news
stringlengths
299
12.4k
class
class label
3 classes
Jul 31,2015 నెట్‌లో సగం ఫేస్‌బుక్‌ యూజర్లే         హైదరాబాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ వినియోగదారులందరిలో సగం మంది ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తోన్నారు. గత జూన్‌ చివరి కల్లా నెలకు ఒక్క సారి అయినా ఫేస్‌బుక్‌ వాడే వారి సంఖ్య 13 శాతం పెరిగిందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా సేవలను అందుకుంటున్న దాదాపు 300 కోట్ల మందిలో సగం మంది ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందులో 65 శాతం మంది ప్రతి రోజు చూస్తున్నారని అంచనా. ప్రజలు స్మార్ట్‌పోన్‌తో గడిపే సమయంలో ప్రతి ఐదు నిమిషాల్లో ఒక్క నిమిషం ఫేస్‌బుక్‌కు కేటాయిస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
singer sunitha gives clarity on her second marriage rumour సింగర్ సునీత రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది సింగర్ సునీత రెండో పెళ్లిపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో సునీత రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్త హల్ చల్ చేస్తుండటంతో ఫేస్ బుక్ లైవ్‌ ద్వారా తన పెళ్లి వార్తల్ని... Samayam Telugu | Updated: Jul 21, 2018, 05:44PM IST సింగర్ సునీత రెండో పెళ్లిపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో సునీత రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్త హల్ చల్ చేస్తుండటంతో ఫేస్ బుక్ లైవ్‌ ద్వారా తన పెళ్లి వార్తల్ని ఖండించారు సునీత. సునీత మాట్లాడుతూ.. కొన్ని పర్శనల్ ప్రాబ్లమ్ వల్ల ఈ మధ్య ఫేస్ బుక్‌లైవ్‌లోకి రాలేకపోతున్నాను. అయితే అభిమానుల బ్లెస్సింగ్ ఉండటం వల్ల అనేక పాటలు పాడుతూ హ్యాపీగా బ్రతికేస్తున్నాను. నా జీవితాన్ని చాలా అందంగా మరల్చుకుంటున్నాను. అయితే అనుకోకుండా ఈ మధ్య కాలంలో నాకు చాలా మెసేజ్‌లు ఫోన్లు వస్తున్నాయి. ఏంటి? మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారట కదా.. ఐటీ ప్రొఫెషనల్‌ని రెండో పెళ్లి చేసుకోబోతున్నారట కాదా అంటూ చాలా మంది అడుగుతున్నారు. ఇక చాలా వెబ్ సైట్‌లో ఇదే న్యూస్ వచ్చింది. అదే టైమ్‌‌లో ఈ విషయంలో వస్తున్న రెస్పాన్స్ అసలు ఊహించలేదు. నా పెళ్లి గురించి వీళ్లకి ఇంత ఆసక్తి ఉందా.. ఇంత ఎఫెక్షన్ ఉందా? నేను జీవితంలో సెటిల్ కావాలని అనుకుంటున్నారా? ఇది నిజంగా మంచిదే అనిపించింది.
0business
Jakarta, First Published 25, Aug 2018, 11:43 AM IST Highlights ఏషియన్ గేమ్స్ లో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఒకదాని తర్వాత మరో విభాగంలో పతకాల పంట పండిస్తున్నారు. షూటింగ్ తో ప్రారంభమైన పతకాల వేట రెజ్లింగ్, టెన్నిస్ ను దాటుకుని ఇప్పుడు రోయింగ్ కి చేరింది. రోయింగ్ విభాగంలో భారత క్రీడాకారులు ఒకే రోజు మూడు పతకాలు సాధించి దేశ ప్రతిష్టను మరింత పెంచారు. ఈ పతకాల్లో ఓ స్వర్ణంతో పాటు రెండు కాంస్యాలున్నాయి.   ఏషియన్ గేమ్స్ లో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఒకదాని తర్వాత మరో విభాగంలో పతకాల పంట పండిస్తున్నారు. షూటింగ్ తో ప్రారంభమైన పతకాల వేట రెజ్లింగ్, టెన్నిస్ ను దాటుకుని ఇప్పుడు రోయింగ్ కి చేరింది. రోయింగ్ విభాగంలో భారత క్రీడాకారులు ఒకే రోజు మూడు పతకాలు సాధించి దేశ ప్రతిష్టను మరింత పెంచారు. ఈ పతకాల్లో ఓ స్వర్ణంతో పాటు రెండు కాంస్యాలున్నాయి. ఆరో రోజుకు చేరిన ఆసియా క్రీడల్లో భారత రోయర్ల హవా కొనసాగింది. పురుషులు క్వాడ్రపుల్ స్కల్స్ విభాగంలో సవర్ణ్‌సింగ్‌, దత్తు భోకనల్‌, ఓం ప్రకాశ్‌, సుఖ్‌మీత్‌ సింగ్‌లతో కూడిన భారత జట్టు కేవలం 6నిమిషాల17.13సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి మొదటి స్థానంలో నిలిచారు. దీంతో వీరి బృందానికి స్వర్ణ పతకం లభించింది. రెండో స్థానంలో నిలిచి థాయ్ లాండ్ బృందం రజతం సాధించగా, ఆతిథ్య ఇండోనేషియా కాస్యంతో సరిపెట్టుకుంది.   ఇక ఇదే విభాగంలో లైట్ వెయిట్ స్కల్స్ లో దుశ్యంత్ 7నిమిషాల 18.76 సెకన్ల టైమింగ్ తో మూడో స్థానంలో నిలిచి కాస్యం గెలుచుకున్నాడు. అలాగే లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ కేటగిరీలో రోహిత్ కుమార్- భగవాన్ సింగ్ జోడీ 7నిమిషాల 04.61 సెకన్ల టైమింగ్ తో కాంస్యం సాధించారు.
2sports
Paradise పేరడైజ్‌ బిర్యానీతో పేటిఎం ఒప్పందం హైదరాబాద్‌, జనవరి 15: డిజిటల్‌ లావాదేవీలకు మొగ్గుచూపిస్తున్న ప్రస్తుత తరుణంలోప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలకు అనుగు ణంగా ప్రైవేటు పేమెంట్‌ సంస్థలు కూడా వ్యాపార సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంటున్నాయి. ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న పేటిఎం ప్రస్తుతం నగరంలో ప్రాచుర్యం పొందిన పేరడైజ్‌ బిర్యానీ హోటల్‌తో భాగస్వామ్యంఅయింది. పేటిఎంవ్యాలెట్‌ద్వారా పేరడైజ్‌ ఇక చెల్లింపులు స్వీకరిస్తుంది. ప్రస్తుతం భారత్‌లోని 26 పేరడైజ్‌ బిర్యానీ ఔట్‌లెట్లద్వారా అందుబాటులో ఉందని, పేటిఎం ఎల్లవేళలా నిరంతరాయంగా చెల్లింపులు కొన సాగించేవిధంగా కృషిచేస్తోందని ప్రకటించింది. ఇప్పటికే ప్యూచర్‌ గ్రూప్‌, మోర్‌; స్పెన్సర్‌్‌స, డబ్ల్యు హెచ్‌స్మిత్‌, హాల్దిరామ్స్‌, వాంగో, కెఎఫ్‌సి, పిజ్జాహట్‌, బారిస్టా, కోస్తా కాఫీ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. పది ప్రాంతీయ భాషల్లో యాప్‌ను విడుదలచేసినట్లు వెల్లడించింది. పేటిఎం పేమెంట్స్‌ బ్యాంకు ప్రారంభించేంత వరకూ ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడంలేదని వివరించింది.
1entertainment
Suresh 128 Views ipl ఐపిఎల్‌లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా హవా న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ల హవా కనిపిస్తుంది.భవిష్యత్‌లో ఆసీస్‌ క్రికెటర్ల జోరు ఎక్కువగా నడిస్తుందా? అని ఐపిఎల్‌ జట్లకు ఆసీస్‌ ఆటగాళ్లే కెప్టెన్లుగా ఉండే విధంగా పరిస్థితి మారిపోతుందా అనే అను మానాలు కలుగుతున్నాయి.ఇప్పటికే రెండు జట్లకు ఆసీస్‌ ఆటగాళ్లే రథసారథులుగా ఉండగా ఇప్పుడు మూడవ జట్టుకు కూడా ఆసీస్‌ ఆటగాడే శరణ్యమైపోయాడు.దీన్నంతాచూస్తుంటే ఐపిఎల్‌ పేరు కూడా ఎపిఎల్‌ (ఆస్ట్రేలియా ప్రీమియర్‌ లీగ్‌) అని మారిపోతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఐపిఎల్‌ పదవ సీజన్‌ కోసం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు కొత్త కెప్టెన్‌ను నియమించింది. మురళీ విజ§్‌ు స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన గ్లేన్‌ మ్యాక్స్‌వెల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇప్పటికే ఆసీస్‌కు చెందిన డేవిడ్‌ వార్నర్‌ సన్‌ రైజర్స్‌ కెప్టెన్‌గా ఉండగా, పుణే జట్టు ధోనీ స్థానంలో స్టీవ్‌ స్మిత్‌కు బాధ్యతలు అప్పగిం చింది. కెప్టెన్‌గా మ్యాక్స్‌వెల్‌ను నియమించిన విషయాన్ని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించింది.ఆ జట్టు ప్రధాన కోచ్‌ సెహ్వాగ్‌కూడా ఈ విషయాన్ని ట్వీట్‌ చేశాడు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌,వెస్టిండీస్‌ ప్లేయర్‌ డారెన్‌ సమీతో పాటు దక్షిణాఫ్రికా ప్లేయర్‌ హషీమ్‌ అమ్లాను కాదని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మాక్స్‌వెల్‌కు బాధ్యతలు అప్పగిం చడం విశేషం.భుజం గాయం కారణంగా మిగతా రెండు టెస్టులకు దూరమైన మార్ష్‌ స్థానంలోకి వచ్చేందుకు మ్యాక్స్‌వెల్‌ ప్రయత్నిస్తున్నాడు.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV పాకిస్థాన్ కాచుకో.. భారత్‌ వచ్చేసింది..! డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి భారత్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి మళ్లీ పాక్‌తో ఢీకొట్టేందుకు TNN | Updated: Jun 15, 2017, 09:44PM IST ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ దాయాదుల సమరం. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి భారత్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి మళ్లీ పాక్‌తో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ని మట్టికరిపించింది. 265 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ (123 నాటౌట్: 129 బంతుల్లో 15x4, 1x6) శతకంతో చెలరేగగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (96 నాటౌట్: 78 బంతుల్లో 13x4) అజేయ అర్ధ శతకం బాదేశాడు. దీంతో లక్ష్యాన్ని భారత్ కేవలం 40.1 ఓవర్లలోనే 265/1తో ఛేదించేసింది. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి పాకిస్థాన్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో భారత్- పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే 124 పరుగుల తేడాతో పాక్‌ను భారత్ ఓడించిన విషయం తెలిసిందే. అంతకముందు కేదార్ జాదవ్ (2/22), జస్‌ప్రీత్ బుమ్రా (2/40), భువనేశ్వర్ కుమార్ (2/53) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 264 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో ముష్ఫికర్ రహీమ్ (61: 85 బంతుల్లో 4x4), తమీమ్ ఇక్బాల్ (70: 82 బంతుల్లో 7x4, 1x6) అర్ధ శతకాలతో ఫర్వాలేదనిపించారు.
2sports
‘స్మార్ట్‌ సేవలకు ఆర్‌జియో కొత్త నిర్వచనం!   ముంబై, నవంబరు 20: రిలయన్స్‌ ఎక్స్‌పీరియర్స్‌ సెంటర్‌ సేవలతో ఆర్‌జియో టెలికాంసేవలకు కొత్త నిర్వచనం ఇస్తోంది. రిలయన్స్‌ ఎక్స్‌ పీరియన్స్‌ సెంటర్‌తో కనెక్ట్‌ అయితే చాలు కస్టమర్లు నివసించే సిటీ స్మార్ట్‌సిటీ అయినా కాకపోయినా జియోసిమ్‌ యజమానులు మాత్రం స్మార్ట్‌సిటిజన్‌గా మారతారని జియో ధీమా. ఆర్‌జియో కనెక్షన్‌ఉన్న వినియోగదారుడు ఏనగరం లో అయినా సరే సకలసౌకర్యాలతో స్మార్ట్‌సిటి జెన్‌ జీవనశైలి అలవరుచుకుంటారు. జియో సిమ్‌ కార్డతో 4జి మొబైల్‌పై అత్యధికవేగంతో డేటాసేవలు అందుతాయి. ఇల్లు ఆఫీసు, టివిలేదా కారు ఇష్టమైన దినపత్రిక ఏవైనా సరే ఒక్క స్మార్ట్‌ఫోన్‌పై ఒకసారి టచ్‌చేస్తే చాలు అన్నీ కళ్లముందుకు వస్తాయని ఆర్‌ జియో ఎక్స్‌పీరియా సెంటర్‌నిపుణులు చెపు తున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రిల యన్స్‌ ఈ కేంద్రాన్ని ముంబైలోని రిలయన్స్‌ కార్పొరేట్‌ పార్క్‌లో నెలకొల్పింది. ఈకేంద్రంలో ఎంపికచేసిన కస్టమర్లు, వెండాలర్ల సమక్షంలో జియో డిజిటల్‌ ప్రపంచానికి మరింత చేరువ అవుతోంది. ఇటీవలే హైదరాబాద్‌ నుంచి వచ్చిన మీడియా బృందానికి లైవ్‌డెమోద్వారా ఈ సెంటర్‌కు సంబంధించిన అన్ని విశేషాలను వివరించారు. బ్రాడ్‌బాండ్‌ నెట్‌వర్క్‌ అప్లికేషన్లు, ఇతర సేవలు గురించి విశదీకరించారు. జియో ఏవిధంగా జనావాసాలు ఇళ్లు, కార్యాలయాలు, ఉపకరణాలు వాహనా లతో కనెక్ట్‌ అవుతుందనే అంశాన్ని సమగ్రంగా ఆర్‌జియోరాకతో రూపురేఖలే మారిపోతాయని టివిహెచ్‌డిటివి, మొబైల్‌టివి, వైఫైసెట్‌ టాప్‌బాక్స్‌,మైఫై వంటివన్నీ కూడా కేవలం మొబైల్‌పై అందుబాటులోనికి వస్తున్నాయి. ఇతర ఫోన్లలో ఉన్న అనుభవాల రూపురేఖలే మారిపోయాయి.జియోసిమ్‌ అప్‌, డివైజెస్‌తో పరికరాలు ఇతర సామగ్రి పూర్తి మార్పును తెచ్చాయి. ఇక జియో వీడి యో అప్లిపకేషన్ల ద్వారా ఎంత పెద్ద వీడియోలనైనా ఏమాత్రం జాప్యంలేకుండా క్షణకాలంలో డౌన్‌లోడ్‌చేసు కునే సౌకర్యం ఉంది. జియో మ్యూజిక్‌ ద్వారావేలాది పాటలు భద్రపరుచుకునేందుకు వీలుగా ఒక స్టోర్‌ సదుపాయం ఉంది. ఇక జియో న్యూస్‌ మ్యాగ్‌జైన్‌ అప్లికేషన్లద్వారా వార్తలుచదువు కోవచ్చు. క్రీడా, సినిమా విభాగాలకు నేరుగా పోవచ్చు. జియోటివి ద్వారా మొత్తం ఛానెళ్లు, జియో సినిమాద్వారా వేలాది సినిమాలు, జియో మనీద్వారా బిల్లుల చెల్లింపులు ఒకటేమిటి సర్వస్వం ముందుకు తెస్తోంది. వన్‌జిబి పిఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను అమలు చేస్తోంది. ఫైబర్‌టుది హోం ఎఫ్‌టిటిహెచ్‌గా పిలిసే సర్వీసుతో ఇళ్లు, ఆఫీసులకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ఇస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్త కేబుల్‌ ఏర్పాటయిందని వీటితోపాటు ఒక ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌బాక్స్‌ కూడా అందిస్తుంది. చేతిలో పట్టేసే జియోఫై రూ.2 వేలతో సమకూర్చుకుంటే ఇంటిని మొత్తం వైఫై గా మార్చేస్తుంది. ఇక జియో మీడియా షేర్‌ ద్వారా డేటాను ఇళ్లలోని వివిధ డిజిటల్‌ పరి కరాల మధ్య మార్పిడిచేసుకునే వీలుంది. జియో మీడియాషేర్‌యాప్‌ ఒకేసారి ఐదు ఉపకరణాలకు పనిచేసే వీలుంటుంది. రెండుల్యాప్‌ టాప్‌లు, ఒక డెస్క్‌టాప్‌, మొబైల్‌ ఏకకాలంలో కనెక్ట్‌ అయిపోతా యి. ఇంటర్నెట్‌ ఆధారంగాపనిచేసే సెక్యూ రిటీ సిస్టమ్స్‌, మోషన్‌ సెన్సార్స్‌ కెమేరాతో కూడిన డోర్‌బెల్స్‌, స్పీకర్లు, ఫైర్‌డిటెక్టర్లను కూడా సమకూర్చి ఒక స్మార్ట్‌హోం నిర్మాణ విధానానికి ఆర్‌జియో శ్రీకారం చుడుతోంది. భవి ష్యత్తులో వాడుకునేకార్లను స్మార్ట్‌కార్లుగా రూపొందించే విధంగా డిజిటల్‌ టెక్నాలజీతో ఆర్‌జియో కొత్తపుం తలు తొక్కు తోందనే చెప్పాలి. మొత్తం మీద టెలికాం, వాయిస్‌ మొబైల్‌ డేటా సేవల్లో ఆర్‌జియో కొత్త శకానికి తెరతీసిందనడంలో సందేహంలేదు.
1entertainment
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిపై ఫ్రెంచ్ డైరెక్టర్ స్పందన Highlights పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న అజ్ఞాతవాసి గత కొంత కాలంగా ఫ్రెంచ్ సినిమా కాపీ అంటూ రూమర్స్ తాజాగా అజ్ఞాతవాసిపై ఫ్రెంచ్ డైరెక్టర్ ట్వీట్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. ఇప్పుడు ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ తెగ పబ్లిసిటీ అవుతోంది. అలాంటి రూమర్లను వినేసి టి సిరీస్ వారు.. ఈ సినిమా కథ గురించి తెలుసుకుని.. రిలీజ్ అయ్యాక సినిమా చూసి.. నిర్మాతకు లీగల్ నోటీస్ ఇవ్వాలని చూస్తున్నారట. ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు లార్గో ఫించ్ దర్శకుడు జిరోమ్ సెలే.. ట్విట్టర్లో ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేయడంతో.. ప్రపంచం అంతా ఈ విషయం రచ్చయ్యేలా ఉంది. పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి మూవీ టికెట్., దానికన్నా ముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి అంటూ ట్వీటేశాడు. ఆన్ లైన్లో వచ్చిన అజ్ఞాతవాసి కాపీ అంట.. టి సిరీస్ వారు లీగల్ నోటీస్ ఇస్తున్నారు అనే న్యూస్ ను తనకు ఎవరో ఫ్యాన్స్ చేరవేయడంతో.. ఆ న్యూస్ లింకుతో పాటు ఈ ట్వీటును వేశాడు సదరు ఫారిన్ డైరక్టర్. ఒకవేళ నిజంగానే అజ్ఞాతవాసి సినిమాను చూసి.. అసలు తను తీసిన వర్షన్ ఎందుకు పెద్దగా ఆడలేదు.. త్రివిక్రమ్ తీసిన ఈ సినిమా రిలీజ్ కంటే ముందే 100 కోట్లకు పైగా బిజినెస్ ఎలా చేసిందో తెలుసుకుంటాడా ఏంటి?    2008లో వచ్చిన ఫ్రెంచ్ సినిమా లార్గో ఫించ్. బెల్జియంకు చెందిన ఒక కామిక్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. కట్ చేస్తే దానిని ఇంగ్లీషులోకి అనువదించి.. ది హేర్ అపారెంట్ పేరుతో కూడా రిలీజ్ చేశారు. కమర్షియల్ సక్సెస్ పెద్దగా లేని ఈ సినిమాను కాపీ కొట్టేసి తెలుగులో అజ్ఞాతవాసి అంటూ తీస్తున్నారని ఇప్పుడు పెద్ద న్యూస్ అయిపోయింది. ఇందులో నిజమెంతో త్రివిక్రమ్ కే తెలియాలిలే. Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0business
Hyderabad, First Published 22, Sep 2018, 3:27 PM IST Highlights బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా ఉన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అతడి కోసం ర్యాలీలు, రక్త దానాలు చేస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు.  బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా ఉన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అతడి కోసం ర్యాలీలు, రక్త దానాలు చేస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు. కౌశల్ కి క్రేజ్ పెరగడంలో కౌశల్ ఆర్మీతో పాటు అతడు భార్య నీలిమ కూడా తన వంతు కృషి చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో నీలిమ కౌశల్ ఓ ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు. గత కొద్దిరోజులుగా హౌస్ లో చోటు చేసుకుంటున్న సంఘటనలతో తాను చాలా బాధ పడుతున్నట్లు ఆమె తెలిపారు. అలానే కొన్ని సంతోషకరమైన విషయాలు కూడా చోటుచేసుకున్నాయని.. ఆ బాధని, సంతోషాన్ని మీరంతా పంచుకుంటున్నారని కౌశల్ ఆర్మీని ఉద్దేశించి నీలిమ అన్నారు. కౌశల్ ని మీ ఇంట్లో సభ్యుడిగా భావించి ప్రేమిస్తున్నందుకు రుణపడి ఉంటామని అన్నారు. అయితే ఆమె గత వారం హౌస్ లోకి వెళ్లినప్పుడు కౌశల్ కి బయట విషయాలు చెప్పారని, అందుకే కౌశల్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటిపై స్పందించిన ఆమె కౌశల్ కి ఏం చెప్పలేదని, చాలా తక్కువ విషయాలు చెప్పానని అన్నారు. కౌశల్ కి మద్దతు చేయాలని కోరుకుంటూనే.. ఇతర కంటెస్టెంట్స్ పై ట్రోల్స్ చేయొద్దని, వారికి కూడా కుటుంబాలు ఉంటాయని.. తిట్టడం కరెక్ట్ కాదని నీలిమ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.  Last Updated 22, Sep 2018, 3:29 PM IST
0business
kings eleven punjab batting 11.2 ఓవర్లకు పంజాబ్‌ స్కోరు 61-4 బెంగళూరు: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 4వ వికెట్‌ కోల్పోయింది.. చాహల్‌ వేసిన 12వ ఓవర్‌ రెండో బంతికి మనన్‌ నోహ్రా (25) షాట్‌ కొట్టేందుకు రపయత్నించి డెవిలియర్స చేతికి చిక్కాడు.. దీంతో పంజాబ్‌ స్కోరు 11. 2 ఓవర్లలో 4 వికెట్లునష్టపోయి 61 పరుగులు, సాహా (6) , స్కిపర్‌ మ్యాక్స్‌వెల్‌క్రీజ్‌లో ఉన్నారు..
2sports
BANKLOAN పన్ను బకాయిలు రాబట్టేందుకు ‘నేమ్‌ అండ్‌ షేమ్‌ న్యూఢిల్లీ, మే 20: పన్నుబకాయిలు రాబట్టేందుకు ఆదాయపు పన్నుశాఖ కూడా గతంలో బ్యాంకులు అనుసరించిన విధానం అనుసరిస్తోంది. నేమ్‌ అండ్‌ షేమ్‌ విధానంలో పన్ను బకాయిలు రాబడుతోంది. ఇప్పటివరకూ పదికోట్లకు మించి ఉన్న పన్ను బకాయిలు వసూలుచేసేందుకు ఐదు సంస్థల పేర్లను గురువారం ప్రచురించింది. పెద్దమొత్తం బకాయిదారుల గుట్టు బైటపెట్టడం ద్వారా వీరినుంచి పన్ను బకాయిలు వసూలుచేయవచ్చని ఐటిశాఖ భావిస్తోంది. అన్ని ప్రముఖ దినపత్రికల్లో వ్యాపార ప్రకటనలు జారీచేసింది. ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్ను బకాయిలు పడిన వారిని వెంటనే చెల్లించాలని లేని పక్షంలో రికవరీ ఉంటుందని హెచ్చరించింది. గడచిన కొన్నేళ్లు గా ఇదేవిధానం అనుసరిస్తున్న ఐటిశాఖ కనీసం 96వరకూ ఇటువంటి సంస్తలున్నట్లు అంచనా వేసింది. భారీ మొత్తంలో బకాయిలు ఉన్నాయి. అయితే ఈ సంస్థల ఆచూకీ ఇప్పటికీ గుర్తించలేకపోతోంది. అంతేకాకుండా రికవరీకి ఎటువంటి స్థిరాస్తులు కూడా లేవు. ప్రస్తుతం ప్రకటించిన బకాయిదారుల జాబితా అంతా ఢిల్లీ పరిసరాల్లోనే ఉంది. వ్యక్తులు, లేదా సంస్థలు పాన్‌కార్డునంబరు, లేదా చివరి అసెస్‌మెంట్‌లో పొందుపరిచిన చిరునామా, పన్ను బకాయి మొత్తం వంటి వాటిని ప్రచురించండం జరుగుతుందని ఐటిశాఖ వెల్లడించింది. పన్ను అసెస్‌మెంట్‌ సంవత్సరం, పన్ను బకాయిలు కూడా బకాయిదారులకు వివరిస్తుంది. ఇటువంటి బకాయిలపై ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో నోటీసులు జారీ అవు తాయి. మొత్తం ఐదుగురు బకాయిదారుల నుంచి 10.27 కోట్లు రావాల్సి ఉంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గడచిన కొంతకాలంగా ఇటువంటి మొండి బకాయిలు, రానిబాకీలను తమ వెబ్‌సైట్‌లో పొందు పరచడమేకాకుండా బహిరంగం చేయడం ద్వారా కొంతమేర వసూలు చేయవచ్చని నిర్ణయించింది. ఐటి శాఖ ఇటీవలనే పాన్‌, ఆధార్‌ దస్త్రాల్లో మార్పులుచేర్పులు చేసుకునేందుకు ఆన్‌లైన్‌ అవకాశాలు కల్పిం చింది. ఆధార్‌తో పాన్‌ అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా వీటిని ఏర్పాటు చేసింది. రెండు ప్రత్యే క హైపర్‌లింకులను ఇఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోనే ఉంచింది. ఒకటి మార్పులు అప్‌డేట్‌ చేసుకోవడం, రెండోది కొత్తపాన్‌ కార్డుకోసం దరఖాస్తు భారతీయులు, లేదా ప్రవాసభారతీయులు ఎవరైనా చేయవచ్చు.
