నారాయణ తల్లి అచ్చమ్మ మృతి చెందగా.. మిగతా వారంతా తీవ్రగాయాలతో మిర్యాలగూడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లుడి కుటుంబంపై దాడి చేసిన శ్యామల తల్లిదండ్రులు, అన్న స్వయంగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లుతెలుస్తోంది. |
https://www.telugupost.com/crime/five-dead-and-several-injured-in-lakhimpur-kheri-after-truck-crushes-pedestrians-1459856 | యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లఖింపూర్ ఖేరీలోని గోలా బెహ్రైచ్ జాతీయ రహదారిపై ఓ స్కూటీని కారు ఢీ కొట్టింది. కారులో స్కూటీ ఇరుక్కుపోయింది. ఆ రెండు వాహనాలను వేరు చేసేందుకు పాదచారులు ప్రయత్నిస్తుండగా.. వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు పాదాచారులను బలంగా ఢీ కొట్టింది. దాంతో ఐదుగురు పాదచారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కొందరికి గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. |
https://www.telugupost.com/movie-news/konidela-niharika-happy-wedding-81994/ | మెగా డాటర్ కి మెగా అనే పదమే శాపం అయ్యిందనిపిస్తుంది. మెగా హీరోలకు మెగా అనే పదం ఒక బ్రాండ్. కానీ నిహారికకు మాత్రం మెగా అనే పదం శాపం ఆనేలానే ఉంది వ్యవహారం చూస్తుంటే. ఎందుకంటే హీరోయిన్స్ అంటే సినిమాల్లో ఎంతోకొంత గ్లామర్ షో చెయ్యాలి. అలాగే హీరోలతో మంచి రొమాంటిక్ సీన్స్ లో కలుపుగోలుగా నటించాలి. కానీ నిహారికకు అవకాశం ఇవ్వాలంటేనే జంకే దర్శకనిర్మాతలు ఆమె కోసం గ్లామర్ పాత్రలు రాయడానికి కూడా సాహసించరు. మరి హీరోయిన్ గా నాగ శౌర్య తో కలిసి ఒక మనసు సినిమా లో చక్కటి ట్రెడిషనల్ డ్రెస్సులతో... అందమైన చీర కట్టులో కనిపించినప్పటికీ... ఆ సినిమా సో సో గానే ఆడింది. నాగ శౌర్య తో రొమాంటిక్ గా మెప్పించినా ఆ సినిమాపెద్దగా ఆడలేదు. ఇక ఆ సినిమా వచ్చిన చాన్నాళ్ళకి మళ్ళీ హ్యాపీ వెడ్డింగ్ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించింది. మరి ఈ సినిమా లోనటించిన హీరో కూడా యావరేజ్ కావడం నిహారికకు మైనస్ అయ్యింది. ఏదైనా పేరున్న హీరో తో చేసిన ఈ సినిమా యావరేజ్ పడేదేమో కానీ... సుమంత్ అశ్విన్ వంటి యావరేజ్ హీరోతో నటించిన నిహారిక ఈ హ్యాపీ వెడ్డింగ్ తో యావరేజ్ మార్కులే వేయించుకుంది. బాగా కన్ఫ్యూషన్ ఉన్న అమ్మాయిగా నిహారిక ఈ సినిమాలో బాగానే నటించింది. లుక్స్ లోను నిహారిక అందమైన ట్రెడిషనల్ డ్రెస్సులతోనే నటించింది. కానీ మేకప్ విషయంలో నిహారిక ఇంకాస్త శ్రద్ద తీసుకోవాల్సింది.ఇక హ్యాపీ వెడ్డింగ్ సినిమా కి ఓ అన్నంత మార్క్స్ క్రిటిక్స్ వెయ్యలేదు. విడుదలకు ముందున్న బజ్ విడుదలయ్యాక సినిమా మీద లేదు. నిహారిక, సుమంత్ అశ్విన్ అన్ని కాలేజ్ లకు తిరుగుతూ సినిమా మీద హైప్ పెంచే ప్రయత్నం చేశారు. ఇక సినిమాలో ఫ్యామిలీ డ్రామా బాగున్నప్పటికీ... సుమంత్ నటన సూపర్ అయినప్పటికీ.. సుమంత్ అశ్విన్ డైలాగ్ డెలివరీ గాని.. సెకండ్ హాఫ్ లోని సాగదీత గాని, ఎమోషన్స్ గాని, ఈ సినిమా పాటలు, థమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ గాని, డైరెక్షన్ గాని, స్క్రీన్ ప్లే గాని ఏమాత్రం రుచించేదిగా లేదు. మరి కేవలం ఈ సినిమా కి కెమెరా పని తనం, నిహారిక నటన, కొన్ని డైలాగ్స్ మాత్రమే మెప్పించేవిగా ఉన్నాయి. మరి నిహారికాకి ఈ హ్యాపీ వెడ్డింగ్ తో కూడా ఒక మనసు లాంటి ఫలితమే దక్కింది. మరి ఈ సినిమా తర్వాత అమ్మడు మరో సినిమా కోసం మరెంత గ్యాప్ తీసుకోవాల్సి వస్తుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/pantham-collections-2-78686/ | ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వారం రెండు సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. అందులో ఒకటి గోపీచంద్ - మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన పంతం మూవీ. మరొకటి సాయి ధరమ్ తేజ్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తేజ్ ఐ లవ్ యు. ఈ రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్ తో విడుదలయ్యాయి.అయితే అందులో గోపీచంద్ పంతం మూవీ కి సాయి ధరమ్ తేజ్ తేజ్ ఐ లవ్ సినిమాలు రెండిటీకి...యావరేజ్ టాక్ రావడం అలాగే రెండు సినిమాలకు క్రిటిక్స్ కూడా ఒకేలాంటి మార్కులు వెయ్యడం జరిగాయి. అయితే నిన్న గురువారం విడుదలైన పంతం సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా.. ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది. గోపీచంద్ కి మరో ప్లాప్ పడింది అనుకున్నా కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించింది. మరి సాయి ధర్మ తేజ్ ఐ లవ్ యూ కి అంత కలెక్షన్స్ వచ్చే సీన్ లేదంటున్నారు. సాయి ధరమ్ సినిమాలో అనేక మైనస్ లు ఉన్నాయంటున్నారు. కేవలం అనుపమ ఎక్సప్రెషన్స్, సినిమాటోగ్రఫీ తప్ప ఆ సినిమాలో మరే ప్లస్ పాయింట్ లేదంటున్నారు. ఇక గోపీచంద్ పంతం మూవీ లో మైనస్ లు ఉన్న తేజ్ ఐ లవ్ యూ కన్నా బెటర్ అనేలా ఉన్నాయని...అందుకే ఈ వారం లో గోపీచంద్ గట్టెక్కేసినట్లే అంటున్నారు. ఇక కరుణాకరన్ ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోవడం... రొటీన్ కథతో తేజ్ ఐ లవ్ యూ ని బోర్ కొట్టించేసాడంటున్నారు. ఏదిఏమైనా ఈ వారం విజేత మాత్రం గోపీచందే. మరి అసలే కష్టాల్లో ఉన్న గోపీచంద్ కి తేజ్ ఐ లవ్ యు కి టాక్ తేడా టాక్ రావడం కలిసొచ్చింది.అలా గోపీచంద్ అనుకోకుండా గట్టెక్కేసాడు |
https://www.telugupost.com/movie-news/శివాని-లుక్-సూపర్-62515/ | హీరోయిన్స్ గా సినీ ఇండస్ట్రీలో పాతుకుపోవాలంటే వారికి కచ్చితంగా నటనతో పాటు అందం కూడా ఉండి తీరాలి. ఆలా అయితే ఎక్కువ ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండగలరు. ఇప్పుడు చాలా మంది స్టార్ ఫామిలీస్ నుండి భామలు వెండితెరను ఏలడానికి సిద్ధమవుతున్నారు.మొన్నటివరకు హీరోయిన్స్ కూతుర్లు పెద్దగా ఇండస్ట్రీలో కనిపించే వారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే అసలు విషయానికి వస్తే.. హీరో రాజశేఖర్ కూతురు తల్లి జీవిత సహకారంతో శివాని వెండితెరకు పరిచయం కాటానికి ఎంతో సమయం పట్టేలాలేదు. ఎందుకంటే ఆమె అందం ఇప్పుడు చాలా మందిని ఆకర్షిస్తోంది.లేటెస్ట్ గా జరిగిన ఓ మ్యారేజ్ లో శివాని లంగా వోణి లో కనిపించి అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. ఆల్రెడీ '2 స్టేట్స్' తెలుగు రీమేక్ లో హీరో అడివి శేష్ పక్కన హీరోయిన్ గా చేయడానికి సిద్దపడిన సంగతి తెలిసిందే. అయితే వెండితెరపై ప్రేక్షకులని ఎలా అలరిస్తదో తెలీదు కానీ..ఇక్కడ మాత్రం చాలా ట్రెడిషనల్ లుక్ తో చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. కచ్చితంగా ఆమెకు టాలీవుడ్ లో మంచి భవిషత్తు ఉండే అవకాశం ఉంది. |
https://www.telugupost.com/movie-news/sarvanand-samantha-janu-collections-147650/ | జాను చిత్రానికి తెలుగు ప్రేక్షకులే కాదు.. క్రిటిక్స్ కూడా సూపర్ హిట్ టాకిచ్చారు. కానీ సినిమాకి కలెక్షన్స్ చాలా డల్ ఉన్నాయి. రెండు తెలుగు రాష్టాల్లోనూ జాను సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులు పల్చగానే కనబడుతున్నారు. సినిమా ఫీల్ గుడ్ క్లాసిక్ అయినప్పటికీ.. ఆ సినిమా స్లో నేరేషన్ వలన ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఒక కారణమైతే.. ఇప్పటికే ఈ సినిమాని తమిళంలో వీక్షించేయడం మరో కారణం. అలాగే తమిళ రీమేక్ 96 గనక ఆన్ లైన్ లోను, అలాగే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోను, బుల్లితెర మీద రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేది అంటున్నారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వీకెండ్ డల్ కలెక్షన్స్ తో జాను సినిమా ఉండగా.. ఇలాంటి క్లాసిక్, క్లాసీ లవ్ స్టోరీస్ ని ఇష్టపడే ఓవర్సీసీ ప్రేక్షకులు కూడా జాను సినిమాని ఆదరించనట్లే కనబడుతుంది అక్కడి వ్యవహారం. జాను సినిమా మొదటినుండి ఓవర్సీస్ వసూళ్లలో మాత్రం నెమ్మదిగానే ఉంది. ప్రీమియర్ల ద్వారా 34,168 డాలర్లు మాత్రమే వసూలు చేసిన జాను శుక్రవారం 34,391 డాలర్లు, రెండవ రోజు శనివారం జాను 52,869 డాలర్ల వసూళ్లు దక్కించుకుంది. ఆదివారం కలెక్షన్స్ కూడా అలానే ఉన్నాయి. సమంత హిట్ చిత్రం ఓ బేబీ కేవలం ప్రీమియర్ల ద్వారానే 155,000 డాలర్లను వసూలు చేసింది. దానితో పోల్చితే జాను వసూళ్లు చాలా తక్కువనే అనాలి. |
https://www.telugupost.com/movie-news/why-so-silent-162593/ | నెల రోజుల్ ముందు వరకు కరోనా లాక్ డౌన్ తో షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. మూడు నెలలు షూటింగ్స్ లేక అల్లాడిన సినిమా ఇండస్ట్రీ మళ్ళీ జూన్ 8 నుండి ఒక్కొక్కటిగా పట్టాలెక్కడానికి రెడీ అయ్యాయి. సినిమాల సంగతెలా ఉన్న సీరియల్స్ షూటింగ్ మాత్రం వరసబెట్టి సెట్స్ కెళ్ళిపోయాయి. కానీ సినిమా షూటింగ్స్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. సినిమా షూటింగ్స్ కోసం కంకణం కట్టుకుని గ్యాంగ్ ని వెంటేసుకుని తిరిగిన చిరంజీవి సైలెంట్ గా వేడుక చూడడం తప్ప ఏం చెయ్యడం లేదు. తలసాని తో తన ఇంట్లోనే నాగార్జున, దర్శకనిర్మాతలతో కలిసి మీటింగ్స్ పెట్టి.. పెద్దరికం నెత్తిన వేసుకుని మరీ ప్రభుత్వ అనుమతులు తెచ్చి ఇలా మౌనం గా ఉండడం అందరిని ఆశ్చర్యానికి కలగజేస్తుంది. చిరు లాంటి పెద్ద మనిషే ఇలా మౌనంగా ఉంటే.. మిగతా వారు ఎలా డేర్ చేసి సెట్స్ మీదకెళ్తారు. కానీ చిరు మాత్రం షూటింగ్ గురించి ఆలోచించడం లేదు.. కరోనా గురించి మాట్లాడడము లేదు. బాలకృష్ణ చెప్పిందే జరుగుతుంది. ఇప్పట్లో సినిమా ఇండస్ట్రీ కోలుకోలేదని, ఇదివరికటిలా సినిమా ఇండస్ట్రీ ఉండదని.. చెప్పినట్లే జరుగుతుంది. అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చూసినా చిరు పెదవి విప్పడం లేదు. కనీసం షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో.. పెద్ద సినిమాలు ఎప్పుడు సెట్స్ మీదకెళ్తాయో అనేది చర్చించడం లేదు. మొన్నటివరకు రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల లాంటి దర్శకులతో మీటింగ్స్ పెట్టిన చిరు.. ఇప్పుడు మాత్రం ఎవ్వరిని కలవడం కూడా లేదు. మరి ఎందుకు ఈ మౌనం అంటూ చాలామంది చిరుని వేలెత్తి చూపించే పరిస్థితి వస్తుంది. చిరు అన్నీ గమనిస్తున్నాడో.. లేదంటే కరోనా కదా మనకెందుకులే అని సైలెంట్ అవుతున్నాడో. |
https://www.telugupost.com/movie-news/2-0-release-review-collections-99702/ | బెల్లంకొండ శ్రీనివాస్ తన మొదటి సినిమా వీవీ వినాయిక్ డైరెక్షన్ లో నటించాడు. 'అల్లుడు శ్రీను' యావరేజ్ గా అనిపించుకుంది. ఆ తరువాత వచ్చిన ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఆడలేకపోయాయి. ఈనేపధ్యంలో తనకు ఒక్క హిట్ అయిన అవసరం అనుకుని రెండు సినిమాలు వరసగా చేస్తున్నాడు శ్రీనివాస్. తేజ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో కాజల్ హీరోయిన్. మరొకటి కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తో చేస్తున్నాడు.ఈసినిమాకు ‘కవచం’ అనే టైటిల్ ను పెట్టారు. ఇందులో కూడా కాజల్ హీరోయిన్. మెహ్రీన్ ఇంకో హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. డిసెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. మొదట ఈసినిమాను ‘2.0’కి పాజిటివ్ టాక్ వస్తే విడుదల తేదీ వాయిదా వేద్దాం అనుకున్నారు. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ‘2.0’కి పోస్జిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈసినిమాను వాయిదా వేయట్లేదు.ముందుగా చెప్పినట్టుగా డిసెంబర్ 7వ తేదీన విడుదల అవుతుందని చెబుతున్నారు. నిన్నటి నుండి రిలీజ్ డేట్ ప్రోమోస్ కూడా విడుదల చేసారు. ఈమూవీపై పూర్తిగా చూసి కొనుగోలు చేసిన బయ్యర్లు కూడా కంటెంట్ పై నమ్మకంతోనే ఉన్నారట. అందుకే అనుకున్న టైం కి రిలీజ్ చేస్తున్నారు. ఇక అదే రోజు ‘సుబ్రహ్మణ్యపురం’.. ‘భైరవగీత’.. ‘హుషారు’ థియేటర్లలోకి వస్తున్నాయి. ఈసినిమాలతో కవచం ఎలా తట్టుకుంటాదేమో చూడాలి |
