id
int64
1
4.06M
inputs
stringlengths
4
37.5k
targets
stringlengths
0
37.5k
dataset_name
stringclasses
27 values
sub_dataset_name
stringclasses
7 values
task_type
stringclasses
11 values
template_id
int64
0
18
language
stringclasses
1 value
script
stringclasses
1 value
split
stringclasses
1 value
4,058,301
ఆంథోజోవన్ల ముఖ్య లక్షణాలపై లఘుటీక రాయండి.
ఆంథోజోవా : ఈ జీవులను సాధారణంగా సీ అనిమోన్లు అంటారు. ఇవి స్థానబద్ధ జీవులు, పాలిప్ రూపాలను మాత్రమే కలిగి ఉంటాయి. సీలెంటిరాన్ అనేక గదులుగా ఆయత విభాజకాలతో విభక్తమై ఉంటుంది. ఈ విభాజకాలను మీసెంటరీలు అంటారు. మధ్యశ్లేష్మస్తరం సంయోజక కణజాలాన్ని కలిగి ఉంటుంది. దంశకణాలు బహ్మచర్మం, అంతఃచర్మంలో ఉంటాయి. బీజకణాలు అంతఃచర్మం నుంచి ఏర్పడతాయి. ఉదా : ఎడామ్సియా (సీ అనిమోన్), కొరాలియమ్ రుబ్రమ్ (ప్రశస్తమైన ఎరుపు శిలా ప్రవాళం), గార్గోనియా (సముద్ర విసనకర్ర), పెన్నాట్యులా (సముద్ర కలం).
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,302
Title: కరోనావైరస్: దేశంలో రోజూ ముప్పావు లక్ష కేసులు.. మరి లాక్‌డౌన్ సఫలమా? విఫలమా?\nGiven the above title of an imaginary article, imagine the article.\n
భారత్‌లో కరోనా రోజువారీ సంక్రమణ సంఖ్య భాతదేశంలోనే అత్యధికంగా ఉంది. మొత్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యను చూస్తే, అమెరికా మొదటి స్థానంలో ఉండగా, బ్రెజిల్ రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉంది. కానీ రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్యను బట్టి చూస్తే భారత్ మొదటి స్థానంలో ఉంది. ఈ గణాంకాల తీరు చూస్తుంటే భారత్ అతి త్వరలో ప్రపంచంలోనే అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన దేశాల్లో మొదటి స్థానానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. భారతదేశంలో లాక్‌డౌన్ సడలించినప్పటి నుంచి రోజువారీ కేసులు అధిక సంఖ్యలో నమోదవడం మొదలైందని గణాంకాలు చెబుతున్నాయి. జూన్ 1 నుంచీ లాక్‌డౌన్ క్రమంగా సడలించారు. దాన్ని అన్‌లాక్-1 అని పిలిచారు. భారత్‌లో పెరుగుతున్న కరోనా రోజువారీ కేసులు లాక్‌డౌన్‌తో పూర్తిగా స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలు అన్‌లాక్-1లో నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. అప్పటినుంచే రోజువారీ కోవిడ్-19 కేసులు కూడా పెరగడం మొదలయ్యింది. దీంతో, లాక్‌డౌన్‌తో చేసిన ప్రయత్నాలన్నీ అన్‌లాక్-1 వల్ల వృధా అయిపోయిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొట్టమొదట మార్చి 25 నుంచీ 21 రోజులపాటూ లాక్‌డౌన్ విధించారు. కానీ కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతుండడంతో దానిని మే 3కు, తర్వాత మే 30కి పొడిగించారు. చివరికి జూన్ 1న అన్‌లాక్-1 ప్రకటించారు. తర్వాత క్రమంగా అన్‌లాక్-2, అన్‌లాక్-3 కూడా ప్రకటించారు. క్రమక్రమంగా అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అన్‌లాక్-4 ప్రారంభం కానుంది. మరోవైపు కోవిడ్-19 కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అంటే, దీనినిబట్టి భారతదేశంలో లాక్‌డౌన్ పూర్తిగా విఫలమయ్యిందని అనుకోవచ్చా? భారత్‌లో లాక్‌డౌన్ నిపుణులు ఏమంటున్నారు? లాక్‌డౌన్ పూర్తిగా విఫలమైనట్లుగా భావించాల్సిన అవసరం లేదని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన డాక్టర్ గిరిధర్ ఆర్. బాబు బీబీసీతో అన్నారు. "లాక్‌డౌన్ ముఖ్య ఉద్దేశం వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం, అదే సమయంలో కోవిడ్-19 ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం. ఈ రెండు లక్ష్యాలూ నెరవేరాయి. లాక్‌డౌన్‌తో కోవిడ్-19 పూర్తిగా మాయమైపోతుందని కాదు. వ్యాక్సిన్ వచ్చేవరకూ కరోనావైరస్ వ్యాప్తి తగ్గదు" అన్నారు. కానీ, లాక్‌డౌన్ వైఫల్యం ప్రాంతీయంగా ఉందని డా. గిరిధర్ చెప్పారు. ఉదాహరణకు ముంబై, దిల్లీలలో లాక్‌డౌన్ సమయంలో కూడా కేసులు అధికంగా పెరిగాయన్నారు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,303
ఒక్క ప్రోకారియోటిక్ కణం ఒక గంటలో అనేక సార్లు విభజించగలదు. చాలా తక్కువ యూకారియోటిక్ కణాలు ఇంత వేగంగా విభజించగలవు. ఈ క్రింది వాటిలో ఏది ఈ తేడాను బాగా వివరిస్తుందో ఎంచుకోండి? (i). యుకారియోటిక్ కణాలు ప్రోకారియోటిక్ కణాల కన్నా చిన్నవి. (ii). యుకారియోటిక్ కణాలలో ప్రోకారియోటిక్ కణాల కన్నా తక్కువ DNA ఉంటుంది. (iii). యుకారియోటిక్ కణాలలో ప్రోకారియోటిక్ కణాల కన్నా ఎక్కువ కణ గోడలు ఉంటాయి. (iv) యుకారియోటిక్ కణాలు ప్రోకారియోటిక్ కణాల కంటే నిర్మాణపరంగా మరింత సంక్లిష్టంగా ఉంటాయి.
(iv) యుకారియోటిక్ కణాలు ప్రోకారియోటిక్ కణాల కంటే నిర్మాణపరంగా మరింత సంక్లిష్టంగా ఉంటాయి.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,304
మీరు మీ ఊహాశక్తితో ఒక కథను రాయండి.
ఒకరోజు రెండు రాళ్లు మాట్లాడుకుంటున్నాయి. “అడుగో ! శిల్పి వస్తున్నాడేవ్” అంది ఒక రాయి. “అతనంటే నాకు భయం. ఒళ్లంతా చెక్కేస్తాడు” అంది మరొక రాయి. “ఆ దెబ్బలు భరిస్తేనే కదా ! మనకు గౌరవం దక్కుతుంది.” అంది మొదటి రాయి. “గౌరవం లేదు. గాడిద గుడ్డూ లేదు. నేను భరించలేను, పారిపోతున్నాను.” అని క్రిందికి దొర్లిపోయింది. పది సంవత్సరాల తర్వాత, గుడిలో వినాయక విగ్రహం ఎదురుగా మెట్ల క్రింద రాయి ఉంది. ఆ రాయి వినాయకుని కాపాడమని ప్రార్థించింది. అందరూ తనను తొక్కుతూ వెడుతున్నారని, ఆ బాధ భరించలేకపోతున్నానని, విముక్తి కల్గించమని ప్రార్థించింది. వినాయక విగ్రహం పకపకా నవ్వింది. పది సంవత్సరాల క్రితం మనిద్దరం ప్రక్క ప్రక్కనే ఉండేవాళ్లం. “నువ్వు ఉలిదెబ్బలకు భయపడి పారిపోయావు. నేను భరించాను. అందుకే ఈ రోజు పూజలందుకొంటున్నాను. కష్టపడితే ఫలితం వస్తుంది. చిన్నప్పుడు కష్టపడి చదువుకొంటే, జీవితమంతా సుఖపడవచ్చు. చిన్నప్పుడు చదువుకు భయపడితే, నీలాగే జీవితమంతా బాధపడాలి. అందుకే మొదట కష్టపడు. తర్వాత సుఖపడు అన్నారు. ఎవరూ ఎవరినీ రక్షించలేరు. నీ జీవితానికి నువ్వే కర్తవు. “జాలి పడడం’ తప్ప నేనేం చేయలేను” అంది వినాయక శిల్పంగా మారిన రాయి.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,305
Question: సర్వం చిత్ర దర్శకుడు ఎవరు? Topic: సర్వ శిక్షా అభియాన్ Article: సర్వ శిక్షా అభియాన్ [1] అనేది 6–14 సంవత్సరాల మధ్య వయస్సున్న బాలలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను ఒక ప్రాథమిక హక్కుగా మార్చిన పథకం. ఇది భారత రాజ్యాంగంలో 86వ సవరణ ద్వారా ప్రాథమిక విద్య సార్వజనీకరణ సాధనకు అటల్ బీహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో భారతదేశ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. 2001లో లక్షిత బాలల సంఖ్య 205 మిలియన్ల వద్ద ఉన్నట్లు అంచనా. 2010 నాటికి సంతృప్తికర నాణ్యతతో ప్రాథమిక విద్య యొక్క సార్వత్రీకరణ సాధన ఈ కార్యక్రమ లక్ష్యంగా ఉంది. ఈ కార్యక్రమాను సారం, భారతదేశంలో అవసరమైన చోటల్లా పాఠశాలలు స్థాపించడం, పిల్లలందరినీ పాఠశాలలలో చేర్పించడం, విద్యను సార్వత్రీకరించడం. నిరక్షరాస్యతను పారద్రోలి, అక్షరాస్యతను సాధించడం. పాఠశాలైన, ప్రాథమిక పాఠశాలలను ప్రతి కిలోమీటరునకూ ఒక పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకూ ఓ ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతి ఐదు కిలోమీటర్లకూ ఒక ఉన్నత పాఠశాల ఉండేటట్లు చూసి, విద్యను వ్యాపింపజేయడం ముఖ్య ఉద్దేశం. పాఠశాలల నిర్వహణకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని తగురీతిలో వుంచి విద్యాస్థాయిని పెంపొందించడం. పాఠశాలలలో ప్రయోగశాలలను ఏర్పాటుచేయడం, కంప్యూటర్లను ఏర్పాటుచేయడం కూడా ముఖ్య ఉద్దేశ్యాలలోనివి. నేపథ్యం ప్రాథమిక విద్య సార్వజనీకరణ కోసం రాజ్యాంగ, న్యాయ, జాతీయ ప్రకటనలు రాజ్యాంగ ఆదేశం, 1950 - "ఈ రాజ్యాంగం అమలు చేసిన సమయం నుంచి పదేళ్ల కాలంలోగా దేశం బాలలందరికీ 14 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఉచితంగా, తప్పనిసరి విద్య అందించేందుకు ప్రయత్నించాలి." విద్యా జాతీయ విధానం, 1986 - "మనం 20వ శతాబ్దంలోకి అడుగుపెట్టడానికి ముందు బాలలందరికీ 14 ఏళ్ల వయస్సు వరకు సంతృప్తికరమైన ఉచిత, నిర్బంధ విద్య అందేలా చూడాలి". ఉన్నికృష్ణన్ తీర్పు, 1993 - "ఈ దేశం యొక్క ప్రతి బిడ్డ/పౌరుడికి పద్నాలుగేళ్ల వయస్సు వచ్చే వరకు ఉచిత విద్య పొందే హక్కు ఉంది." ఉద్దేశాలు బాలలందరూ 2003నాటికి బడి, విద్యా హామీ కేంద్రం లేదా ప్రత్యామ్నాయ పాఠశాలల్లో ఉండేలా చర్యలు 2005నాటికి ఐదేళ్ల ప్రాథమిక విద్యను, 2010నాటికి 8 ఏళ్ల పాఠశాల విద్యను పూర్తి చేయడం. 2010నాటికి బాలలందరూ ఎనిమిదేళ్ల పాఠశాల విద్యను పూర్తి చేయడం జీవనానికి అవసరమైన విద్యపై ప్రత్యేక దృష్టితో ప్రాథమిక విద్యను సంతృప్తికరమైన నాణ్యతతో అందించడానికి కృషి 2007నాటికి ప్రైమరీ స్థాయిలోను, 2010నాటికి ప్రాథమిక విద్యా స్థాయిలోనూ లింగ, సామాజిక అంతరాలన్నింటినీ తొలగించడం 2010నాటికి పాఠశాల విద్య...
None
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,306
a1/a2=b1/b2=c1/c2 అయిన a1x + b1y + c1 =0 మరియు a2x + b2y + c2 = 0 యొక్క గ్రాఫ్ ఏర్పరచు రేఖలు A) ఖండన రేఖలు B) లంబరేఖలు C) ఏకీభవించు రేఖలు D) నిర్ణయించలేము
C) ఏకీభవించు రేఖలు
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,307
కుతుబ్షాహీలు సాధించిన విజయాలను వివరించండి.
గోల్కొండ రాజధానిగా స్వతంత్ర కుతుబ్షాహీ వంశాధికారాన్ని క్రీ. శ. 1512లో సుల్తాన్-కులీ-కుతుబ్-ఉల్- ముల్క్ స్థాపించాడు. బహమనీ సుల్తాన్ మూడో మహమ్మద్ షా కాలంలో ఆ రాజ్య విచ్ఛిన్నం జరిగింది. అహమద్ నగర్, బీజాపూర్, బీదర్, బీరార్, గోల్కొండ అనే ఐదు స్వతంత్ర రాజ్యాలు బహమనీ రాజ్య శిథిలాలపై వెలిశాయి. గోల్కొండ కుతుబ్షాహీలు వారి అధికారులు స్థానిక తెలుగు ప్రజల మద్దతుతో, సుమారు 175 ఏళ్ళపాటు నేడు తెలుగు మాట్లాడే అత్యధిక ప్రాంతాలనూ, కన్నడ, మరాఠి మాట్లాడే కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. సుప్రసిద్ధ చరిత్రకారులైన హరూన్-ఖాన్-షేర్వానీ, నేలటూరి వేంకటరమణయ్య మొదలైన వారు కుతుబ్షాహీలు అత్యంత ప్రజాసేవాతత్పరత కలిగిన పాలకులనీ, వారు ముస్లింలు అయినప్పటికీ హిందూ ప్రజలను, వారి ఆచారాలను, సంస్కృతిని గౌరవించారనీ, వీరిలో కొందరు తెలుగు భాషలో మంచి పాండిత్యం సంపాదించారనీ, వారు తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేశారనీ ప్రశంసించారు. కుతుబ్షాహీ సుల్తానుల్లో సుల్తాన్-కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1512 – 1543), ఇబ్రహీం కుతుబ్షా (క్రీ.శ. 1550-1580), మహమ్మద్-కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1580-1612) సుప్రసిద్ధులు. ఆధారాలు: కుతుబ్షాహీ సుల్తానుల పరిపాలనా కాలానికి సంబంధించిన వివిధ అంశాల గురించి సమకాలీన ముస్లిం చరిత్రకారుల రచనలు, విదేశీ బాటసారుల రచనలు, కుతుబ్షాహీ సుల్తానులు జారీ చేసిన ఫర్మానాలు, సమకాలీన తెలుగు సాహిత్యం ఎంతో అమూల్యమైన సమాచారాన్ని తెలియచేస్తున్నాయి. ముస్లిం చరిత్రకారుల రచనల్లో ఫెరిస్టా రాసిన గుల్షన్-ఇ-ఇబ్రహీమి, ఖదీరాఖాన్ రాసిన తారీఖ్-ఇ-కుతుబ్షాహీ, సయ్యద్ అలీ-టబాటబీ రచన, బుర్హన్-ఇ-మాసిర్, అజ్ఞాత చరిత్రకారుడు రాసిన తారీఖ్-ఇ-సుల్తాన్ మహమ్మద్ షాహీ పేర్కొనదగినవి. ఈ రచనల్లో సుల్తానుల కాలం నాటి రాజకీయ చరిత్ర, పరిపాలన వ్యవస్థ, సామాజిక, ఆర్థిక, సంస్కృత రచనల్లో, అద్దంకి గంగాధరుడు రాసిన ‘తపతీ సంవరణోపాఖ్యానం’, పొనగంటి తెలగనార్యుని రచన యయాతి చరిత్ర, మట్ల అనంతభూపాలుని రచన కుకుత్స విజయం, సారంగతమ్మయ్య రచన ‘వైజయంతీ విలాసం’, భద్రాద్రి శతకం, సింహాద్రి శతకం, భతృహరీ శతకం, కదిరీఫతీ రాసిన ‘హంసవింసతి’, అయ్యలరాజు నారాయణామాత్రుడు రాసిన సుకసప్తతి, వేమన పద్యాలు ఆనాటి ప్రజాజీవనాన్ని వర్ణిస్తున్నాయి. కుతుబ్షాహీల రాజధాని గోల్కొండ, కొత్త నగరం హైద్రాబాద్, దక్కన్లోని ఇతర నగరాలను, ప్రాంతాలను సందర్శించిన విదేశీ బాటసారులైన ఫ్రాన్స్ దేశస్థులైన టావెర్నియర్, బెర్నియర్, థీవ్నాట్, విలియం మాథోల్డ్ రష్యాకు చెందిన నిఖిటిన్ మొదలైన వారు ఈ యుగానికి చెందిన వివిధ విషయాలను తమ డైరీలలో, రచనల్లో పేర్కొన్నారు. ఇవి కుతుబ్షాహీల యుగచరిత్ర రచనకు ఎంతో అమూల్య సమాచారాన్ని అందచేస్తున్నాయి. సుల్తాన్-కులీ-కుతుబ్-ఉల్-ముల్క్: స్వతంత్ర కుతుబ్షాహీ రాజ్య స్థాపకుడు సుల్తాన్-కులీ-కుతుబ్-ఉల్- ముల్క్. ఇతడు బహమనీల కొలువులో కొంతకాలం పనిచేశాడు. తెలంగాణా తరఢారుగా పనిచేశాడు. మూడో మహమ్మద్ షా పరిపాలన చివరి దశలో చెలరేగిన తిరుగుబాట్లతో ప్రేరేపితుడై క్రీ.శ. 1512లో స్వతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు. ఇతడు సమకాలీన విజయనగర, గజపతి రాజులతో అనేక యుద్ధాలు చేశాడు. ఇతడు గోల్కొండ దుర్గాన్ని బలోపేతం చేయించాడు. అనేక మసీదులు, రాజప్రసాదాలు, భవనాలు నిర్మించాడు. గోల్కొండకు సమీపంలో ‘మహమ్మద్ నగర్’ అనే కొత్త పట్టణాన్ని కట్టించాడు. అతణ్ణి అధికారులు, ప్రజలు అభిమానించారు. 99వ యేట కుమారుడి (జంషీద్) చేతిలో హత్యచేయబడ్డాడు. ఇతని కాలంలోనే గోల్కొండ రాజ్యం దక్కన్లోనే కాక సమకాలీన ప్రపంచంలో విశేష ఖ్యాతి గడించింది. జంషీద్-కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1543-1550): ఇతడు సుల్తాన్-కులీ మూడో కుమారుడు. స్వార్థపరుడు. కుట్రలకు పెద్ద వ్యూహకర్త. సొంత తండ్రినే అధికార దాహంతో హత్యచేసి సింహాసనం అధిష్టించి ఏడేళ్ళు పరిపాలన చేశాడు. ప్రజలు, అధికారులు ఇతని చర్యను ఏవగించుకున్నారు. మంచి పాండిత్యం కలవాడు. కవిత్వం రాసేవాడు. క్రీ.