1entertainment
Oct 24,2019 తెలంగాణలో హోండా ఎస్‌ఈసీ నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) సంస్థ తెలంగాణలో తన రెండో నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని (ఎస్‌ఈసీ) ఏర్పాటు చేసింది. సిరిసిల్ల పార్క్‌లోని ప్రభుత్వ ఐటీఐలో హెచ్‌ఎంఎస్‌ఐ దీనిని ఏర్పాటు చేసింది. జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్‌ వారి సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేశారు. స్థానిక యువతకు ఉపాధి-ఆధారిత సాంకేతిక నైపుణ్యత శిక్షణను అందించే ఉద్దేశంతో ఈ కేంద్రా న్ని ఏర్పాటు చేసినట్టుగా వరంగల్‌ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కె.వి. చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్న మెంట్‌ ఐటీఐ ప్రిన్సిపల్‌ దేవానంద, హోండా టూవీలర్స్‌ సంస్థ దక్షిణ భారత విభాగం అమ్మకాలు, మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజరు యోగేశ్‌ మాథూర్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీవాస్త తదితరులు పాల్గొన్నారు. స్థానిక యువతకు నైపుణ్యతను పెంచి ఉపాధి అవకాశాలను పెంపొందించే ఉద్దేశంతో తాము కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌లో భాగంగా ఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా సంస్థ ఉపాధ్యక్షుడు ప్రదీప్‌ పాండే తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
IPO ఇన్వెట్‌ ఐపిఒలతో తగ్గుతున్న రుణభారం న్యూఢిల్లీ, మే 11: మార్కెట్లకు వస్తున్న నాలుగు ఇన్వెట్‌ ఐపిఒల ద్వారా ఆయా సంస్థల ప్రమోటర్ల రుణ భారం రూ.13వేల కోట్లు తగ్గుతుందని వెల్లడించారు. మొదటి నాలుగు ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్‌ట్రస్టులు ఐపిఒలకు వస్తున్నాయి. ఈ ఏడాదిలోనే వస్తున్న ఈ నాలుగు ఐపిఒలతో ఆయా గ్రూప్‌ల రుణభారం తగ్గించుకునే కసరత్తులు చేస్తున్నాయి. ఇన్విట్‌ఫండ్‌ ఐపిఒ వల్ల నగదు అత్యవసరం అయిన సంస్థలకు నిధులు వెనువెంటనే సమకూరే అవకాశం ఉంటుందని అంచనా. ఇండియారేటింగ్స్‌ తన నివేదికలో ఇదే అంశాన్ని ఉటంకించింది. ప్రస్తుతం స్టెరిలైట్‌ పవర్‌గ్రిడ్‌ వెంచర్స్‌, ఆర్‌ఇన్‌ఫ్రా, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌,ఐఆర్‌బి ఇన్‌ప్రా వంటి సంస్థలు ఐపిఒలకు వస్తున్నాయి. ఐఆర్‌బి ఇన్‌ఫ్రా ఇప్పటికే ఐదువేల కోట్ల ఐపిఒను ముగించింది. ఇన్విట్స్‌వల్ల కంపెనీల ఆస్తి అప్పుల పట్టీలను సమన్వయం చేసుకునే అవకాశం ఉంటుంది. రుణభారం తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుందని,మొత్తం 13వేల కోట్ల రుణభారం తగ్గిన తర్వాతమిగిలిన 3600 కోట్ల రుణం తీర్చుకునేందుకు రీఫైనాన్స్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని ఇండియా రేటింగ్స్‌ తన నివేదికలో వెల్లడించింది. ఐఆర్‌బి తన రుణభారంలోని 3513 కోట్లలో 77.5శాతం తగ్గించుకోగలదని ఎక్కువగా టోల్‌ రోడ్‌ ప్రాజెక్టులే ఉన్నాయని అంచనావేసింది. ఇన్వెట్‌ట్రస్ట్‌ద్వారా ఇండియా గ్రిడ్‌ట్రస్ట్‌ తన స్టెరిలైట్‌గ్రిడ్‌సాయంతో ఇన్వెట్‌ ట్రస్ట్‌ ద్వారా ఐపిఒకు వస్తోంది. ఈ సంస్థకు రెండు నిర్వహణ ట్రాన్స్‌మిషన్‌ ఆస్తులునానయి.భోపాల్‌ లోని ధూలే ట్రాన్స్‌మిషన్‌ జబల్‌పూర్‌ట్రాన్స్‌మిషన్‌ కంపెనీలు ఈరెండూ కూడా ఐపిఒకు వచ్చేవే. ఐపిఒ తర్వాత ఇండ్‌గ్రిడ్‌లో 15-25శాతం వాటాలు కలిగి ఉంటుంది.
1entertainment
Hyd Internet 84 Views sindhu and okuhara sindhu and okuhara టోక్యో: ప్రస్తుతం జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రారంభంకానుంది. ఇటీవలే కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో తెలుగు తేజం  సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే. సింధు, ఒకుహర వీరి మధ్య పోటికి మరో వేదిక సిధ్దమైంది. గత రెండు  టోర్నీ ఫైనల్లో ఎదురైన ఇద్దరు, ఈ సారి ప్రిక్వార్టర్స్‌లో పోటీ పడే అవకాశముంది. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీ ఈ నెల 24 వరకు జరుగుతుంది. తొలి రౌండ్‌లో మినిత్సుతో సింధు తలపడనుంది. మరోవైపు చౌచువాంగ్‌తో సైనా నెహ్వాల్‌ తన పోరాటం ప్రారంభించనుంది.
2sports
నటుడు రాజశేఖర్ కి మాతృవియోగం Highlights రాజశేఖర్ తల్లి ఆండాల్ వరదరాజ్ కన్నుమూత చెన్నైలో అంత్యక్రియలు శోఖ సముద్రంలో రాజశేఖర్ కుటుంబసభ్యులు ప్రముఖ నటుడు రాజశేఖర్ కి మాతృవియోగం. ఆయన తల్లి  ఆండాళ్ వరదరాజ్ (82) ఈరోజు కన్నుమూశారు.  ఆండాళ్ కి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. రాజశేఖర్ ఆమెకు రెండో సంతానం. ఆమె అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించనున్నారు. ఆమె మృతితో రాజశేఖర్ కుటుంబ సభ్యులు శోఖ సముద్రంలో మునిగిపోయారు. Last Updated 25, Mar 2018, 11:57 PM IST
0business
క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి… కివీస్‌తో టీ20కి గ్రీన్‌ ఫీల్డ్‌ స్టేడియం త్రివేండ్రియం: కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌ నవంబర్‌ 7న ఆరాష్ట్ర క్రికెట్‌ అభి మానులు పండుగ చేసుకునేలా చేసింది. ఎందుకంటే ఆరోజు ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. కాబట్టి, ఆస్ట్రేలియాతో పరిమిత ఓబర్ల క్రికెట్‌ సిరీస్‌ ముగిసిన అనంతరం న్యూజిలాండ్‌ జట్టు నవంబర్‌ నెలలో భారత పర్యటనకు రానుంది. ఈ స్టేడియం గ్రీన్‌ ఫీల్డ్‌ స్టేడియం కావడం విశేషం. 1998లో వివ్‌ రిచర్డ్స్‌ నేతృత్వంలోని వెస్టిండీస్‌ జట్టు చ చివరిసారిగా ఈ స్టేడియంలో మ్యాచ్‌ ఆడింది. ఆతర్వాత నుంచి ఇప్పటివరకు ఈ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగలేదు. జాతీయ క్రీడలతో పాటు రంజీ మ్యాచ్‌లకు మాత్రం ఆతిథ్యం ఇచ్చింది. ఇటీవలే కేరళ క్రికెట్‌ అసోసియేషణ్‌ ఈ స్టేడియాన్ని కేరళ యూనివర్సిటీకి సంబంధించినది కావడం విశేషం. అంతకుముందు వరకు బిసిసిఐ నిర్వహించే అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌ లకు కొచ్చిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యమిచ్చింది.
2sports
READ ALSO: Kangana అక్రమ సంబంధంపై స్పందించిన యువ హీరో అయితే ఈ కారిడర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పాక్ తరఫున ఇమ్రాన్ ఖాన్‌ కూడా హాజరుకానున్నారు. ఈ వేడుకకు పూనమ్ కౌర్‌ను కూడా ఆహ్వానించారట ఇమ్రాన్. ఈ విషయాన్ని పూనమ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘కర్తార్‌పూర్ కారిడార్ ఆవిష్కరణకు పాకిస్థాన్ నుంచి నాకు ఆహ్వానం అందింది. ఇందుకోసం నేను నా వీసా పనులు చూసుకుంటున్నాను. ఇది నాకు ఎంతో భావోద్వేగంతో కూడుకున్న నిర్ణయం. సిక్కులు గర్వపడే విషయం. నాకు అధికారులు అవకాశం ఇస్తే నేను ఇమ్రాన్ ఖాన్‌ను కలవాలని అనుకుంటున్నాను. 1947లో విభజన అనంతరం దర్బార్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లిన మొదటి భారతదేశ సిక్కు మహిళను నేనే’ READ ALSO: నా దృష్టిలో కొడుకు, కుక్క ఒక్కటే: నటి మలైకా ‘ గతేడాది వెళ్లినప్పుడు నా వీడియో కూడా వైరల్ అయింది. అలా నా గురించి పాక్‌ ప్రధానికి తెలిసింది. అందుకే కారిడర్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించారు. ఓ యాత్రికురాలిగా మాత్రమే నేను కారిడర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్నాను. నా ఆలోచనలు, ఉద్దేశం కరెక్ట్ అయినప్పుడు ఫలితం కూడా అలాగే ఉంటుంది. గతేడాది నన్ను ఇరు దేశాల మధ్య శాంతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ పాకిస్థాన్ అవార్డ్ ఇవ్వాలనుకుంది. కానీ ఆ సమయంలో పుల్వామా దాడులు జరుగుతున్నందుకు నేను వెళ్లలేకపోయాను. ఈ విషయంలో ప్రజలు నన్ను టార్గెట్ చేసినా ఫర్వాలేదు. నాకు అలవాటైపోయింది’ అని వెల్లడించారు. See Photo Story: 'వరల్డ్ ఫేమస్' హీరోయిన్.. అందాల బొద్దుగుమ్మ కేథరిన్   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
రకుల్ ప్రీత్ జిమ్‌ను ప్రారంభించిన సైనా నెహ్వాల్ First Published 2, Nov 2017, 12:51 PM IST రకుల్ ప్రీత్ జిమ్‌ను ప్రారంభించిన సైనా నెహ్వాల్ రకుల్ ప్రీత్ జిమ్‌ను ప్రారంభించిన సైనా నెహ్వాల్ రకుల్ ప్రీత్ జిమ్‌ను ప్రారంభించిన సైనా నెహ్వాల్ రకుల్ ప్రీత్ జిమ్‌ను ప్రారంభించిన సైనా నెహ్వాల్ రకుల్ ప్రీత్ జిమ్‌ను ప్రారంభించిన సైనా నెహ్వాల్ రకుల్ ప్రీత్ జిమ్‌ను ప్రారంభించిన సైనా నెహ్వాల్ రకుల్ ప్రీత్ జిమ్‌ను ప్రారంభించిన సైనా నెహ్వాల్ రకుల్ ప్రీత్ జిమ్‌ను ప్రారంభించిన సైనా నెహ్వాల్ రకుల్ ప్రీత్ జిమ్‌ను ప్రారంభించిన సైనా నెహ్వాల్ రకుల్ ప్రీత్ జిమ్‌ను ప్రారంభించిన సైనా నెహ్వాల్ రకుల్ ప్రీత్ జిమ్‌ను ప్రారంభించిన సైనా నెహ్వాల్ Recent Stories
0business
- ఎయిర్‌పోర్టులో డేటావిండ్‌ కేంద్రం ప్రారంభం నవతెలంగాణ- శంషాబాద్‌ పెట్టుబడులను రప్పించి రాష్ట్ర ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఐటీ శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పరిశ్రమలు స్థాపనకు ప్రభుత్వం తీసుకున్న విధానం దేశానికే ఆదర్శమని చెప్పారు. మొబైల్‌ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన డేటావిండ్‌ (టీఎస్‌ఎక్స్‌డబ్ల్యు) అత్యాధునిక తయారీ కేంద్రాన్ని శుక్రవారం శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పో ర్టులో కెనడా హై కమిషనర్‌ నాదిర్‌పటేల్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఒంటారియో దేశ ప్రధాని కాథలిన్‌ వైన్నె హైదరాబాద్‌ను సందర్శించిన కంపెనీ ఏర్పాటుకు డేటావిండ్‌ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుందన్నారు. దేశంలో రెండో కేంద్రాన్ని ఎయిర్‌పోర్టులో ప్రారంభించారని, రూ.వంద కోట్ల పెట్టుబడితో తాత్కాలిక ప్రదేశంలో ఏర్పాటు చేశారని, నిర్మాణం నెలన్నరలో పూర్తవుతుందని తెలిపారు. తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ద్ధి చేయడంలో కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విద్య అంటే డాక్టర్‌ ఇంజనీరింగ్‌ మాత్రమే కాకుండా ఐటీ రంగంలో విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు. యువత ఐటీ, డిప్లొమా కోర్సులు చదివే విధంగా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని డిజిటలైజ్‌ చేస్తున్నామని, అందులో భాగంగా విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు 3540 పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను ప్రారంబి óంచామని వివరించారు. వాటర్‌గ్రిడ్‌ పథకంలో డిజిటల్‌ విధానం అమలు చేస్తున్నా మన్నారు. ఈ కంపెనీలో మొదట విడతగా 500 మందికి ఉపాధి కల్పిస్తామని, వీరి సంఖ్యను నెలన్నర రోజుల్లో వెయ్యికి పెంచాలని నిర్ణయించామని అన్నారు. మొదటి ఏడాది 20లక్షల యూనిట్ల ఉత్పత్తి, తరువాత ఏడాది 50లక్షల యూనిట్ల ఉత్పత్తిని లక్ష్యంగా కంపెనీ పెట్టుకుందని తెలిపారు.కెనడా హైకమిషనర్‌ నాదిర్‌ పటేల్‌ మాట్లాడుతూ.. భారత్‌తో మరింత మెరుగైన సంబంధాలను కొనసాగిస్తామని తెలిపారు. ఆర్థికంగా ఆదుకో వడంతో పాటు విద్యాపరమైన అభివృద్ద్ధికి డేటావిండ్‌ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని చెప్పారు. భారతదేశంలో అతిపెద్ద మార్కెట్‌ విస్తరించి ఉన్నందున పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని అన్నారు. టాబ్‌లెట్‌ ఉత్పత్తిదారులుగా మార్కెట్‌లో వివిధ ఉత్పత్తుల శ్రేణిని ఈ కేంద్ర నుంచి కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డేటావిండ్‌ కంపెనీ సీఈఓ సునీత్‌సింగ్‌తులీ, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు సీఈఓ కిషోర్‌ పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
TEAM తప్పిదాలతో భారీ మూల్యం ఐసిసి ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది. చెత్త బౌలింగ్‌, పసలేని బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ వైఫల్యా లతో పాక్‌ చేతిలో 180 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈమ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 50ఓవర్లలో 4వికెట్లు నష్టపోయి 338పరుగులు చేసింది. పాక్‌ బ్యాట్స్‌మెన్‌లలో పకార్‌ జామన్‌ సెంచరీ(114) పరుగులతో చెలరేగగా, అజర్‌ అలీ (59), బాబర్‌ ఆజం (46), షోయబ్‌ మాలిక్‌ (12), మహ్మద్‌ హఫీజ్‌ (57 నాటౌట్‌), ఇమాద్‌ వాసిమ్‌ (25నాటౌట్‌) పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, హార్థిక్‌ పాండ్యా, కేదార్‌ జాదవ్‌లు తలో వికెట్‌ తీశారు. పాక్‌ నిర్ధేశించిన భారీలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిం డియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసిన ఆలౌటైంది. దీంతో పాక్‌ చేతిలో 180 పరుగుల భారీ తేడాతో భారత్‌ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కనీస పోరాట పటిమ చూపకుండా చేతులెత్తేయడాన్ని తీవ్రంగా పట్టుబట్టారు. అయితే టీమిండియా ఓటమికి కారణాలకు క్రికెట్‌ విశ్లేషకుల అభిప్రా యాలతో ప్రభాతవార్త ప్రత్యేక కథనం… ఫీల్డింగ్‌ ఎంచుకొని కోహీ ్లసేనభారీ మూల్యం టాస్‌ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్‌ ఎంచుకుని భారీ మూల్యం చెల్లించుకున్నాడు. టాస్‌ గెలిచిన కోహ్లీ పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. టాస్‌ అనంతరం పాక్‌ కెప్టెన్‌ సర్పరాజ్‌ మాట్లాడుతూ తాను టాస్‌ గెలిస్తే ఫీల్డింగ్‌ తీసుకుంటానని చెప్పాడు. అంతేకాదు టాస్‌ గెలిస్తే పాకిస్తాన్‌కు ఫస్ట్‌ బ్యాటింగ్‌ ఇవ్వొద్దని పాక్‌ మాజీ క్రికెట్‌ దిగ్గజం ఇమ్రాన్‌ ఖాన్‌ ఎందుకు చెప్పాడో ఓటిమి అనంతరం టీమిండియాకు తెలిసొచ్చింది. పిచ్‌ కూడా ప్లాట్‌గా, పొడిగా ఉంది. ఇలాంటి పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం ఈక్రమంలో టాస్‌ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్‌ ఎంచుకోవడం జట్టుకు తీవ్ర నష్టం చేసింది. అదే టాస్‌ గెలిచిన టీమిం డియా తొలుత బ్యాటింగ్‌ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. తొలుత బ్యాటింగ్‌ చేసి ఉంటే భారీస్కోర్‌ చేయకపోయినా 270 పరుగులు చేసినా ఫలితం ఉండేది. ఇటీవల కాలంలో పాక్‌ నిలకడలేమితోఉన్నందున ఆస్కోరునికూడా చేధిం చలేక ఒత్తిడికి లోనయ్యేది. నిజానికి టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో అదే జరిగింది. ఛేదనల్లో బాగా తడబడుతుందన్న పేరు పాకి స్తాన్‌కు ఉంది. ఆదివారం నాటి మ్యాచ్‌ కోహ్లీ మన బలాన్ని నమ్ముకోకుండా పరిస్థితులకు తగ్గట్లు వెళ్లడమే భారత్‌ ఓటమికి కారణమైంది. బూమ్రా నోబాల్‌కు మూల్యం చెల్లించుకున్న భారత్‌ నిర్లక్ష్యపు బౌలింగ్‌ కారణంగా ట ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో కూడా ఆదిలోనే భారీ మూల్యం చెల్లించుకుంది. భారత్‌ ఫేసర్‌ బూమ్రా వేసిన ఓవర్‌ తొలి బంతికి పాక్‌ ఓపెనర్‌ ఫకార్‌ కీపర్‌ ధోనికి క్యాచ్‌ఇచ్చి అవుటయ్యాడు. అంపైర్‌ కూడా అవుట్‌గా ప్రకటించాడు. దీంతో టీమిండియా అభిమానులు సంబరాల్లో మునిగారు. అయితే అంతలోనే అది నాటౌట్‌ అంటూఊ అంపైర్లు మరోమారు ప్రకటించారు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌ తొలి బంతికి నోబాల్‌ కావడంతో అంపైర్‌ ఈనిర్ణయం తీసుకున్నాడు. పసలేని భారత బౌలింగ్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ కీలకమైన ఫైనల్‌ పోరులో పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ జోరుకు భారత స్పిన్సర్లు తేలిపోయారు. భారత బౌలింగ్‌లో పస లేకపోవ డంతో పాకిస్తాన్‌ 4వికెట్లకు 339 పరుగులు చేసింది. ఓవల్‌లోని ఫ్లాట్‌ పిచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు తీసుకొని భారత్‌ బరిలోకి దిగడం అస్సలు ఫలితాన్ని ఇవ్వలేదు. కోహ్లీకి ఇంతకు మించి పెద్ద ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతను స్పినర్ల మీద ఎక్కువ ఆదారపడినట్లు కనిపించింది. ఈపరిస్థితుల్లో ఉమేశ్‌జాదవ్‌ అందుబాటులో ఉండిఉంటే పరిస్థితి కాస్తమెరుగ్గా ఉండేదని నిపుణులు అబిప్రాయం. బూమ్రా కూడ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. భువనేశ్వర్‌, హార్థిక్‌ పాండ్యా మాత్రమే పర్వా లేదనిపించారు. 40ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 247పరుగులు చేసిన పాక్‌ ఓ దశలో 350 పరుగులకు చేరుకుంటుందా..? అనిపిం చింది. అయితే, కానీ చివరకు నిర్ణీత 50 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ దూకుడును కట్టడి చేయడంలోనూ పరుగుల వరదకు అడ్డు కట్ట వేయడంలోనూ భారత స్పిన్‌ బౌలర్లు విఫల మయ్యారు. మిడిల్‌ఓవర్లలో పరుగులు అడ్డుకుం టారనుకున్న స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా…ఇద్దరూ చేతులెత్తేశారు. అశ్విన్‌, జడేజా కలిసి వేసిన 18 ఓవర్‌లో పాక్‌ బ్యాట్స్‌మెన్‌ 137పరుగులు పిండుకోవడం.. పాక్‌ను పరిమిత లక్ష్యానికి నిలువరించాలన్న టీమిండియా ఆలోచనను భారీగా దెబ్బతీసింది. డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌గా పేరొందిన బుమ్రా సైతం ఒత్తిడికితట్టుకొని నిలబడలేకపోయాడు. 9ఓవర్లు వేసిన అతను ఏకంగా 68పరుగులు సమర్పించు కున్నాడు. ఇందులో మూడు నోబాల్స్‌ ఐదు వైడ్లు ఉన్నాయి. 10ఓవర్లలో భువీ ఒక వికెట్‌ తీసుకొని..44 పరుగులిచ్చి పాక్‌ ఎదురుదాడి తోనూ తట్టుకొని నిలబడ్డాడు. ఇందులో రెండు మెయిడెన్‌ ఓవర్లు ఉన్నాయి. భువీకి కాస్తో.. కూస్తో…తోడుగా నిలిచింది హార్దిక్‌ పాండ్యా మాత్రమే. పాండ్యా ఓవర్లలో ఓ వికెట్‌ తీసుకొని 53 పరుగులు ఇచ్చాడు. భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ పాక్‌ నిర్ధేశించిన 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పాక్‌ బౌలర్‌ మహ్మద్‌ అమిర్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు దీంతో టీమిండియా ఓవర్‌ ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 2పరుగులు చేసింది, అందివచ్చిన లైప్‌ను సద్వినియోగం చేసుకోని కోహ్లీ ఆతర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లీ తొలుత లైఫ్‌ లభించినప్పటికీ దానిని సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. తొలిఓవర్‌లో రోహిత్‌ను పెవిలియన్‌కు పంపిన అమిర్‌ మూడో ఓవర్‌ నాలుగో బంతికి కోహ్లీని అవుట్‌ చేశాడు. ఒంటి చేత్తో విజయాలు అందించగల సత్తా ఉన్న టీమిండియా కెప్టెన్‌ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేరడంతో ఓటమి ఖాయమైంది. మూడు ఓవర్లు కూడా పూర్తికాకుండానే రెండు వికెట్లు కోల్పోవ డంతో భారత్‌ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఒక లైఫ్‌ ఇచ్చినప్పటికీ కోహ్లీ నిలదొక్కుకోకపోవడంతో భారత్‌ బ్యాటింగ్‌ గాడి తప్పింది. నిలకడను కోల్పోయిన తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు యువరాజ్‌ సింగ్‌తో కలిసి ఓ పెనర్‌ కాసేపు నిలకడగా ఆడినా తర్వాత జట్టు స్కోరు 33 పరుగుల వద్ద ఓపెనర్‌ శిఖర్‌ దావన్‌ కీపర్‌ సర్పరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.దీంతో భారత్‌లో కంగారు మొదలైంది. కాస్త నిలకడగా ఆడతాడనుకున్న బ్యాట్‌ ఝులిపించేందుకు ప్రయత్నించిన యువరాజ్‌ అనూహ్యంగా ఎక్కువసేపు క్రీజులో నిలవలేక పెవిలియన్‌కు చేరాడు. యువీ పెవిలియన్‌ చేరిన తర్వాత ఓవర్‌ మూడో బంతికే మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ ఇమాద్‌ వసీమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 72పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్‌ పేసర్‌ అమర్‌ విజృంభణ ఫైనల్లో పాక్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్న పేసర్‌ అమీర్‌ విజృంభణతో భారత బ్యాట్స్‌మెన్‌ బెంబేలెత్తారు. స్పాట్‌ పిక్సింగ్‌ ఆరోపనలతో ఆటకు దూరమైనా అతడి బౌలింగ్‌లో పదును తగ్గలేదు. ముగ్గురు టాప్‌ బ్యాట్స్‌మెన్లను అవుట్‌ చేసి కోలుకోలేని దెబ్బతీశాడు. అమిర్‌ బౌలింగ్‌ లోనే భారత కీలక బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ (0), దావన్‌ (21), కోహ్లీ(5)లను పెవిలియన్‌కు చేర్చాడు. హాట్రిక్‌ సిక్సర్లతో చెలరేగిన పాండ్యా భారత టాప్‌ఆర్డర్‌ విఫలమైనా పాండ్యా చెలరే గాడు. భారత స్కోరు 72/6. భారత్‌ కనీసం వంద పరుగులైనా చేస్తుందా అన్న సందేహం. అలాంటి స్థితిలో హార్థిక్‌ పాండ్యా నిలబడ్డాడు. మ్యాచ్‌ పరిస్థితులతో సంబంధం లేకుండా తనదైన శైలిలో చెలరేగిపోయాడు. ఉన్నంతసేపు విధ్వంసర బ్యాటింగ్‌తో పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. షాదాబ్‌ వేసిన ఒక ఓవర్‌లో అయితే వరుసగా హాట్రిక్‌ సిక్సర్లు, మరో ఫోర్‌ బాదాడు. హాట్రిక్‌ సిక్సర్లతో అతడి అర్థసెంచరీని పూర్తి చేశాడు. ఆరు పరుగులకే మిగతా మూడు వికెట్లు పాండ్యా గెలిపిచేస్తాడన్న ఆశలేమి కలగకపోయినా సెంచరీ అయినా కొడతాడని, ఓటమి అంతరాన్ని మరింత తగ్గిస్తాడని అభిమానులంతా భావించారు. అయితే జడేజా సింగిల్‌ కోసం పిలిచి, తర్వాత వెనక్కి తగ్గడంతో పాండ్యా రనౌటయ్యాడు. పాండ్యా అవుటైన తర్వాత భారత్‌ ఇంకో ఆరు పరుగులు మాత్రమే జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV చెర్రీ-బోయపాటి మూవీకి ముహూర్తం ఫిక్స్! రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ 'రంగస్థలం' మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అన్ని పనులు పూర్తి చేసి మార్చి నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. TNN | Updated: Nov 20, 2017, 09:17PM IST రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ 'రంగస్థలం' మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అన్ని పనులు పూర్తి చేసి మార్చి నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే జనవరి నాటికి మొత్తం షూటింగ్ అయితే పూర్తయిపోతుంది. చరణ్ తన తదుపరి చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా స్క్రిప్ట్‌ను లాక్ చేశారు. బోయపాటి స్టయిల్‌లో ఉండే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే దర్శకుడు బోయపాటి వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నాడు.
