link
stringlengths 46
153
| text
stringlengths 1
18.7k
|
---|---|
https://www.tupaki.com//entertainment/article/dhanush-aishwarya-divorce/316512 | కోలీవుడ్ జంట ధనుష్-ఐశ్యర్య విడాకుల నిర్ణయం ఒక్కసారిగా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల ధాంతప్యజీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించడం అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి ఈ నిర్ణయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. విడాకులకు కారణం ఏమై ఉంటుందని సందేహాలు.. ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక కారణాలు తెరపైకి వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం సుచీలుక్స్ లో ధనుష్ హీరోయిన్లతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.దీంతో తొలిసారి ధనుష్-ఐశ్వర్య మద్య మనస్పర్ధలు తలెత్తినట్లు ప్రాచారం సాగింది. ఆ సమయంలో మనస్పర్ధలు తొలగించి ధనుష్ మామగారు..ఐశ్వర్య తండ్రి రజనీకాంత్ నచ్చజెప్పి ఒకటి చేసినట్లు అప్పట్లో తేలింది . అయితే మరోసారి అలాంటి కారణమే తాజాగా మళ్లీ వైరల్ అవుతోంది. ధనుష్ ఓ హీరోయిన్ తో చనువుగా ఉంటున్నాడని.. ఈ విషయం ఐశ్యర్యకు తెలిసి భరించలేక ఐశ్వర్య విడాకుల నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అలాగే రజనీకాంత్ హీరోగా ధనుష్ నిర్మించి `కాలా` సినిమా భారీ నష్టాలు తెచ్చింది. ఆ సమయంలో రజనీకాంత్..అల్లుణ్ణి ఆర్ధికంగా ఆదుకోలేదని.. అప్పటి నుంచి ధనుష్ కూడా అత్తగారి ఫ్యామిలీపై అసంతృప్తిగా ఉన్నట్లు మరో రీజన్ కూడా వినిపిస్తోంది.అలాగే ఐశ్యర్య- ధనుష్ ముందుకు ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తీసుకురాగా..అందుకు ధనుష్ ఒప్పుకోలేదని మనస్పర్ధలు తలెత్తినట్లు కోలీవుడ్ వర్గాల సమచారం. ఇలా మనస్పర్ధలు చినిగి చినిగి గాలివాన మారినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ నిర్ణయాలు మార్చుకోలేమని తెగేసి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. విడాకుల నిర్ణయానికి ముందు రజనకాంత్ ఇద్దరికి వేర్వేరుగా ఫోన్ చేసా మాట్లాడారుట. చివరిగా నిర్ణయం మాత్ర వాళ్లిద్దరికే వదిలేసినట్లు తెలుస్తోంది. అయితే వీటిలో కొన్ని కారణాలు ఎంత మాత్రం సహేతుకంగా లేవని తెలుస్తోంది. ధనుష్-ఐశ్యర్యల వివాహం 2004లో జరిగింది. |
https://www.tupaki.com//entertainment/article/kalyan-ram-budget-for-ntr-jai-lava-kusa-movie/155012 | తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తో జై లవ కుశ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇటు హీరోగా కంటిన్యూ అవుతూనే.. సినిమా నిర్మాణం కూడా చేయడం కళ్యాణ్ రామ్ కు అలవాటు. ప్రొడ్యూసర్ గా భారీ చిత్రాలనే నిర్మించే కళ్యాణ్ రామ్ కు.. నిర్మాతగా జై లవ కుశ అతి పెద్ద చిత్రం అనడంలో సందేహం లేదు.కానీ ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్.. రీసెంట్ గా రెండు ఎదురుదెబ్బలు తిన్నాడు. రవితేజ హీరోగా రూపొందిన కిక్2.. తనే హీరోగా నటించిన ఇజం చిత్రాలు.. దారుణంగా దెబ్బతిన్నాయి. భారీ నష్టాలను మిగిల్చాయి. ఈ రెండు సినిమాలతో.. దాదాపు 20 కోట్లకు పైగా నష్టాలు వాటిల్లినట్లు చెబుతారు ట్రేడ్ జనాలు. అయినా సరే.. ఇప్పుడు తమ్ముడు ఎన్టీఆర్ తో తీస్తున్న చిత్రానికి భారీ బడ్జెట్ నే కేటాయించాడని తెలుస్తోంది. జై లవ కుశకు 55 కోట్ల రూపాయల బడ్జెట్ గా అనుకుంటున్నారట. మూవీ పూర్తయ్యే నాటికి ఈ మొత్తం మరికొంత పెరిగే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు.దర్శకుడు బాబీ చెప్పిన స్క్రిప్ట్ విపరీతంగా నచ్చడం.. ఇతర క్యాస్టింగ్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉండడం.. ప్రాజెక్టుపై పూర్తి కాన్ఫిడెన్స్ ఉండడంతో.. కళ్యాణ్ రామ్ ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించాలనే టార్గెట్ ను కచ్చితంగా అందుకుంటానని నమ్మకంగా ఉన్నాడట కళ్యాణ్ రామ్ <|hyperlink|> /Tupakidotcom/ |
https://www.tupaki.com//entertainment/article/get-ready-for-chiranjeevi-sye-raa-movie-trailer/223832 | ఎట్టకేలకు ఈరోజు ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు 'సైరా' టీం. నిన్నటి వరకూ ఈరోజు ట్రైలర్ ఉంటుందా లేదా అనే మెగా ఫ్యాన్స్ కి అనుమానాలకి నిన్న సాయంత్రం టీం క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. కేవలం సోషల్ మీడియాలో ట్రైలర్ లాంచ్ కాకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసారు మేకర్స్. రెండు రాష్రాల్లో దాదాపు తొంబైకు పైగా థియేటర్స్ లో ట్రైలర్ ను ప్లే చేయబోతున్నారు. ఈ మేరకూ సాయత్రం ట్రైలర్ వేసే థియేటర్స్ ల లిస్టు కూడా వదిలారు. అంటే ఈ రోజు నుండి సైరా ప్రమోషన్స్ మొదలుపెట్టినట్టే.సాయంత్రం హైదరబాద్ ఐమ్యాక్స్ లో ఈ ట్రైలర్ ను ఓ ఈవెంట్ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్ కి దర్శకుడు సురేందర్ రెడ్డి అలాగే నిర్మాత రామ్ చరణ్ అటెండ్ అవుతున్నారు. ట్రైలర్ అనంతరం చరణ్, సురెందరే రెడ్డి మీడియాతో ముచ్చటించే అవకాశం ఉంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ కూడా చెప్చనున్నారని తెలుస్తుంది.ఇక ఇప్పటికే మెగా ఫ్యాన్స్ సైరా ట్రైలర్ డే అంటూ సోషల్ మీడియాలో హంగామా మొదలెట్టేసారు. ఇక సాయంత్రం థియేటర్స్ లో ఫ్యాన్స్ హంగామా ఎలా ఉండబోతుందో చూడాలి. ఇప్పటికే టీజర్ తో ఎట్రాక్ట్ చేసిన సైరా ఇక ట్రైలర్ తో ఏ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. సో నేటి నుండి సైరా ప్రమోషన్స్ తో మెగా స్టార్ మేనియా మొదలవుతున్దన్నమాట. |
https://www.tupaki.com//entertainment/article/kamal-confidence-a-different-level/332465 | విశ్వనటుడు కమల్ హాసన్ చాలా రోజుల తర్వాత మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సరైన విజయం సొంతం చేసుకున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది.ఇక ఈ సినిమా సాధించిన విజయంతో కమల్ హాసన్ అయితే ఫుల్ జోష్ లో ఉన్నాడు అని చెప్పాలి. ఇప్పటికే ఆనందంలో సినిమాకు పనిచేసిన వారికి ప్రత్యేకంగా ఖరీదైన కానుకలను కూడా అందజేశారు.దర్శకుడికి ఒక లగ్జరీ కారును హీరో సూర్య కోసం రోలెక్స్ వాచ్ ను బహుమతిగా ఇచ్చాడు. అలాగే సహాయక దర్శకులకి ఖరీదైన బైక్లను కూడా కానుకగా ఇచ్చాడు. అయితే ఈ సినిమా విజయంపై కమల్ హాసన్ అయితే ముందుగానే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.ముఖ్యంగా తెలుగులో అయినవి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకొని చాలా కాలం అయింది. విక్రమ్ సినిమా మాకు తెలుగులో కూడా మంచి స్పందన వస్తుందని ముందుగానే కమల్ హాసన్ చాలా నమ్మకంతో ఉన్నాడు. చాలా కాలంగా కమల్ హాసన్ కు తెలుగులో వరుసగా అపజయాలు వస్తుండడంతో మార్కెట్ కోల్పోవాల్సి వచ్చింది. అయితే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు కూడా కమల్ హాసన్ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు పెద్దగా పోటీ పడ లేదు. ఇక నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తెలుగులో ఈ సినిమాను విడుదల చేశాడు. అయితే కమల్ సినిమా విడుదలకు ముందే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారు అనే ధీమాగా చెప్పాడు.మంచి కంటెంట్ తెలుగువారి ముందుకు వస్తే ఎప్పుడు కూడా అపజయం రాలేదు అని.. ఒక విధంగా తమిళ ప్రేక్షకుల కంటే ముందుగా తెలుగు ప్రేక్షకులకు తనకు ఎక్కువ విజయాలు అందించారు అనే పాత రోజులను గుర్తు చేసుకున్నాడు. ఇక విక్రమ్ సినిమా కూడా అంతే విజయాన్ని అందుకుంటుందని కమల్ హాసన్ రిలీజ్ కు ముందు వివరణ ఇచ్చాడు. ఇక అనుకున్నట్లుగానే కమల్ హాసన్ చెప్పి మరి బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాడు. |
https://www.tupaki.com//entertainment/article/ntr-speech-at-telavarite-guruvaram-movie-pre-release-event/282443 | తెలుగు సినిమాకి మెలోడీలోని మాధుర్యాన్ని రుచి చూపించిన సంగీత దర్శకుడు కీరవాణి. ఆయన పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా తండ్రిబాటలో నడుస్తున్నాడు. ఇక చిన్నబ్బాయి శ్రీసింహా హీరోగా తన రెండవ సినిమాను పూర్తి చేశాడు. 'తెల్లవారితే గురువారం' టైటిల్ తో రూపొందిన ఈ సినిమా ద్వారా మణికాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడాడు. "సాధారణంగా నేను స్టేజ్ పై మాట్లాడటానికి ఇబ్బందిపడను. కానీ మొదటిసారిగా ఈ స్టేజ్ పై మాట్లాడటానికి టెన్షన్ పడుతున్నాను. వీళ్లేమో 'తెల్లవారితే గురువారం' అంటున్నారు. నాకేమో 'తెల్లవారితే ఆదివారం' అని ఈ ఫంక్షన్ గురించి టెన్షన్ పడుతూ వచ్చాను. నేను ఇంత టెన్షన్ పడటం ఇదే మొదటిసారి అనుకుంటున్నాను. రేప్పొద్దున నా పిల్లలు అభయ్ కానివ్వండి .. భార్గవ్ కానివ్వండి ఏదైనా సాధిస్తే ఒక తండ్రిగా ఆనందంతో నాకు ఎలా మాటలు రావో, అలాగే ఈ రోజున నా తమ్ముళ్లు కాలభైరవ - శ్రీసింహాను చూస్తే కూడా నాకు అలాగే అనిపిస్తోంది.ఈ రోజున కాలభైరవ - శ్రీసింహాను చూసి నేను ఎంత ఆనందపడుతున్నానో, ఏదో ఒక రోజున అభయ్ - భార్గవ్ ను చూసి ఇలాగే ఆనందపడతానేమో. నన్ను ఇక్కడ ముఖ్య అతిథి అని చాలామంది అన్నారు. 20 సంవత్సరాలుగా నాకు దేవుడు ఇచ్చిన శక్తి మీరైతే, దేవుడు ఇచ్చిన కుటుంబం కీరవాణి - జక్కన్న. నా కష్టసుఖాల్లో .. మంచిచెడులలో .. నేను తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ప్రత్యక్షంగానో .. పరోక్షంగానో వాళ్లు ఉన్నారు. అలాంటి కుటుంబంలో నేను ఒక సభ్యుడిని .. గెస్టును కాదు .. కాలేను కూడా. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి. శ్రీసింహా - కాలభైరవ మరో మెట్టు ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ ఇద్దరూ మా పిల్లలకు స్ఫూర్తిగా నిలవాలనీ, యువతకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు. |
https://www.tupaki.com//entertainment/kalkisecoundhighestgrosserinnorthamerics-1374284 | 2024లో ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా కల్కి 2898ఏడీ నిలిచింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 1000+ కోట్ల కలెక్షన్స్ ఇప్పటికే కల్కి క్రాస్ చేసింది. బాహుబలి 2 తర్వాత సౌత్ నుంచి వచ్చి అత్యధిక కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా కల్కి 2898ఏడీ నిలిచింది. డార్లింగ్ ప్రభాస్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే లాంటి స్టార్ యాక్టర్స్ కల్కి 2898ఏడీ మూవీ సక్సెస్ లో భాగం అయ్యారు.
ప్రతి ఒక్కరు వారి పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేసి నాగ్ అశ్విన్ చెప్పాలనుకున్న కథని బలంగా జనాల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడ్డారు. విజువల్ స్పెక్టక్యులస్ గా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ప్రేక్షకులకి అందించారు. అలాగే సరికొత్త ప్రపంచాన్ని కల్కి మూవీలో ఆవిష్కరించి అందరిని మెస్మరైజ్ చేశారు. ఈ కారణంగానే కల్కి సినిమాకి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే డీసెంట్ కలెక్షన్స్ తో కల్కి మూవీ థియేటర్స్ లో కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా నార్త్ అమెరికాలో నాన్ బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. బాహుబలి 2 నార్త్ లో 20+ మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. కల్కి 2898ఏడీ మూవీ నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 18+ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అందుకుందంట. పఠాన్, జవాన్ మూవీ రికార్డులని కూడా కల్కి చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో బ్రేక్ చేసిందని అర్ధమవుతోంది. నార్త్ అమెరికాలో కలెక్షన్స్ వైడ్ గా టాప్ 1, 2 చిత్రాలు రెండు కూడా డార్లింగ్ ప్రభాస్ వే కావడం విశేషం.
ఇదే జోరు కొనసాగితే వరల్డ్ వైడ్ గా జవాన్ మూవీ కలెక్షన్స్ ని కల్కి 2898ఏడీ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఏ భాషలలో ఇప్పుడు ఈ కల్కి తర్వాత రిలీజ్ అయిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేదు. దీంతో మూడు వారాలు అద్భుతమైన రన్ తో భారీ వసూళ్లని కల్కి చిత్రం సొంతం చేసుకుంది. అయితే జులై 19న తెలుగు, హిందీ భాషలలో కొన్ని ఇంటరెస్టింగ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి.
ఇవి కల్కి సినిమా కలెక్షన్స్ ని ఎంత వరకు హోల్డ్ చేయగలవు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కల్కి 1 సూపర్ సక్సెస్ కావడంతో ప్రేక్షకులు కల్కి 2 కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ కల్కి 2 స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారంట. అలాగే యాక్టర్స్ కాల్స్ షీట్స్ అన్ని సెట్ అయ్యాక షూటింగ్ కి వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ కారణంగా 2026లో సంక్రాంతికి రిలీజ్ అవ్వొచ్చనే టాక్ నడుస్తోంది. |
https://www.tupaki.com//entertainment/article/glimpses-of-valimai-movie/303904 | కోలీవుడ్ స్టార్ హీరో 'తలా' అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ''వలిమై''. హెచ్. వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ యువ హీరో కార్తికేయ గుమ్మకొండ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ - ఫస్ట్ సింగిల్ - కార్తికేయ లుక్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'వలిమై' ఫస్ట్ గ్లిమ్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.'వలిమై' గ్లిమ్స్ చూస్తుంటే ఇది బైక్ రేస్ నేపథ్యంలో తెరకెక్కే పవర్ ఫుల్ కాప్ డ్రామా అని తెలుస్తోంది. బైక్ రేసింగ్ మరియు పవర్ ఫుల్ డైలాగ్స్ - యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ గ్లిమ్స్ ని కట్ చేశారు. ఇందులో అజీత్ - కార్తికేయ లను బైక్ రేసర్లుగా చూపించారు. ఇద్దరి మధ్య వచ్చే డైలాగ్స్ అలరిస్తున్నాయి. 'అర్జున్.. నువ్వు నా ఈగోని హర్ట్ చేశావ్.. గేమ్ కోసం రెడీగా ఉండు' అని కార్తికేయ సీరియస్ గా అంటుండగా.. 'నేను ఎప్పుడో గేమ్ ని స్టార్ట్ చేశాను కిడ్' అని అజిత్ కూల్ గా సమాధానం ఇస్తున్నాడు. కార్తికేయ డిఫెరెంట్ మెకోవర్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.'వలిమై' చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ - విజువల్స్ హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయి. స్వతహాగా బైక్ రేసర్ అయిన అజిత్ కుమార్.. ఈ చిత్రంలో రిస్కీ ఛేజింగ్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ గ్లిమ్స్ కి సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ - నిరావ్ షా కెమెరా వర్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దిలీప్ సుబ్బరాయన్ ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ చేయగా.. విజయ్ వెలుకుట్టి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లిమ్స్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది.ఇందులో అజిత్ సరసన బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తోంది. బాణీ - సుమిత్ర - అచ్యుంత్ కుమార్ - యోగి బాబు - రాజ్ అయ్యప్ప - పుగజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'నెర్కొండ పార్వై' తర్వాత అజిత్ - వినోద్ - బోనీ కపూర్ కలయికలో వస్తున్న సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. |
https://www.tupaki.com//entertainment/ustaadmoviereview-1309573 | స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన యంగ్ హీరో శ్రీసింహ. యమదొంగ సినిమాలో చైల్డ్ యాక్టర్ గా కెరియర్ ప్రారంభించిన శ్రీసింహ మత్తు వదలరా మూవీతో హీరోగా టర్న్ తీసుకున్నాడు. మొదటి సినిమా ఓ డిఫరెంట్ ప్రయత్నంగా వచ్చి సక్సెస్ అయ్యింది. ఈ మూవీతో నటుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత హీరోగా నిలబడి ప్రయత్నం శ్రీ సింహా చేస్తూనే ఉన్నాడు.
అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. తెల్లవారితే గురువారం అనే లవ్ అండ్ కామెడీ డ్రామాతో హీరోగా సెకండ్ సినిమా చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. నెక్స్ట్ దొంగలున్నారు జాగ్రత్త అనే మూవీ చేశారు. ఇందులో కథ మొత్తం కారులోనే నడుస్తుంది. ప్రయోగాత్మకంగా వచ్చిన ఆ చిత్రం శ్రీసింహకి కెరియర్ పరంగా ఏ విధంగాను ఉపయోగపడలేదు.
ఈ ఏడాది క్రైమ్ కామెడీతో భాగ్ సాలె అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇవన్నీ ఎలా ఉన్నా ఉస్తాద్ టైటిల్ తో తెరకెక్కిన మూవీ మీద మాత్రం శ్రీసింహా చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎమోషనల్ లైఫ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫైలెట్ కావాలని కలలుకనే ఓ సామాన్య యువకుడి కథగా దీనిని ఆవిష్కరించారు. తాజాగా ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది.
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం దగ్గరుండి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసింది. నాని కూడా శ్రీసింహకి గట్టిగానే ప్రమోషన్ ఇచ్చే ప్రయత్నం ప్రీరిలీజ్ ఈవెంట్ తో చేశారు. అయితే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ మరోసారి ఈ హీరోగా చేదు ఫలితాన్ని ఇచ్చిందని చెప్పాలి. కంటెంట్ మెయిన్ లైన్ బాగున్నా దానిని నడిపించడానికి రాసుకున్న కథనం పరంగా డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. దీంతో స్లో పేజ్ లో సాగే డ్రామాగా ఈ మూవీ మిగిలిపోయింది.