శ. 1550లో వ్యాధిగ్రస్తుడై మరణించాడు. సుఖాన్-కులీ-కుతుబ్షా: జంషీద్ మరణానంతరం ఏడేళ్ళ పిన్నవయస్కుడైన అతని కుమారుణ్ణి అతని తల్లి, మంత్రులు గోల్కొండ సింహాసనంపై కూర్చోబెట్టి అధికారం చెలాయించారు. ఇతని పరిపాలన కేవలం ఏడు నెలలపాటు కొనసాగింది. రాజ్యంలో అంతరంగిక కలహాలు, సర్దారుల స్వార్థ రాజకీయాలు హద్దుమీరాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయనగర రాజ్యంలో అళియరామరాయల వద్ద శరణాగతునిగా ఉన్న ఇబ్రహీం-కులీ-కుతుబ్షా, రామరాయల మద్దతుతో గోల్కొండ రాజ్య సింహాసనాన్ని క్రీ.శ. 1550లో అధిష్టించాడు. ఈ విధంగా సుబాన్ కులీ పాలన అంతమైంది. ఇబ్రహీం-కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1550-1580): ఇతడు గోల్కొండ రాజ్య స్థాపకుడైన సుల్తాన్ కులీ చిన్న కుమారుడు. తన సోదరుడైన జంషీద్ పన్నిన కుట్ర నుంచి ప్రాణాలతో తప్పించుకొని క్రీ.శ.1543లో విజయగనర రాజ్యం పారిపోయి అళియ రామరాయల శరణు పొందాడు. అక్కడే ఏడేళ్ళపాటు గడిపాడు. రామరాయలు ఇతణ్ణి సొంత కొడుకులా ఆదరించాడు. తెలుగు భాషలో మంచి పాండిత్యం సంపాదించాడు. క్రీ.శ. 1550లో గోల్కొండ సుల్తానుగా సింహాసనం అధిష్టించిన ఇబ్రహీం-కులీ-కుతుబ్షా ప్రజా బలంతో 30 సంవత్సరాలపాటు సమర్థవంతంగా పరిపాలన చేశాడు. ఇతడు రాజ్య విస్తరణ కోసం సోదర షియా సుల్తానులతో, విజయనగర రాజులతో అనేక యుద్ధాలు చేశాడు. అళియ రామరాయల విభజించి పాలించు దౌత్యనీతికి ఇతడు నష్టపోయాడు. గత సహాయాన్ని విస్మరించి విజయనగర చక్రవర్తికి వ్యతిరేకంగా వైవాహిక సంబంధాల ద్వారా బీజాపూర్, అహమద్ నగర్ సుల్తానులను, బీరార్, బీదర్ సుల్తానులను ఐక్యం చేశాడు. చారిత్రాత్మక రాక్షసి తంగడి యుద్ధం (జనవరి 23, 1565)లో విజయగనరం సేనాధిపతియైన ఆళియ రామరాయలను మోసంతో దెబ్బతీశాడు. రాత్రిపూట సంప్రదింపుల సాకుతో వారి శిబిరంపై దాడిచేయించాడు. 80 ఏళ్ళ వయస్సులో రామరాయలు విరోచితంగా పోరాడి ఓడాడు. హుస్సేన్-నిజాం షా రామరాయల తలను ఖండించి యుద్దభూమిలో పగ తీర్చుకొన్నాడు. దీంతో విజయనగర సేనలు చిన్నాభిన్నమయ్యాయి. ఇతని పాలనలో గోల్కొండ రాజ్యం కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఆర్థికంగా, సైనికంగా గోల్కొండ రాజ్యం బలోపేతమైంది. ఇతడు వ్యవసాయాభివృద్ధికై అనేక చెరువులు, కాలువలు నిర్మించాడు. వీటిలో పేర్కొనదగ్గవి హుస్సేన్ సాగర్ చెరువు, ఇబ్రహీంపట్నం చెరువు. రైతాంగం సుఖసంతోషాలతో ఉండేది. స్వదేశీ, విదేశీ వ్యాపారం అభివృద్ధి చెందింది. గోల్కొండ వస్త్రాలు, వజ్రాలు యూరోపియన్ రాజ్యాల్లో మంచి పేరు పొందాయి. సాహిత్యం, కళలు ఇతని పోషణలో వికసించాయి. ఇతడు క్రీ.శ. 1580లో మరణించాడు. మహమ్మద్ కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1580-1612): ఇబ్రహీం-కులీ-కుతుబ్షా మరణానంతరం అతని సోదరుడైన (సుల్తాన్-కులీ-మూడో కుమారుడు) మహమ్మద్-కులీ-కుతుబ్షా పదిహేను ఏళ్ళ పిన్నవయస్సులో గోల్కొండ రాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతడు దక్కన్ ముస్లిం పాలకుల్లో అత్యంత ప్రతిభావంతుడిగా కీర్తిగడించాడు. గొప్ప పరిపాలనాదక్షుడు. సైన్యాలను నడపడంలో దిట్ట. సాహిత్యప్రియుడు, గొప్ప కట్టడాల నిర్మాత. హైద్రాబాద్ నగరం ఇతని నిర్మాణమే. చార్మినార్, జామామసీద్, చందన్ మహల్ కూడా ఇతడే నిర్మించాడు. ఇతడు ఇబ్రహీం మాదిరిగానే తెలుగు భాషను ఆదరించాడు. అరబిక్, పర్షియన్, ఉర్దు భాషలతో సమానంగా తెలుగుభాష పురోగతి చెందింది. స్థానిక ప్రజల సంప్రదాయాలను, ఆచారాలను, పద్ధతులను గౌరవించాడు. ప్రజా సంక్షేమాన్ని కోరి పరిపాలించాడు. క్రీ.శ. 1612లో 32 ఏళ్ళ సుదీర్ఘ పాలన తరువాత మరణించాడు. ఇతడి ఏకైక కుమార్తె హయత్-బక్ష్-బేగం. ఈమె భర్త సుల్తాన్ మహ్మద్ కుతుబ్షా గోల్కొండ చరిత్రలో మహమ్మద్ కులీ-కుతుబ్షా పరిపాలనా కాలం ఒక చారిత్రక ఘట్టం. సుల్తాన్ మహమ్మద్-కులీ-కుతుబ్షా (క్రీ.శ.1612-1626): మహ్మమద్ కులీ-కుతుబ్షా మరణానంతరం అతని మేనల్లుడు, అల్లుడైన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా గోల్కొండ సుల్తానుగా బాధ్యతలు చేపట్టాడు. ఇతడు గొప్ప పండితుడు. ఇతనికి మత సంప్రదాయాల పట్ల అభిమానం ఎక్కువ. అధిక సమయం పండితులతో చర్చల్లో గడిపేవాడు. క్రీ.శ. 1617లో హైద్రాబాద్ నగరంలో మక్కామసీదు నిర్మాణానికి ఇతడే పునాది వేశాడు. దీని నిర్మాణం డైబ్బైఏడేళ్ళ పాటు కొనసాగింది. క్రీ.శ 1687 లో గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ మక్కామసీద్ నిర్మాణాన్ని 1694లో పూర్తిచేశాడు. ఇతడే సుల్తాన్ నగరాన్ని నిర్మించాడు. అబ్దుల్లా-కుతుబ్షా (క్రీ.శ.1626 – 1672): ఇతడు సుల్తాన్ మహమ్మద్ కుమారుడు. పన్నెండు ఏళ్ళ పిన్న వయస్సులో గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతని తల్లి హయత్-బక్ష్-బేగం రాజ్య వ్యవహారాలు నిర్వహించింది. ఇతడు విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఇతని కాలంలో మొగల్ దాడులు గోల్కొండ రాజ్యంపై తీవ్రతరమయ్యాయి. పరాజయం పొందిన గోల్కొండ సుల్తాన్ మొగల్ చక్రవర్తికి కప్పం చెల్లించి అధికారం కొనసాగించాడు. ఇతడు క్రీ.శ.1672లో మరణించాడు. అబుల్హాసన్ తానాషా (క్రీ.శ.1672–1687): కుతుబ్షాహీ సుల్తానుల్లో అబుల్హసన్ తానాషా చివరివాడు. ఇతడు అబ్దుల్లా కుతుబ్షా అల్లుడు. ఇతడి పదిహేను ఏళ్ళ పరిపాలనా కాలంలో కుతుబ్షాహీ రాజ్యంపై మొగల్ చక్రవర్తి సేనలు నిరంతర దాడులు చేశాయి. దీనివల్ల కుతుబ్షాహీ రాజ్య ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇతడి పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఇతడు పరమత సహనం ప్రదర్శించాడు. ఔరంగజేబ్ సామ్రాజ్య కాంక్షకు అబుల్హాసన్ రాజ్యం బలైంది. సుమారు ఎనిమిది నెలలపాటు ధైర్యసాహసాలతో మొగల్ సేనలను కుతుబ్షాహీ సేనలు ఎదుర్కొన్నాయి. పరాజితుడైన సుల్తాన్ను మొగల్ సేనలు బందీగా బీదర్, దౌలతాబాద్లలో పన్నెండు ఏళ్ళపాటు ఉంచారు. క్రీ.శ. 1690లో చివరి కుతుబ్షాహీ సుల్తాన్ బందీగా దౌలాతాబాద్లోనే మరణించాడు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,308
కింది వాక్యముని సంక్లిష్ట వాక్యంగా మార్చండి. వైద్యుడు ప్రథమ చికిత్స చేస్తాడు. వైద్యుడు మందులు ఇస్తాడు.
వైద్యుడు ప్రథమ చికిత్స చేసి, మందులు ఇస్తాడు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,309
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: అమ్మకం
విక్రయం
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,310
ప్రియసఖా! నీ లేఖ అందింది. పట్నం జీవితం ఎలా ఉంటుందో అందులో వర్ణించావు. పల్లెటూరి జీవితాన్ని చిత్రిస్తూ ఉత్తరం రాయమన్నావు. నీది ఉత్తమమైన వాంఛ. ఒకచోటి జీవిత విధానంలో మరొకచోటి జీవిత విధానాన్ని నిత్యమూ పోల్చి తెలుసుకొంటూ ఉండాలి. మంచి చెడ్డలు, హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ఈ వాంఛ నీకు కలిగినందుకు అభినందిస్తున్నాను. నీ పట్న జీవితం నా పల్లెటూరి జీవితంతో పోలిస్తే పరస్పర విరుద్ధంగా ఉంటుంది. నా జీవిత విధానాన్ని గురించి రాయడమంటే పల్లెటూళ్ళ జీవిత విధానాన్ని గురించి రాయడమన్నమాట. పల్లెటూళ్ళు, అక్కడి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? విద్యుద్దీపాలతో, పంఖాలు ఉన్న మేడలలో హాయిగా సుఖించే నీకు ఏమి తెలుస్తుంది? నీకుమా గ్రామ జీవితం అర్థం కావాలంటే, మా ఇంటికి ఒకసారి రా! ఈ పూరి గుడిసెలో ఒక్కరోజు ఉండు. ఇటు, నీ మిత్రుడు. ఇచ్చిన లేఖ ప్రకారం ఇచ్చిన ప్రశ్నకి జవాబు రాయండి: దేని గురించి రాశాడు?
పట్నవాసపు జీవితాన్ని, పల్లెటూరి జీవితంతో పోల్చి రాశాడు. పల్లెటూరి జీవితంలోని బాధలు రాశాడు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,311
క్రింది వానిలో అష్టక నియమం పాటింపబడని అణువు. A) O2 B) F2 C) BCl3 D) N2
C) BCl3
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,312
ఫైలేరియాసిస్ వ్యాధి చివరి ఘట్టం బోదకాలు / ఎలిఫెంటియాసిస్ నిరూపించండి.
ఫైలేరియాసిస్ వ్యాధి తీవ్రత వలన వాపు చెందిన భాగాలలో ఫైబ్రోబ్లాస్ట్లు అభివృద్ధి చెంది తంతుయుత కణజాలంగా మారతాయి. ప్రభావిత భాగాలలో స్వేదగ్రంథులు క్షీణించి, అక్కడి చర్మం పొడిగాను, గరుకుగాను అవుతుంది. ఈ చివరి స్థితిని బోదకాలు లేదా ఎలిఫెంటియాసిస్ వ్యాధి అంటారు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,313
కింద ఇచ్చిన భావం వచ్చేలాగా ఒక పద్యాన్ని రాయండి మరియు రాసిన పద్యంలో ప్రతి పదంకి అర్ధము రాయండి: గత కాలంలోని మన ధైర్య, శౌర్య, పరాక్రమాలను కథలు కథలుగా చెప్పారు. మన పూర్వీకులలోని ఆ సత్తువ ఎక్కడ దాచావు. ఈ భారత భూమిలో మన ఉనికే లేకపోయింది. ఒక ప్రత్యేక జాతిగా మన అస్తిత్వాన్నే కోల్పోయాము. ఇంతటి ఘనచరిత్ర గల ఆంధ్రులు నేడు బతుకే ఎంతో భారంగా గడుపుతున్నాడు. వంద రకాలుగా పోరాడైనా సరే మొదటి స్థానంలో మనం నిలవాలి.
గతములో నీ కీర్తి కతలల్లి సెప్పారు షసయేడ దాచావు వుసిలేక పోయెరా బ్రతుకే బరువై యుంటివీనాడు శతపోరి సాధించు తొలిపేరూ ప్రతిపదార్థము : కతలల్లి = కథలు కథలుగా పస= సత్తువ వుసి = ఉనికి శతపోరి = వంద రకాలుగా పోరాడి
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,314
క్రింద ఇచ్చిన సినిమా పాటలోని ఒక భాగం యొక్క సాహిత్యంపై విశ్లేషణ చెయ్యండి: లలిత భావ నిలయ నవ రసానంద హృదయ విక చారవింద నయన.. సదయ జగదీశ్వరీ
‘లలిత భావ నిలయ’ అని ప్రారంభించారు. లలితము అనగా మంగళప్రదమైన అనిఅర్ధం. మంగళము అనగా బ్రహ్మ స్వరూపం. మంగళప్రదమైన నీ రూపం ‘నవరసానంద హృదయ’ – సర్వ కాల, సర్వావస్ధలయందు నూతనమైన ఉత్తేజాన్ని, ఆనందాన్ని కలిగించే హృదయమున్న తల్లివి నీవు. ‘వికచారవింద నయన’ – వికసించిన తామర పూవులవంటి కన్నులు కల ‘ సదయ జగదీశ్వరి ‘ – అందరిపట్ల సమానమైన దయాగుణం కలిగిన జగన్మాతావు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,315
రాజరాజ చోళుడు సాధించిన విజయాలను వివరించండి.
మొదటి రాజరాజు కాలం నుంచి చోళ రాజ్యంలో నూతన శకం ప్రారంభమైంది. రాజరాజు అనేక ఘన విజయాలను సాధించి చోళ రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా విస్తరింపచేశాడు. రాజరాజుకు ‘జయంగొండ’, ‘చోళమార్తాండ’ మొదలైన బిరుదులున్నాయి. పాండ్యులను, చేర రాజులను ఓడించి వారి సామ్రాజ్య భాగాలైన కొడమలై, కొళ్ళంలను యుద్ధం చేసి ఆక్రమించాడు. నౌకాదళంతో దాడి చేసి, మలయా ద్వీపాన్ని ఆక్రమించడమే కాకుండా శ్రీలంక మీద అనూరాధపురాన్ని (ఉత్తర సింహళం) నాశనం చేశాడు. ఉత్తర సింహళానికి “ముమ్ముడి చోళమండల”మని నామకరణం చేశాడు. ఇతని కాలంలోనే కళ్యాణి చాళుక్యులకు, వేంగీ చాళుక్యులకు పోరు ప్రారంభమైంది. రాజరాజు వేంగీ చాళుక్యులకు మద్దతునిచ్చి తన ప్రాబల్యాన్ని వేంగీలో నెలకొల్పాడు. రాజరాజు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడమే కాకుండా క్రమబద్ధమైన పాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. పంటపొలాలను సర్వేచేయించి, న్యాయసమ్మతమైన పన్నులను వసూలు చేశాడు. రాజరాజు శివభక్తుడు. తంజావూర్లో ‘రాజరాజేశ్వర’మనే పేరున్న బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. శైవుడైనప్పటికీ రాజరాజు పరమత సహనం ఉన్నవాడు. శైలేంద్ర రాజైన శ్రీమార విజయోత్తుంగ వర్మకు నాగపట్టణంలో బౌద్ధ విహారాన్ని నిర్మించడానికి అనుమతినివ్వడమే కాకుండా ఆ విహారానికి ఒక గ్రామాన్ని దానం చేశాడు. ఇతను లలితకళల అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశాడు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,316
పొరిఫెరా వర్గ జీవులలో విసర్జన కొరకు ప్రత్యేకమైన విసర్జకావయవాలు లేవు. జీవుల ప్రతి కణంలోకి నీటి ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా విసర్జ కావయవాలు లేని వర్గానికి మరొక ఉదాహరణ ఇవ్వండి.
సీలెంటరేటా
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,317
I’m తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి. Based on the context (గుంటూరు జిల్లా లోని చందోలు (చందవోలు) గ్రామంలో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, హనుమమ్మ దంపతులకు శాస్త్రి గారు1896, ఆగష్టు 5 న జన్మించారు.[1] తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి 1922లో శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్యము ప్రబంధాన్ని వ్రాసి ప్రచురించాడు. తిరిగి 1986లో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి రామకథామృత గ్రంథమాల తరఫున పునర్ముద్రించాడు.), here's the question to answer: తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి ఎక్కడ జన్మించాడు?.
గుంటూరు జిల్లా లోని చందోలు
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,318
కింది ప్రకృతి – వికృతులను జతపరచండి. 1. హృదయము అ) సత్తువ 2. నిభ ఆ) ఎద 3. సత్వము ఇ) పత్తనము 4. పట్టణము ఈ) నెపము
1. హృదయము ఆ) ఎద 2. నిభ ఈ) నెపము 3. సత్వము అ) సత్తువ 4. పట్టణము ఇ) పత్తనము
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,319
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు మరియు తాత్పర్యం రాయండి: క. ఇనుఁ డుదయింపకమున్నే వననిధి లంఘించి మనుజవల్లభుకడకున్ నినుఁ గొనిపోయెద వీఁపున జననీ ! కూర్చుండు మనిన సంతోషమునన్.
ప్రతిపదార్థం : జననీ = తల్లీ ! సీతమ్మా ! ఇనుడు = సూర్యుడు ఉదయింపక మున్నే = ఉదయించడానికి ముందే వననిధిన్ = సముద్రాన్ని లంఘించి = దాటి మనుజవల్లభుకడకున్ = మనుష్యులకు ప్రభువైన రామచంద్రుని వద్దకు నినున్ = నిన్ను కొనిపోయెదన్ = తీసుకొని వెడతాను వీపునన్ = నా వీపు మీద కూర్చుండుము = కూర్చో తల్లీ ! అనినన్ = అని హనుమంతుడు చెప్పగా సంతోషమున్ = (సీత) సంతోషంతో తాత్పర్యం : “తల్లీ ! సూర్యోదయం కావడానికి ముందే సముద్రాన్ని దాటి, నిన్ను రాముని వద్దకు తీసుకొని వెడతాను. నా వీపుపై కూర్చో” అని హనుమంతుడు చెప్పగా, సీత సంతోషించింది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,320
వర్గవికాస జీవవర్గీకరణను వివరించండి.