0business
Hyd Internet 89 Views Team India Team India 2018లో భారత జట్టు పర్యటన షెడ్యూల్ ను ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. 2018 జూలై 3 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్ లో టీమిండియా మూడు నెలల పాటు ఇంగ్లండ్ లో ఉండనుంది. ఈ షెడ్యూల్ లో ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడుతుంది. ఇందుకోసం సెప్టెంబర్ రెండో వారం వరకు ఇంగ్లండ్ లో టీమిండియా పర్యటించనుంది. తొలి టీ20 మ్యాచ్ జులై 3 న మాంచెస్టర్‌ వేదికగా జరగనుంది.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ‘బేవర్స్’ హీరోయిన్ హర్షిత పన్వార్ హాట్ హాట్‌గా! ‘బేవర్స్’ సినిమా హీరోయిన్.. గ్లామర్ డోస్ పెంచేసింది. తన అందాలను ఆరబెడుతూ.. కుర్రకారు మనసు దోచుకుంటోంది. Samayam Telugu | Updated: Oct 5, 2018, 05:04PM IST ‘బేవర్స్’ హీరోయిన్ హర్షిత పన్వార్ హాట్ హాట్‌గా! సంజోష్‌, హ‌ర్షిత పన్వార్ హీరో హీరోయిన్స్‌గా న‌టించిన ‘బేవర్స్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఎస్.ఎస్.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నిర్మాత‌లు పొన్నాల‌ చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్ అర‌వింద్ నిర్మించిన ఈ సినిమాకు ర‌మేష్ చెప్పాల ద‌ర్శకత్వం వహించారు. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన హర్షితా పన్వార్.. హాట్ హాట్ అందాలతో కుర్రకారను పిచ్చెక్కిస్తోంది. ఈ సినిమాలో ఆరాధ్య పాత్రలో హర్షిత కనిపిస్తుంది. జోద్‌పూర్‌కు చెందిన ఈ భామకు తెలుగులో ఇది నాలుగో చిత్రం కావడం గమనార్హం. ఇంతకు ముందు ఆమె కన్నయ్య, సత్యా గ్యాంగ్, ఖయ్యుం భాయ్ సినిమాల్లో నటించింది. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ అమ్మడికి ‘బేవర్స్’ సినిమాతోనైనా బ్రేక్ వస్తుందో లేదో చూడాలి. హర్షితా పన్వార్ మరిన్ని ఫొటోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
internet vaartha 148 Views అనిశ్చితి తప్పదంటున్న ఆర్ధికవేత్తలు న్యూఢిల్లీ : యూరోపియన్‌ కూటమి నుంచి బ్రిటన్‌ వైదొలిగే నిర్ణయంపై దీర్ఘకాలంలో బ్రిటన్‌ 2.9 లక్షలకోట్ల డాలర్ల వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతుందన్న అంచనాలున్నాయి. 28 దేశాల ఐరోపా కూటమి నుంచి వైదొలిగితే ఆదేశాలకు బ్రిటన్‌చేసే ఎగుమతులు దెబ్బతింటాయి.దిగుమతులు ఖర్చుతో కూడినవిగా మారతాయి. ఇప్పటి వరకూ ప్రపంచ ఆర్ధిక హబ్‌గా ఎదిగిన లండన్‌ ఇకపై పూర్తి ఒత్తిడికి లోనై కుప్పకూలే ప్రమాదముందని అంచనా. భారీ కార్పొరేషన్లు అన్నీ యుకెను వీడివెళతాయి. దీనివల్ల బ్రిటన్‌ ఆర్ధికవ్యవస్థకు పెద్దచిక్కు వస్తుంది. పెట్టుబడు లుకూడా గణనీయంగా తగ్గుతాయి. దేశంలో నెల కొన్న అనిశ్చితి దృష్ట్యా ఇన్వెస్టర్లకు సౌతం ఎక్కువ అనిశ్చితి ఎదురౌతుంది. సమయానుకూలంగా వ్యవ హరిస్తారు. యుకె, ఐరోపా కూటమి సంబంధాలు బ్రెగ్జిట్‌ తర్వాత ఎలా ఉంటాయన్నది చర్చనీయాం శమవుతుందని భారతీయ స్టేట్‌బ్యాంకు ప్రధాన ఆర్ధికవేత్త సౌమ్యకాంతి ఘోష్‌ పేర్కొన్నారు. బ్రెగ్జిట్‌ వల్ల ఐరోపా కూటమికి కూడా సమస్యలున్నాయి. ఎగుమతులకు బ్రిటన్‌ పెద్ద మార్కెట్‌గా ఉన్నది. అంతేకాకుండా కూటమిలోని మిగిలిన దేశాలుకూడా బ్రిటన్‌ మార్గం ఎంచుకునే ప్రమాదం లేకపోలేదు. వలసలు, ఉగ్రవాదంవంటి వాటి కారణంగా మిగిలిన దేశాలు కూడా బ్రిటన్‌ బాటపట్టే అవకాశముందని నిపుణుల అంచనా. బ్రిటన్‌ యూరోప్‌ నుంచి వైదొలిగే అంశంకంటే ఈ ప్రభావం కూటమి దేశా లపై ఎంతవరకూ ఉంటుందన్నదే ప్రస్తుతం చర్చ అని నిపుణులు చెపుతున్నారు. ఇక భారత్‌ కంపె నీల పరంగా చూస్తే యుకెలో ఉన్న భారత భారీ కంపెనీలకు ఒత్తిడి తప్పదు. టాటామోటార్స్‌ ఇప్ప టికే బ్రెగ్జిట్‌ భయాలతో గత వారం నుంచి దిగువ స్థాయిలోనే నడుస్తోంది. ఈ కంపెనీని బ్రిటన్‌ ఒక దశలో కొనుగోలుకు ఆఫర్‌ కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం బ్రెగ్జిట్‌ వ్యవహారంతో కంపెనీ షేర్లు తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి మరికొన్ని కంపెనీలకు ఒడిదుడుకులు ఎదురవుతాయి. బ్రెగ్జిట్‌ భారత్‌కు ఒకరకంగాచెప్పాలంటే కలిసొచ్చే అంశమే. బ్రిటన్‌తో వాణిజ్య సంబంధాలు పెంచుకునేందుకు దోహదం చేస్తుంది. అలాగే బ్రిటన్‌ కూడా భారత్‌తో సంప్రదింపులు పెంచుకుంటుంది. ఐరోపా కూటమి దేశాల్లో ఉన్న సమయంలో ఉన్న విపరీత నిబంధనల నుంచి స్వేఛ్ఛ లభించడంవల్ల యుకె కూడా భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెంచు కునేందుకే దేహదంచేసుందని నిపుణుల వాదన. ఫండ్‌ మేనేజర్లు కూడా బ్రెగ్జిట్‌ అయినపక్షంలో భవి ష్యత్తు వ్యూహాలను ఇపుడిపుడే సిద్ధంచేస్తున్నారు. పెట్టుబడుల బదలాయింపు బ్రిటన్‌ తదనంతర పరిస్థితులను అంచనాలను వేస్తూ ముందు బంగారంపై పెట్టుబడులకు మళ్లించే అవకాశం ఉందని అంచనా. సిటీ, డచ్‌బ్యాంక్‌, జెపి మోర్గాన్‌, గోల్డ్‌ మాన్‌ శాక్స్‌, హెచ్‌ఎస్‌బిసి, బార్‌క్లేస్‌, రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్లాండ్‌, ల్లాయిడ్స్‌వంటి సంస్థలు ఇప్పటికే 23వ తేదీ నిర్వహించనున్న రిఫరెండం ప్రభావాలను అధ్యయనం చేసేందుకు సీనియర్‌ అధికారులందరినీ బ్రిటన్‌కు పిలిపించుకుం టున్నాయి. అలాగే బ్రిటన్‌ వెంటనే వైదొలిగితే ముందు విదేశీ కరెన్సీ మార్కెట్లకు ఎక్కువ ప్రభా వం ఉంటుంది. పౌండ్‌, స్టెర్లింగ్‌లు వెంటనే క్షీణి స్తాయి. గోల్డ్‌మాన్‌ శాక్స్‌ అంచనాల ప్రకారం చూస్తే 11 శాతం తగ్గుతుందని తేలింది. అలాగే ఇతర ప్రపంచ కరెన్సీ మార్కెట్లలో కూడా ఈ ప్రభావం ఉంటుంది. భారత్‌ రూపాయి కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. గత ఏడాది ఆగస్టులో చైనా కరెన్సీ విలువలు తగ్గించిన సమయంలో ఎదుర్కొన్న రూపాయి ఒత్తిడి తరహాలోనే బ్రెగ్జిట్‌ వల్ల ఎదురుకావచ్చని తేలింది. మొత్తం మీద ఈనెల 23వ తేదీ బ్రిటన్‌లో జరిగే అభిప్రాయ సర్వే అంటే రిఫరెండమ్‌ బ్రెగ్జిట్‌కు కీలకం అవుతుందని అంచనా. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వంటి ప్రపంచ స్థాయి ఆర్ధిక సంస్థలు బ్రెగ్జిట్‌ వల్ల బ్రిటన్‌ ఆర్ధిక వ్యవస్థకే కాకుండా ఐరోపా దేశాల కూటమికి భారీ ఒడిదుడుకులు ఎదురవుతాయని హెచ్చరించాయి. ఇక భారత్‌ ప్రభావంపై ఆర్ధిక మంత్రి జయంత్‌ సిన్హా మాట్లాడుతూ బ్రిటన్‌ కనుక కూటమిని వీడి వెళ్లేందుకుఓటు వేస్తే ఎదురయ్యే పరిణామాలు ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధం అవు తోందని అన్నారు. అలాగే గత వారంలో రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ బ్రెగ్జిట్‌వల్ల అనిశ్చితి తప్పదని హెచ్చరించారు. అయితే భారత్‌ పరంగా విధివిధానాలు, దీర్ఘకాలిక రుణాలు, పుష్క లంగా ఉన్న విదేశీ కరెన్సీ నిల్వలవల్ల పెద్ద ముప్పే మీ ఉండదన్న భరోసా ఇచ్చారు.
1entertainment
admin 411 Views 0 Comment టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ పెళ్లిళ్ల విషయంలోనూ తనది ప్రత్యర్థి పంథా అని నిరూపించుకున్నాడు. కాగా 52 సంవత్సరాల వయసులో అతడు ముచ్చటగా మూడవ సారి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. కాగా ఆ వార్తలను అజ్జూ భాయ్ ఖండిస్తున్నప్పటికి ఇటీవల వెలుగు చేసిన పలు ఘటనలు మాత్రం అది వాస్తవమేనని తేటతెల్లం చేస్తున్నాయి. టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు గతంలో నౌరీన్‌ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకే ఆ పెళ్లి పెటాకులు కాగా, బాలీవుడ్‌ అందాల నటి సంగీతా బిజిలానీతో రెండవ పెళ్లి చేసుకున్నాడు. కాగా 1996లో జరిగిన ఈ పెళ్లి 2010లో విడాకులతో ముగిసింది. ఆ తరువాత 2012లో తనకు పరిచయమైన అమెరికా దేశస్థురాలు, ఫ్యాషన్‌ డిజైనేర్ షనోన్‌ మేరీని అతడు ఇటీవలే వివాహం చేసుకున్నట్లు సమాచారం.
2sports
internet vaartha 130 Views న్యూఢిల్లీ : టీమిండియాలో మంచి దూకుడు మీద ఉన్న బౌలర్‌ అశ్విన్‌పైనే పలువురు చూపు నిలిచింది.కాగా కాన్పూర్‌ టెస్టులో 10 వికెట్లు తీసుకుని టీమిండియా విజయానికి పునాది వేసిన అశ్విన్‌ విన్యాసంపైనే ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే రెండవ టెస్ట్‌ మ్యాచ్‌ విజయంపై ధీమా కనిపిస్తుంది.కాగా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్న అశ్విన్‌ ఈడెన్‌లో విజృంభించి జట్టు గెలుపునకు కృషిచేస్తే టీమిండియా టాప్‌ పోజిషన్‌కు వెళ్తుంది.టెస్టుల్లో అగ్రస్థానాన్ని తిరిగి పొందే అవకాశం భారత్‌ జట్టు ముందు నిలిచింది.కాన్పూర్‌ టెస్ట్‌ విజయం సాధించి ఊపు మీద ఉన్న భారత్‌ కోల్‌కతా లో జరుగనున్న రెండవ టెస్టులోను విజయం సాధిస్తే టెస్టుల్లో తిరిగి టీమిండియా అగ్ర స్థానానికి చేరుకునే వీలుంది.ప్రస్తుతం తొలి స్థానంలో ఉన్న పాక్‌ కంటే టీమిండియా ఒక్క పాయింట్‌ మాత్రమే వెనుకబడి ఉంది.కివీస్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ ను కైవసం చేసుకుంటే టీమిండియా టాప్‌ పోజిషన్‌కు తిరుగుండదు.కాన్పూర్‌ టెస్టులో పది వికెట్లు తీసి అశ్విన్‌ బౌలర్ల జాబితాలో రెండవ స్థానానికి ఎగబాకాడు.కివీస్‌ విజయంతో కీలక పాత్ర పోషించిన ఇతడు ఇక్క పాయింట్‌ తేడాతో జేమ్స్‌ అండర్సన్‌ను వెనక్కి నెట్టాడు.ప్రస్తుతం దక్షిణాఫ్రికా బౌలర్‌ డేయిల్‌ స్టేయిన్‌ మాత్రమే అశ్విన్‌ కంటే ముందున్నాడు. కోల్‌కతా టెస్టులోనూ ఈ స్పిన్నర్‌ విజృంభించి ఆడితే ఈ ఏడాది మరో సారి టెస్టుల్లో నంబర్‌ 1 బౌలర్‌ స్థానాన్ని కైవసం చేసుకోనున్నాడు.గత సంవత్సరం చివరలో జరిగిన బాక్సింగ్‌ టెస్టు ద్వారా అశ్విన్‌ ఈ సంవత్సరం ఆరంభంలో నంబర్‌ 1 బౌలర్‌గా ఎదిగాడు. కాన్పూర్‌ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 40 పరుగులు చేసిన ఇతను ఆల్‌రౌండర్ల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. అశ్విన్‌ కాన్పూర్‌లో చేసిన మ్యాజిక్‌ మళ్లీ చేస్తే భారత జట్టుకు టెస్ట్‌ల్లో నంబర్‌ 1 హోదాతో పాటు బౌలింగ్‌లో కూడా అతను టాప్‌ పోజిషన్‌కు చేరుకుంటాడు.బ్యాట్స్‌మెన్‌ జాబితాలో కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ టెస్ట్‌ల్లో రెండవ స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్మిత్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మిగతా రెండు టెస్టుల్లో సత్తా చాటితే విలియమ్సన్‌ తొలి స్థానానికి చేరిపోయే వీలుంది.లేదా స్మిత్‌ పాయింట్లతో అంతరాన్ని బాగా తగ్గించుకోవచ్చు. కాగా రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన పుజారా-విజయ్ సంయుక్తంగా 20వ స్థానం నుంచి 16వ స్థానానికి చేరుకున్నారు.
2sports
పోర్చ్‌గీసు ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం పోర్టో సాల్వో| పుత్తా యర్రం రెడ్డి| పోర్చ్‌గీసులో విద్యావాప్తికి అవసరమైన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించడంలో మైక్రోసాఫ్ట్, ఆ దేశ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్, పోర్చుగీసు ప్రధాన మంత్రి జోస్ సోక్రేట్స్‌ల మధ్య శుక్రవారం తుది విడత చర్చలు జరిగాయి. అదే సమయంలో ఒప్పంద పత్రాలపై ఇరువురు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం విద్యారంగంలో సాంకేతికతను పెంపొందించుకోనున్నారు. పోర్చగీసు ప్రభుత్వ సాయంతో మైక్రోసాఫ్ట్ సంస్థ 'ఈ-ఎస్కోలినాస్' కార్యక్రమాన్ని ఆరంభిస్తోంది. దీనికి మైక్రోసాఫ్ట్‌ మగెలాన్ లెర్నింగ్ సూట్ అని పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశారు. వివిధ స్థాయిలలోని విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు పోర్టబుల్ కంప్యూటర్‌ను సిద్ధం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా 5 బిలియన్ల మంది జనం ఈ సాంకేతికతను పొందాల్సి ఉందని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ తెలిపారు. సంబంధిత వార్తలు
1entertainment
హోమ్ క్రీడలు బీచ్ లో సందడి చేసిన టీమిండియా బీచ్ లో సందడి చేసిన టీమిండియా August 21, 2019,   4:38 PM IST Share on: రేపటి నుంచి వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ మొదలుకానున్న నేపథ్యంలో కోహ్లీ సేన ఒత్తిడిని పక్కన పెట్టి బీచ్‌లో కొద్దిసేపు సరదాగా గడిపింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, రోహిత్‌ శర్మ, ఇషాంత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మయాంక్ అగర్వాల్‌, సహాయ సిబ్బంది బీచ్‌లో జాలీగా ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన చిత్రాలను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచాడు. బీచ్‌లో ఆటగాళ్లతో ఇదో ఓ అద్భుతమైన రోజు అంటూ ట్యాగ్‌ చేశాడు. సంబంధిత వార్తలు
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV గంభీర్‌కు ఇండోర్ టెస్టే ఆఖరిదా..? భారత డాషింగ్ ఓపెనర్ గౌతం గంభీర్ చాలా విరామం తరవాత జాతీయ జట్టులోకి వచ్చాడు. TNN | Updated: Oct 7, 2016, 04:55PM IST భారత డాషింగ్ ఓపెనర్ గౌతం గంభీర్ చాలా విరామం తరవాత జాతీయ జట్టులోకి వచ్చాడు. కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ గాయపడటంతో శనివారం నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టెస్టులో గంభీర్ ఆడనున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా శుక్రవారం ఈ విషయాన్ని ఖరారు చేశాడు. అయితే గంభీర్‌కు ఇండోర్ టెస్టే ఆఖరిదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ 34 ఏళ్ల ఎడమచేతి బ్యాట్స్‌మెన్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ముగించడానికి ఇది మంచి అవకాశమనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు ఇండోర్‌లోని హోల్కార్ స్టేడియంలో జరుగుతున్న రెండు రోజుల ప్రాక్టీస్ సెషన్‌లో గంభీర్ పాల్గొన్నాడు. శుక్రవారం నెట్స్‌లో సుమారు రెండు గంటలపాటు కష్టపడ్డాడు. పేస్, స్పిన్ బౌలింగ్‌లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. సుమారు రెండేళ్ల క్రితం అంటే 2014లో ఓవల్‌లో జరిగిన టెస్టులో గంభీర్ చివరిగా ఆడాడు. ఆ మ్యాచ్‌లో గౌతం ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా రెండో ఇన్నింగ్స్‌లో 3 పరుగులకే పరిమితమయ్యాడు. అంతకు ముందు ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు చేశాడు. ఆ తరవాత జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు. దీంతో గంభీర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే అనుకున్నారు. అయితే తాజాగా ఐపీఎల్, దులీప్ ట్రోఫీల్లో గంభీర్ మళ్లీ ఫాంలోకి రావడం, ఆరుసార్లు 50పైగా పరుగులు సాధించడంతో మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు. కోల్‌కతా టెస్టులో శిఖర్ ధావన్ ఆడటంతో గంభీర్‌కు అవకాశం రాలేదు. మరి ఇప్పుడొచ్చిన అవకాశాన్ని గంభీర్ అందిపుచ్చుకుంటాడో లేక ఇదే తన ఆఖరి టెస్టుగా మార్చుకుంటాడో చూడాలి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ​ భారత మణికట్టు స్పిన్నర్లే దెబ్బతీశారు ఇండోర్ టీ20లో భారత మణికట్టు స్పిన్నర్ల బౌలింగ్‌ను ఛేదించడం కష్టమైందని శ్రీలంక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కుశాల్ పెరీరా నిరాశ వ్యక్తం TNN | Updated: Dec 23, 2017, 03:56PM IST ​ భారత మణికట్టు స్పిన్నర్లే దెబ్బతీశారు ఇండోర్ టీ20లో భారత మణికట్టు స్పిన్నర్ల బౌలింగ్‌ను ఛేదించడం కష్టమైందని శ్రీలంక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కుశాల్ పెరీరా నిరాశ వ్యక్తం చేశాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 261 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 17.2 ఓవర్లలోనే 172 పరుగులకు కుప్పకూలిపోయింది. ఆ జట్టులో కుశాల్ పెరీరా (77: 37 బంతుల్లో 4x4, 7x6) హిట్టింగ్‌తో కాసేపు భారత బౌలర్లని కంగారుపెట్టినా.. చివరికి కుల్దీప్ యాదవ్ అతడ్ని బోల్తా కొట్టించి లంక పతనాన్ని వేగవంతం చేశాడు. మ్యాచ్‌లో చెరో నాలుగేసి ఓవర్లు బౌలింగ్ చేసిన భారత మణికట్టు స్పిన్నర్లు చాహల్ (52/4) కుల్దీప్ యాదవ్ (52/3) కెరీర్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
2sports
Indian squad for West Indies tour వెస్టిండీస్‌ పర్యటనకు భారత్ జట్టు ప్రకటన జులై 23 నుంచి వెస్టిండీస్‌తో ఐదు వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. TNN | Updated: Jun 15, 2017, 04:32PM IST ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం వెస్టిండీస్‌ పర్యటన కోసం భారత్ జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. జులై 23 నుంచి వెస్టిండీస్‌తో ఐదు వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్‌ నుంచి ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రాకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. వారి స్థానంలో యువ వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేసినట్లు సెలక్టర్లు వెల్లడించారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున రిషబ్ పంత్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున కుల్దీప్ యాదవ్ మెరుగ్గా రాణించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే ఈ పర్యటనకి కొనసాగుతారని బీసీసీఐ స్పష్టం చేసింది. వెస్టిండీస్ పర్యటనకు 15 మంది‌తో కూడిన జట్టు ఇదే.. విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, అజింక్య రహానె, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), యువరాజ్ సింగ్, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, దినేశ్ కార్తీక్
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఎట్టకేలకు డీఆర్‌ఎస్‌కు ఓకే చెప్పిన బీసీసీఐ! నవంబర్ 6న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రయోగాత్మకంగా డీఆర్ఎస్ టెక్నాలజీని వాడేందుకు బీసీసీఐ అంగీకరించింది. TNN | Updated: Oct 21, 2016, 04:53PM IST ఎట్టకేలకు డీఆర్‌ఎస్‌కు ఓకే చెప్పిన బీసీసీఐ! డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) పట్ల మొదటి నుంచి విముఖంగానే ఉన్న బీసీసీఐ ఈ విషయంలో కాస్త మెత్తబడింది. వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో ఆరంభం కానున్న టెస్టు సిరీస్‌లో డీఆర్ఎస్‌ను ఉపయోగించనున్నట్లు తెలిపింది. డీఆర్ఎస్‌ను ప్రయోగాత్మకంగా వాడటం కోసం, దానికి మరిన్ని మెరుగులు దిద్దేందుకు ఏమేం చేయాలో సూచించడం కోసం బీసీసీఐ ఈ సిరీస్‌ను ఉపయోగించుకోనుంది. డీఆర్‌ఎస్‌కు మెరుగులు అద్దడం కోసం బీసీసీఐ, హాక్‌ఐ, ఐసీసీ అధికారులు సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సిరీస్‌లలో చివరిసారిగా 2008లో శ్రీలంకతో సిరీస్ సందర్భంగా బీసీసీఐ డీఆర్ఎస్‌ను ఉపయోగించింది. అప్పటి నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లలో మళ్లీ ఈ టెక్నాలజీని వాడలేదు. వరల్డ్ కప్ లాంటి మేజర్ టోర్నీల్లో మాత్రం భారత్ డీఆర్ఎస్‌ను ఉపయోగిస్తోంది. డీఆర్ఎస్‌ను మెరుగుపర్చడం కోసం భారత్ సిఫారసు చేసిన అన్ని అంశాలనూ హాక్‌ఐ సంస్థాగతంగా డీఆర్ఎస్‌లో పొందుపర్చింది. దీంతో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో మెరుగుపర్చిన డీఆర్ఎస్‌ను ప్రయోగాత్మకంగా వాడేందుకు అంగీకరించామని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. డీఆర్ఎస్ విషయంలో సంతృప్తి చెందితే, దాని గురించి ఫీడ్‌బ్యాక్ సానుకూలంగా వస్తే రాబోయే సిరీస్‌లలో వాడే విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. మైదానంలోని అంపైర్లు తీసుకునే నిర్ణయాన్ని సమీక్షించే టెక్నాలజీయే డీఆర్ఎస్. అంపైర్ల నిర్ణయం వివాదాస్పదం అయినప్పుడు, బ్యాట్స్‌మెన్ అవుటయ్యాడో లేదో తెలుసుకోవడం కోసం ఈ విధానం ద్వారా రివ్యూకు వెళ్లే వీలుంది. దీన్ని తొలిసారిగా 2008లో భారత్-శ్రీలంక టెస్టు సందర్భంగా వినియోగించారు. అయితే ఐసీసీ అధికారికంగా 2009 నవంబర్లో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన టెస్టులో డీఆర్ఎస్‌ను ఉపయోగించింది. మేజర్ టోర్నీల్లో దీని వాడకాన్ని తప్పనిసరి చేయగా, ద్వైపాక్షిక సిరీస్‌లలో దీన్ని ఆప్షనల్ చేశారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Also Read: ‘ఏడు చేపల కథ’ రివ్యూ: టెంప్ట్ అయ్యారో..! అయితే, ఇంత హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకులు దేని కోసం అయితే వెళ్లారో ఆ కంటెంట్ సినిమాలో లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. సినిమా చూసి బయటకు వచ్చిన తరవాత వాళ్ల ముఖాలు చూసి నవ్వాలో, బాధపడాలో అర్థంకాదు. టిక్కెట్ డబ్బులకు అస్సలు న్యాయం జరగలేదనే ఫీలింగ్ ఒకపక్క.. ‘ఏం చెప్పారు, ఏం చూపించారురా అయ్యా..’ అనే కోపం మరోపక్క. ఈ ఫస్ట్రేషన్‌లో హీరో, దర్శకనిర్మాతలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. అసలుసిసలైన బూతులతో తిట్టారు. Also Read: మా నిర్మాతకు చెవుడు.. సెక్స్ సినిమాతో సెన్సారోళ్లకు చుక్కలు: ‘ఏడు చేపల కథ’ హీరో వాస్తవానికి టీజర్లు, ట్రైలర్ చూసిన ఎవరైనా ఈ సినిమా గురించి మాట్లాడకుండా ఉండరు. అంత ఘోరంగా చూపించారు. ఒకప్పటి షకీలా సినిమాల కన్నా దారుణంగా చూపించారు. దీంతో అలాంటి సినిమాలు చూసే ప్రేక్షకులు తెగ ఆరాటపడ్డారు. కానీ, సెన్సార్ బోర్డు మాత్రం ఆ సీన్లన్నింటినీ కట్ చేసి పారేసింది. ఇక ఎలాగూ ఆ సీన్లన్నీ ట్రైలర్‌లో చూపించాం కదా.. సినిమాలో మిగిలిన కంటెంట్ చూపిస్తే చాలులే అనుకున్నారేమో దర్శక నిర్మాతలు. ఆ విషయాలేమీ బయటపెట్టకుండా మంచి హైప్ క్రియేట్ చేసి సినిమాను విడుదల చేశారు. ఈ విషయం తెలియక ఎగబడి థియేటర్లకు వెళ్లినవాళ్లు తీవ్ర నిరాశతో బయటికి వస్తున్నారు. ‘ఏడు చేపల కథ’ పబ్లిక్ టాక్ X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV గోపీచంద్ కొత్త సినిమా సంగతేంటి? మాస్ యాక్షన్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని నాలుగో షెడ్యూల్‌ను ప్రారంభించుకోనుంది. TNN | Updated: Jan 18, 2017, 04:27PM IST మాస్ యాక్షన్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని నాలుగో షెడ్యూల్‌ను ప్రారంభించుకోనుంది. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ నాలుగో షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావులు మాట్లాడుతూ.. "థాయ్ ల్యాండ్, హైద్రాబాద్ లో మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇక నేటి నుంచి మొదలై ఫిబ్రవరి 20 వరకూ జరగనున్న నాలుగో షెడ్యూల్ లో హీరోహీరోయిన్లు గోపీచంద్-రాశీఖన్నా-కేతరీన్ లపై కాంబినేషన్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసేందుకు దర్శకుడు సంపత్ నంది సన్నాహాలు చేసుకొంటున్నారు.