మాసూద సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన గంగోత్రి చైల్డ్ యాక్టర్ కావ్య కళ్యాణ్ రామ్ మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టింది. తర్వాత బలగంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. అయితే మూడో సినిమాగా వచ్చిన ఉస్తాద్ మాత్రం ఆమె ఖాతాలో డిజాస్టర్ లిస్టులో చేరింది. అటు శ్రీసింహకి కెరియర్ పరంగా వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఉస్తాద్ రూపంలో మరో డిజాస్టర్ వచ్చి పడింది. |
https://www.tupaki.com//entertainment/article/satya-dev-upcoming-movies-updates/286717 | లాక్డౌన్ సమయంలో టాలీవుడ్ నుండి ఏ హీరో కూడా ఓటిటి వేదికగా సినిమాలు విడుదల చేయలేదు. అందులోను ఒకటి.. రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు విడుదల చేసిన హీరో సత్యదేవ్ మాత్రమే అని చెప్పాలి. అందులో ఒకటి 47డేస్ కాగా.. మరొకటి ఉమామహేశ్వర ఉగ్రరూపస్యతో పాటు గువ్వగోరింక. ఈ మూడు సినిమాలు ఓటిటిలోనే విడుదలయ్యాయి. ఇందులో ఉమామహేశ్వర మూవీ మలయాళం నుండి రీమేక్ చేశారు. అయితే సత్యదేవ్ ప్రస్తుతం కంప్లీట్ చేస్తున్న సినిమాలు కూడా ఓటిటిలోనే విడుదల కానున్నాయట. లీడ్ హీరోగా, నటుడిగా ఇప్పుడిప్పుడే ఫేమ్ తెచ్చుకుంటున్న సత్యదేవ్.. మెగాస్టార్ చిరంజీవి లాంటి బిగ్ షాట్స్ నుండి ప్రశంసలు పొందడం విశేషమే. కానీ అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఓటిటి స్టార్ అంటూ సత్యదేవ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎందుకంటే డైరెక్ట్ ఓటిటిలో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తున్నాడని నెటిజన్లు అలా అంటున్నారట. అయితే సత్యదేవ్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్, ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నాడు. ఓవైపు కరోనా మహమ్మారి వణుకు పుట్టిస్తుండటంతో సత్యదేవ్ చేతిలో ఉన్నటువంటి సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేస్తాడని టాక్. ప్రస్తుతం ఈ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయట. అందులో తమన్నాతో గుర్తుందా శీతాకాలం, తిమ్మరుసు, గాడ్సే సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తిమ్మరుసు సినిమా రిలీజ్ కు దగ్గరపడిందని తెలుస్తుంది. అయితే ఈ ఓటిటి తిమ్మరుసు సినిమాను కూడా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేస్తాడని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి ఎప్పుడు ఎందులో రిలీజ్ చేయనున్నారో..! |
https://www.tupaki.com//entertainment/article/katrina-kaif-glamourous-pose/239734 | కత్రిన వెర్సటైలిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పటికప్పుడు ఈ భామ ఏజ్ ని కనిపించుకుండా ఎలా దాచేయగలుగుతోంది? అన్న సందేహం యువతరంలో తప్పనిసరి. 35 ఏజ్ లోనూ ఇంకా టీనేజీ పరువాలతో గుండెల్లో మత్తు చల్లుతోంది. అయితే అందుకు కత్రిన ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో తెలిసిందే. నిరంతరం జిమ్- యోగా అంటూ కత్రిన పర్ఫెక్ట్ ఫిట్నెస్ రూల్స్ పాటిస్తుంది.ఇక ఒంపులు తిరిగిన దేహశిరిని పర్ఫెక్ట్ స్టైలింగ్ తో ఎలివేట్ చేయడమెలానో కత్రిననే అడిగి తెలుసుకోవాలి. నేటితరానికి క్యాట్ ఒక స్ఫూర్తి. ఇక కత్రిన పబ్లిక్ ఈవెంట్లకు .. ర్యాంప్ షోలకు ఎటెండైనప్పుడు తను ఫాలో చేసే ఫ్యాషన్ టెక్నిక్స్ ని యూత్ నిశితంగా పరిశీలిస్తుంటుంది. ఇదిగో లేటెస్టుగా క్యాట్ లేటెస్ట్ లుక్ అంతే జోరుగా వైరల్ అవుతోంది. ఈసారి పూర్తిగా వైట్ అండ్ వైట్ లో ఏదో మాల్ నుంచి బయటకు వస్తోంది. పిక్చర్ పర్ఫెక్ట్ లుక్ ఇది. కత్రిన సింపుల్ గా స్మైలిస్తూ అదరగొట్టింది.ప్రస్తుతం కెరీర్ కంటే ఈ అమ్మడు యువహీరో విక్కీ కౌశల్ తో ప్రేమాయణానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టుంది. సెట్స్ లో స్నేహం ఎటో వెళుతోందన్న టాక్ వినిపిస్తోంది. విక్కీ- కత్రిన జంట `భూత్ 1- ది హాంటెడ్ షిప్` సిరీస్ లో నటిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆ ఇద్దరూ రెగ్యులర్ గా అంథేరిలోని కత్రిన భవంతిలో కలుసుకుంటున్నారని నిండా ప్రేమలో మునిగారని బాలీవుడ్ మీడియా ఒకటే ఊదరగొట్టేస్తున్న సంగతి తెలిసిందే. |
https://www.tupaki.com//entertainment/article/dhruva-movie-first-look/131940 | సురేందర్ రెడ్డి ధ్రువ టీమ్ ని పరుగులు పెట్టిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ సినిమాని పూర్తి చేశాడు. మూడో షెడ్యూల్ కోసం త్వరలోనే కాశ్మీర్ వెళ్లబోతున్నారు. ఈ స్పీడుకీ - జోరుకీ కారణం రామ్ చరణ్ ఎనర్జీనే అన్నది సురేందర్ రెడ్డి మాట. చరణ్ ఉన్నాడంటే సెట్లో అందరూ ఉత్సాహంగా ఉంటారని ఆయన ఇటీవల ఫేస్ బుక్ ద్వారా తెలియజేశారు. నిన్నటివరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. రామ్ చరణ్ ఆ సన్నివేశాల్లో అదరగొట్టాడట. చిత్రబృందంలోని కొద్దిమంది స్వయంగా ఆ విషయాన్ని వెల్లడించారు. తని ఒరువన్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రమే ధ్రువ. ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన స్టైల్ మొత్తం మార్చేశాడు. అథ్లెట్ బాడీని సిద్ధం చేయడంతో పాటు - మీసకట్టులోనూ మార్పులు చేసుకొన్నాడు. దీంతో ఆయన తెరపై ఇదివరకటికంటే కొత్తగా కనిపిస్తున్నాడు. సినిమాకీ కొత్త ఫ్లేవర్ యాడ్ అయినట్టైంది. ప్రోగ్రెస్ తోపాటు ఫేస్ బుక్ లో ధ్రువ ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశాడు సురేందర్ రెడ్డి. జంజీర్ తర్వాత పోలీసు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రమిది. యాక్షన్ తోపాటు మైండ్ గేమ్ కి ప్రాధాన్యమున్న ఈ చిత్రంపై ఇప్పటికీ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇందులో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. |
https://www.tupaki.com//entertainment/article/justin-bieber-mumbai-show-controversy/157955 | కెనడియన్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ మ్యూజిక్ లైవ్ షో ఇండియాలో గత కొన్ని వారాల కిందట జరిగిన సంగతి తెలిసిందే. ఆ పోగ్రామ్లో జరిగిన అవకతవకలు సమసిపోయాయి అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ముంబాయి లో జరిగిన ఈ షో ఒక వరద బురదే మిగిల్చి పోయింది.ఆ షో నిర్వహించిన అర్జున్ జైన్ కు.. థానె ఎంటర్టైన్మెంట్ బ్రాంచ్ శాఖ తరుపున ఒక నోటిస్ పంపించారు. వైట్ ఫాక్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ షో తెరవెనుక బాగోతలు చాలా జరిపిందట. అక్కడ అనుమతి ఇచ్చిన స్థలంలో 3,529 ప్రేక్షకులు పడతారు కానీ అక్కడుకు వచ్చినవాళ్లు 7,000 పైగా ఉన్నారట. వివిఐపి లో ఉన్న రెండు సెక్షన్లలో 93, 86 మంది ఉండాలి కానీ షో జరిగినప్పుడు ఒక్కో సెక్షన్లో 150 కి పైగా కనిపించారు. వైట్ ఫాక్స్ వాళ్ళు చెప్పిన వివరాలు వాళ్ళు చేసిన పనులు పూర్తిగా రూల్స్ కు విరుద్దంగా ఉన్నాయి. దీనికి వాళ్ళు సుమారుగా 1.85 కోట్లు పెనాల్టీ పే చేయవలిసి ఉందట. అక్కడ ఈవెంట్ కు పని చేసిన వాళ్ళుకు కూడా పూర్తి పేమెంట్ ఇవ్వలేదట ఆర్గనైజ్ చేసినవాళ్లు. అందుకే ఇప్పుడు వీరికి ఎంటర్టయిన్మెంట్ బ్రాంచ్ పెనాల్టీ కట్టడానికి 7 రోజుల గడువు ఇచ్చింది. అది సంగతి.ఇంకోటి కూడా ఉందండోయ్.. అక్కడకు వచ్చిన అభిమానులు ఒక విషయంలో బాగా నిరాశ చెందారు. బీబర్ పాడిన పాటకు వాళ్ళ పెదాల కదిలికకు ఏమి పొంతన లేదంటూ అందరూ ఎద్దేవా చేశారు. ఇంత దారుణంగా నిర్వహించిన ఈ షో కి టికెట్లు రేటు మాత్రం 4,000 నుండి 70,000 వరుకు వసూలు చేశారు. ప్చ్!! |
https://www.tupaki.com//entertainment/article/aviri-teaser-3/224817 | ప్రయోగాత్మక చిత్రాలకు పర్మనెంట్ అడ్రెస్ అయిన రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆవిరి'. ఈమధ్యే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొద్దిరోజుల క్రితం ఆవిరి టీజర్ 1 రిలీజ్ చేశారు. తర్వాత ఆవిరి టీజర్ 2 రిలీజ్ చేశారు. తాజాగా ఆవిరి టీజర్ 3 రిలీజ్ చేశారు. ఇలా ఆవిరి 1 ఆవిరి 2 ఆవిరి 3.... అని చదువుతూ పోతుంటే మనకు ఎలా ఉంటుందో టీజర్ కూడా అలానే ఉంది. సహజంగా ఒక సినిమాకు మూడు టీజర్లు విడుదల చేశారంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారు? మొదటి టీజర్ లో లేని అంశాలు రెండో టీజర్ లోనూ.. మూడులో ఇంకా విభిన్నంగానూ ఉంటాయని ఆశిస్తారు. కానీ ఈ మూడు టీజర్లలో స్వల్పమైన మార్పులు ఉన్నాయి. అదీ విపరీతమైన పరిశీలనా శక్తి.. టీజర్లను రిపీట్ మోడ్ లో చూసే ఆసక్తి.. అన్ని టీజర్లను వరసగా చూసి వాటిలో తేడాలు కనిపెట్టే సహనం.. ఓర్పు ఉంటే తప్ప కనిపెట్టలేం. మొదటి టీజర్ లో మనకు కనిపించని ఒక ఆత్మ జ్యూన్ ను ఒక గ్లాస్ లోకి ఒంపుకుంటుంది. రెండో టీజర్ లో ఆ ఆత్మ చిన్న పిల్లల స్కేటింగ్ స్కూటర్ ను నడుపుతుంది. ఇక మూడవ టీజర్లో ఒక పింక్ కలర్ ట్రావెల్ బ్యాగ్ హ్యాండిల్ ను బయటకు లాగి బ్యాగును తోసుకెళ్తుంది. అవే ఆ తేడాలు.. ఇక మిగతా అంతా దాదాపుగా సేమ్ టు సేమ్.ఈ టీజర్ లో భయం గొలిపే అంశం మచ్చుకైనా కనిపించదు. బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా చాలా వీక్. వీటికి తోడు 'మీరు ఆత్మను కనిపెట్టండి' అని పజిల్ లాంటి క్యాప్షన్ ఒకటి! ఒక్క ముక్కలో చెప్తే ఈ టీజర్ సినిమా స్థాయిలో లేదు.. పైగా ఈ వరస టీజర్ల దండయాత్ర నెటిజన్లకు చిరాకు తెప్పిస్తోంది. అందుకే ఈ టీజర్ కింద కామెంట్స్ సెక్షన్లో నెటిజన్లు ఫ్రస్ట్రేషన్లో పదుల సంఖ్యలో జోకులు రాసి పెట్టారు. ఆలస్యం ఎందుకు.. టీజర్-3 ను చూసేయండి! |
https://www.tupaki.com//entertainment/article/rama-jogayya-shastri-about-sreenu-vaitla/326073 | టాలీవుడ్ లో ప్రస్తుతం ఫేమస్ పాటల రచయిత ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో రామ జోగయ్య శాస్త్రి పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆయన కెరీర్ ప్రస్తుతం చాలా జోష్ మీద సాగుతోంది. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సింగిల్ కార్డ్ రచయితగా నిలిచారు. కొన్ని వేల కొద్ది పాటలను రాసి వందల కొద్ది సూపర్ హిట్స్ ను అందుకున్న ఘతన దక్కించుకున్నాడు.ఇండస్ట్రీలో రామ జోగయ్య శాస్త్రి అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయ్యింది. ఆయన సక్సెస్ లో ప్రతి ఒక్క పాట కూడా కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. అయితే ఆయన తనకు మొదట అవకాశం ఇచ్చిన దర్శకుడిని మర్చి పోకుండా.. తనకు లైఫ్ ఇచ్చిన సినిమా ను మర్చి పోకుండా ప్రత్యేక సందర్బంలో ఆ సినిమా మరియు దర్శకుడిని తల్చుకున్నాడు.మంచు విష్ణు హీరోగా జెనీలియా హీరోయిన్ గా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇప్పటికి కూడా ప్రేక్షకుల అభిమానంను దక్కించుకుంటున్న 'ఢీ' సినిమా విడుదల అయ్యి 15 సంవత్సరాలు పూర్తి అయ్యింది.దాంతో సోషల్ మీడియా లో ఆ హడావుడి కనిపిస్తుంది. ఆ సినిమా తోనే రామ జోగయ్య శాస్త్రి ఎంట్రీ ఇచ్చారు.ఢీ సినిమాకు 15 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా రామ జోగయ్య శాస్త్రి స్పందించారు. ఆయన ట్విట్టర్ లో తనకు శ్రీను వైట్ల ఇచ్చిన అవకాశం పై మరియు ఆయన తనను నమ్మడం వల్లే ఈ స్థాయిలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. కెరీర్ లో ఎంతో మంది తన ఎదుగుదలకు దోహద పడ్డారు. కాని మొదటి అవకాశం ఇచ్చింది మాత్రం శ్రీనువైట్ల అన్నట్లుగా శాస్త్రి గారు ట్వీట్ చేశారు.ఆయన ట్విట్టర్ లో... థ్యాంక్యూ డియర్ శ్రీనువైట్ల... నేనింతవరకూ రావడంలో మీ పాత్ర మరువలేనిది...తొలిరోజుల్లో ఒక ప్రతిభను గుర్తించడం నమ్మడం మీరు నాకు చేసిన మేలు..ఢీ...నామట్టుకు నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం..మన టీమ్ అందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. శ్రీనువైట్ల ఈమద్య కాలంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ లను దక్కించుకోలేక పోతున్నాడు. మళ్లీ ఆయన కెరీర్ గాడిలో పడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. |
https://www.tupaki.com//entertainment/article/visaranai-is-india-official-entry-for-oscars-2017/139539 | ప్రతి ఏటా సినీ ప్రియులు జాతీయ అవార్డుల కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో.. ఆస్కార్ అవార్డుల నామినేషన్ కోసం ఇండియా నుంచి ఎంపికయ్యే సినిమా ఏదని కూడా అంతే ఆసక్తిగా చూస్తారు. ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం పురస్కారానికి ఇండియన్ ఎంట్రీగా తమిళ సినిమా ‘విసారణై’ ఎంపికైన సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. అతడికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ‘ఆడుగళం’ చిత్రాన్ని రూపొందించిన వెట్రిమారన్ ‘విసారణై’కి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ ఉన్నాడు. చంద్రకుమార్ అనే ఆటో డ్రైవర్ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వెట్రిమారన్.వెనిస్ చిత్రోత్సవంలో ప్రదర్శితమై అవార్డు గెలవడంతో పాటు జాతీయ అవార్డుల్లోనూ సత్తా చాటింది ‘విసారణై’. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు. విశేషం ఏంటంటే.. తమిళంలో విడుదలైన ఏడెనిమిది నెలల తర్వాత ఈ మధ్యే ఈ చిత్రాన్ని తెలుగులోకి ‘విచారణ’ పేరుతో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్. విడుదలకు సన్నాహాలు చేసుకుంటుండగానే ఈ సినిమా ఆస్కార్ అవార్డుల్లో పోటీ పడటానికి ఎంపికైంది. ఇది ‘విచారణ’కు కచ్చితంగా కలిసొచ్చే అంశమే. ఇందులో నటీనటులందరూ కొత్తవాళ్లు కావడంతో మన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదేమో. ఐతే ఆస్కార్ రేసుకు ఎంపికవడంతో ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. తెలుగులో విడుదలకు మార్గం సుగమం కావడమే కాదు.. ఈ సినిమా మీద ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించే అవకాశముంది. సగం వరకు ఆంధ్రప్రదేశ్ లోనే సాగడం కూడా సినిమాకు కలిసి రావచ్చు. మరి ఈ చిత్రాన్ని మన ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. |
https://www.tupaki.com//entertainment/article/corona-free-im-back-kriti-sanon/272250 | ‘నేను అనుకున్నదానికంటే చాలా బలంగా ఉన్నాను. కరోనా సోకిన తర్వాత ఆ విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు నా బలాన్ని తిరిగి పొందడానికి కృషి చేస్తున్నాను.’ అని ప్రకటించింది బాలీవుడ్ నటి కృతి సనన్. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో పర్పుల్ కలర్ స్పోర్ట్స్ బనియన్.. బ్లాక్ లైక్రా ప్యాంటు ధరించి వర్కవుట్స్ చేస్తోంది కృతి సనన్.ఆ వీడియోకు ఓ క్యాప్షన్ కూడా జత చేసింది. “ఈ సంవత్సరం చాలా విధాలుగా కఠినమైంది. కానీ.. నేను అనుకున్నదానికంటే చాలా బలంగా ఉన్నానని నాకు అర్థమైంది! కరోనా తర్వాత నా బలాన్ని తిరిగి పొందడం కోసం కసరత్తు చేస్తున్నాను. ఈ సంవత్సరాన్ని ఇలా ముగించాల్సి వచ్చింది’’ అని పేర్కొంది. ‘నేను ఇటీవలే కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నాను. అందులో నెగెటివ్ వచ్చింది. నేను కోలుకోవాలంటూ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ తెలిపింది కృతి.కాగా.. కృతి నెక్స్ట్ మూవీ అభిషేక్ జైన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సెకండ్ ఇన్నింగ్స్”. ఇందులో రాజ్ కుమార్ రావుతో కలిసి నటిస్తోంది కృతి. ఈ చిత్రం షూటింగ్ చండీగడ్ లో జరుపుతుండగాా.. అక్కడే కరోనా పాజిటివ్ రావడంతో కృతి ఇంటికి బయల్దేరింది. ఈ చిత్రంలో పరేష్ రావల్ తోపాటు డింపుల్ కపాడియా నటిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. |
https://www.tupaki.com//entertainment/article/kangana-raunat-comments-on-deepika-padukone/234611 | పౌరసత్వ బిల్లు నేపథ్యంలో ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెల్సిందే. జేఎన్ యూలో జరిగిన ఘటనపై పలువురు బాలీవుడ్ స్టార్స్ స్పందించారు. అయితే దీపిక పదుకునే మాత్రం ఏకంగా యూనివర్శిటీకి వెళ్లి జేఎన్ యూ విద్యార్థులకు మద్దతుగా నిలిచిన విషయం తెల్సిందే. దీపిక చేసిన పనిపై బీజేపీ నాయకులు మరియు కేంద్ర మంత్రులు పలువురు చాలా సీరియస్ అయ్యారు. ఆమె దేశ ద్రోహులకు మద్దతుగా నిలుస్తుందంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వస్తున్నాయి.ఆమె నటించిన తాజా చిత్రం ప్రమోషన్ కోసం ఆమె ఇలా చేసిందనే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో కంగనా స్పందిస్తూ తాను దీపిక జేఎన్ యూ వెళ్లడంపై స్పందించాలనుకోవడం లేదు. కాని దేశాన్ని విచ్చిన్నం చేసి మన సైనికులు చనిపోతే వేడుకలు చేసుకునే వారికి మద్దతుగా మాత్రం నేను నిలువను. తుక్డే గ్యాంగ్ వెనుక నిల్చోవాలని నేను అనుకోవడం లేదు. ఆమెకు ఎవరికి మద్దతు అయినా ఇచ్చే అర్హత ఉంది.. ఎక్కడకు వెళ్లి అయినా మద్దతు తెలిపే హక్కు ఉందని కంగనా కౌంటర్ వేసింది. కంగనా కౌంటర్ కు దీపిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. |
https://www.tupaki.com//entertainment/updateonooruperubhairavakona-1323658 | మంచి టాలెంట్ ఉన్న నటుడు సందీప్ కిషన్. వైవిధ్యమైన పాత్రలు, కథలు చేయాలనే తపన ఆయనలో ఎప్పుడూ ఉంటుంది. కానీ విజయాలు ఆయనతో కలిసిరావడం లేదు. గత కొద్ది కాలంగా సందీప్ చేస్తున్న సినిమాలన్నీ వరుసగా నిరాశ పరుస్తున్నాయి. ఆ మధ్య చివరిగా ఆయన చేసిన పాన్ ఇండియా మైఖేల్ ఫలితం సందీప్ను పూర్తిగా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన సోషియో ఫాంటసీ ఊరు పేరు భైరవకోన అనే సినిమా చేస్తున్నారు.
విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. అయితే ఈ చిత్రానికి ఆ మధ్యలో గట్టిగా ప్రమోట్ చేశారు. ప్రచార చిత్రాలు కూడా విడుదల చేసి సినీ ప్రియుల్లో క్యూరియాసిటీని కూడా పెంచారు. కానీ ఇప్పుడు ఈ సినిమా పేరే కొంత కాలం నుంచి సరిగ్గా వినపడట్లేదు. ఇంకా సాలిడ్ రిలీజ్ డేట్ను కూడా లాక్ చేసుకోలేకపోయింది.
అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి ఓ వార్త వినిపిస్తోంది. గరుడ పురాణంలో మాయమైపోయిన ఓ నాలుగు పేజీల కథే ఈ భైరవకోన అని ఆ మధ్యలో మూవీటీమ్ తెలిపింది కదా. ఇలాంటీ ఫాంటసీ ఎలిమెంట్స్ను తెరపై చూపించాలంటే మంచి విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి. వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది. అయితే ఈ చిత్ర వీఎఫ్ఎక్స్ వర్క్తో దర్శకుడు ఆనందంగా సంతృప్తిగా లేరని తెలిసింది. అందుకే కొన్ని సన్నివేశాలను రీవర్క్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
అందుకే ఇలా ఆలస్యం అవుతోందని అంటున్నారు. సీజీ వర్క్ మొత్తం అనుకున్న విధంగా పూర్తైతే.. చిత్రాన్ని వచ్చే ఏడాది 2024 ఫిబ్రవరిలో మంచి స్లాట్ చూసుకుని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే నిర్మిస్తున్నారు. రాజేష్ దండా నిర్మాత. అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా, గతంలో దర్శకుడు ఆనంద్ - సందీప్ కలిసి మాయవన్ అనే సినిమా చేశారు. మరి వరుస ఫ్లాప్ల్లో ఉన్న సందీప్కు ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ను అందిస్తుందో చూడాలి. |
https://www.tupaki.com//entertainment/article/dil-raju-on-nenu-local-movie-release/144894 | విడుదల విషయంలో ప్లానింగులు ఎక్కడైనా వర్కవుట్ అవుతాయేమో కానీ... తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రం చాలా కష్టం. చిన్న సినిమాలైతే అవి ఎప్పుడొస్తాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఒక్క స్టార్ సినిమా కాస్త అటు ఇటూ అయితే చాలు... అది ఇది అని లేకుండా అన్ని సినిమాల రిలీజ్ డేట్లూ మారిపోతుంటాయి. `సింగం 3` విడుదల తేదీ వాయిదా పడటంతో ఆ విషయం మరోసారి ఇండస్ట్రీకి బాగా తెలిసొచ్చింది. డిసెంబరు 16న రావల్సిన సూర్య `సింగం3` చరణ్ `ధృవ` కోసమని 23కి మారిపోయింది. దాంతో 23న రావాలనుకొన్న సినిమాలు కొన్ని ముందుకు వచ్చేశాయి. కొన్ని సినిమాలు మాత్రం వాయిదా వేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నాయి. నిజానికి క్రిస్ మస్ కి నాని సినిమా `నేను లోకల్` విడుదల కావల్సి ఉంది. అయితే సూర్యలాంటి స్టార్ కథానాయకుడి సినిమాతో పాటుగా `నేను లోకల్` విడుదల చేయడం దిల్ రాజుకి ఇష్టం లేదట. దాంతో `నేను లోకల్`ని వాయిదా వేయబోతున్నట్టు తెలిసింది. అయితే ఉరుమొచ్చి మంగళం మీద పడ్డట్టుగా నాని సినిమా కాస్త శర్వానంద్ `శతమానం భవతి`కి ఎసరు పెట్టే అవకాశాలున్నాయని తెలిసింది.దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కిన శతమానం భవతి సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనేది మాట. ఆ మేరకు ఇటీవల షూటింగ్ ని కూడా పూర్తి చేశారు. అయితే క్రిస్ మస్ కి రావల్సిన నాని `నేను లోకల్`ని సంక్రాంతికి విడుదల చేస్తే ఎలా ఉంటుందా అని ఇప్పుడు దిల్ రాజు ఆలోచిస్తున్నాడట. నానికి మాస్ ప్రేక్షకుల్లో మంచి పట్టుంది. ఆయన సినిమా సంక్రాంతికి విడుదలైందంటే పెద్దయెత్తున ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయి. అందుకే శతమానం భవతిని ఫిబ్రవరికి వాయిదా వేసి నాని సినిమాని సంక్రాంతికి తీసుకొచ్చేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్నగర్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే కొద్దిమంది మాత్రం శతమానం భవతి సంక్రాంతికే రావల్సిన సినిమా అనీ, అది ఫక్తు ఫ్యామిలీ సబ్జెక్టుతో తెరకెక్కిన సినిమా కాబట్టి దాన్ని దిల్రాజు ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేయడని మాట్లాడుకొంటున్నారు. పైగా శర్వానంద్ సినిమాలకి కూడా ఈమధ్య మంచి ఓపెనింగ్సే వస్తున్నాయి కాబట్టి శతమానం భవతిని వాయిదా వేయకపోవచ్చన్న వాదనలూ బలంగా వినిపిస్తున్నాయి. మరి దిల్రాజు నిర్ణయమేంటన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే <|hyperlink|> /Tupakidotcom/ |
https://www.tupaki.com//entertainment/willkalkibreakthatrecord-1365602 | కల్కి.. కల్కి.. కల్కి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మూవీ కోసమే చర్చ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ తో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అమితాబ్ గ్లింప్స్ చూసి వావ్ అన్నారు. ఇక సినిమాలోని ప్రభాస్ వెహికల్ బుజ్జిని చూసి సినీ ప్రియులతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న బుజ్జి అండ్ భైరవ ప్రీలూడ్ వీడియోస్ చూశాక.. నాగ్ అశ్విన్ ను శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.
ఇప్పుడు అంతా కల్కి ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. జూన్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కొత్త కల్కి ప్రపంచాన్ని చూసేందుకు సిద్ధం అవ్వడంటూ మరింత బజ్ క్రియేట్ చేశారు. మరోవైపు మేకర్స్.. వరల్డ్ వైడ్ గా జూన్ 27వ తేదీన మూవీని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ మూవీ ఓపెనింగ్స్ కు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కల్కి ఓపెనింగ్స్ ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ ఫస్ట్ డే భారీ వసూళ్లు రాబడుతుందని అంటున్నారు. అందుకు కారణంగా ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబుతో కల్కి నిర్మాత అశ్వనీదత్ కు మంచి బాండింగ్ ఉంది. దీంతో కల్కి రేట్ల పెంపు, స్పెషల్ షోల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని టాక్.
దీంతో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్ ను కల్కి బ్రేక్ చేస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో RRR చిత్రం రూ.70 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. పూర్తి రన్ టైమ్ లో రూ.230 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వీటిని కల్కి అధిగమిస్తుందని అంటున్నారు. అయితే ప్రభాస్ గత చిత్రాలు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే RRR రికార్డ్ బ్రేక్ అవ్వలేదని, ఈసారి పక్కా బద్దలు అవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. |
https://www.tupaki.com//entertainment/article/unstoppable-prabhas-and-pawan-kalyan-craze-attenson-whom/359301 | బాలకృష్ణ ఆహాలో చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో మొదటి ఎపిసోడ్ ని నార చంద్రబాబు నాయుడుతో చేయడం ద్వారానే ఒక వైబ్ ని క్రియేట్ చేశారు. ఆ వైబ్ ని కొనసాగిస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక ఎపిసోడ్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. సినిమా ఈవెంట్స్ లో ఎప్పుడూ కూడా ప్రభాస్ తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ నేపధ్యంలో అన్ స్టాపబుల్ షోలో అతని రియల్ బిహేవియర్ ఎలా ఉండబోతుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే బయట కనిపించే దానికి, ఎపిసోడ్ లో ప్రభాస్ రియల్ ఆటిట్యూడ్ కి కంప్లీట్ గా డిఫరెన్స్ కనిపించడం విశేషం. ప్రభాస్ ఎపిసోడ్ మొత్తం చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేశాడు. క్రేజీగా ఫ్యాన్స్ ని అలరించాడు. ఎపిసోడ్ లో ప్రభాస్ చాలా యాక్టివ్ గా ఉంటూ సమాధానాలు చెప్పడంతో పాటు కావాల్సినంత ఫన్ క్రియేట్ చేశాడు. ఇక ఈ సీజన్ చివరి ఎపిసోడ్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇన్వైట్ చేశారు. దీంతో ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అనేది సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఇటు సినిమా పరంగా, అటు రాజకీయాలలో కూడా ఈ ఎపిసోడ్ పై క్యూరియాసిటీ పెరిగింది. విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. దానికి తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి ఊహించని స్థాయిలో ఆదరణ వచ్చింది. ఇప్పటి వరకు అన్ స్టాపబుల్ లో ప్రభాస్, మహేష్ బాబు ఎపిసోడ్స్ కంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ఎక్కువ మంది వీక్షించారు. ఓ విధంగా చెప్పాలంటే రికార్డ్ బ్రేక్ చేసింది. పోల్స్ కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపించే అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ పవన్ కళ్యాణ్ టాప్ లో నిలిచింది. అయితే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత కొంత మంది నిరాశ చెందారుదీనికి కారణం బాలకృష్ణతో సంభాషణలు అంటే చాలా యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో నడుస్తాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఎపిసోడ్ లో చాలా సిగ్గుతో, బెరుకుగా కనిపించాడు. అలాగే చాలా తక్కువ మాట్లాడాడు. బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం మాత్రమే చేశాడు. బాలయ్య ఎన్ని విధాలుగా పవన్ ని కాస్తా జోవియల్ మూడ్ లోకి తీసుకొచ్చి యాక్టివ్ చేసిన పవన్ తాను ఎం మాట్లాడాలని అనుకుంటే అదే మాట్లాడాడు. దీంతో ఎపిసోడ్స్ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కంటే ప్రభాస్ ఎపిసోడ్ ఎక్కువ ఎంటర్టైన్ చేసింది అనే మాట అన్ స్టాపబుల్ ఆడియన్స్ నుంచి వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎక్కువ మంది చూసిన కూడా ప్రేక్షకులకి వినోదాన్ని అందించింది మాత్రం ప్రభాస్ ఎపిసోడ్ అని తెలుస్తుంది. దీనికి కారణం ప్రభాస్ ఈ ఎపిసోడ్ లో తనలో హ్యూమర్ సెన్స్ ని పరిచయం చేయడమే అని చెప్పాలి. అదే పవన్ కళ్యాణ్ మాత్రం తనకి అలవాటు లేని పని చేస్తున్నట్లుగా ఎపిసోడ్ ఆద్యంతం కనిపించాడు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. |
https://www.tupaki.com//entertainment/article/prakash-raj-serious-comments-on-mohan-babu-and-manchu-vishnu/306531 | 'మా' ఎలక్షన్స్ ఈ సారి మాటలతోనే మహాసంగ్రామాన్ని తలపించాయి. ఎవరూ ఎలాంటి ఆరోపణలు చేయడానికి తగ్గలేదు. ఆ తరువాత తమని తాము సవరించుకుని కూల్ కాలేదు. చివరివరకూ ఆ వాడి .. వేడితోనే కొనసాగాయి. ఫలితాలు వెల్లడించిన తరువాత అంతా సర్దుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. ఎవరికి అవకాశం వస్తే వారు చెలరేగిపోతూనే ఉన్నారు. పంచ్ లు .. సవాళ్లు విసురుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమానికి వచ్చిన ప్రకాశ్ రాజ్, ఆ ఎన్నికలపై తన మనసులోని మాటల మూటను విప్పారు."కొంతమంది మన కుటుంబం .. మన కుటుంబం అంటున్నారు .. అదంతా అబద్ధం. అలా అనేవాళ్ల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. నుంచున్న వాళ్ల మధ్య పోటీ ఉండదు .. వీడి వెనక ఎవరున్నారో .. వాడి వెనక ఎవరున్నారో వాళ్లు వదలరు. అసలువాళ్లు పరోక్షంగా వేరే రూపాల్లో వస్తుంటారు. అలా అసలు వాళ్ల మధ్య జరిగిన యుద్ధంలో నేను ఒక పావును అయ్యానని అంతా అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే అందరి పెద్దరికాలను నేను ప్రశ్నిస్తూ ఉండటమే అందుకు నిదర్శనం. సినిమా ఇండస్ట్రీ కొంతమంది చెబుతున్నట్టుగా ఒకటైతే కాదు .. ఇక్కడ ఎవరి ఈగోలు వారికి ఉన్నాయి. నా వెనక ఎవరో ఉన్నారని అంటారు. నేను అంటే నచ్చిన వాళ్లంతా నా వెనక ఉన్నట్టా? నన్ను పోటీకి నిలబెట్టాలని ఎవరు నిర్ణయించారని అంటారు. నన్ను నిర్ణయించేవారు ఎవరండీ ఈ దేశంలో. నా వెనక చిరంజీవిగారు ఉన్నారని విష్ణు చెప్పినా .. మోహన్ బాబు గారు చెప్పినా అది అబద్ధం ఎందుకు అయ్యుండకూడదు? 'మా'లో ఈగోవార్ జరుగుతుందనే విషయాన్ని నేను గమనించే ఈ సారి నేను నుంచోవాలని పోయినసారే నిర్ణయించుకున్నాను. మూలాలలోకి వెళ్లి పరిశీలిస్తే, ఇప్పటివరకూ ఉన్నవారికి అవగాహనే లేదనే విషయం నాకు అర్థమైంది. కుటుంబం .. కుటుంబం అంటారు .. దాదాపు 50 శాతం మంది ఓటింగుకు రారు. అలాంటప్పుడు అది కుటుంబం ఎలా అవుతుంది? అనే విషయం నాకు అర్థం కాలేదు. ఎప్పుడైనా గెలిచినవారు తమని గెలిపించినవారిని గురించి ఆలోచించారా? ఓటేసిన తరువాత ఇక్కడ ఎవరి కష్టాలు వాళ్లే పడాలి. 'మా' అసోసియేషన్ మసకబారింది అంటారు. కింద ఉన్న 900 మంది వలన కాదు, ఆ పైనున్నపాతిక మంది వల్లనే ఇలా అయింది. సమస్యలు పట్టించుకోకపోతే పరిష్కారమవుతాయా? నా వలన ఇబ్బంది అవుతుందనే ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెచ్చారు. నేను నిజాయితీగా గెలవాలని అనుకున్నాను .. అలాగే ముందుకు వెళ్లాను. నేను ఓట్లను గుద్దించుకోలేదు .. పోస్టల్ బ్యాలెట్ పేపర్ల విషయంలో మోసాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను .. ఫ్లైట్ టిక్కెట్లు .. స్టార్ హోటల్స్ ను నేను బుక్ చేయలేదు. 60 ఏళ్లు దాటిన పెద్దవారిని నేను బెదిరించలేదు. చిన్నవాళ్లకు స్వీట్లు పంచలేదు .. ఇంటింటికీ చీరలు పంచలేదు. అందువలన నాకు వచ్చిన ఓట్లు నిజాయితీగా వచ్చినవే. గెలిచిన వాళ్లను నేను తప్పకుండా ఎప్పటికప్పుడు రిపోర్ట్ కార్డు అడుగుతూనే ఉంటాను. అక్కడే ఉండి క్వశ్చన్ చేస్తే బ్యాన్ చేస్తారు. వాళ్లకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే బయటకికి వచ్చేశాను. గెలిచింది విష్ణు .. మాట్లాడుతుంది మోహన్ బాబు .. ఇది ఎలా వినపడాలి నాకు. ఎన్నికల రోజున కళ్ల ముందు ఏం జరుగుతున్నా ఏం చేయలేకపోయాము. చేయండి పని .. మంత్లీ రిపోర్టు కార్డు ఇచ్చి తీరాలి ఇప్పుడు. నెక్స్ట్ టూ ఇయర్స్ పడుకోనీయను" అంటూ చెప్పుకొచ్చారు. |
https://www.tupaki.com//entertainment/article/boyapati-srinu-on-balakrishna-100th-movie/120997 | బాలయ్య వందో సినిమా.. దీని గురించి రెండు మూడేళ్ల నుంచి చర్చ జరుగుతోంది. తెలుగు పరిశ్రమలో మరే హీరో వందో సినిమాకు లేనంత హంగామా బాలయ్య సెంచరీ మూవీ గురించి ఉండబోతోందనడంలో ఎవరికీ సందేహాల్లేవు. ఈ సినిమాకు దర్శకుడెవరు.. నిర్మాత ఎవరు.. హీరోయిన్లుగా ఎవరు నటిస్తారు.. టైటిల్ ఏంటి.. బాలయ్య ఎలాంటి కథ ఎంచుకుంటాడు.. అని కొన్నేళ్ల నుంచి చర్చ నడుస్తోంది నందమూరి అభిమానుల్లో. ఇప్పుడిక 99వ సినిమాను కూడా పూర్తి చేసి 100వ సినిమా ముంగిట నిలిచాడు బాలయ్య. ఇంతకుముందు సింహా - లెజెండ్ సినిమాల్లో బాలయ్యను అద్భుతంగా చూపించిన బోయపాటే 100వ సినిమాకు కూడా దర్శకుడని ముందే తేలిపోయింది. ఆ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది.బాలయ్య ‘డిక్టేటర్’ పూర్తి చేసి ఖాళీ అయిపోతుండగా.. ఇంకో నెలా రెండు నెలల్లో బోయపాటి కూడా ‘సరైనోడు’ నుంచి ఫ్రీ అవుతాడు. ఆ తర్వాత బాలయ్య వందో సినిమా మొదలవడమే తరువాయి అనుకున్నారు. కానీ ఇప్పుడేమో సడెన్ గా బెల్లంకొండ శ్రీనివాస్ తో ఇంతకుముందు అనుకున్న సినిమాను మళ్లీ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు బోయపాటి. మరి బాలయ్య వందో సినిమా సంగతేంటన్నదే అర్థం కావడం లేదు. బోయపాటి పూరి జగన్నాథ్ లాగా వారం రోజుల్లో స్క్రిప్టు రాసి.. రెండు నెలల్లో సినిమా పూర్తి చేసే టైపు కాదు. దేనికైనా బాగా టైం పడుతుంది. మరి శ్రీనివాస్ సినిమా పూర్తి చేసి.. ఆ తర్వాత బాలయ్య సినిమాకు స్క్రిప్టు రాసి సినిమా మొదలుపెట్టాలంటే ఏడాది పైనే పడుతుంది. మరి బాలయ్య దీనికి ఒప్పుకుని అంత కాలం బాలయ్య ఖాళీగా ఉంటాడా.. నందమూరి అభిమానులు ఊరుకుంటారా? |
https://www.tupaki.com//entertainment/article/kangana-ranaut-about-vijayendra-prasad/324800 | రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్ పద్మవిభూషణ్ కు అర్హుడని ప్రశంసించారు క్వీన్ కంగన రనౌత్. ఎస్ఎస్ రాజమౌళిని కింగ్ అని అని కూడా సంబోధించడం చర్చనీయాంశమైంది. SS రాజమౌళి తెరకెక్కించిన సినిమాటిక్ వండర్ RRR థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ 700 కోట్ల క్లబ్ నుంచి 1000 కోట్ల క్లబ్ వైపు వడి వడిగా అడుగులు వేస్తోంది. ఈ సినిమా సామాన్యులనే కాకుండా ప్రముఖుల హృదయాలను కూడా కొల్లగొడుతోంది. సల్మాన్ ఖాన్ - కరణ్ జోహార్ ఈ చిత్రం గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొనడంతో క్రేజ్ మరింత పెరిగింది.ఆపై విడుదలకు ముందు అమీర్ ఖాన్ వచ్చి RRR కి మద్దతునివ్వడం మరింత ప్లస్ అయ్యింది. ఇప్పుడు ఇటీవల కంగనా రనౌత్ తన సోషల్ మీడియాలో ఏకంగా ప్రశంసల ఝడివాన కురిపించారు. ఇంత గొప్ప చిత్రాన్ని రూపొందించినందుకు RRR' బృందాన్ని ప్రశంసిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు.ఈ చిత్రానికి ప్రమోషన్స్ అవసరం లేదు. ఇది అన్ని రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఇది దేశభక్తి - ఐక్యత భావాలతో నిండి ఉంది. ఇది మంచి కళ.. సంస్కృతిని ప్రోత్సహిస్తుంది. ఏ భారతీయుడైనా ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ప్రశంసించాలని కోరుకుంటారు. ఈ సినిమా ఇద్దరు నిజ హీరోల కథ. మన స్వాతంత్య్ర సమర కాలంలో ఇంకా ఎందరో బయటకు తెలియని హీరోలు ఉంటారా? అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. నేటి యుగంలో కూడా పెద్దగా మాట్లాడని హీరోలు ఎందరో ఉన్నారు.. ఈ చిత్రానికి రచయిత శ్రీ కె.వి.విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. మాకు అనేక విశేషమైన సినిమాలకు కథలు ఇచ్చారు ఆయన. 80 ఏళ్ల వయస్సులో అతను భారతదేశంలోని అత్యంత బిజీ రచయితలలో ఒకరిగా ఉన్నారు. అతను 15 రోజుల్లో కథలు రాస్తారు. అయితే ఇతరులు ఒక కథను పూర్తి చేయడానికి 6 నెలల ఒక సంవత్సరం తీసుకుంటారు. మీరు అతనిని కలిసినప్పుడు ఉద్వేగభరితంగా ఉంటారు. పద్మవిభూషణ్ కి అర్హులు ఆయన.. అది తన అవసరం కాదు.. యువత అవసరం.. పరిశ్రమలో ఇలాంటి వారు మరింత మంది కావాలి`` అని క్వీన్ ప్రశంసల్లో ముంచెత్తారు.RRR లో ప్రతి నటుడు చాలా బాగా నటించారు. అది ఎన్టీఆర్ జీ .. రామ్ చరణ్ జీ కావచ్చు. నేను దర్శకుడు SS రాజమౌళి గురించి మాట్లాడేటప్పుడు నాకు మాటలు రావడం లేదు.. అతను రాజు లాంటివాడు.. నేను చెప్పేదంతా ``రాజుగారితో జీవించు..`` అనే. ధన్యవాదాలు... RRR కోసం.. అంటూ క్వీన్ పొగిడేశారు.భారతదేశంలో అత్యంత విజయవంతమైన బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటిగా ఆర్.ఆర్.ఆర్ సంచలనాలు సృష్టిస్తోంది. ఇంతకాలం వేచి చూసి ఇప్పుడు రిలీజ్ చేసినందుకు సరైన సమయాన్ని ఎంచుకున్నారని కూడా ప్రూవ్ అయ్యింది. దక్షిణాది నుండి మాత్రమే కాకుండా ఉత్తరాదిన ఇతర మార్కెట్ల నుండి కూడా ఈ చిత్రానికి ప్రశంసలు కురుస్తున్నాయి. వసూళ్లు అంతే అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇది సిసలైన పాన్ ఇండియా చిత్రం. RRR విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద అద్భుత ఫలితాలను చూపుతోంది. ఈ చిత్రం అత్యంత వేగంగా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. పోస్ట్-పాండమిక్ 5 రోజులలోపు భారీ వసూళ్లతో సంచలనాలు సృష్టించి ఇప్పటికీ గొప్ప వసూళ్లను సాధిస్తోంది.డివివి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను నిర్మించారు. 25 మార్చి 2022న సినిమా విడుదలైంది. వారం తర్వాతా అద్భుత వసూళ్లను సాధిస్తోంది. క్వీన్ కంగన రాజమౌళిని కింగ్ అంటూ ఆశీర్వదించడమే గాక.. విజయేంద్రునికి ఏకంగా పద్మవిభూషణ్ ఇవ్వాలని కోరింది. తద్వారా చాలా మంది తెలుగు కథానాయికలు లేదా హీరోలు లేదా ఇతరుల కంటే బెటర్ థింకర్ అని నిరూపించింది. ఒక తెలుగు వాడికి ఇది గర్వకారణం. కంగన నుంచి చాలా నేర్చుకోవాల్సింది ఉందని అంతా అంగీకరించాలి. |