https://www.telugupost.com/crime/5-men-employed-at-isro-canteen-killed-in-road-accident-in-kerala-1458824 | అతివేగం ప్రాణలకు ప్రమాదకరమని.. రోడ్డుకి ఇరువైపులా మనకు బోర్డులు దర్శనమిస్తూనే ఉంటాయి. కానీ.. కొందరు ఏం కాదులే అన్న గుడ్డివైఖరితో వాహనాలను శృతిమించిన వేగంతో నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గతరాత్రి యూపీలో ఓ ట్రక్కు సృష్టించిన బీభత్సానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఆ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే కేరళలో జరిగిన మరో ప్రమాదంలో ఐదుగురు యువకులు దుర్మరణం చెందారు.సోమవారం వేకువజామున 1.30 గంటలకు ఏపీ నుండి బియ్యం బస్తాల లోడుతో కేరళలోని అంబలపూఝ జిల్లాలోని అలపూఝ వెళ్తోంది. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పడంతో.. రెండు వాహనాలు పరస్పరం ఢీ కొన్నాయి. తిరువనంతపురానికి సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో.. కారులో ప్రయాణిస్తోన్న ఐదుగురు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి.. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు.మృతులు ఇస్రో క్యాంటీన్ లో పనిచేస్తున్న ప్రసాద్, అమల్, షిజు, సచిన్, సుమోద్ లుగా గుర్తించారు. నలుగురు ఘటనా ప్రాంతంలోనే చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్, క్లీనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. |
https://www.telugupost.com/movie-news/tamanna-bhatia-marriage-81881/ | రెండు రోజుల క్రితం హీరోయిన్ తమన్నాకి కి ఒక అమెరికా డాక్టర్ కం బిజినెస్ మ్యాన్ తో వివాహం జరగబోతుందంటూ మీడియాలో తమన్నా పెళ్లి వార్తలు తెగ హల్చల్ చేశాయి. ఇప్పటికే తమన్నా పేరెంట్స్.. ఆ వరుడు డాక్టర్స్ పేరెంట్స్ ఇద్దరూ మాట్లాడుకుని పెళ్లి డేట్ ఫిక్స్ చేయబోతున్నారని.. అసలిప్పటికే నిశ్చితార్ధం అయ్యిందని.. ఇలా రకరకాల వార్తలు సోషల్, వెబ్ మీడియాలో వచ్చాయి. ఇక పెళ్లిపై తర్వాత తమన్నా సినిమా లు కంటిన్యూ చేస్తుందా.. లేక అవకాశాలు లేవు కదా అని డాక్టర్ తో అమెరికాలో సెటిల్ అవుతుందా అంటూ రకరకాల న్యూస్ లు హల్చల్ చేశాయి కూడా. మరి ప్రస్తుతం తాను నటిస్తున్న తెలుగు క్వీన్ సినిమా పూర్తి కాగా.. సై రా నరసింహారెడ్డి వంటి బిగ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్న తమన్నా... వెంకటేష్ సరసన ఎఫ్ 2 లో కూడా వన్ అఫ్ ద హీరోయిన్ గా నటిస్తుంది.. ఇక తాజాగా తన పెళ్లి వార్తలపై ఘాటుగా స్పందించింది. తాను పెళ్లి చేసుకుంటున్నాననే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని... అసలు ఒకరోజు సినిమా హీరోని, మరోసారి క్రికెటర్ ని, ఇంకోసారి డాక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్నానని వస్తున్న వార్తలను చూస్తుంటే నేనేదో పెళ్లికొడుకుల్ని షాపింగ్ చేస్తున్నట్టుగా ఉంది... అసలు నా పర్సనల్ విషయాల మీద ప్రూఫ్ లేని వార్తలు పుట్టిస్తే ఊరుకునేది లేదని.. అసలు నేను ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు.. అలాగే నా పేరెంట్స్ కి కూడా పెళ్లి విషయంలో ఎలాంటి తొందర లేదు.. ఇక నేను చాలా సినిమాల్తో బాగా బిజీగా వున్నాను.. ఇప్పటి వరకైతే సినిమా లనే ప్రేమిస్తున్నాను... అంటూ తన ట్విట్టర్ సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు.. తన పెళ్లి పుకార్లని ట్విట్టర్ లోని లెటర్ తో ఫుల్ స్టాప్ పెట్టింది. మరి ఎప్పుడు తన పెళ్లి వార్తలపై స్పందించని తమన్నా ఈసారి మాత్రం తెగ ఫైర్ అయ్యింది.అయినా వయసొచ్చాక పెళ్లి చేసుకోవాలి గాని.. వయసైపోయినా పెళ్లి మాటెత్తితే ఇలా అంతెత్తున లేవడం అవసరమా.. ఏదో నాకు పెళ్లి కుదరలేదు.. అవన్నీ ఒట్టి పుకార్లే అంటూ స్పందిస్తే సరిపోయే దానికి... ఇంట పెద్ద లెటర్ అవసరమా తమన్నా అంటూ నెటిజెన్ల కామెంట్స్ చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/released-yesterday-evening-the-saira-trailer-got-a-good-response-134028/ | నిన్న సాయంత్ర రిలీజ్ అయిన సైరా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఇది ఒక విజువల్ వండర్ అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఇందులో చిరంజీవి తన నట విశ్వరూపం చూపించారు అని, అమితాబ్, విజయ సేతుపతి, సుదీప్, జగపతి పాత్రలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయని అర్ధం అవుతుంది. పాత్రలు చాలా కీలకం…. ముఖ్యంగా ఇందులో నయనతార, తమన్నా పాత్రలు చాలా కీలకం కాబోతున్నాయని ట్రైలర్ చూస్తే చెప్పొచ్చు. తమన్నా గురించి మాట్లాడుకుంటే ఇందులో ఆమె చెప్పిన ఓ డైలాగ్ ” లక్ష్మీ అనే నాపేరుముందు నరసింహ అనే మీ పేరు ఇవ్వండి చాలు” వింటే ఈమెకు ఇందులో మంచి రోల్ ఇచ్చారని అర్ధం చేసుకోవచ్చు. డైలాగ్ పరంగా చూసుకుంటే నరసింహారెడ్డి భార్యగా కావాలని తపించే యువతిగా తమన్నా పాత్ర ఉంటుందనిపిస్తుంది. నయనతార – చిరు – తమన్నా మధ్య వచ్చే సీన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్తుందని తెలుస్తుంది. బాహుబలి తరువాత సైరా లో అంతటి పాత్ర చేస్తున్న తమన్నా ఎలా అలరిస్తుంది చూడాలి. |
https://www.telugupost.com/movie-news/samantha-gave-a-brilliant-performance-in-janu-telugu-movie-147473/ | పెళ్లి తర్వాత సమంత రేంజ్ మారిపోతుంది. ఆమెకి అవకాశాలే రావు అనుకున్నవారికి.. సమంత ఎప్పటికప్పుడు హిట్ సినిమాలు చేస్తూ సమాధానం చెబుతూనే ఉంది. పెళ్లి తర్వాత గ్లామర్ డాల్ గా మారిన సమంత సినిమాల్లో మాత్రం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకి మొగ్గు చూపుతుంది అనేది.. ఆమె చేసిన వరస సినిమాలు చూస్తే తెలుస్తుంది. మజిలీ, ఓ బేబీ, యు టర్న్, నిన్న విడుదలయిన జాను సినిమాలు ఉదాహరణలు. యు టర్న్ లో అందంగా గ్లామర్ గా అదరగొట్టిన సమంత, మజిలీ సినిమాలో చైతూకి కి వైఫ్ గా బలమున్న కేరెక్టర్ లో ఎమోషనల్ గా సూపర్ అనిపించింది. ఇక ఓ బేబీ లో సమంత నటనకు అందరూ షాకవ్వల్సిందే. అంత అద్భుతంగా నటించింది. ఇక తాజాగా 96 రీమేక్ జాను సినిమాలో టైటిల్ రోల్ పోషించిన సమంత జాను అలియాస్ జానకి దేవి పాత్రకి ప్రాణం పోసింది. సమంత కి ఇది చాలా కష్టతరమైన పాత్ర అయినప్పటికి ఆమె మరోసారి తానేంటో నిరూపించుకుంది. ఈ సినిమాలో సమంత పర్ఫార్మెన్స్ కన్నీరు పెట్టిస్తుంది. లుక్స్, పెర్ఫామెన్స్ విషయంలో త్రిషతో పోలిస్తే సమంత తక్కువగా కనిపిస్తుంది కానీ.. తెలుగులో ఈ పాత్ర చేయడానికి సమంత కంటే మంచి ఛాయిస్ లేదన్న ఫీలింగ్ కలిగించేలా ఆమె నటించింది. మరి ఇలాంటి పాత్రలకు సమంత నే బెస్ట్ ఛాయస్ గా కన్పిస్తుంది. దిల్ రాజు మొదటినుండి సమంత నే ఈ పాత్రకి ఎందుకు అనుకున్నాడో.. ఆయన ఛాయస్ ఎంత బెస్టో అనేది సమంత జాను కేరెక్టర్ నిజం చేసి చూపించింది. |
https://www.telugupost.com/movie-news/శ్రీదేవి-కూతురు-బ్యాక్-ట-62348/ | శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన తొలి చిత్రం 'ధడక్' ద్వారా వెండితెరపైకి రానున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి చనిపోవటం కారణంగా జాన్వీ కపూర్ ఈ షూటింగ్ కు 10 రోజులు గ్యాప్ తీసుకుని మళ్లీ తిరిగి వచ్చింది. ఆ బాధను మనసులోనే దిగమింగిన జాన్వీ సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది.రెండు రోజులు క్రితం తన 21వ పుటిన రోజు జరుపుకున్న జాన్వీ..ఈ సినిమాను అనుకున్న సమయానికే పూర్తి చేయాలనీ చిత్ర యూనిట్ తో చెప్పిందట. ఈ షెడ్యూల్ లో జాన్వీ, ఈషాన్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను బాంద్రా ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు.'ధడక్' సినిమా మరాఠీ లో సూపర్ హిట్ అయిన 'సైరాత్' హిందీ రీమేక్ గా ఈ చిత్రం తయారవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయనున్నారు చిత్ర యూనిట్. |
https://www.telugupost.com/crime/20-years-young-woman-gang-assaulted-in-tripura-1476061 | త్రిపురలో నిర్భయ తరహా ఘటన జరిగింది. 20 ఏళ్ల యువతి కాలేజీకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేశారు. కారు కదులుతుండగానే ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం బాధిత యువతిని ఓ ప్రాంతంలో వదిలి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ త్రిపుర జిల్లాలో కదులుతున్న కారులో 20 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలు సోమవారం (మే8) కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేశారు. వారిలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి బాధితురాలికి 5 నెలలుగా తెలుసు. యువతిని కిడ్నాప్ చేసిన అనంతరం.. కారును ఎక్కడ ఆపకుండా నగరమంతా తిప్పుతూ అత్యాచారం చేశారు. అర్థరాత్రి తర్వాత బాధితురాలిని ఆమె ఇంటికి సమీపంలోని స్కూల్ గ్రౌండ్ వద్దకు తీసుకెళ్లి మరోమారు అత్యాచారం చేశారు. అనంతరం పరారయ్యారు.నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలిని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం బాధిత యువతి జీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గైత్ శర్మ (26), సుదీప్ ఛెత్రి (31), పెద్దజిత్ పాల్ (26)గా గుర్తించారు. ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. |
https://www.telugupost.com/movie-news/wow-father-and-daughter-in-law-162673/ | టాలీవుడ్ సినీ ఫ్యామిలి అక్కినేని నాగార్జున – సమంత ల అనుబంధం అందరికి తెలిసిందే. చైతు ని పెళ్లి చేసుకుని అక్కినేని ఫ్యామిలోకి వెళ్ళాక నాగ చైతన్య – సమంత వేరుగా ఉంటున్నప్పటికీ…. అమల, నాగ్ లతో మంచి రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తుంది సమంత. తాజాగా కరోనా లాక్ డౌన్ లో ఇంట్లోనే కూరగాయలు పండిస్తూ యోగాలు, వర్కౌట్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సమంత తాజాగా మామగారు నాగార్జున తో కలిసి మొక్కలు నాటింది. నాగార్జున కూడా షూటింగ్స్ కోసం ప్రభుత్వ అనుమతులు వచ్చేవరకు చిరు తో కలిసి నడిచాడు. ప్రభుత్వం షూటింగ్ అనుమతులు వచ్చాక నాగార్జున మీడియాకి దూరంగానే ఉంటున్నాడు. అయితే తాజాగా మామకోడళ్లు కలిసి మొక్కలు నాటుతూ ఫొటోలకి ఫోజులిచ్చారు. ఆ పిక్ చూసిన వారు వావ్ మామకోడళ్లు భలే మంచి పని చేస్తున్నారుగా అంటున్నారు. సమంత చక్కటి చిరునవ్వుతో… నాగార్జున కూడా నవ్వుతూ.. మొక్కని నాటుతున్న ఫోటో నెటిజెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. కోడలు సమంత – నాగార్జున ఈ రోజు జూబీలీహిల్స్ లోని తన నివాసంలో కలిసి మూడు మొక్కలు నాటారు. ఇప్పుడు టాలీవుడ్ లో అందరూ గ్రీన్ ఛాలెంజ్ అంటూ హడావిడి చేస్తున్నారు. మరి నాగ్ ని సమంత ని ఎవరు నామినేట్ చేసారో కానీ.. నాగార్జున – సమంత కలిసి మొక్కలు అంటారు.. మరి మామకోడళ్ళ మంచి పని చూసిన అందరూ అది ఆదర్శంగా తీసుకుంటే బావుంటుంది అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/esha-rebba-glamour-show-photo-shoot-115918/ | టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కు గ్లామర్ రోల్స్ ఇవ్వాలంటే దర్శకులు కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే మన తెలుగమ్మాయిని గ్లామర్ రోల్స్ కు సెట్ అవ్వరని అనుకుంటారు. ఒకవేళ తెలుగు హీరోయిన్స్ గ్లామర్ చూపించినా ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ గా చూపించరు. అందుకే తెలుగు హీరోయిన్స్ పక్క భాషలకు పోయి అందాలు ఆరబోస్తున్నారు. తాజాగా ఒక భామ ఇక్కడ సినిమాలతో మెల్లిగా గ్లామర్ షో చెయ్యడానికి సిద్దమయ్యిది. ఆమె మొదటి నుండి గ్లామర్ షో చెయ్యడానికి రెడీ అయినా.. అమెకొచ్చిన పాత్రలన్నీ ట్రెడిషనల్ పాత్రలు కావడంతో ఆమె గ్లామర్ హీరోయిన్ గా ఎవ్వరికీ కనిపించలేదు. అంతకు ముందు ఆ తర్వాత, అ!, అమీతుమీ, సుబ్రమణ్యపురం వంటి సినిమాల్లో ట్రెడిషన్ గా కనబడిన ఈషా రెబ్బ.. ఈమధ్య అందాల ఆరబోతకు సై అనడమే కాదు గ్లామర్ షో చేస్తుంది. ఇప్పుడైనా అవకాశాలు వస్తాయా..? అరవింద సమేతలో సెకండ్ హీరోయిన్ గా ప్రాధాన్యత లేని పాత్రలో ఫోకస్ కాని ఈషా రెబ్బ… తాజాగా ఓ హర్రర్ థ్రిల్లర్ లో నటించబోతుంది. అయితే ఈషా రెబ్బ లేటెస్ట్ గా చేయించుకున్న హాట్ ఫోటో షూట్ ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఇప్పటివరకు అంతగా ఎక్స్ పోజ్ చెయ్యని ఈషా రెబ్బ ఇపుడు లేటెస్ట్ ఫోటో షూట్ లో మత్తెక్కించేసింది. ఈషా కెరీర్లో ఇప్పటిదాకా ఇంత గ్లామర్ గా, సెక్సీ గా, ఇంత హాట్ గా ఎప్పుడూ కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. ఒక తెలుగు హీరోయిన్ ఇంత బోల్డ్ గా కనిపిస్తుందా అని అందరూ షాకవుతున్నారు. మరి ఈ ఫోటో షూట్ చూసాకైనా దర్శకనిర్మాతలెవరైనా పిలిచి పెద్ద సినిమాల్లో ఆఫర్స్ ఇస్తారేమో చూద్దాం. ఎందుకంటే ఈషా ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. |