0business
internet vaartha 203 Views రియో డి జెనిరో : బ్రెజిల్‌లో జరుగనున్న ఒలింపిక్స్‌ టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి. కాగా ఆగస్టు 5 నుంచి 21 వరకు రియోడి జెనిరోలో ఈ క్రీడోత్సవాలు జరుగుతాయి. వాటి టికెట్లను స్థానిక దుకాణాల్లో తొలిసారి విక్రయానికి పెట్టినట్లు ఒలింపిక్స్‌ నిర్వాహకలు పేర్కొన్నారు.ఇంతకు ముందు బ్రిజిల్‌ వాసులకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లు అందుబాటులో ఉండేవి, ఇప్పుడు రియోలోని రెండు షాపింగ్‌ మాల్స్‌లో కూడా వాటిని విక్రయానికి పెట్టారు. కాగా రాబోయే వారాల్లో రియోతోపాటు ఒలింపిక్స్‌ పుట్‌ బాల్‌ మ్యాచ్‌లు జరిగే సావో పాలో,బెలో హారిజాంట్‌,సాల్వడార,బ్రసీలియా,మనౌస్‌ నగరాల్లో 30 టికెట్‌ కౌంటర్లను త్వరలో ప్రారంభిస్తామని చెబుతున్నారు. టికెట్‌ కౌంటర్ల వద్ద భారీగా రష్‌ ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నామని,అందువల్ల  బ్రిజిల్‌ వాసులు చిట్ట  చివరి నిముషం వరకు ఆగకుండా ముందే టికెట్లు కొనుగోలు చేయాలని సూచించారు. వెబ్‌ సైట్‌లో ఉన్న ధరలకే టికెట్‌ కౌంటర్లలో కూడా విక్రయిస్తున్నారో లేదో జాగ్రత్తగా చూసుకోవాలని, అధిక ధర చెల్లించాల్సిన అవసరం లేదని,ఇప్పటికే 42 లక్షల టికెట్లు విక్రయించామని,మరో 18 లక్షల టికెట్లు మాత్రమే ఉన్నాయని, ఒలింపిక్‌ టికెట్ల ధరలు ఆయా క్రీడాంశాలను బట్టి 800 నుంచి కొన్ని వేల వరకు ఉన్నాయి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV దక్షిణాఫ్రికాలోనూ భారత్‌ హవా సాగుతుంది దక్షిణాఫ్రికా పర్యటనలోనూ భారత్ విజయాల జోరు కొనసాగుతుందని టెస్టు జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్/ వికెట్ కీపర్ TNN | Updated: Dec 19, 2017, 02:28PM IST దక్షిణాఫ్రికాలోనూ భారత్‌ హవా సాగుతుంది దక్షిణాఫ్రికా పర్యటనలోనూ భారత్ విజయాల జోరు కొనసాగుతుందని టెస్టు జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్/ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ధీమా వ్యక్తం చేశాడు. జనవరి 5 నుంచి సఫారీలతో భారత్ జట్టు మూడు టెస్టుల సిరీస్‌ని ఆడనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా గడ్డపై కోహ్లిసేన విజయావకాశాల గురించి మీడియాతో సాహా మంగళవారం మాట్లాడాడు. దేశవాళీ టోర్నీ.. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున మ్యాచ్‌లు ఆడుతూ సాహా మునుపటి ఫామ్‌ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ‘భారత్ జట్టు గత రెండు మూడేళ్లుగా అద్వితీయ ఆటతో వరుస సిరీస్‌ విజయాలు సాధిస్తోంది. ఇదే ఆటతీరుని దక్షిణాఫ్రికా గడ్డపై కూడా కొనసాగించగలిగితే.. కచ్చితంగా టీమిండియా అద్భుతాలు చేయగలదు. నాకు తెలిసి టెస్టు సిరీస్‌లో భారత్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీలంకతో టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత.. దక్షిణాఫ్రికా పర్యటన గురించి జట్టులో ఇంతవరకు చిన్న చర్చ కూడా జరగలేదు’ అని సాహా వివరించాడు. ఇటీవల స్లిప్‌ క్యాచ్‌ల్ని భారత ఫీల్డర్లు జారవిడచడంపై మాట్లాడుతూ ‘క్యాచ్‌లు చేజారడం మ్యాచ్‌ల్లో మామూలే. బెస్ట్ ఫీల్డర్లుగా పేరొందిన క్రికెటర్లు కూడా కొన్ని క్యాచ్‌లని జారవిడిచిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి’ అని సాహా గుర్తు చేశాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
ASWIN అశ్విన్‌ కుటుంబంలో విషాదం న్యూఢిలీ: టీమిండియా ప్రధాన స్పిన్నర్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌ ఇంట్లో విషాదం నెలకొంది. అశ్విన్‌ తాతయ్య ఎస్‌ నారాయణ స్వామి(92) మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారయణ స్వామి మృతిచెందారు. ఆయన సదరన్‌ రైల్వేలో ఉద్యోగి. అశ్విన్‌ క్రికె టర్‌గా ఎదిగే క్రమంలో నారయణ స్వామి పాత్ర చాలాఉంది. ఆయ నకు క్రికెట్‌ అంటే విపరీతమైన ప్రేమ. తన తాతను చివరి చూపుకూడా చూసుకునే పరిస్థితి అశ్విన్‌కు లేకుండా పోయింది. ప్రస్తుతం అశ్విన్‌ ఇంగ్లండ్‌ పర్య టనలో ఉన్నారు. ప్రతిష్టాత్మక చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టులో అశ్విన్‌ సభ్యుడు కావడంతో అతను తిరిగి భారత్‌కు వచ్చే అవకాశం లేకుండా పోయింది. న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌కు ముందు అశ్విన్‌కు తాత మృతిచెందిన వార్తను చేరవేశారు. దాందో ఆమ్యాచ్‌లో బాధను దిగమింగుకొని అశ్విన్‌ పాల్గొన్నారు.
2sports
Visit Site Recommended byColombia ‘ఆకు చాటు పిందె తడిసె..’ పాటలో రకుల్.. బాలయ్యతో ఆడిపాడనుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర కేవలం 20 నిమిషాలు మాత్రమే. ఇందుకు ఆమె రూ.2 కోట్లు చెల్లిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే, ఎన్టీఆర్ సినిమాల్లో బాగా పాపులరైన మరో పాట ‘ఆరేసుకో బోయి పారేసు కున్నాను హరీ’. ఈ పాటలో ఎన్టీఆర్ జయప్రదతో ఆడిపాడతారు. ఈ నేపథ్యంలో ‘యన్.టి.ఆర్’ మొదటి పార్టులో ఈ పాటను కూడా పెట్టాలని భావిస్తున్నారు. చిత్రయూనిట్ సమాచారం ప్రకారం.. జయప్రద పాత్ర కోసం మిల్కీబ్యూటీ తమన్నా పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే వరకు సస్పెన్సే. మరి, తమన్నా ఆ పాత్రకు ఎంతవరకు న్యాయం చేయగలదో చూడాలి. ‘యన్.టి.ఆర్ కథానాయకుడు 2019, జనవరి 9న, ‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ జనవరి 24న విడుదల కానున్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Aam Aadmi Beema Yojana:నిరుపేద‌ల ప్ర‌యోజ‌నం కోసం ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న‌ భార‌త ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న‌(ఏఏబీవై) , జ‌న శ్రీ బీమా యోజ‌న లాంటి సామాజిక భ‌ద్ర‌తా ప‌థ‌కాల‌ను విలీనం చేశారు. విలీన‌మైన ప‌థ‌కానికి "ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న" అని పేరు పెట్టారు. Samayam Telugu | Updated: May 23, 2018, 03:05PM IST ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న దేశం ఎంత అభివృద్ది చెందుతున్నా నిరుపేద‌లు లేకుండా త‌యారుకావ‌డం లేదు. అలాంటి వారికి ఆస‌రాగా ఉండేందుకు కేంద్రం ఎన్నో బీమా ప‌థ‌కాల‌ను తీసుకొచ్చింది. ఇదే క్ర‌మంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఎన్నో బీమా ప‌థ‌కాలు వ‌చ్చాయి. భార‌త ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న‌(ఏఏబీవై) , జ‌న శ్రీ బీమా యోజ‌న లాంటి సామాజిక భ‌ద్ర‌తా ప‌థ‌కాల‌ను విలీనం చేశారు. విలీన‌మైన ప‌థ‌కానికి "ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న" అని పేరు పెట్టారు. రాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్ర పాలిత ప్రాంతం ఈ ప‌థ‌కానికి నోడ‌ల్ ఏజెన్సీగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా, ఈ ప‌థ‌కంలో బీమా పొందే వారి త‌ర‌పున వ‌కాల్తా పుచ్చుకున్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంది. ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న ద్వారా ఎటువంటి ఆర్థిక ఆస‌రా లేని, గ్రామీణ ప్రాంతాల్లోని అసంఘ‌టిత రంగంలో వారు ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు. ఈ ప‌థ‌కాన్ని ఎల్ఐసీ నిర్వ‌హిస్తోంది. నిరుపేద‌ల‌కు ప్ర‌భుత్వం అందించే ఈ బీమా ప్ర‌యోజ‌నం గురించి మ‌రిన్ని వివ‌రాలు మీ కోసం.. అర్హ‌త‌ బీమా చేయించుకునే వ్య‌క్తి 18 నుంచి 59 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సు క‌లిగి ఉండాలి. ఆ వ్య‌క్తి భూమి లేని గ్రామీణ కుటుంబ పెద్ద, లేదా ఆ కుటుంబంలో సంపాదించే వ్య‌క్తి అయి ఉండాలి. అవ‌స‌ర‌మైన ప‌త్రాలు(వ‌య‌సుకు సంబంధించిన రుజువులు) రేష‌న్ కార్డు పుట్టిన తేదీకి సంబంధించి రిజిస్టర్‌లోనిది పాఠ‌శాల స‌ర్టిఫికేట్లో పుట్టిన తేదీ రుజువు వోట‌ర్ జాబితాలో పేరు ప్ర‌భుత్వం లేదా పేరున్న సంస్థ‌లు జారీ చేసే రుజువు ఆధార్ కార్డు ప్ర‌యోజ‌నాలు కాల‌వ్య‌వ‌ధి ముగియ‌క‌ముందే హ‌ఠాత్తుగా మ‌ర‌ణిస్తే, బీమా చేయ‌బ‌డిన మొత్తం రూ.30 వేల‌ను నామినీకి అందజేస్తారు. భూమి లేన నిరుపేద‌లు, దారిద్ర్య రేఖ‌కు దిగువ‌న ఉన్న వారు ఎవ‌రైనా ఈ ప‌థ‌కానికి అర్హులు. అతి త‌క్కువ ప్రీమియంతో గౌర‌వ‌ప్ర‌ద‌మైన సొమ్మును అందుకుంటారు. ప్ర‌యోజ‌నాలు ప్ర‌మాద ప్ర‌యోజ‌నాలు: బీమా చేయించుకున్న వ్య‌క్తి ప్ర‌మాదం కార‌ణంగా మ‌ర‌ణించినా, ప్ర‌మాదంలో పూర్తి లేదా పాక్షిక అంగ‌వైక‌ల్యం పొందినా ఈ కింద విధంగా ప్ర‌యోజ‌నాలు అందిస్తారు. ప్ర‌మాదం కార‌ణంగా మ‌ర‌ణిస్తే రూ.75,000 ప్ర‌మాదం వ‌ల్ల పూర్తి, శాశ్వ‌త అంగ‌వైక‌ల్యం క‌లిగితే రూ. 76,000 ప్ర‌మాదంలో రెండు క‌ళ్లూ, రెండు అవ‌య‌వాలూ, లేదా ఒక క‌న్ను, ఒక కాలు, ఒక చేయి వీటిలో ఒక‌టి కోల్పోతే రూ. 75,000 ఒక క‌న్ను లేదా ఒక కాలు, ఒక చెయ్యి వీటిలో ఏదో ఒక‌టి పోగొట్టుకున్న సంద‌ర్భంలో రూ.37,500 ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న ఉప‌కార వేత‌నాలు ఈ బీమా ప‌థ‌కం కింద దీనిలోని స‌భ్యుల పిల్ల‌ల‌కు ఉప‌కార‌వేత‌నం రూపంలో ఒక అద‌న‌పు ఉచిత ప్ర‌యోజ‌నం వ‌స్తుంది. ఇద్ద‌రికి మించ‌కుండా 9 నుంచి 12 త‌ర‌గ‌తులు చ‌దువుతున్న పిల్ల‌ల‌కు నెల‌కు రూ. 100 చొప్పున ఉప‌కార వేత‌నం అందుతుంది. ఈ మొత్తాన్ని ఆరు నెల‌ల‌కోసారి ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 1న‌, జులై 1న చెల్లిస్తారు. ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న స్కాలర్ షిప్ పిల్ల‌ల‌కు ఉప‌కార వేత‌నం అందేందుకు ఏం చేయాలి... ఉప‌కార వేత‌నానికి అర్హుడైన స‌భ్యుని పిల్ల‌ల ఉప‌కార వేత‌నం కోసం ఆరు నెల‌ల‌కోసారి ఒక విన‌తి ప‌త్రాన్ని నోడ‌ల్ ఏజెన్సీకి స‌మ‌ర్పించాలి. నోడ‌ల్ ఏజెన్సీ విద్యార్థుల‌ను గుర్తిస్తుంది. నోడ‌ల్ ఏజెన్సీ విద్యార్థి పేరు, పాఠ‌శాల పేరు, త‌ర‌గ‌తి, స‌భ్యుని పేరు, మాస్ట‌ర్ పాల‌సీ సంఖ్య‌, స‌భ్య‌త్వ సంఖ్య మ‌రియు ప్ర‌త్య‌క్ష చెల్లింపు కోసం నెఫ్ట్ వివ‌రాలు వంటి పూర్తి వివ‌రాల‌తో ల‌బ్ధిదారు విద్యార్థుల జాబితా పీ అండ్ జీఎస్ యూనిట్‌కి స‌మ‌ర్పిస్తుంది. ప్ర‌తి ఆరు నెల‌ల‌కు, జులై 1 మ‌రియు జ‌న‌వ‌రి 1, ప్ర‌తి సంవ‌త్స‌రం ఎల్ఐసీ నెఫ్ట్ ద్వారా ల‌బ్ధిదారు విద్యార్థుల ఖాతాకు ఉప‌కార వేత‌నాన్ని చెల్లిస్తుంది. ఎల్ఐసి/ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉపకారవేతన చెల్లింపులో ఏదైనా ఇతర విధానం భవిష్యత్తులో వర్తించవచ్చు నోడ‌ల్ ఏజెన్సీ "నోడల్ ఏజన్సీ" అంటే కేంద్ర మంత్రివర్గ శాఖ/రాష్ట్ర ప్రభుత్వం/ భారత కేంద్ర పాలిత ప్రాంతాలు/ఇతర సంస్థాగతమైన ఏర్పాట్లు/ఏదైనా నమోదిత NGO నిబంధనల ప్రకారం పథకం అమలు జరిపేందుకు నియమించింది. "ఇళ్లు లేని గ్రామీణుల" విషయంలో, నోడల్ ఏజెన్సీ అంటే రాష్ట్ర ప్రభుత్వం/పథకం అమలు జరిపేందుకు నియమించిన కేంద్ర పాలిత ప్రాంతం అని అర్థం. ఆమ్ ఆద్మీ బీమా యోజన పాల‌సీ ప్ర‌యోజ‌నం పొందేందుకు ఇలా చేయాలి? పథకం కింద మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు లబ్ధిదారులకు LIC P & GS యూనిట్ ద్వారా నేరుగా NEFT ద్వారా చెల్లింపులు చేస్తారు. NEFT సౌకర్యం అందుబాటులో లేకపోతే LIC అధికారుల అనుమతితో అర్హులైన లబ్ధిదారుకు బ్యాంకు ఖాతా చెల్లింపు చెక్ లేదా ఇతర క్లెయిమును పద్ధతుల ద్వారా చెల్లింపు చేయవచ్చు. పరిధి వ్యవధి సమయంలో మరియు పాలసీ అమలులో ఉన్నప్పుడు సభ్యుడు మరణిస్తే, అతని/ఆమె నియుక్తుడు (నామినీ) నోడల్ ఏజెన్సీ నియమించిన అధికారికి సొమ్ము చెల్లించమని మరణ దృవపత్రంతో పాటు ధరఖాస్తు చేసుకోవాలి. నోడల్ ఏజెన్సీ నియమించిన అధికారి దావా పత్రాలు ధ్రువీకరించాలి మరియు మరణ దృవపత్రం మరియు మరణించిన సభ్యుడు అర్హమైన వృత్తుల క్రింద బిపిఎల్/బిపిఎల్ కంటే స్వల్పంగా ఎక్కువ కుటుంబానికి చెందిన పెద్ద/సంపాదించే సభ్యుడు అనే దృవపత్రం సమర్పించాలి. కింది అవసరమైన వివరాలతో పాటు నోడల్ ఏజెన్సీకి వినతి పత్రాన్ని సమర్పించాలి: అన్ని విధాలుగా పూర్తిచేసిన దావా పత్రం ధృవీకరించిన కాపీతో పాటు అసలు మరణ దృవీకరణ పత్రం. ప్రమాద భీమా ప్రయోజనం విషయంలో క్రింది అదనపు అవసరాలు మరణ నమోదు సర్టిఫికెటుతో పాటు సమర్పించాలి: ఎఫ్ఐఆర్ కాపీ
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV పుణెలో కివీస్ ఓటమికి కారణమిదే..? పుణెలో బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ ఓటమి కారణం.. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను TNN | Updated: Oct 26, 2017, 12:10PM IST పుణెలో బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ ఓటమి కారణం.. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను చేజార్చుకోవడమేనని కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ అభిప్రాయపడ్డాడు. పిచ్ నుంచి సహకారం లభించడంతో భారత ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా వరుసగా మార్టిన్ గప్తిల్ (11), విలియమ్సన్ (3), కోలిన్ మున్రో (10) వికెట్లను పడగొట్టారు. దీంతో 7 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 27/3తో కష్టాల్లో పడింది. ఇలా వికెట్లు చేజార్చుకోవడంతోనే ఎక్కువ స్కోరుని భారత్‌ ముందు ఉంచలేకపోయామని.. ఇదే కివీస్‌ విజయావకాశాల్ని దెబ్బతీసిందని శాంట్నర్ వివరించాడు. ‘మొదట బ్యాటింగ్ చేస్తున్న జట్టు తొలి 10 ఓవర్లలోనే మూడు ప్రధాన వికెట్లను చేజార్చుకుని.. తిరిగి మ్యాచ్‌లో పుంజుకోవడం చాలా కష్టం. పుణె వన్డే ఆరంభంలోనే 27/3తో మా జట్టు ప్రదర్శన చాలా నిరాశ కలిగింది. ఇక్కడ ఘనత అంతా భారత పేసర్లకే దక్కాలి. పదునైన బౌలింగ్‌తో వారు కివీస్‌ని ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో మా జట్టు చివరికి 230 పరుగులకే పరిమితమయ్యింది. ఇక్కడే దాదాపు మ్యాచ్ చేజారినట్లే. ఇక ఛేదనలో శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్ చివరి వరకూ క్రీజులో నిలిచి కివీస్‌కి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పని పూర్తి చేశారు’ అని శాంట్నర్ వివరించాడు. భారత్ జట్టు ఈ వన్డే విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని 1-1తో సమం చేసింది. విజేత నిర్ణయాత్మక వన్డే ఆదివారం కాన్పూర్ వేదికగా జరగనుంది.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రూ. 25 కోట్లు కలెక్ట్ చేసిన ‘బిచ్చ‌గాడు’ తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో మే 13న విడుదల చేశారు. TNN | Updated: Jul 17, 2016, 12:44AM IST తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో మే 13న విడుదల చేశారు. ఈ చిత్రం దిగ్విజ‌యంగా వంద‌రోజుల వేడుక‌ను జ‌రుపుకునే దిశ‌గా వెళుతుంది. ఇప్ప‌టి వరకు ఈ చిత్రం రూ. 25 కోట్లు క‌లెక్ట్ చేసి ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇంకా సినిమా 70 శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ అవుతుంద‌ని ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఇలాగే కొన‌సాగితే రూ. 30 కోట్లకు పైగానే వ‌సూళ్ల‌ను సినిమా సాధిస్తుంద‌ని నిర్మాత‌లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
0business
balakrishna's next with b gopal? బి.గోపాల్‌తో బాలయ్య ‘తొడకొట్టేందుకేనా’? దర్శకుడు బి.గోపాల్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన డైరెక్ట్ చేసిన 'ఆరడుగుల బుల్లెట్' సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం ఆయన చేతుల్లో ఏ సినిమా లేదు. ఈ క్రమంలో బాలయ్య పిలిచి మరీ బి.గోపాల్‌కు అవకాశం ఇచ్చినట్లుగా టాక్. TNN | Updated: Sep 4, 2017, 08:46PM IST దర్శకుడు బి.గోపాల్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన డైరెక్ట్ చేసిన 'ఆరడుగుల బుల్లెట్' సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం ఆయన చేతుల్లో ఏ సినిమా లేదు. ఈ క్రమంలో బాలయ్య పిలిచి మరీ బి.గోపాల్‌కు అవకాశం ఇచ్చినట్లుగా టాక్. బాలయ్య ఎప్పుడు ఎవరికి అవకాశాలు ఇస్తాడో చెప్పలేం. ఈ మధ్య కాలంలో హిట్స్ లేని పూరిజగన్నాథ్‌తో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఆ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇప్పుడు బి.గోపాల్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. వీరిద్దరి కాంబినేషన్‌లో 'సమరసింహారెడ్డి', 'నరసింహానాయుడు' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి బాలయ్య ఆయనకు పిలిచి మరీ అవకాశం ఇస్తున్నాడు. మనం ఒక సినిమా చేస్తున్నాం.. కథ రెడీ చేసుకో' అంటూ బాలయ్య సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బాలయ్య కోసం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట గోపాల్. ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం బాలయ్య.. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఖైదీ నెం. 106.. నాలుగోసారి అదే జైలులో సల్మాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి జోధ్‌పూర్ న్యాయస్థానం ఐదేళ్లు జైలు శిక్ష విధించడంతో.. Samayam Telugu | Updated: Apr 6, 2018, 08:47AM IST కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి జోధ్‌పూర్ న్యాయస్థానం ఐదేళ్లు జైలు శిక్ష విధించడంతో.. అతడ్ని జోధ్‌పూర్ కేంద్ర కారాగారానికి తరలించారు. అక్కడ బ్యారక్ నంబరు-2లో సల్మాన్‌ని ఉంచి ఖైదీ నంబరు 106 కేటాయించినట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడ్ని సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నామని.. గదిలో చెక్క మంచం, దుప్పటి, కూలర్ మాత్రమే ఉన్నాయని అధికారులు వివరించారు. 1998 అక్టోబరులో జోధ్‌పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో సల్మాన్ ఖాన్ వేటాడటంతో రెండు కృష్ణ జింకలు చనిపోయానని అప్పట్లో వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. అనంతరం సుదీర్ఘ విచారణలో మూడుసార్లు ఆయనకి జైలు శిక్ష ఖరారైంది. 1998, 2006, 2007 సంవత్సరాల్లో సల్మాన్ ఖాన్ సుమారు 18 రోజులు జోధ్‌పూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించాడు. ఈసారి కూడా శిక్షాకాలం మూడేళ్ల కంటే ఎక్కువగా ఉండటంతో.. బెయిల్ కోసం సల్మాన్ ఖాన్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నాడు. శిక్ష నిలుపుదల లేదా బెయిల్ ఫిటిషన్‌పై సెషన్స్ కోర్టు శుక్రవారం విచారణ జరపనుంది.