వర్గవికాస వర్గీకరణ : ఉమ్మడి వంశపారంపర్యంను ఆధారంగా చేసుకొన్న వర్గీకరణను వర్గవికాస వర్గీకరణ అంటారు. ఈ వర్గీకరణలో జాతుల మధ్యగల ‘జన్యుఅంతరాన్ని’ లెక్కించడం ద్వారా ‘వర్గవికాస వృక్షాన్ని’ తయారుచేస్తారు. జీవుల క్రియాసామ్య లక్షణాలు, నిర్మాణసామ్య లక్షణాల ఆధారంగా చేసేదే వర్గవికాస వర్గీకరణ. అభిసారి పరిణామం వల్ల ఏర్పడిన ఒక జత జీవులు పంచుకొనే లక్షణాలను క్రియాసామ్య లక్షణాలు అంటారు. ఉదాహరణకు పిచ్చుక రెక్క; ఎగిరే ఉడుత, గబ్బిలంలోని పెటాజియం అనే రెక్కలాంటి చర్మ విస్తరణ నిర్మాణం. ఒకే ఉమ్మడి వంశకర్త నుంచి అనువంశికత ద్వారా ఒక జత జీవులు పంచుకొనే లక్షణాలను నిర్మాణసామ్య లక్షణాలు అంటారు. ఉదాహరణకు పిచ్చుక రెక్క (ఫించ్) కాకిరెక్క, వర్గ వికాస చరిత్రను వృక్షరూప చిత్రంగా గానీ లేదా శాఖీయుత రేఖాచిత్రం గానీ సూచించే పద్ధతిని ఎర్నెస్ట్ హెకెల్ ప్రవేశపెట్టాడు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,321
ఇచ్చిన పదానికి నానార్ధాలు ఇవ్వండి: నిట్టవొడుచు
ఉప్పొంగు, రోమాంచితం, విజృంభించు
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,322
కింది లోహాలలో, ప్రతి లోహానికి రెండు ఉపయోగాలు .ఇవ్వండి. ఎ) జింక్ బి) కాపర్ సి) ఐరన్ డి) అల్యూమినియమ్
ఎ) జింక్ ఉపయోగాలు : 1. జింక్ను అధిక మొత్తంలో బ్యాటరీలలో ఉపయోగిస్తారు. 2. ఐరన్ను గాల్వనైజ్ చేయుటకు ఉపయోగిస్తారు. 3. చాలా మిశ్రమ లోహాలలో అనుఘటకంగా ఉపయోగిస్తారు. ఉదా : ఇత్తడి (Cu 60%, Zn 40%) బి) కాపర్ ఉపయోగాలు : 1. విద్యుత్ పరిశ్రమలో వాడే తీగలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. 2. నీరు, ఆవిరి గొట్టాలను తయారు చేయడానికి కాపర్ను ఉపయోగిస్తారు. 3. కాపర్ను మిశ్రమ లోహాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. సి) ఐరన్ ఉపయోగాలు : 1. పోత ఇనుమును స్టవ్లు, రైలుబోగీలు, గట్టర్పైప్పులు, బొమ్మలకు పోతపోయడంలో వాడతారు. 2.చేత ఇనుము, స్టీల్ తయారీలో వాడతారు. డి) అల్యూమినియమ్ ఉపయోగాలు : 1. పలుచని అల్యూమినియం రేకును చాక్లెట్ల మీద చుట్టడానికి వాడతారు. 2. లోహ సూక్ష్మచూర్ణాన్ని పెయింట్లు, లాకర్లలో వాడతారు. 3. ఎక్కువ చర్యాశీలత ఉండుట వలన అల్యూమినియంను క్రోమియం, మాంగనీస్లను వాటి ఆక్సైడ్ల నుండి నిష్కర్షణ చేయుటకు వాడతారు. 4. అల్యూమినియం తీగలను విద్యుద్వాహకాలుగా వాడతారు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,323
Title: కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు... అయినా 130కి పైగా దేశాలు చుట్టేశారు ఈయన\nGiven the above title of an imaginary article, imagine the article.\n
టోనీ గైల్స్ 130కి పైగా దేశాల్లో పర్యటించారు ఆయనకు కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు. అయినా, దూర ప్రయాణాలు చేయాలన్న తపన ఆయనను 130కి పైగా దేశాలకు తీసుకెళ్లింది. "మీరు ఇంతగా దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు అని కొందరు నాకు అంటుంటారు. కానీ, కళ్లు కనిపించకున్నా, చెవులు వినిపించకున్నా తమదైన దృష్టితో ప్రపంచాన్ని చూడవచ్చు అని నేను వారికి చెబుతున్నాను" అని ఇంగ్లాండ్‌కు చెందిన ఈ 41 ఏళ్ల టోనీ చెప్పారు. ఇటీవల తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో పర్యటిస్తుండగా బీబీసీ ట్రావెల్ షో బృందం ఆయనతో ముచ్చటించింది. భావోద్వేగాల నుంచి బయటపడేందుకు ప్రయాణాలు ఉపయోగపడుతున్నాయని టోనీ అంటున్నారు స్పర్శ ద్వారా అనుభూతి "నా చుట్టూ ఉండేవారి మాటలు వింటాను. పర్వతాల మీదికి వెళ్తా, జాగ్రత్తగా దిగుతాను. నా చర్మం, కాళ్ళ ద్వారా అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తాను. నేను ఒక దేశాన్ని అలాగే చూస్తాను. తేడాలను గమనిస్తాను" అని ఆయన వివరించారు. టోనీ గత 20 ఏళ్లుగా అనేక కొత్త ప్రదేశాలను సందర్శించారు. ఒక పర్యటనలో ఆయన తన గ్రీకు గర్ల్‌ఫ్రెండ్‌ని కూడా కలుసుకున్నారు. ఆమెకు కూడా చూపు లేదు. గత ఏడాది ఆమెతో కలిసి రష్యా వెళ్లారు. వైశాల్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యాను రైలులో చుట్టేశారు. కానీ, చాలా ప్రయాణాలలో ఆయన ఒంటరిగానే వెళ్తారు. టోనీ గైల్స్ తండ్రి పెన్షన్ డబ్బులతో ఈ ప్రయాణాల కోసం ఆయన తండ్రి పెన్షన్ డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా చాలా ముందుగానే ప్లాన్ చేస్తారు. విమానం టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఆయన తల్లి సాయపడతారు. ఎందుకంటే, చాలా ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్లలో చూపులేనివారు సొంతంగా టికెట్లు బుక్ చసుకునే వెసులుబాటు లేదని ఆయన అంటున్నారు. తను వెళ్లాలనుకుంటున్న ప్రదేశంలో తనలాంటి వారికి సాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా? అని తెలుసుకుంటారు. కొన్ని వెబ్‌సైట్ల ద్వారా వారిని సంప్రదిస్తూ ఉంటారు. "నేను ఎప్పుడంటే అప్పుడు ఏదో ఒక ప్రదేశానికి వెళ్లలేను. వెళ్లే ప్రదేశం గురించి ముందే బాగా తెలుసుకోవాలి. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్న విషయాలు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడు వెళ్లాలి? ఎలా వెళ్లాలి? అని ప్రణాళిక వేసుకుంటాను' అని ఆయన చెప్పారు. తాను గతంలో ఎప్పుడూ వెళ్లని కొత్త నగరాలలో దారులను వెతుక్కోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఆయన అంటున్నారు. "కొన్నిసార్లు, ఎవరిని కలవబోతున్నానో, ఏం జరగబోతుందో నాకు తెలియదు. నాకు అదొక...వి0త.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,324
ప్రశ్న : భూమి భ్రమణం, పరిభ్రమణాలను మనం ఎందుకు స్పృశించలేం?
భూమి భ్రమణం, పరిభ్రమణాలను మనం స్పృశించలేం కారణమేమిటంటే : భూమితో పాటు మనం కూడా అంతే వేగంతో తిరుగుతున్నాము కనుక. ఉదా : భూమితో పాటు కొండలు, చెట్లు, గుట్టలు, సముద్రాలు అన్ని తిరుగుతుండటం వలన మనం భూభ్రమణంను స్పృశించలేం.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,325
ప్రశ్న స్వాతంత్ర్యానికి ముందు ప్రజలు బాలికలను బడికి పంపించకపోవడానికి గల వేర్వేరు కారణాలేవి?
స్వాతంత్ర్యానికి ముందు ప్రజలు బాలికలను బడికి పంపించకపోవడానికి గల కారణాలు : బాల్య వివాహాలు, (కన్యాశుల్కం) తల్లిదండ్రుల నిరక్షరాస్యత తల్లిదండ్రుల పేదరికం మూఢనమ్మకాలు, విశ్వాసాలు (ఆడపిల్లకు చదువు ఎందుకు అని అంటుండేవారు) పాఠశాలలు అందుబాటులో లేకపోవడం (పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడం) పెద్ద కుటుంబాల (ఉమ్మడి కుటుంబాలు) అవ్వటం వలన ఆడపిల్లలను ఇంటి పనులకు పరిమితం చేయటం. చిన్న పిల్లల సంరక్షణ బాధ్యతను ఇంటిలోని ఆడపిల్లలకు అప్పజెప్పడం.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,326
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: తీపి
మధురము, మాధుర్యం
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,327
న్యాయం ఏ విధంగా పరిణామం చెందింది ?
న్యాయం – పరిణామం: ప్రాచీన భారతదేశంలో న్యాయం అనేది ధర్మంతో ముడిపడి ఉంది. అటువంటి ధర్మం గురించి ప్రాచీన హిందూ స్మృతులలో ప్రస్తావించడమైంది. వాటి ప్రకారం రాజు కర్తవ్యాలలో న్యాయం ఒకటి. ధర్మం ప్రాతిపదికపై న్యాయబద్ధమైన సామాజిక వ్యవస్థను ఏర్పరచి, నిర్వహించేందుకు రాజు కృషి చేసేవాడు. ప్రఖ్యాత చైనా తత్త్వవేత్త అయిన కన్ఫ్యూసియస్ రాజు ప్రధాన కర్తవ్యం చెడు పనులకు పాల్పడే వారిని శిక్షించడం మంచి వ్యక్తులకు బహుమానాలిచ్చి ప్రోత్సహించడంగా పేర్కొన్నాడు. సాధారణంగా న్యాయమంటే ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడమే. అయితే న్యాయభావన అర్థం వ్యక్తులను బట్టి మారుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన మానవీయ దృక్కోణంలో న్యాయాన్ని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. జర్మనీ తత్త్వవేత్త ఇమ్మాన్యుయల్ కాంట్ ప్రకారం మానవులందరూ గౌరవాన్ని కలిగి ఉంటారు. వ్యక్తులందరికీ గౌరవం లభించినట్లయితే వారంతా శక్తి సామర్థ్యాలను వినియోగించుకొని తమ లక్ష్యాల సాధనకై చాలినన్ని అవకాశాలను పొందగలుగుతారు. అందువల్ల న్యాయభావన ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికీ సమానమైన గుర్తింపు, గౌరవం ఇవ్వడమైంది. ప్లేటో వల్ల ప్రభావితుడైన సెయింట్ ఆగస్టీన్ అనే మధ్యయుగ రాజనీతి తత్త్వవేత్త న్యాయభావనను వివరించాడు. సమాజం సరైన రీతిలో కొనసాగేందుకు వ్యక్తుల మధ్య సౌహార్ద్ర సంబంధాల గురించి అతడు ప్రముఖంగా ప్రస్తావించాడు. ఆ తరువాత న్యాయాన్ని మతం నుంచి వేరుచేసిన వారిలో ప్రథముడిగా మరొక మధ్యయుగ రాజనీతి తత్త్వవేత్త థామస్ ఆక్వినాన్ను పరిగణించవచ్చు. పదహారవ శతాబ్దంనాటికి న్యాయ భావన పూర్తిగా లౌకిక భావాల చేత మార్పులకు గురయ్యింది. థామస్ హాబ్స్ వంటి సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు న్యాయభావనను సార్వభౌమాధికారి ఆజ్ఞగా పరిగణించారు. ఆ తరువాత జాన్లాక్, రూసో, ఇమ్మాన్యుయల్ కాంట్ వంటివారు న్యాయమంటే స్వేచ్ఛ, సమానత్వ భావనల సమ్మేళనంగా పరిగణించారు. సహజ న్యాయ సిద్ధాంత ప్రతిపాదకులు వైయక్తిక న్యాయ భావనను అభివృద్ధి చేశారు. సామ్యవాదులు న్యాయభావనను ఆర్థిక దృక్కోణం నుంచి అవలోకించారు. వేరొకవైపు సాంప్రదాయక రాజనీతి తత్వవేత్తలు న్యాయ భావనను వ్యక్తిపరంగా వివరించారు. ఆధునిక రాజనీతి శాస్త్రవేత్తలు ఆ భావనను సామాజిక దృక్కోణంలో పరిశీలించారు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,328
ఇచ్చిన శ్లోకాలకు కొనసాగింపు రాయండి: చంద్రార్కాగ్ని విలోచనం స్మితముఖం పద్మద్వ యాంతః స్థితం | ముద్రాపాశ మృగాక్ష స్రక్ర్ప విలస త్పాణిం హిమాంశుప్రభం | కోటీందుప్రగల త్సుధా ఫ్లుతతనుం హారాది భూషోజ్జ్వలం | కాంతం విశ్వ విమోహనం పశుపతిం మృత్యుంజయ భావయే || ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిమ్ నమామి శిరసా దేవం
కిం నో మృత్యుః కరిష్యతి || కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || గంగాధరం మహాదేవం సర్పాభరణ భూషితం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || అనాధ పరమానందం కైవల్యపద గామినం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || స్వర్గాపవర్గ దాతారం సృష్టి స్థితి వినాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ఉత్పత్తి స్థితి సంహార కర్తారం గురుమీశ్వరం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || తస్య మృత్యు భయం నాస్తి- నాగ్నిచోరభయం క్వచిత్ నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || శతావర్తం ప్రవర్తవ్యం సంకటే కష్ట నాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధి ప్రదాయకం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || జన్మ మృత్యు జరారోగైః పీడితం కర్మ బంధనైః నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || తావతస్త్వద్గత ప్రాణః త్వచ్చిత్తోహం సదామృడ నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యం మనుం జపేత్ నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || నమశ్శివాయ సాంబాయ – హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ – యోగినాం పతయే నమః || మృకండు సూను మార్కండేయ కృత మృత్యుంజయ స్తోత్రం సంపూర్ణమ్.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,329
కింద ఇచ్చిన తాత్పర్యం వచ్చేలాగా ఒక పద్యాన్ని రాయండి: పుష్పక విమానము పొగడచెట్టు వద్ద ఆగిపోగా, వరుస ముఖములు గల రావణుడు ఆశ్చర్యము పొంది ఈ పుష్పకమును ముందుకు సాగక ఆపగలవాడు కూడా ఉన్నాడా ? దీనికి చొరబడని చోటులున్నాయా ? చూడండి. కారణమేమిటో తెలుసుకోమని తన మంత్రులను ఆజ్ఞాపించాడు. వారు ఆ ప్రాంతంలో సంచరించి కారణమేమిటో తెలుసుకోలేకపోయారు.
నిలిచినఁ బంక్తి కంధరుండు నివ్వెఱఁ గంది యిదేల యిచ్చటన్ నిలిచెను శక్తుఁడే యొకఁడు నిల్పఁగ దీనికి దుర్గమ స్థలం బులు గలవోటు చూడుఁడటఁ బొండని మంత్రులఁ బంప వార ల క్కెలంకుల సంచరించి పరికించియు హేతువు గాన కయ్యెడన్.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,330
మహిళల ప్రగతిని వివరిస్తూ వ్యాసం రాయండి.
ఈనాడు సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో అగ్రగాములుగా ఉంటున్నారు. చదువుల్లో వారు సరస్వతీమూర్తులుగా మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. వారు విమానాలను నడుపుతున్నారు. మిలటరీలో కూడా చేరి రాణిస్తున్నారు. శాస్త్రవేత్తలుగా ఎన్నో చక్కని పరిశోధనలు చేసి పేరు గడిస్తున్నారు. ఐ.ఎ.యస్, ఐ.పి.యస్ ఆఫీసర్లుగా పరిపాలనా రంగంలో స్త్రీలు చక్కగా రాణిస్తున్నారు. M.L.Aలుగా, MLC లుగా, MP లుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, కేంద్రమంత్రులుగా స్త్రీలు చక్కగా రాణిస్తున్నారు. స్త్రీలు గొప్ప పరిపాలనాదక్షలుగా నిరూపించుకున్నారు. నిరూపించుకుంటున్నారు. ఒకనాడు స్త్రీలు ఉన్నత విద్యారంగంలో ఉండేవారు కాదు. అటువంటిది ఈనాడు స్త్రీలకు ప్రత్యేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వచ్చాయి. పురుషులతో సమానంగా స్త్రీలు విద్యావంతులై రాణిస్తున్నారు. స్త్రీలలో మంచి డాక్టర్లు, ఇంజనీర్లు నేడు ఉన్నారు. స్త్రీలు పంచాయతీ బోర్డు మెంబర్ల దగ్గర నుండి, దేశ ప్రధానులుగా కూడా తమ పరిపాలనా దక్షతను ప్రదర్శిస్తున్నారు. ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్, సిరిమావో- భండారనాయకే, జయలలిత, మమత వంటి స్త్రీమణులు, మంచి పరిపాలన దక్షలుగా రాణించారు. రాణిస్తున్నారు. స్త్రీలల్లో మంచి క్రీడాకారిణులు ఉన్నారు. ఉషా, అశ్వినీ వంటి స్త్రీలు, పరుగుపందెంలో రాణించారు. సైనా నెహ్వాల్, సెరెనా విలియమ్స్, హంపి, సానియామీర్జా వంటి క్రీడాకారిణులు వివిధమైన ఆటలలో ప్రపంచంలో మొదటివారుగా ఉన్నారు. వ్యాపార రంగంలో ఎందరో స్త్రీలు చక్కగా రాణిస్తున్నారు. కిరణ్ బేడీ వంటి మంచి పోలీసు ఆఫీసర్లు స్త్రీలలో ఉన్నారు. ఈ విధంగా స్త్రీలు అన్ని రంగాలలో నేడు ముందంజలో ఉంటున్నారు. నేటి మహిళల ప్రగతికి, 20వ శతాబ్దంలో స్త్రీ విద్యకై పోరాడిన స్త్రీ మూర్తులే కారణం అని మనం ఎప్పుడూ మరువకూడదు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,331
క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి: విజయనగర రాజులు ఆదరించిన తొలి తెలుగు కవి?
నాచన సోముడు
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,332
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం గురించి నీకు తెలిసింది రాయండి.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాలన్నీ వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతం స్విట్జర్లాండ్లో కొన్ని కాంటన్ల లోనూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,333
‘కాలం చాలా విలువైంది’ ఎందుకో చర్చించండి.
నిజంగానే కాలం చాలా విలువైంది. ఎందుకంటే గడిచిపోయిన ఒక్క క్షణం కూడా తిరిగిరాదు. పోయిన డబ్బును తిరిగి సంపాదించవచ్చు. పోయిన పదవిని తిరిగి సంపాదించవచ్చు. పోయినదానిని దేనినైనా తిరిగి సంపాదించ * వచ్చు. కానీ కాలం మాత్రం తిరిగి సంపాదించలేం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోతే చీకటిలో ఏ పనీ చేయలేం కదా ! కాలం దీపం వంటిది. కాలం ఉండగానే పనులు చేయాలి. కాలం వెళ్లిపోయాక ఏమీ చేయలేం. అంటే చిన్నతనంలో చదువుకోకపోతే, సరైన ఉద్యోగం దొరకదు, అందుకే సకాలంలోనే పనులు పూర్తిచేయాలి. ఎప్పటి పనులను అప్పుడు చేసేయాలి.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,334
కింద ఇచ్చిన పద్యానికి భావం రాయండి: తే. నా ధరాదేవుఁ డతుల దివ్యాంబరాభ రణ విభూషితులై రతిరాజు సాయ కముల గరి నొప్పు పరిచారికలు భజింప, లలిత సౌభాగ్య యగు నిజ లలనఁ జూచి.
ఆ ఇల్లాలు తన భర్త వస్తున్నాడని తెలుసుకొని ఎంతో ఆనందంతో ఎదురు వచ్చింది. మానవరూపం ధరించిన మహాలక్ష్మిలాగా ఉన్న ఆమో కనుకొలకుల్లో ఆనందభాష్పాలు రాలుతుండగా భర్త పాదాలకు నమస్కరించి మనస్సులో కౌగిలించుకొంది. దివ్యాంబరాలు, ఆభరణాలు ధరించి మన్మధుని బాణలలాగా ఉన్న పరిచారికల సేవలందుకొంటూ ఐశ్యర్యంతో తులదూగే తన భార్యను కుచేలుడు చూచాడు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,335
కంపెనీ నమోదు గురించి విశదీకరించండి.