https://www.tupaki.com//entertainment/article/shivaji-ganesan-on-about-savithri-anger-moment/184632 | సావిత్రి గారి బయోపిక్ గా మహానటి ఘన విజయం సాధించాక ఆవిడ జీవితం గురించి విశేషాలు తెలుసుకోవడానికి ఇప్పటి తరం ప్రయత్నించడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే. యూత్ తో మొదలుకుని ముసలి వాళ్ళ దాకా వయసు భేదాలు లేకుండా అందరూ థియేటర్లకు రావడం చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. క్లైమాక్స్ ముందు వచ్చే కొన్ని సన్నివేశాల్లో అక్కడక్కడ తప్ప సావిత్రి గారికి కోపం వచ్చే అలవాటు ఉన్నట్టు నాగ అశ్విన్ ఎక్కడా చూపించలేదు. నిజానికి సావిత్రి గారిది చాలా జోవియల్ నేచర్. తన చుట్టూ ఉన్న వారితో సరదాగా ఉంటూ అందరితో నవ్వుతూ కాలం గడపటమే ఆవిడకు తెలిసింది. అలాంటి సావిత్రి గారికి ఒకేఒక్కసారి పట్టలేనంత కోపం వచ్చిందట. అది ఆవిడ భర్త జెమిని గణేషన్ అప్పట్లో జరిగిన ఒక పాత ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు.పాపమనిప్పు అనే సినిమా వంద రోజుల వేడుక కోసం సావిత్రి గారు జెమిని గణేషన్ ఇద్దరూ బెంగుళూరు చేరుకున్నారు. అక్కడి ప్రఖ్యాత వుడ్ లాండ్స్ హోటల్ లో మకాం. థియేటర్ కు వెళ్ళాక జెమినీ గారికి హోటల్ నుంచి ఫోన్ కాల్ టెలిగ్రామ్ వచ్చిందని. అదేంటో ఈయన చదవమన్నారు. అందులో సావిత్రి గారి అమ్మాయి విజయ చాముండేశ్వరి పోయారు అని ఉందట. దీంతో షాక్ తిన్న జెమిని గణేషన్ సావిత్రికి చెప్పకుండా వెంటనే హోటల్ రూమ్ కు చేరుకున్నారు. వెంటనే మెడ్రాస్ కు ఫోన్ చేసి అమ్మాయి క్షేమంగా ఉందని తెలుసుకుని నిట్టూర్చారు. మొదటి భార్య అలిమేలును ఫోన్ లో అడిగితే ఆ టెలిగ్రామ్ సంగతి తనకు తెలియదన్నారు.వేడుక అయిపోయాక జెమిని గణేషన్ సావిత్రి కి జరిగినదంతా చెప్పారు. సావిత్రి గారి ఉగ్ర స్వరూపం మొదటి సారి జీవితంలో ఆయన చూసారు. కోపంతో ఊగిపోతూ విజయ గురించి ఇలాంటి వార్త ఇచ్చింది ఎవరూ అంటూ ఆరా తీసేందుకు వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. తన పలుకుబడి మొత్తం ఉపయోగించి ఈ పని ఎవరు చేసారో కనుక్కునేందుకు చాలా ప్రయత్నించారు. జెమిని గణేశన్ ఎంత ప్రయత్నించినా కోపం తగ్గలేదు. ఆ పని చేసింది ఎవరో మాత్రం తేలలేదు. ఇప్పటి లాగా టెక్నాలజీ అందుబాటులో ఉండి ఉంటే ఇది సులభం అయ్యేది కాని అప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టమే. అదండీ సావిత్రి గారికి కోపం వచ్చిన ఒకే ఒక్క సందర్భం. |
https://www.tupaki.com//entertainment/article/is-allu-family-not-keeping-efforts-in-unstoppable-show/350193 | నందమూరి బాలకృష్ణ 'ఆహా' ఓటీటీ కోసం తొలి సారి హోస్ట్ గా మారి 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె' టాక్ షోలో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ని ప్రారంభించి సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రీసెంట్ గా సీజన్ 2 ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ తో స్టార్ట్ చేయడం అది సూపర్ హిట్ కావడం తెలిసిందే.టాలీవుడ్లో ఇంత వరకు చాలా మంది టాక్ షోలు చేసినా అన్నింటికి మించి భారీ క్రేజ్ తో పాటు పాపులర్ అయిన షోగా 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె' పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా టాక్ షోలలో అత్యధిక క్రేజ్ ని సొంతం చేసుకున్న టాక్ షోగా ఐఎండీబీ లో రికార్డు స్థాయి రేటింగ్స్ ని సొంతం చేసుకుని సరికొత్త రికార్డుల్ని సొంతం చేసుకుంది. ఈ షోలో ఫస్ట్ సీజన్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు పలువురు క్రేజీ సెలబ్రిటీలు పాల్గొన్నారు.కానీ ఈ టాక్ షోలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్స్ ఎంట్రీ ఇచ్చినా ఈ టాక్ షోలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఇంత వరకు పాల్గొనలేదు. వీరు షోలో పాల్గొంటే బాలయ్య రియాక్షన్ ఎలా వుంటుంది?.. బాలయ్య ప్రశ్నలకు వారి సమాధానాలు, రియాక్షన్ ఎలా వుంటాయా? అని మెగా ఫ్యాన్స్, అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా చిరు, చరణ్ కలిసి షోలో సందడి చేస్తే చూడాలని కూడా చాలా మంది ఆరా తీస్తున్నారు.అల్లు అరవింద్ ఆహా కోసం నిర్వహిస్తున్న షో కాబట్టి చిరు, చరణ్ లని ఈ షోలోకి తీసుకురావడం తేలికే కానీ అది ఎందుకు జరగడం లేదు. చిరుకు, బాలయ్యకు మద్య గ్యాప్ వచ్చిందా? లేక అల్లు అరవింద్ ఆ ప్రయత్నాలు జరగడం లేదా? అనే చర్చ జరుగుతోంది. మెగా ఫ్యాన్స్ కి కూడా ఇది ఎందుకు జరగడం లేదో అంతు చిక్కడం లేదట. ఇటీవల చిరు ఏపీ సీఎంని, గతంలో టీఎస్ సీఎంని కలిసిన సందర్భంలో బాలయ్యకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం.. ఆ తరువాత బాలయ్య ఇండైరెక్ట్ గా చిరుపై సంచలన వ్యాఖ్యలు చేయడం వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టి 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె'లోకి మెగాస్టార్ ఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అది త్వరలోనే జరుగుతుందా?.. ఇంతకీ చిరు బాలయ్య షోలోకి రాకపోవడానికి కారణం ఏంటీ? అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. |
https://www.tupaki.com//entertainment/article/who-is-new-james-bond/192549 | హాలీవుడ్ లో బాండ్ సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా బాండ్ చిత్రాలు వేల కోట్ల వసూళ్లను రాబట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా జేమ్స్ బాండ్ చిత్రాలకు మంచి ఆధరణ దక్కింది - దక్కుతుంది - దక్కబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే జేమ్స్ బాండ్ పాత్రను పోషించే వ్యక్తి వరల్డ్ సూపర్ స్టార్ అంటూ ప్రేక్షకులు అభిమానిస్తారు. ఇప్పటి వరకు ఎంతో మంది హాలీవుడ్ స్టార్స్ జేమ్స్ బాండ్ పాత్రను పోషించారు. డేనియల్ క్రెయిగ్ ప్రస్తుతం బాండ్ చిత్రాల హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఈయన బాండ్ గా నాలుగు చిత్రాలు వచ్చాయి. ఆ నాలుగు చిత్రాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా వేలాది కోట్ల వసూళ్లను రాబట్టాయి. ప్రస్తుతం డేనియల్ క్రెయిగ్ బాండ్ గా అయిదవ చిత్రం తెరకెక్కుతుంది.బాండ్ చిత్రాలను చేయడం అంటే అంత ఆశామాషీ కాదు. కోట్ల పారితోషికం వస్తున్నా - కోట్లాది మంది అభిమానం పొందే అవకాశం ఉన్నా కూడా అంతకంటే ఎక్కువ కష్టం ఉంటుందని డేనియల్ క్రెయిగ్ చెబుతూ ఉంటాడు. అందుకే బాండ్ గా నాలుగు చిత్రాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇకపై బాండ్ పాత్రను పోషించలేను అంటూ తేల్చి చెప్పాడు. కాని నిర్మాతలు మాత్రం ఆయనకు భారీ పారితోషికంను ఆఫర్ చేయడంతో పాటు - బలవంతం చేయడం వల్లే తాజా చిత్రానికి కమిట్ అవ్వడం జరిగింది. ఈ చిత్రం తర్వాత ఖచ్చితంగా డేనియల్ మరో బాండ్ చిత్రాన్ని చేసే పరిస్థితి లేదు. అందుకే కొత్త బాండ్ ను వెదికే పనిలో ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధులు ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటి వరకు బాండ్ పాత్రలను శ్వేతజాతీయులు మాత్రమే పోషించడం జరిగింది. మొదటి సారి నల్లజాతీయుడితో బాండ్ పాత్రను పోషించాలనే నిర్ణయానికి నిర్మాణ సంస్థ వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. హాలీవుడ్ సినిమాలకు అత్యధికంగా ప్రేక్షకులు శ్వేతజాతీయులు - బాండ్ సినిమాలను వారు మాత్రమే ఎక్కువ ఆధరిస్తారు. ఇలాంటి నేపథ్యంలో బాండ్ పాత్రకు నల్ల జాతీయుడిని ఎంపిక చేయడం చాలా పెద్ద సాహసం నిర్ణయంగా హాలీవుడ్ ప్రముఖులు చెబుతున్నారు. గతంలో - ప్రస్తుతం హాలీవుడ్ లో పలువురు నల్ల జాతీయులు హీరోలు అయ్యారు. కాని బాండ్ పాత్రకు నల్ల జాతీయుడిని హాలీవుడ్ ప్రేక్షకులు స్వీకరిస్తారా అనేది అనుమానమే. త్వరలోనే కొత్త బాండ్ ను ప్రకటించడంతో పాటు, కొత్త జేమ్స్ బాండ్ సినిమా మొదలు పెట్టే అవకాశాలున్నాయంటున్నారు. |
https://www.tupaki.com//entertainment/article/niharika-konidela-insta-post/322615 | సోషల్ మీడియా యుగంలో రూమర్లు చాలా సులువుగా వైరల్ అయిపోతున్నాయి. ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేసేయడంతో తీవ్రంగా హర్ట్ అయిపోతున్నారు కొందరు. నిజం ఏమిటో అబద్ధం ఏమిటో తెలియని కన్ఫ్యూజన్ ని సృష్టిస్తున్నారు. ఇదే తీరుగా ఇటీవలి కాలంలో మెగా ప్రిన్సెస్ నిహారిక- చైతన్య దంపతుల పైనా రకరకాల రూమర్లు సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఈ రూమర్లకు చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.కొణిదెల నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను తాత్కాలికంగా మూసివేసిందనే వార్త మీడియా సర్కిల్ లలో ప్రధానంగా వైరల్ అయ్యింది. తన వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారనేది ఈ పుకారు సారాంశం. ఇది నిజమా అబద్ధమా? అన్నదానికి సరైన క్లారిటీ లేదు. వాస్తవం ఏమిటో ఎవరికీ తెలియదు. ఆమె వ్యక్తిగత పోస్ట్ లు భర్త జెవి చైతన్య పోస్ట్ లు ఏమైనా ఉంటే ప్రతిదీ సాధారణమైనదిగా అనిపించినా ఇప్పటికీ ఈ పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.అయితే ఇలాంటి అవాస్తవాలను కొట్టి పారేసేందుకు ఆ ఇద్దరిలో ఎవరూ ఆసక్తిని కనబరచకపోవడంతో ఇవి మరింతగా వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు అక్కినేని ఇంటిపేరును తొలగించి సమంత తన ప్రొఫైల్ పేరును మార్చినప్పుడు, #ChaySam గురించిన పుకార్లన్నీ సంచలనాలుగా మారాయి. ఆ తరువాత అవన్నీ నిజమయ్యాయి. చాలా మంది ఇతర నటులు నటీమణుల విషయంలో కూడా అదే జరగడం షాక్ కి గురి చేసింది. సెలబ్స్ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో దానికి ముందస్తుగా సోషల్ మీడియాలో ప్రవర్తన ఉంటుంది.కానీ గాసిప్స్ కి చెక్ పెట్టేందుకు నిహారిక తన భర్త జేవీ చైతన్యతో కలిసి ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేసారు. సోషల్ మీడియా విషాన్ని తగ్గించేందుకు ఈ ప్రయత్నం అని భావించవచ్చు. ఇప్పుడు క్లారిటీ ఇచ్చినందున రూమర్స్ కి చెక్ పెట్టినట్టేనని భావించాలి. ఇక నిహారిక పెళ్లి తరవాతా నిటిస్తుందని భావించినా కానీ విరామం తీసుకున్నట్టే కనిపిస్తోంది. దానిపైనా రూమర్లకు చెక్ పెడుతూ నిహారిక వివరణ ఇస్తారేమో చూడాలి.నటిగా యాంకర్ గా నిర్మాతగా ఆల్ రౌండర్ నైపుణ్యం కలిగిన ప్రతిభావని కెరీర్ పరంగా వెనకబడిపోవడం తన అభిమానులకు నచ్చదు. అందుకే తను వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. |
https://www.tupaki.com//entertainment/article/over-to-tollywood-are-those-sambar-stories-not-at-all/326731 | తెలుగు చిత్ర సీమను చూసి నేర్చుకోవాలని భారతీయ సినీ దిగ్గజాలుగా పేరొందిన చాలా మంది అంటున్నారు. ప్రస్తుతం నెలకొని ఉన్న మూవీ ట్రెండ్ ను తమదైన రీతిలో నిర్వచిస్తున్నారు. విశ్లేషిస్తున్నారు కూడా ! అసలు సిసలు వ్యాపార సూత్రాలు లేదా పాఠాలు అన్నవి ఇక్కడి నుంచే పుట్టుకు వస్తున్నాయి అని, అవి యావత్ ప్రపంచ సినిమా వ్యాపారాన్నే శాసిస్తున్నాయని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఆ విధంగా మన సినిమా ఇప్పుడు రిఫరెన్స్ కోడ్ అయింది.కోలీవుడ్ కు కూడా ఇదే ల్యాండ్ మార్క్ కానుంది. తమిళ తంబీలు మన నుంచి నేర్చుకోవాలని తపిస్తున్నారు.ఒకప్పటి తమిళ సినిమాకూ, ఇవాళ్టి తమిళ సినిమాకూ ఎంతో తేడా ఉందని భారతీ రాజా లాంటి దిగ్గజ దర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి తమిళ సినిమా తీరు బాలేదన్న అసంతృప్తి కూడా వేదికలపై బాహాటంగానే వెల్లడి చేస్తూ, మన తెలుగు సినిమాలను ఉదాహరణగా చూపిస్తూ ఇక్కడి నుంచి నేర్చుకోండి అని దిశను నిర్దేశం చేస్తుండడం గర్వించదగ్గ పరిణామం.ముఖ్యంగా ఇటీవల విడుదలయిన ట్రిపుల్ ఆర్ కానీ అంతకుమునుపు విడుదలయి సంచలనాలను నమోదు చేసిన పుష్ప కానీ సీజన్ తో సంబంధం లేకుండా విజయాలు నమోదు చేసిన చిత్రాలే ! కథా పరంగా కథన పరంగా కొన్ని తప్పిదాలు ఉన్నా కూడా ప్రమోషన్ యాక్టివిటీస్ పరంగా కానీ లేదా కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో కానీ మన మేకింగ్ టాలెంట్ ను చూసి అబ్బురపడుతున్నారు పొరుగున ఉన్న తమిళ తంబీలు.ఇటీవలే అక్కడ ఓ టాక్ నడుస్తోంది కూడా ! నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించి తీసే సినిమాకు సంబంధించి కథ పరంగా మనం వెచ్చిస్తుంది ఎంత పది కోట్లు కూడా కాదు అని, దీనిపై పునరాలోచించుకుని నాణ్యమైన సినిమాల రూపకల్పనకు అంతా ఏకతాటిపై నిలిచి కృషి చేయాలని ఇటీవల అక్కడి సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖుడు కామెంట్లు చేశారు. వీటిని సైతం భారతీ రాజా సమర్థించారు. అదే క్రమంలో తమిళ సినిమాలో వైవిధ్యం లోపిస్తుందని కూడా అన్నారు. ఒకనాటి బాలీవుడ్ ను ఊపేసిన మాస్ ట్రెండ్స్ ను ఇప్పుడు టాలీవుడ్ మళ్లీ, మళ్లీ తెరపైకి తెస్తూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోందని ఇతర భాషలకు చెందిన సినీ ప్రముఖులు కూడా మన దర్శకులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇక్కడి వారి ప్రతిభను ఎంతగానో మెచ్చుకుంటున్నారు. |
https://www.tupaki.com//entertainment/article/whistle-trailer-talk/226342 | తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'బిగిల్'. ఈ సినిమాను తెలుగులో 'విజిల్' అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను 'విజిల్' టీమ్ విడుదల చేసింది. ఈ సినిమాలో విజయ్ తండ్రికొడుకులుగా డబల్ రోల్ లో నటించినా మూడు విభిన్న పార్శ్వాలు ఉండే పాత్రలో నటించాడు. రాయప్పగా వయసుమళ్ళిన పాత్రలోనూ.. మైఖేల్/బిగిల్ గా మరో పాత్రలోనూ కనిపించాడు. మైఖేల్ ఒక రౌడీ కాగా.. బిగిల్ టాప్ క్లాస్ ఫుట్ బాల్ ప్లేయర్. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ ప్రారంభం నుంచే ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉంది. గ్రౌండ్ లో ఫుట్ బాల్ టీమ్ కోచ్ బిగిల్ కు వుమన్ ప్లేయర్స్ అందరూ వరసగా గుడ్ మార్నింగ్ చెప్తుంటారు. ఒక అమ్మాయి మాత్రం ఏదో పరధ్యానంగా ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా.. వినిపించకుండా 'గుడ్ మార్నింగ్ కోచ్' అంటుంది. ఒకరకమైన కేర్ లెస్ యాటిట్యూడ్ తో 'గట్టిగా' అంటాడు విజయ్. కొంచెం పెద్దగా 'గుడ్ మార్నింగ్ కోచ్' అంటుంది ఆ ప్లేయర్. మరోసారి 'గట్టిగా' అని రెట్టిస్తాడు. ఇంకొంచెం పెద్ద గొంతుకతో 'గుడ్ మార్నింగ్ కోచ్' అంటుంది. అయినా 'వినపడేలా' అంటాడు. ఈసారి స్టేడియం మొత్తం ప్రతిధ్వనించేలా 'గుడ్ మార్నింగ్ కోచ్' అంటుంది. మాస్ కు కిక్కిచ్చే ఇలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి.ఇక ట్రైలర్ లో విజయ్ యాటిట్యూడ్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. రాయప్ప పాత్రలో విజయ్ గోధుమ రంగు లుంగీని పైకి కట్టుకుంటూ నడిచే తీరు.. ఆ సమయంలోరెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్. ట్రైలర్ లో ఎక్కువగా ఇంప్రెస్ చేసే మరో అంశం ఫుట్ బాల్ ను నైపుణ్యంతో విజయ్ హ్యాండిల్ చేసే తీరు. ఓవరాల్ గా చూస్తే ఈ మాస్ మసాలా లాగా కనిపిస్తోంది. లాజిక్కులు అన్నీ వదిలేసి చూడాల్సిన మాస్ ఎంటర్టైనర్. విజయ్ సినిమా కాబట్టి రిచ్ ఫీల్ ఉంది. బ్యాక్ రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రఫీ బాగున్నాయి. తమిళ నేటివిటీని కాసేపు పక్కన పెట్టి చూడగలిగితే మాత్రం ఎంజాయ్ చేసేలా ఉంది. |
https://www.tupaki.com//entertainment/article/chiranjeevi-hints-about-ram-charan-and-upasana-kids/157765 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కామినేని వారింటి అమ్మాయి ఉపాసనలకు పెళ్లయి దాదాపు 5 ఏళ్లు కావస్తోంది. 2012 జూన్ 14న చరణ్- ఉపాసనల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటికీ ఒకరినొకు సోషల్ మీడియాలో పొగుడుకోవడం.. తమ ఆప్యాయతను.. క్రమశిక్షణను తెలియచేయడం తప్ప అసలు సంగతిని మాత్రం ఇప్పటివరకూ చెప్పలేదు ఈ జంట.మెగాస్టార్ చిరంజీవికి తనయుడుగా రామ్ చరణ్ మీద మెగా ఫ్యాన్స్ కు ఎంతటి ప్రేమ ఉందో.. రామ్ చరణ్ కు పుట్టబోయే సంతానంపై కూడా అంతే ఉత్సాహం ఉంది. అయితే.. చెర్రీ మాత్రం ఆ సంగతి చెప్పడం లేదు. రీసెంట్ గా చిరంజీవికి ఇదే విషయంపై ప్రశ్న ఎదురైంది. తాత అని ఎప్పుడు పిలిపించుకుంటున్నారు అంటూ 61 సంవత్సరాల చిరంజీవిని అడిగితే.. ఆయన సింపుల్ గా 'ఇప్పటికే ముగ్గురితో పిలిపించుకుంటున్నాగా' అంటూ నవ్వుతూ సమాధానం దాటేసేందుకు ప్రయత్నించారు. అంటే తన కూతుళ్ల పిల్లలతో తాతా అని పిలిపించుకుంటున్నారు కదా.. ఆ విషయాన్నే ఇలా చెప్పారన్న మాట.దీంతో రామ్ చరణ్ వారసుడి సంగతేంటి అంటూ నేరుగానే ప్రశ్నించాల్సి వచ్చింది. 'అది రామ్ చరణ్ ప్లాన్ చేసుకుని డిసైడ్ చేసుకోవాలి. అయినా త్వరలోనే ఆ ముచ్చటా తీరిపోతుందిలే' అంటూ ఓ చిన్న హింట్ ఇచ్చి ఊరించారు చిరంజీవి <|hyperlink|> /Tupakidotcom/ |
https://www.tupaki.com//entertainment/article/ishq-movie-trailer/285815 | యువ కథానాయకుడు తేజ సజ్జా - ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''ఇష్క్''. 'నాట్ ఎ లవ్స్టోరీ' అనేది దీనికి ఉపశీర్షిక. యస్.యస్.రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సౌత్ ఇండియాలోని బడా బ్యానర్లలో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొంత విరామం తర్వాత తెలుగులో నిర్మిస్తున్న సినిమా ఇది. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్ - పారస్ జైన్ - వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'ఇష్క్' ట్రైలర్ ను సుప్రీమ్ హీరో సాయి తేజ్ రిలీజ్ చేశారు.'ఇష్క్' ట్రైలర్ హీరోహీరోయిన్ల మధ్య మనోహరమైన ప్రేమకథను చెప్పే ఆహ్లాదకరమైన చిత్రమని చెప్పే విధంగా ప్రారంభమవుతుంది. హీరోయిన్ బర్త్ డే ప్లాన్స్ చేసుకున్న హీరో.. ఆమెతో కలిసి కారులో బయలు దేరడం.. ఒక ముద్దిస్తావా అని అడగడం వంటివి రొమాంటిక్ ఫీల్ ని కలిగించాయి. అయితే ఒక్క ఇన్సిడెంట్ తో అన్ని విషయాలు తలక్రిందులైనట్లుగా.. సడన్ గా హీరోని ఎవరో తరుముతున్నట్లుగా చూపించారు. తేజాను వెంబడిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? దీనికి అసలు కారణమేమిటి? అతన్ని ఎలా కనుగొంటాడు? ఈ క్రమంలో హీరోకి ఎదురయ్యే సమస్యలేమిటి? అనేది ఈ కథలో చూపించబోతున్నట్లు అర్థం అవుతోంది. మొత్తం మీద ట్యాగ్ లైన్ సూచించినట్లు ఇది ప్రేమ కథ మాత్రమే కాదని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.తేజా - ప్రియా ప్రకాష్ వారియర్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలానే వీరిద్దరూ తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సరిపోయారనిపిస్తుంది. ఈ ట్రైలర్ కు మహతి స్వరసాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు శ్యామ్ కె. నాయుడు కెమెరా పనితనం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ గా సాగిన 'ఇష్క్' ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి వరప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తుండగా.. విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇటీవల 'జాంబీ రెడ్డి' మూవీతో సక్సెస్ అందుకున్న తేజ సజ్జా.. ''ఇష్క్'' సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి. |
https://www.tupaki.com//entertainment/vijay-thalapathy-goat-movie-1383435 | దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ ది గోట్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. విజయ్ సినిమా కోలీవుడ్ లో ఎలా ఉన్నా ఆడేస్తుంది. గోట్ సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ సూపర్ అనేస్తున్నారు. కానీ అక్కడ తప్ప మిగతా ఏ భాషలోనూ సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన విజయ్ గోట్ సినిమాకు అంత గొప్ప టాక్ రాలేదు.