0business
సాలే గారు సినిమా చూశాక ఏమంటున్నాడో తెలుసా... Highlights పవన్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి ఫ్రెంచ్ మూవీ కాపీ అని టాక్ రావటంతో స్పందించిన దర్శకుడు జెరోమ్ సాలే తన లార్గో వించ్ మూవీలానే వుందంటూ, టి సిరీస్ డీల్ సరిపోదంటూ ట్వీట్   పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రానికి విడుదలకు ముందే పలు వివాదాలు చుట్టుముట్టాయి. ప్రధానంగా అజ్ఞాతవాసి చిత్రాన్ని ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ ను కాపీ కొట్టి తీశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆ సినిమా రీమేక్ రైట్స్ పొందిన బాలీవుడ్ కు చెందిన టి-సిరీస్ న్యాయ పోరాటానికి సిద్ధమవడంతో వాళ్లతో సెటిల్మెంట్ చేసుకున్నారనే టాక్ వినిపించింది. దీంతో అజ్ఞాతవాసి కాపీ ఆరోపణలు ఒరిజినల్ మూవీ లార్గో వించ్ తెరకెక్కించిన ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోమ్ సాలే దాకా కూడా వెళ్లాయి. దీంతో అజ్ఞాతవాసి సినిమా చూసేందుకు తాను సిద్ధమవుతున్నట్లు ప్రకటించిన ఫ్రెంచ్ దర్శకుడు..  సినిమా రిలీజయ్యాక స్వయంగా చూసి ఓ ట్విట్ కూడా పెట్టాడు.   ‘‘టి-సిరీస్ తో చేసుకున్న సెటిల్మెంట్ సరిపోదేమో అని నేను భయపడుతున్నాను. ఇది కేవలం ఇండియాకు సంబంధించిన విషయం కాదు. అజ్ఞాతవాసి ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ’’ అని జెరోమ్ సాలే ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు అర్థం తనతో కూడా ఇష్యూ సెటిల్ చేసుకోవాలనీ, లేకుంటే లీగల్ యాక్షన్ దాకా వెళ్లాల్సి వస్తుందన్నట్టుగా చెప్పకనే చెప్పాడని కొందరు విశ్లేషిస్తున్నారు.   అయితే అసలు లార్గో వించ్ సినిమా ఫ్రెంచ్ లో హిట్ మూవీ ఏం కాదు.  అదే స్టోరీ ఎత్తేశారు అంటూ టాక్ వినిపిస్తున్న అజ్ఞాతవాసి కూడా ఫ్లాప్ టాక్ మూట గట్టుకుంది. తన సినిమా సక్సెస్ అయిందయినా లేక ఇప్పుడు రిలీజైన అజ్ఞాతవాసి సూపర్ డూపర్ హిట్టైనా జెరోమ్ సాలే రీమేక్ రైట్స్ గురించి డిమాండ్ చేయటంలో అర్థం వుండేదని అంటున్నారు మరికొందరు. ఇంతకీ ఈ ఇష్యూ సెటిలైందా లేదా తేలాలి.   Last Updated 25, Mar 2018, 11:40 PM IST
0business
Visit Site Recommended byColombia గాయం నుంచి తాజాగా కోలుకున్న హార్దిక్ పాండ్య.. ఇటీవల రంజీ ట్రోఫీలో బరోడా జట్టు తరఫున మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ముంబయితో జరిగిన తొలి మ్యాచ్‌లోనే బ్యాట్‌తో 137 బంతుల్లో 8x4, 1x6 సాయంతో 73 పరుగులు చేసిన హార్దిక్ పాండ్య.. బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టి.. లయ అందుకున్నాడు. దీంతో.. ఆస్ట్రేలియాతో ‘బాక్సింగ్ డే’ టెస్టుకి ఈ ఆల్‌రౌండర్‌ని ఎంపిక చేయాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుండగా.. గత వారం అడిలైడ్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో గెలుపొందింది. తాజాగా పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు.. మంగళవారం ముగియనుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
internet vaartha 144 Views న్యూఢిల్లీ : భారత్‌ ఫార్మాదిగ్గజం సన్‌ఫార్మా తాజాగా డెంగ్యూ వ్యాక్సిన్‌ అభివృద్ధి ఉత్పతి తమార్కెటింగ్‌కోసం ఢిల్లీకి చెందిన జెనటిక్‌ ఇంజినీరింగ్‌ బయోటెక్నాలజీ అంతర్జాతీయ కేంద్రం (ఐసిజిఇబి)తో ఒప్పందంచేసుకుంది. వచ్చేనెలలో ఇందుకు సంబంధించి లాంఛనంగా ఒక ప్రకటన విడుదలవుతుంది. డెంగ్యూ వ్యాక్సిన్‌ను మొదటిసారిగా నూరుశాతం భారత్‌లోనే వృద్ధిచేయడంఅందులోనూ భారత్‌లోనే క్లినికల్‌ పరంగా వృద్ధిచేయడం కూడా జరిగింది. రోటావైరస్‌ నుంచి చిన్నపిల్లలను రక్షించేందుకు రోటావ్యాక్‌ వ్యాక్సిన్‌ ఇదేకోవలో భారత్‌మందుల కంపెనీ వృద్ధి చేసింది. భారత్‌లోని సార్వత్రిక వ్యాధినిరోధక కార్యక్రమానికి అను సంధానంగా పనిచేసేందుకు సన్‌ఫార్మా నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 390 మిలియన్ల మంది ప్రతిఏటా డెంగ్యూ వైరస్‌బారిన పడుతు న్నారు. వీరిలో క్లినికల్‌గా 96 మిలియన్ల రోగులు బాధపడుతున్నారు. భారత్‌ లోనూ లెక్కకకు మించిన సంఖ్యలో డెంగ్యూబారిన పడుతున్నారు. మొత్తం 99,913 కేసులు గుర్తించారు. 220కిపైగా మరణాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 33,310 మంది వ్యాధిబారినపడితే 20 మందికిపైగా చని పోయినట్లు తేలింది. దోమలవ్యాప్తితో ఉధృతం అవుతున్న డెంగ్యూ వ్యాధి నివారణ, కొత్త వ్యాక్సిన్‌ల పరిశోధనకు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. మొత్తం 128 దేశాల్లో ఈ వ్యాధి విజృంభించింది. వివిధ కంపెనీలు వృద్ధిచేసిన వ్యాక్సిన్‌లలో డెంగ్‌వ్యాక్సియా కీలకంగా ఉంది. ఫ్రెంచ్‌ ఔషధ సంస్థ సనోఫి ఉత్పత్తిచేసింది. గత ఏడాది డిసెంబరు నుంచి బ్రెజిల్‌, మెక్సికో, ఫిలిపైన్స్‌, ఎల్‌సాల్వెడార్‌లలో 9-45 ఏళ్ల వయసున్న వారికి ఈ ఔషధం అందించవచ్చని అంచనా వేసింది. పాన్‌ఏసియా బయోటెక్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలకు ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి లైసెన్సులున్నాయి. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌, జపాన్‌ ఫార్మాకంపెనీ టెకెడా వంటివి రెండోదశ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఐసిజిఇబి వ్యాక్సిన్‌ డిఎస్‌వి 4గా పిలుస్తోంది.
1entertainment
Cricket Stadium ఒక్క పరుగివ్వకుండా 10 వికెట్లు న్యూఢిల్లీ: టీ20 అంటేనే బ్యాట్స్‌మెన్‌ గేమ్‌.ఎంత గొప్ప బౌలరైనా టీ20కి వచ్చే సరికి పరుగులు ఇవ్వక తప్పదు. ఒక్కోసారి బ్యాట్స్‌మెన్‌ బాదుడు తట్టుకోలేక తలపట్టు కుంటారు బౌలర్లు. కానీ 15 ఏళ్ల రాజస్తాన్‌ బౌలర్‌ దీన్ని తలకిందులు చేశాడు. టీ20 క్రికెట్‌లో ఇప్పట ివరకు చూడని బౌలింగ్‌ ప్రదర్శనను ఇచ్చాడు. తన లెఫ్ట్‌ ఆర్మ్‌ మీడియం పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును ఉక్కిరి బిక్కిరి చేశాడు. జట్టులో ఏ ఇతర బౌలర్‌కు అవకాశమివ్వకుండా మొత్తం 10 వికెట్లు ఒక్కడే తీశాడు. అతను ఆకాశ్‌ చౌదరి. స్థానికంగా జరిగిన టీ20టోర్నీలో 4-4-0-10 గణాంకా లతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. జైపూర్‌లో జరిగిన లేట్‌ భవేర్‌ సింగ్‌ టీ 20 టోర్నమెంట్‌లో దిశా క్రికెట్‌ అకాడమీ తరుపున ఆడిన ఆకాశ్‌ బుధవారం ఈ అద్భుతమైన బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేశాడుపెర్ల్‌ అకాడమీ జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఆకాశ్‌…నాలుగు మెయిన్లు, సున్నా పరుగులు, 10 వికెట్లతో జట్టును గెలిపించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దిశా అకాడమీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు వచ్చిన పెర్ల్‌ అకాడమీ జట్టు…ఆకాశ్‌ ధాటికి 36 పరుగులకే చాప చుట్టేసింది. తొలి ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌…రెండు, మూడో ఓవర్లలోనూ చెరో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆఖరి ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి మొత్తం 10 వికెట్లను తన ఖాతాలో వేసేసుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో హ్యాట్రిక్‌ కూడా సాధించాడు. ఇలాంటి గణాంకాలు చూడటం ఇదే తొలిసారి అని చాలా మంది క్రికెట్‌ విశ్లేషకులు అంటున్నారు. ఒక్క పరుగు ఇవ్వకుండా రెండు, మూడు వికెట్లు తీసిన సందర్భాలు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్నాయి. కానీ…సున్నా పరుగులతో మొత్తం 10 వికెట్లు తీసిన మ్యాచ్‌లు చూడలేదని అంటున్నారు.
2sports
internet vaartha 111 Views హైదరాబాద్‌ : వొడాఫోన్‌ ఇటీవల నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలను ప్రకటించింది. వొడాఫోన్‌ మెగాకార్‌ ధమ్మల్‌ పోటీలో నగరానికి చెందిన మెట్టా మనోహర్‌రావుకు ఆడి ఎ3 కారు లభించింది. వొడాఫోన్‌ ఎపి తెలం గాణ బిజినెస్‌ హెడ్‌ రోహిత్‌ ట్యాండన్‌ విజేతకు కారుతోపాటు తాళాలను కూడా ఇటీ వల నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అందచేసారు. వొడా ఫోన్‌ డేటా, వాయిస్‌ మార్కెట్లలో గణనీయమైన నాణ్యతాప్రమాణాలు అనుసరిస్తోంది. కంపెనీ గత ఏడాది నవంబరు 18వ తేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15వతేదీ వరకూ నిర్వహించిన మెగాకార్‌ ధమ్మాల్‌ పోటీలో విజేతగామెట్టా మోహన్‌రావు నిలిచారు. విజేతకు ఆడి3 కారును  అందించారు.
1entertainment
Hyderabad, First Published 23, Mar 2019, 9:31 AM IST Highlights  ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా ఆయన అగస్త్య మంజుతో కలిసి ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను తెరకెక్కించారు. ఆ చిత్రం  ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ ఏదో పగ పట్టినట్లుగా తనకు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీసే ఛాన్స్ ఇవ్వలేదని ఈ సినిమా తీస్తున్నారని మీడియాలో వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి.   ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా ఆయన అగస్త్య మంజుతో కలిసి ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను తెరకెక్కించారు. ఆ చిత్రం  ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ ఏదో పగ పట్టినట్లుగా తనకు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీసే ఛాన్స్ ఇవ్వలేదని ఈ సినిమా తీస్తున్నారని మీడియాలో వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి.   బాలకృష్ణతో ఎన్టీఆర్‌ బయోపిక్‌ చేసే  అవకాశం మీకే వచ్చుంటే, అప్పుడు  ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో ఉన్న కంటెంట్ ని  తెరపై చూపించకపోదురని అంటున్నారు. ఈ విషయమై మీడియా వారు డైరక్టర్ గా రామ్ గోపాల్ వర్మనే ప్రశ్నించారు. దానికి వర్మ చాలా సూటిగా సమాధానమిచ్చారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీస్తున్నప్పుడు   ఈ అంశం లేకపోతే... అందులో    భావోద్వేగాలు, సంఘర్షణ అంటూ ఏమీ ఉండవు. అందుకే అది ఉంటేనే సినిమా చేస్తానని బాలకృష్ణతో చెప్పా. ఆయన స్ట్రెయిట్‌ లైన్‌లో సినిమా చేస్తేనే బాగుంటుందన్నారు. అంతే తప్ప మా మధ్య గొడవేమీ లేదు' అన్నారు. అంతేకాదు.... ఎన్టీఆర్‌ బయోపిక్‌ గురించి బాలకృష్ణ నన్ను కలిశాక అప్పుడు నా దృష్టికి వచ్చిన సంఘటనలనే తెరకెక్కించాను. ఆయన పరిచయం చేసిన కొద్దిమంది వ్యక్తులతో ఈ సమాచారం సేకరించాక, అక్కడ్నుంచి మరింత లోతుగా వెళ్లిపోయింది అన్నారు.  Last Updated 23, Mar 2019, 9:31 AM IST
0business
Suresh 92 Views World record Drek Monis వాషింగ్టన్‌: మహిళల ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ 400మీటర్ల హర్డిల్స్‌ రేసులో ప్రపంచ రికార్డు నమోదైంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ అథ్లెటిక్స్‌ ట్రైల్స్‌లో భాగంగా డెస్‌ మొనిస్‌ డ్రాకే స్టేడియంలో జరిగిన 400మీటర్ల హర్డిల్స్‌ రేసును అమెరికాకు చెందిన దలైలా మహ్మద్‌ 52.20 సెకన్ల టైమింగ్‌తో పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో 29ఏళ్ల దలైలా మహ్మద్‌ గత 16ఏళ్లు వరల్డ్‌ రికార్డుని బద్దలు కొట్టింది. 2003లో రష్యన్‌ రన్నర్‌ యూలియా నెలకొల్పిన 52.34సెకన్ల ప్రపంచ రికార్డును దలైలా ఈ సందర్భంగా అధిగమిం చింది. రియో ఒలింపిక్స్‌ మహిళల 400మీటర్ల హర్డిల్స్‌లో దలైలా మహ్మద్‌ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ రికార్డు నెలకొల్పిన అనంతరం దలైలా మహ్మద్‌ మాట్లాడుతూ ఇదొక అద్భుతమైన ఫీల్డ్‌, ఇక్కడ ఎలాంటి రికార్డులైన బద్దలవుతాయి.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Suresh 117 Views డిసెంబర్‌లో యువరాజ్‌ పెళ్లి ముంబయి: భారత క్రికెటర్‌ యువరాజ్‌, ప్రేయసి హేజిల్‌ కిచ్‌లు ఎప్పుడు వివాహం చేసుకుంటారా? అని అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయమై యువరాజ్‌ ముంబయిలో నిర్వ హించిన ప్యాషన్‌ కార్యక్రమంలో వెల్లడించాడు. డిసెంబర్‌ మొదటి వారంలో తాను హేజిల్‌ని వివాహం చేసుకుంటున్నానని, అనంతరం కాబోయే భార్యతో హేజిల్‌తో కలిసి ర్యాంప్‌ వాక్‌ చేశాడు. యువరాజ్‌తో పాటు క్రికెటర్లు క్రిస్‌గేల్‌,రోహిత్‌లు ర్యాంప్‌ వాక్‌ చేశాడు. ఈ ప్యాషన్‌ కార్యక్రమానికి బాలీవుడ్‌ ప్రముఖులు కూడా హాజ రయ్యారు
2sports
sumalatha 218 Views cricket , DINESH KARTHIK , india Dinesh Karthik హైదరాబాద్‌: వరల్డ్‌ కప్‌లో ఒక్క మ్యాచ్‌ ఓటమితో టీమిండియా కథ ముగిసింది. వరల్డ్‌ కప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కార్తీక్‌ తేలిపోయాడు. ఓ మ్యాచ్‌లో 8, మరో మ్యాచ్‌లో 6 పరుగులతో ఉసూరుమనిపించాడు. ఇప్పటికే అనేక చాన్సులు అందుకున్న డీకే, వరల్డ్ కప్ వైఫల్యంతో తన కెరీర్ ను తానే కష్టాల్లోకి నెట్టుకున్నాడు. సెలక్టర్లు మరోసారి డీకేపై కరుణ చూపుతారని భావించలేం. ఈ నేపథ్యంలో, విండీస్ టూర్ కు వెళ్లే భారత జట్టులోకి యువ బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్ ను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్టు సమాచారం. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV భారత్ వికెట్లు ఇంకా పడాలనుకున్నా..! : బుమ్రా మెల్‌బోర్న్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. ఈరోజే ఇంకొన్ని వికెట్లు పడుంటే బాగుండేదని నాకు అనిపించింది. -జస్‌ప్రీత్ బుమ్రా Samayam Telugu | Updated: Dec 28, 2018, 04:02PM IST భారత్ వికెట్లు ఇంకా పడాలనుకున్నా..! : బుమ్రా మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఈరోజు భారత్ వికెట్లు ఇంకా పడింటే బాగుండేదని ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అభిప్రాయపడ్డాడు. ఆటలో మూడో రోజైన శుక్రవారం 8/0తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు.. జస్‌ప్రీత్ బుమ్రా (6/33) ధాటికి 151 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. 292 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న భారత్ జట్టు ఈరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో పేలవంగా వికెట్లు చేజార్చుకుని 54/5తో నిలిచింది. అయితే.. ఇప్పటికే 346 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో ఈరోజు ఇంకా కొన్ని వికెట్లు పడుంటే బాగుండేదని బుమ్రా చెప్పుకొచ్చాడు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV #MeToo: అర్జున్‌పై మరో బాంబు పేల్చిన శ్రుతి మీటూ ఉద్యమంలో భాగంగా ‘జెంటిల్‌మెన్’ అర్జున్‌పై నటి శ్రుతి ఆరోపణలు కన్నడ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. Samayam Telugu | Updated: Oct 22, 2018, 05:36PM IST #MeToo: అర్జున్‌పై మరో బాంబు పేల్చిన శ్రుతి మీటూ ఉద్యమంలో భాగంగా దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులలో నటుడు అర్జున్ ఒకరు. సినిమా షూటింగ్‌లో భాగంగా అర్జున్ తనను అసభ్యంగా తాకాడని, ఇలాంటి సీన్లు చేద్దామంటూ దర్శకుడిని ప్రేరేపించారని నటి శ్రుతి హరిహరణ్ ఆరోపించిన విషయం తెలిసిందే. మీడియాతో మాట్లాడుతూ.. తనతో పాటు అర్జున్ మరో నలుగురు మహిళా ఆర్టిస్టులతో అసభ్యంగా ప్రవర్తించారని ‘జెంటిల్‌మెన్’ నటుడిపై మరో బాంబు పేల్చారు నటి శ్రుతి. బాధిత మహిళలు తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం తాను అర్జున్ వేధింపులకు సంబంధించి ఆధారాలు, సాక్ష్యాలు సేకరించే పనులు ఉన్నానని, కాలం కలిసొస్తే అన్నీ బయటపెడతానని చెప్పారు. దర్శన్, సుదీప్ లాంటి స్టార్ హీరోలతో నటించినా.. తనకు వారి నుంచి ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదని ఆమె వెల్లడించారు. అర్జున్‌పై శ్రుతి ఆరోపణల పర్యవసానంగా కన్నది చిత్ర పరిశ్రమ రెండుగా విడిపోయి తమ మద్దతు తెలుపుతోంది. చదవండి: అర్జున్ అసలు సిసలైన జెంటిల్‌మెన్: నటి అర్జున్ చాలా మంచి వ్యక్తి అని నటి సోని చరిష్టా ఇటీవల ఆయనకు మద్దతు తెలపగా, మరికొందరు నటుడి గురించి తమకు తెలుసునంటున్నారు. ఇదే క్రమంలో #MeToo మీటూ ఉద్యమానికి మద్దతు తెలపాలంటూ నటి శ్రుతి హరిహరణ్‌కు మరికొందరు సినీ పెద్దలు తమ వంతు సహకారం అందిస్తామని చెబుతున్నారు. తనకు మద్దతు తెలిపిన శ్రద్ధా శ్రీనాథ్, తాప్సీలు తన హీరోలంటూ నటి శ్రుతి పేర్కొంది. నీతు శెట్టి, రాగిని ద్వివేదీలు కూడా శ్రుతికి మద్దతుగా నిలిచారు. చదవండి: #MeToo: అర్జున్ అలా చేస్తారనుకోలేదు: నటి శ్రుతి వేధింపులపై కమిటీ ఏర్పాటు చేయండి సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల విచారణకు సంబంధించి ఇంటర్నల్ కంప్లెయింట్స్ కమిటీ (ఐసీసీ) ఏర్పాటు చేయాలని నటి శ్రుతి హరిహరణ్ కోరారు. తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కొందరు నీచ పనులకు పాల్పడుతున్నారని అర్జున్‌ను ఉద్దేశించి శ్రుతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చదవండి: MeToo సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి శ్రుతి ఆరోపణల్ని ఖండించిన అర్జున్ తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణల్ని నటుడు అర్జున్ ఖండించారు. తాను చెడ్డవాడినైతే తనపై శ్రుతి హరిహరణ్ ప్రశంసలు ఎందుకు కురిపించావని నటుడు ప్రశ్నించాడు. కొందరు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అర్జున్ విమర్శించారు. Article Read In English: Sruthi Hariharan accuses Arjun Sarja of molesting four other actresses   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Visit Site Recommended byColombia బంగారం ధరలు మంగళవారం రూ.100 తగ్గిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.24,800 వద్దే కొనసాగుతోంది. నేటి ట్రేడింగ్‌లో వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. మంగళవారం వెండి ధర రూ.700 తగ్గిన సంగతి తెలిసిందే. బుధవారం ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో కిలో వెండి ధర రూ.37,450 వద్దే కొనసాగుతోంది. ఇక వారాంతపు డెలివరీ వెండి ధర రూ.443 తగ్గి రూ.36,219 కి చేరింది. 100 వెండి నాణేల ధర కూడా రూ.1000 తగ్గడంతో.. కొనుగోలు ధర రూ.73,000 ఉండగా.. అమ్మకం ధర రూ.74,000 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. సింగపూర్‌లో ఔన్సు బంగారం ధర 1,202.08 అమెరికా డాలర్ల వద్ద స్థిరపడింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV నెం.4లో 9మంది ఫెయిల్.. రాయుడు హిట్ టీమిండియా గత మూడునాలుగేళ్లలో నెం.4 స్థానం కోసం దాదాపు 9 మంది ఆటగాళ్లని పరీక్షించింది. ఈ క్రమంలో సీనియర్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, అజింక్య రహానె, దినేశ్ కార్తీక్‌లకి ఛాన్స్‌లిచ్చింది. కానీ.. ? Samayam Telugu | Updated: Oct 30, 2018, 05:21PM IST భారత్ జట్టుని సుదీర్ఘకాలంగా వేధిస్తున్న నెం.4 బ్యాట్స్‌మెన్ సమస్య సోమవారం జరిగిన బ్రబౌర్న్ వన్డేతో తీరిపోయింది. వెస్టిండీస్‌తో జరిగిన ఈ వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అంబటి రాయుడు (100: 81 బంతుల్లో 8x4, 4x6) శతకంతో సత్తాచాటాడు. ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్లు చేజార్చుకుని ఇబ్బందుల్లో పడిన జట్టుని రోహిత్ శర్మతో కలిసి 200+ భాగస్వామ్యంతో రాయుడు తిరుగులేని స్థితిలో నిలిపాడు. మ్యాచ్ గమనానికి అనుగణంగా స్ట్రైక్‌ని రొటేట్ చేస్తూనే.. గత తప్పిన బంతుల్ని బౌండరీకి తరలించిన రాయుడు ఆటకి టీమిండియా మేనేజ్‌మెంట్ ఫిదా అయిపోయింది. 2019 ప్రపంచకప్‌ వరకూ నెం.4 బ్యాట్స్‌మెన్‌ గురించి ఇక చర్చ ఉండబోదని వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ బాహాటంగానే ప్రకటించేశాడు. https://t.co/n9rbXvXPL6 — This is HUGE! (@ghanta_10) 1540813333000 టీమిండియా గత మూడునాలుగేళ్లలో నెం.4 స్థానం కోసం దాదాపు 9 మంది ఆటగాళ్లని పరీక్షించింది. ఈ క్రమంలో సీనియర్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, అజింక్య రహానె, దినేశ్ కార్తీక్‌లకి ఛాన్స్‌లిచ్చింది. కానీ.. వారు నిలకడగా ఆ స్థానంలో రాణించలేకపోయారు. దీంతో.. యువ క్రికెటర్లు మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్, కేఎల్ రాహుల్, మనోజ్ తివారీలకి అవకాశాలిచ్చింది. వీళ్లూ నిరాశపరిచారు. దీంతో.. సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. https://t.co/aHHT98vsCM
2sports
Hyd Internet 83 Views idea IDEA న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సంస్థ ఐడియా సెల్యూలర్‌ రెండవ త్రైమాసికంలో భారీగా నష్టపోయింది. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో మరోసారి నష్టాలను నమోదు చేసి రూ.1100కోట్లకుపైగా భారీ నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా రిలయన్స్‌ జియో ఎంట్రీతో గత క్వార్టర్‌లో భారీ నష్టాలను మూటగట్టుకున్న ఐడియా సెప్టెంబరు 30తో ముగిసిన రెండవ క్వార్టల్‌లో త్రైమాసికంలో పన్ను తర్వాత 169.45మిలియన డాలర్ల నష్టపోయినట్టు ఐడియా సెల్యూలార్‌ సోమవారం తెలిపింది. ప్రత్యర్థుల నుంచి భారీ పోటీ నెలకొన్న మార్కెట్ల పరిస్థితుల మధ్య ఎనలిస్టులు అంచనాలను మించి వరుసగా నాలుగవ క్వార్టర్లలో కూడా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన మొబైల్‌ టెలికాం సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం జూలై-సెప్టెంబర్‌లో రూ.1,107కోట్ల నికరనష్టం ప్రకటించింది. తొలి క్వార్టర్‌లో రూ.815 కోట్ల మేర నష్టం నమోదుకాగా, మొత్తం ఆదాయం రూ.7,465కోట్లకు చేరింది. నిర్వహణ లాభం రూ.1,502 కోట్లుకాగా, ఇబిటా మార్జిన్లు 23శాతం నుంచి 20.1శాతానికి బలహీనపడ్డాయ. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం రూ.132ను తాకింది. మరోవైపు తన టవర్‌ బిజినెస్‌ను ఏటిసి టెలికాంను విక్రయిస్తున్నట్లు ఐడియా వెల్లడించింది. అలాగే బ్రిటిష్‌ సంస్థ వొడాఫోన్‌ ఇండియాతో విలీనం అంశం త్వరలోనే పూర్తికానున్నట్లు వెల్లడించింది. దీంతో తమ వాటా టవర్‌ బిజినెస్‌ను రూ.4000కోట్లకు విక్రయించనున్నామని, దీనికి బోర్డు ఆమోదం లభించినట్టు తెలిపింది. ఈ ఫలితాల నేపథ్యంలో ఐడియా కౌంటర్‌ 3శాతానికి పైగా నష్టాలోకి జారుకుంది.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఆస్ట్రేలియాతో సిరీస్‌కి అశ్విన్ దూరం..? భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో సెప్టెంబరు నుంచి జరగనున్న సుదీర్ఘ సిరీస్‌కి ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దూరం TNN | Updated: Aug 30, 2017, 08:21PM IST భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో సెప్టెంబరు నుంచి జరగనున్న సుదీర్ఘ సిరీస్‌కి ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దూరం కాబోతోన్నట్లు వార్తలు వస్తున్నాయి. విశ్రాంతి పేరుతో ఇప్పటికే శ్రీలంకతో వన్డే సిరీస్‌కి దూరమైన అశ్విన్.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 13 వరకు భారత్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఆసీస్‌పై మంచి రికార్డు ఉన్న అశ్విన్ ఈ సిరీస్‌కి అందుబాటులో ఉండకపోతే.. అతని స్థానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కి చోటు దక్కే అవకాశం ఉంది. ‘ఆస్ట్రేలియాతో సిరీస్‌ కోసం బీసీసీఐ నుంచి నాకు పిలుపు వస్తుందనే అనుకుంటున్నా. అయితే.. ప్రస్తుతం నేను కౌంటీల్లో ఆడుతున్న జట్టుకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని చెప్పాను. ఇప్పటికీ బీసీసీఐ నుంచి నాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఒకవేళ శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత నా ఎంపికపై చర్చిస్తారేమో చూడాలి. ఇంగ్లాండ్‌లో కౌంటీలు ఆడటం ప్రపంచకప్ 2019కి ఉపయోగపడుతుంది. ఆ టోర్నీ ఇక్కడే జరుగుతుంది కాబట్టి.. అప్పటికి పిచ్‌లపై పూర్తిస్థాయి అవగాహన వస్తుంది. కానీ.. తుది నిర్ణయం మాత్రం బీసీసీఐదే’ అని అశ్విన్ వివరించాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ప్రభాస్, చరణ్‌ల కొత్త బిజినెస్ ప్లాన్! ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీలు సినిమాల్లో సంపాదించిన డబ్బుని ఇతర వ్యాపారాలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలో బన్నీ, తమన్నా, సురేందర్ రెడ్డి ఇలా చాలా మంది సొంత వ్యాపారాలు చేస్తున్నారు. TNN | Updated: Dec 14, 2017, 03:31PM IST ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీలు సినిమాల్లో సంపాదించిన డబ్బుని ఇతర వ్యాపారాలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలో బన్నీ, తమన్నా, సురేందర్ రెడ్డి ఇలా చాలా మంది సొంత వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు కలిసి కొత్త బిజినెస్ చేస్తుండడం హాట్ టాపిక్‌గా మారింది. గత కొంత కాలంగా ప్రభాస్ , రామ్ చరణ్‌లు కలిసి వ్యాపారం చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రభాస్‌కు ఎప్పటినుండో ఓ మల్టీప్లెక్స్ నిర్మించాలనే కోరిక. ఈ మేరకు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఓ స్థలం కూడా కొని ఉంచారు. అయితే రామ్ చరణ్‌తో కలిసి ఈ వ్యాపారం చేయాలనేది ప్రభాస్ ప్లాన్. ఇద్దరూ కలిసి ఓ జాయింట్ వెంచర్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్స్‌ను లీజ్‌కు తీసుకొని వ్యాపారం చేస్తున్నారట. ఇదంతా కూడా యువి క్రియేషన్స్ అలానే కొణిదల ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో జరుగుతుందని చెబుతున్నారు. చరణ్ నటిస్తోన్న 'రంగస్థలం' సినిమా నైజాం హక్కులను యువి క్రియేషన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ ఇద్దరు హీరోలు కలిసి పెద్ద ప్లానే వేశారు.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కత్రినాపై ప్రశంసలు కురిపించిన సల్మాన్ బాలీవుడ్ లో మాజీ ప్రేమికులుగా ముద్రపడిన జంటల్లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కూడా ఒకటి. ఇటీవలే ఓ షోలో తనని | Updated: Jan 24, 2016, 08:49PM IST కత్రినాపై ప్రశంసలు కురిపించిన సల్మాన్ బాలీవుడ్‌లో మాజీ ప్రేమికులుగా ముద్రపడిన జంటల్లో సల్మాన్ ఖాన్ , కత్రినా కైఫ్ కూడా ఒకటి. ఇటీవలే ఓ షోలో తనని కలిసిన కత్రినాపై సల్మాన్ ప్రశంసలజల్లు కురింపించడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇప్పటివరకు తాను చూసిన వాళ్లలో కత్రినా కైఫ్ చాలా ధైర్యవంతురాలు. 16 ఏళ్ల ప్రాయంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కత్రినా ఇవాళ ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడిందో తనకి తెలుసు అని సల్మాన్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనియాంశమైంది. షోలో సల్మాన్‌తో మాట్లాడుతూ.. తాను కానీ కంటెస్టెంట్స్ స్థానంలో వుండి వుంటే ఎంతో టెన్షన్ పడేదానిని అని కత్రినా చెప్పిన మాటలకి స్పందిస్తూ సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. సల్మాన్ చేసిన ఈ వ్యాఖ్యల సంగతెలా వున్నా.. 'మళ్లీ ఈ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయినట్టుందే' అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. రణ్‌బీర్ కపూర్‌ కన్నా సల్మానే బెటర్ అనేది కత్రినా ఐడియా కావచ్చంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV SBI ATM Card: ఎస్‌బీఐ కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. వారికి మాత్రమే! పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, పర్చేజ్ ప్రొటెక్షన్ కవర్, లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవర్ అనే మూడు రకాల సేవలు పొందొచ్చు. ఎస్‌బీఐ గోల్డ్, ఎస్‌బీఐ ప్లాటినం, ఎస్‌బీఐ ప్రైడ్, ఎస్‌బీఐ ప్రీమియం, ఎస్‌బీఐ వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డులపై మాత్రమే ఈ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఉన్నాయి. Samayam Telugu | Updated: Apr 17, 2019, 10:38AM IST హైలైట్స్ ఎస్‌బీఐ తన డెబిట్ కార్డుదారులకు కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అందిస్తోంది అందరికీ ఇవి అందుబాటులో ఉండకపోవచ్చు కేవలం ప్రీమియం డెబిట్ కార్డులు వినియోగిస్తున్న వారికే ఈ సౌకర్యం ప్రభుత్వ రంగ దిగ్గజమైన ఎస్‌బీఐ వివిధ రకాల డెబిట్ కార్డులను జారీ చూస్తూ ఉంటుంది. వీటిని ప్రధానంగా బేసిక్ కార్డు, ప్రీమియం కార్డు అనే రెండు విభాగాలుగా విభజించుకోవచ్చు. బ్యాంకు ప్రీమియం డెబిట్ కార్డులపై కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ అందిస్తోంది. పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, పర్చేజ్ ప్రొటెక్షన్ కవర్, లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవర్ అనే మూడు రకాల సేవలు పొందొచ్చు. ఎస్‌బీఐ గోల్డ్, ఎస్‌బీఐ ప్లాటినం, ఎస్‌బీఐ ప్రైడ్, ఎస్‌బీఐ ప్రీమియం, ఎస్‌బీఐ వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డులపై మాత్రమే ఈ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఉన్నాయి.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV 2019 Union Budget Live: ఐటీ పెంపు, రైతులకు రూ.6 వేలు.. బడ్జెట్ హైలెట్స్ ఇవే! ముందుగా ఊహించినట్టుగానే బడ్జెట్‌లో కేంద్రం వరాలను ప్రకటించింది. ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచడంతోపాటు ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేల సాయం ప్రకటించింది. అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ.3 వేల పెన్షన్ పథకాన్ని ప్రకటించింది. Samayam Telugu | Updated: Feb 1, 2019, 06:16PM IST హైలైట్స్ ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు ఐదెకరాల్లోపు రైతులకు ఏటా రూ.6 వేల సాయం అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ.3 వేల ఫించను. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం శుక్రవారం తుది బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజాకర్షక మధ్యంతర బడ్జెట్‌ను పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకూ సంస్కరణల దిశగా అడుగులేసిన మోదీ సర్కారు.. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా చివరి బడ్జెట్‌‌లో జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టింది. ఓట్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ.. రైతాంగం, ఉద్యోగులు, పేదలు, అసంఘటిత కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్రం వరాలు గుప్పించింది. 2019-20 బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు.. ✔ వేతన జీవులకు ఊరట. ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు. సెక్షన్ 80సీ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు. రూ.6.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారు ప్రావిడెంట్ ఫండ్స్, ఈక్విటీల్లో పెట్టుబడి పెడితే పన్నులు కట్టనక్కర్లేదు. 3 కోట్ల కుటుంబాలకు లబ్ధి. ✔ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏర్పాటు. ఐదెకరాల లోపు రైతులకు ఏటా రూ.6 వేల రూపాయలు అందిస్తాం. 12 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. డిసెంబర్ 1, 2018 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. రూ. 2 వేలు చొప్పున మూడు వాయిదాల్లో చెల్లింపు. నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నగదు బదిలీ. ఈ పథకం కోసం ఏటా రూ.75 వేల కోట్లు ఖర్చు. Dear NoMo, 5 years of your incompetence and arrogance has destroyed the lives of our farmers. Giving them Rs. 17… https://t.co/aqAMJPaVSA — Rahul Gandhi (@RahulGandhi) 1549013325000 ✔ ప్రధాని శ్రమ యోగి మంధన్ పేరిట అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం పెన్షన్ పథకం. నెలకు రూ.100 చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3 వేలు. పది కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ✔ ఇళ్ల కొనుగోలు దారులను జీఎస్టీ నుంచి మినహాయించే విషయమై త్వరలోనే నిర్ణయం. ✔ పన్నులు లేకుండా గ్రాట్యూటీ పరిమితి రూ.20 లక్షలకు పెంపు. ఓవరాల్‌గా గ్రాట్యూటీని రూ.30 లక్షలకు పెంపు. ✔ అద్దెలపై పన్ను మినహాయింపు పరిమితి రూ.1.80 లక్షల నుంచి రూ.2.40 లక్షలకు పెంపు. ✔ ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ. 76,800 కోట్లకు పెంపు. గత బడ్జెట్లో రూ.62,474 కోట్ల కేటాయింపు. ✔ మూలధన వ్యయం - రూ.3,36,292 లక్షల కోట్లు ✔ నోట్ల రద్దు తర్వాత 1.06 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం. 24 గంటల్లోగా ఆదాయ పన్ను రీఫండ్ అయ్యేలా చర్యలు. ✔ వచ్చే ఐదేళ్లలో 5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్, ఎనిమిదేళ్లలో 10 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న ఇండియా. ✔ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం రూ.58,166 కోట్లు కేటాయింపు. గత ఏడాది కంటే ఇది 21 శాతం అధికం. ✔ రైల్వేకు బడ్జెటరీ సపోర్ట్ కింద రూ.64,587 కోట్ల నిధులు. ✔ 59 నిమిషాల్లోనే సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలకు కోటి రూపాయల రుణం. ✔ కార్మిక ప్రమాద బీమా రూ.6 లక్షలకు పెంపు. ✔ రక్షణ రంగానికి రూ.3 లక్షల కోట్లు కేటాయింపు. ✔ ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన ద్వారా 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ✔ ముద్రా కింద రూ.7 లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం. ✔ కేంద్రంలో ప్రత్యేకంగా మత్స్య శాఖ ఏర్పాటు. ✔ 21 ఎయిమ్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి లేదా నిర్మాణ దశలో ఉన్నాయి. ✔ పేదలకు 143 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు ఇచ్చాం. ✔ ఆవాస్ యోజనలో భాగంగా 1.53 లక్షల ఇళ్లు నిర్మించాం. ✔ గ్రామ్ సడక్ యోజన కోసం రూ.19 వేల కోట్లు ఖర్చుపెట్టాం. ✔ ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్టసీ కోడ్ ద్వారా రూ.3 లక్షల కోట్లు రికవరీ చేయగలిగాం. ✔ స్వచ్ఛతను మరో అడుగు ముందుకు తీసుకెళ్లాం. 5.45 లక్షల గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనకు దూరమయ్యాయి. ✔ ఐదేళ్లలో సంస్కరణలను చేపట్టాం. ద్రవ్యలోటును 2.5 శాతానికి తగ్గించాం. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యింది. ✔ ఈ నాలుగున్నరేళ్లలో 239 డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులను తేగలిగాం. 2008-14 మధ్య రుణభారం వేగంగా పెరిగింది. Delhi: Finance Minister Piyush Goyal begins budget speech in the Parliament #BudgetSession https://t.co/VDCvHAxCRG — ANI (@ANI) 1548999245000 ✔ మధ్యంతర బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరికాసేపట్లో గోయల్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో మనం ఏం ఆశించొచ్చు? X ✔ ఏపీకి ఎన్డీయే సర్కారు అన్యాయం చేసిందని విమర్శిస్తూ తెలుగు దేశం పార్టీ ఎంపీలు నల్ల దుస్తుల్లో పార్లమెంట్ ముందు నిరసన చేపట్టారు. Delhi: Telugu Desam Party (TDP) MPs dress in black to protest against the central government ahead of the presentat… https://t.co/0Qk5DJYgwT — ANI (@ANI) 1548997604000 ✔ బడ్జెట్‌ను ఆమోదించడానికి కేబినెట్ భేటీ అయ్యింది. కేబినేట్ ఓకే చెప్పిన తర్వాత గోయల్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ✔ ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ బీఫ్ కేసుతో పార్లమెంట్‌కు చేరుకున్నారు. Delhi: Finance Minister Piyush Goyal arrives at the Parliament with the #Budget briefcase. Following the Cabinet me… https://t.co/vbUqSW1kCg — ANI (@ANI) 1548995154000 ✔ సంప్రదాయం ప్రకారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రపతి కోవింద్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిశారు. బడ్జెట్ 2019-20 ప్రతులను ఇప్పటికే పార్లమెంట్‌కు పంపించారు. As per tradition, Finance Minister @PiyushGoyal calls on #PresidentKovind at Rashtrapati Bhavan before presenting t… https://t.co/BErWKF5apk — President of India (@rashtrapatibhvn) 1548993985000 ✔ బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 80 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 10850 మార్క్ దాటింది. మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి? X
1entertainment
Hyderabad, First Published 9, Apr 2019, 4:54 PM IST Highlights 'బాహుబలి' చిత్రంతో ప్రభాస్ పాపులారిటీ ఎంతగా పెరిగిపోయిందో తెలిసిందే.  'బాహుబలి' చిత్రంతో ప్రభాస్ పాపులారిటీ ఎంతగా పెరిగిపోయిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రభాస్ కి గుర్తింపు లభించింది. ఈ సినిమాకు జపాన్ ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.  జపనీయులు బాహుబలి చిత్రాన్ని తమ సొంత చిత్రాలకంటే ఎక్కువగా ఆదరించారు. అందుకే ఇప్పుడు అక్కడి ప్రేక్షకుల కోసం ప్రభాస్ ఓ సర్ప్రైజ్ సిద్ధం చేశాడని సమాచారం. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' చిత్రాన్ని జపాన్ లో కూడా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట ప్రభాస్. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన జపాన్ వెళ్లనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ నటిస్తోంది. విలన్ పాత్రలో నీల్ నితిన్ ముఖేష్ కనిపించనున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
0business
అన్నం మానేయడమేంటి.. మీరే చదవండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోనూ తెగ బిజీ అయిపోయారు. ఇటు సినిమాలు చేస్తూనే అనేక సామాజిక రాజకీయ అంశాలపై తరచుగా స్పందిస్తూ.. జనసేన పార్టీ 2019 ఎన్నికలకు సంసిద్ధమయ్యే దిశగా పనిచేస్తున్నారు. మరోవైపు సినిమా షూటింగుల్లోనూ పాల్గొంటున్నారు. 46ఏళ్ల పవన్ కళ్యాణ్ సాధారణంగా టిపికల్ ఆంధ్రా భోజనం తినేందుకే ఇష్టపడతారు. అన్నం, కూరలు, పప్పు, పచ్చళ్లతో తన భోజనం మెనూ ఉంటుంది. అయితే ఆంధ్రా భోజనాన్ని అంతగా ఇష్ట పడే పవన్ కళ్యాణ్ తనకు ఎంతో ఇష్టమైన ఆ భోజనాన్ని తినటం ఇక నుంచి మానేస్తున్నారు. పవన్ అన్నం తినటం మానేయటానికి బలమైన కారణమే ఉంది. పవన్ ఇటీవల కాటమరాయుడు సినిమాతో అన్నయ్య పాత్రలో కనిపింంచారు. ఆపాత్రలో శృతీహాసన్ ను ప్రేమలో పడేసే రాయుడుగా నటించినా... కాటమరాయుడు అనే పేరుకు తగ్గట్టుగా కేరక్టర్ లో పెద్దరికం చూపించారు. అయితే అంతకు ముందు నటించిన గబ్బర్ సింగ్ 2 సినిమాలో పవన్ కాస్త ఏజ్ డ్ గా కనిపించారని టాక్ వినిపించింది. అత్తారింటికి దారేది సినిమాలో యూత్ ఫుల్ గా కనిపించిన పవన్ ప్రస్థుతం నటిస్తున్న సినిమాలోనూ అదే మాదిరిగా యంగ్ గా కనిపించాలట.   ప్రస్థుతం పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ యంగ్ గా కనిపించాలట. అందుకే ముఖంలో రైస్ తినటం వల్ల వస్తున్న వాపు, చర్మం మందమెక్కుతుండటం లాంటివి కనిపిస్తుండటంతో... వెంటనే రైస్ తినటం మానేయాలని నిర్ణయించారట. గతంలో అత్తారింటికి దారేది సమయంలో కూడా త్రివిక్రమ్ కోరికమేరకు పవన్ అన్నం తినటం మానేసి చాలా యంగ్ గా కనిపించారు, ఇప్పుడు కూడా త్రివిక్రమ్ సూచన మేరకు అదే ఫార్ములాను ఫాలో అయి మరింత యంగ్ గా కనిపించి అభిమానులను అలరించనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. Last Updated 25, Mar 2018, 11:39 PM IST
0business
sumalatha 113 Views bse , NSE , stock market Sensex ముంబయి: దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.36గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 216 పాయింట్లు ఎగబాకి 37,903 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 11,254 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 68.78 వద్ద కొనసాగుతోంది. తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/women/
1entertainment
ms dhoni, rohit sharma recommended jasprit bumrah bowling penultimate over: virat kohli వారి సలహా మేరకే బుమ్రా ఏడో ఓవర్ వేశాడు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన బుమ్రా ఆఖరి ఓవర్ కాకుండా ఏడో ఓవరే ఎందుకు బౌలింగ్ చేశాడో కోహ్లి చెప్పాడు. వారిద్దరి సలహాతోనే అలా చేయించామన్నాడు. | Updated: Nov 8, 2017, 12:21PM IST న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. కివీస్‌ను కట్టడి చేసిన బౌలర్లు 67 పరుగుల లక్ష్యాన్ని కాపాడారు. 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత విజయంలో బౌలర్లు, ఫీల్డర్లు కీలక పాత్ర పోషించారు. బౌలింగ్ ఆర్డర్లో మార్పు కూడా కివీస్‌ను ఒత్తిడిలో నెట్టడానికి ఉపయోగపడింది. భువనేశ్వర్ కుమార్ తన రెండు ఓవర్ల కోటాను ముందే వినియోగించుకోగా... బుమ్రా ఆఖరి ఓవర్ వేస్తాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కోహ్లి ఏడో ఓవర్లోనే బంతిని బుమ్రా చేతికి ఇచ్చాడు. ఈ వ్యూహం ఫలితాన్ని ఇచ్చింది. రెండు ఓవర్లలో కివీస్ విజయానికి 29 పరుగులు అవసరం కాగా, తొలి బంతికే బుమ్రా నికోలస్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ ఓవర్లో పది పరుగులు రాబట్టిన కివీస్ చివరి బంతికి మరో వికెట్ కోల్పోయింది. బ్రూస్‌ను ధోనీ, హార్దిక్ అద్భుతంగా రనౌట్ చేశారు. దీంతో చివరి ఓవర్‌కు ముందు న్యూజిలాండ్ ఒత్తిడికి లోనైంది.
2sports
శివరాత్రిన 800 ఏళ్ల నాటి శివాలయంలో ఉపాసన పూజలు Highlights శివరాత్రిన 800 ఏళ్ల నాటి శివాలయంలో ఉపాసన పూజలు మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన మహాశివరాత్రిని పురస్కరించుకుని పురాతన శివాలయాన్ని దర్శించుకున్నారు. దేవుడు విరాళాలు కోరుకోడు. ఆయన భక్తుల నుంచి భక్తి, శుభ్రతను కోరుకుంటారని రాంచరణ్ సతీమణి ఉపాసన అన్నారు. దయచేసి ఆలయాలను పవిత్రంగా ఉంచండి అంటూ వేడుకొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉపాసన 800 ఏళ్ల నాటి దోమకొండ సంస్థానంలోని పురాతన ఆలయాన్ని దర్శించుకున్నారు. Omnamahshivay God doesn't need donation,he only expects devotion & cleanliness in his place of worship.Pls keep temples & surroundings clean pic.twitter.com/LrrRBbBJWR — Upasana Kamineni (@upasanakonidela) 24 February 2017 800 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాన్ని మీకు పరిచయం చేయాలనుకొంటున్నాను. ఇది చాలా పవిత్రమైనంది. ఈ ఆలయం సమీపంలో మా పూర్వీకులు 400 ఏళ్ల క్రితం దోమకొండ కోటను నిర్మించారు. నాకు సమయం దొరికినప్పుడల్లా ఈ ఆలయాన్ని దర్శించుకొంటాను. శుభ్రమైన నీటితో స్వయంగా నా చేతులతోనే కడుగుతాను. నా కోర్కెలు తీరాలని మొక్కు కొంటాను. అవి వారంలో తీరుతాయి. అని తెలుపుతూ ఉపాసన ట్విట్టర్ లో పెట్టారు. Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0business
2జీ స్కామ్ : బెయిల్ కోసం ఢిల్లీకోర్టును ఆశ్రయించిన కనిమొళి PNR| Last Modified శనివారం, 5 నవంబరు 2011 (16:33 IST) 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో అరెస్టు అయి తీహార్ జైలు జీవితం గడుపుతున్న డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళితో పాటు.. మరో ముగ్గురు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో శనివారం పిటీషన్ దాఖలు చేశారు. వారిపై నమోదు చేసిన అభియోగాలు తీవ్రమైనవి కావడంతో వారికి బెయిల్ మంజూరు చేసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో గత మే నెల నుంచి జైలు జీవితం గడుపుతున్న కనిమొళి బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ దాఖలు చేసిన వారిలో కలైంజ్ఞర్ టీవీ చీఫ్ శరద్ కుమార్, కుసేగాన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైరక్టర్లు, అసిఫ్ బల్వా, రాజీవ్ బి అగర్వాల్‌లు ఉన్నారు. గత గురువారం వీరికి బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించడమే కాకుండా ఈనెల 11వ తేదీ నుంచి కేసు విచారణ ఆరంభమవుతుందని తెలిపింది. కాగా, బెయిల్ నిరాకరించి వారిలో స్వాన్ టెలికామ్ ప్రమోటర్ షాహిద్ ఉస్మాన్ బల్వా, కేంద్ర టెలికామ్ మాజీ మంత్రి ఏ.రాజా, ఆయన ప్రైవేట్ కార్యదర్శి ఆర్కో.చండోలియా, బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ, టెలికామ్ మాజీ సెక్రటరీ సిద్ధార్థ్ బెహురాలు ఉన్నారు. సంబంధిత వార్తలు
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఆ సినిమాలను వెనక్కి నెట్టేసిన ‘బాహుబలి 2’ బాహుబలి 2 రికార్డుల వరద కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ... కొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. విడుదలకు ముందే రూ.500 కోట్లు ఆర్జించిన ‘బాహుబలి 2’... TNN | Updated: May 3, 2017, 02:13PM IST బాహుబలి 2 రికార్డుల వరద కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ... కొత్త రికార్డుల దిశగా పరుగులు తీస్తోంది. విడుదలకు ముందే రూ.500 కోట్లు ఆర్జించిన ‘బాహుబలి 2’... కేవలం మూడు రోజుల ఓపెనింగ్స్‌లోనే రూ.506 కోట్లు కలెక్షన్లతో బాలీవుడ్‌ సినిమాల రికార్డులను అధిగమించింది. వారాంతం ఓపెనింగ్స్‌లో ఇప్పటి వరకు ఉన్న రికార్డులపై మీరూ ఓ లుక్కేయండి మరి!!
0business
Sep 18,2017 సెన్సెక్స్‌ 151 పాయింట్ల పరుగు ముంబయి : జాతీయ, అంతర్జాతీయ సానుకూల అంశాల మద్ధతుతో సోమవారం భారత మార్కెట్లు పరుగులు పెట్టాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఆటో సూచీల ర్యాలీతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 151.15 పాయింట్లు పెరిగి 32,423.76కు చేరింది. ఇంతక్రితం ఏడు సెషన్లలో ఈ సూచీ మొత్తంగా 610.64 పాయింట్లు పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 68 పాయింట్లు రాణించి 10,153 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో రంగాల వారిగా కాపిటల్‌ గూడ్స్‌ 1.47 శాతం, కన్సూమర్‌ డ్యూరెబుల్స్‌ 1.43 శాతం, ఆటో 1.24 శాతం, బ్యాంకింగ్‌ 0.71 శాతం చొప్పున రాణించాయి. మరోవైపు ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీ మాత్రం 0.07 శాతం తగ్గింది. సెన్సెక్స్‌లో బజాజ్‌ ఆటో 3.57 శాతం, హెచ్‌యూఎల్‌ 2.77 శాతం, ఎల్‌అండ్‌టీ 2.09 శాతం, కోల్‌ ఇండియా 1.89 శాతం, సిప్లా 1.7 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఫిబ్రవరిలో సినిమాలే .. సినిమాలు ఒకప్పుడు టాలీవుడ్‌లో ఫిబ్రవరి నెలలో సినిమాలు రిలీజ్ చేయాలంటే వెనుకడుగు వేసేవారు. ఫిబ్రవరి అన్ సీజన్ అనే ఫీలింగ్ అందరిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది. TNN | Updated: Feb 1, 2017, 03:09PM IST ఒకప్పుడు టాలీవుడ్‌లో ఫిబ్రవరి నెలలో సినిమాలు రిలీజ్ చేయాలంటే వెనుకడుగు వేసేవారు. ఫిబ్రవరి అన్ సీజన్ అనే ఫీలింగ్ అందరిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది. గతేడాది ఎన్టీఆర్ 'టెంపర్' సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసి పెద్ద హిట్ కొట్టాడు. ఈఏడాదిలో కూడా ఫిబ్రవరి నెలలో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి మేకర్స్ ముందుకొస్తున్నారు. ముందుగా ఫిబ్రవరి 3న నాని నటించిన 'నేను లోకల్' సినిమా.. అలానే మోహన్ లాల్ నటించిన 'కనుపాప' సినిమాలు విడుదల కానున్నాయి. ఆ తరువాత ఎన్నో వాయిదాల మీద వాయిదాలు పడుతున్న సూర్య 'సింగం 3' ఫిబ్రవరి 9న రాబోతుంది. ఆ మరుసటి రోజే నాగార్జున భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' రిలీజ్ కానుంది. ఆ మరుసటి వారం ఫిబ్రవరి 17న వరుసగా నాలుగు సినిమాలు రాబోతున్నాయి. ముందుగా రానా 'ఘాజీ', మంచు మనోజ్ 'గుంటురోడు', రాజ్ తరుణ్ 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వీటితో పాటు మరో చిన్న సినిమా రాబోతుంది. ఇలా నెల మొత్తం బిజీగా ఉంటే ఫినిషింగ్ టచ్‌గా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తన 'విన్నర్' సినిమాతో ఫిబ్రవరి 24న రాబోతున్నాడు. ఈ సినిమాలన్నింటిపైన ప్రేక్షకుల్లో భారీ అంచనలే ఉన్నాయి. ఇక ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ ప్రభావాన్ని ఏ విధంగా చూపించబోతున్నాయో తెలియాలంటే ఎక్కువరోజులు ఎదురుచూడక్కర్లేదు. మొత్తానికి సంక్రాంతి సినిమా పండగ జోష్‌‌ను ఎంజాయ్ చేసిన తెలుగు ప్రేక్షకులు ఫిబ్రవరిలో కూడా కంటిన్యూ చేయడానికి రెడీగా ఉన్నారు.