https://www.telugupost.com/movie-news/guntur-kaaram-hero-mahesh-babu-introduce-his-cutest-gym-trainer-1507301 | Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకి వయసుతో పాటు అందం కూడా పెరుగుతూనే వెళ్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా యంగ్ గా మారుతూ వస్తున్నారు. అయితే మహేష్ ఇలా హ్యాండ్సమ్ గా కనిపించడానికి చాలా కఠిన శిక్షణే ఉంది. జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తూ బాడీ ఫిట్నెస్ మెయిన్టైన్ చేస్తూ డైట్ ఫాలో అవుతూ.. యంగ్ లుక్ లో దర్శనమిస్తున్నారు. కాగా జిమ్ లో వర్క్ అవుట్స్ చేసే ఫోటోలను, వీడియోలను మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు.తాజాగా మహేష్ తన జిమ్ ట్రైనర్ ని పరిచయం చేస్తూ ఒక క్యూట్ ఫోటో షేర్ చేశారు ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ మహేష్ బాబుకి జిమ్ లో ట్రైనింగ్ ఇచ్చే ఆ ట్రైనర్ ఎవరంటే.. మహేష్ పెంపుడు కుక్క 'స్నూపీ'. మహేష్ బాబు ఒక పిక్ షేర్ చేస్తూ.. "మీ క్యూటెస్ట్ ట్రైనర్ మీకు శిక్షణ ఇస్తున్నప్పుడు రెస్ట్ అనేది ఉండదు" అంటూ రాసుకొచ్చారు. ఆ పిక్లో.. మహేష్ జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తుంటే స్నూపీ ఎదురుగా కూర్చొని మహేష్ ని గమనిస్తూ కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) కాగా మహేష్ ఇంటిలో గతంలో 'ఫ్లూటో' అనే కుక్క ఉండేది. అయితే అది అనారోగ్యంతో మరణించింది. దీంతో మహేష్ 'స్నూపీ'ని దత్తత తీసుకున్నారు.ఇక అప్పటి నుంచి స్నూపీతో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యన కూడా ఒక ఫోటో షేర్ చేశారు. ఆ పిక్ లో మహేష్ స్నూపీ ఎత్తుకొని కనిపిస్తున్నారు. ఉదయాన్ని స్నూపీని ముద్దాడుతూ మొదలుపెట్టడం కంటే మంచి మార్గం ఉండదు అంటూ మహేష్ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 2024 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మూవీ టీం కష్టపడుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో జరుగుతుంది. |
https://www.telugupost.com/movie-news/బొంబాయి-వచ్చే-సరికి-లుంగ-19641/ | సందర్భం ఏదైనా తమిళ తంబిలకు సౌకర్యమైన, సాంప్రదాయ దుస్తులు అంటే లుంగీ నే. ఇతర రాష్ట్రాలలో కూడా లుంగీ వాడతారు కానీ తమిళ తంబిలలా పండగలకి పెళ్ళిళ్ళకి కూడా లుంగినే ధరించే సంస్కృతి ఎక్కడా లేదు. ఇక తమిళనాడు లో తప్ప మిగిలిన రాష్ట్రాలలో మారుతున్న తరం సౌకర్యార్ధం దృష్ట్యా లుంగీ కనుమరుగైపోతుంది. కానీ మూడేళ్ళ క్రితం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్ష్ప్రెస్స్ చిత్రంలోని లుంగీ డాన్స్ పాట కారణంగా మళ్లీ ఉత్తరాది రాష్ట్రాలలోనూ లుంగీకి క్రేజ్ పెరిగిపోయింది. షారుఖ్ ఖాన్ వల్ల ఊపందుకున్న ఈ లుంగీ మానియా ఇప్పుడు హాలీవుడ్ హీరో విన్ డీసెల్ ని కూడా తాకింది.రేపు(14 జనవరి) భారత దేశంలో విడుదల కానున్న xxx రిటర్న్స్ ఆఫ్ గ్జాండర్ కేజ్ లో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటించటంతో భారత దేశంలో కూడా ఈ చిత్రానికి భారీగా క్రేజ్ పెరిగిపోయింది. విదేశాలలో కంటే ఆరు రోజులు ముందుగానే ఈ చిత్రాన్ని భారత దేశంలో విడుదల చేసే విధంగా నిర్మాతల పై ఒత్తిడి తెచ్చింది దీపికా పదుకొనె. దాని ఫలితంగానే బొంబాయి లో ప్రచార కార్యక్రమాలలో పాల్గొనటానికి వచ్చిన విన్ డీసెల్ చెన్నై ఎక్ష్ప్రెస్స్ లో లుంగీ డాన్స్ పాటకు వేదిక పై కాలు కదుపుతుంటే తనకి ఒక లుంగీ అందించి దీపికా కూడా లుంగీ కట్టుకుని వేదికపై విన్ డీజిల్ తో కలిసి చిందేసింది. చెన్నై ఎక్ష్ప్రెస్స్ లో షారుఖ్ సరసన నటించిన హీరోయిన్ దీపికా కావటం మరో విశేషం. |
https://www.telugupost.com/movie-news/క్రెడిట్-అంతా-ఆయనకే-30572/ | ప్రపంచం దృష్టిని ఒక్క బాహుబలితో తనవైపు తిప్పుకున్న ఎస్ ఎస్ రాజమౌళి ఐదేళ్ల కఠోర శ్రమతో తెరకెక్కించిన బాహుబలి ద కంక్లూజన్ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకులను అలరించబోతుంది. ఇక బాహుబలి పబ్లిసిటీని బాలీవుడ్ రేంజ్ లో చేపట్టిన రాజమౌళి అందులో భాగంగానే తెలుగు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో బాహులికి సంబందించిన అనేక విషయాలను మీడియా మిత్రులతో పంచుకున్నారు. అందులో మచ్చుకు మీకోసం.బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించేటప్పుడు ఎంతో ఎగ్జైట్మెంట్ ఉండేది.. సినిమా పూర్తయ్యాక విడుదలయ్యేవరకు టెన్షన్ పడాల్సి వస్తుందని అన్నారు. ఇక బాహుబలి చిత్రానికి ప్రాణం పోసింది మాత్రం అందులో ఉన్న పాత్రలే అని... ఆ కేరెక్టర్స్ ని అలా తీర్చిదిద్దిన గొప్పదనం మాత్రం తన తండ్రి విజియేంద్ర ప్రసాద్ గారిదే అని అన్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఆ పాత్రలే కళ్ళ ముందు కదలాడుతుంటే... సినిమా చూసి ఇంటికొచ్చాక కూడా ఆ కేరెక్టర్స్ గురించి డిస్కస్ చేస్తే అది గొప్ప సినిమా అవుతుందని ఆ క్రెడిట్ మొత్తం తన తండ్రికే ఇచ్చేస్తా అన్నాడు రాజమౌళి. అంతేకాకుండా నిర్మాతలు నన్ను నమ్మి ఇంత డబ్బు ఖర్చుపెట్టారు... నా కుటుంబం మొత్తం బాహుబలి కోసం శ్రమించిందని చెప్పారు. ఇక బాహుబలి ద బిగినింగ్ కి బాహుబలి కంక్లూజన్ సీక్వెల్ కాదని బాహుబలి కథ పెద్దగా ఉండడం వలన రెండు పార్టులుగా తియ్యాల్సి వచ్చిందని... మొదటి భాగంలో కథని పరిచయం చెయ్యకుండా పాత్రల పరిచయమే జరిగిందని.... ఇక ట్విస్ట్ గా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అనే దాన్ని పార్ట్ 2 లో చూడొచ్చని చెప్పాడు. అలాగే నాకు నేను తీసిన అన్ని చిత్రాల కంటే బాహుబలితోనే తృప్తి కలిగిందని చెప్పిన రాజమౌళి బాహుబలి మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్ విజువల్స్ పరంగా గ్రాఫిక్స్ పరంగా పెద్దదిగా కనిపిస్తుందని చెప్పాడు. ఇక బాహుబలి చిత్రం ఎంత వసూలు చేస్తుందో చెప్పలేం కానీ ప్రీరిలీజ్ బిజినెస్,ట్రేడ్ వర్గాలను బట్టి చూస్తే ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ వసూళ్లు వస్తాయని అనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసాడు జక్కన్న. ఇక నిర్మాతలు తమ జీవితాలను రిస్క్ లో పెట్టి మరీ బాహుబలిని నిర్మించారని వారికోసమైనా బాహుబలి భారీ వసూళ్లు సాధించాలని కోరుకుంటున్నాని ఇంటర్వ్యూ ముగించాడు రాజమౌళి. |
https://www.telugupost.com/movie-news/allu-arjun-collaborates-with-harish-shankar-for-an-ad-shoot-1381373 | అల్లు అర్జున్ ఒక ప్రకటన కోసం దర్శకుడు హరీష్ శంకర్తో చేతులు కలిపాడు. ఇప్పుడు ఈ యాడ్ షూటింగ్ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.అల్లు అర్జున్ గ్రే షర్ట్, కార్గో ప్యాంట్లో ఎప్పటిలాగే స్టైలిష్గా కనిపిస్తుండగా.. హరీష్ శంకర్ ఆకుపచ్చ టీ-షర్ట్, కార్గో ప్యాంట్లో కనిపించాడు. ఈ ప్రాజెక్ట్ కోసం DOP సుదీప్ ఛటర్జీ పని చేస్తూ ఉన్నారు. షూట్ నుండి BTS వీడియో కూడా ఇంటర్నెట్లో కనిపించింది. 'డీజే' చిత్రం కోసం హరీశ్ దర్శకత్వంలో బన్నీ నటించాడు. ఇప్పుడు ఓ యాడ్ ఫిల్మ్ కోసం కలిశారు. ఈ యాడ్ త్వరలోనే విడుదల కానుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ పలు ప్రకటనల్లో నటించాడు. ఇప్పుడు తొలిసారి హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాణిజ్య ప్రకటనలో నటించాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ థాయ్ లాండ్ లో జరిగినట్టు సమాచారం.అల్లు అర్జున్ త్వరలో పుష్ప: ది రైజ్ సీక్వెల్ కోసం వర్క్ ను మొదలుపెట్టనున్నాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఈ ఏడాది ఆగస్టు నాటికి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. 6 నెలలకు పైగా సుదీర్ఘ షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. పలు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించబోతున్నారు. 2023లో సినిమాను విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది.దర్శకుడు హరీష్ శంకర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను చేయబోతున్నాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ డ్రామాకి సంబంధించిన స్క్రిప్ట్ను పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశిస్తున్నట్లుగా పూర్తీ చేస్తున్నాడు హరీష్ శంకర్. |
https://www.telugupost.com/movie-news/అందుకే-ఒప్పుకుందా-40540/ | కాజల్ ముందుగా తేజ డైరెక్షన్ లోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమా ఎలా వున్నా కాజల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగి దశాబ్ద కాలం పాటు తన హావా కొనసాగించింది. ఇక తేజ మీద ఉన్న అభిమానంతోనే కాజల్, రానా కి జోడిగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నటించింది. మరి కాజల్ ఈ సినిమాలో నటిస్తుంది అనేసరికి ఆ సినిమాపైమంచి అంచాలనే వచ్చేసాయి. ఎప్పుడూ గ్లామర్ పాత్రలో దూసుకుపోయే కాజల్ ఈ చిత్రంలో చీరకట్టు అందాలతో అదరగొట్టేసింది. రాధా కేరెక్టర్ లో హోమ్లీగా ఒదిగిపోయింది. ఇక సినిమా పబ్లిసిటీ విషయంలో కూడా కాజల్ 'నేనే రాజు నేనే మంత్రి' చిత్ర టీమ్ వెంటే ఉండి సినిమా కోసం ప్రచారం చేసింది. రానాతో కలిసి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో పర్యటించి 'నేనే రాజు నేనే మంత్రి' గురించిన ప్రచారంలో పాల్గొంది. సినిమాకోసం చాలా కష్టపడింది కాజల్. దానికి తగ్గ ఫలితం కూడా ప్రేక్షకులు ఇచ్చేసారు. సినిమా మిగతా 'లై, జయ జానకి నాయక' మీద కొంచెం బావుందనే టాక్ తెచ్చుకుంది. అయితే ఎప్పుడూ సినిమాల ప్రమోషన్స్ గురించి పెద్దగా పట్టించుకోని కాజల్ 'నేనే రాజు నేనే మంత్రి' కోసం విపరీతంగా ప్రచారంలో పాల్గొనడం చూసిన అందరికి కొంచెం డౌట్ వచ్చేస్తుంది.మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్ కన్నా ఎక్కువగా కాజల్ కి ఇవ్వబట్టే ప్రచారంలో ఇలా పాల్గొందనే టాక్ బయటికి వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ ఈ చిత్రం ప్రమోషన్ కి అక్షరాలా 30 లక్షలు అందుకుందని....అందుకే ఇలా ప్రమోషన్స్ లో యాక్టీవ్ గా పాల్గొందని అంటున్నారు. అయితే ఇప్పుడు సౌత్ హీరోయిన్స్ అందరూ ఇలానే బిహేవ్ చేస్తున్నారు. సినిమాకోసం భారీ పారితోషకం అందుకుంటూనే ప్రమోషన్స్ కోసం మరికొంత నిర్మాతలనుండి గుంజేస్తున్నారు |