ఐతే ఈ సినిమాలో విజయ్ వెరైటీగా కొంతమంది స్టార్ హీరోల రిఫరెన్స్ లు తీసుకోవడం సర్ ప్రైజ్ చేసింది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఐకానిక్ ఫోజు, సూపర్ స్టార్ రజినీకాంత్ పడైయప్పలో మ్యూజిక్ తో పాటుగా మహేష్ ఒక్కడు సినిమా తరహాలో యోగి బాబు పాత్ర ఇలా అన్ని కావాలని పెట్టారు. ఇక విజయ్ గిల్లి సినిమాలో త్రిష తో వేసిన స్టెప్పులను మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రిపీట్ చేశారు. ఐతే ఇవన్నీ దళపతి ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించినా కామన్ ఆడియన్స్ కు మాత్రం అంతగా ఎక్కలేదు.
ఫలితంగా తమిళంలో అది కూడా దళపతి ఫ్యాన్స్ గోట్ చూసి ఆహా ఓహో అనేస్తున్నా అసలు టాక్ మాత్రం అంతగా బాగాలేదు. సినిమాకు రన్ టైం ఒక మైనస్ కాగా ఫస్ట్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపించి సెకండ్ హాఫ్ మీద ఎక్కువ భారం పడగా సెకండ్ హాఫ్ అంచనాలను అందుకోకపోవడంతో సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ఐతే దళపతి విజయ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ తో ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయని తెలుస్తుంది.
విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటున్న గోట్ సినిమా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చినా కామన్ ఆడియన్స్ మాత్రం సంతృప్తి చెందలేదు. ఐతే నిజంగానే దళపతి విజయ్ పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెబుతారా లేదా టైం చూసుకుని కొనసాగిస్తారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఈమధ్యనే తన పార్టీ ని అనౌన్స్ చేసి రాజాకీయాళ్లోకి వస్తున్నానని ప్రకటించిన విజయ్ ఇక నుంచి తాను ఒక యాక్టర్ మాత్రమే కాదు పొలిటీషియన్ గా కూడా రియల్ హీరో అనిపించుకోవాలని ఫిక్స్ అయ్యారు. |
https://www.tupaki.com//entertainment/article/star-hero-double-dhamaka-with-back-to-back-releases/275971 | ధనుష్ నటించిన ‘జగామే తంతిరమ్’ (జగమే తంత్రం) OTT విడుదల తేదీపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుండగా.. అధికారిక విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.సంక్రాంతి బరిలో ‘మాస్టర్’ .. ‘క్రాక్’ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. ఈ బ్లాక్ బస్టర్లు రెండూ OTT విడుదలను త్వరగా కుదిరింది. ఇది నిర్ణయాత్మక చర్య. ‘మాస్టర్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై OTT లోనూ విజయాన్ని రుచి చూస్తోంది. ‘క్రాక్’ 2021 ఫిబ్రవరి 5 న ఆహా వీడియోలో విడుదలవుతుంది. అయితే జగమే తంతిరం పూర్తిగా ఓటీటీ రిలీజ్ నే దృష్టిలో ఉంచుకోవడం చర్చనీయాంశమైంది.ఈ చిత్రంలో ధనుష్ ఆసక్తికరమైన పాత్రలో నటించగా.. ఐశ్వర్య లెక్ష్మి .... హాలీవుడ్ నటుడు జేమ్స్ కాస్మో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జగమే తంతిరంను వై నాట్ ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేయనుంది. ఇది నిజానికి దీపావళి 2020 కి విడుదల కావాల్సి ఉన్నా కోవిడ్ -19 మహమ్మారి వల్ల వాయిదా పడింది.ఆ క్రమంలోనే ప్రత్యక్ష OTT విడుదలకు నిర్ణయించుకున్నారు. తాజా నివేదికల ప్రకారం... అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘మాస్టర్’ విజయాన్ని చూసిన తర్వాత నెట్ ఫ్లిక్స్ మరింత ముందుగా విడుదల చేసే యోచనలో ఉందిట. జగమే తంతిరం నెట్ ఫ్లిక్స్లో విడుదల కానుండగా.. ధనుష్ తదుపరి చిత్రం ‘కర్ణన్’ ఏప్రిల్ 2021 లో థియేట్రికల్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. |
https://www.tupaki.com//entertainment/article/aha-changed-naveen-movie-name-as-bhanumathi-and-ramakrishna/251910 | నవీన్ చంద్ర.. సలోని లుథ్ర జంటగా తెరకెక్కిన ‘భానుమతి రామకృష్ణ’ చిత్రం డిజిటల్ లో విడుదల అయ్యేందుకు సిద్దం అయ్యింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా ద్వారా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సిద్దం అయ్యారు. విడుదల ముంగిట ఉన్న సమయంలో కోర్టు చిత్ర యూనిట్ సభ్యులకు షాక్ ఇచ్చింది. సీనియర్ హీరోయిన్ భానుమతి రామకృష్ణ తనయుడు చెన్నై హైకోర్టులో తన తల్లి పేరుతో సినిమాను తెరకెక్కించారు అందుకు మా అనుమతి తీసుకోలేదు అంటూ పిటీషన్ వేయడం జరిగింది.నిర్మాతలకు కోర్టు నోటీసులు ఇచ్చింది. సినిమా టైటిల్ మార్చాల్సిందే అంటూ కోర్టు సూచించడంతో నిర్మాతలు టైటిల్ మార్చారు. భానుమతి రామకృష్ణ అంటూ ఉన్న టైటిల్ ను భానుమతి అండ్ రామకృష్ణ గా మార్చారు. కేవలం అండ్ ఒక్కటి జత చేసి కొత్త పోస్టర్స్ ను విడుదల చేశారు. కనుక కోర్టు నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి. సినిమా థియేటర్లలో విడుదల కాదు కనుక అనుకున్న సమయంకు విడుదల అవుతుందా లేదా అనే సందేహం లేదు. ఆహాలో అనుకున్న సమయంకు అంటే రేపటి నుండి భానుమతి అండ్ రామకృష్ణ స్ట్రీమింగ్ అవ్వబోతుంది. |
https://www.tupaki.com//entertainment/article/katrina-kaif-plays-a-parsi-girl-for-the-first-time-in-phantom/110740 | సైఫ్ అలీఖాన్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఫాంటమ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కత్రిన గెటప్స్ ఇప్పటికే డిష్కసన్ పాయింట్ అయ్యాయి. డీగ్లామరస్ రోల్ లో కనిపిస్తోంది క్యాట్. అయితే ఈ లుక్ మీనింగ్ ఏంటి? అన్న క్యూరియాసిటీ అభిమానుల్లో అంతకంతకు పెరుగుతోంది. అందుకే ఈ డీటెయిల్స్... దర్శకుడు కాకముందు కబీర్ ఖాన్ డాక్యుమెంటరీ ఫిలింమేకర్ గా బోలెడన్ని దేశాలు తిరిగాడు. ఆఫ్ఘనిస్తాన్, బోస్నియా, ఇస్రాయేల్ తదితర చోట్ల తిరిగాడు. అక్కడ పలు రకాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను దగ్గరగా చూశాడు. వీళ్లంతా లోకల్ గయ్స్ నే రహస్యంగా రిక్రూట్ చేసుకుని, స్లీపర్ సెల్స్ తరహాలోనే తమ ఆపరేషన్ కి ఉపయోగించుకునేవారు. ఇప్పుడు అదే తరహాలో ఫాంటమ్ సినిమాలో కథానాయిక రోల్ ఉంటుంది.కత్రిన ఓ పార్సీ ఇండియన్ గాళ్ గా కనిపించబోతోంది. చూడటానికి సాదాసీదాగానే కనిపిస్తుంది. కానీ అంతర్జాతీయ నేరగాళ్లను వలవేసి పట్టుకునే అత్యంత ట్యాలెంటెడ్ గాళ్ గా కత్రినని తెరపై చూపించబోతున్నాడు. 26/11 ముంబై దాడుల నేపథ్యంలో ఆసక్తి రేకెత్తించే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కత్రిన నటన హైలైట్ గా ఉంటుందని చెబుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా క్యాట్ అలానే ఎందుకు కనిపిస్తోందో? |
https://www.tupaki.com//entertainment/article/akhil-praises-chiranjeevi-at-siima-2016/133308 | మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ప్రారంభమైపోయింది. మెగా ఫ్యాన్స్ మంచి హుషారుగా ఉన్నారు. చిరును మళ్లీ స్క్రీన్ పై చూడబోతున్నామన్న ఎగ్జైట్మెంట్ అభిమానుల్లో కనిపిస్తూనే ఉంది. సినీ మా అవార్డ్ ఫంక్షన్ లో డ్యాన్స్ తో కుమ్మేసిన చిరింజీవి.. 150వ సినిమా షూటింగ్ ప్రారంభం రోజున లుక్స్ తో ఇరగదీసేశారు. 20 ఏళ్ల క్రితం ఎలా ఉండేవారో.. చిరు ఎలా కనిపించారో.. ఇప్పుడు కూడా అదే టైపులో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు మెగాస్టార్.చిరంజీవి రీఎంట్రీ ఇవ్వడం కచ్చితంగా అభిమానులకు జోష్ నిచ్చే విషయమే. అలాగే మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆనందించడంలో పెద్ద విశేషం ఏమీ ఉండదు. మరి ఇండస్ట్రీ జనాలు ఏమనుకుంటున్నారు? టాలీవుడ్ జనాల ఆలోచనలు ఎలా ఉన్నాయి? పాత తరం హీరోలు సంగతి తెలిసిందే కాబట్టి.. న్యూ జనరేషన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఇలాంటి వన్నీ ఇప్పటివరకూ ప్రశ్నలే కానీ.. ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసింది. ఆ జవాబు ఇచ్చింది ఎవరో కాదు.. అక్కినేని వంశానికి నవతరం వారసుడు అక్కినేని అఖిల్. 'మెగాస్టార్ ఈజ్ బ్యాక్.. అందుకే నేను ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు కంగ్రాట్స్ చెబుతున్నా' అంటూ అఖిల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మెగాస్టార్ రీఎంట్రీపై ఎంతగా బజ్ ఉందో తెలిపేందుకు.. అఖిల్ లాంటి లేటెస్ట్ జనరేషన్ హీరో నుంచి ఈ ఒక్క మాట చాలేమో కదా. సైమా 2016 అవార్డుల కార్యక్రమంలో సింగపూర్ లో 'బెస్ట్ డెబ్యూ' అవార్డును అందుకున్న అఖిల్ ఈ కామెంట్ చేశాడు. |
https://www.tupaki.com//entertainment/article/kanika-kapoor-tests-positive-for-coronavirus-fourth-time/242137 | కరోనా వైరస్ ప్రపంచాన్నంతా వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ప్రపంచంలో వేలాదిమంది మరణించారు. ఇక దీని బారిన పడి చికిత్స పొందుతున్న వారు లక్షల్లో ఉన్నాయి. వారిలో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కూడా ఇటీవల కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. లండన్ నుంచి వచ్చిన ఆమె ఎయిర్ పోర్ట్ లో తన ట్రావెల్ హిస్టరీ దాచిపెట్టి ఫ్యామిలీ పార్టీకి హాజరై అందరిలో కలవరం రేపింది. దీంతో ఆమెను లక్నో నగరంలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కనికాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆమెతో పార్టీకి హాజరైన వారంతా ఇప్పుడు ఐసోలేషన్లో ఉన్నారు. వారిలో కొంతమంది టెస్టులో నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. అయితే కనికా కపూర్కు ఇప్పటికే మూడు సార్లు కరోనా వైరస్ టెస్టులో పాజిటివ్ రాగా, ఇప్పుడు నాలుగోసారి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 'కనికా 10 రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నప్పటికీ కరోనా బారి నుంచి బయటపడడం లేదు. దీనిని బట్టీ ట్రీట్మెంట్కు కనికా స్పందించడంలేదని అర్థమవుతోంది. ప్రస్తుతం లాక్డౌన్ నడుస్తుండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను విదేశాలు కూడా తీసుకెళ్లలేం. ఆమె కోలుకోవాలని దేవుడిని ప్రార్థించడం తప్ప ఇంకేమీ చేయలేం’ అని కనికా కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. మరోవైపు కనికా పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పాపం.. కనికాను కరోనా వదలడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. |
https://www.tupaki.com//entertainment/article/the-dance-master-did-not-touch-the-lady-judge-like-that/262777 | ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ టెరెన్స్ లూయిస్ పై చెలరేగిన వివాదంపై ఆయన క్లారిటీ ఇచ్చాడు. సోనీ చానెల్ లో ప్రసారమవుతున్న ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్’ షోకు న్యాయ నిర్ణేతగా ప్రముఖ కొరియో గ్రాఫర్స్ టెరెన్స్ లూయిస్, గీతాకపూర్, నటి మలైకా అరోరా వ్యవహరిస్తున్నారు.కాగా ఇటీవల ఇందులో జడ్జిగా వ్యవహరిస్తున్న నటి మలైక కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో ప్రముఖ్య డ్యాన్స్ మాస్టర్ నోరా ఫతేహి న్యాయమూర్తిగా ఎంట్రీ ఇచ్చింది.ఈ క్రమంలోనే కొరియోగ్రాఫర్ టెరెన్స్, డ్యాన్సర్ నోరాతో అనుచితంగా ప్రవర్తించాడని వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి స్టేజ్ పై డ్యాన్స్ చేస్తుండగా నోరాను అభ్యంతరకరంగా తాకినట్లు ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.తాజాగా ఈ వీడియోపై టెరెన్స్ లూయిస్ స్పందించాడు. అది అసలైన వీడియో కాదని.. మార్ఫింగ్ చేశారని.. నోరాపై తనకు చాలా గౌరవం ఉందని పేర్కొన్నాడు. ఒకవేళ ఈ క్లిప్ వాస్తవమైతే నోరా ఎందుకు స్పందించకుండా ఉంటుందని తెలిపాడు. ఆడవాళ్లపై తనకు అమిత గౌరవం ఉందని.. ఇలాంటి చెడు పనులు జీవితంలో చేయనని పేర్కొన్నాడు. |
https://www.tupaki.com//entertainment/article/successful-directors-in-2015/119717 | ఎప్పటికప్పుడు పరిశ్రమలోకి కొత్త రక్తం వస్తూనే ఉంది. ప్రతి యేడాది లానే 2015లో కూడా చాలా మంది యువ దర్శకులు పరిచయం అయ్యారు. అలా వచ్చిన ఓ డజను డైరెక్టర్లలో ఎవరు విజయం సాధించారు? ఎవరి స్టాటస్ ఏంటి? అన్నదే ఈ రివ్యూ.ఏడాది ఆరంభమే పటాస్ మూవీతో హిట్ కొట్టాడు అనీల్ రావిపూడి. రచయితగా కెరీర్ ప్రారంభించి కళ్యాణ్ రామ్ అవకాశం ఇవ్వడంతో దర్శకుడయ్యాడు. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి దిల్ రాజు సంస్థలో ఛాన్స్ అందుకున్నాడు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక గోపిచంద్ హీరోగా జిల్ సినిమాతో హిట్ కొట్టాడు రాధాకృష్ణ. విషయం ఉన్న దర్శకుడిగా టాలీవుడ్ సర్కిల్ష్ లో పాపులర్ అయ్యాడు. అలాగే నాని హీరోగా కంబ్యాక్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రానికి దర్శకత్వం వహించాడు నాగ్ అశ్విన్. ఆ సినిమా సెట్స్ లోనే నిర్మాత ప్రియాంక దత్ ని ప్రేమించి ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నారా రోహిత్ హీరోగా కృష్ణ విజయ్ అసుర చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. పోలీస్ కథే అయినా కిక్కిచ్చేలా తీశాడన్న పేరొచ్చింది.ఇక నిఖిల్ హీరోగా సూర్య వర్సెస్ సూర్య లాంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన దర్శకుడిగా కార్తీక్ కి చక్కని గుర్తింపు వచ్చింది. అలాగే కమల్హాసన్ చీకటి రాజ్యం మూవీతో మంచి విజయం అందుకున్నాడు రాజేష్ .ఎం. సెల్వ. అలాగే ఏడాది చివరిలో తను నేను అనే సినిమాతో దర్శకుడిగా మారిన నిర్మాత రామ్మోహన్ తొలి ప్రయత్నం తోనే ఆకట్టుకున్నారు. అభిరుచి ఉన్న సినిమా తీశారని మెప్పు పొందారు. లయన్ సినిమాతో సత్యదేవా - కొరియర్ బోయ్ కళ్యాణ్ సినిమాతో ప్రేమ్ సాయి - శివమ్ సినిమాతో శ్రీనివాస్ రెడ్డి - శంకరాభరణం సినిమాతో ఉదయ్ నందవనం దర్శకులుగా పరిచయం అయ్యారు. కానీ ఈ సినిమాలేవీ విజయం సాధించకపోవడంతో ఐడెంటిటీ కోల్పోవాల్సొచ్చింది. ప్రస్తుతం వీళ్లంతా రెండో సినిమా కోసం ఎటెంప్ట్ చేస్తూనే ఉన్నారు. హిట్టొచ్చినవాళ్లకు వెంటనే అవకాశాలిచ్చే పరిశ్రమలో కాస్త కష్టమే అయినా ప్రయత్నించి రెండో ప్రయత్నంలో అయినా గెలుపు సాధించాలని ఆశిద్దాం. |
https://www.tupaki.com//entertainment/article/does-acharya-seem-to-be-fixed-for-that-date/305589 | మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల కాంబోలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేయాలనుకున్న ఆచార్య కు కరోనా సెండ్ వేవ్ అడ్డు వచ్చింది. షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్దం చేసిన ఈ సమయంలో మాత్రం ఇతర సినిమాలు పోటీగా వస్తూ విడుదల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఆచార్య సినిమా ను డిసెంబర్ 17న విడుదల చేయాలనే బలమైన నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని అదే సమయంలో విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాల పరిస్థితి ఏంటీ అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆచార్యను విడుదల చేస్తే డిసెంబర్ 17న విడుదల చేయాలి. లేదంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు వెయిట్ చేయాలి అనేది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ.డిసెంబర్ 17న విడుదల చేయాలనే విషయంలో దర్శకుడు కొరటాల శివ చాలా సీరియస్ గా ఉన్నాడు అంటున్నారు. ఆయన ఖచ్చితంగా సినిమా ఆ తేదీకి విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నా కూడా నిర్మాతలు మరియు ఇతర విషయాలు మాత్రం ఆ తేదీ విడుదలకు కాస్త కష్టం అన్నట్లుగా ఉన్నాయట. చిరంజీవి తల్చుకుంటే ఆ తేదీన అంతా క్లీయర్ చేయడం పెద్ద సమస్య కాదని.. ఇప్పటికే ఆలస్యం అయిన ఆచార్యను వెంటనే విడుదల చేయాలని కొరటాల కోరుకుంటున్నాడు. చిరంజీవితో పాటు ఇతర మెగా హీరోలతో ఆచార్య విడుదల విషయంలో కొరటాల శివ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఆచార్య విడుదల విషయంలో కనుక డిసెంబర్ నిర్ణయం తీసుకోకుంటే కొరటాల తదుపరి సినిమా విషయంపై ఆ ప్రభావం పడుతుందని అంటున్నారు.ఆచార్య సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ నటించగా కాజల్ తో పాటు పూజా హెగ్డే కూడా హీరోయిన్ గా నటించారు. మొత్తానికి ఈ సినిమా అంచనాలు పీక్స్ లో ఉండగా విడుదల విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భారీ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం ఉన్న ఈ సినిమాను ఖచ్చితంగా ఆలస్యం అయినా పర్వాలేదు కాని మంచి సమయం చూసి విడుదల చేయాల్సి ఉంటుంది. కనుక ఆచార్య విడుదల తేదీ విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరించాలి అనేది మెగా కాంపౌండ్ అభిప్రాయం. నిర్మాతలు కూడా విడుదల విషయంలో మెగా స్టార్ నిర్ణయాన్ని గౌరవించాలని భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదిలోనే విడుదల అవుతాడు. కాస్త అటు ఇటు ఏమైనా అయితే మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు. |
https://www.tupaki.com//entertainment/prabhudevaandkajolreunion-1363261 | సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో హీరోయిన్స్ ఒకప్పుడు కంటిన్యూగా సినిమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ గత 20 ఏళ్ళ నుంచి ఆ తరహా కాంబినేషన్స్ కనిపించడం లేదు. ఇక కొన్నిసార్లు ఓకే సినిమాతో మెప్పించిన హీరో హీరోయిన్ మళ్ళీ కనిపిస్తే చూడాలని ఆడియెన్స్ కోరుకుంటూ ఉంటారు.