0business
Hyderabad, First Published 6, Aug 2019, 12:16 PM IST Highlights చాలా రోజులుగా వరుస ప్లాఫ్ లతో సతమతమవుతున్న డైరెక్టర్ పూరీ, హీరో రామ్‌కు `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్  ఆక్సిజన్ అందించింది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసించారు. అయితే పూరీతో కలిసి `పోకిరి`, `బిజినెస్‌మేన్` వంటి సినిమాలు చేసిన సూపర్‌స్టార్ మహేష్ మాత్రం స్పందించలేదు.   ఈ మద్యకాలంలో  సోషల్ మీడియాలో చాలా స్పీడుగా ఉంటున్నారు సూపర్ స్టార్ మహేష్.  క్రిడల దగ్గర నుంచి సామాజిక అంశాలు దాకా ప్రతీ విషయంపై తన స్పందనను తెలియచేస్తున్నారు. మంచి సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. తన కు నచ్చిన సినిమాలను అభినందిస్తున్నారు. అయితే ఆయన తెలుగులో ఈ మధ్యకాలంలో వచ్చి హిట్టైన ఇస్మార్ట్ శంకర్ గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  నిజానికి చాలా రోజులుగా వరుస ప్లాఫ్ లతో సతమతమవుతున్న డైరెక్టర్ పూరీ, హీరో రామ్‌కు `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్  ఆక్సిజన్ అందించింది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసించారు. అయితే పూరీతో కలిసి `పోకిరి`, `బిజినెస్‌మేన్` వంటి సినిమాలు చేసిన సూపర్‌స్టార్ మహేష్ మాత్రం స్పందించలేదు.అయితే ఎందుకు ఆయన స్పందించలేదో  అందరికీ తెలుసుకాబట్టి లైట్ తీసుకున్నారు. వాస్తవానికి ఇస్మార్ట్ శంకర్ గురించి మహేష్ ట్వీట్ చేద్దామనుకున్నారట. అయితే ఈ లోగా మహేష్  తో తను సినిమా జనగణమన  చేయలేనంటూ  పూరి జగన్నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. హిట్ ఉన్న దర్శకులతోనే మహేష్ చేస్తారని అన్నారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ కు పిచ్చ కోపం వచ్చింది. ఈ విషయం పెద్దదైంది. మీడియాలో కొద్ది రోజులు హాట్ టాపిక్ గా నడిచింది. దాంతో ఖచ్చితంగా ఈ టాపిక్ మహేష్ దాకా చేరే ఉంటుంది. దాంతో ఆయన ట్విట్ చేద్దామనుకున్నా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పకుండా మహేష్ ఇగో అడ్డుపడిందని అంటున్నారు. పూరి జగన్నాథ్ వ్యాఖ్యలకు మహేష్ మనస్సు గాయపడిందని అందుకే ఆయన స్పందించలేదని చెప్తున్నారు. మరో ప్రక్క  హీరో రామ్, మహేష్‌ కలిసి మాట్లాడుకుంటున్నట్టున్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇస్మార్ట్ గెటప్‌లో ఉన్న రామ్‌, మహేష్‌ మధ్య  మాటలు జరిగాయి. రీసెంట్ గా బిగ్ బాస్ షో కోసం అన్నపూర్ణకు వచ్చిన రామ్ అక్కడే షూట్ లో ఉన్న మహేష్ ని కలిసారు. మహేష్ స్వయంగా రామ్ ని కంగ్రాట్స్ చేసారని, ఇస్మార్ట్ శంకర్ లో బాగా చేసావని మెచ్చుకున్నారని తెలుస్తోంది. Last Updated 6, Aug 2019, 3:25 PM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV లంకతో చివరి వన్డేకి శిఖర్ ధావన్ దూరం..? శ్రీలంకతో ఆదివారం జరగనున్న చివరి వన్డేకి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూరం కానున్నాడు. ధావన్ తల్లి ఆరోగ్య పరిస్థితి TNN | Updated: Sep 2, 2017, 07:27PM IST శ్రీలంకతో ఆదివారం జరగనున్న చివరి వన్డేకి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూరం కానున్నాడు. ధావన్ తల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో శ్రీలంక నుంచి ఈ ఓపెనర్ భారత్‌కి పయనమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల టెస్టులతో పాటు వన్డేల్లోనూ పరుగుల వరద పారించిన ధావన్.. ప్రస్తుతం జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఈ చివరి వన్డే అనంతరం భారత్ బుధవారం ఏకైక టీ20 మ్యాచ్‌ కూడా లంకతో ఆడనుంది. ధావన్ దూరమైతే.. అతని స్థానంలో అజింక్య రహానె తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. అతను ఓపెనర్‌గా వస్తాడా..? లేదా మిడిలార్డర్‌లో కెప్టెన్ కోహ్లి అవకాశమిస్తాడో చూడాలి. ఎందుకంటే.. ఈ సిరీస్ ముందు వరకు ఓపెనర్‌గా ఉన్న కేఎల్ రాహుల్.. గత నాలుగు వన్డేల్లోనూ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. కానీ.. ఒకటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేకపోవడంతో ఐదో వన్డేలో ధావన్ స్థానంలో రాహుల్ మళ్లీ ఓపెనర్‌గా వచ్చే ఛాన్స్‌లున్నాయి. ఒకవేళ రహానెకి అవకాశం దక్కకపోతే.. కేదార్ జాదవ్‌ తుది జట్టులోకి రావొచ్చు..!
2sports
Suresh 168 Views టీమిండియా ఘనవిజయం హరారే: జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా రెండవ టి20 మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో జింబాబ్వే తక్కువ స్కోరునే టీమిండియా ముందుంచగలిగింది. తొలి టి20లో ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై కసితీరా విజయం సాధించిందనే వ్యాఖ్యలు విన్పించాయి. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న జింబాబ్వే కేవలం 99 పరుగులు మాత్రమే చేసింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 13.1 ఓవర్లలోనే ఒక్క వికెట్‌ కూడ నష్టపోకుండా 103 పరుగులు చేసి రెండవ టి20లో విజయం సాధించింది.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV మొహాలి వన్డేలో ఆస్ట్రేలియా టార్గెట్ 359 ఈ ఏడాది తొలిసారి వన్డేల్లో మొదటి వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఈ ఓపెనింగ్ జోడీ.. అదే క్రమంలో డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లింది. కానీ.. జట్టు స్కోరు 193 వద్ద సిక్స్ కొట్టే ప్రయత్నంలో రోహిత్ శర్మ ఔటైపోయాడు. Samayam Telugu | Updated: Mar 10, 2019, 05:51PM IST మొహాలి వన్డేలో ఆస్ట్రేలియా టార్గెట్ 359 హైలైట్స్ ఎట్టకేలకి ఈ ఏడాది తొలి సెంచరీ నమోదు చేసిన శిఖర్ ధావన్ కొద్దిలో శతకం చేజార్చుకున్న రోహిత్ శర్మ తొలి వికెట్‌కి 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ధావన్- రోహిత్ జోడీ ఆఖర్లో మెరుపులు మెరిపించిన రిషబ్ పంత్, విజయ్ శంకర్ వన్డే ప్రపంచకప్ ముంగిట భారత్ ఓపెనర్లు ఎట్టకేలకి ఫామ్ అందుకున్నారు. ఆస్ట్రేలియాతో మొహాలి వేదికగా ఆదివారం జరుగుతున్న నాలుగో వన్డేలో శిఖర్ ధావన్ (143: 115 బంతుల్లో 18x4, 3x6) సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ (95: 92 బంతుల్లో 7x4, 2x6) శతక సమాన ఇన్నింగ్స్ ఆడటంతో ఆస్ట్రేలియాకి 359 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. సుదీర్ఘకాలం తర్వాత తొలి వికెట్‌కి 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ధావన్- రోహిత్ జోడీ.. జట్టు భారీ స్కోరుకి బాటలు వేయగా.. స్లాగ్ ఓవర్లలో రిషబ్ పంత్ (36: 24 బంతుల్లో 4x4, 1x6), విజయ్ శంకర్ (26: 15 బంతుల్లో 1x4, 2x6) బ్యాట్ ఝళిపించేశారు. దీంతో 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్ ఐదు వికెట్లు తీయగా.. రిచర్డ్‌సన్ మూడు, ఆడమ్ జంపాకి ఒక వికెట్ దక్కింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియాపై తొలి మూడు వన్డేల్లోనూ నిరాశపరిచిన శిఖర్ ధావన్ ఆరంభం నుంచే వరుస బౌండరీలతో జోరు అందుకోగా.. క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన రోహిత్ శర్మ మొదటి పవర్‌ప్లే ముగిసిన తర్వాత బ్యాట్ ఝళిపించాడు. ఈ క్రమంలో ఇద్దరూ పోటీపడి మరీ బౌండరీలు బాదడంతో ఒకానొక దశలో భారత్ జట్టు 370పైచిలుకు స్కోరు సాధించేలా కనిపించింది. ఈ క్రమంలో 44 బంతుల్లోనే శిఖర్ ధావన్ అర్ధశతకం పూర్తి చేసుకోగా.. రోహిత్ శర్మ 61 బంతుల్లో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఏడాది తొలిసారి వన్డేల్లో మొదటి వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఈ ఓపెనింగ్ జోడీ.. అదే క్రమంలో డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లింది. కానీ.. జట్టు స్కోరు 193 వద్ద సిక్స్ కొట్టే ప్రయత్నంలో రోహిత్ శర్మ ఔటై.. సెంచరీని చేజార్చుకోగా.. 97 బంతుల్లో శిఖర్ ధావన్‌ 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వన్డే కెరీర్‌లో శిఖర్ ధావన్‌కి ఇది 16వదికాగా.. ఈ ఏడాది ఇదే మొదటిది కావడం విశేషం. సెంచరీ సాధించిన తర్వాత శిఖర్ ధావన్ శివాలెత్తిపోయాడు. పేసర్లు, స్పిన్నర్లు అని తేడాలేకుండా.. బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు 254 వద్ద పాట్ కమిన్స్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ క్లీన్‌బౌల్డవగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లి (7: 6 బంతుల్లో 1x4), లోకేశ్ రాహుల్ (26: 31 బంతుల్లో 1x4), కేదార్ జాదవ్ (10: 12 బంతుల్లో) నిరాశపరిచారు. కానీ.. రిషబ్ పంత్, విజయ్ శంకర్ స్లాగ్ ఓవర్లలో క్రీజులో ఉన్నంతసేపూ దూకుడుగా ఆడారు. ఇన్నింగ్స్ చివరి బంతి, తాను ఎదుర్కొన్న తొలి బంతినే జస్‌ప్రీత్ బుమ్రా (6 నాటౌట్: 1 బంతి 1x6) సిక్స్‌గా కొట్డడం విశేషం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Hyderabad, First Published 23, Aug 2018, 4:24 PM IST Highlights టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. బండ్ల గణేష్ పెద్ద సోదరుడు కుమార్తె అశ్రిత వివాహం హైదరాబాద్ లోకి జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ఈరోజు జరిగింది. ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, బ్రహ్మానందం దంపతులు, హీరో శ్రీకాంత్ దంపతులు, రాజశేఖర్ జీవిత, కొందరు హీరోలు ఈ వేడుకకు హాజరయ్యి నూతన వధూవరులకు తమ ఆశీస్సులు అందించారు. సినీ ప్రముఖులతో పాటు కొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.   cm
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ సాంగ్: మరోసారి ఆకట్టుకున్న తమన్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. Samayam Telugu | Updated: Nov 4, 2019, 10:45PM IST ‘చిత్రలహరి’ చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ ఇప్పుడు ‘ప్రతిరోజూ పండగే’ అంటూ తెలుగు ప్రేక్షకులకు పండగలాంటి సినిమాను అందించేందుకు సిద్ధమవుతున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశీ ఖన్నా హీరోయిన్‌గా ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ అమెరికాలో జరిగింది. ఈ సినిమాలో టైటిల్ సాంగ్‌కు మంచి ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ సినిమాలో మంచి సందర్భంలో ఈ పాట వస్తుంది. అలాంటి టైటిల్‌ సాంగ్‌ని సోమవారం విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తమన్ స్వరపరిచిన ఈ పాటకు కేకే సాహిత్యం అందించారు. శ్రీకృష్ణ ఆలపించారు. ఈ మధ్య కాలంలో తమన్ మంచి స్వరాలను అందిస్తున్నారు. మొన్నీమధ్యే ‘అల.. వైకుంఠపురములో...’ రెండు అద్భుతమైన పాటలను స్వరపరిచిన తమన్.. ఇప్పుడు తేజూ కోసం మరో ఆసమ్ ట్యూన్‌ను ఇచ్చారు. ‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ సాంగ్ X కాగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు.. ప్రతి ఒక్కరు హాయిగా ఎంజాయ్ చేసే మంచి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్‌ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్‌లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్‌గా చూపించనున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్‌టైన్మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
0business
Visit Site Recommended byColombia కోహ్లి గైర్హాజరీలో రోహిత్ శర్మ త్రైపాక్షిక టీ20లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్ మార్చి 6-18 తేదీల మధ్య జరగనుంది. దీంతో ముంబై టీ20 లీగ్‌లో మెజార్టీ మ్యాచ్‌లకు రోహిత్ దూరం కానున్నాడు. అందుకే అతడికంటే రహానేకు ఎక్కువ మొత్తం దక్కింది. ముంబై నార్త్ సెంట్రల్ జట్టు రూ. 5 లక్షలకు శ్రేయస్ అయ్యర్‌ను తమ ఐకాన్ ప్లేయర్‌గా కొనుగోలు చేయగా.. ముంబై సౌత్ రూ. 4 లక్షలు వెచ్చించి అభిషేక్ నాయర్‌ను తమ ఐకాన్ ప్లేయర్‌గా దక్కించుకుంది. నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు ఐకాన్ ప్లేయర్‌తోపాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సత్తా చాటుతున్న ఐదుగురు ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాంఖడే స్టేడియంలో మార్చి 11 నుంచి 21 తేదీల మధ్య ముంబై టీ20 క్రికెట్ లీగ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సచిన్ టెండుల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా.. ఆయన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ట్రైనింగ్ కారణంగా ఈ లీగ్‌కు దూరంగా ఉండనున్నాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
పడిలేచిన కెరటంలా ముందుకు అంతర్జాతీయంగా మళ్లీ పాపులారిటీ జూనియర్లకు సూచనలు పొదుపైన బౌలర్‌గా ప్రథమ స్థానం న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో అకౌంట్‌ లేదని,పాత నోకియా ఫోన్‌నే వాడుతున్నానని ప్రకటించిన టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ ఆశీష్‌ నెహ్రాపై ఇటీవల కాలంలో ప్రశంసలు,విమర్శలు పెరిగిపోయాయి. ఇంకా ఇలాంటి వాళ్లు ఉన్నారా? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాతకాలపు మనిషి అంటూ పలువురు నెహ్రాను ఛమత్కరిస్తు న్నారు.వీటిపై టీమిండియా క్రికెటర్‌ రోహిత్‌శర్మ కూడా ట్విట్టర్‌ ద్వారా స్పందించాడు.సోషల్‌ మీడియాలో నెహ్రా ట్రెండ్‌ అవుతున్నాడు.కానీ ఈ విషయం అతను చూడకపోవడమే ఆశ్చర్యం. ఎందుకంటే నెహ్రా పాత కాలపు మనిషి కనుక.అంటూ పేర్కొన్నాడు.కాగా ఆశీష్‌ నెహ్రా ఇప్పుడు టీమిండియా బౌలింగ్‌ భారాన్ని మోస్తున్నాడు. సీనియర్‌ బౌలర్‌ అయిన నెహ్రా గాయలు, ఫాం లేమితో గత కొంత కాలంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.అయితే ఐపిఎల్‌ పుణ్యమాని టి20 భారత్‌ జట్టులో స్థానం దక్కించుకున్నాడు ఈ 36 సంవత్సరాల పేస్‌ బౌలర్‌.కాగా ఊహంచిన రీతిలో లేటు వయసులోనూ పడిలేచిన కెరటంలా టీమిండియాలోకి దూసుకొచ్చిన నెహ్రా టి20ల్లో అనూహ్యంగా ఆడుతూ అంతర్జాతీయంగా మళ్లీ పాపులారిటి తెచ్చుకున్నాడు.పొదుపైన బౌలింగ్‌తో పొట్టి క్రికెట్‌లో నెహ్రా ఆకట్టుకుంటున్నాడు. కాగా ఆదిలో ఓపెనర్ల వికెట్లు తీస్తూ టీమిండియా బౌలర్లకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. భారత జట్టులో జహీర్‌ఖాన్‌ వంటి సీనియర్‌ బౌలర్‌ లేని సమయంలో అతను కొత్త బంతితో బాగా ఆడుతున్నాడు. సీనియర్‌ బౌలర్‌గా ఇటు బూమ్రాకు,అటు పాండ్యాకు సూచనలు,సలహాలు ఇస్తూ దూసుకెళ్తున్నాడు. బంగ్లాదేశ్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో నెహ్రా ఈ ఇద్దరికి సూచనలు ఇస్తూ కనిపించాడు. ఇక బౌలింగ్‌లో నెహ్రా బాగానే ముందుకు సాగుతున్నాడు.టి20 వరల్డ్‌ కప్‌లో ఇప్పటి సగటున ఓవర్‌కు తక్కువ పరుగులు ఇచ్చి పొదుపైన బౌలర్‌గా నెహ్రా ప్రథమస్థానంలో ఉన్నాడు.ఓవర్‌కు 5.93 సగటు పరుగులతో పొదుపైన బౌలర్‌గా ద్వేన్‌ బ్రేవో,ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌లను వెనక్కి నెట్టేశాడు.ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ ఆశలు నిలబెట్టింది నెహ్రానే.కాగా ఈ మ్యాచ్‌లో అతను పొదుపైన బౌలింగ్‌ చేయడమే కాదు,ప్రమాదకరమైన ఉస్మాన్‌ ఖావాజాను ఔట్‌ చేశాడు.ఈ రెండు జరిగి ఉండకపోతే భారత్‌ ముందు కొండంత టార్గెట్‌ ఉండేది.కాగా ఈ మ్యాచ్‌లో మొదటి బంతుల్లో 11 డాట్‌ బాల్స్‌ వేసిన నెహ్రా ఓవరాల్‌గా 13 డాట్‌ బాల్స్‌ వేశాడు.తన కళాత్మక విధ్వంసంతో ఈ మ్యాచ్‌ క్రెడిట్‌ కోహ్లీ దక్కించుకున్నా కెప్టెన్‌ ధోనీ మాత్రం నెహ్రా నైపుణ్యాన్ని కొనియాడాడు.జట్టు అవసరాలకు అనుగుణంగా మంచి బౌలింగ్‌ను నెహ్రా వేశాడని మెచ్చుకోవడం గమనార్హం.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV విరాట్ సెంచరీ.. తొలి రోజు భారత్‌దే హవా హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి శతకంతో చెలరేగాడు. TNN | Updated: Feb 9, 2017, 04:51PM IST హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి శతకంతో చెలరేగాడు. 130 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో శతకం బాదాడు. విరాట్ కెరీర్లో ఇది 16వ టెస్టు శతకం కావడం విశేషం. 96 పరుగుల వ్యక్తిగత స్కోరుకు చేరుకోగానే స్టేడియమంతా కోహ్లి నామస్మరణతో మారుమోగిపోయింది. అభిమానుల కోలాహలం మధ్యనే మెహిది హసన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా బంతిని బౌండరీకి తరలించిన కోహ్లి కెరీర్లో మరో మైలురాయిని అందుకోగలిగాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. విరాట్‌ 111 పరుగులతో, రహానె 45 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. ఇదే మ్యాచ్‌లో మురళీ విజయ్ కూడా శతకం బాదిన సంగతి తెలిసిందే.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV నా పేరు గిరి.. నా ఇళ్లు ‘నాగార్జున’ ఈ యువకుడి పేరు గిరిబాబు. ఊరు అమలాపురం. ఇతడికి నాగార్జున అంటే వీరాభిమానం ఎంతెలా అంటే తాను కష్టపడి కట్టుకున్న ఇంటికి ‘కింగ్ నాగార్జున నిలయం ’ అని పేరు పెట్టేంతగా!! TNN | Updated: Sep 1, 2017, 02:10PM IST ఆయ్... నా పేరు గిరిబాబండి. మాది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర్లో విలస గ్రామం అండి. మా గోదారోళ్లకి సినిమా పిచ్చి కాస్త ఎక్కువే లెండి.. మా అభిమాన హీరో సినిమా వస్తుంంటే అబ్బా... ఆసందడే వేరులెండి. థియేటర్ అంతా పెద్ద పెద్ద ప్లెక్సీలు పెట్టేసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తేనేకాని నేను బువ్వముట్టను.. అంతే కాదండిబాబూ నాకు నాగార్జున అంటే భళే ఇష్టం అండి ఎంత అంటే కొన్ని సంగతులు మీతో చెప్పాలండి. ఇంటారా!! నా పేరు చెప్పను కదండీ బాబూ.. గిరి బాబు నేను అమలాపురం చిన్న లేబొరేటరీలో వర్కర్‌గా పనిచేస్తున్నానండి. నాకు నాగార్జున అంటే మహ పిచ్చండీ.. ఆయనంటే పేణం. అందుకేనండీ చిన్నప్పటినుండీ ఆయన సినిమాలు తెగ చూశానండీ. మన్మథుడు సినిమా అయితే ఎన్నిసార్లు చూశానో నాకే తెలీదండి. అందుకే ఆ సినిమాలో ఆయన భుజంపై వేసుకున్న పచ్చబొట్టుని నేను కూడా కసక్ మని పొడిపించేసుకున్నాడండీ.. అంతేకాదండీ నాగార్జున అంటే ఎంత అభిమానమో చెప్పాలని ఆ పేరుని నా ఒంటి మీద పచ్చబొట్టు పొడిపించేసుకున్నానండీ.
0business
Hyd Internet 90 Views ICICI ICICI ముంబై: దేశంలో ప్రైవేట్‌ బ్యాంకుల్లో అగ్రగామి అయిన ఐసిఐసిఐబ్యాంకు నికరలాభాలు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఇంతకుముందు ఏడాదితో పోలిస్తే 34శాతం పడిపోయాయి. అయితే అసెట్‌ పాలిటి విషయంలో మాత్రం కాస్త మెరుగుదల కనపరచారు. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంకు రూ.3,102కోట్ల నికరలాభం ఆర్జించగా, ఈ ఏడాది అది 2,058కోట్లకు పడిపోయింది. కాగా గత ఏడాది సెప్టెంబరు నాటికి బ్యాంకు స్థూలనిరర్ధక ఆస్తుల నిష్పత్తి, నికర ఎన్‌పిఎల నిష్పత్తి 6.12శాతం, 3.21శతంగా ఉండగా, ఈ ఏడాది అదేసమయానికి వరుసగా 7.87శాతం, 4.43శతంగా ఉన్నాయి. అయితే క్రితం త్రైమాసికంతో పోలిస్తే మాత్రం కాస్త మెరుగ్గా ఉన్నాయి. క్రితం త్రైమాసికంలో వరుసగా 7.99శాతం, 4.86శాతంగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వడ్డీల, నికరమార్జిన్‌ 3.13శాతంగా ఉండగా, ఇప్పుడు స్వల్పంగా పెరిగి 3.27శాతానికి చేరుకుంది. అలాగే క్రితం ఏడాది ఇదే సమయంలో వడ్డీలపై రాబడి రూ.5,253కోట్లు ఉండగా, ఇప్పుడు 9శాతం పెరిగి రూ.5,709కోట్లకు చేరుకుంది. అలాగే ఫీజుల ద్వారా ఆదాయం కూడా 9శాతం పెరిగి, రూ.2,570కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే సమయంలో వడ్డీలు కాక మిగతా వాటికి కంటింజెన్సి పథకాల కోసం బ్యాంకు రూ.7,083కోట్లు కేటాయించగా, ప్రస్తుత త్రైమాసికంలో రూ.4,502కోట్లు మాత్రమే కేటాయించింది. వాస్తవానికి చూసినట్లయితే క్రితం ఏడాదితో పోలిస్తే ఇప్పుడు నిరర్థక ఆస్తులు పెరిగాయి. క్రితం ఏడాది ఎంపిఎల్‌ రూ.32,548కోట్లుగా ఉండగా, ఇప్పుడు అవి రూ.44,489కోట్లకు పెరిగాయి.