https://www.telugupost.com/movie-news/అసలు-లాసే-రాదు-45912/ | శంకర్ - రజినీకాంత్ కలయికలో తెరకెక్కిన చిత్రం రోబో 2.0 . దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ పెట్టి మరి తీస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఏది కదిపినా కోట్లతో ఉండే వ్యవహారమే. లైకా ప్రొడక్షన్ వారు కూడా కళ్ళు మూసుకుని 2.0 కి పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చేసారు. అయితే లైకా ప్రొడక్షన్స్ వారు 2.0 కి 400 కోట్ల పై మేర బడ్జెట్ పెట్టినప్పటికీ వారికేమి లాస్ రాదులెండి. ఎందుకంటే 2.0 ప్రీ రిలీజ్ బిజినెస్ ఆ లేవల్లోనే వుంది. నిర్మాతలకు బోలెడు లాభాలు తెచ్చే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. గత రెండేళ్లుగా 2.0 ని చెక్కుతున్న శంకర్ ఈ చిత్రాన్ని జనవరి నెలాఖరులో విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న చిత్ర బృందం మరోవైపు 2.0 పబ్లిసిటీ కార్యక్రమాల పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది.2.0 సినిమా కోసం చెన్నై శివార్లలోని ఒక్క పార్క్ లో భారీ సెట్స్ నిర్మించారు. దాదాపు 2.0 షూటింగ్ ఎక్కువ శాతం అందులోనే చేశారు. ఇప్పటికే విడుదల చేసిన మేకింగ్ వీడియోలో చూపించిన చాలా సన్నివేశాలు ఆ సెట్ లోనివే. అయితే 2.0 సినిమా విడుదల తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆ సెట్ ను అలానే ఉంచబోతున్నారు. ఇక 2.0 షూటింగ్ చివరి షెడ్యూల్ లో భాగంగా మిగిలిన ఒక్క పాటను మరో నాలు రోజుల పాటు షూట్ చెయ్యబోతున్నారు. రజనీకాంత్, ఎమీ జాక్సన్ మధ్య తెరకెక్కించనున్న ఈ సాంగ్ తో 2.0 షూటింగ్ మొత్తం పూర్తి అయిపోతుంది.ఇకపోతే 2.0 సినిమా బిజినెస్ ఇప్పటికే అదిరిపోయే లెవల్లో జరిగింది. తెలుగులోనే 80 కోట్లకు పైగా తెలుగు రైట్స్ అమ్ముడు పోగా శాటిలైట్స్ హక్కులే 170 కోట్ల మేర అమ్ముడుపోయినట్లుగా చెబుతున్నారు. మరి మేకర్స్ 450 కోట్ల బడ్జెట్ పెడితేనేమి దానికి రెండింతల బిజినెస్ జరిగినట్లుగా చెబుతున్నారు. ఇకపోతే ఈ నెలాఖరులో దుబాయ్ లో 2.0 ఆడియో వేడుకని 12 కోట్ల ఖర్చుతో నిర్వహిస్తుండగా... వచ్చే నెల అంటే నవంబర్ నెలాఖరున తెలుగులో 2.0 ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది చిత్ర బృందం. |
https://www.telugupost.com/top-stories/ex-member-of-parliament-ponguleti-srinivasareddy-has-become-a-headache-for-the-ruling-brs-1461494 | మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అధికార బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను కూడా ఆత్మీయ సమ్మేళనాల్లోనే ప్రకటిస్తూ వెళుతున్నారు. ఆయన ఏ పార్టీలో చేరుతున్నారన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయితే అన్ని పార్టీలూ తమ పార్టీలో చేరతాయని చెప్పుకుంటున్నాయి. ఆయన వైఎస్ విజయమ్మను ఇటీవల కలవడంతో వైఎస్సార్టీపీలో చేరతారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేసుకుని అభ్యర్థులను ప్రకటిస్తూ వెళుతున్నారు.అభ్యర్థులను ప్రకటిస్తూ...పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వా రావు పేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆది నారాయణ, వైరాలో విజయాభాయి వంటి వారి పేర్లను బహిరంగంగానే ప్రకటించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాదాపు ఐదారు నియోజకవర్గాల్లో తన సన్నిహితులను, తన వెంట ఉన్నవారిని బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. తాను కొత్తగూడెం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పోటీ చేసి గెలుపే ముఖ్యం కాదు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయించారు. ఎంత ఖర్చు చేసైనా సరే అధికార పార్టీని ఖమ్మం జిల్లాలో ముప్పతిప్పలు పెట్టాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. బీఆర్ఎస్ అధినాయకత్వానికి...జిల్లాలో తన సత్తా ఏమిటో బీఆర్ఎస్ అధినాయకత్వానికి తెలిసి రావాలంటే ఐదారు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఒకరకంగా బీఆర్ఎస్ కు తలనొప్పి అనే చెప్పాలి. ఎందుకంటే అధికార పార్టీ ఓట్లను మాత్రమే పొంగులేటి వర్గం చీల్చే అవకాశాలుండటంతో బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యునిస్టు పార్టీలకు కూడా బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో బీఆర్ఎస్ అక్కడ గెలుపు నల్లేరు మీద నడక కాదు. అధికార పార్టీ ఓట్లనే అభ్యర్థులను బట్టి ఇతర పార్టీలు చీల్చుకునే అవకాశముంది.నష్టం ఎవరికి?అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు జరిగిన అవమానాలతో పార్టీపై పగ తీర్చుకోవాలనుకుంటున్నట్లుంది. అందుకే ఆత్మీయ సమ్మేళనాలతో క్యాడర్ ను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విందు సమావేశాలను ఏర్పాటు చేసి ఒక్కటి చేయాలన్న ప్రయత్నంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వైసీపీ నుంచి 2014లో ఎంపీగా గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చిన నాటి నుంచి తనను పట్టించుకోలేదని, అనేక అవమానాలకు గురి చేశారని, అందుకు తగిన మూల్యం బీఆర్ఎస్ చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పొంగులేటి మాత్రం బీఆర్ఎస్ కు ఇబ్బందులు కలిగిస్తారనే చెప్పాలి. అంగ, ఆర్థిక బలాలున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో తన పట్టు ఏందో కేసీఆర్కు చూపించాలని కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/ఈసారి-దెబ్బపడినట్లే-35674/ | అల్లు అర్జున్ తాజా చిత్రం 'డీజే దువ్వాడ జగన్నాథం' ఈ శుక్రవారమే విడుదలై యావరేజ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. ఇప్పటికే వరుస హిట్స్ తో జోష్ మీదున్న బన్నీకి ఈ యావరేజ్ టాక్ కాస్త షాక్ కొట్టిందని అంటున్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథం' చిత్రానికి రెమ్యునరేషన్ కింద ఎంత తీసుకున్నాడనే టాపిక్ చర్చకు వచ్చింది. తానూ చేస్తున్న సినిమాలన్నీ వరసగా బాక్సాఫీసు దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తుండడంతో ఈసారి బన్నీ తన రెమ్యునరేషన్ కింద ఉత్తరాంధ్ర రైట్స్ తీసుకున్నాడనే టాక్ వినబడుతుంది. అయితే ఏపీలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే.. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కావడంతో తనకు అదృష్టం కలిసొస్తుందని బన్నీ అండ్ బ్యాచ్ స్కెచ్ వేసింది. కానీ ఇప్పుడు బన్నీ 'డీజే' కి మొదటి షో నుండే యావరేజ్ టాక్ రావడంతో బన్నీ అభిమానులు బాగా డీలాపడ్డారనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక 'డీజే' లో కథా లోపం వలెనే ఇలా యావరేజ్ టాక్ వచ్చిందని బలమైన కథ గనక ఉన్నట్లైతే సినిమా సూపర్ హిట్ అయ్యుండేదని అంటున్నారు. అసలు హరీష్ శంకర్ చెప్పిన స్టోరీతో డీజేని తెరకెక్కించినా బాగుండేదని... మధ్యలో చాలా మార్పులు చేయడం వల్లే ఇలా జరిగిందని కూడా గుసగుసలాడుకుంటున్నారు. అందుకే ఈసారి బన్నీ ‘నాపేరు సూర్య’ స్టోరీ విషయంలో ఆలోచనలోపడినట్టు ఫిల్మ్నగర్ వర్గాల భోగట్టా.. ఈ నేపథ్యంలో 'నాపేరు సూర్య' కథని కూడా స్వల్పంగా మార్పులు చేయవచ్చని అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/movie-maha-samudram-will-be-released-in-theaters-today-204195/ | మహా సముద్రం సినిమా నేడు థియేటర్లలో విడుదలవుతుంది. ట్విట్టర్ రివ్యూ లో మూవీకి మంచి రేటింగ్ వచ్చింది. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్, ఆదితిరావు నటించిన ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మంచి టాక్ తెచ్చుకుంది. ఇంటర్వెల్ ముందు సీన్లు సినిమాకు హైలెట్ అని చెబుతుతున్నారు. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. దాదాపు పదేళ్ల తర్వాత సిద్దర్థ్ తెలుగు సినిమాలో నటిండచం కూడా కలసి వచ్చింది. |
https://www.telugupost.com/movie-news/తమిళ-హీరో-ఎంతైనా-గ్రేట్-క-43633/ | కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరో విశాల్ కి చేతిలో సరైన హిట్ లేకపోయినప్పటికీ కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అతనికి మంచి పేరుంది. ఇక తాజాగా విశాల్ తీసుకునే నిర్ణయాల గురించి తమిళ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న నడిగర్ సంగం ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే కాదు... నిర్మాతల మండలి అధ్యక్షుడు అయినా తర్వాత వెంటనే పైరసీ వెబ్ సైట్ల పని పడతానంటూ హడావిడి చేసాడు. కేవలం అది హడావిడి మాత్రమే కాదు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని..... చేతలలో చూపించాడు. తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టీం సహాయంతో సినిమాలను పైరసీ చేసి వెబ్సైట్ లో పెట్టేసి నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఒక ప్రముఖ వెబ్సైట్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించడమే కాదు.... ఆ వెబ్ సైట్ ని మూయించిపడేశాడు.ఈ దెబ్బకి మిగతా పైరసీ వెబ్సైట్ ఓనర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇక అంతటి ఘనకార్యం చేసిన విశాల్ కి పొగడ్తల మీద పొగడ్తలు దక్కుతున్నాయి. అలాగే నిర్మాతల మండలి అధ్యక్షుడు అయిన తర్వాత తమిళ రైతులని ఆదుకుంటామని విశాల్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే నిర్ణయాలను తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే ప్రతి సినిమా టికెట్ ద్వారా వచ్చే ఆదాయంలోంచి ఒక రూపాయి రైతు సంక్షేమ నిధికి వెళ్లేలా విశాల్ తీసుకున్న నిర్ణయం తో విశాల్ పేరు తమిళనాట మార్మోగిపోతోంది. ఇక ఇప్పుడు తాజాగా తాను నటించిన 'తుప్పారివాలన్’ చిత్రం ఈ గురువారమే విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రానికి వచ్చే లాభాల్లో కొంతమొత్తం రైతులకి ఇస్తానని కూడా విశాల్ ప్రకటించాడు. |
https://www.telugupost.com/top-stories/jana-sena-chief-pawan-kalyans-alliance-with-tdp-and-bjp-is-a-topic-of-discussion-1476363 | ఏదైనా గుప్పెట మూసి ఉంచేంత వరకే రహస్యం. అది ఓపెన్ అయిన తర్వాత ఇక దాచిపెట్టేదేమీ ఉండదు. తేలిపోతే తేలిపోవచ్చు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిసి ఊబిలోకి దిగుతున్నారా? లేకపోతే తెలియకుండానే తన అడుగులు పార్టీకి భవిష్యత్ లేకుండా చేస్తున్నాయా? అన్నది జనసైనికులకు కూడా అర్థం కాకుండా ఉంది. మూడు పార్టీలతో కలిపి 2024 ఎన్నికలకు వెళ్లి అనుకోని పరిస్థితుల్లో వైసీపీ చేతిలో ఓటమి పాలయితే ఇక జనసేన కోలుకోనట్లే. అప్పుడు జనం జనసేనను నమ్మరు. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా జనసేనను చేరదీయడానికి ఎవరూ సిద్ధపడరు.2014 రిపీట్ అయితే....2014లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి బహిరంగంగా మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోయినా వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని భావించి నాడు పవన్ కల్యాణ్ టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో తాను మద్దతు ఇవ్వడం వల్లనే కూటమి విజయం సాధ్యమయిందని పవన్ నమ్ముతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఒకింత అదే రకమైన అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే పవన్ వెనక ఫ్యాన్స్ తో పాటు బలమైన కాపు సామాజికవర్గం ఉంది. అందుకే పవన్ కు రాజకీయాల్లో అంత డిమాండ్ ఉందని చెప్పాలి.అందుకే పొత్తు...అందుకే పవన్ ను వదులుకునేందుకు చంద్రబాబు సిద్ధపడటం లేదు. పవన్ కోరితే కొన్ని స్థానాలు అధికంగా ఇచ్చైనా సరే పొత్తుకు సిద్ధమవుతారు. అంతేకాకుండా బీజేపీని కూడా ఈ కూటమిలో తెచ్చేందుకు పవన్ ఉపయోగపడతారు. 2019 ఎన్నికలు జరిగిన వెంటనే బేషరతుగా బీజేపీతో జట్టుకట్టినప్పుడే పవన్ ఈ పనికోసమే వెళ్లారని వైసీపీ నేతలు ఆరోపణల్లో నిజానిజాలు ఎలా ఉన్నా పవన్ ఇప్పుడు చెబుతున్న దాని ప్రకారం అది నిజమేనని పిస్తుంది. లేకుంటే ఎన్నికలు జరిగిన రెండు మూడు మాసాల్లోనే పొత్తుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తమ కూటమిలోకి తెచ్చుకునేందుకే పవన్ వెళ్లారన్నది కూడా అంతే కాదనలేని వాస్తవం. కానీ ఈసారి కూడా ఆ కూటమి గెలిస్తే ఓకే. పవన్ చరిష్మా కొంత కాలం నిలబడుతుంది. పవన్ వల్లనే గెలిచారని జనం నుంచి రాజకీయ పార్టీ నేతల వరకూ అందరూ భావిస్తారు.ఓటమి పాలయితే...2014లో లాగా వైసీపీ లేదు. అప్పటికీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంది. పరిపాలన చేసింది. సంక్షేమం ద్వారా ప్రత్యేక మైన ఓటు బ్యాంకు సంపాదించుకుంది. మంచి జరిగితేనే తనకు ఓటు వేయమని ఇప్పటికే జగన్ కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో కానీ అనుకోని పరిస్థితుల్లో కూటమి ఓటమి పాలయితే మాత్రం పవన్ రాజకీయ పార్టీకి ఇక శాశ్వతంగా చిరునామా కూడా దొరకదన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఓటమి పాలయితే పవన్ ఎవరు లెక్క చేస్తారు? ఆయనను ఇటు బీజేపీతో పాటు ఇక భవిష్యత్ తో టీడీపీ కాని, కమ్యునిస్టులు కాని నమ్మరు. అందుకే పవన్ ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయంలో ఆవేశంతో వెళుతున్నారన్న కామెంట్స్ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. అయితే దాని వల్ల పవన్ కు వ్యక్తిగతంగా వచ్చే నష్టమేమీ లేదు. రాజకీయంగా ఇబ్బంది ఎదురైనా ఆయనకు వేరే వృత్తి ఉంది కాబట్టి ఇబ్బందులు తలెత్తక పోవచ్చు. కానీ ఆయనను నమ్ముకుని పార్టీలో ఉన్న జనసేన నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో నష్టపోతారన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. |