ఇక అలా కోరుకునే లిస్టులో మెరుపు కలలు జోడి టాప్ లిస్ట్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఆ సినిమాలో వెన్నెలవే.. పాటను ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. అలాంటి కాంబినేషన్ మళ్ళీ ఇన్నాళ్ళకు బిగ్ స్క్రీన్ పై సరికొత్తగా కనిపించబోతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి బాలీవుడ్లో తన ప్రతిభను చాటేందుకు సిద్దమయ్యాడు. తన కొత్త యాక్షన్ థ్రిల్లర్లో బాలీవుడ్ స్టార్లు కాజోల్, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
27 సంవత్సరాల క్రితం మెరుపు కలలు సినిమాలో కలిసి నటించిన ఈ జంట మళ్లీ తెరపై కనిపించనుంది. ఇక ఈ ప్రాజెక్టులో నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ వంటి ఇతర ప్రముఖ నటీనటులు కూడా ఉన్నారు. కాజోల్, ప్రభుదేవా కాంబినేషన్ ప్రేక్షకులకు మరింత ఉత్సాహం కలిగించనుంది. ఈ ప్రాజెక్టు తొలి షెడ్యూల్ పూర్తయి, త్వరలోనే టీజర్ విడుదల చేయనున్నారు.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్లో టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. జవాన్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పని చేసిన జికె విష్ణు, యానిమల్ మూవీకి సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్, పుష్ప చిత్రానికి ఎడిటర్గా పని చేసిన నవీన్ నూలి వంటి ప్రతిభావంతులు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. స్క్రీన్ ప్లే కోసం మై నేమ్ ఈజ్ ఖాన్, వేక్ అప్ సిద్ చిత్రాలతో క్రేజ్ అందుకున్న నిరంజన్ అయ్యంగార్, జెస్సికా ఖురానా పనిచేస్తున్నారు.
ప్రొడక్షన్ డిజైనర్గా సాహి సురేష్ వ్యవహరిస్తున్నారు. ఇక ప్రభుదేవా, కాజోల్ కలయికతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు మునుపెన్నడూ లేనివిధంగా వినోదాన్ని అందించనుంది. ప్యాన్ ఇండియా భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. మొత్తానికి, చరణ్ తేజ్ ఉప్పలపాటి బీటౌన్లో తన ప్రతిభను నిరూపించడానికి భారీ ప్రాజెక్టుతో ముందుకు రావడం నిజంగా ప్రత్యేకంగా ఉంది. తెరమీద కనిపించడం తగ్గించిన నసీరుద్దీన్ షా కూడా ఈ ప్రాజెక్టులో భాగమవడం కథకు బలమైన కంటెంట్ ఉన్నట్టు సూచిస్తుంది. |
https://www.tupaki.com//entertainment/article/simbhu-eswaran-release-date-fixed/272746 | లాక్ డౌన్ కారణంగా ఇన్నినెలలు సినిమా థియేటర్లు మూసేయడంతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ లేక ఓటిటిలకు అలవాటు పడ్డారు. కానీ సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని కూడా ఎదురు చూసారు. మొత్తానికి కోలీవుడ్ ఇండస్ట్రీలో సినీ యాక్టర్లకు, సినీ అభిమానులకు ఎంజాయ్ చేసే టైం వచ్చేసింది. ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం సినిమా థియేటర్లలో 100% సీటింగ్ అనుమతి కల్పించింది. అందుకే ఈ సంక్రాంతికి అక్కడ థియేటర్ల వద్ద పోరుకు సిద్ధం అవుతున్నాయి సినిమాలు. ఇళయదళపతి విజయ్ నటించిన 'మాస్టర్' రిలీజ్ అవుతుండగా.. ఏ సినిమా పోటీకి లేదని విజయ్ ఫ్యాన్స్ అంతా ఖుషి అయిపోయారు. కానీ నేనున్నా అంటూ తన సినిమాను పోటీకి దింపుతున్నాడు హీరో శింబు. శింబు తెలుగు వాళ్లకు కూడా సుపరిచితుడే.. కానీ అతని సినిమాలన్నీ ప్లాప్ అవుతుండటంతో తెలుగులో మార్కెట్ కోల్పోయాడని చెప్పాలి. అందుకే ఈ మధ్య తెలుగులోకి డబ్ చెయ్యట్లేదు.ఇక మాస్టర్ సినిమాతో పోటీ విషయానికి వస్తే.. సంక్రాంతికి కోలీవుడ్ రేసులో మాస్టర్ మాత్రమే ఉండటంతో అన్ని థియేటర్లలో అదొక్కటే నడుస్తుందని అనుకున్నారు. కానీ శింబు తను నటించిన ఈశ్వరన్ సినిమాను విడుదలకు సిద్ధం చేసాడు. మాస్టర్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారని తెలిసి మెల్లగా ప్రెస్ నోట్ వదిలాడు. 'మాస్టర్ సినిమాకి మా సినిమా పోటీ కాదు. విజయ్ నాకు మంచి బ్రదర్. అటు విజయ్ అన్న సినిమాను నా అభిమానులు చూడండి. నా సినిమాను విజయ్ అభిమానులు కూడా చూడండి. మొత్తానికి సినిమా ఇండస్ట్రీని కాపాడండి' అన్నట్లుగా రాసుకొచ్చాడు. అలాగే విజయ్ అభిమానులు అంటే నాకు కూడా ఇష్టమే. కానీ ఫ్యాన్స్ కోసం థియేటర్లో రిలీజ్ చేయాలనీ సినిమాను ఏడాది పాటు ఆపారు అది పెద్ద విషయం అంటూ విజయ్ ఫ్యాన్స్ కి ఐస్ వేసే ప్రయత్నం చేసాడు. కానీ మాస్టర్ ముందు ఈశ్వరన్ చతికిలపడటం ఖాయం అంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి మాస్టర్ కి ఈశ్వరన్ పోటీనా లేక సపరేటేనా అనేది. |
https://www.tupaki.com//entertainment/article/cherry-plan-with-new-talent-in-less-time/291452 | ప్రస్తుత లాక్ డౌన్ సన్నివేశం.. కరోనా మహమ్మారీ పర్యవసానం స్టార్ హీరోల ఆలోచనల్ని మార్చేస్తున్నట్టే కనిపిస్తోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయాలంటే అది ప్రమాదకరంగా కనిపిస్తోంది. భారీ బడ్జెట్లతో సాహసాలు ఈ సీజన్ లో పెను ముప్పుగా మారింది. పాన్ ఇండియా కేటగిరీ అంటే తెలుగు రాష్ట్రాలు సహా దేశ విదేశాల్లో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న సన్నివేశంలో అది సాధ్యమేనా? అన్నది పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది.కరోనా మహమ్మారీ పర్యవసానం ఇంకా ఎంత కాలం ఉంటుందో అర్థం కాని గందరగోళం నెలకొంది. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలు చిన్న బడ్జెట్ లో మంచి కథలను ఎంపిక చేసుకుని చిన్న స్థాయి దర్శకులు కొత్త వారితో ప్రయోగాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.రామ్ చరణ్ ఈ తరహా ఆలోచన చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అతడు ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత కంటెంట్ కి నటనకు ఆస్కారం ఉన్న చిన్న సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. క్రియేటివిటీకి పదును పెట్టే నవతరం దర్శకులకు ఇది మంచి అవకాశం గా మారనుంది. ఏదైనా స్క్రిప్ట్ డిసైడ్ చేస్తుంది. ఇది పరిమిత బడ్జెట్లో పూర్తయ్యి ఓటీటీ సహా ఇతర ప్రక్రియల ద్వారా మంచి మార్చెట్ చేసేదిగా గిట్టుబాటు అయ్యేదిగా ఉండాలనేది ప్లాన్. ఇది వర్కవుటైతే ఎంత పెద్ద భారీ చిత్రాలు చేసినా.. తక్కువ సమయంలో పూర్తయ్యే సినిమాల్ని మరోవైపు వేగంగా పూర్తి చేసేందుకు ఆస్కారం ఉంటుందనేది ఆలోచన.చరణ్ ఇటీవల కొంతమంది నవతరం దర్శకులను ఆహ్వానించారట. రోబో శంకర్ తో తన చిత్రం ఆలస్యం అయినట్లయితే అతను ఈ చిత్రాన్ని వెంటనే ప్రారంభిస్తారు. పరిమిత బడ్జెట్లో తక్కువ సమయంలో పూర్తయ్యేలా ఈ చిత్రం ఉంటుందట. అయితే జాక్ పాట్ కొట్టే ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఎవరు? అన్నది వేచి చూడాలి. |
https://www.tupaki.com//entertainment/article/bollywood-heros-south-directors/341352 | బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చేస్తున్న జవాన్ సినిమాకు సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తుండగా.. తమిళ దర్శకుడు శంకర్ త్వరలోనే హిందీలో అపరిచితుడు ను చేయబోతున్న విషయం తెల్సిందే.రణ్ వీర్ సింగ్ హీరోగా హిందీ అపరిచితుడు తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. సల్మాన్ ఖాన్ కూడా ఒక సౌత్ దర్శకుడితో సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.ఇక హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విక్రమ్ వేదా రీమేక్ కు కూడా దర్శకత్వం ను మన సౌత్ దర్శకులు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ స్టార్స్ మాత్రమే కాకుండా మరి కొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు.. అంతే కాకుండా సౌత్ దర్శకులతో వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఒకప్పుడు సౌత్ దర్శకులు అంటే చిన్న చూపు చూసిన బాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు టైమ్ కల్పించుకుని మరీ సౌత్ దర్శకులతో వర్క్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తమిళ సినిమా లు పదుల కోట్ల నుంచి వందల కోట్ల దిశగా పరుగులు తీస్తున్న ఈ సమయంలో బాలీవుడ్ సినిమాల యొక్క వసూళ్లు దారుణంగా పడిపోయాయి. కనుక సౌత్ దర్శకులతో వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.బాలీవుడ్ లో ఇద్దరు ముగ్గురు హీరోలు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఒక హిందీ సినిమా ను పూరి జగన్నాథ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొందరు బాలీవుడ్ స్టార్ హీరోలు మరియు నటీ నటులు కూడా సౌత్ దర్శకుల దర్శకత్వం లో సౌత్ సినిమా ల్లో కూడా నటించేందుకు ఓకే చెబుతున్నారు.మొత్తానికి ఒక బాహుబలి.. ఆర్ ఆర్ ఆర్.. కేజీఎఫ్.. పుష్ప.. ఇప్పుడు కార్తికేయ 2 వంటి సినిమాల వల్ల మన సౌత్ దర్శకుల క్రేజ్ విపరీతంగా పెరిగింది. ముందు ముందు కూడా సౌత్ దర్శకులు బాలీవుడ్ లో సినిమాలను చేయడం.. బాలీవుడ్ లో మన సౌత్ దర్శకులు చేసిన ఇక్కడి భాష సినిమాలు కుమ్మేయడం మనం చూడబోతున్నాం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. |
https://www.tupaki.com//entertainment/article/burrakatha-telugu-movie-teaser-talk/212357 | డైలాగ్ కింగ్ వారసుడిగా ప్రేమ కావాలి తో పరిచయమైన ఆది సాయి కుమార్ హీరోగా రూపొందిన కొత్త సినిమా బుర్రకథ. హాస్య చిత్రాల రచయితగా పేరున్న డైమండ్ రత్నబాబు మొదటిసారి దర్శకుడిగా డెబ్యు చేస్తున్న మూవీ ఇది. ఇందాకా ట్రైలర్ విడుదల చేశారు. ఓ యువకుడికి రెండు బుర్రలు ఉండటమే ఇందులో ట్విస్ట్.అభిరామ్(ఆది సాయి కుమార్)కు పుట్టుకతోనే రెండు బుర్రలు ఉంటాయి. ఒకటి అభిగా జాలీగా ఉంటె రెండోది రామ్ పేరుతో ఆధ్యాత్మికత ప్రశాంత చిత్తంతో దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దీని వల్ల తండ్రి(రాజేంద్ర ప్రసాద్)ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనతో ప్రేమలో ఉంటుంది హ్యాపీ(మిస్త్రి చక్రవర్తి).అభిరాంను ట్రీట్ చేస్తున్న డాక్టర్(పోసాని)కి సైతం ఈ సమస్య అంతు చిక్కదు. అసలు ఈ రెండు బుర్రలతో అభిరాం ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు అతని జీవితంలోకి వచ్చిన విలన్(అభిమన్యు సింగ్)వల్ల ఎలాంటి ప్రమాదాలను ఎదురుకున్నాడు అనేదే కథగా కనిపిస్తోందిఆది సాయికుమార్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలు ఈజ్ తో చేసుకుంటూ పోయారు. ఒకే మనిషిలో రెండు బుర్రలు కాబట్టి గెటప్స్ పరంగా వేరియేషన్స్ లేకపోయినా యాక్టింగ్ పరంగా మంచి వ్యత్యాసం చూపించాడు. రాజేంద్రప్రసాద్ పోసానిలు తమ టైమింగ్ తో అలరించగా టీజర్ చివర్లో జంబలకిడిపంబలో బ్రహ్మానందం స్టైల్ లో పృథ్వి విధవ రూపంలో చేసిన కామెడీ వెరైటీ గా ఉంది.మొత్తానికి రొటీన్ గా కాకుండా ఏదో డిఫరెంట్ గా ట్రై చేసిన ఆది సాయికుమార్ ఇందులో కాస్త విభిన్నంగా కనిపించాడు. రత్నబాబు దర్శకత్వ శైలిలో అతని కామెడీ టైమింగ్ కనిపించింది. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం సాయి కార్తీక్ సంగీతం అందించిన బుర్రకథ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది |
https://www.tupaki.com//entertainment/article/clash-between-hero-and-director/368044 | సాధారణంగా సినిమా షూటింగ్ లు అయ్యే సమయంలో హీరో, దర్శకుల మధ్య ఏదో ఒక సందర్భంగా క్లాష్ వస్తూ ఉంటుంది. సీన్స్ విషయంలో కాని, యాక్టర్స్ విషయంలో కాని, లేదంటే సాంగ్స్ విషయంలో చిన్న చిన్న క్లాష్ లు రావడం కామన్ గా జరుగుతుంది. అయితే వాటిని పరిష్కరించుకొని హీరో, దర్శకులు మరల మూవీ కంప్లీట్ చేసుకుంటారు.అయితే క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా సినిమా నుంచి హీరో తప్పుకోవడమో లేదంటే దర్శకుడు తప్పుకోవడమో జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలు చాలా సినిమాలకి వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ పెద్ద ప్రొడక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమాకి హీరో, దర్శకుడికి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయంట.ఐటెమ్ సాంగ్ విషయంలో ఇద్దది మధ్య డిస్టబెన్స్ వచ్చిందంట. ఐటెం సాంగ్ ఉండాలా వద్దా అనే అంశంపై వీరిద్దరి మధ్య వివాదం నడుస్తుందంట. ఇంకా ఆ సమస్య పరిష్కారం కాకపోవడంతో సినిమా షూటింగ్ కి కూడా బ్రేక్ పడినట్లు టాక్ వినిపిస్తోంది. గతం లో రవితేజ సినిమాల విషయంలో దర్శకులతో ఇలాంటి క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయి. అయితే తరువాత వాటిని కూర్చొని పరిష్కరించుకున్నారు. ఈ విషయాన్ని రవితేజ కూడా చాలా సందర్భాలలో చెప్పారు. తాజాగా రిలీజ్ కి రెడీ అవుతోన్న రామభాణం సినిమా విషయంలో హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీ వాస్ మధ్య చిన్న చిన్న క్లాష్ లు వచ్చాయంట. అయితే వాటిని ఇద్దరు పరిష్కరించుకొని మూవీని రిలీజ్ కి రెడీ చేశారు.అయితే ఇప్పుడు ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ లో ఐటెం సాంగ్ విషయంలో హీరో, దర్శకుల మధ్య ఉన్న డిస్టబెన్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి వాటిని ఎలా పరిష్కరించుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. |
https://www.tupaki.com//entertainment/article/ping-fong-baby-shark-stood-top-in-youtube-most-viewed-list/265376 | యూట్యూబ్ లో కోటి రెండు కోట్ల వ్యూస్ దక్కితేనే గొప్ప విషయంగా చెప్పుకుంటారు. వంద కోట్ల వ్యూస్ సాధించిన వీడియో అంటే చాలా గొప్ప విషయం. అలాంటిది ఒక చిన్న పిల్లల రైమ్ ఏకంగా 700 కోట్ల వ్యూస్ ను దక్కించుకుంది. దక్షిణ కొరియాకు చెందిన పింక్ ఫాంగ్ యూట్యూబ్ ఛానెల్ వారి బేబీ షార్క్ పాట ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న యూట్యూబ్ వీడియోగా నిలిచింది. 2016 జూన్ లో యూట్యూబ్ లో పోస్ట్ అయిన ఈ పాటకు అప్పటి నుండి రోజుకు లక్షల్లో వ్యూస్ వస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు నెం.1 గా ఉన్న డెస్పాసిటో పాటను వెనక్కు నెట్టేసి నెం.1 స్థానంను దక్కించుకుంది. అమెరికన్ సాంగ్ క్యాంప్ ఫైర్ పాటకు రీమిక్స్ గా బేబీ షార్క్ రైమ్ ను రూపొందించారు. పిల్లలకు మాత్రమే కాకుండా పెద్ద వారిని కూడా ఆకట్టుకోవడం వల్ల ఈ పాటకు ఈ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఎన్నో దేశాల్లో ఈ పాటను వివిధ రకాలుగా వాడుతూ ఉంటారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జనాలు ఎక్కడ పడితే అక్కడ గుమ్మి గూడకుండా ఉండేందుకు ఈ పాటను ప్లే చేస్తూ ఉంటారు. ఆ పాట ప్లే అయితే జనాలు గుమ్మి కూడటం నిషేదం. ఇక ది వాషింగ్టన్ బేస్బాల్ జట్టు తమ థీమ్ మ్యూజిక్ లో దీన్ని చేర్చుకున్నారు. ఆ పాట చేర్చుకున్న సంవత్సరంలో ఆ జట్టు సిరీస్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఇలా పెద్దలను కూడా ఆకట్టుకుంటూ పిల్లలకు మంచి రైమ్ గా మారడంతో పాటు సింపుల్ డాన్స్ స్టెప్పులు మరియు ఈజీగా అర్థం అయ్యే పదాలు ఉండటం వల్ల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో మొదటి వెయ్యి కోట్ల వ్యూస్ ను దక్కించుకోబోతున్న వీడియోగా దీనిని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది లేదా ఏడాదిన్నరలో 300 కోట్ల వ్యూస్ ను దక్కించుకుని వెయ్యి కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. |