1entertainment
విష్ణు మంచు "ఓటర్" ఫస్ట్ లుక్... రాజకీయాలపై వివాదమా? Highlights హీరో విష్ణు మంచు జన్మదిన సందర్భంగా విడుదలైన 'ఓటర్' ఫస్ట్ లుక్ పోస్టర్ పోస్టర్ లో రాజకీయ నాయకుల చిత్రాలు ఓటర్ పవరేంటో చూపించే చిత్రం హీరో విష్ణు మంచు జన్మదిన సందర్భంగా విడుదలైన 'ఓటర్' ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేష స్పందన వస్తుంది. ప్రముఖ కేంద్ర, రాష్ట్ర రాజకీయ నాయకుల ముఖచిత్రాలతో నిండి, ఓటర్ గా విష్ణు తన ఇన్క్ వేయబడిన వేలును చూపిస్తున్నట్లున్న ఓటర్' ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా పవర్ఫుల్ గా ఉందని ప్రశంసిస్తున్నారందరు. ప్రధాని నరేంద్ర మోది, అటల్ బిహారి వాజ్పాయ్ నుండి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ మరియు దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డితో సహా పలువురు ప్రఖ్యాత నేతల ఫొటోలతో కూడిన పోస్టర్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది.    జి.ఎస్. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ కుమార్ పూదోట నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తికావస్తోంది. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో బైలింగ్వల్ గా రూపొందుతున్న'ఓటర్' చిత్రంతో విష్ణు తమిళ తెరకు పరిచయం కాబోతున్నారు. తమిళంలో 'కురళ్ 388 ' అనే పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు నిర్మాతలు. "ప్రజా స్వామ్యంలో అత్యంత కీలకమైన పాత్ర ఓటర్ దే, కానీ అటువంటి ఓటర్ ఎన్నికల తర్వాత నిర్లక్ష్యానికి గురవుతున్నాడు. ఓటర్ పవర్ ఏంటో చూపించే చిత్రం ఇది. కామన్ పాయింట్ కావడంతో తమిళంలో కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. తమిళ తెరకు పరిచయం అయ్యేందుకు విష్ణుకు ఇది మంచి చిత్రం అవుతుందని భావిస్తున్నాను," అన్నారు దర్శకుడు. తమిళ ప్రముఖ రాజకీయ నాయకుల ఫొటోలతో నిండిన 'కురళ్ 388 ' ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా అనూహ్య స్పందన వస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలనీ భావిస్తున్నారు. త్వరలోనే ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు నిర్మాత.   ఇతర తారాగణం మరియు సాంకేతిక వర్గం: సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రవణ్, బేసన్ నాగర్ రవి, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: కిరణ్ మన్నే, కూర్పు: కె.ఎల్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: రాజేష్ యాదవ్, సహ-నిర్మాత: కిరణ్ తనమాల, సంగీతం: ఎస్.ఎస్.తమన్, నిర్మాత: జాన్ సుధీర్ కుమార్ పూదోట,   కథ-మాటలు-దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్. Last Updated 25, Mar 2018, 11:57 PM IST
0business
Visit Site Recommended byColombia ‘నేను శైల‌జ’ వంటి యూత్‌ఫుల్ లవ్‌స్టోరీని అందించిన కిషోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వంలో ‘చిత్రలహరి’ తెరకెక్కుతోంది. ఆ సినిమాలో మాదిరిగానే ‘చిత్రలహరి’ కూడా మ్యూజికల్ హిట్ అవుతుందని తేజూ అభిమానుల ఆశిస్తున్నారు. ‘శ్రీమంతుడు’, ‘జ‌న‌తా గ్యారేజ్‌’, ‘రంగ‌స్థలం’ వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాల‌ను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా న‌టించారు. సునీల్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. #ChitralahariFirstSingle #ParuguParugu from Tomorrow 5 PM on @SonyMusicSouth A @ThisIsDSP Musical https://t.co/MLzdJhnHuB — Mythri Movie Makers (@MythriOfficial) 1552910669000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
దర్శకుడు తర్వాత మళ్లీ కుమారి 21ఎఫ్ కాంబినేషన్ రిపీట్! Highlights చిన్న చిత్రాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం కుమారి 21 ఎఫ్ జీనియస్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా రూపొందిన చిత్రం కుమారి 21 ఎఫ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై ఆగస్టు 4న మరో వైవిధ్య ప్రేమకథా చిత్రం దర్శకుడు కుమారి 21ఎఫ్ టీమ్ కాంబినేషన్ లో త్వరలో మరో చిత్రం   చిన్న చిత్రాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం కుమారి 21 ఎఫ్. జీనియస్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం అప్పట్లో హాట్‌టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక సుకుమార్ రైటింగ్స్ సంస్థ నుంచి రానున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు ఆగస్టు 4న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ తరుణంలో సుకుమార్ రైటింగ్స్ సంస్థ తన మరో తాజా చిత్రానికి శ్రీకారం చుట్టబోతుంది.   కుమారి 21ఎఫ్  సెన్సేషనల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. ఆ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించిన రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ తాజా చిత్రానికి సంగీతం అందించడం ఈ చిత్రంకు మొదటి ఆకర్షణ. కుమారి 21ఎఫ్ విజయంతో తారాజువ్వలా దూసుకెళ్తున్న రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. కుమారి 21ఎఫ్  చిత్రంతో  తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న పల్నాటి సూర్యప్రతాప్ ఈ నూతన చిత్రానికి దర్శకుడు. వైవిధ్యమైన కథలకు చిరునామాగా చెప్పుకునే ప్రముఖ దర్శకుడు సుకుమార్ అందిస్తున్న కథతో  సుకుమార్ రైటింగ్స్ అండ్ రేష్మాస్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని సుకుమార్‌తో కలిసి విజయ ప్రసాద్ బండ్రెడ్డి, సునీత-రాజ్‌కుమార్ బృందావనం నిర్మిస్తారు. సహ నిర్మాత శ్రీ తులసి బండ్రెడ్డి.   ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ వైవిధ్యమైన చిత్రాలను అందించాలనే తపనతోనే సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించాం. సుకుమార్ ఆలోచనలు.. ఆయన విభిన్నత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుండి అందరూ ఎలాంటి వైవిధ్యమైన చిత్రాలను కోరుకుంటారో ఈ తాజా చిత్రం కూడా అంతకుమించిన కొత్తదనంతో వుండబోతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం అని తెలిపారు. Last Updated 25, Mar 2018, 11:45 PM IST
0business
virat kohli move up to 5th spot in latest icc test rankings వార్నర్‌ను వెనక్కి నెట్టి.. టెస్టుల్లో ఐదో స్థానానికి కోహ్లి! కోల్‌కతాలో శతకం బాదిన కోహ్లి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను వెనక్కి నెట్టాడు. TNN | Updated: Nov 21, 2017, 05:17PM IST ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐదోస్థానానికి ఎగబాకాడు. కోల్‌కతా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విరాట్.. టాప్-5లో చేరాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను వెనక్కి నెట్టాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ ఆటగాడు జోయ్ రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ మూడోస్థానంలో ఉండగా.. నిలకడకు మారు పేరైన ఛటేశ్వర్ పుజారా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. వార్నర్, విరాట్ మధ్య ఒక పాయింట్ మాత్రమే అంతరం ఉంది. శ్రీలంకతో రెండో టెస్ట్ అనంతరం విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా సొంత గడ్డ మీద ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ఆడనుంది. దీంతో వచ్చేసారి ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకటించే సమయానికి డేవిడ్ వార్నర్ కోహ్లిని వెనక్కి నెట్టే అవకాశం ఉంది. ఐసీసీ వన్డే, టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బౌలింగ్ విభాగం విషయానికి వస్తే.. కోల్‌కతా టెస్టులో 8 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన భువనేశ్వర్ కుమార్ 29వ ర్యాంక్ సాధించాడు. భువీ కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. మరో పేసర్ మహ్మద్ షమీ.. 18వ స్థానంలో నిలిచాడు. కోల్‌కతా టెస్టులో పిచ్ మీద పచ్చిక ఉండటంతో సరిగా బౌలింగ్ చేయలేకపోయిన రవీంద్ర జడేజా టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మూడోస్థానానికి పడిపోయాడు. అశ్విన్ నాలుగోస్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ తొలి స్థానంలో నిలవగా, దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడ రెండో స్థానానికి చేరుకున్నాడు.
2sports
Highlights నిర్మాతపై ఫిర్యాదు చేసిన ప్రియమణి తెలుగు పరిశ్రమలో హిరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి. ప్రేమ్‌ ఆర్యన్ దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో ‘అంగుళీక’ అనే చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారు. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకొన్నారు. అయితే తాను తప్పుకొన్న చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాల్లో  తన ఫొటోలు ఉపయోగించుకున్నారని ఆరోపిస్తూ సినీ నటి ప్రియమణి సదరు చిత్ర నిర్మాతపై మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)కు ఫిర్యాదు చేశారు.   ప్రియమణికి ‘అంగుళీకం’ కథ చెప్పి, అందులో నటించాల్సిందిగా దర్శక, నిర్మాతలు తొలుత ఆమెను సంప్రదించారు. అందుకు ప్రియమణి కూడా అంగీకరించడంతో ఫొటోషూట్‌ జరిగింది. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం నుంచి ప్రియమణి తప్పుకొన్నారు. అనంతరం ఇందులో కథానాయిక పాత్రకోసం వేరొకరిని సంప్రదించారు. అయితే ఈ చిత్రం ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రచారంలో భాగంగా చిత్రబృందం మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసింది. ఇందులో‌ ప్రియమణి చిత్రాలను వాడుకున్నారంటూ ఆమె ప్రతినిధులు ‘‌మా’కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. Last Updated 25, Mar 2018, 11:39 PM IST
0business
india is now second largest mobile phone producer: indian cellular association రెండో అతి ఎక్కువ ఫోన్లు తయారీ భారత‌దేశంలోనే... ప్ర‌పంచంలో చైనా త‌ర్వాత అత్య‌ధికంగా ఫోన్లు త‌యార‌వుతున్న దేశంగా భార‌త్ వినుతికెక్కింద‌ని ఇండియ‌న్ సెల్యూలార్ అసోసియేష‌న్(ఐసీఏ) ప్ర‌క‌టించింది. TNN | Updated: Apr 1, 2018, 03:21PM IST ప్ర‌పంచంలో చైనా త‌ర్వాత అత్య‌ధికంగా ఫోన్లు త‌యార‌వుతున్న దేశంగా భార‌త్ వినుతికెక్కింద‌ని ఇండియ‌న్ సెల్యూలార్ అసోసియేష‌న్(ఐసీఏ) ప్ర‌క‌టించింది. టెలికాం మంత్రి మ‌నోజ్ సిన్హా, ఐటీ శాఖా మంత్రి ర‌వి శంక‌ర్ ప్ర‌సాద్‌తో ఐసీఏ ఈ స‌మాచారాన్ని పంచుకుంది. మార్చి 28న ఇద్ద‌రు మంత్రుల‌కు ఐసీఏ జాతీయ అధ్య‌క్షుడు పంక‌జ్ మొహింద్రో రాసిన లేఖ‌లో భార‌త ప్ర‌భుత్వం, ఐసీఏ, ఎఫ్‌టీటీఎఫ్ చేసిన సంయుక్త కృషి వ‌ల్ల ఫోన్ల త‌యారీలో భార‌త్ రెండో స్థానానికి చేరుకోగ‌లిగింద‌ని రాశారు. మొబైల్ ఫోన్ త‌యారీలో భార‌త్ దూసుకెళుతోందా? ఎఫ్‌టీటీఎఫ్ అంటే ఫాస్ట్ ట్రాక్ టాస్క్ ఫోర్స్. దేశ ఎల‌క్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్స్ 2019 స‌మ‌యానిక‌ల్లా 50 కోట్ల ఫోన్లు త‌యారీ ల‌క్ష్యంగా నిర్దేశించుకుంది. దాదాపు 46 బిలియ‌న్ యూఎస్ డాల‌ర్ల విలువైన ఫోన్ల‌ను త‌యారుచేయాల‌ని భావించారు. ఎఫ్‌టీటీఎఫ్ అనే దానిలో ప‌రిశ్ర‌మ, ప్ర‌భుత్వం నుంచి స‌భ్యులు ఉంటారు. ఈ సంస్థ ద్వారా 8బిలియ‌న్ యూఎస్ డాల‌ర్ల విలువైన ఫోన్ల విడి భాగాలు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. త‌ద్వారా మొబైల్ ఉత్ప‌త్తుల్లో ఉన్న అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటూ 2019 క‌ల్లా 15 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పించాల‌నేది ప్ర‌ణాళిక‌. Read also in English
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అక్రమ సంబంధం ఆరోపణలపై స్పందించిన షమీ షమీకి అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందని.. అతడి భార్య చేసిన ఆరోపణలపై క్రికెటర్ స్పందించాడు. TNN | Updated: Mar 7, 2018, 02:20PM IST అక్రమ సంబంధం ఆరోపణలపై స్పందించిన షమీ టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీకి అమ్మాయిలతో సంబంధాలున్నాయని అతడి భార్య ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వేరే అమ్మాయిలతో షమీ చేసిన చాటింగ్ స్క్రీన్‌షాట్లను ఫోన్ నంబర్లతో సహా హసీన్ జాహన్ బయటపెట్టింది. ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో ఉంచింది. తనను రెండేళ్లుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని, చంపాలని కూడా చూశారని ఆమె ఆరోపించింది. దీంతో షమీ అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్త మీడియాలో హల్‌చల్ చేసింది. అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయంటూ భార్య ఆరోపించడంపై షమీ స్పందించాడు. ప్రస్తుతం ధర్మశాలలో ఉన్న షమీ ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలిపాడు. తన భార్య చేసిన ఆరోపణలన్నీ అసంబద్ధమని షమీ తెలిపాడు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పాడు. చదవండి: ​ మహ్మద్ షమీకి వివాహేతర సంబంధాలు.. గుట్టు బయటపెట్టిన భార్య! ఎవరో ఉద్దేశపూర్వకంగానే తన కెరీర్‌ను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని షమీ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఆట నుంచి దూరం చేయడానికి భారీ కుట్ర పన్నుతున్నారని ఆరోపించాడు. తన పరువు తీయడానికి ఎవరో కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని షమీ ట్వీట్ చేశాడు. Hi I'm Mohammad Shami. Ye jitna bhi news hamara personal life ke bare may chal raha hai, ye sab sarasar jhut hai, ye koi bahut bada humare khilap sajish hai or ye mujhe Badnam karne or mera game kharab karne ka kosis ki ja rahi hai. — Mohammad Shami (@MdShami11) March 7, 2018   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
జయజానకినాయక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో గ్యాలరీ First Published 10, Aug 2017, 2:55 PM IST జయజానకినాయక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో గ్యాలరీ జయజానకినాయక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో గ్యాలరీ జయజానకినాయక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో గ్యాలరీ జయజానకినాయక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో గ్యాలరీ జయజానకినాయక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో గ్యాలరీ జయజానకినాయక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో గ్యాలరీ జయజానకినాయక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో గ్యాలరీ జయజానకినాయక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో గ్యాలరీ జయజానకినాయక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో గ్యాలరీ జయజానకినాయక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో గ్యాలరీ Recent Stories
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV తిత్లీ తుఫాన్ బాధితులకు ‘మా’ సాయం తిత్లీ తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) సభ్యులు. Samayam Telugu | Updated: Oct 20, 2018, 06:31PM IST తిత్లీ తుఫాన్ బాధితులకు ‘మా’ సాయం తిత్లీ తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) సభ్యులు. భయంకర తిత్లీ తుఫాన్ బీభత్సం‌తో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రూ. 2800 కోట్ల మేర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. బాధితులను ఆదుకోవడానికి పెద్ద మనసుతో ముందుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందజేయాలని రాష్ట్ర ప్రజలను కోరుతోంది ఏపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా శనివారం నాడు రూ.5 లక్షల చెక్కును ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావుకి అందచేశారు ‘మా’ సభ్యులు. ఈ కార్యక్రమం లో 'మా' అధ్యక్షులు శివాజీరాజా , జనరల్ సెక్రటరీ నరేష్ , వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ , ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వర రావు, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, నటుడు నిర్మాత అశోక్ కుమార్, నాగినీడు, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
P.V.Sindhu వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌కు సింధు అర్హత న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ సింగిల్స్‌ టోర్నమెంట్‌కు భారత్‌కు చెందిన సింధు తొలిసారి అర్హత సాధించింది.కాగా ఈ మెగా ఈవెంట్‌ దుబా§్‌ులో డిసెంబర్‌ 14 నుంచి 18 వరకు జరుగుతుంది.సీజన్‌లోని 12 సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లు ముగిశాక టాప్‌-9లో నిలిచిన క్రీడాకారిణులకు వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో ఆడే అవకాశం లభిస్తుంది.కాగా సింధు 46,290 పాయింట్లతో ఎనిమిదవ స్థానంలో నిలిచి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి బెర్త్‌ ఖాయం చేసుకుంది. మరోవైపు సైనా నెహ్వాల్‌ తొమ్మిదవ స్థానంలో నిలిచి ఈ టోర్నీకి అర్హత పొందలేకపోయింది. సింధుతో తై జు యంగ్‌, అకానే యూసుగుచి,సెన్‌ ఉ,సుంగ్‌ జి హుస్‌,రదనోక్‌,హీ బింగ్‌ జియావో,కరోలినా మారిన్‌ కూడా ఈ టోర్నీకి అర్హత పొందారు.
2sports
Read Also: ఓటింగ్‌లో టాప్ బాబా, శ్రీముఖి.. ఆ ముగ్గురికీ అప్పడం! తాజాగా ప్రోమోలో.. వరుణ్, బాబా భాస్కర్‌లు సరదాగా మాట్లాడుకుంటున్న మాటలను ప్లే చేసి చూపించిన నాగార్జున.. బాబా భాస్కర్‌ని టార్గెట్ చేశారు. ఈరోజు గడిస్తే.. మరో వారం మాత్రమే ఇక మిగిలి ఉందని వరుణ్.. బాబా భాస్కర్‌తో అంటుండగా.. బాబా భాస్కర్ ‘దీన్ని నేను కేర్ చేయను.. ఐ యామ్ ఫైనల్ టికెట్ కంటెస్టెంట్స్ .. నో టెన్షన్, నో నత్తింగ్’ అని అంటున్నారు. మరి ఇందులో నాగార్జునకి తప్పేం కనిపించిందో ఏమో కాని.. బాబా భాస్కర్‌ని పిలిచి ‘నీ టికెట్ టు ఫినాలే ఎక్కడ ఉంది.. ఇలా తీసుకురా అని.. అది ఫేక్ టికెట్ టు ఫినాలే, నువ్ కూడా నామినేషన్స్‌లో ఉన్నావు అందరితో పాటు’ అంటూ సీరియస్ అవుతున్నారు. అయితే ఇదంతా ఎపిసోడ్‌కి హైప్ తీసుకువచ్చేందుకు ఇచ్చే బిల్డప్ మాత్రమే అని.. నాగార్జున సపోర్ట్ బాబాకి లేకపోయినా ప్రేక్షకుల మద్దతు ఉందని, ఖచ్చితంగా బాబా ఫైనల్‌కి వెళ్తారని ఈ ప్రోమోపై కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు.. నాగార్జున ప్రతిసారి చిన్న విషయాన్ని పెద్దది చేసి బాబా భాస్కర్‌కి క్లాస్ పీకడం కామనే.. ఈసారి ఆయన్ని నెగిటివ్‌గా చూపించేందుకు మరో స్కెచ్ వేశారు అంటూ నాగార్జునపై మండిపడుతున్నారు. ఈ ప్రోమోకి వస్తున్న కామెంట్స్‌లో అందరూ నాగార్జునను తిడుతున్నవారే తప్ప.. కరెక్ట్ అంటున్నవారు లేకపోవడం విశేషం. అందరూ బాబా భాస్కర్‌కి జై కొడుతున్నారు. మరి ఈ డ్రామా ఏంటో నేటి రాత్రి ఎపిసోడ్‌లో చూడాలి. X
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV బంగ్లా గెలుస్తుందని.. షకీబ్ భార్య ముందే..? ఆస్ట్రేలియా జట్టుపై తొలి టెస్టులో బంగ్లా సంచలన విజయం సాధిస్తుందని బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ భార్య TNN | Updated: Aug 30, 2017, 06:24PM IST ఆస్ట్రేలియా జట్టుపై తొలి టెస్టులో బంగ్లా సంచలన విజయం సాధిస్తుందని బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ భార్య ముందే చెప్పిందట. ఢాకా వేదికగా బుధవారం ముగిసిన ఈ టెస్టులో బంగ్లాదేశ్ 20 పరుగుల తేడాతో అనూహ్యంగా విజయాన్ని అందుకుంది. 265 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (112: 135 బంతుల్లో 16x4, 1x6) శతకం బాదినా.. షకీబ్ అల్ హసన్ (5/85) ధాటికి మిగిలిన బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. దీంతో పసికూన చేతిలో కంగారూలకి ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 5/68తో రాణించిన షకీబ్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 5 వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ‘బంగ్లాదేశ్ చరిత్రాత్మక విజయంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. స్టేడియానికి వచ్చి మద్దతిచ్చిన అభిమానులకి థ్యాంక్స్. మేము గెలుస్తామని వారు నమ్మకంతో వచ్చారో లేదో తెలియదుగానీ.. నేను మాత్రం డ్రింక్స్ బ్రేక్ సమయంలో జట్టుతో ఒకటి చెప్పాను. స్టేడియానికి వచ్చిన అభిమానులు మనం గెలుస్తామనే నమ్మకంతో వచ్చారు. వారిని తలదించుకునేలా చేయొద్దు అని. మంగళవారం రాత్రి కూడా బంగ్లాదేశ్ గెలుస్తుందని నేను ఊహించలేదు. కానీ.. షకీబ్ నువ్వు బంగ్లాదేశ్‌ని రేపు గెలిపిస్తావ్ అని నా భార్య నాతో అంది’ అని షకీబ్ వెల్లడించాడు.
2sports
Dhoni వైరల్‌గా మారిన ధోనీ డాన్స్‌ వీడియో న్యూఢిల్లీ: ఐపిఎల్‌ -10 సీజన్‌ ప్రారంభానికి ముందు రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ పదవి నుంచి ఉద్వాసనకు గురైన ధోనీ ప్రస్తుతం జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగుతు న్నాడు. ధోని తన సహచర ఆటగాళ్లతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.ధోని తన ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా ఈ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు.ఈ వీడియోలో ధోని,అజింక్యా రహానే కలిసి డ్యాన్స్‌చేస్తుండగా పుణే జట్టులో ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ వెనున నిల్చుని ఎంజా§్‌ు చేస్తున్నాడు.ఈ వీడియోను పోస్టు చేసిన 12 గంటల్లోనే 7.50 లక్షల వ్యూస్‌, 4400 కామెంట్లు వచ్చాయి.ఇదే వీడియోని అజింక్యా రహానే తన పేస్‌ బుక్‌ ద్వారా షేర్‌ చేశాడు.2008 ఐపిఎల్‌ ఆరంభమయ్యాక 2015 వరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా ధోని బాధ్యతలు నిర్వర్తించాడు.ఐపిఎల్‌ నుంచి చెన్నై జట్టుపై నిషేదం విధించిన తరువాత గత సీజన్‌లో పుణే కెప్టెన్‌గా ధోని నియమితు డయ్యాడు. అయితే ఐపిఎల్‌ -10వ సీజన్‌ ప్రారంభానికి ముందు ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించి అతడి స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. ఇదిలా ఉంటే కెప్టెన్సీ బాధ్యతలు లేకుండా సాధారణ ఆటగాడిగా ధోని ఆడుతున్న తొలి ఐపిఎల్‌ ఇదే కావడం విశేషం.
2sports
SACHIN సచిన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం కానుక ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌ సినిమాకు మహారాష్ట్ర ప్రభుత్వం వినోదం పన్ను మినహాయించింది. సచిన్‌ టెండూ ల్కర్‌ ప్రపంచ క్రికెట్‌కు చేసిన సేవలు, ప్రజలందరికీ థియేటర్లలో సినిమా చూసే అవకాశం కల్పించేదుకు వీలుగా మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఈనిర్ణయం తీసుకుంది. బ్రిటిష్‌ ఫిల్మ్‌మేకర్‌ జేమ్స్‌ ఎర్‌స్కైన్‌ రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ, ఇంగ్లీష్‌,మరాఠీ, తమిళం, తెలు భాషల్లో శుక్రవారం విడుదలైంది. 200నాటౌట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రవి భగ్‌చంద్కా, కార్నివాల్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించారు.సచిన్‌ చిన్ననాటి నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన తీరు సాధించిన ఘన విజయాలను, ఆర్జించిన కీర్తి ప్రతిష్టల సమాహారంగా ఈ డాక్యుమెంటరీలో చూపిం చారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. ఈచిత్రానికి ఇప్పటికే ఒడిశా, కేరళ, చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు వినోదం పన్ను మినహాయించాయి.
2sports
sumalatha 212 Views OLA , pikup.ai Ola Cab న్యూఢిల్లీ: ఓలా చేతికి పికప్‌.ఏఐ వచ్చింది. కృత్రిమ మేధ సేవలను అందించే బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్‌ను ఇందర్‌ సింగ్‌, రిత్విక్‌ శిఖలు ప్రారంభించారు. ఈ కొత్త డీల్ ప్రకారం పికప్‌ బృందం ఓలాలో చేరనుంది. భవిష్యత్తులో ఓలాను మరింత అభివృద్ధి చేసేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఓలా మిషిన్‌ లెర్నింగ్‌, కంప్యూటర్‌ విజన్‌, కృత్రిమ మేధ వంటి సాంకేతికతల్లో పెట్టుబడులు పెట్టడంలో ఇది కూడా ఒక భాగమన్నారు. పికప్‌.ఏఐ బృందాన్ని ఆహ్వానించేందుకు చాలా ఆతృతతో ఉన్నాము. మేము సంయుక్తంగా సృజనాత్మకంగా సాంకేతికతలను తయారు చేస్తున్నాం.గ అని ఓలా సీటీవో అంకిత్‌ భాతి తెలిపారు. తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/andhra-pradesh/
1entertainment
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
DOLLAR అమెరికా సెక్యూరిటీల్లో భారత్‌ పెట్టుబడుల పెంపు న్యూఢిల్లీ,జూన్‌ 27: అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో భారత్‌ పెట్టుబడుల వాటా 124.1 బిలియన్‌ డాలర్ల కు పెరిగాయి. 2016 జూలైనెల తర్వాత ఇదే గరిష్ట స్థాయిలో ఉన్నట్లు ప్రభుత్వం అంచనావేసింది. గత ఏడాది జూలైనెలలో 1213.7బిలియన్‌ డాలర్ల పెట్టు బడులు పెట్టింది. ఏప్రిల్‌ నెలాఖరునాటికి జపాన్‌ అమెరికాలో 1.106 లక్షలకోట్ల డాలర్ల పెట్టుబడులు ఉన్నట్లు అంచనా. ఆ తర్వాత చైనా 1.092 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులుపెట్టింది. అమెరికా ట్రెజరీ డిపార్టుమెంట్‌ గణాంకాలను పరిశీలిస్తే భారత్‌ పెట్టుబడులు ఏడు బిలియన్‌ డాలర్లు పెరిగి 124.1 బిలియన్‌ డాలర్లకు చేరాయి. మార్చినెలలో భారత్‌ నుంచి అమెరికా సెక్యూరిటీల్లో పెట్టుబడులు 117.1 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు అంచనా. బ్రిక్స్‌ ఐదు దేశాల్లో అమెరికా సెక్యూరిటీల పెట్టుబడుల్లో భారత్‌ మూడో అతిపెద్ద దేశంగానిలిచింది. చైనాబ్రెజిల్‌ దేశాలు రెండూ 267.7బిలియన్‌ డాలర్లు ఏప్రిల్‌నెలలో పెట్టు బడులు పెట్టాయి. రష్యాకు సెక్యూరిటీలపరంగా 104.9 బిలియన్‌ డాలర్లు పెరిగినట్లు అంచనా. ట్రెజరీ డిపార్టుమెంట్‌ విదేవీ నివాసితులు తమతమ ట్రెజరీ బిల్స్‌ను ఏప్రిల్‌నెలలో 7.2బిలియన్‌ డాలర్లకు పెంచా యి. డాలర్‌ఆధారిత స్వల్పకాలిక అమెరికా సెక్యూ రిటీలు ఇతర ఉత్పత్తుల్లో 26 బిలియన్‌ డాలర్లుగా విదేశీ నివాసితుల వాటా ఉన్నట్లు అంచనా. 2017 మొదటి త్రైమాసికంలో అమెరికా వాస్తవస్థూల దేశీయో త్పత్తి వార్షిక పద్ధతిన 1.2 శాతంగా ఉంది. గతనెలలో బ్యూరో ఆఫ్‌ ఎకనమిక్‌ అనాలిసిస్‌ విడుదల చేసిన నివేదికలే ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
1entertainment