https://www.telugupost.com/movie-news/mahesh-babu-pooja-hegde-look-maharshi-108637/ | మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం మహర్షి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ నెలలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 25న విడుదల చేయాలని మహేష్ అండ్ టీం ప్రయత్నం చేస్తోంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటివరకు పూజా హెగ్డే లుక్ వదల్లేదు. నిన్న ఈ చిత్రంలో పూజా లుక్ ని రివీల్ చేసారు మేకర్స్. అరవింద లుక్ లోనే… మహేష్ బాబు, పూజా హెగ్డేల రొమాంటిక్ స్టిల్ ను విడుదల చేశారు. మహేష్ ని ప్రేమగా హగ్ చేసుకుని ఉన్న స్టిల్ చాలా క్యూట్ గా ఉంది. ఎన్టీఆర్ అరవింద సమేతలో పూజా ఎలా అయితే కనిపించిందో ఇప్పుడు దాదాపు అదే మేకోవర్ తో కనిపించబోతుంది. మహేష్ మాత్రం కాస్త గడ్డం మీసాలతో కొత్తగా కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రం కోసం పూజా హెగ్డే ఏకంగా 1.75 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా టాక్. తెలుగులో వరుసగా టాప్ హీరోస్ తో నటిస్తున్న పూజాకు ఈ సినిమా మరింత హెల్ప్ అవ్వనుంది. |
https://www.telugupost.com/movie-news/petition-filed-on-telugu-biggboss-host-nagarjuna-in-high-court-1510578 | Nagarjuna : తెలుగు బిగ్బాస్ షోకి నాగార్జున హోస్టుగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఏడు సీజన్లు పూర్తి కాగా.. ఐదు సీజన్స్ కి నాగార్జునే హోస్టుగా వ్యవహరించారు. ఇక ఈ షో పై ఎన్ని విమర్శలు వస్తున్నా, అభ్యంతరాలు వినిపిస్తున్నా.. బిగ్బాస్ నిర్వాహుకులు నడిపిస్తూనే వస్తున్నారు. టీవీలో షోని ప్రేక్షకులు ఆదరిస్తూనే వస్తున్నారు. ఇక ఈ 7వ సీజన్ ఎండింగ్.. దాడులతో, గొడవలతో రచ్చరచ్చగా సాగింది. దీంతో ఆ దాడికి కారణమైన బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, అతడి ఫ్యాన్స్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.తాజాగా బిగ్బాస్ హోస్ట్ నాగార్జున పై కూడా పిటిషన్ దాఖలు అయ్యింది. అడ్వాకెట్ అరుణ్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. 100 రోజులు పాటు కొందరు వ్యక్తులను అక్రమంగా నిర్బంధించడం పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ ని అందజేశారట. ఈ విషయం పట్ల బిగ్బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ని కూడా విచారించాలంటూ పేర్కొన్నారు. అలాగే ఆర్టీసీ మరియు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం పై విచారణ జరపాలంటూ కోరారు.ఇక ఆ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్న నాగార్జునని తక్షణమే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై తీవ్ర అగ్రం వ్యక్తం చేశారు. మరి ఈ పిటిషన్ పై నాగార్జున, బిగ్బాస్ నిర్వాహుకులు ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో ఇలాంటి పిటిషన్ లో హైకోర్టులో నమోదు అయ్యినప్పటికీ.. వాటిని న్యాయస్థానం కొట్టిపారేసింది. మరి ఈసారి ఏం చేస్తుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/ram-charan-ntr-rajamouli-rrr-title-152001/ | ఎన్టీఆర్ – రామ్ చరణ్ తో భారీ బడ్జెట్ తో భారీ మొత్తంలో రాజమౌళి RRR తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఉగాది కానుకగా RRR టైటిల్ రివీల్ చేసారు. ఉగాది రోజున అందరూ కరోనా వలన తమ సెలెబ్రేషన్స్ ని ఆపుకుంటే.. రాజమౌళి మాత్రం RRR టైటిల్ ని రివీల్ చేసాడు. రామ్ చరణ్ ని రౌద్రంగా అగ్ని జ్వాలల మధ్యన చూపించగా… ఎన్టీఆర్ ని రుధిరంగా నీటి బిందువులుగా చూపించాడు. నిప్పు – నీరు కలిస్తే అనే కాన్సెప్ట్ తోనే RRR తెరకెక్కుతుంది అనేది RRR లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ పాత్రలు చూస్తే తెలుస్తుంది. రౌద్రం రణం రుధిరం అంటూ ఐదు భాషలకు కలిపి టైటిల్ ని ఫిక్స్ చేసాడు జక్కన్న. అయితే జక్కన్న టైటిల్ మీనింగ్ చెబుతూ RRR టైటిల్ ని రివీల్ చేసాడు కానీ… ఈ టైటిల్ అన్ని భాషలకు రీచ్ అవుతుందా అనేది ఇప్పుడున్న అతి పేద ప్రశ్న. రాజమౌళి గత సినిమాల టైటిల్స్ ఇలా బయటికి రాగానే అలా ట్రెండ్ అయ్యేవి. ఇప్పుడు ఈ రౌద్రం – రణం – రుధిరం టైటిల్ కూడా ట్రేండింగ్ లోనే ఉంది.. కానీ ఈ టైటిల్ అనుకున్నంతగా ప్రేక్షకులకు రీచ్ కావడం లేదనేది తాజా న్యూస్. ఈసారి RRR టైటిల్ విషయంలో జక్కన్నకి తేడా కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. ఇక రాజమౌళి ఈసారి ఏ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాడో అంటూ అప్పుడే రౌద్రం రణం రుధిరం పోస్టర్ చూసి మిగతా సినిమాలను వెతికేస్తున్నారు జనాలు. ఎందుకంటే ఈ సినిమా టైటిల్ లో మరేదన్నా సినిమా టైటిల్ పోలికలు కనబడతాయేమో అనే క్యూరియాసిటీ జనాల్లో బాగా ఉంది |
https://www.telugupost.com/movie-news/ఈ-పోస్టర్-చూస్తుంటే-లై-సి-61578/ | పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ నిర్మిస్తున్న సినిమాలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో .. నితిన్ హీరోగా వస్తున్న 'చల్ మోహన్ రంగ' సినిమాపై బాగానే అంచనాలు వున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయినా టీజర్ చూస్తే ఏదో కొత్తగా తీయబోతున్నారు అని అర్ధం అవుతుంది . ఈ టీజర్ కు మంచి స్పందన కూడా వచ్చింది.టీజర్ తర్వాత ఓ సాంగ్ రిలీజ్ చేసారు. థమన్ అందించిన మ్యూజిక్ కి అందరు ఫిదా అయిపోయారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో వుంది. సో టీం ప్రొమోషన్స్ స్టార్ట్ చేసి పోస్టర్స్ వదులుతున్నారు. అయితే లేటెస్ట్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో నితిన్ - మేఘా ఆకాష్ లు ఇద్దరూ కనిపిస్తారు. కనెక్ట్ చేసిన రెండు రైలు బోగీలకు అటూ ఇటూ కూర్చుని ఒకరివంక ఒకరు చూసుకుంటూ కనిపిస్తారు. విజువల్ లో ఈ పోస్టర్ చాలా బాగుంది.ఇటువంటి పోస్టర్ ఏ నితిన్ గత చిత్రం లై లో కూడా ఇలాగే ట్రైన్ దగ్గర ఓ సీన్ ఉంటుంది. అందులో కూడా నితిన్ - మేఘ ఆకాష్ జంటగా నటించారు. దీంతో చల్ మోహన్ రంగ పోస్టర్ చూస్తున్న.. లై పోస్టర్ చూస్తున్న ఒకేలా ఉందని.. ఏదో కొత్త సినిమా పోస్టర్ చూస్తున్న ఫీలింగ్ రావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రమోషన్ పోస్టర్స్ లో ఇలాంటి పోలికలు కనిపించకుండా చూడడం బెటర్. |
https://www.telugupost.com/top-stories/janasena-chief-pawan-kalyan-is-waiting-for-a-road-map-from-the-bjp-high-command-1361881 | జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ అధిష్టానం నుంచి రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే జనసేన ఆవిర్భావ సభలో స్వయంగా చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఎప్పుడు రోడ్డు మ్యాప్ పై క్లారిటీ వస్తుందన్న దానికి ఎవరి వద్ద సమాధానం లేదు. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహం మీద బీజేపీ నాయకత్వం ఉంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుంది.ఫోకస్ అంతా....గుజరాత్ ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలు బీజేపీకి ప్రతిష్టాత్మకం. గుజరాత్ మోదీ సొంత రాష్ట్రం కాబట్టి అధికారాన్ని అక్కడ నిలబెట్టుకోవాలి. మధ్యప్రదేశ్ లోనూ గత ఎన్నికల్లో ఓటమి పాలయినా ఎలాగోలా అధికారాన్ని దక్కిించుకోగలిగారు. ఈసారి రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో గెలిచి తీరాలి. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలో కొంత స్పేస్ ఉండటంతో ఇక్కడ పట్టు సాధించాల్సి ఉంటుంది. వరస ఎన్నికలతో...ఇన్ని రాష్ట్రాల ఎన్నికలపైన బీజేపీ అధినాయకత్వం ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఏపీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగానే సమయం ఉంది. అప్పటి వరకూ అధికార పార్టీ మీద పోరాటం చేయాలని ఇప్పటికే పార్టీ అధినాయకత్వం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి రూట్ మ్యాప్ ఇచ్చింది. ఆ మేరకు రాష్ట్ర బీజేపీ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు పవన్ కు రోడ్డు మ్యాప్ అందించే అవకాశం లేదంటున్నారు.ఇప్పట్లో స్పష్టత....ప్రధానంగా పొత్తులపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. 2024 ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే పొత్తులపై కేంద్ర నాయకత్వం క్లారిటీ ఇవ్వనుందని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే మరో రెండేళ్ల పాటు రోడ్డు మ్యాప్ కోసం పవన్ కల్యాణ్ ఎదురు చూస్తారా? లేదంటే తన దారి తాను చూసుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. పవన్ కోరుకుంటున్నట్లు రోడ్డు మ్యాప్ ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం మాత్రం లేదు. మరి జనసేనాని ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. |
https://www.telugupost.com/movie-news/pawan-krish-title-169691/ | పవన్కళ్యాణ్ వకీల్ సాబ్ సెట్స్ మీదకెళ్లినట్టుగానే అనిపిస్తుంది. దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ వచ్చేవరకు వేరే సీన్స్ ని చిత్రీకరించామని వేణు శ్రీరామ్ కి చెప్పినట్టుగా టాక్. అయితే పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే వకీల్ సాబ్ సెట్స్ మీదకెళ్తాడని.. తడుఅప్రి క్రిష్ తో తాను చెయ్యబోయే సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది. అయితే క్రిష్ – పవన్ కాంబో మూవీ జానపద కథతో తెరకెక్కుతోందని.. పవన్ ఇంతవరకు ఇలాంటి జోనర్ లో సినిమా చెయ్యలేదని.. క్రిష్ పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక సెట్స్ వేయించి మరీ ఈ సినీమా షూటింగ్ చేయబోతున్నాడనే ప్రచారం ఉంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబో మూవీ టైటిల్ విషయంలో రోజుకో పేరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ ని విరూపాక్షగా చూపించబోతున్నారని, కాదు దొంగగా కనిపిస్తాడు కాబట్టి గజ దొంగ అనే టైటిల్ పెడుతున్నారని, తాజాగా ఓం శివమ్ అనే టైటిల్ కూడా ప్రచారం లోకొచ్చింది. క్రిష్ గత సినిమాల టైటిల్స్ ని పరిశీలించిన చాలామంది క్రిష్ – పవన్ మూవీకి ఓం శివమ్ అనే టైటిల్ ఫిక్స్ అన్నారు. కానీ తాజాగా క్రిష్ -పవన్ కాంబో సినిమాకి మాటలు అందిస్తున్న బుర్రా సాయి మాధవ్ ఓ ట్వీట్ చేసారు. అది అంతర్వాహిని పేరిట ఓ పేరాగ్రాఫ్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. అద్భుతమైన వాఖ్యలతో అంతర్వాహిని పేరిట సాయి మాధవ బుర్ర చేసిన ట్వీట్ ని క్రిష్ కూడా హైలైట్ చెయ్యడం ఆసక్తికరంగా మారింది. అంటే పవన్ – క్రిష్ మూవీ టైటిల్ అంతర్వాహిని అయ్యుండొచ్చు అందుకే అంతగా హైలెట్ చేస్తున్నారంటున్నారు. |