కంపెనీ ఒక కల్పిత వ్యక్తి నమోదు ద్వారా దీనికి అస్తిత్వము వస్తుంది. నమోదు అనేది చట్టపరమైన చర్య. ప్రైవేటు కంపెనీగాని, పబ్లిక్ కంపెనీగాని కంపెనీ రిజిస్ట్రారు కార్యాలయములో అవసరమైన ముఖ్యమైన పత్రాలు దాఖలు చేసి, రిజిస్ట్రేషన్ చేయవలెను. కంపెనీ నమోదు విధానము : కంపెనీ నమోదు కోసము దిగువ ముఖ్య పత్రాలను తయారు చేసి జతపరచాలి. 1) పేరు అనుమతి కోసం దరఖాస్తు: ‘కంపెనీ నమోదుకోసం మొదట పేరు అనుమతి కోరుతూ ఆ రాష్ట్ర కంపెనీల రిజిస్ట్రారుకు దరఖాస్తు చేయాలి. పేర్ల చట్టం 1950 పరిధిలోపు ఏ పేరైనా కంపెనీ పెట్టుకోవచ్చు. కంపెనీ రిజిస్ట్రారు దరఖాస్తు అందిన 14 రోజులలోపు అనుమతిని ఇస్తారు. ఆ తేదీనుంచి 3 నెలల లోపు ఆ పేరును రిజిస్ట్రేషన్ చేయాలి. 2) సంస్థాపనా పత్రము : ఈ పత్రము కంపెనీకి రాజ్యాంగము వంటిది. ఇందులో కంపెనీ ధ్యేయాలు, అధికారాలు, బయటవారితో ఉన్న సఁ న నిర్వచిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పత్రము దీనిని జాగ్రత్తగా తయారు చేసి తగిన స్టాంపులు అతికించాలి. పబ్లిక్ కంపెనీ అయితే ఏడుగురు, ప్రైవేటు కంపెనీ అయితే ఇద్దరు ఈ పత్రముపై సంతకాలు చేయాలి. 3) కంపెనీ నియమావళి : ఈ పత్రము కంపెనీ అంతర్గత పరిపాలనకు సంబంధించి నియమ నిబంధనలు ఉంటాయి. సంస్థాపనా పత్రము మీద సంతకాలు చేసినవారు దీని మీద సంతకాలు చేయవలెను. ప్రైవేటు కంపెనీ నియమావళిని తప్పని సరిగా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి. పబ్లిక్ కంపెనీ నియమావళిని తయారుచేయకపోతే కంపెనీ చట్టంలోని షెడ్యూల్ 1, టేబుల్ A ని అనుసరించవచ్చును. 4) అదనపు పత్రాలు : కంపెనీ నమోదుకు మరికొన్ని అదనపు పత్రాలు తయారు చేసి రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి. ఎ) డైరెక్టర్ల అంగీకార పత్రము : డైరెక్టర్లుగా వ్యవహరించడానికి వారి సమ్మతిని తెలియజేస్తూ ఒక పత్రాన్ని రిజిస్ట్రారుకు దాఖలు చేయవలెను. బి) పవర్ ఆఫ్ అటార్నీ : కంపెనీ నమోదుకు కావలసిన లాంఛనాలు పూర్తి చేసినట్లు ధృవీకరించడానికి, అవసరమయితే తగిన మార్పులు చేయడానికి ఒక న్యాయవాదిని వ్యవస్థాపకులు నియమించాలి. అతనిని అటార్నీ అంటారు. అతని నియామకపు పత్రాన్ని కూడా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి. సి) కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయము తెలిపే నోటీసు : కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయము ఎక్కడ ఏర్పాటు చేయవలెనో ముందు నిర్ణయము అయితే, నమోదైన 30 రోజులలోపు రిజిష్టర్డ్ కార్యాలయ వివరాలను రిజిస్ట్రారుకు తెలియజేయాలి. డి) డైరెక్టర్ల వివరాలు : కంపెనీ డైరెక్టర్లు, మేనేజరు లేదా సెక్రటరీ మొదలైన వారి వివరాలను ఫారం 32లో పొందుపరిచి నమోదుకు 30 రోజులలోపు రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి. 5) శాసనాత్మక ప్రకటన .: కంపెనీల చట్టం ప్రకారము నమోదుకు సంబంధించి అన్ని లాంఛనాలు సక్రమముగా నిర్వర్తించినట్లు కంపెనీ న్యాయవాది గాని, ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా సెక్రటరీగాని చట్టపూర్వకమైన ప్రకటన చేయించాలి. 6) నమోదు రుసుం చెల్లింపు : కంపెనీ నమోదుకు చట్టప్రకారము నిర్దేశించిన రుసుము చెల్లించి రశీదును పొందాలి. పైన తెలిపిన పత్రాలన్నింటిని రిజిస్ట్రారు పరిశీలించి సంతృప్తి చెందితే నమోదు పత్రాన్ని జారీ చేస్తాడు. ఈ పత్రాన్ని పొందిన వెంటనే ప్రైవేటు కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కాని పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధృవపత్రము పొందనిదే వ్యాపారాన్ని ప్రారంభించరాదు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,336
Topic: పందళ రాజులు Article: ప్రారంభ చరిత్ర తమిళ రాజుకు చెందిన పాండ్య రాజ్యం ఖల్జీ వంశీయుల అల్లావుద్దీన్ ఖల్జీ యొక్క కమాండర్-ఇన్-చీఫ్ అయినమాలిక్ కఫూర్ ఒకసారి దాడికి గురైంది. పాండ్య రాజు వైఫల్యంతో, ఈ రాజవంశం యొక్క రెండు శాఖలు దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి పశ్చిమానికి (కేరళ) వైపుకు పారిపోయారు. పశ్చిమ కనుమల పర్వత ప్రాంతాల నుండి ఒక శాఖ బయలుదేరింది, కొట్టాయంలో పూంజర్లో పూంజర్ రాజ్యాన్ని స్థాపించింది. ఇతర శాఖలు ( చిమ్మళనూర్ ) అనేక ప్రదేశాల గుండా తిరుగుతూ,చివరకు పండలంలో స్థిరపడ్డాయి.. మొదట పారిపోతున్న చెమ్బజ్హన్నూర్ శాఖ వల్లియూర్లో ( తిరునెల్వేలిసమీపంలో) స్థిరపడింది మరియు సమాజంలో విశేష స్థానం పొందారు. ఆ తరువాత ముట్టడి యొక్క బెదిరింపులు కారణంగా, రాజ కుటుంబం టెన్కాసికిమారింది. తిరుమలై నాయక్ (నాయకన్) , మధురై యొక్క ప్రఖ్యాత పాలకుడు చెంబజన్నార్ కుటుంబంలోని యువరాజుతో తన కూతురు వివాహం చూడాలని కోరుకున్నాడు. అయితే పెళ్లి ప్రతిపాదన తిరస్కరించడంతో, నాయక్ పాండియాల శత్రువు అయ్యాడు. అతడి బలమైన మరాపపడ (సైన్యం) తో తెన్కాసిలో భారీ నష్టాలను కలిగించాడు . తెన్కాసిలో వారు శాంతియుత జీవితాన్ని కొనసాగిస్తారని తెలుసుకున్న ఆ కుటుంబం ఎలుతూర్ మణియమ్ అనేస్థలంలోకి వెళ్లారు మరియు పులియాంకు సమీపంలోని పర్వత ప్రాంతాలను కొన్నారు. కాని నాయక్ రాజ కుటుంబాన్ని హింసించట్టం కొనసాగించాడు, అచ్చంకోవిల్, ఆర్యంగావు, కులతుపుళా వంటి ప్రదేశాల గుండా పశ్చిమానికి ( కేరళ ) వెళ్ళటానికి వారిని బలవంతం చేసాడు మరియు కొన్నీలో స్థిరపడ్డారు.ఈ కుటుంబం వారి రోజువారీ ఆరాధనల కోసం కొనిలోనిశివ భగవానుడిని ( మురింగ్మమంగళం శ్రీమహదేవర టెంపుల్ ) నిర్మించారు. ఈ దేవాలయం కేరళలోని చెమ్బాజుహుర్ కుటుంబం యొక్క అత్యంత ప్రసిద్ధ రచనలలో ఒకటి.  చోళులచే ట్రావెన్కోర్లో జరిగిన దాడులకు కుటుంబం కొండని పారిపోయి, పండాలంలోస్థిరపడటానికి బలవంతంగా వారి శాశ్వత రాజధానిగా మారింది.  ట్రావెన్కోర్ రాష్ట్ర మాన్యువల్ ప్రకారం , పండాల రాజ్యం ట్రావెన్కోర్ రాజులతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉంది. అయ్యప్ప చరిత్ర శబరిమల, అయ్యప్ప పవిత్ర నివాసం పండలంలోని రాచరిక కుటుంబం భార్గవ గోత్రాలకుచెందినది, కేరళలోని ఇతర రాచరిక కుటుంబాలువిశ్వవిత్రా గోత్రంలో చేర్చబడ్డాయి అని నమ్ముతారు.హరిహారా కుమారుడు అయ్యప్పతో కలిసి శివుడుమరియు విష్ణువు కలయికతో ఈ రాజ్యం ప్రసిద్ధి చెందింది. 
పందళ రాజులు
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,337
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి ధనావేశం, రుణావేశం గల ఆర్ద్ర ఫెర్రిక్ ఆక్సైడ్ కొల్లాయిడ్ ద్రావణాల ఫార్ములాలను వ్రాయండి.
1. ధనావేశం గల ఆర్ధఫెర్రిక్ కొల్లాయిడ్ ద్రావణ ఫార్ములా Fe2O3.xH2O/Fe+3 2. ఋణావేశం గల ఆర్ధఫెర్రిక్ కొల్లాయిడ్ ద్రావణ ఫార్ములా Fe2O3.xH2O/OH–
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,338
సరైన సమాధానాన్ని గుర్తించండి. నీడ ఏర్పడటానికి కావలసినవి A) కాంతి వనరు B) కాంతి నిరోధక పదార్థం C) తెర D) పైవన్నీ
D) పైవన్నీ
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,339
Title: కరోనావైరస్: దక్షిణ కొరియాలో ఒకే రోజులో రెట్టింపైన రోగుల సంఖ్య\nGiven the above title of an imaginary article, imagine the article.\n
వైరస్ వ్యాప్తి కొత్త దశలోకి వచ్చిందని దక్షిణ కొరియా ఆరోగ్య శాఖ ఉప మంత్రి కిమ్ గాంగ్-లిప్ అన్నారు. కొత్త కేసుల్లో చాలా వరకు డేగు నగర సమీపంలో ఉండే ఒక ఆసుపత్రి, ఒక మతానికి చెందినవారున్నారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరు కరోనా రోగులు మరణించగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చియాంగ్డోకు సమీపంలో ఉన్న డేగు నగరంలో ఈ ఆసుపత్రి ఉంది. ఈ ప్రాంతాన్ని అక్కడి ప్రభుత్వం స్పెషల్ కేర్ జోన్‌గా ప్రకటించింది. డేగు నగర వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. చైనా వెలుపల అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నిర్ధారణయింది దక్షిణ కొరియాలోనే. చనిపోయిన 2,345 మందితో కలిపి చైనాలో మొత్తం 76,288 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ కాగా జపాన్ తీరంలో నిలిపివేసిన డైమండ్ ప్రిన్సెస్ నౌకలో 600 మందికిపైగా ఈ వైరస్ సోకింది. అయితే, చైనాలో కొత్త కేసులు, మరణాలు రెండూ తగ్గుముఖం పట్టినట్లు శనివారం అక్కడి అధికారులు చెప్పారు. చైనాతో ఎలాంటి సంబంధం లేకుండా దక్షిణకొరియాలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రియేసస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆఫ్రికా ఖండంలోని బలహీనమైన ఆరోగ్య సేవల వ్యవస్థలున్న దేశాల్లో ఈ వైరస్ ప్రబలితే కలిగే మరింత ప్రమాదమనని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. చైనా కాకుండా 26 దేశాల్లో 1200 కేసులు నమోదయ్యాయని.. కనీసం 8 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. మిగతా దేశాల్లో.. * క్రూయిజ్ షిప్‌లో ఉన్న బ్రిటిష్, ఇతర ఐరోపా దేశాలకు చెందిన పాసింజర్లను తీసుకొచ్చిన విమానం ఇంగ్లండ్ చేరుకుంది. * కరోనా వైరస్ కారణంగా తమ దేశంలో ఇద్దరు మరణించారని ఇటలీ ప్రకటించింది. * తమ దేశంలో అయిదుగురు చనిపోయినట్లు ఇరాన్ వెల్లడించింది. అక్కడి కోమ్ నగరంలో ఈ వైరస్ ప్రబలినప్పటికీ ఇప్పటికే అది దేశంలోని మిగతా అన్ని నగరాలకూ వ్యాపించి ఉంటుందని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. కొత్తగా వైరస్ సోకినవారిలో 62 మంది డేగులోని షిన్‌చియోంజీ చర్చ్ ఆఫ్ జీసస్ అనే క్రైస్తవ మత శాఖకు చెందినవారని కేసీడీసీ వెల్లడించింది. దక్షిణ కొరియాలో ఏమైంది? దక్షిణకొరియా వైద్యాధికారులు శనివారం తొలుత 142 కొత్త కేసులు రికార్డయినట్లు చెప్పారు.. అక్కడికి కొద్ది గంటల్లోనే మరో 87 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణయిందని ప్రకటించారు. శనివారం నిర్ధరణయిన 229 కేసులతో చియాంగ్డోలోని డీనమ్ హాస్పిటల్‌‌లోనే 95 మంది ఉన్నారని...తెలిసినది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,340
ఇచ్చిన పద్యంకి భావం రాయండి. శివరాజంతట మేల్ముసుంగుఁ దెరలో – స్నిగ్జాంబుదద్ఛాయలో నవసౌదామినిఁ బోలు నా యవనకాంతారత్నమున్ భక్తి గా రవముల్ వాజఁగఁ జూచి వల్కె “వనితారత్నంబు లీ భవ్యహైం దవభూజంగమ పుణ్యదేవతలు; మాతా! తప్పు సైరింపుమీ !”
శివాజీ మహారాజు అప్పుడు మేలు ముసుగు తెరలో దట్టమైన నీలి మేఘం వెనుక ఉన్న మెరుపు తీగవంటి యవన కాంతను భక్తి గౌరవాలతో చూస్తూ ఇలా అన్నాడు. “స్త్రీలు శుభప్రదమైన ఈ హైందవ భూమిపై సంచరించే పుణ్యదేవతలు. అమ్మా ! మా తప్పును మన్నింపుము.”
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,341
రాజ్యం, సమాజం మధ్యగల వ్యత్యాసాలను పేర్కొనండి.
రాజ్యం, సమాజం మధ్య వ్యత్యాసాలు: రాజ్యం, సమాజాల మధ్య సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ, ఈ రెండూ ఒకదానికొకటి వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి. వాటిని కింది పట్టిక ద్వారా తెలపవచ్చు. రాజ్యం రాజ్యం అనేది రాజకీయ సంస్థ. రాజ్యం వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మాత్రమే నియంత్రిస్తుంది. ఈ విషయంలో అది కొన్ని నిబంధనలను రూపొందిస్తుంది. రాజ్యానికి దండనాధికారం ఉంది. రాజ్యశాసనాన్ని అతిక్రమించినవారు శిక్షార్హులుగా పరిగణించ బడతారు. రాజ్యం చేసే చట్టాలు రాజ్యానికి బలం చేకూరుస్తాయి. రాజ్యం అనేది ప్రాదేశిక సంస్థ. దానికి స్వీయ నిర్దిష్ట భూభాగం ఉంటుంది. ప్రాదేశికత అనేది రాజ్యానికి చెందిన ప్రధాన లక్షణంగా పేర్కొనవచ్చు. రాజ్యం ఒక్కటే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. తన సార్వభౌమాధికారాన్ని వినియోగించి ప్రజల సంబంధాలను నిర్దేశించే అనేక చట్టాలను రూపొందించి, అమలు పరుస్తుంది. రాజ్యం సహజంగా ఏర్పడిన సంస్థ కాదు. అది మానవనిర్మితమైంది. దానిలో సభ్యత్వం వ్యక్తులకు నిర్బంధమైంది. రాజ్యం సమాజంలోని అతి ముఖ్యభాగం. సమాజంలోని రాజకీయంగా వ్యవస్థీకృతమైన భాగాన్ని అది సూచిస్తుంది. సాంఘిక వ్యవస్థ అభివృద్ధి చెందిన రూపమే రాజ్యం. అది సమాజం నుంచి ఆవిర్భవించింది. రాజ్యం శాశ్వతమైంది కాకపోవచ్చు. అది అంతరించి పోయే అవకాశం ఉంది. వేరొక దానిని బలవంతంగా ఆక్రమించుకోవచ్చు. రాజ్య చట్టాలు, విధి, విధానాలు ఖచ్చితంగాను, స్పష్టంగాను ఉంటాయి. రాజ్యంలోని చట్టాలు ఒకే విధంగా ఉంటాయి. చట్టాన్ని అతిక్రమించిన వ్యక్తులందరూ తారతమ్యం లేకుండా శిక్షకు గురవుతారు. రాజ్యానికి ప్రభుత్వం అనే రాజకీయ వ్యవస్థ ఉంటుంది. అది రాజ్యం తరపున చట్టాలను రూపొం దించి, అమలుచేస్తుంది. సమాజం సమాజం అనేది సాంఘిక వ్యవస్థ. సమాజం మానవుల బాహ్య, అంతర్గత ప్రవర్తనలు రెండింటిని నియంత్రిస్తుంది. వ్యక్తుల సామాజిక జీవనాన్ని ఇది క్రమబద్ధం చేస్తుంది. సమాజానికి దండనాధికారం లేదు. సాంఘిక ఆచారాలను అతిక్రమిస్తే వారిని సమాజం శిక్షించ లేదు. సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు సమాజానికి బలం చేకూరుస్తాయి. సమాజానికి నిర్దిష్టమైన భౌగోళిక హద్దులు లేవు. అది రాజ్యం కంటే విశాలమైంది కావచ్చు లేదా చిన్నదైనా కావచ్చు. సమాజం విశ్వమంతా విస్తరించి ఉంటుంది. సమాజానికి నిర్బంధ అధికారాలు అంటూ ఏవీ లేవు. సమాజం మానవ సామాజిక ప్రవర్తనను క్రమబద్దం చేసే నియమాలను రూపొందించి నప్పటికీ వాటికి చట్టబద్ధత ఉండదు. సమాజం సహజంగా, స్వతఃసిద్ధంగా ఏర్పడిన సంస్థ. వ్యక్తులు తమ విచక్షణను అనుసరించి దీనిలో సభ్యులుగా కొనసాగుతారు. రాజ్యం కంటే సమాజం విస్తృతమైంది. అనేక సంఘాలు, సంస్థలు, వ్యవస్థల ద్వారా అది ఏర్పడి అభివృద్ధి చెందుతుంది. సమాజం పెద్దది. రాజ్యం దానిలో అంతర్భాగం మాత్రమే. సమాజం రాజ్యం కంటే ముందు అవతరించింది. మానవుడు స్వభావరీత్యా సంఘజీవి. సమాజం శాశ్వతమయంది. ఇది నిరంతరం కొనసాగుతుంది. సమాజ సూత్రాలు అస్పష్టమైనవి. అవి సాధారణంగా అనిర్దిష్టంగా ఉంటాయి. అవి సంప్రదాయాలు, కట్టుబాట్లపై ఆధారపడి ఉంటాయి. సమాజం నియమాలు ఒకే విధంగా ఉండవు. ఒకే ఒక వర్గ నియమాలకు, వేరొక వర్గ నియమాలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. వివిధ సామాజిక వర్గాలు ఒకే రకమైన నేరానికి పాల్పడితే విధించే శిక్షలు వేరువేరుగా ఉంటాయి సమాజ నియమాలను అమలు పరచడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగమంటూ ఏదీ లేదు. ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల ద్వారా అది మానవ ప్రవర్తనను నియంత్రిస్తుంది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,342
కనక దుర్గ గుడి క్షేత్ర పురాణం అంటే ఏమిటి?
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు. రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,343
I wonder మాధవరం గ్రామంలో మొదటి బ్యాంక్ ఏది?. Help me answer this question with "Yes" or "No" or "None" if none of the first two answers apply. Here's what I found on the internet: Topic: గూడెం మాధవరం Article: గూడెం మాధవరం కృష్ణా జిల్లా, వీరులపాడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన వీరులపాడు నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 50 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 423 ఇళ్లతో, 1520 జనాభాతో 644 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 757, ఆడవారి సంఖ్య 763. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 614 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 11. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588900[1].పిన్ కోడ్: 521181. సమీప గ్రామాలు ఈ గ్రామానికి సమీపంలో అల్లూరు, చెన్నారావుపాలెం, గంగినేనిపాలెం, పెద్దాపురం, చాత్తన్నవరం గ్రామాలు ఉన్నాయి. సమీప మండలాలు వీరులపాడు, జి.కొండూరు, మైలవరం, కంచికచెర్ల విద్యా సౌకర్యాలు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉంది. జిల్లాపరిషత్ హైస్కూల్, జమ్మవరం, బాలబడి కంచికచర్లలోను, మాధ్యమిక పాఠశాల వల్లూరులోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల కంచికచర్లలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ విజయవాడలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం గూడెం మాధవరంలో ఉన్న ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది. పారిశుధ్యం గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు.
None
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,344
వివిధ లాభ సిద్ధాంతాలను తెల్పండి.
వ్యవస్థాపకుడు చేసే ఉత్పత్తి నిర్వహణ కృషికి ఇచ్చే ప్రతిఫలమే లాభం. లాభ సిద్ధాంతాలు: 1) చలన లాభ సిద్ధాంతం: J.R. క్లార్క్ ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈ సిద్ధాంతం ప్రకారం వస్తూత్పత్తి వ్యయం కంటే ధర ఎక్కువగా ఉంటే లాభం వస్తుంది. నిశ్చల ఆర్థిక వ్యవస్థలో పోటీ పరిస్థితుల వల్ల ఉత్పత్తి కారకం తన ఉత్పాదక శక్తికి సమానంగా వేతనం పొందుతుంది. అందువల్ల ఉద్యమదారులు లాభాలు పొందలేరు. కాని వేతనాలు పొందుతారు. 2) నవకల్పన సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని షుంపీటర్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఉద్యమదారుని నవకల్పనా నైపుణ్యాలకు పారితోషికంగా లాభం చెల్లించబడుతుంది. ఉద్యమదారుడు ఉత్పత్తి కార్యక్రమంలో ప్రవేశపెట్టే నవకల్పన వల్ల ఉత్పత్తి వ్యయం ధరకంటే తక్కువగా ఉండి లాభం వస్తుంది. 3) హాలే నష్టభయ లాభ సిద్ధాంతం: హాలే ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమదారుడు తప్ప మిగిలిన ఏ ఉత్పత్తి కారకం నష్టభయాన్ని భరించడు. అందువల్ల ఇతర ఉత్పత్తి కారకాలకు పంచగా మిగిలిన ఆదాయం ఉద్యమదారునికి చెందుతుంది. 4) అనిశ్చితత్వ లాభ సిద్ధాంతం: నైట్ ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఇది మెరుగుపరచబడిన నష్టభయ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొన్నందుకు ఉద్యమదారునికి చెల్లించే ప్రతిఫలమే లాభం. 5) వాకర్ సిద్ధాంతం: వాకర్ తన సిద్దాంతంలో ఉద్యమదారుని, పెట్టుబడిదారుని వేరుచేసి చూపాడు. వాకర్ ప్రకారం ఉద్యమదారుల సామర్థ్యానికి చెల్లించే ప్రతిఫలం లాభం. వాకర్ లాభ సిద్ధాంతం రికార్డో భాటక సిద్ధాంతాన్ని పోలి ఉంది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,345
భక్తి ప్రబోధకుల ప్రధాన లక్షణాలను తెలపండి.
ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు నడిచిన భక్తి ఉద్యమంలో క్రింది ప్రధాన లక్షణాలను గమనించవచ్చు. 1) ఈశ్వరుని ఏకత్వంపై గాఢానురక్తి ప్రధాన లక్షణం. ఇందులో ముక్తి సాధనకై భగవంతుడి కృపను పొందడమే భక్తుడి లక్ష్యంగా భావించబడింది. 2) పూజా పునస్కారాలు, కర్మకాండలను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు పవిత్రమైన మనస్సు, జీవనం, మానవత్వం, భక్తి వంటివి అనుసరించడం ద్వారా భగవంతుడి కృపను పొందవచ్చు అని బోధించారు. 3) భక్తి ఉద్యమకారులు ఏకేశ్వరోపాసనను బోధించారు. కొందరు సగుణోపాసనను, మరికొందరు నిర్గుణోపాసనను ప్రోత్సహించారు. వైష్ణవుల్లో సగుణోపాసన ప్రసిద్ధమైంది. వారు శ్రీమహావిష్ణువు అవతారాలైన రాముడు లేదా కృష్ణుడిని తమ దేవుడిగా భావించారు. కాగా నిర్గుణోపాసన విగ్రహారాధనను వ్యతిరేకించింది. దేవుడు సర్వాంతర్యామి, మానవుల హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని వారు ప్రచారం చేశారు. సగుణోపాసన, నిర్గుణోపాసనలను రెండింటినీ చిన్న మార్పులతో శంకరాచార్యుడి అద్వైత సిద్ధాంతములో చెప్పబడ్డాయి. 4) ఉత్తర, దక్షిణ భారతదేశ భక్తి ఉద్యమకారులు జ్ఞానం పొందడం ‘భక్తి’లో భాగంగా చెప్పారు. నిజమైన జ్ఞానాన్ని పొందేందుకు గురువు అవసరమని వారు బోధించారు. 5) భక్తి ఉద్యమకారులందరూ కుల వ్యవస్థను వ్యతిరేకించారు. అందువల్ల తక్కువ కులాలవారికి వారు ఆశాజ్యోతి అయ్యారు. భక్తి ఉద్యమకారుల్లో అధికమంది తక్కువ వర్గాల నుంచి వచ్చిన వారు కావడం విశేషం. నామదేవుడు (1270-1350), దర్జీ కుటుంబం, తుకారామ్ (1601-1649) శూద్ర కుటుంబం, కబీర్ దాస్ ముస్లిం మతంలోని నేతకుటుంబం నుంచి వచ్చారు. 6) భక్తి ఉద్యమకారులు పూజారులు పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠి, హిందీ వంటి ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందాయి.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,346
“యానాది వేదాంతి” – దీనిని సమర్థిస్తూ రాయండి.
ఒక విధంగా ఆలోచిస్తే యానాదిని వేదాంతిగానే భావించవచ్చు. వారికి ఆస్తి మీద ఆశ ఉండదు. వారి కాయ కష్టం మీద వారు ఆధారపడి జీవిస్తారు. వీరు ఇంటిని కూడా చెట్లకొమ్మలు, చిట్టి వెదుళ్లు, వెదురు బొంగులతో ‘ వలయాకారంగా నిర్మిస్తారు. ఇంటిని తాటాకులతో నేల నుండి పై వరకు నారతో కుట్టేస్తారు. వారి ఇంటికి కుడి ప్రక్కన గుంటపొయ్యి, నీళ్లకుండలు, చెంబు ఉంటాయి. ఎడమ పక్క తట్టలు, బుట్టలు ఉంటాయి. మధ్యలో రోకటి గుంట ఉంటుంది. నెత్తి మీద తగిలేటట్టు కట్టి పెట్టిన తప్పెట ఉంటుంది. వాకిలి వెనుక జాజి చెక్కల పెట్టె ఉంటుంది. దానిపై వేలాడ గట్టిన ఈతాకుల చాప ఉంటుంది. చూరులో దూపిన గెసిక కర్ర ఉంటుంది. ఇంత నిరాడంబరంగా జీవిస్తాడు. జీవితం అశాశ్వతం, ఐశ్వర్యం నిలబడదు అనే సందేశం తన జీవన విధానం ద్వారా ఇస్తాడు కనుకనే యానాదిని వేదాంతి అనవచ్చు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,347
పుష్పించే మొక్కలలోని మూడు మూల కణజాల వ్యవస్థల పేర్లను తెలపండి. ప్రతి కణజాల వ్యవస్థకు చెందిన కణజాలాల పేర్లను తెలపండి.
పుషించు మొక్కలలో మూడు మూలకణజాల వ్యవస్థలు ఉంటాయి. అవి. బాహ్య చర్మ కణజాల వ్యవస్థ సంధాయక కణజాల వ్యవస్థ నాళిక కణజాల వ్యవస్థ 1. బాహ్య చర్మ కణజాల వ్యవస్థ : దీనిలో బాహ్య చర్మము అవభాసిని, పత్రరంధ్రాలు, కేశాలు (వేర్లు), ట్రైకోమ్లు (కాండము) ఉంటాయి. 2. సంధాయక కణజాల వ్యవస్థ : దీనిలో సరళకణజాలాలు అయిన మృదుకణజాలము, స్థూలకోణ కణజాలము, దృఢ కణజాలము ఉంటాయి. ఇవి వేర్లు, కాండాల వల్కలం పరిచక్రం, దవ్వ, దవ్వ రేఖలలో ఉంటాయి. పత్రాలలో సంధాయక కణాల హరిత రేణువులను కలిగి పలుచని కవచాలతో ఉంటాయి. 3. నాళికా కణ జాల వ్యవస్థ : దీనిలో ప్రసరణ కణజాలాలు అయిన, దారువు, పోషక కణజాలము ఉంటాయి.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,348
ఇచ్చిన గద్యానికి కొనసాగింపుగా ఒక పేరా రాయండి: రష్యాకు చెందిన పన్నెండేళ్ల అన్నాసిన కోవ రాసిన ‘అనారోగ్యం గురించి ఆలోచించకు’ కవితకూడా వారిని అబ్బురపరచింది. ఏమైనా ముఖ్యమైన పనులు చేపట్టినప్పుడు సమస్యలు తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. కాని ఆ సమస్యలు శాసించకూడదని అబ్దుల్ కలాం నమ్ముతారు. దానినే మీరు సమస్యలు అధిగమించండి విజయం సాధించండి అని యువతీయువకులకు చెప్తారు.
ఇటువంటి భావాలే అన్నాసిన్యకోవ కవితలో కూడా ప్రతిధ్వనించాయి. ఆరోగ్యవంతమైన జీవితాల్ని నిలబెట్టుకోవటం కోసం ఎటువంటి వ్యాధినైనా, అనారోగ్యాన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలనే బలమైన సందేశం ఆమె కవితలో కలాంకు కనబడింది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,349
చుట్టూ ఉన్న పరిసరాలలో మానవులకు మేలుచేసే చెట్లు/పక్షులు/జంతువులను గురించి వారి మాటల్లో రాయండి.
1) మేలు చేసే చెట్లు : మేమందరం మేలు చేసే చెట్లమే. మీకు ‘నీడనిస్తాం. నిమ్మ, మామిడి, అరటి, కొబ్బరి, బొప్పాయి ఇలా ఎన్ని పేర్లని చెప్పుకోం. మేమంతా మానవులకు, పశువులకు, పక్షులకు, కీటకాలకి అంతెందుకు ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవికీ, ఆహారాన్ని ఇస్తాం. నీడ నిస్తాం. అన్ని జీవులూ మామీద ఆధారపడతాయి. కాని, మేమెవ్వరి మీదా ఆధారపడం, మేము సొంతంగా ఆహారం తయారుచేసుకొంటాం. గాలి, సూర్యకాంతి, మా ఆకులలోని పచ్చదనాన్ని ఉపయోగించుకొని, ఆహారాన్ని తయారుచేస్తాం. అది మీరు తింటారు. మీకు ఆక్సిజన్ అందించేది కూడా మేమే. మీరు మాకేమీ ఉపకారం చేయక్కర్లేదు. మాకు అపకారం తలపెట్టకండి చాలు. ఇప్పటికే సరైన గాలి, చల్లదనం, వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా బుద్ధిలేదు. మమ్మల్ని బ్రతకనివ్వరు. మేం లేకపోతే మీ బ్రతుకు దుర్బరం. అది తెలుసుకోండి. ఐనా వినకపోతే మీ ఖర్మ. (ఈ విధంగా చెప్పండి) 2) పక్షులు : ప్రకృతిలో మా పక్షుల కిలకిలలు .మీకు వీనుల విందు చేస్తాయి. మా బ్రతుకు మేం బతుకుతుంటే మమ్మల్ని మీరు బతకనివ్వటల్లేదు. మీ ఆహారం కోసం మమ్మల్ని చంపుకొని తింటున్నారు. అయినా సహించాం. మా జాతికి చెందిన కోడి మిమ్మల్ని నిద్ర లేపుతుంది. కోడికి పల్లెటూరి గడియారమని పేరు. కోడిని పకోడిగా చేసుకొని తినేస్తున్నారు. మీ రాక్షసానందం కోసం మా కాళ్లకు కత్తులు కట్టి పోరాటాలు పెడుతున్నారు. నెమలి పింఛం అంత అందమైనదేదీ ఈ సృష్టిలో లేదు. ఆ నెమలి కూడా మీకు బలైపోతుంది. కొంతమంది దయామూర్తులు పక్షి ప్రేమికులు మమ్మల్ని పెంచుతూ కాపాడుతున్నారు. మీ ఆనందం కోసం మమ్మల్ని బాధ పెట్టకండి. చంపకండి. 3) జంతువులు : మేము జంతువులం. మా బాధ వర్ణనాతీతం. మా బాధలకు ఎక్కువగా కారణమయ్యేది మానవులే. మాలోని ఆవులు, గేదెలు, మేకలు మీకు త్రాగడానికి పాలనిస్తున్నాయి. మా పాలు తాగి బలం పొంది, మమ్మల్నే కోసుకొని తినేస్తున్నారు. మీ ఇళ్లలో పెళ్లి వచ్చినా, చావు వచ్చినా మాకు చావు తప్పదు. మాకు పులులు, సింహాలు కంటే కూడా మాన్క “తేనే భయం. పులులు, సింహాలకే మీరంటే భయం. మీ మూర్ఖత్వానికి మాలోనూ, పక్షులలోనూ కొన్ని రకాల జాతులు నశించిపోయాయి. అక్కడక్కడా జంతు ప్రేమికులుండబట్టి ఈ మాత్రమైనా బతుకుతున్నాం. లేకపోతే మాకసలు బతుకే లేదు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,350
ఇచ్చిన గేయానికి ప్రతిపదార్ధాలు మరియు భావం రాయండి: కదల నంతట సెట్టి పలికెను, దేవకార్యం ముందు, ఆవల రాచకార్యం కాద, రాజా ! శలవు నీ విస్తే
ప్రతిపదార్థం : అంతట = అప్పుడు సెట్టి = సెట్టి పలికెను = ఇట్లా అన్నాడు రాజా ! = రాజా ! ముందు = ముందు దేవకార్యం = దేవుని పూజ ఆవల = తరువాతే రాచకార్యం = ప్రభువుల పని కాద = కదా ! నీవు = మీరు శలవు ఇస్తే = అనుమతిస్తే భావం : అప్పుడు సెట్టి ఇట్లా అన్నాడు. రాజా ! ముందు దేవుని పూజ. తరువాతే ప్రభువుల పని కదా ! మీరు అనుమతిస్తే.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,351
ప్రశ్న : ఇతర మతాలకు చెందిన ప్రాంతాలకు నీవెప్పుడైనా వెళ్ళావా? అక్కడ నీవు గమనించిన మంచి విషయాలు ఏవి? ఏ సారూప్యతలు నీవు గమనించావు?
ఇతర మతాలకు చెందిన ప్రాంతాలకు నేను తరచుగా వెళతాను. అక్కడ గమనించిన మంచి విషయాలు : వారు అందరూ కలసి మెలసి ఉంటూ, నన్ను కూడా కలుపుకున్నారు. వారు వారి పెద్దలను గౌరవిస్తూ, వారు చెప్పేది శ్రద్ధగా పాటిస్తున్నారు. వారి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందరి మంచిని కోరుకుంటున్నారు. (సర్వేజనా సుఖినోభవంతు అని) గమనించిన సారుప్యతలు : అందరి భావాలు దేవుడు ఒక్కడే అని చెబుతున్నాయి. ప్రేమతత్వాన్ని బోధిస్తున్నాయి. తోటి ప్రాణి మంచిని కోరుతున్నారు. పాప, పుణ్యాల గురించి తెల్పుతున్నాయి.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,352
2x + 3y – 5 = 0 కు అసంగతమయ్యే సమీకరణమును ఒక దానిని రాయండి.
a1/a2=b1/b2≠c1/c2 అయితే అసంగతాలు. ∴ 2x + 3y – 5 = 0 నకు అసంగతమయ్యే ఒక సమీకరణం = 4x + 6y – 20 = 0 (Note : x, y పదాలను ఒకే సంఖ్యతో గుణించి, స్థిరపదాన్ని వేరొక సంఖ్యతో గుణించాలి.)
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,353
‘మకరందబిందు బృందరసస్యందన మందరమగు మాతృభాషయే’ – ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
అలంకారము : వృత్త్యనుప్రాసాలంకారం. లక్షణం : ఒకే అక్షరం, పలుమార్లు ఆవృత్తి అవడం.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,354
“సమర్థులైన కొడుకులు తల్లిదండ్రుల కష్టాలు తొలగిస్తారు”- ఈ వాక్యాన్ని సమర్థిస్తూ సొంతమాటలలో రాయండి.
కొన్ని పేద, మధ్య తరగతి కుటుంబాలలో తల్లిదండ్రులు తమకు ఆర్థికస్తోమత లేకపోయినా తమ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం కావాలని ఆశిస్తారు. తామెన్ని వ్యయప్రయాసలు, కష్టనష్టాలకు అయినా ఓర్చి వారికి పెద్ద చదువులు చెప్పిస్తారు. అటువంటి కుటుంబాలకు చెందిన కొందరు సమర్థులైన పిల్లలు తమ శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని, తాపత్రయాన్ని గుర్తించి, చక్కగా చదువుకొని ఉన్నత స్థానానికెదిగి, మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. వారు తమ తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆసరాగా నిలవడమే కాక, వారికి అన్ని విధాలా తోడ్పాటు నందిస్తూ, శ్రద్ధాసక్తులతో గౌరవిస్తూ, వారి సలహాలను పాటిస్తూ, వారి కోర్కెలను తీరుస్తూ ఉత్తమ జీవనం సాగిస్తారు. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవడానికి వారు శాయశక్తులా కృషి చేస్తారు. మన పాఠంలో గరుత్మంతుడు సమర్థుడు. బలవంతుడు. కొండల్ని పిండి చేయగలడు. అందువల్లనే తమ దాస్య కారణాన్ని తల్లి నుండి అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు. కద్రువ పుత్రుల వద్దకు వెళ్ళి “మీకు ఇష్టమైనదేదో చెప్పండి. దేవతలనైనా జయించి తెస్తాను’ అని అన్నాడు. అలా అనడానికి అతనికి గల సమర్థత, శక్తి సామర్థ్యాలు కారణం. మాట అనడమేకాదు, తన రెక్కల గాలితో దుమ్మును రేపి అమృతాన్ని రక్షించే పాములకు కళ్ళు కనబడకుండా చేశాడు. వాటి తలలను తొక్కి అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. అమృతాన్ని కద్రూ పుత్రులకు తెచ్చి ఇచ్చి తమ దాస్యాన్ని పోగొట్టుకున్నాడు. దీనిని బట్టి సమర్థులైన కొడుకులు, తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తారని చెప్పగలం.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,355
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అల్పాంతరాళ లోపం అంటే ఏమిటి?
అల్పాంతరాళ లోపాలు : ఎప్పుడైనా కొన్ని ఘటక కణాలు అల్పాంతరాళ స్థానాలను ఆక్రమిస్తే ఆ స్ఫటికానికి అల్పాంతరాళ లోపం ఉంటుంది. → ఈ లోపం పదార్థం సాంద్రతను పెంచుతుంది. → అల్పాంతరాళ లోపాలు అయానికం కాని ఘన పదార్థాలు చూపిస్తాయి. అయానిక పదార్థాలు ఎప్పుడూ కూడా విద్యుత్పరంగా తటస్థంగా ఉండాలి.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,356
Given the below title and summary of an article, generate a short article or the beginning of a long article to go along with them. Title: ‘చైనా ఏజెంట్లు ప్రపంచమంతా పాకేశారు.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్ మెయిలింగ్‌లు’\nSummary: టెలికాం దిగ్గజం హువావే చుట్టూ తాజాగా అల్లుకున్న వివాదం, చైనా గూఢచర్యం విధానాలను మరోసారి బయటపెట్టింది.\nArticle (Max 500 characters):
చైనా తన పనులు నెరవేర్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులను, వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇది తేటతెల్లం చేసింది. చైనా గూఢచర్యం ఏ స్థాయిలో ఉంది? అది ఎలా నడుస్తుంది? ఎవరు నడుపుతారు? మాజీ ఎం-16 గూఢచారి సహకారంతో ఇటీవల విడుదలైన ఓ రిపోర్ట్‌ అనేక అంశాలను బయటపెట్టింది. తమ టెలికాం కంపెనీ తిరిగి బ్రిటన్‌లో కార్యకలాపాలు కొనసాగించడానికి చైనా ప్రభుత్వం ఆ దేశ రాజకీయ నాయకులతో ఎలా వ్యవహారం నడిపిందో.. ప్రముఖ వ్యక్తులను ప్రభావితం చేయడానికి ఎలా ప్రయత్నించిందో అందులో వివరించారు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,357
డయాబెటిక్ అయిన ఆమెకు అప్పటికే ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఈఎన్‌టీ నిపుణుడు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. ఆమె ముక్కులో ఒక ట్యూబ్ వేసిన ఆయన 'మ్యూకోర్‌మైకోసిస్‌' వల్ల ఇన్‌ఫెక్ట్ అయిన కణజాలాన్ని తొలగిస్తున్నారు. ఇది ఒక అరుదైన, ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. తీవ్రమైన ఆ ఇన్ఫెక్షన్ ముక్కు, కళ్లు కొన్నిసార్లు మెదడుపై కూడా ప్రభావం చూపిస్తుంది. తన కొలీగ్ అది పూర్తి చేయగానే, డాక్టర్ నాయర్ రోగి కంటిని తొలగించడానికి మూడు గంటలపాటు ఆపరేషన్ చేయాలి. "ఆమె ప్రాణాలు కాపాడ్డానికి నేను ఆమె కన్ను తీసేస్తున్నాను. ఈ వ్యాధి అంత తీవ్రమైనది" అని డాక్టర్ నాయర్ నాతో అన్నారు. భారత్‌లో కోవిడ్-19 సెకండ్ వేవ్ ప్రాణాంతకంగా వ్యాపిస్తుంటే, ఈ అరుదైన ఇన్ఫెక్షన్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయని డాక్టర్లు ఇప్పుడు చెబుతున్నారు. కోలుకున్న రోగులు దీన్ని 'బ్లాక్ ఫంగస్' అని కూడా అంటున్నారు. 'మ్యూకర్‌మైకోసిస్' అంటే మ్యూకోర్‌మైకోసిస్ ఒక అరుదైన ఇన్ఫెక్షన్. సాధారణంగా మట్టిలో, మొక్కల్లో, ఎరువులో కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయల్లో కనిపించే మ్యూకర్(బూజు లాంటిది) వల్ల వస్తుంది. "ఇది అన్నిచోట్లా ఉంటుంది. మట్టిలో, గాల్లో, ఆరోగ్యంగా
వ్యక్తుల ముక్కులో, చీమిడిలో కూడా ఉంటుంది"ని నాయర్ అన్నారు. ఇది సైనస్, మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. డయాబెటిక్ రోగులకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే క్యాన్సర్ లేదా హెచ్ఐవీ లాంటివి ఉన్న రోగులకు ఇది ప్రాణాంతకం కావచ్చు. మ్యూకర్‌మైకోసిస్‌ సోకినవారిలో 50శాతం మంది మరణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కోవిడ్‌ 19 రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగించే స్టెరాయిడ్లే. కోవిడ్-19 వల్ల ఊపిరితిత్తుల్లో వచ్చే మంటను స్టెరాయిడ్స్ తగ్గిస్తాయి. శరీరంలోని రోగనిరోధక శక్తి కరోనావైరస్‌తో అతిగా పోరాడ్డం వల్ల వచ్చే కొన్ని నష్టాలను అడ్డుకోవడానికి ఇవి సహకరిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, డయాబెటిక్ రోగుల్లో, ఇతరుల్లో అవి ఇమ్యూనిటీని తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. దానివల్ల మ్యూకోర్‌మైకోసిస్ కేసుల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని కూడా భావిస్తున్నారు. "డయాబెటిస్ శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. కరోనావైరస్ అది మరింత తగ్గిపోయేలా చేస్తుంది. తర్వాత కోవిడ్-19తో పోరాడ్డానికి సహకరించే స్టెరాయిడ్స్ మ్యూకోర్‌మైకోసిస్‌కు అగ్నికి ఆజ్యంలా పనిచేస్తాయి" అని నాయర్ చెప్పారు. సెకండ్ వేవ్‌కు ఘోరంగా ప్రభావితమైన ముంబయిలో డాక్టర్ నాయర్ మూడు ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న దాదాపు 40 మంది రోగులను తనను ఇప్పటికే కలిశానని ఆయన చెప్పారు. "వారిలో చాలా మంది డయాబెటిక్ రోగులు. కోవిడ్-19 వచ్చాక ఇళ్లలోనే కోలుకున్నారు. వారిలో 11 మందికి సర్జరీ చేసి ఒక కన్ను తొలగించాం" అన్నారు. డిసెంబర్-ఫిబ్రవరి మధ్య మరో ఐదు నగరాల్లోని ఆయన ఆరుగురు కొలీగ్స్ ఇదే ఇన్ఫెక్షన్‌కు సంబంధించి 58 కేసులు వచ్చినట్లు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది రోగులు కోవిడ్ నుంచి కోలుకున్నవారే. కరోనా నుంచి కోలుకున్న 12 నుంచి 15 రోజుల తర్వాత ఈ డాక్టర్లను కలిశారు. ముంబయిలో బిజీగా ఉండే సియాన్ ఆస్పత్రిలో గత రెండు నెలల్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్‌ 24 కేసులు నమోదయ్యాయి. "గతంలో ఏడాదికి ఇవి ఆరు కేసులు వచ్చేవి. ఇప్పుడు పెరిగాయి" అని ఆస్పత్రిలోని ఈఎన్‌టీ విభాగం హెడ్ డాక్టర్ రేణుకా బ్రాడూ చెప్పారు. వీరిలో 11 మంది ఒక కన్ను కోల్పోగా.. మరో ఆరుగురు చనిపోయారు. ఆమె రోగుల్లో ఎక్కువగా మధ్యవయసు డయాబెటిక్ రోగులే ఉన్నారు. కోవిడ్-19 నుంచి కోలుకున్న రెండు వారాలకు వాళ్లకు ఈ ఫంగస్ వచ్చింది. .