https://www.tupaki.com//entertainment/article/manchu-manoj-pan-india-film-aham-brahmasmi-first-look-released/239817 | గత కొన్నేళ్లలో మంచు వారి కుటుంబం నుంచి వచ్చిన సినిమాల పరిస్థితేంటో తెలిసిందే. ఒకరిని మించి ఒకరు బాక్సాఫీస్ దగ్గర జీరోలైపోయారు. మోహన్ బాబు సినిమాల్లో నటించడం ఎప్పుడో తగ్గించేశారు కాబట్టి ఇప్పుడు ఆయన ఫాలోయింగ్, మార్కెట్ గురించి చెప్పాల్సిన పని లేదు. మంచు లక్ష్మిది ఎప్పుడూ పార్ట్ టైం వ్యవహారంలా ఉంటుంది కాబట్టి ఆమె సంగతి కూడా పక్కన పెట్టేద్దాం. కానీ టాలీవుడ్లో మిగతా వారసుల్లో తన కొడుకుల్ని కూడా పెద్ద స్టార్లుగా చూడాలని ఆశపడి మంచు విష్ణు, మంచు మనోజ్ల మీద ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాడు మోహన్ బాబు. కానీ వాళ్లు నిలదొక్కుకోలేకపోయారు. మధ్యలో కాస్తంగా మార్కెట్ సంపాదించుకున్నట్లు కనిపించారు కానీ.. మళ్లీ ఫాం కోల్పోయారు. విష్ణు చివరి సినిమాలు ‘ఆచారి అమెరికా యాత్ర’, ‘ఓటర్’ దాదాపు జీరో షేర్ మిగిల్చాయి. మంచు మనోజ్ సినిమా ‘ఒక్కడు మిగిలాడు’కు కూడా దారుణమైన ఫలితమే వచ్చింది.ఐతే ఈ ఇద్దరూ ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇస్తున్నారు. విష్ణు ‘మోసగాళ్ళు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఓ ఫారిన్ డైరెక్టర్ను పెట్టుకున్నాడు విష్ణు. దీని బడ్జెట్, బిజినెస్ సంగతులు పక్కన పెడితే.. దీని తర్వాత ‘కన్నప్ప’ సినిమా చేయబోతున్నానని.. బడ్జెట్ రూ.95 కోట్లని.. కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని.. దీనికి ఓ హాలీవుడ్ డైరెక్టర్ పని చేస్తాడని.. అక్కడే స్క్రిప్టు వర్క్ జరుగుతుందని గొప్పలు పోతూ చెప్పుకొచ్చాడు విష్ణు. కానీ తిప్పి కొడితే రూ.5 కోట్ల మార్కెట్ కూడా లేని హీరో రూ.95 కోట్ల బడ్జెట్ గురించి మాట్లాడుతుంటే వినే జనాలకు కామెడీగా అనిపిస్తోంది. ‘మోసగాళ్ళు’ హిట్టయినా కూడా విష్ణు మార్కెట్ పది కోట్లకు మించి పెరిగే అవకాశం లేదు. అలాంటిది అంత బడ్జెట్ ఎలా వర్కవుట్ అవుతుందనుకుంటున్నాడు? విష్ణు సంగతిలా ఉంటే.. మనోజ్ కూడా రీఎంట్రీలో భారీ ప్రయత్నం చేస్తున్నాడు. ‘అహం బ్రహ్మాస్మి’ పేరుతో పాన్ ఇండియా సినిమా అంటున్నాడు. దాని బడ్జెట్ రూ.30 కోట్లకు పైమాటే అంటున్నారు. కానీ అతడి మీద ఇంత బడ్జెట్ అంటే చాలా పెద్ద రిస్కే. దీన్ని అతనెలా వర్కవుట్ చేయాలనుకుంటున్నాడో తెలియదు. ముందు కంటెంట్ మీద దృష్టిపెట్టి చిన్న బడ్జెట్ సినిమాలు చేసి అంచెలంచెలుగా ఎదిగే ప్రయత్నం చేయకుండా వీళ్లిద్దరూ ఇలాంటి భారీ ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారన్నది అర్థం కాని విషయం. |
https://www.tupaki.com//entertainment/article/balayya-ravi-teja-combo/314732 | నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. బాలయ్య షో కు వస్తున్న గెస్ట్ లతో సందడి చేస్తూ.. ఆడుతూ.. అల్లరి చేస్తూ సరదాగా టాక్ షో ను సాగిస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూ లేదా.. టాక్ షో అన్నట్లుగా కాకుండా అలా అలా సాఫీగా గంట సమయం ను బాలయ్య కానిచ్చేస్తున్నాడు. బాలయ్య టాక్ షో ను ఎలా డీల్ చేస్తాడా అనుకుంటూ ఉండగా మంచి ఉత్సాహంతో నిర్వహిస్తున్న తీరు చూసి అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక షో కు వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా వర్క్ చేయాలని అనుకుంటున్నట్లుగా.. చేద్దాం అన్నట్లుగా బాలయ్య చెబుతున్నాడు. బాలయ్యను బోళా అంటూ ఉంటారు... ఆయన షో లో మాటలను వింటూ చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది.తాజాగా బాలయ్య షో కు రవితేజ వచ్చాడు. ఆ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను మాట్లాడుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరి మద్య చాలా కాలంగా కోల్డ్ వార్ జరుగుతుందని.. ఇద్దరు కూడా తమ సినిమాలను కావాలని పోటీగా విడుదల చేస్తూ ఉంటారనే టాక్ ఉంది. ఆ టాక్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇద్దరి మద్య కనీసం చిన్న పాటి వివాదం కూడా లేదు.. అలాంటిది కోల్డ్ వార్ ఏంటీ అన్నట్లుగా ఇద్దరు నవ్వేసి ఇన్ని రోజులు దాని గురించి మాట్లాడుకున్న వారిని వెర్రి వాళ్లను చేశారు. ఆ విషయంలో క్లారిటీ రావడం ఇద్దరు అభిమానులకు ఆనందం కలిగించే విషయం. ఇక బాలయ్య అందరితో అన్నట్లుగానే రవితేజతో కూడా సినిమా చేద్దాం అన్నాడు.రవితేజతో సినిమా చేద్దాం అన్నాడు కాని.. కలిసి నటిద్దాం అనకుండా రవితేజ దర్శకత్వంలో సినిమా చేస్తాను అన్నట్లుగా బాలయ్య చెప్పుకొచ్చాడు. రవితేజ గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. కనుక మళ్లీ సినిమా కు డైరెక్ట్ చేయాలనే కోరిక ఆయనకు ఉంది. అయితే తనను తాను డైరెక్ట్ చేయబోను అని.. తన కొడుకును కూడా డైరెక్ట్ చేయను అన్నాడు. దాంతో నాతో సినిమా చేద్దువు లేమ్మా అంటూ రవితేజకు బాలయ్య హామీ ఇచ్చాడు. మంచి కథ రెడీ చేస్తే రవితేజ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయడం పక్కా అన్నమాట. అంటే వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా మల్టీ స్టారర్ కాకుండా సోలో స్టార్ మూవీనే కాని రవితేజ దర్శకత్వం అన్నమాట. మరి ఈ కాంబో నిజంగా సెట్స్ పైకి వెళ్లేనా అనేది కాలమే నిర్ణయించాలి. బాలయ్య మాట ఇచ్చాడు కనుక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం రవితేజ చేతిలోనే ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. |
https://www.tupaki.com//entertainment/article/jana-sena-activists-disturb-chiranjeevi-in-khaidi-150-event/147606 | ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారే.. ఇప్పుడు హాయ్ ల్యాండ్ లో కూడా తమ టాలెంట్ చూపించేశారు. ఒక ప్రక్కన స్వయంగా పవన్ కళ్యాణ్ ''ఖైదీ నెం 150'' సినిమాకు విషెస్ తెలిపినప్పటికీ.. కొందరు అభిమానులు మాత్రం పవర్ స్టార్ అని అరుస్తూ ఖైదీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హంగామా చేశారు. విశేషం ఏంటంటే.. అది ఓపెన్ ప్లేస్ కావడంతో.. ఎవరు ఎంతగా పవర్ స్టార్ అని అరిచినా కూడా అక్కడ ఎవ్వరికీ వినిపించదు. దానితో కొందరు జనసేన జెండాను తీసుకొచ్చేసి.. ఈ ఈవెంట్లో ఊపడం మొదలెట్టారు. ఎక్కడో దూరంగా ఊపుతున్నంతసేపూ బాగానే ఉంది.. కాని ఒక యువకుడు మాత్రం ఏకంగా స్టేజ్ కు దగ్గరగా వచ్చేసి.. చిరంజీవి ముఖం ఎవ్వరికీ కనిపించడకుండా.. కెమెరాలకు అడ్డొచ్చేలా జెండా ఊపడం స్టార్ట్ చేశాడు. దానితో చిరంజీవి తన స్పీచ్ ఆపేసి.. జెండా కిందకు దించు అంటూ కాస్త సీరియస్ గా ఆదేశించారు. కాసేపు జనసేన జెండాను ఆపేసిన ఆ అభిమాని.. మళ్ళీ ఊపడం మొదలెట్టేశాడు. కట్ చేస్తే.. ఎవరో ఆ జెండా పైకి ఊగకుండా అటూ ఇటూ కాస్త గట్టిగా లాగి పట్టుకోవడంతో.. చిరంజీవి తన స్పీచ్ ను ముగించేసి వెళ్ళిపోయారు. మొత్తానికి జనసేన జెండాతో చిరంజీవిని అలా ఇబ్బందిపెట్టేశారని వేరే చెప్పక్కర్లేదు. ఏంటో ఈ అభిమానం.. రేపు పవన్ ప్రసంగిస్తున్నప్పుడు జనసేన మీటింగులో ఇలాగే ఎవరైనా కాంగ్రెస్ బిజెపి జెండాలు ఊపితే వీరు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో <|hyperlink|> /Tupakidotcom/ |
https://www.tupaki.com//entertainment/article/reason-behind-pawan-kalyan-speed-up-his-upcoming-movies/236979 | నసేన అధితనే..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో(లాయర్ సాబ్) రీ ఎంట్రీ ఇవ్వడం..అటుపై వరుసగా సినిమాలు ప్రకటించడంతో అభిమానులు సైతం షాక్ అయ్యారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ లో నటిస్తూనే క్రిష్ తో తన 27వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అటుపై హరీష్ శంకర్ తో 28వ చిత్రాన్ని.. యంగ్ డైరెక్టర్ బాబికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తనతో 29వ చిత్రాన్ని...డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో తన 30 వ చిత్రాన్ని చేస్తున్నట్లు కథనాలు ఇప్పటికే వేడెక్కిస్తున్నాయి. నిజంగా ఇది అభిమానులకు ఊహించని సర్ సర్ ప్రైజ్. ఏడాదికి ఒక సినిమా చేసి మిగతా సమయాన్ని రాజకీయాలకు కేటాయిస్తాడని అభిమానులు సహా ప్రేక్షకులు భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా పవర్ స్టార్ సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు.సినిమాలకంటూ ఎక్కువ సమయాన్ని..రాజకీయాలకంటూ కొంత సమాయాన్ని కేటాయించి ప్లాన్ చేసుకుని కొత్త ప్రయాణం సాగిస్తున్నాడు. తొలిగా కమిట్ అయిన మూడు సినిమాలకు పవన్ భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. జనసేన పార్టీ కార్యకలాపాలు యాక్టివ్ గా సాగలంటే డబ్బు అవసరం కాబట్టి సినిమాలు చేయాల్సి వస్తుందని కొందరంటుంటే? పూర్తిగా మేకప్ వేసుకుని సీన్ లోకి ఎంటరైపోయాడని మరికొందరు విమర్శిస్తున్నారు. ఆ కారణాలు ఎలా ఉన్నా? ప్రస్తుత ఏపీ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంటే...తాను ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటానని..తనికి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జగన్ పాలన బాగుంటే మళ్లీ సినిమాలకే అంకితమైపోతానని ఒకటికి రెండుసార్లు ప్రస్తావించాడు. మరి పవన్ తాజా సన్నివేశాన్ని చూస్తుంటే మాట మీద నిలబడుతున్నట్లున్నాడని కామెంట్లు పడుతున్నాయి. అమరావతి రాజధాని రైతుల విషయంలో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. విజయవాడ లో భాజాపాతో కలిసి లాంగ్ మార్చి అని ప్రకటించి వెనక్కి తగ్గాడు. రాజధానిపై నో నాయిస్....ఓన్లీ సీయింగ్ అన్నట్లే కనిపిస్తున్నాడు. వీటన్నింటిని పక్కనబెడితే ఏపీలో జగన్ పాలనను ప్రజలు మెచ్చారు కాబట్టే పవన్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నాడని..అందుకే వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయం ఉత్తరాంధ్ర ప్రజలు...రాయలసీ మ ప్రజల మధ్య గత వారం రోజులుగా హాట్ టాపిక్ అయింది. మరి పవన్ పొలిటికల్ స్పీడ్ కి బ్రేకు వేసింది జగన్ ఉత్తమ పాలనే అనుకోవాలేమో. |
https://www.tupaki.com//entertainment/article/prabhas-announces-mega-project-with-nag-ashwin/252387 | కొన్ని నెలల క్రితం ప్రభాస్ తో సినిమాను చేయబోతున్నట్లుగా మహానటి మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సినిమాను 2021 ఆరంభంలో ప్రారంభించి 2022 సంవత్సరంలో విడుదల చేస్తామంటూ ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిన తర్వాత మహమ్మారి వైరస్ కారణంగా సినిమా ప్లానింగ్స్ అన్ని కూడా తారుమారు అయ్యాయి. దాంతో ఈ సినిమా కూడా విడుదల 2022 లో ఉండక పోవచ్చు అనుకుంటున్నారు. ప్రభాస్.. రాధాకృష్ణ ల కాంబోలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఇంకా చాలానే ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయితే కానీ నాగ్ అశ్విన్ సినిమాను ప్రభాస్ మొదలు పెట్టె అవకాశం లేదనుకున్నారు. కనుక నాగ్ అశ్విన్ సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుటన్న నేపథ్యంలో వైజయంతి మూవీస్ వారు మాత్రం సినిమాను మొదట ప్రకటించినట్లుగా ఖచ్చితంగా 2022 సంవత్సరం చివరి వరకు విడుదల చేస్తామని ధీమాగా చెబుతున్నారు. కాస్త ఆలస్యంగా షూటింగ్ ప్రారంభం అయినా కూడా సినిమా విడుదల విషయంలో ఎలాంటి ఆలస్యం కాకుండా చేసుకుంటామని నాగ్ అశ్విన్ టీమ్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారట. ప్రభాస్ సినిమా అంటే ఈ మధ్య కాలంలో అనుకున్న సమయం కు విడుదల అవ్వడం వీలు కాదు అన్నట్లుగా పరిస్థితి మారింది. మరి నాగ్ అశ్విన్ ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేస్తాడా చూడాలి. |
https://www.tupaki.com//entertainment/article/bellamkonda-srinivas-speedunnodu-trailer/122292 | అరంగేట్ర మూవీ అల్లుడు శీనుతోనే హిట్ కొట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. బడ్జెట్ ప్రకారం చూస్తే ఆ మూవీ కాస్ట్ ఫెయిల్యూర్ కావచ్చు కానీ, ఓ కొత్త హీరోకి మాత్రం ఇది చాలా పెద్ద హిట్టే అనాలి. ఇప్పుడు రెండో మూవీ విషయంలోనూ చాలా కేర్ ఫుల్ గా ఎన్నో ఎటెంప్ట్స్ తర్వాత, ఓ రీమేక్ ని థియేటర్లలోకి తెస్తున్నాడు ఈ కుర్ర హీరో.కోలీవుడ్ మూవీ సుందరపాండియన్ కి రీమేక్ గా తెరకెక్కింది 'స్పీడున్నోడు'. లేటెస్ట్ గా లాంఛ్ అయిన థియేట్రికల్ చాలా పవర్ఫుల్ గా కట్ చేశారని అనిపించడం ఖాయం. ముఖ్యంగా ఈ కుర్రాడిని డైరెక్టర్ భీమినేని మరోసారి మాస్ గానే చూపించబోతున్నాడు. అవడానికి కామెడీ లీడ్ గా నడిచే సబ్జెక్ట్ అనిపిస్తున్నా, యాక్షన్, గ్లామర్ డోసులు మాత్రం బాగానే ఉన్నాయి. హీరోయిన్ సోనారికా భడోరియా ఓ రేంజ్ అయితే.. బ్యాచిలర్ బాబూ అంటూ గంతులేసిన మిల్కీ బ్యూటీ తమన్నా మరొక ఎత్తు. కేరక్టర్ ఆర్టిస్టులు కూడా కుప్పలుతెప్పలుగా ఉండడంతో, ఎమోషన్స్ క్యారీ చేయడం అంత కష్టమేం కాదనిపిస్తోంది. అయితే, పంచ్ డైలాగులో కాస్త శృతి మించినట్లుగా ఉంది. ఏజ్ ట్వంటీ టూ, స్పీడ్ వన్ ట్వంటీ లాంటివి కొంచెం ఎక్కువే. అలాగే ఒకరిని ఒకరు చెంపదెబ్బలు కొట్టుకునే సీన్స్ ని అయితే, ట్రైలర్ లోనే బోలెడన్ని తగిలించారు. ఏ రకంగా చూసినా.. స్పీడున్నోడు అంటూ అన్నింటిలోనూ డోస్ ఎక్కువగానే చూపించాడు బెల్లంకొండ శ్రీనివాస్. |
https://www.tupaki.com//entertainment/article/boyapati-srinu-about-akhanda-success/312197 | 'అఖండ' సినిమా గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ నిన్న రాత్రి వైజాగ్ లో జరిగింది. బాలయ్య అభిమానులు భారీ సంఖ్యలో ఈ ఈవెంట్ కి తరలిరావడం జరిగింది. ఈ స్టేజ్ పై బోయపాటి మాట్లాడుతూ .. " నేను .. బాలయ్య .. మా కాంబినేషన్లో ఇలా హిట్లు రావడమనేది దైవ సంకల్పం ... పూర్వజన్మ సుకృతం. మా ఇద్దరి మధ్య ఒక అద్భుతమైన ట్యూనింగ్ ఉంది. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా ఇద్దరి కాంబినేషన్లో మళ్లీ ఏంటనేది నేను ఓపెన్ చేస్తాను .. ఆ విషయాన్ని గురించి వదిలేయండి.ఈ సినిమా కోసం కొంతమంది హీరోయిన్లను అనుకున్నాము. మనకి చేస్తామని అన్నవాళ్లేమో అంత కేపబుల్ గా లేరు. మితగావాళ్లను అనుకుంటే చిన్నఇది ఉంది. 'జయ జానకి నాయక'లో సెకండ్ లీడ్ చేసిన ప్రగ్యా నాకు గుర్తుకు వచ్చింది. నేను కాల్ చేసి హైదరాబాదు రావాలని చెప్పాను. ఎందుకు అని కూడా అడక్కుండా నేరుగా ఆఫీసుకు వచ్చేసింది. 'అఖండ' సినిమాను గురించి ఆమెకు చెప్పాను .. నువ్వు ఈ సినిమా చేస్తున్నావు అని చెప్పాను .. 'చేస్తున్నాను సార్' అంది .. అంతే. ఈ సినిమాలో ఆమె తన పాత్రకి న్యాయం చేసింది. అందువలన క్లాప్స్ తో ఆమెను అభినందించవలసిందే. ఈ సినిమా కథ ఏమిటంటే ప్రకృతి .. పసిబిడ్డ .. పరమాత్మ. ఈ మూడింటినీ గౌరవిస్తేనే భావితరాలు కూడా బాగుంటాయి. అదే మన హైంధవ ధర్మం అని చెప్పడానికి ప్రయత్నించాము .. సక్సెస్ అయ్యాము. ఆ పసిబిడ్డ పాత్రను ధేష్ణ చేసింది. తనకి మూడేళ్లే .. అయినా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఆ పాపకి అందరి ఆశీస్సులు కావాలి. ప్రకృతి .. పసిబిడ్డ .. పరమాత్మ .. ఈ మూడింటినీ టచ్ చేస్తే దేవుడు ఎలా దిగివస్తాడో చెప్పడం జరిగింది. దానికి మీ ప్రతిస్పందనే ఈ రోజున ఈ సినిమా ఇంత హిట్ కావడానికి కారణం. శివుడు ఈ సినిమాను హిట్ చేశాడు .. మీ రూపంలో. మేము జస్ట్ తీసుకున్నామంతే. ఇది భగవంతుడు ఇచ్చిన హిట్టు. ఈ పరిశ్రమకి ఊపిరిలాంటి హిట్టు. అలాంటి సినిమాను అందించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. మీరంతా కలిసి సినిమాను గెలిపించారు .. పరిశ్రమని గెలిపించారు. మంచి సినిమాలను గెలిపిస్తూ, పరిశ్రమను కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తున్నాను. ఈ సక్సెస్ మీట్ ను సక్సెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అంటూ ముగించారు. |
https://www.tupaki.com//entertainment/panjavaishnavtejcareer-1361223 | మెగా ఫ్యామిలీ నుంచి చివరగా వచ్చి తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చి బాబు డైరెక్షన్లో ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీతోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు. ఉప్పెన హిట్ తో వైష్ణవ్ సినిమాల మీద బజ్ పెరిగింది. ఐతే ఆ తర్వాత మాత్రం వైష్ణవ్ తేజ్ కి అలాంటి హిట్ పడలేదు. ఉప్పెన తర్వాత చేసిన 3 సినిమాలు కూడా ఒక దాన్ని మించి మరొకటి అనే రేంజ్ లో డిజాస్టర్లు అయ్యాయి.
మొదటి సినిమా విషయంలో కథ పరంగా ప్రొడక్షన్ పరంగా పర్ఫెక్ట్ గా కాలిక్యులేషన్స్ వేసుకున్న వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత సినిమాలకు మాత్రం అవేవి లేకుండా చేసి కెరీర్ రిస్క్ లో పడేసుకున్నాడు. చివరగా వైష్ణవ్ తేజ్ చేసిన ఆదికేశవ సినిమా సితార బ్యానర్ నిర్మించినా సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
కథగా విన్నప్పుడు బాగున్న ప్రతిది సినిమాగా తెరకెక్కినప్పుడు బాగుంటుందని చెప్పడం కష్టం. అందుకే స్టోరీ సెలక్షన్ మీద పూర్తి అవగాహన ఉండాలని అంటారు. ఇదిలా ఉంటే ఆదికేశవ ఫ్లాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ కెరీర్ డైలమాలో పడింది. ఉప్పెన తర్వాత చేసిన సినిమాలన్నీ వర్క్ అవుట్ అవ్వకపోవడం వల్ల హీరో మార్కెట్ కూడా దారుణంగా పడిపోయింది. ఈ టైం లో ఒక సూపర్ హిట్ కథ కోసం వైష్ణవ్ తేజ్ వెతుకుతున్నాడని తెలుస్తుంది.