https://www.telugupost.com/crime/hyderabad-constable-molests-married-woman-1448626 | తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ ఏదొక ప్రాంతంలో ఆడపిల్లలు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వారిలో కొందరు మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి న్యాయం కోసం పోరాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో మహిళపై దారుణం జరిగింది. రక్షణగా ఉండాల్సిన కానిస్టేబులే వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నగ్నచిత్రాలు, వీడియోలు తీసి తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ బెదిరింపులకు దిగాడు. మీర్ పేట ఠాణా పరిధిలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడైన హైదరాబాద్ స్పెషల్ బ్రాంచి కానిస్టేబుల్ పి. వెంకటేశ్వర్లు (30)ను పోలీసులు ఈనెల 14న అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం మీర్ పేట పరిధిలో ఉంటోన్న ఓ వివాహిత కుటుంబం గతంలో సైదాబాద్ లో నివసించేది. మాదన్నపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లు వాళ్లింటికి సమీపంలోనే నివాసముండేవాడు. ఈ క్రమంలో అతను వివాహితతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆమె తిరస్కరించడంతో వేధింపులకు గురిచేశాడు. దాంతో బాధితురాలు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో 2021 జనవరిలో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంకటేశ్వర్లుకి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు.కానీ.. వెంకటేశ్వర్లు ప్రవర్తనలో మార్పు రాకపోగా.. మరింత వేధింపులు ఎక్కువయ్యాయి. ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. మరోసారి బాధితురాలు మే నెలలో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడైన వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. ఆ తర్వాత బాధితురాలి కుటుంబం సికింద్రాబాద్ కు, కొన్ని నెలలకి మీర్ పేటకి ఇల్లు మారారు. ఫోన్ నంబర్ మార్చినా వేధింపులు ఆగలేదు. జైలు నుండి విడుదలయ్యాక ఆమె ఆచూకీ తెలుసుకున్నాడు.భర్త ఇట్లోలేని సమయం చూసి ఆగస్టు 18న ఆమె ఇంటికెళ్లి.. బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్నుండి ఫొటోలు, వీడియోలు చూపిస్తూ.. తరచూ అత్యాచారం చేశాడు. ఈ నెల 14న బాధితురాలి ఇంటికెళ్లి తనపై గతంలో పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశాడు. వినకపోవడంతో మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుండి పరారయ్యాడు. అదేరోజు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు వెంకటేశ్వర్లుని అరెస్ట్ చేశారు. |
https://www.telugupost.com/movie-news/nagarjuna-comments-on-akhil-90075/ | నాగార్జున ప్రస్తుతం దేవదాస్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. నానితో కలిసి శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో దేవదాస్ అనే మల్టీస్టారర్ లో నటించిన నాగార్జున... శుక్రవారం విడుదలకాబోతున్న సినిమా ముచ్చట్లు మీడియాతో పంచుకోవడమే కాదు.. తన వయసు గురించి, తన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ విషయాలను కూడా మీడియాతో పంచుకున్నాడు. తనకు ఇంకా 25 ఏళ్ల వయసు అనే మనసులో అనుకుంటానని.. తన పెద్ద కొడుకు చైతు కన్నా చిన్నోడినే కదా అంటూ ఫన్నీగా నవ్వేసాడు. ఇక తన వయసు 25 అని ఫీల్ అయినా... తన కొడుకుల సినిమాల విషయంలో సలహాలు ఇచ్చేటప్పుడు మాత్రం పెద్దగా ఫీల్ అవుతానని చెబుతున్నాడు.ఇక్కడ హిట్ అయ్యాకే...ఇక అఖిల్ అయితే అఖిల్ సినిమా చేసే టైంలో చెప్పిన మాట వినలేదని.. తొందరపడి నిర్ణయం తీసుకున్నాడని.. అందుకే ఫలితం అనిభావించాల్సి వచ్చిందని చెబుతున్నాడు. ఆలాగే అఖిల్ హిందీ డెబ్యూపై కూడా నాగార్జున స్పందించాడు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కి అఖిల్ అంటే చాలా ఇష్టమని.. అందుకే అఖిల్ హిందీ డెబ్యూ మూవీ తానే చేస్తానని ఒకటికి రెండుసార్లు అడిగినా తొందరపడొద్దు... ఇప్పటికే ఒకసారి అఖిల్ తొందరపడ్డాడని.. తెలుగులో అఖిల్ నటించిన చిత్రమేదైనా సూపర్ హిట్ అయితే దాన్ని హిందీలో రీమేక్ చేద్దువుగానీ అని చెప్పినట్లుగా చెబుతున్నాడు. అలాగే తాను ఇక్కడ శివతో హిట్ కొట్టాక ఆ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. అఖిల్ ఓసారి తొందరపడ్డాడు. కొన్నిసార్లు పెద్దోళ్లు చెప్పే మాటలు వినాలి. అంటూ అఖిల్ గురించిన విషయాలన్నీ నాగార్జున మీడియాకి చెప్పేసాడు. ప్రస్తుతం అఖిల్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను లో నటిస్తున్నాడు. |
https://www.telugupost.com/crime/fashion-designer-prathyusha-garimella-found-dead-in-hyderabad-1373642 | ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల శనివారం మధ్యాహ్నం బంజారాహిల్స్లోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 35 ఏళ్ల ప్రత్యూష బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిల్మ్ నగర్లోని ఓ ఇంట్లో ఉంటోంది. శనివారం మధ్యాహ్నం ఆమె స్పందించకపోవడంతో సెక్యూరిటీ గార్డులు పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్రూమ్లో ఆమె మృతదేహం కనిపించింది. వాష్రూమ్లో రసాయనాల బాటిల్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీలో ఉన్న బంధువులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యూష తన సొంత ఫ్యాషన్ లేబుల్ని స్థాపించారు, ఆమె రూపొందించిన ప్రోడక్ట్స్ ప్రత్యూష గరిమెళ్ల బ్రాండ్ పేరుతో విక్రయిస్తూ ఉన్నారు.డిప్రెషన్కు గురైన నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. కార్బన్ మోనాక్సైడ్ను స్టీమ్ లో కలుపుకుని పీల్చి ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ను పోలీసులు కనుగొన్నారు. పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించి ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రవీనా టాండన్, పరిణీతి చోప్రా, హుమా ఖురేషి, కాజోల్, శ్రియా సరన్, కాజల్ అగర్వాల్, మాధురీ దీక్షిత్, జూహీ చావ్లా, గౌహర్ ఖాన్, నేహా ధూపియా, భూమి పెడ్నేకర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖుల కోసం గరిమెళ్ల దుస్తులను డిజైన్ చేశారు. |
https://www.telugupost.com/politics/himachal-pradesh-elections-2022-polling-starts-in-all-constituencies-1447762 | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుండి పోలింగ్ ప్రారంభమవగా.. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ లకు వెళ్తున్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో 48 జనరల్ సీట్లు, 17 ఎస్సీ రిజర్వ్ డ్, 3 ఎస్టీ రిజర్వ్ డ్ స్థానాలున్నాయి.రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 55.92 లక్షల మంది ఉండగా.. పురుష ఓటర్లు 28.54 లక్షలు, మహిళా ఓటర్లు 27.37 లక్షలు మంది ఉన్నారు. 38 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లున్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ- కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రాహుల్ భారత్ జోడో యాత్ర ఈ ఎన్నికలపై ఎంతవరకూ ప్రభావం చూపుతుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/prabhas-to-release-sahoo-new-look-122115/ | ‘బాహుబలి’ 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో. ఇండిపెండెన్స్ డే కానుకగా అగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ గా విడుదలకి సిద్ధమౌతోంది. రేపటి నుంచి ప్రభాస్ సాహో ప్రమోషన్స్ ని మొదలు పెట్టనున్నారు. ఇందులో భాగంగా సాహో న్యూ లుక్, రిలీజ్ డేట్ పోస్టర్ ను ఇంస్టాగ్రామ్ ద్వారా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ లో ప్రభాస్ పోస్ట్ చేయనున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ – ప్రమోద్ – విక్కీ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెబల్స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1కి ఇప్పటికే ఇండియా మెత్తం క్రేజ్ వచ్చింది. రెబల్స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులతో షేడ్స్ ఆఫ్ సాహో 2తో ఈ చిత్రం హీరోయిన్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ స్పెషల్ వీడియోలో శ్రద్ధా కపూర్ క్యారెక్టర్ లుక్ ని రివీల్ చేశారు. ఈ వీడియోలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ స్టైలిష్ లుక్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స మేకింగ్ హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ మేకింగ్ వీడియోతో ఈ సినిమా ఏ రేంజ్ లో తీస్తున్నారు అనేది మరింత స్పష్టమైంది. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్ ని క్యాప్చర్ చేయడం మరో విశేషం. ఇంతటి భారీ ప్రతిష్టాత్మక చిత్రానికి రన్ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజీత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హైటెక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ – ఎహసాన్ – లాయ్ సంగీతం అందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను… స్టార్ రైటర్ అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు. |
https://www.telugupost.com/movie-news/అబ్బో-అన్నిటిలో-మంచి-టాల-35351/ | ఎప్పటినుండో టాలీవుడ్ లో హీరోయిన్స్ గా చలామణి అవుతున్న టాప్ హీరోయిన్స్ ఎవరూ తమ సొంత గొంతు వినిపించడానికి ముందుకు రారు. అయినా కొంతమంది హీరోయిన్స్ గొంతులు బాగోవు గనకే వారు తమకు అరువు గొంతు తెచ్చుకుంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యి అవ్వగానే కొన్ని సినిమాల తర్వాత తమ సొంత గొంతుతోనే తమ సినిమాలకు డబ్బింగ్ చెప్పేసుకుంటారు. అయితే ఈ కోవలో చాలా తక్కువమంది హీరోయిన్స్ మాత్రమే వస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ పొజిషన్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పేసుకుంటుంది.ఇక ఇప్పుడు తాజాగా టాలీవుడ్ ఎంట్రీ సినిమాతోనే తన సొంత గొంతు వినిపించడానికి సిద్ధమైంది మలయాళం భామ సాయి పల్లవి. మలయాళం లో 'ప్రేమమ్' ద్వారా స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ భామ కి తెలుగులో శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తున్న 'ఫిదా' చిత్రంలో అవకాశం ఇచ్చాడు. మరి ఆమె నటనలో ఎంత టాలెంట్ ఉందొ మలయాళ 'ప్రేమమ్' చూసిన అందరికి అర్ధమవుతుంది. ఇక టాలీవుడ్ ఎంట్రీ ఫిల్మ్ తోనే తన గొంతును సవరిచేసింది ఈ భామ. సహజమైన సౌందర్యంతో పాటు తన సొంత గొంతుతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చెయ్యడానికి వచ్చేస్తుంది. ఇప్పటికే 'ఫిదా' చిత్రం కోసం డబ్బింగ్ కూడా చెప్పేస్తుంది సాయి పల్లవి . రీసెంట్ గా సాయి పల్లవి 'ఫిదా' కి డబ్బింగ్ చెబుతున్న వీడియో ఒకదానిని చిత్ర నిర్మాత దిల్ రాజు యుట్యూబ్ లో పోస్ట్ చేసాడు. అలా డబ్బింగ్ చెబుతున్న సాయి పల్లవిని చూస్తుంటే అచ్చమైన తెలుగమ్మాయే అని అనిపించకమానదు. |