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,358
నాకు నైతికత ఉన్న ఒక పొడవాటి తెలివైన అబ్బాయి కథ చెప్పండి.
ఇది మా నైతిక కథల సంకలనం నుండి ఒక చిన్న కథ. ఇద్దరు చిన్నారులు కలిసి ఆడుకుంటున్నారు. వారిలో ఒకడు నేలమీద గింజను చూశాడు. అతను దానిని తీసుకోకముందే మరొక అబ్బాయి దానిని తీసుకున్నాడు. మొదటి కుర్రాడు “తాంబూలం ఇవ్వు. ఇది నాది. నేను ముందే చూసాను”. అవతలి కుర్రాడు అసహ్యంతో, “ఇది నాది. నేను మొదట తీసుకున్నాను". ఈ విషయమై ఇద్దరు అమాయకుల మధ్య గొడవ జరిగింది. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక పొడవాటి కుర్రాడు వాళ్ళు గొడవ పడుతుండడం చూసి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. కుర్రాళ్ల గొడవ చూసి.. తమలపాకు ఇవ్వండి, మీ గొడవ నేను తీరుస్తాను అన్నాడు. అతను గింజను రెండు భాగాలుగా విభజించాడు. పండు యొక్క విత్తనాన్ని తీసి, అతను ఒక అబ్బాయికి సగం పైసా మరియు మరొకరికి సగం పైసా ఇచ్చాడు. అతను చాకచక్యంగా పండు విత్తనాన్ని నోటిలో పెట్టుకుని, “ఇదేం నీ గొడవ తీర్చుకోవడానికే” అన్నాడు. కథ యొక్క నీతి: ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటే మరొకరికి లాభం చేకూరుతుంది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,359
విద్యార్థులు – క్రమశిక్షణ మీద వ్యాసం రాయండి.
విద్యను అర్థించేవారు విద్యార్థులు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనని కలిగి ఉండటం. నిజానికి క్రమశిక్షణ అన్ని వర్గాలవాళ్ళకీ, అన్ని వయస్సుల వాళ్ళకీ అవసరమే. అయితే విద్యార్థులు భావిభారత పౌరులు! జాతి భవిష్యత్తు వాళ్ళమీదే ఆధారపడి ఉంది. “మొక్కై వంగనిదే మానై వంగునా !” అన్నారు. చిన్నప్పుడే క్రమశిక్షణ అలవడటం సాధ్యం. పెద్దయిన తర్వాత మనిషి మారటం చాలా కష్టం. అందుకని విద్యార్థుల్లో క్రమశిక్షణ ఉండాలి. అయితే విద్యార్థుల్లో క్రమశిక్షణ ఎందుకు లోపిస్తోంది? అనే అంశాన్ని లోతుగా పరిశీలించవలసి ఉంది. అందుకు కొన్ని కారణాలు : కావలసిన కోర్సులో సీటు దొరకకపోవడం – కావలసిన రంగంలో ఉద్యోగం దొరకకపోవడం. రాజకీయ పార్టీల, నాయకుల ప్రభావం, జోక్యం. విద్యాలయాల్లో అవినీతి, అవకతవకల పరంపరలు ! ప్రభుత్వం విద్యను వ్యాపారంగా చెయ్యడం. తల్లిదండ్రుల అశ్రద్ధ, అలసత్వం. ఇన్ని కారణాలతో పాటు పేర్కొనవలసిన మరొక రెండు ముఖ్యమైన అంశాలున్నాయి – ఒకటి సినిమా, రెండు టి.వి ! ఈ రెండూ మానసిక వికాసానికి, జ్ఞానాభివృద్ధికి ఉద్దేశించబడ్డాయి. కానీ పాశ్చాత్య విషసంస్కృతి ప్రభావంచే ఈ రెండు ప్రసార సాధనాలూ యువకులపై, విద్యార్థుల పై “స్లోపాయిజన్” లా పని చేస్తున్నాయి. విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడాలంటే ముందుగా – విద్యను వ్యాపారంగా మార్చే ధోరణులపై కఠిన వైఖరి అవలంబించాలి. విద్యారంగంలోని అవకతవకల్ని, అవినీతిని (లీకేజీ, మాస్ కాపీయింగ్ సంప్రదాయాల్ని) అరికట్టాలి. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో, ఆదర్శవంతంగా ప్రవర్తిస్తూ బోధనకి అంకితమవ్వాలి. రాజకీయ పార్టీల నీడ కూడా విద్యాలయాలపై పడకూడదు. విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ ఉండాలి. విద్యార్థుల్లో దేశభక్తి, సచ్ఛీలత, సహనం అలవడేలా తగిన చర్యలు తీసుకోవాలి. క్రమశిక్షణ ఇతరులు బలవంతంగా రుద్దినట్లు ఉండకూడదు. ఆత్మగౌరవానికి సంబంధించినదిగా, ఆత్మశక్తికి సంబంధించినదిగా, జీవితధ్యేయంగా క్రమశిక్షణను అలవరచుకోవాలి. అప్పుడు విద్యార్థులతో పాటు దేశం కూడా అక్షరజ్యోతిగా వెలిగి అభివృద్ధి బాటలో పయనిస్తుంది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,360
చలన ఆర్థిక విశ్లేషణ గురించి సంక్లిప్తంగా వివరించండి
ఆర్థిక చలనత్వం వేరువేరు సమయాలకు చెందిన విలువలను తెలియజేసే సంబంధిత చలాంకాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,361
ఆర్థిక కార్యకలాపాల సంక్షిప్త వివరణ.
వ్యాపార ఆర్థిక కార్యకలాపాలను వ్యాపారము, వృత్తి, ఉద్యోగము అని మూడు రకాలుగా విభజించవచ్చును. వ్యాపారము: సాహిత్యపరముగా వ్యాపారము అంటే నిరంతరము శ్రమిస్తూ ఉండే స్థితి. ప్రతి వ్యక్తి ఏదో ఒక పనిచేస్తూ నిమగ్నమై ఉంటాడు. లాభార్జన ధ్యేయంతో చేపట్టే వ్యాపకమే వ్యాపారము. వ్యాపార కార్యకలాపాలు వస్తు సేవల ఉత్పత్తి లేదా వినిమయం లాభార్జన లేదా జీవనోపాధి కోసము జరుగుతాయి. వృత్తి: ప్రత్యేకమైన విజ్ఞానము, విద్య, శిక్షణల ప్రాతిపదికగా ప్రత్యేక స్వభావము కలిగిన సేవలను వ్యక్తిగతముగా అందజేసే వ్యాపకాన్ని వృత్తి అంటారు. వృత్తి సంబంధమైన సేవలను అందజేసినందుకు ప్రతిఫలముగా కొంత సొమ్మును వసూలు చేయవచ్చును. ఉదా: ఒక డాక్టరు వైద్యశాస్త్రంలో తనకున్న పరిజ్ఞానము ద్వారా పేషెంట్లకు సహాయము చేసి ఫీజును వసూలు చేయవచ్చును. ఉద్యోగము: ఒక ఒప్పందము ప్రకారముగాని లేదా సేవా నియమాల ప్రకారము ఒక వ్యక్తి మరొక వ్యక్తికి పనిని అప్పగించినట్లయితే అది ఉద్యోగము క్రిందకు వస్తుంది. పనిని అప్పగించిన వ్యక్తిని యజమాని అని, పని స్వీకరించిన వ్యక్తిని ఉద్యోగి అని అంటారు. ఉద్యోగి యజమాని ఆదేశాల ప్రకారం పని చేసి కొంత ప్రతిఫలాన్ని జీతము రూపములో పొందుతాడు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,362
ఇచ్చిన ప్రశ్నకు జవాబు ఇవ్వండి: యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో, భద్రతా మండలిలో ఎంత మంది శాశ్వత సభ్యులు ఉన్నారు?
అయిదుగురు
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,363
క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి: సిగరెట్ పొగలో ఉండే రేడియోధార్మిక పదార్థం ఏది?
పొలోనియం
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,364
కింది పేరా చదవండి. సంక్లిష్ట వాక్యాలను గుర్తించండి. రాయండి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పశ్చిమబెంగాల్ లో జన్మించాడు. ఈయన సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషలు నేర్చుకున్నారు. చదువు పూర్తయింది. ఈశ్వరచంద్రుడు ఉద్యోగంలో చేరాడు. ఈయన ప్రధానోపాధ్యాయునిగా, ప్రత్యేక తనిఖీ అధికారిగా పనిచేశాడు. ఈ ఉద్యోగం అతనికి రుచించలేదు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి, అనేక బాలికా పాఠశాలలు స్థాపించాడు. వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. అంతేగాక తన కుమారునికి ఒక వితంతువుతో వివాహం జరిపించి, సభ్య సమాజానికి ఆదర్శప్రాయుడయ్యాడు.
సంక్లిష్ట వాక్యాలు : స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి, అనేక బాలికా పాఠశాలలను స్థాపించాడు. అంతేగాక తన కుమారునికి ఒక వితంతువుతో వివాహం జరిపించి, సభ్య సమాజానికి ఆదర్శప్రాయుడైనాడు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,365
ప్రశ్న: ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోకపోతే ఏమవుతుంది?
ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోకపోతే : 1. భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుంది. 2. తర్వాత పంటకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉండవు. 3. కరవు, కాటకాలు లాంటివి ఏర్పడినప్పుడు ఆహార ధాన్యాల నిల్వలు లేకపోతే ఆహార కొరత ఏర్పడుతుంది. 4. ఆహార కొరత సమయంలో వ్యాపారులు (నల్ల బజారు) బ్లాక్ మార్కెటింగ్ చేసే అవకాశం ఉంది. 5. ఆహార కొరత సమయంలో ఆకలి చావులు ఏర్పడే ప్రమాదం ఉంది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,366
ఒక అర్ధవృత్తములో, కేంద్రము వద్ద కోణము ఎంత?
180°
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,367
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదాన్ని వివరించండి?
మానవతావాదం అంటే మానవ సంక్షేమాన్ని, మానవ ప్రగతిని, లక్ష్యంగా పెట్టుకుని ఒక మానవుడు తోటి మానవుని గురించి శుభకామనతో చేసే ఆలోచనా రీతి. దీనిని మావనతా వాదం అనే కన్నా మానవతా దృక్పధం అనటం సబబని రవ్వాహరి అభిప్రాయం. ఈ మానవతా దృక్పధానికి మూలం ప్రేమ. మానవుడు తోటి మానవుని పట్ల ప్రేమ భావాన్ని స్నేహభావాన్ని చూపించగలిగితే సమాజం ఆనందమయం అవుతుంది. ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి, మానవతా వాదానికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సంస్కృతంలో వేద వాఙ్మయం అతి ప్రాచీనమైంది. ఆ వేదాలలో ఋగ్వేదం మొదటిది. దానిలోని ‘పదవ మండలంలో అన్నదాన మహాత్మ్యాన్ని చెప్పే శ్లోకం ఒకటి ఉంది. ప్రాచీన సాహిత్యంలో కన్పించే అన్నదాన ఘట్టాలన్నీ మానవతా వాద ప్రతిపాదకాలే! ఆకలితో బాధపడేవానికి అన్నం పెట్టనివాడు చనిపోయన వానితో సమానుడుట. వాల్మీకి రామాయణం ఆరంభమే మానవతావాదంతో ప్రారంభమయింది. “మానిషాద ప్రతిష్ఠాం….” అన్న ఆది కావ్యా రామాయణ వాక్యాలు పరమ కారుణ్య భావానికి ప్రతీకలు. ప్రేమ భావాన్ని దయాభావాన్ని మానవులపైనే కాక సకల జీవరాశిపై చూపించాలన్నది నిజమైన మానవతావాదం. బోయవాడు క్రౌంచ పక్షులలో మగపక్షిని భాణంతో కొట్టాడు. ఆడపక్షి దుఃఖం – వాల్మీకిని కదిలించిందట. ఇది అసలైన కారుణ్యభావం కదా!- ఇక ‘మహాభారతంలో ఉన్నదే మరొక చోట కూడా ఉంటుంది. మహాభారతంలో లేనిది మరెక్కగా ఉండదు. ధర్మప్రతిపాదన మహాభారత లక్షణం. దధీచి, శిబి, రంతి దేవుని కథలు మానవతా వాదానికి మచ్చుతునకలు. రంతిదేవుడు నోట వ్యాసుడు “న త్వహం కామయే రాజ్యం…” అన్న శ్లోకం ద్వారా” నాకు రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, మోక్షం అసలే వద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తిని తొలగించటమే కావాలంటాడు. దీనికి మించిన మానవతా వాదం ఇంకా ఎక్కడున్నది. ఇక దానాలన్నింటిలో అన్నదానం గొప్పదంటారు. ఎందుకంటే అది క్షుద్బాధను తీరుస్తుంది కాబట్టి. తాను కడుపునిండా తింటూ కొందరు ఆకలితో అలమటిస్తుంటే ఉ దాసీనంగా పట్టనట్లుగా ఉంటే అది మానవత్వం అన్పించుకోదు. ప్రాచీన సాహిత్యమంతటిలో దానమైన నిత్యం చేస్తే అది మానన్తవం అనిపించుకుంటుంని చెప్పబడింది. భాగవతంలోని సప్తమ అధ్యాయంలో గృహస్థ ధర్మాలను వ్యాసులవారు వివరించారు. ఏ మానవునికైనా తన కడుపునింపుకునే ధనం మీద మాత్రమే అధికారం ఉంది. అంతకంటే ఎక్కువ ఉంచుకుంటే అది పాపమే అవుతుంది అన్నాడు. చరకుడు తన చరకసంహితలో సమస్త ప్రాణుల సంతోషాన్ని కోరుకున్నాడు. అష్టాంగ హృదయంలో ‘బాల వృద్ధేభ్యః అన్నమదత్వాన భుజంతీ” అని చెప్పబడింది. అంటే బాలలకు వృద్ధులకు అన్నంపెట్టిన తరువాతే మనం భుజించాలని అర్థం. మానవులందరూ సుఖంగా ఉండాలి. సర్వజీవులు ఆనందంగా జీవించాలని అన్నది మన ప్రాచీనుల ఆదర్శమని రవ్వాశ్రీహరి పేర్కొన్నారు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,368
Question: 2011 నాటికి సత్యవరం గ్రామంలో ఎన్ని ఇళ్లులు ఉన్నాయి? Answer the question with Yes or No. If it is not possible then answer None. Hint: సత్యవరం, విశాఖపట్నం జిల్లా, పాయకరావుపేట మండలానికి చెందిన గ్రామము.[1]. ఇది తునికి మూడు కిలోమీటర్ల దూరంలో, తుని-పెంటకోట రోడ్డు మీద, దిగువున ఉన్న చిన్న గ్రామం. ప్రసిద్ధి చెందిన తుని తమలపాకులు ఈ సత్యవరంలోనూ, దగ్గర ఉన్న రామభద్రపురంలోనూ ఉన్న తోటలలోనే పెరిగేవి. ఈ వూరిలో గౌరి దేవి ఆలయము చాలా ప్రసిద్ధి. ఊరిలో గౌరి దేవి సంబరాలు మార్చి లేదాఫిబ్రవరిలో జరుగుతాయి. ఆ వేడుకలను ఘనంగా జరుపుతారు. సత్యవరం తమలపాకులకు ప్రసిధ్ది. ఇది మండల కేంద్రమైన పాయకరావుపేట నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తుని నుండి 5 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1530 ఇళ్లతో, 5657 జనాభాతో 546 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2869, ఆడవారి సంఖ్య 2788. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 942 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 586460[2].పిన్ కోడ్: 531127. విద్యా సౌకర్యాలు గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల తునిలోను, ఇంజనీరింగ్ కళాశాల రాజుపేటలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కాకినాడలోను, పాలీటెక్నిక్ నర్సీపట్నంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పాయకరావుపేటలోను, అనియత విద్యా కేంద్రం తునిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విశాఖపట్నం లోనూ ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం సత్యవరంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టరు ఒకరు ఉన్నారు. ఒక మందుల దుకాణం...
1530
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,369
Rumor has it that 1985 is the answer to క్రిస్టోఫర్ నెయిల్ ఏ సంవత్సరంలో జన్మించాడు?
క్రిస్టోఫర్ నెయిల్ "క్రిస్ " అలెన్ కాన్వాయ్, ఆర్కాన్సాస్ నుండి (1985 జూన్ 21 లో పుట్టారు) వచ్చిన ఒక అమెరికా గాయకుడు-గేయరచయిత మరియు అమెరికన్ ఐడోల్ యొక్క ఎనిమిదవ తరుణం విజేత.[1] ఐడోల్</i>లో గెలుపొందేముందు, ఆయన స్వంతంగా 2007లో బ్రాండ్ న్యూ షూస్ అనే పేరుతో ఒక ఆల్బంను విడుదల చేసారు.[2][3]
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,370
హ్రస్వదృష్టి గల కంటి యొక్క గరిష్ఠ దూర బిందువు 1.5 మీ|| దూరంలో ఉంది. ఈ దోషాన్ని సవరించడానికి వాడవలసిన కటక సామర్థ్యం విలువ A) 0.66 D B) -0.66 D C) +1.5D D) -1.55 D
B) -0.66 D
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,371
Jason mikhaelstatham గురి0చితెలుపవలెను.