https://www.telugupost.com/movie-news/తనకి-మంచి-మిత్రుడు-మాత్ర-53301/ | పవన్ కళ్యాణ్ ఈ మధ్యన రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటినుండి చక్కటి ప్రసంగాలు చేస్తున్నాడు. ఎంతో క్లారిటీగా ప్రజాసమస్యలపై గళమెత్తుతున్నాడు. అయితే పవన్ మాటల్లో అంత స్పష్టత ఉండడానికి వెనుక మరొకరున్నారని.. అది కూడా పవన్ నీడ దర్శకుడు త్రివిక్రమ్ అనే ప్రచారం బాగా వుంది. అయితే పవన్ కి సలహాదారుగా త్రివిక్రమ్ అనే టైటిల్ కి పవన్ కళ్యాణ్ ఈ మంగళవారం నోవెటల్ లో జరిగిన అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అతిరధ మహారథుల మధ్యన జరిగిన అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో పవన్ కి త్రివిక్రమ్ మీద ఎంత గౌరవం ఉందొ ఫాన్స్ సాక్షిగా గా చాటుకున్నాడు.తన వెనుక త్రివిక్రమ్ ఉన్నాడనే మాట వాస్తవం కాదంటూనే.. త్రివిక్రమ్ తనకి సలహాలు ఇస్తుంటాడని చాలా చాలా రకాలుగా చాలామంది భావిస్తారు.. అలాంటి సమయంలో నాకు కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే తనని చాలామంది ఒంటరి వాణ్ణి చేసినప్పుడు, అలాగే డిప్రెషన్ లోకి వెళ్లిన సమయంలో ఒక ఆప్తుడిలా ఆదుకున్నాడని... ఒక మంచి వ్యక్తిని పరిచయం చేస్తానని చెప్పి త్రివిక్రమ్ నాకో పుస్తం ఇచ్చాడని... అలాగే డిప్రెషన్ లోనుండి బయటికి రావడానికి మంచి కవితలు వినిపించేవాడిని... త్రివిక్రమ్ నాకు అపజయాలు వచ్చినప్పుడు వెన్నంటి ఉండి ధైర్యం చెప్పాడని... చెప్పుకొచ్చాడు.అంతేకాకుండా నేను స్వతహాగా రక్తం పంచుకుని పుట్టిన వారిని కూడా కోప్పడలేని నేను త్రివిక్రమ్ ని కోప్పడగలనని.. ఎందుకంటే ఆయనతో నాకంత చనువుందని.. త్రివిక్రమ్ తనకి మంచి మిత్రుడని చెప్పాడు. అంతేకాకుండా త్రివిక్రమ్ కి హీరోగా తాను కాకపోతే బోలెడుమంది హీరోలున్నారని... ఇండస్ట్రీలో తానొక్కడే హీరో కాదని.. అలాంటి త్రివిక్రమ్ కి నేను లైఫ్ ఇవ్వడం అనేది హాస్యాస్పదమని చెప్పాడు. |
https://www.telugupost.com/movie-news/అబ్బో-బాగానే-వాడేస్తున్న-24827/ | యంగ్రెబెల్స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'బాహుబలి-ది కన్క్లూజన్' ఎప్పుడు విడుదలవుతుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కాగా ఆయన తన తదుపరి చిత్రాన్ని 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవి క్రియేషన్స్ బేనర్లో ఇప్పటికే లాంఛనంగా ప్రారంభించేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్తో అంటే దాదాపు 150కోట్లతో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ చేయనున్నారు. పలు అద్భుత చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ మది, జాతీయ అవార్డులను ఎన్నో గెలుచుకున్న డిజైనర్ సాబుసిరిల్, బాలీవుడ్ సంగీత త్రయం శంకర్-ఇహసాన్-లాయ్లు ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. కాగా మొదట ప్లాన్ ప్రకారం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ను బాహుబలి-ది కన్క్లూజన్' ఏప్రిల్ 28న విడుదలైన తర్వాత మేలో ప్రారంభించాలని ప్లాన్ చేశారు. తాజాగా వారు ఈ ఆలోచనలో చిన్న మార్పు చేసినట్లు సమాచారం. మార్చి, ఏప్రిల్ మొదటి వారంలో ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించి, 'బాహుబలి-ది కన్క్లూజన్'తో పాటే దేశవిదేశాలలో 'బాహుబలి2' విడుదల కానున్న వేలాది థియేటర్లలో ఈ చిత్రం టీజర్ను ప్రదర్శించాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. అలా చేస్తే సుజీత్ చిత్రానికి కూడా మొదటి నుంచే అన్ని భాషల్లో మంచి పబ్లిసిటీ, ప్రమోషన్ దొరుకుతుందనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నాడట.మొత్తానికి ప్రభాస్ 'బాహుబలి-ది కన్క్లూజన్' చిత్రాన్ని తన తదుపరి చిత్రం పబ్లిసిటీ వాడుకోవడం భలే స్ట్రాటర్జీ అనే చెప్పాలి. మరి ఇది కార్యరూపం దాలుస్తుందో లేదో వేచిచూడాల్సివుంది. |
https://www.telugupost.com/movie-news/industry-celebrities-and-political-leaders-condolence-to-actress-jamuna-demise-1459538 | ప్రముఖ నటి జమున(86) ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటితరం నటీమణులలో అగ్రకథానాయికగా వెలుగొంది తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న జమున గారు మృతి చెందడం బాధాకరం. ఆవిడ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటితరం నటీమణులలో అగ్రకథానాయకిగా వెలుగొంది తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న జమున గారు మృతి చెందడం బాధాకరం. ఆవిడ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/nDePyrPGri— YS Jagan Mohan Reddy (@ysjagan) January 27, 2023 జమున మరణం సినీపరిశ్రమకు తీరని లోటని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను కేసీఆర్ స్మరించుకున్నారు. కళాసేవే కాకుండా పార్లమెంట్ సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం కూడా గొప్ప విషయమన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. "అలనాటి సినీనటి, మాజీ ఎంపీ, బీజేపీ నేత శ్రీమతి జమున గారు పరమపదించారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ వివిధ పాత్రల్లో నటించి మెప్పించిన జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను." అని ట్వీట్ చేశారు.అలనాటి సినీనటి, మాజీ ఎంపీ, బీజేపీ నేత శ్రీమతి జమున గారు పరమపదించారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ వివిధ పాత్రల్లో నటించి మెప్పించిన జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/7kqJlKYKXw— G Kishan Reddy (@kishanreddybjp) January 27, 2023 చిరంజీవి స్పందిస్తూ.. ‘సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది. ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు తదితర సినీ ప్రముఖులు జమున మృతి పట్ల సంతాపం తెలుపుతూ.. ట్వీట్లు చేశారు.సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి.మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు.మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది.ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను— Chiranjeevi Konidela (@KChiruTweets) January 27, 2023 |
https://www.telugupost.com/movie-news/సహాయం-అందుకుని-ఇలా-మట్లా-193857/ | గత నాలుగు రోజులుగా టాలీవుడ్ కేరెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల కన్నీటి కష్టల గురించి కరాటే కళ్యాణి పెట్టిన వీడియో ద్వారా ఆమె బాధలను తెలుసుకున్న మెగాస్టార్ చిరు దగ్గరనుండి చాలామంది ఆమెకి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. పావలా శ్యామల ఆరోగ్యం, ఆమె ఆర్ధిక కష్టాలను విని చలించిపోయిన చిరంజీవి ఆమెకి మా లో సభ్యత్వం ఇప్పించడం కోసం 1,01,500 చెక్ ని పంపించారు. మా లో సభ్యత్వం రాగానే ఆమెకి నెల నెల ఆరు వేల రూపాయల పెన్షన్ వచ్చే ఏర్పట్లని చిరు చేసారు. అలాగే కరాటే కళ్యాణి పావలా శ్యామల ఆర్ధికకష్టాలను వివరిస్తూ రెండు లక్షలకు పైగా డబ్బు పోగుచేసి పావలా శ్యామలకి అందచేసింది.అలాగే నటుడు జీవన్ కుమార్ పావలా శ్యామల ఇంటికి వెళ్లి తన వంతు సాయం అందించడమే కాకుండా నిత్యావసరాలతో పాటు ప్రతి రోజు భోజన వసతి కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని తెలపడంతో.. చిరంజీవి గారు మా సభ్యత్వం ఇప్పించి ఆరు వేల రూపాయల పెన్షన్ వచ్చే ఏర్పాట్లు చేసిన.. తన మందులకు నెలకి పది వేల ఖర్చు అవుతుంది అని, అలాగే తాను ఇతరులు వండిన ఆహారాన్ని తినను అని, తాను బ్రాహ్మణ వర్గానికి చెందినదాన్ని కాబట్టి ఇతరులు చేసిన ఆహారం తిననని అంటూ చెప్పి షాకింగ్ కామెంట్స్ చేసింది. కరాటే కళ్యాణి కూడా తనకి ఇంత సహాయం చేస్తున్నాం.. కాని ఆమెకి కృతజ్ఞత లేదు.. తనకి ఎలాంటి హెల్ప్ వద్దు.. కేవలం డబ్బు చాలని చెబుతుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.అయితే తాను చావలేక అడుక్కుంటున్నా అని, తాను చనిపోయినా తన కూతురుకి సహాయం చెయ్యాలని, తన కూతురు తన మీద ఆధారపడి బ్రతుకుతుంది అని, తాను అందుకే బ్రతకాలనుకుంటున్నా అని, చేతనైతే సహాయం చెయ్యండి.. దయచేసి అవమానించకండి. నా హృదయం గాయపడితేనే ఎవర్నైనా అంటా.. గొడవ పడతా.. అంతే తప్ప కావాలని ఎవర్నీ అనను.. అంటూ పావలా శ్యామల యు టర్న్ తీసుకుంది. |
https://www.telugupost.com/movie-news/top-writer-story-to-nagachaitanya-100390/ | టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్ లోనూ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కి మంచి పేరుంది. ఇక బాహుబలి రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ పేరు మాములుగా మార్మోగలేదు. మరి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథతో సినిమాలు తెరకెక్కుతున్నాయి అంటే.. ఆ సినిమాలకు ఆటోమాటిక్ గా హైప్ వచ్చేస్తుంది. అందుకేనేమో నాగార్జున తన పెద్ద కొడుకు కోసం ఇప్పుడు ఈ స్టార్ రైటర్ ని నమ్మకుంటున్నాడు. నాగ చైతన్య గత కొన్నాళ్లుగా హిట్ అనే పదానికి మొహం వాచిపోయాడు. వరస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న చైతు ప్రస్తుతం భార్య సమంత స్టార్ స్టేటస్ మీద ఆధారపడ్డాడు.సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని...శివ నిర్వాణ దర్శకత్వంలో భార్య సమంతతో కలిసి మజిలీ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మీద చైతు భారీ ఆశలే పెట్టుకున్నాడు. తనకి మార్కెట్ లేకపోయినా... సమంత స్టార్ డమ్ మీద సినిమాకి క్రేజ్ వస్తుందని.. అలాగే సినిమా కూడా హిట్ అవ్వాలనే కసితో పనిచేస్తున్నాడు. అయితే తాజాగా నాగ్... చైతు కోసం రైటర్ విజయేంద్ర ప్రసాద్ ని రంగంలోకి దింపుతున్నాడట. ఈ సినిమాతో చైతు సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కథని ప్రిపేర్ చేస్తున్నాడట విజయేంద్ర ప్రసాద్. ఇకపోతే ఈ కథతో చైతుని ఎవరు డైరెక్ట్ చేస్తారు..? ఎవరు ప్రొడ్యూస్ చేస్తారనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు. |
https://www.telugupost.com/movie-news/amala-paul-married-her-boy-friend-151575/ | నటి అమలాపాల్ తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చాలా తక్కువ సమయంలోనే అమలాపాల్ విజయ్ నుండి డివోర్స్ తీసుకుంది. భర్త విజయ్ నుండి దూరమయ్యాక సినిమాలే లోకంగా బ్రతుకుతున్న అమలా పాల్ గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అయితే తాజాగా అమలాపాల్ కి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే న్యూస్ గత నెల నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కానీ అమలాపాల్ ఎక్కడా ధ్రువీకరించలేదు. ప్రస్తుతం సినిమాల్తో బిజీగా ఉన్న అమలాపాల్ తాజాగా బాయ్ ఫ్రెండ్ ని చాలా సీక్రెట్ గా పెళ్లాడింది. ఆ విషయాన్ని ఆమల పాలే రివీల్ చేసింది.. పెళ్లి తర్వాత తన భర్త తో దిగిన ఫొటోస్ ని షేర్ చేసి తన పెళ్లి విషయాన్ని అందరికి చెప్పేసింది. సంప్రదాయం ప్రకారమే అమల పాల్ పెళ్లి జరిగినట్టుగా ఆ ఫొటోస్ చూస్తుంటే అర్ధమవుతుంది. అమలా పాల్ బుర్ఖా ధరించి భవ్నిందర్ సింగ్తో బయటకు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అమల అలా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఫొటోస్ షేర్ చేసేసరికి అమల పాల్ అభిమానులు షాకవుతున్నారు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసిందే మొన్న.. అప్పుడే పెళ్లా.. మల్లి పెళ్లి విషయంలో అమల పాల్ రాంగ్ స్టెప్ వెయ్యలేదు కదా అంటూ నోరు నొక్కుకుంటున్నారు. కానీ అమల పాల్ మాత్రం కూల్ గా పెళ్ళి ఫొటోస్ షేర్ చేసి, కరోనా కన్నా పెద్ద షాకిచ్చింది. |
https://www.telugupost.com/movie-news/no-focus-on-chaitu-185027/ | మజిలీ తో మంచి హిట్ ఉన్న నాగ చైతన్య, సాయి పల్లవి శేఖర్ కమ్ముల కాంబోలో లవ్ స్టోరీ సినిమా చేసాడు. లవ్ స్టోరీ పై ప్రేక్షకుల్లోనే కాదు ట్రేడ్ లోను మంచి క్యూరియాసిటీ ఉంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే మాములుగా ఏ హీరో సినిమా అయినా వస్తుంది అంటే దాని మీద అంటే అభిమానుల్లో అటెంక్షన్, ప్రేక్షకుల్లో ఫోకస్ ఉంటుంది. కానీ లవ్ స్టోరీ సినిమా విషయానికి వచ్చేసరికి లీడ్ తీసుకుంటుంది మాత్రం డైరెక్టర్ మరియు హీరోయిన్. హీరో నాగ చైతన్య కన్నా దర్శకుడు శేఖర్ కమ్ముల, సాయి పల్లవి మీదే ఎక్కువగా ఫోకస్ ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సారంగా దారియా సాంగ్ యూట్యూబ్ ని ఓ ఊపు ఊపుతుంది. సాయి పల్లవి తన డాన్స్ తో ఎక్సప్రెషన్స్ తో మరోసారి తన మార్క్ చూపించింది.మరి శేఖర్ కమ్ములకి ఫిదా లాంటి హిట్ ఉండడం, ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున సినిమా లవ్ స్టోరీ కాబట్టి లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల మూవీ గానే ప్రొజెక్ట్ అవుతుంది. అందుకే లవ్ స్టోరీ విషయంలో అటు దర్శకుకుడు, ఇటు హీరోయిన్ లీడ్ తీసుకుంటున్నారు. ఏదైనా లవ్ స్టోరీ పై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను మంచి పాజిటివ్ బజ్ అయితే ఉంది. ఎవరు లీడ్ తీసుకుంటే ఏమిటి.. సక్సెస్ అనేది వచ్చి పడితే చాలుగా. చైతు అకౌంట్ లో లవ్ స్టోరీతో ఇంకో సక్సెస్ పడిపోయినట్టే.. కాదు పడిపోతుంది అంతే. |
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-wants-to-work-in-a-pan-india-movie-139877/ | బాహుబలి చూసి హీరోలంతా పాన్ ఇండియా ఫిలిమ్స్ మీద పడ్డారు. బాహుబలి హీరోనే పాన్ ఇండియా సినిమా అంటూ సాహో తో చేతులు కాల్చుకున్నాడు. సాహో దెబ్బకి రాధాకృష్ణ సినిమా బడ్జెట్ ని ప్రభాస్ కంట్రోల్ లో పెడుతున్నాడని అంటున్నారు. ఇక మెగా స్టార్ చిరు సై రా తో ఇతర రాష్ట్రాలల్లో కోలుకోలేని దెబ్బతిన్నాడు. అందుకే కొరటాలతో తియ్యబోయే సినిమా విషయంలో రామ్ చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనే టాక్ ఉంది. ఇక తాజాగా మరో హీరో పాన్ ఇండియా సినిమా కోసం తహతహలాడుతున్నాడు. అదే డియర్ కామ్రేడ్ తో దెబ్బతిన్న విజయ్ దేవరకొండ. అసలు డియర్ కామ్రేడ్ నే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటుగా హిందీలోనూ విడుదల చేద్దామనుకున్న విజయ్ దేవరకొండకి ఆ సినిమా దెబ్బేసినా.. మళ్ళీ అన్ని భాషల్లో సినిమా చెయ్యాలనుకుంటున్నట్లుగా చెబుతున్నాడు. వరల్డ్ ఫెమస్ లవర్ తర్వాత పూరి తో ఫైటర్ సినిమా చెయ్యబోతున్న విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని మజిలీ డైరెక్టర్ తో కమిట్ అయ్యాడని అన్నారు. కానీ విజయ్ కి కథ చెప్పడానికొచ్చిన ఓ హిట్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ పెట్టిన కండిషన్ కి ఆ డైరెక్టర్ కి దిమ్మతిరిగిందని టాక్. ఆ హిట్ డైరెక్టర్ తో ఏదైనా పాన్ ఇండియా కథ ఉంటె చెప్పండి వింటా అని అనడంతో ఆ డైరెక్టర్ షాక్ అయ్యి.. అయితే ఈ కథ మీకు కుదరదులే అని అక్కడనుండి చల్లగా జారుకున్నాడట. మరి సాహో, సై రా చూసాక తనకున్న క్రేజ్ తో తాను పాన్ ఇండియా ఫిలిం చేసినా సక్సెస్ కాగలను అని విజయ్ బలంగా నమ్ముతున్నట్టుగా ఉంది. |
https://www.telugupost.com/movie-news/ఇది-కదా-ఎన్టీఆర్-ఫాన్స్-క-71372/ | నేడు ఆదివారం మే 20 నందమూరి అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగ రోజు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ రోజు కావడం, ఇదే రోజు ఎన్టీఆర్ కొత్త సినిమా లుక్ తో పాటుగా టైటిల్ కూడా విడుదల చెయ్యడం నందమూరి, ఎన్టీఆర్ ఫాన్స్ కి పట్టలేని ఆనందాన్నిచ్చింది. కేవలం టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మాత్రమే కాదు 'అరవింద సమేత వీర రాఘవ' మోషన్ పోస్టర్ తో ఎన్టీఆర్ ఫాన్స్ కి కిర్రెక్కిన్చే సంతోషాన్నిచ్చారు హారిక అండ్ హాసిని నిర్మాతలు. ఇక త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా విషయంలో ఇలా ఎన్టీఆర్ విషెస్ అందుకుంటే... తన కొడుకు అభయ్ రామ్ నుండి తన పుట్టినరోజు మొదటి విషెస్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఈ విషయంలో కూడా ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.అలాగే ఇండస్ట్రీలోని ఎన్టీఆర్ సన్నిహితులదగ్గరనుండి.. స్నేహితుల వరకు ఎన్టీఆర్ కి పుట్టినరోజు సుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహేష్ బాబు ఎన్టీఆర్ కి హ్యాపీ బర్త్ డే, జూనియర్ ఎన్టీఆర్... విష్ యు ఆల్ ది విక్టరీస్, లవ్ అండ్ ఎవిరీథింగ్ పాజిటివ్! అంటూ విషెస్ తెలియజెయ్యగా .. రామ్ చరణ్ అయితే ఎన్టీఆర్ తో కలిసి తాను దిగిన ఒక అద్భుతమైన పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ... ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. మరి ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కలిసి రాజమౌళి మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నారు . అంతకుముందే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మంచి ఫ్రెండ్స్. ఇక ఎన్టీఆర్ సినిమాలు చరణ్ చూసి అభినందించడం.. చరణ్ సినిమాలు ఎన్టీఆర్ చూసి అభినందించడం అలాగే.. చరణ్ పార్టీలకు ఎన్టీఆర్, ఎన్టీఆర్ వెడ్డింగ్ యానివర్సరీకి చరణ్ వెళ్లడం వంటి విషయాలతో చరణ్ అండ్ ఎన్టీఆర్ లు చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు.ఇక ఇప్పుడు చరణ్ ఎన్టీఆర్ ని హగ్ చేసుకుని ప్రేమతో గట్టిగా పట్టుకున్న ఆ పిక్ అటు మెగా, ఇటు ఎన్టీఆర్ ఫాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇక చరణ్ సోషల్ మీడియాలో ఆ ఫోటో ని పోస్ట్ చేసి హ్యాపీ బర్త్ డే బ్రదర్!! హేవ్ వండర్ఫుల్ ఇయర్ ఎహెడ్. అంటూ ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. మరి ఆ పిక్ చూస్తుంటే అభిమానులకు కావాల్సింది ఇది కదా అనిపిస్తుంది కదూ. |
https://www.telugupost.com/movie-news/balayya-gopichand-179792/ | బాలకృష్ణ కి మాస్ కథ, మాస్ డైరెక్టర్ తగిలితే ఎలా ఉంటుందో సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు దగ్గర నుండి నిన్నమొన్నటి సింహ, లెజెండ్ సినిమాల వరకు చూస్తూనే ఉన్నాం. గత కొన్నాళ్లుగా ప్లాప్స్ తో కొట్టు మిట్టాడుతున్న బాలయ్య బాబు మళ్ళీ తనకి మాస్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను తో BB3 చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే బాలయ్య – బోయపాటి BB3 తర్వాత బాలయ్య చెయ్యబోయే నెక్స్ట్ మూవీపై అందరిలో ఆసక్తి మొదలయ్యింది. గతంలో బాలయ్యకి హిట్స్ ఇచ్చిన బి గోపాల్ కథ సెట్ అయ్యి బాలయ్య బాబు ఒప్పుకుంటే బాలయ్యతో సినిమా చేస్తా, కానీ ఇంతవరకులు కథా చర్చలేమీ బాలయ్య బాబుతో జరగలేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు BB3 తర్వాత బాలయ్య తో నెక్స్ట్ మూవీ చేసేందుకు క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని వచ్చి చేరాడు. ఈ సంక్రాంతికి ముందుగా బరిలోకి దిగిన గోపీచంద్ మలినేని క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. క్రాక్ ఇచ్చిన హిట్ ఉత్సాహంలో గోపీచంద్ మలినేని – బాలయ్య మూవీ ని సెట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ మాస్ ఎంటర్టైనర్ ఫిక్స్ అయ్యింది. మరి క్రాక్ డైరెక్టర్ కి మాస్ హీరో బాలయ్య దొరికితే ఆ సినిమా మాస్ మసాలాలా ఉండడం ఖాయం. ఇక ఎప్పటినుండో బాలయ్య బాబు తో మైత్రి మూవీ మేకర్స్ సినిమా చెయ్యాలనుకుంటుంది. ఇప్పుడు క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కథకి మైత్రి వారు ఇంప్రెస్స్ అవడంతో బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబోని సెట్ చేసారు మైత్రి నిర్మాతలు. |
https://www.telugupost.com/movie-news/saho-fails-and-its-effect-falls-on-saira-133757/ | మన టాలీవుడ్ నుంచి ఒకేసారి రెండు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి రీసెంట్ గా నెగటివ్ టాక్ తో పక్కకు తప్పుకుంది. దాదాపు 350 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కించిన సాహో చిత్రం కి ఒక్క హిందీ వర్షన్ లో తప్ప మిగిలిన అన్ని భాషల్లో నష్టాలుచవి చూడటం ఖాయమని తేలిపోయింది. ఓవరాల్ రన్ లో ఎంత లాస్ అనేది తెలియనుంది. సాహో ఫెయిల్ అవ్వడంతో దాని ప్రవాభం సైరాపై పడింది. నాలుగు భాషల్లో సైరా… సైరా కూడా నాలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది. కానీ సైరా టీం నుంచి మాత్రం ఎటువంటి జోష్ కనిపించడంలేదు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ డేట్ ప్రకటించినా ఆశించిన జోష్ బయట కనిపించడం లేదు.దానికి కారణం సాహో రిజల్ట్ అని కొందరు విశ్లేషిస్తున్నారు. రిలీజ్ఇంకా రెండు వారాలు మాత్రమే ఉన్నా ఏ మాత్రం దూకుడుగా లేదు. అసలే సైరా పై చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ని కొన్న బయ్యర్లు సైరా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. సాహో పరిస్థితి సైరా కి రాకూడదని ఫ్యాన్స్ తో పాటు సినిమాకి కొన్న బయ్యర్స్ కోరుకుంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/allu-arjun-new-movie-78379/ | ప్రస్తుతం నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా దెబ్బకి అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ కోసం బాగా గ్యాప్ తీసుకుంటున్నాడు. నా పేరు సూర్య సెట్స్ మీదున్నప్పుడే... అనేకమంది దర్శకుల చెప్పిన కథలు విన్న అల్లు అర్జున్ చివరికి మనం సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన కథకి కనెక్ట్ అయ్యాడని చెప్పినా... విక్రమ్ కుమార్ ని కూడా అల్లు అర్జున్ చాలా రోజులు హోల్డ్ లో పెట్టి తెగ వెయిట్ చేయించాడు. ఇక చివరికి .... విక్రమ్ చెప్పిన కథే ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో.. అల్లు అర్జున్ విక్రమ్ ని పిలిచి కొన్ని మార్పులు చేర్పులు చెప్పి పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చెయ్యమని చెప్పాడట. ఎలాగూ విక్రమ్ కుమార్కి ఏ సెంటర్స్, ఓవర్సీస్లో సాలిడ్ మార్కెట్ వుండడంతో తన డౌట్లు పక్కన పెట్టేసి ఈ సినిమా చెయ్యడానికి ఓకే చెప్పేసాడు. ఇక విక్రమ్ కుమార్ కథ, దర్శకత్వంలో అల్లు అర్జున్ మరికాన్ని రోజుల్లోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మొదలెట్టబోతున్నాడు. అయితే అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక కొత్త హీరోయిన్ తో నటించాలని అనుకునున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ చాలామంది భామలను తెలుగు తెరకు పరిచయం చేసాడు. గంగోత్రి సినిమాలో అదితి అగర్వాల్ ని, దేశముదురు సినిమాతో హన్సిక ని ఇలా చాలా సినిమాల్లో అల్లు అర్జున్ కొత్త హీరోయిన్స్ తోనే నటించాడు. తాజాగా అల్లు అర్జున్ విక్రమ్ కుమార్ సినిమాలోనూ ఒక కొత్త హీరోయిన్ కోసం వెతుకుంటున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరి అల్లు అర్జున్ తన సరసన నటించబోయే అమ్మాయిని బాలీవుడ్ నుండి తీసుకొస్తాడో లేదంటే...ఏ మలయాళీ భామను వెతుకుతాడో చూడాలి. ఇక గీత ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమా మాత్రం త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది |
https://www.telugupost.com/telangana/uttar-pradesh-boy-dies-in-telangana-stray-dogs-attack-1476979 | తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వీధికుక్కల దాడిలో మరో బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే క్వార్టర్స్ లో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన సునీత , మల్కాన్ దంపతులు అజ్మీర్ వెళ్లేందుకు కొడుకు చోటూ (8)తో కాజీపేట రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. సంచార నివాసితులుగా ఉండే వీరు.. వంట చేసుకునేందుకై గురువారం (మే18) రాత్రి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న పార్కుకు వెళ్లారు.ఉదయం నిద్రలేవగానే చోటూ.. పక్కనే ఉన్న పొదల్లోకి బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఆరు వీధికుక్కలు బాలుడిపై దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో.. చెట్టుకొమ్మకు షర్టు చిక్కుకుంది. దాంతో ఎటూ కదల్లేక కింద పడిపోయాడు. ఎంత కేకలు పెట్టినా ఎవరికీ వినిపించలేదు. దాదాపు 15 నిమిషాల పాటు వీధికుక్కలు చోటూపై విచక్షణ రహితంగా దాడి చేసి, గాయపరచడంతో.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వీధికుక్కల దాడిలో కొడుకు మరణించడంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా.. నాలుగురోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ బాలికపై, 10 రోజుల క్రితం రైల్వే ఉద్యోగి పై కూడా దాడిచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. |