జాసన్ మైఖేల్ స్టాథమ్ (pronounced/ˈsteɪ θəm/(deprecated template);[1][2] 12 సెప్టెంబరు 1972న జననం)[3] ఒక ఆంగ్ల నటుడు మరియు మార్షల్ ఆర్టిస్ట్. గయ్ రిట్చీ రూపొందించిన లాక్, స్టాక్ అండ్ టూ స్మోకింగ్ బ్యారల్స్ ; రివోల్వర్ ; మరియు స్నాచ్ వంటి నేర చిత్రాల్లో పోషించిన పాత్రలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. స్టాథమ్ ది ఇటాలియన్ జాబ్ వంటి పలు అమెరికా చిత్రాల్లో సహాయక పాత్రలు చేశాడు. అలాగే ది ట్రాన్స్‌పోర్టర్ , క్రాంక్ , ది బ్యాంక్ జాబ్ , వార్ (మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు జెట్లీతో కలిసి) మరియు డెత్ రేస్ వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రధారుడిగా నటించాడు. సాధారణంగా తనకు కేటాయించిన సన్నివేశాలు మరియు పోరాటాలను సొంతంగా తనే చేసేవాడు.[4] బాల్యం స్టాథమ్ లండన్[5][6]లోని సిడెన్‌హామ్‌లో జన్మించాడు. అతను లౌంజి గాయకుడు మరియు నర్తకుడుగా మారిన దర్జీ కుమారుడు. తర్వాత అతను నార్‌ఫోక్‌లోని గ్రేట్ యార్‌మౌత్‌కు వెళ్లాడు. వీధి నాటకంలో ప్రావీణ్యం సంపాదించడానికి అతను చిన్నతనంలో తన తల్లిదండ్రులను అనుసరించాడు. స్థానిక గ్రామర్ స్కూల్ (1978–83) తరపున అతను ఫుట్‌బాల్ కూడా ఆడాడు. అయితే ప్రత్యేకించి అతనికి డైవింగ్ అంటే మహా ఇష్టం. 1992లో నిర్వహించిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అతను 12వ స్థానాన్ని సాధించాడు.[7] అంతేకాక అతను పన్నెండేళ్ల పాటు బ్రిటన్‌కు చెందిన నేషనల్ డైవింగ్ స్క్వాడ్‌లో సభ్యుడు. లండన్‌లోని క్రిస్టల్ ప్యాలెస్ నేషనల్ స్పోర్ట్స్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నప్పుడు అథ్లెటిక్స్‌లో నైపుణ్యం ఉన్న ఒక సామర్థ్యవంతుడితో కలిసి కనిపించడం ద్వారా స్టాథమ్ మాధ్యమ జీవితం ప్రారంభమయింది. ఆ తర్వాత, టామీ హిల్‌ఫైజర్ అనే దుస్తుల బ్రాండ్‌కు అతను మోడల్‌గా వ్యవహరించాడు. కిక్‌బాక్సింగ్ మార్షల్ ఆర్ట్‌లో స్టాథమ్ నిపుణుడు. జీవనం ఫ్రెంచ్ కనెక్షన్‌తో పనిచేస్తున్నప్పుడు, ఒక చలనచిత్ర రూపకల్పనపై కసరత్తు చేస్తూ, ఔత్సాహిక కళాకారుడి పాత్ర ఎంపికకు ప్రయత్నిస్తున్న బ్రిటీష్ దర్శకుడు గయ్ రిట్చీ[8]కి అతను పరిచయం చేయబడ్డాడు. స్టాథమ్ గతం గురించి తెలుసుకున్న తర్వాత 1998లో విజయవంతమైన తన లాక్, స్టాక్ అండ్ టూ స్మోకింగ్ బ్యారెల్స్ చిత్రంలో "బేకన్" పాత్రను రిట్చీ అతనికి కేటాయించాడు.[9] ఈ చిత్రం విమర్శకులు మరియు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. దాంతో అప్పటివరకు పెద్దగా తెలియని స్టాథమ్‌ ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. 2000లో విడుదలయిన స్నాచ్ చిత్రం ద్వారా రిట్చీతో స్టాథమ్...
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,372
I want to teach my class about the topic of వంటలమామిడి @ గాదిలమెట్ట. వంటలమామిడి @ గాదిలమెట్ట గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ ఏంటి?,
వంటలమామిడి @ గాదిలమెట్ట, విశాఖపట్నం జిల్లా, పాడేరు మండలానికి చెందిన గ్రామము.[1] ఇది మండల కేంద్రమైన పాడేరు నుండి 23 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 66 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 11 ఇళ్లతో, 44 జనాభాతో 15 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 21, ఆడవారి సంఖ్య 23. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 44. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 584767[2].పిన్ కోడ్: 531024.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,373
ఇచ్చిన పదానికి నానార్ధాలు ఇవ్వండి: వాసం
ఇల్లు, ఇంటి పైకప్పుకు అడ్డుగా వేసే కర్ర
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,374
భారతదేశంలో ఉత్తర, దక్షిణ భాగాలలో శీతోష్ణస్థితికి ఎందుకు భిన్నంగా ఉంటుంది?
భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్యరేఖకి దగ్గరగా ఉష్ణమండలంలో ఉంది. ఈ కారణంగా ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి. కన్యాకుమారిలోని శీతోష్ణస్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోషస్థితికంటే భిన్నంగా ఉండటానికి ఇది ఒక కారణం.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,375
మీ ఇంటికి వచ్చిన అతిథులకు మీరు ఎలా మర్యాద చేస్తారు?
మా ఇంటికి వచ్చిన అతిథిని లోనికి రమ్మని పిలుస్తాం. కాళ్ళు కడుగుకోడానికి నీళ్ళు ఇస్తాం. మంచి నీరు తెచ్చి ఇస్తాం. ఆయన వచ్చిన పని ఏమిటో తెలుసుకుంటాం. ఆయనకు కాఫీ కాని, టీ కాని, మజ్జిగ కాని ఇస్తాం. భోజనం కావాలంటే వండి పెడతాం.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,376
కొత్తగా చేర్చిన ‘మెసెంజర్ రూమ్స్’ ఫీచర్ ద్వారా జనం గ్రూప్ వీడియో చాట్ చేసుకోవచ్చు. అందులో 50 మంది చేరొచ్చు. ఈ ఫీచర్లను తమ ప్రణాళిక కన్నా ముందుగానే విడుదల చేశామని, కరోనావైరస్ లాక్‌డౌన్ అందుకు కారణమని ఫేస్‌బుక్ సంస్థ బీబీసీతో చెప్పింది. గ్రూప్ చాట్‌లోకి అవాంఛిత అతిథులు వచ్చిపడకుండా నిరోధించటానికి క్రిప్టోగ్రాఫర్లతో కలిసి పనిచేసినట్లు తెలిపింది. ఈ కొత్త ఫీచర్లు బ్రిటన్‌లో శుక్రవారం నాడు కొందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చినా.. ఫేస్‌బుక్ ఖాతాదారులందరికీ చేరటానికి కొన్ని వారాల సమయం పడుతుంది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో వీడియో కాలింగ్ సేవలు విపరీతంగా పెరిగాయి. కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా ప్రాంతాల్లో మెసెంజర్‌లో వీడియో కాలింగ్ గత ఏడాది కన్నా రెట్టింపయిందని ఫేస్‌బుక్ తెలిపింది. ప్రత్యర్థి యాప్ ‘జూమ్‌’ వినియోగదారులు ఏప్రిల్‌ నెలలోనే 30 కోట్ల మంది పెరిగారు. అమెరికాలో మార్చి ప్రారంభంలో మొదటిసారిగా ప్రధాన నగరాల్లో జనం ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చినపుడు హౌస్‌పార్టీ యాప్‌ను 20 లక్షలకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి కొన్ని యాప్‌లు.. ఈ మహమ్మారి సమయంలో ప్రీమియం ఫీచర్లను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించాయి. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఒక బ్లాగ్ పోస్టు ద్వారా ఫేస్‌బుక్ కొత్త మెసెంజర్ రూమ్స్‌ను పరిచయం చేశారు. మెసెంజర్ రూమ్స్ కొత్త ఫీచర్లు... హౌస్‌పార్టీ తరహాలో మెసెంజర్ రూమ్స్ కూడా జనం విడివిడిగా రూమ్ వీడియో కాల్‌లోకి వచ్చి, వెళ్లటానికి వీలుంటుంది. ‘‘భౌతిక ప్రపంచంలో అలా వెళుతూ జనంతో కలవటానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం మెసెంజర్ రూమ్స్‌లో ఉంచాం. ఇటువంటి ఫీచర్ మరే యాప్‌లో లేదు’’ అని ఫేస్‌బుక్ న్యూస్‌ఫీడ్ వైస్‌ ప్రెసిడెంట్ జాన్ హెజిమాన్ పేర్కొన్నారు. ఈ రూమ్‌లను ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకు కూడా త్వరలో జోడించాలన్నది ప్రణాళికగా ఆ సంస్థ చెప్పింది. మెసెంజర్ రూమ్‌లను క్రియేట్ చేసే వారు ఆ రూమ్‌లను ప్రైవేటుగా ఉంచుకోవచ్చు. అవాంఛిత పార్టిసిపెంట్లను బ్లాక్ చేయవచ్చు. ఫేస్‌బుక్‌లో లేని వారికి ఇన్విటేషన్లు పంపించవచ్చు. పార్టిసిపెంట్లు ఆగ్‌మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్లను ఉపయోగించి, తమ బ్యాక్‌గ్రౌండ్లను అప్పటికప్పుడు మార్చేసుకోవచ్చు. ఇక అందరికీ కనిపించే రూమ్‌ల జాబితా ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్ అగ్రభాగంలో కనిపిస్తుంది. ఈ సర్వీసును ఫేస్‌బుక్...
మెసెంజర్ రూమ్స్: ఫేస్‌బుక్ కొత్త వీడియో కాల్‌లో ఒకేసారి 50 మంది మాట్లాడుకోవచ్చు
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,377
ఏకస్వామ్యం గురించి సంక్లిప్తంగా వివరించండి
అసంపూర్ణ పోటీలో ఏకస్వామ్యం ఒకటి. దీనినే గుత్తాధిపత్యం అంటారు. మార్కెట్లో ఒకే ఒక అమ్మకందారుడుండి, సమీప ప్రత్యామ్నాయ వస్తువులు లభ్యంకాని మార్కెట్ని ఏకస్వామ్యం అంటారు. ఈ మార్కెట్లో ధర విచక్షణకు అవకాశం ఉంటుంది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,378
కింద ఇచ్చిన భావం వచ్చేలాగా పద్యం రాయండి: “ఆహా !. యాదవవంశ శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడు తన సతీమణియగు సాక్షాత్తు లక్ష్మీదేవియైన రుక్మిణి ఏమనుకుంటుందో అని కూడ భావింపక, తాను ఎదురుగా వెళ్ళి సంతోషముతో మిత్రుడైన కుచేలుని కౌటిలించుకున్నాడు. సముచితమైన సేవలతో ఆయనను సంతృప్తిని కావించాడు. ఈ బ్రాహ్మణుడెంతగి అదృష్టవంతుడో కదా !” అని అంతఃపుర కాంతలు ఆశ్చర్యముతో భావించిరి.
చ. తన మృదుతల్పమందు పనితామణి యైన రమాలలాను సాం దును నెదఁగాఁ దలంపక యడుప్రవరుం డెదురేఁగి మోచముం దనుకంగఁ గౌఁగిలించి యుచితక్రియలం బరితుష్టుఁ జేయుచున వినయమునన్ భజించె; ధరణీసురుఁ దెంతటి భాగ్యవంతుదో ?
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,379
క్రింద ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధం మరియు తాత్పర్యం ఇవ్వండి: క || భూతేశు ప్రతిజ్ఞకు సం జాతాతి క్రోధ యగుచు స్వర్గంగ నిజ స్రోతోవేగంబున హరుఁ, బాతాళం బంటంద్రొక్కు భావం బిడియెన్.
ప్రతిపదార్థం : భూతేశు = శివుని ప్రతిజ్ఞకు = మాటకు సంజాతాతి = పుట్టిన పెద్ద క్రోధ యగుచు = కోపంతో స్వర్గంగ = స్వర్గంలోని గంగ నిజస్రోతో = తన ప్రవాహ వేగంబున = వేగంతో హరుఁ న్ = శివున్ని పాతాళంబు + అంటన్ = పాతాళం చేరే విధంగా త్రొక్కు = తొక్కేస్తాను భావంబు + ఇడియెన్ = భావించింది తాత్పర్యం : శివుడు ఇచ్చిన మాటకు పెద్దగా కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివుణ్ణి పాతాళానికి తొక్కి వేస్తాను అని భావించింది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,380
సహకార సంఘాల ప్రయోజనాలను, లోపాలను వివరించండి.
సహకార సంఘాల వలన ప్రయోజనాలు: 1. స్థాపనా సౌలభ్యము: సహకార సంస్థలను స్థాపించుట సులభము. పదిమంది కలసి తమ ఆర్థిక ప్రయోజనాల కోసము ఒక సంస్థగా ఏర్పడవచ్చు. నమోదుచేయుటకు అవలంబించవలసిన చట్టబద్ధమైన లాంఛనాలు చాలా తక్కువ. 2. ప్రజాస్వామ్య పరిపాలన: సంస్థల నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. వ్యాపార నిర్వహణలో పాల్గొనే హక్కు ప్రతి సభ్యునకు ఉంటుంది. ఒక మనిషికి ఒకే ఓటు. అతనికి ఎన్ని వాటాలు అయినా ఉండవచ్చు. 3. నిర్వహణ ఖర్చులు తక్కువ: సహకార సంస్థలలో పరిపాలన ఖర్చులు తక్కువ. పాలక మండలి సభ్యులు వేతనము తీసుకోకుండా నిర్వహణ పనులు చేపడతారు. 4. సేవాశయము: సహకార సంస్థల ముఖ్య ఉద్దేశము సేవలను అందించుట. సభ్యులకు చౌక ధరలకు వస్తువులను అందజేస్తుంది. తక్కువ వడ్డీలకు ఋణాలను అందిస్తుంది. సభ్యుల మధ్య సహకార భావనను కలుగజేస్తుంది. 5. పరిమిత ఋణబాధ్యత: సభ్యుల ఋణబాధ్యత వారు చెల్లించిన వాటా మూలధనానికే పరిమితమై ఉంటుంది. 6. స్థిరత్వము: సభ్యుల మరణము, విరమణ లేదా దివాలా తీయడంవలన సంస్థ మనుగడకు భంగముకలగదు. 7. పన్ను రాయితీలు: సహకార సంఘాల ఆదాయముపై కొంత పరిమితి మేరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అంతేగాక నమోదు రుసుములోను, స్టాంపు డ్యూటీలోను మినహాయింపు ఉంటుంది. 8. ప్రభుత్వ ఆదరణ: ప్రభుత్వము సహకార సంఘాలకు అప్పులు, గ్రాంట్ల రూపములో ఆర్థిక సహాయం అందిస్తుంది. సమాజములో ఆర్థికముగా, సాంఘికముగా వెనుకబడిన వర్గాలకు సహాయపడే ధ్యేయముతో ఈ సంఘాలకు ఉదారముగా ధన సహాయం అందిస్తుంది. 9. వాటాలలో స్పెక్యులేషన్ ఉండదు: ఈ సంఘాలలో సభ్యుడు ఎప్పుడైనా వాటాలను కొనవచ్చు కాబట్టి వాటాలలో స్పెక్యులేషన్ ఉండదు. 10. సాంఘిక ప్రయోజనాలు: ఈ సంస్థలు ప్రజాస్వామ్యములో విద్య, శిక్షణ, స్వయం పరిపాలన, స్వయం సహాయం, పరస్పర సహాయము మొదలైన సూత్రాలను ప్రతిపాదిస్తుంది. 11. వ్యాపారాలపై నియంత్రణ: ఇతర వ్యాపారసంస్థలు అధిక ధరలతో వినియోగదారులను దోచుకుంటున్నప్పుడు, ఇవి తక్కువ ధరలకు వస్తువులను అందజేస్తుంది. 12. మధ్యవర్తులు ఉండరు: సహకార సంస్థలు వస్తువులను నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలుచేసి వాటిని వినియోగదారులకు అందజేస్తాయి. మధ్యవర్తుల బెడద ఉండదు. 13. సభ్యుల మధ్య సుహృద్భావము: ఒకరి కోసము అందరూ, అందరికోసం ఒకరు అనే సూత్రముపై సహకార సంఘాలు పని చేస్తాయి. కాబట్టి సభ్యుల మధ్య సోదరభావం, సంఘీభావము పెంపొందిస్తాయి.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,381
కింద ఇచ్చిన పద్యానికి భావం రాయండి: సమశీలశ్రుతయుతులకు సమధనవంతులకు సమసుచారిత్రులకుం దమలో సఖ్యమును వివా హము నగుఁ గా, కగునె రెండు నసమానులకున్?
సమానమైన స్వభావం, విద్య కలవాళ్ళకు, సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచి నడవికలవాళ్ళకు స్నేహం, వివాహం ఏర్పడతాయి. కాని సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? (ఏర్పడవని భావం)
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,382
“భరత ఖండం” భాగ్యసీమ అనటానికి గల కారణాలు తెలపండి.
మన భరత ఖండం, శ్రీలు పొంగిన జీవగడ్డ. పాలు పారిన భాగ్యసీమ. మనదేశంలో విశాలమైన పంటభూములు, గంగా గోదావరీ వంటి జీవనదులు ఉన్నాయి. పంటలను పండించడానికి కావలసిన మానవ వనరులు ఉన్నాయి. మనదేశంలో పరిశ్రమలు స్థాపించడానికి కావలసిన లోహాలు, అరణ్యాలు ఉన్నాయి. ఇక్కడ ముడిసరుకు, . కూలీలు దొరుకుతారు. బుద్ధిమంతులైన యువకులు ఉన్నారు. కాబట్టి మన భరతఖండాన్ని భాగ్యసీమ అని చెప్పవచ్చు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,383
p(t) = t^3 – 1 అయిన p(1), p(- 1), p(0), p(2) మరియు p(- 2) విలువలు కనుగొనండి.
వివరణ: p(t) = t^3 – 1 p(1) = (1)^3 – 1 = 0 p(- 1) = (- 1)^3 – 1 = – 1 – 1 = – 2 p(0) = (0)^3 – 1 = – 1 p(2) = (2)^3 – 1 = 8 – 1 = 7 p(- 2) = (- 2)^3 – 1 = – 8 – 1 = – 9.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,384
‘అడిగెదనని కడువడి జను, నడిగినఁదను మగుడ నుడుగడని నడయుడుగున్’, ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
అలంకారము : వృత్త్యనుప్రాసాలంకారం. లక్షణం : ఒకే అక్షరం, పలుమార్లు ఆవృత్తి అవడం.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,385
తక్కువ ఆదాయం వచ్చేవారి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు స్థూల జాతీయోత్పత్తి పెరుగుతూ ఉండడం అంటే పెరుగుతున్న వస్తువులు, సేవలవల్ల కొద్దిమంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని అర్థం. దీనిని చదివి, వ్యాఖ్యానించండి.
ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు, సేవల విలువను GDP సూచిస్తుంది. అయితే అభివృద్ధిని కేవలం వస్తువులు, సేవల ఉత్పత్తికే పరిమితం చెయ్యలేం. ఉత్పత్తి, ఆదాయాలు పెరిగినపుడు కూడా తక్కువ ఆదాయం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే దానివల్ల వారు ప్రయోజనం పొందలేదని అర్థం. అయితే పెరిగిన స్థూల జాతీయోత్పత్తి వల్ల కొద్దిమందే ప్రయోజనం పొందితే అది హర్షణీయం కాదు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,386
కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రతిఘటనలు అతిక్రమించగలిగితేనే జీవితానికి విజయం చేకూరుతుంది. కాని, ఒక్కొక్క జీవితానికి హృదయం పునాది అయితే, మరొక్క జీవితానికి మేధస్సు ప్రధానం అయి ఉంటుంది. ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువయిపోతుంది. అక్కడ సానుభూతి కూడా ఉండదు. ఏ జీవితానికి పునాది హృదయమో అది కళాబంధురం అవుతుంది. అక్కడే కళలకు పరిణతి ఉంటుంది. అక్కడే కళలకు వినియోగం కూడా అక్కడే తన్మూలంగా కలిగే ఆనందానుభవమూ ఉంటుంది. అలాంటి ఆనందం తాననుభవించాలన్నా, ఇతర్లకు కలిగించాలన్నా ఆ కళాశీలి, తప్పనిసరిగా మహామేధావి అయివుండాలి. కళావేత్తలోనే – కళాసాధనలోనే తన జీవితం పరిపక్వం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే? ఎవరి సంకల్పం విశుద్ధమో, ఎవరి హృదయం కళామయమో, ఎవరి దీక్ష అనన్య సామాన్యమో, ఎవరి ప్రాప్యం లోక కళ్యాణమో ఆ కళాశీలుల నిర్మాణాలే ద్వంద్వ భూయిష్టమైన భౌతికజగత్తులో ధ్రువతారలయి మెరుస్తూ ఉంటాయి. నిజంగా షుకురల్లీ ఖాను అలాంటి కళాశీలి. అతని అత్తరు అలాంటి ధ్రువతార. ప్రశ్నలు : 1. ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ ఏది తక్కువౌతుంది? 2. వేటిలోనే ఒక జీవితాన్ని పరిపక్వం చేసుకుంటూ ఉండాలి? 3. నిజమైన కళాశీలి ఎవరు? 4. కళాశీలి తప్పనిసరిగా ఏమై ఉండాలి
1. ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ ఏది తక్కువౌతుంది? జవాబు: ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువయిపోతుంది. 2. వేటిలోనే ఒక జీవితాన్ని పరిపక్వం చేసుకుంటూ ఉండాలి? జవాబు: కళావేత్తలోనే, కళారాధనలోనే తన జీవితం పరిపక్వం చేసుకుంటూ ఉండాలి. 3. నిజమైన కళాశీలి ఎవరు? జవాబు: నిజమైన కళాశీలి షుకురలీఖాన్. 4. కళాశీలి తప్పనిసరిగా ఏమై ఉండాలి? జవాబు: కళాశీలి తప్పనిసరిగా మహామేధావి అయి ఉండాలి.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,387
ఇచ్చిన గద్యానికి కొనసాగింపు రాయండి: హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆనకట్ట దగ్గర కొంత ఆగుతుంది. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహిస్తుంది. పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామికి పూజలు చేస్తుంది. అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపుతుంది.
ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపుతుంది. శాశ్వతంగా తెలుగు బిడ్డలకు ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి తల్లిగా, పాలవెల్లిగా, పాల ఏరుగా ప్రవహిస్తుంది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,388
క్రింద ఇచ్చిన గద్యానికి కొనసాగింపు రాయండి: శివుని జడలనుండి గంగానది ఏడు పాయలుగా ప్రవహించింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లు గల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి. సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం భగీరథుని వద్దకు బయలుదేరింది. అలా గంగానది తనవెంట రావడం గమనించిన భగీరథుడు గొప్ప రథం ఎక్కి కదిలాడు. అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందంగా దేవనదీ జలాలలో స్నానాలు చేశారు. వారంతా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు. శివుని శరీరాన్ని తాకి మరింత పవిత్రంగా మారిన దేవనదీ జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు అనేకసార్లు ఆనదిలో స్నానం చేశారు.
జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆనదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్య చకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఇలా అన్నారు. ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి గర్వం అణిగింది. ఇకపై ఈ భూమిపై గంగ నీకూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను. అనగానే జహ్ను మహర్షి తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. ఆ రోజునుండి జహ్ను మహర్షి కూతురు కావున జాహ్నవి అనే పేరుతో గంగానది భూమిపై ప్రవహించింది. భగీరథుని రథం వెంబడి సముద్రానికి వెళ్ళింది. ఎండిపోయిన సముద్రంలో, సాగరులు తవ్విన రంధ్రం ద్వారా, గంగ తనవెంట రాగ, భగీరథుడు పాతాళానికి వెళ్లి, సగరపుత్రుల బూడిద కుప్పలను దీనంగా చూశాడు. ఆ బూడిదకుప్పలు తడిసే విధంగా గంగ ప్రవహించింది. కావున వారు పాపములు పోయినవారై, పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గానికి చేరుకున్నారు. బ్రహ్మ దేవతలందరితో కలిసి వెళ్ళి భగీరథునితో “భూమిపై ఎప్పటివరకు ఈ సముద్రం ఉంటుందో, అస్నటి వరకు సగర పుత్రులు స్వర్గంలో నివసిస్తారు. నీవు కూడా అదేవిధంగా ఆగొప్ప లోకంలో ఉంటావు. గంగానది ఈ భూమిపై జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని, నీ కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ప్రవహిస్తుందని అన్నాడు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,389
ఇచ్చిన సమాచారం బట్టి సమాధానం చెప్పండి: నేను సిరా వ్యవస్థకు సమాంతరంగా ఏర్పడిన రవాణా వ్యవస్థను. టాన్సిల్స్, అడినాయిడ్స్, ప్లీహం, థైమస్ అనేవి ఆ వ్యవస్థలో భాగాలు.
శోషరస వ్యవస్థ
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,390
నార్ల వేంకటేశ్వరరావు గురించి రాయండి.
నార్ల వేంకటేశ్వరరావు 1908 డిసెంబర్ 1వ తేదీన కృష్ణా జిల్లాలోని ‘కవుతరం’ అనే గ్రామంలో జన్మించారు. ఈయన రష్యన్ కథలు (అనువాద రచన), నరకంలో హరిశ్చంద్రుడు (నాటకం), నార్లవారి మాట (పద్య కావ్యం) మొదలైన గ్రంథాలను రచించారు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం కృషిచేసిన మేధావి. ఈయన రచన సరళంగా సొగసైన భావాలతో సుందర శైలిలో నడుస్తుంది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,391
పాలికీట్లు ప్రదర్శించే ముఖ్య లక్షణాలు ఏమిటి?
పాలికీటా : పాలికీటా జీవులు సముద్రపు నీటిలో నివసిస్తాయి. వీటిని సాధారణంగా బ్రిసిల్ పురుగులు అంటారు. వీటిలో కొన్ని స్వేచ్ఛగా కదులుతాయి. మిగతావి బొరియలలో లేదా నాళాలలో జీవిస్తాయి. తల నిర్దిష్టంగా ఉంటుంది. దానిపై నేత్రాలు, స్పర్శకాలు, స్పర్శాంగాల లాంటి జ్ఞానావయవాలు ఉంటాయి. పార్శ్వ పాదాలు అనేక శూకాలను కలిగి (కాబట్టి పాలికీటా) గమనం, శ్వాసక్రియలో సహాయపడతాయి. క్లైటెల్లం ఉండదు. ఈ జీవులు ఏకలైంగికాలు, బీజవాహికలుండవు. సంయోగబీజాలు శరీరకుహరంలోకి విడుదల చేయబడి వృక్క రంధ్రాల ద్వారా వెలుపలికి విడుదలవుతాయి. బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. అభివృద్ధిలో ట్రోకోఫోర్ డింభకం ఉంటుంది. ఉదా : నీరిస్ (ఇసుకపురుగు లేదా రాగ్వర్మ్ లేదా క్లాప్వార్మ్), ఎఫ్రోడైట్ (సముద్ర చుంచెలుక), ఆరెనికోలా (లగ్ వర్క్).
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,392
Given the below title and summary of an article, generate a short article or the beginning of a long article to go along with them. Title: పేదరిక నిర్మూలన: 800 మీటర్ల ఎత్తున్న శిఖరాల మీద నివసించే ప్రజలను పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్న చైనా\nSummary: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో నివసించే కొందరు జనం 800 మీటర్ల ఎత్తున్న పర్వత శిఖరాలను తమ ఇళ్లుగా చెప్పుకునేవాళ్లు. కానీ వారిని ప్రభుత్వం ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో నివాస సముదాయాలకు తరలిస్తోంది.\nArticle (Max 500 characters):
పిల్లలు, పెద్దలు శిథిలమైన నిచ్చెనల మీదుగా శిఖరాలు ఎక్కుతున్న ఫొటోలు బయటకు రావటంతో అటులెర్‌ గ్రామం పేరు మార్మోగిపోయింది. అక్కడ నివసించే దాదాపు 84 కుటుంబాలను స్థానికంగా పేదరిక నిర్మూలన కార్యక్రమం కింద ఇప్పుడు కొత్తగా నిర్మించిన ఫ్లాట్లలోకి తరలించారు. 2020 చివరి నాటికి దేశంలో పేదరికాన్ని నిర్మూలించే జాతీయ కార్యక్రమంలో భాగంగా ఈ పని చేపట్టారు. ‘నాకంటూ ఓ ఇల్లు దక్కటం సంతోషంగా ఉంది’ అటులెర్‌ గ్రామస్తులు తమ ఇళ్లకు వెళ్లాలంటే చంటి పిల్లలను ఎత్తుకుని పాడైపోయిన నిచ్చెనలు ఎక్కుతూ శిఖరాల మీదకు చేరుకోవాలి.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,393
అన్నప్రాసన నాడు జరిగిన సంఘటన గురించి రాయండి.
అన్నప్రాసన నాడు పెన్ను, పుస్తకాలు, దేవుడి బొమ్మ, బొమ్మ కత్తి, బొమ్మలు మొదలైనవన్నీ కవిగారి చిన్నతనంలో చుట్టూ వేశారు. వాటిలో ఏదో ఒకటి తీయమన్నారు. సహజంగానే ఎర్రగా ఉన్న పెన్ను కవిని ఆకర్షించింది. దానినే తీశాడు. కలం పట్టుకొన్నందుకు వాళ్లమ్మ చాలా ఆనందించింది. బిడ్డను అక్కున చేర్చుకొంది. ఒళ్లంతా ముద్దులు పెట్టుకొంది. తన బిడ్డ కలం చేతబట్టి గొప్ప వాడవుతాడని మురిసిపోయింది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,394
ప్రశ్న: గ్రామ పంచాయితీ, గ్రామ సభల మధ్య పోలికలను రాయండి.
గ్రామ పంచాయితీ, గ్రామ సభల మధ్య పోలికలు : 1. రెండూ కూడాను గ్రామ సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకోవటంలో పాల్గొంటాయి. 2. రెండింటికి ‘సర్పంచ్’ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. 3. అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఉంటుంది. 4. రెండూ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటాయి. (మెజారిటీ సభ్యుల అభిప్రాయం).
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,395
ఇచ్చిన గేయానికి ప్రతిపదార్ధాలు మరియు భావం రాయండి: “యింటి దైవం వీరభద్రుడి దేవళానికి పోయి యిప్పుడే పల్లెరం సాగించి వత్తును, పైని తమ చిత్తం !”
ప్రతిపదార్థం : ఇంటిదైవం = కులదైవం అయిన వీరభద్రుడి = వీరభద్రుని దేవళానికి = ఆలయానికి పోయి = వెళ్ళి ఇప్పుడే = ఇప్పుడే పెళ్ళెరం = పూజాద్రవ్యాలు ఉన్న పళ్ళెం సాగించి వత్తును = సమర్పించి వస్తాను పైని = తరువాత తమ చిత్తం = మీ ఇష్టం ! భావం : రాజా ! మా కులదైవమైన వీరభద్రుని గుడికి వెళ్ళి పూజాద్రవ్యాలు ఇచ్చి వస్తాను. తరువాత మీ ఇష్టం.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,396
అంకణా ద్వారా వెల్లడి అయ్యే వెల్లడి కాని తప్పులను వివరించండి.
తప్పులను రెండు రకాలుగా విభజించవచ్చును. అంకణా ద్వారా వెల్లడికాని తప్పులు. అంకణా ద్వారా వెల్లడి అయ్యే తప్పులు 1. అంకణా ద్వారా వెల్లడి కాని తప్పులు: అంకణాను తయారుచేయుట ద్వారా ఈ దోషాలను కనిపెట్టలేము. కారణం ఈ తప్పులు అంకణా సమానతకు భంగము కలిగించవు. సిద్ధాంతపు దోషాలు. ఉదా : యంత్రము మరమ్మత్తులు యంత్రాల ఖాతాకు డెబిట్ చేయడము. ఆకృత దోషాలు : అమ్మకాలను అమ్మకాల పుస్తకములో వ్రాయకుండా వదిలివేయడము. అకార్యాకరణ దోషాలు : కొనుగోలు పుస్తకము ₹ 1000 ఎక్కువగా కూడటము. సరిపెట్టే దోషాలు : రామ్కు చెల్లించిన ₹ 5,500, ₹ 5,000గా నమోదుచేసి, శ్యామ్ నుంచి వచ్చిన మొత్తము ₹ 10,000, కె 9,500గా నమోదు చేయడం. సహాయక పుస్తకాలలో తప్పు పద్దును నమోదు చేయడం. తప్పు ఖాతాలో సరైన వరుసలో నమోదు. ఒక వ్యవహారమును పుస్తకాలలో రెండుసార్లు నమోదు చేయడం. 2. అంకణా ద్వారా వెల్లడి అయ్యే తప్పులు : ఈ తప్పుల వలన అంకణా సమానతకు భంగము కలుగుతుంది. ఒక వ్యవహారమును ఖాతాలో తప్పు వైపు నమోదు చేయడం. ఉదా : ఇచ్చిన డిస్కౌంట్, డిస్కౌంట్ ఖాతాకు క్రెడిట్ చేయడము. ఖాతాలో తప్పు మొత్తాన్ని నమోదు చేయడము. ఉదా : అమ్మకాలు ₹ 25,000 అమ్మకాల ఖాతాలో ₹ 2,500గా నమోదు చేయడం. ఖాతాలను కూడేటప్పుడు తప్పులు. ఉదా : అమ్మకాల వాపసుల పుస్తకము ₹ 100 ఎక్కువగా కూడటము. ఖాతాలను ముందుకు తీసుకొని వెళ్ళడంలో తప్పులు. ఉదా : కొనుగోలు పుస్తకము పేజీలో మొత్తము ₹ 1,500, మరొక పేజీకి ₹ 150 గా తీసుకొని వెళ్ళడము. సహాయక చిట్టాల నుంచి ఖాతాకు నమోదు చేయకపోవడం. ఉదా : హరికి అమ్మిన సరుకు ₹ 1,000 హరి ఖాతాలో నమోదు చేయలేదు. ఖాతాలలో మొత్తాలను రెండుసార్లుగా నమోదు చేయడము. ఉదా : జీతాలు ₹ 1,000 చెల్లించి, జీతాల ఖాతాకు రెండుసార్లు. నమోదు చేయడము. ఖాతా మొత్తాన్ని అంకణాలో నమోదు చేయడం మరిచినపుడు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,397
కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మొక్కలు చైతన్యవంతంగా ఉన్నప్పుడే పోషకాలు అందించడం ద్వారా వృధావ్యయాన్ని తగ్గించి, అధిక దిగుబడి సాధించవచ్చు. చేపలు, రొయ్యలు ఎప్పుడు ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటాయో, తెలియడం వలన చేపల చెరువు శుభ్రంగా ఉండటమే కాక వృధా వ్యయం తగ్గుతుంది. కోళ్ల ఫారంలో ఎక్కువ సమయం వెలుగు ఉంచడం వలన గ్రుడ్లు ఉత్పత్తి పెరగడం రైతులందరికీ తెలిసిందే. పగలు తక్కువ ఉన్న కాలంలో గొర్రెలలో ఉన్ని ఎక్కువవుతుంది. కాబట్టి ఎండాకాలం చీకటిలో ఉంచడం వలన ఉన్ని ఉత్పత్తి ఎక్కువ చేయవచ్చు. ఇక మన సంగతి, రక్తంలో కొలెస్టరాల్, గ్లూకోజ్ శాతం లయబద్ధంగా మారుతుంటుంది. కాబట్టి ఏ సమయంలో మనం మందులు వాడితే పూర్తి స్థాయిలో ఫలితం ఉంటుందో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఆస్తమా రోగులలో రాత్రిళ్లు శ్వాస సమస్యలు అధికమౌతాయి. అందుచేత ఎడ్రినలిన్ అనే ఇంజక్షన్ రాత్రిళ్ళు ఇస్తారు. అలాగే ఇన్సులిన్ ఇంజక్షన్ రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగినపుడే ఇవ్వాలి. ప్రశ్నలు: 1. ఏ రకంగా మొక్కల నుండి అధిక దిగుబడిని సాధించవచ్చు? 2. గొర్రెలలో ఎప్పుడు ఉన్ని ఎక్కువగా ఉంటుంది? 3. ఆస్తమా రోగుల్లో రాత్రిళ్ళు ఏ సమస్యలు అధికం అవుతాయి? 4. ఇన్సులిన్ ఇంజక్షన్ ఎప్పుడు ఇవ్వాలి?
1. ఏ రకంగా మొక్కల నుండి అధిక దిగుబడిని సాధించవచ్చు? జవాబు: మొక్కలు చైతన్యవంతంగా ఉన్నప్పుడే పోషకాలు అందించడం ద్వారా వృధా వ్యయాన్ని తగ్గించి అధిక దిగుబడిని సాధింపవచ్చు. 2. గొర్రెలలో ఎప్పుడు ఉన్ని ఎక్కువగా ఉంటుంది? జవాబు: గొర్రెలలో పగలు తక్కువ ఉన్న కాలంలో ఉన్ని ఎక్కువగా ఉంటుంది. 3. ఆస్తమా రోగుల్లో రాత్రిళ్ళు ఏ సమస్యలు అధికం అవుతాయి? జవాబు: ఆస్తమా ఉన్న రోగుల్లో రాత్రిళ్ళు శ్వాససంబంధమైన సమస్యలు అధికమౌతాయి. 4. ఇన్సులిన్ ఇంజక్షన్ ఎప్పుడు ఇవ్వాలి? జవాబు: ఇన్సులిన్ ఇంజక్షన్ రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగినప్పుడే ఇవ్వాలి.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,398
I wonder వారన్ హేస్టింగ్సు విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ? Can you get me some context to answer this (in the same language as my question)?
వారన్ హేస్టింగ్సు జీవిత కాలం 1732-1818. కార్యకాలం 1750-1785. క్రీ.శ 1599 లో స్థాపించినప్పటినుండి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అనువ్యాపార సంస్ధకి పది-పదిహేను సంవత్సరముల కొకమారు ఇంగ్లండులోని బ్రిటిష్ ప్రభుత్వము సన్నదులు (పట్టా) ద్వారా ( ఉదాహరణకు 1661,1676,1686 చేసిన సన్నదులు.1686 లో శాసన నిర్మాణాధికారము ఇచ్చారు,1767 లో అమలుచేసిన కంపెనీ పట్టా చట్టం) ఇత్యాతులు వ్యాపారనిర్వాహణ నిమిత్తం అన్న ఆర్భాటంతో అనేక పరిపాలనాధికారములను క్రమేణా కలిగించారు. ఇవన్నీ బ్రిటిష్ రాజ్యతంత్రములోభాగములే. 1773 లో ఇంకా అధిక మోతాదులో అధికారమిస్తూ రెగ్యులేటింగ్ చట్టం అని అమలుచేశారు. ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టము యొక్కఉద్దెశ్యము భారతదేశమును ఇంగ్లండు రాణీగారి పేర పరిపాలించే బ్రిటిష్ పార్లమెంటు పరిపాలనా పరిధిలోకి తీసుకుచ్చి బ్రిటిష్ వలసరాజ్య స్థాపనబలపరచటమే. ఆ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీకి కలకత్తాలో గవర్నర్ జనరల్ పదవి కలుగచేసి (చూడు బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్ ) బ్రిటన్ దేశ రాజ్యప్రతినిధినిగా నియమించటం జరిగింది. పరిపాలనా సంఘ (గవర్నింగ్ కౌన్సిల్ ) సభ్యత్వం నలుగురినే చేశారు. ఆ చట్టప్రకారం బీహారు ఒరిస్సా రాష్టములు గూడా గవర్నర్ జనరల్ పరిపాలనాధికారంలోకి వచ్చినవి. అంతే కాక మద్రాసు, బొంబాయి రాష్ట్ర గవర్నర్లులుపై తనిఖీకి అధికారము, రాజ్యపాలిత ఇతర అధికారములు ఇవ్వబడ్డాయి. కలకత్తాలో సుప్రీంకోర్టు నియమించబడింది. ఆ చట్టముక్రింద అప్పటిలోకలకత్తాలో గవర్నరు గానున్న వారన్ హేస్టింగ్సు (WARREN HASTINGS) మొట్టమొదటి గవర్నర్ జనరల్ పదవిలో 1773 నుండి 1785 దాకా బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెని వారిద్వారా బ్రిటిష్ వలసరాజ్యమును పరిపాలించాడు.[2] వ్యక్తిగతముఖ్యాంశాలు వారన్ హేస్టింగ్సు వ్యక్తిగతంగా దురదృష్టవంతుడనే చెప్పాలి. 1732 డిసెంబరు 6 తేదీన ఇంగ్లండులోని చర్చిల్ (CHURCHILL) దగ్గర గ్రామంలో ఒక బీదకుటుంబమున జన్మించి చిన్ననాటనే తల్లిని కొల్పోయాడు. తండ్రి, పినాస్టన్ హేస్టింగ్సు (PYNASTON HASTINGS) కూడా దూరమైపోవటం వల్ల కొంతకాలం ధర్మసంస్థల, అనాథ పాఠశాలలో చదివి, తరువాత బంధువుల పర్యవేక్షణలో పెరిగి లండన్ నగరములోనున్నప్రముఖమైన (WESTMINSTER) పాఠశాలలో విద్యార్థి గాచదువుతూ చదువు పూర్తికాకముందే కుటుంబ ఆర్థిక కారణములవల్ల 17 వ ఏటనే 1750లో బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ వంగరాష్ట్ర ముఖ్య కేంద్రమైన కలకత్తాలో గుమాస్తాగా (writer) ప్రవేశించాడు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,399
మానవ హక్కులు ఎన్ని రకాలు ? వాటిని తెలపండి.
మానవ హక్కులను స్థూలంగా రెండు రకములుగా వర్గీకరించవచ్చు. అవి 1) పౌర, రాజకీయ హక్కులు 2) సాంఘిక, ఆర్థిక సాంస్కృతిక హక్కులు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,400
ఇచ్చిన ప్రశ్నకు జవాబు ఇవ్వండి: వికృతమైన నంగల్ ఆనకట్ట ఏ నదిపై ఉంది?
సట్లెజ్ నది పై ఉంది
Aya-Dataset
-
-
0
tel
Telu
train