అందుకే తన దగ్గరకు వచ్చి కథ చెబుతున్న రైటర్స్, డైరెక్టర్స్ అందరికీ ఏమాత్రం డౌట్ అనిపించినా నో అని చెప్పేస్తున్నాడట. ఆదికేశవ తర్వాత వారానికి ఐదారు కథల దాకా వింటున్నాడట వైష్ణవ్ తేజ్. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా తనకు నచ్చలేదని టాక్. మళ్లీ ఉప్పెన లాంటి హిట్ పడితే తప్ప వైష్ణవ్ తేజ్ కెరీర్ ట్రాక్ లోకి వచ్చే అవకాశం లేదు. మరి మెగా మేనల్లుడు నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది చూడాలి. మేనల్లుడు తొలి సినిమాకు మెగా ఫ్యామిలీ కూడా సపోర్ట్ అందించగా ఉప్పెన తర్వాత స్టోరీ సెలక్షన్ లో సొంత నిర్ణయాల వల్లే వైష్ణవ్ తేజ్ కెరీర్ ఇలా ఉందని చెప్పొచ్చు. మళ్లీ మెగా సపోర్ట్ అందిస్తేనే వైష్ణవ్ తేజ్ కెరీర్ సెట్ రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. |
https://www.tupaki.com//entertainment/article/rajinikanth-all-set-to-go-to-us-for-full-medical-checkup/183134 | సూపర్ స్టార్ రజినీకాంత్ కు వయసు రీత్యా వచ్చిన అనారోగ్యాలపై చెకప్ ల కోసం తరచుగా అమెరికా వెళుతుంటారు. సహజంగా ప్రతీ సమ్మర్ కూ అమెరికా విజిట్ చేయడం ఆయనక ఈ మధ్య అలవాటు అయిపోయింది. ఒకవైపు వేసవి వేడి నుంచి తప్పించుకోవడం.. మరోవైపు హెల్త్ చెకప్ లను కూడా పూర్తి చేయడం.. రెండు విధాలుగా తన ట్రిప్ ఉపయోగపడేలా చేసుకుంటూ ఉంటారు రజినీ. ఈ సమ్మర్ లో కూడా ఆయన అమెరికా వెళతారనే టాక్ ముందు నుంచి ఉంది. ఇప్పుడది కన్ఫాం కావడమే కాదు.. ఇప్పటికే రజినీ అమెరికాలో వాలిపోయారు కూడా. అక్కడి ఎయిర్ పోర్టులో రజినీకాంత్ ఉన్న పిక్స్ ఇప్పుడు వైరల్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. టీ షర్టులో రజినీకాంత్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. ఏమాత్రం మేకప్ వేసుకోకపోయినా.. ఆ గెడ్డం.. ఆ టీ షర్టు.. క్యాజువల్ ట్రౌజర్ లో రజినీకాంత్ స్టైల్ ను చూసి.. ఇందుకు కదా రజినీని అందరూ సూపర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునేది అనిపించక మానదు. ఏజ్ ఎంతగా పెరుగుతుంటే ఆయన స్టైల్ కూడా అంతగా పెరిగిపోతుండడం విశేషం. ఇక రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. జూన్ 7వ తేదీన పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన కాలా కరికులన్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఇవాళే రిలీజ్ కావాల్సి ఉంది కానీ.. తమిళనాట బంద్ కారణంగా కాలా వాయిదా పడింది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2.ఓ చిత్రానికి గ్రాఫిక్ వర్క్ పనులు చకచకా జరుగుతున్నాయి. |
https://www.tupaki.com//photo-story/archanavijayapurilatestphoto-1307318 | అర్చన విజయ భారతీయ మోడల్, టెలివిజన్ హోస్ట్ కం ప్రెజెంటర్. వీటన్నిటినీ మించి మాజీ IPL యాంకర్ గా నటిగా సుపరిచితం. అర్చన `రోమ్ ఫ్యాషన్ వీక్` సహా అనేక మోడలింగ్ షోలలో ఎంతో పాపులర్ సూపర్ మోడల్. మిలన్, సింగపూర్, ఫ్రాన్స్ వంటి చోట్ల అనేక ఫ్యాషన్ షోలలో తన ఉనికిని చాటుకుంది. అర్చన విజయ ఆ తర్వాత దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లకు సన్నిహితురాలిగా సుపరిచితురాలైంది. సులా ఫెస్ట్, ఐసిఐసిఐ బ్యాంక్, సన్ మైక్రోసిస్టమ్స్, సిప్లా, ఎల్జి, శామ్సంగ్ మొబైల్స్ సహా పాపులర్ బ్రాండ్ల ప్రకటనల్లో నటించింది. తరుణ్ తహిలియాని, రోహిత్ బాల్, నరేంద్ర కుమార్, సబ్యసాచి, మనీష్ మల్హోత్రా వంటి ప్రముఖుల ప్రసిద్ధ బ్రాండ్లను కూడా ఆమోదించింది. అర్చన విజయ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ధీరజ్ పూరీతో రెండేళ్లపాటు డేటింగ్ చేసి దుబాయ్లో అతనితో నిశ్చితార్థం చేసుకుంది. ఈ జంట 2015లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక వారసుడు ఉన్నారు.
అర్చన విజయ పూరి సూపర్ మోడల్ వేట- రియాలిటీ షోలో గెలిచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ యాంకర్ గా మంచి పేరు వచ్చింది. కొన్ని నెలల కిందట బిడ్డ తల్లి అయిన అర్చన విజయ్ తనలో ఇంకా వాడి వేడి తగ్గలేదని నిరూపిస్తూ తాజా ఫోటోషూట్ తో గుబులు రేపుతోంది. బికినీ బీచ్ లో ఇలా టూపీస్ లుక్ లో అర్చన ఇచ్చిన ఫోజు ఇప్పుడు నెటిజనుల్లో వైరల్ గా మారింది.
ఆల్ రౌండర్ ప్రతిభ ఆమె సొంతం:
అర్చన విజయ 1982 నవంబర్ 17న కోల్కత్తాలో జన్మించింది. భవానిపూర్ కళాశాల కోల్కత్తాలో స్కూల్ కాలేజ్ విద్యను అభ్యసించింది. కోల్కత్తా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసింది. ఆమె ఛానల్ Vలో హోస్ట్గా తన కెరీర్ను ప్రారంభించింది. సూపర్ మోడల్ రియాలిటీ టీవీ షో గెట్ గార్జియోసిన్ ఛానల్ Vను గెలుచుకుంది. అర్చన పెద్ద క్రికెట్ అభిమాని.. అనేక క్రికెట్ మ్యాచ్లను హోస్ట్ చేసింది. ఆమె 2015లో నియో క్రికెట్ ఇండియా బంగ్లాదేశ్ సిరీస్కు ఆతిథ్యం ఇచ్చింది. 2011 సంవత్సరంలో ఆమె ఆడి జనరేషన్ ఫుట్బాల్ కప్కు ఆతిథ్యం ఇచ్చింది. 2012లో సెట్ మాక్స్లో ప్రసారమైన అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ షో IPL సీజన్ 6ని ఆమె హోస్ట్ చేసింది. ఆ తర్వాత IIFA 2013ని హోస్ట్ చేసింది. ఆమె టూర్ డైరీ అనే షోను కూడా నిర్వహిస్తోంది. టూర్ డైరీ హోస్ట్ గా భారతీయ క్రికెటర్లతో కలిసి పలు దేశాల్లో ఆట స్థలాలకు ప్రయాణించింది. రియాలిటీ టెలివిజన్ షో `గెట్ గార్జియస్` సీజన్ వన్లో కనిపించిన తర్వాత అర్చన విజయ పాపులారిటీ మరింత పెరిగింది. ఈ పోటీలో కూడా అర్చన గెలిచింది. ఆ తర్వాత `రోమ్ ఫ్యాషన్ వీక్`తో మరింత పాపులారిటీ పెంచుకుంది. |
https://www.tupaki.com//entertainment/article/pawan-kalyan-fans-on-about-mega-events/201838 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై రాబోయే సంక్రాంతికి ఏడాది అవుతోంది. కానీ టాలీవుడ్ సినిమా ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంపాక్ట్ మాత్రం ఇంకా ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో పవర్ స్టార్.. పవర్ స్టార్ అని ఫ్యాన్స్ చేసే హంగామా ఇప్పుడు కూడా మరో రకంగా కొనసాగుతోంది. ముఖ్యంగా మెగా ఈవెంట్స్ లో పవన్ నామస్మరణ చేయకపొతే ఫ్యాన్స్ ఊరుకునేలా లేరు.కానీ ఇప్పుడు పవన్ పేరుతో పాటు జనసేన 'గ్లాసు' గురించి మాట్లాడితేనే మెగా ఫంక్షన్ సంపూర్ణం అయినట్టు. ఈమధ్య 'వినయ విధేయ రామ' ఈవెంట్లో చిరంజీవి.. రామ్ చరణ్ లతో పాటుగా టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా పవన్ ప్రస్తావన తీసుకురావలసి వచ్చింది. ఇక తాజాగా వెంకటేష్ -వరుణ్ తేజ్ ల మల్టిస్టారర్ 'F2' ప్రీ-రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చాడు. కానీ ఫ్యాన్స్ ఉత్సాహం అంతటితో చల్లారలేదు. ఇక వాళ్ళ సంతృప్తిపరచడం కోసం జనసేన గురించి కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఫిలిం ఇండస్ట్రీ నుండి మెగా ఫ్యామిలీలో దాదాపుగా అందరూ హీరోలు జనసేనకు మద్దతుగానే ఉన్నారు. వీరితో పాటుగా పవన్ ను అభిమానించే మరికొందరు హీరోలనుండి కూడా జనసేనకు మద్దతు లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇదంతా బాగానే ఉంది గానీ ఇవన్నీ జనసేనకు ఎలెక్షన్స్ లో ఎంతమాత్రం ఉపయోగపడతాయో వేచి చూడాలి. |
https://www.tupaki.com//entertainment/article/all-eyes-are-on-the-major/331735 | గత కొన్ని నెలలుగా బాలీవుడ్ బాక్సాఫీస్ పై మన సినిమాలు దండయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. డబ్బింగ్ వెర్షన్ లో విడుదలవుతున్న మన సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకులు గత కొన్నినెలలుగా బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఉత్తరాదిలో మన సినిమాలకు కాసుల వర్షం కురుస్తోంది. హిందీ సినిమాలకు మించి మన దక్షిణాది మూవీస్ కి పట్టడం కడుతుండటంతో అక్కడి మార్కెట్ లో మన సినిమాలు రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతున్నాయి.గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప` హిందీ బెల్ట్ లో ఊహించని విధంగా భారీ వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక ఆ తరువాత భారీ స్థాయిలో విడుదలైన ట్రిపుల్ ఆర్ కూడా అంతకు మించిన స్థాయిలో బాక్సాఫీస్ ని కొల్లగొట్టింది. 300 కోట్లకు పైచిలుకు వసూళ్లని ఒక్క హిందీ బెల్ట్ లోనే రాబట్టడం విశేషం. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కలయికలో రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1150 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది.ఇదే ఊపులో ఏప్రిల్ 14న విడుదలైన `కేజీఎఫ్ 2` దేశ వ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించింది. రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. హిందీ బెల్ట్ లో ఈ మూవీ ఏకంగా 420 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి అక్కడ చరిత్ర సృష్టించింది. దీంతో బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కేజీఎఫ్ 2 వసూళ్లని చూసి షాకయ్యారు. దీంతో ఈ సినిమా తరువాత దక్షిణాది నుంచి సినిమా రిలీజ్ అవుతోందంటే బాలీవుడ్ లో భయం మొదలౌతోంది. మళ్లీ ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఏ స్థాయిలో వసూళ్లని రాబట్టి బాలీవుడ్ కు షాకిస్తుందో అని ఆశ్చర్యంతో చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న `మేజర్` మూవీ పై ఇప్పడు బాలీవుడ్ వర్గాలు దృష్టిపెట్టాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై తాజ్ హోటల్ మారణహోమం నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల ఈ మూవీ ప్రీమియర్ లకి నార్త్ లో అద్భుతమైన స్పందన లభించింది. దీంతో నార్త్ లో మరీ ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సంచలనాలు సృష్టించడం ఖాయం అని చెబుతున్నారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అదరిపోయాయి. సినిమాని కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో `మేజర్` రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. |
https://www.tupaki.com//entertainment/article/rana-turns-as-producer-for-varun-tej/222526 | ఇటీవలే ఓ యాక్సిడెంట్ వివాదంతో మీడియాలో హాట్ టాపిక్ అయిన రాజ్ తరుణ్ ప్రస్తుతం తన సినిమా షూటింగ్ తో బిజీ అయ్యాడు. దిల్ రాజు నిర్మాణంలో జీ.ఆర్. కృష్ణ డైరెక్షన్ లో 'ఇద్దరి లోకం ఒకటే' చేస్తున్న రాజ్ తరుణ్ నెక్స్ట్ విజయ్ కుమార్ కొండాతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు కాకుండా నెక్స్ట్ సినిమాలను కూడా సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. 'లవర్' సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం ఎలాంటి గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నాడు.అన్నీ అనుకున్నట్లే జరిగితే త్వరలోనే రానా నిర్మాణంలో రాజ్ తరుణ్ ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే రాజ్ తరుణ్ కోసం కథ రెడీగా ఉందట. కాన్సెప్ట్ నచ్చడంతో రానా స్వయంగా ఈ సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడట. గతేడాది వచ్చిన కేరాఫ్ కాంచరపాలెం సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించిన రానా ఈ సినిమాతో పూర్తి నిర్మాతగా మరనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాకు దర్శకుడెవరన్నది తెలియాల్సి ఉందిఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా రాజ్ తరుణ్ సినిమా చేస్తాడని అంటున్నారు. అలాగే మారుతి నిర్మాణంలో ఓ సినిమా ఫిక్సయిందని టాక్. ఇలా వరుసగా సినిమాలు ఫైనల్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి సెట్స్ పైకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడు యంగ్ హీరో. మరి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంటాడా చూడాలి. |
https://www.tupaki.com//entertainment/article/baahubali-producers-no-profits-from-baahubali-movie/155628 | ‘బాహుబలి: ది బిగినింగ్’ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయినప్పటికీ తమకు లాభం ఏమీ రాలేదని అన్నాడు నిర్మాత శోభు యార్లగడ్డ. హీరో ప్రభాస్ సైతం ఇదే మాట చెప్పాడు. ఈ మొత్తంలో బయ్యర్లు.. ఎగ్జిబిటర్లు ఎంత మిగుల్చుకున్నప్పటికీ.. నిర్మాతలకు అసలు లాభమే రాలేదని అనడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘బాహుబలి: ది బిగినింగ్’ కోసం భారీగా ఖర్చు పెట్టిన మాట వాస్తవమే. కానీ ఆ సినిమాకు హైప్ కూడా మామూలుగా రాలేదు. బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగింది. తొలి భాగం పూర్తయ్యే సమయానికే ఈ సినిమాకు రూ.100 కోట్ల దాకా లాభం వచ్చినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది.‘బాహుబలి’ రెండు భాగాలకు కలిపి అనుకున్న బడ్జెట్ రూ.250 కోట్లు. తొలి భాగం పూర్తి చేసే సమయంలోనే రెండో భాగానికి సంబంధించి కూడా 40 శాతం షూట్ పూర్తయింది. అప్పటికి నిర్మాతలు రూ.150 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఉంటారని అంచనా వేశారు. కానీ ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలకు ముందు ప్రెస్ మీట్లో నిర్మాత బడ్జెట్ ను రూ.450 కోట్లకు పెంచి చెప్పాడు. రెండో భాగానికి వచ్చేసరికి ఎక్కువ ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ లభించినప్పటికీ.. బడ్జెట్ ఒక్కసారిగా 80 శాతానికి పైగా పెరిగిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తొలి భాగానికి ఎంత భారీగా వడ్డీలు కట్టి ఉన్నా.. ఈ సినిమాకు సంపూర్ణ సహకారం అందించిన రామోజీరావుకు లాభాల్లో వాటా ఇచ్చి ఉన్నా.. నిర్మాతలకు ఏమీ మిగల్లేదనడం మాత్రం నమ్మశక్యం కాని విషయమే. మరి ‘బాహుబలి-1’ వసూలు చేసిన రూ.600 కోట్లు ఏమైనట్లో అర్థం కావడం లేదు. బాహుబలి ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయో ఏమో కానీ.. తమ మీద ఆదాయపు పన్ను అధికారుల కళ్లు పడ్డ నేపథ్యంలో నిర్మాతలు ఉద్దేశపూర్వకంగానే పైసా లాభం రాలేదని చెబుతున్నారేమో అన్న సందేహాలు లేకపోలేదు <|hyperlink|> /Tupakidotcom/ |
https://www.tupaki.com//entertainment/article/answer-to-lady-journalists-over-avantika-rape-issue/109820 | అవంతిక రేప్ అనేది ప్రస్తుతం హాట్ టాపిక్. ఓ మహిళా జర్నలిస్టు రాజమౌళిని తూర్పారబట్టడం పెద్ద స్థాయిలో చర్చకొచ్చింది. ఆడవారిని ఇప్పటికీ బానిసలుగా చూస్తున్నారని విమర్శించేవాళ్లెందరో. అయితే అవంతికలో సైతం ఓ వీరనారిని చూపెట్టాలన్న ఆలోచన ఓ మగాడికే వచ్చిందన్న విషయాన్ని ఎవరూ ఎందుకు పరిగణించరు. ఓ వీరనారి మరో వీరుడిని ప్రేమించడం తప్పు ఎలా అవుతుంది. ప్రేమించింది.. మనసిచ్చింది కాబట్టే తనువు సమర్పించుకుంది అని ఎందుకు అనుకోకూడదు?ఇలా కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకేవాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం రాజమౌళికి లేదేమో! అయినా మన తెలుగు సినిమా ఘనచరిత్రను పరిశీలిస్తే స్త్రీల ఔనత్యాన్ని చాటి చెప్పే సినిమాలెన్నో వచ్చాయి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకోకుండా అందరు దర్శకుల్ని , ఫిలింమేకర్స్ ని ఒకే గాటిన కట్టేసి తిట్టి పారేయడం ఎంతవరకూ సబబు?అలనాటి మేటి నటి సౌందర్య అమ్మోరుగా నటించగలిగింది? అంటే అందుకు కారకులెవరు? మేటి నాయిక విజయశాంతి సోలో లీడ్ గా నటించి మగరాయుళ్లను తుక్కు రేగేలా ఇరగదీయడానికి కారకులెవరు? అరుంధతిగా వెండితెరపై వెలుగులు విరజిమ్మడానికి అనుష్కకు ఆ అవకాశం ఇచ్చిందెవరు? ఇలాంటి ఎన్నో గొప్ప ఉదాహరణలు కళ్ల ముందే ఉన్నా మొత్తం మగ ప్రపంచమే ఇంతే అనేస్తే ఎలా? కాస్త ఆలోచించాలి కదా! మిల్లీ గ్రామ్ మనసు పెడితే మీకే అన్ని విషయాలు గుర్తొచ్చేవి కదా! |
https://www.tupaki.com//entertainment/article/karthikeya-all-hopes-in-chavu-kaburu-challaga-movie/262545 | 'ప్రేమతో మీ కార్తీక్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యువ హీరో కార్తికేయ 'Rx 100' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అడల్ట్ కల్ట్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాతో కార్తికేయ యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో 'హిప్పీ' 'గుణ 369' '90 ML' వంటి సినిమాలలో నటించినా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాయి. దీంతో యంగ్ హీరో 'గ్యాంగ్ లీడర్' మూవీలో పోషించిన తరహా నెగెటివ్ రోల్స్ చేసుకుంటూ పోవాల్సిందే అని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపించాయి. అయితే అదే సమయంలో టాలీవుడ్ లో పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో 'చావు కబురు చల్లగా' సినిమా చేసే అవకాశం కార్తికేయ కు వచ్చింది.అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ''చావు కబురు చల్లగా'' సినిమాను నిర్మిస్తున్నాడు. కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చగా సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. స్వర్గపురి వాహనం నడిపే బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ నటిస్తున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ మాస్ లుక్.. బాడీ లాంగ్వేజ్.. మాట్లాడే తీరు చూస్తుంటే ఇది కూడా 'Rx 100' తరహా కల్ట్ స్టోరీతో రాబోతోందని తెలుస్తోంది.అయితే ఇప్పుడు కార్తికేయ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అయితే కార్తికేయ కెరీర్ కి పెద్ద ప్లస్ అవడమే కాకుండా.. పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యూచర్ లో కూడా భారీ ప్రాజెక్ట్స్ పై ఆశలు పెట్టుకోవచ్చు. అందుకే 'చావు కబురు చల్లగా' విజయం కార్తికేయకు కీలకమని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో హీరో తల్లి పాత్ర కీలకంగా ఉండబోతుంది. ఈ పాత్రలో సీనియర్ నటి ఆమని కనిపిస్తుండగా.. ఇప్పటికే టీజర్ లో ఆమె క్యారక్టర్ ఎలా ఉంటుందో శాంపిల్ చూపించారు. మరి ఆ పాత్ర ఆడియన్స్ కి ఎంతవరుకు కనెక్ట్ అవుతుందో చూడాలి. |
https://www.tupaki.com//entertainment/article/chloe-cherry-accused-of-shoplifting-charged-with-retail-theft/359153 | సెలెబ్రిటీలు అంటేనే లగ్జరీ లైఫ్. డబ్బులకు కొదువే ఉండదు. కోట్లకు కోట్లు సంపాదిస్తూ నచ్చిన దల్ల కొనుకుంటూ రిచ్ గా జీవిస్తుంటారు. వారు వేసుకునే చెప్పుల నుంచి తలపై క్లిప్ వరకు ప్రతిదీ కాస్ట్లీ అండ్ స్టైలిష్ గా ఉండేలా చూసుకుంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ఔట్ఫిట్స్ ను ధరిస్తూ అందంగా కనపడెందుకు ఆరాటపడుతుంటారు. తమ జీవనశైలితో పదిమందిలో ప్రత్యేకంగా ఉండేందుకు తపిస్తుంటారు. కానీ నిజానికి వాళ్ళు కూడా మనలాంటి సామాన్య మనుషులే. మనమే వారిని ప్రత్యేకంగా భావిస్తూ ఉంటాం. వాళ్ళు ఏమి చేసినా వింతగా చూస్తు ఉంటాం. అయితే సెలెబ్రిటీలు కూడా సామాన్య మనుషులే అని తెలిపే సంఘటనలు సమాజంలో చాలా జరుగుతున్నాయి. తాజాగా, అలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రముఖ నటి రూ. 2 వేలకు కక్కుర్తి పడి ఓ రీటైల్ షాపులో బ్లౌజు దొంగతనం చేసి పట్టుబడింది. ఆమె ఎవరంటే అమెరికాకు చెందిన క్లోయి చెర్రీ. బ్లూ ఫిల్మ్స్, యుఫోరియా అనే టీవీ సిరీస్తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఈమె కొద్దిరోజుల క్రితం పెన్సెల్వేనియాలోని లాన్కాస్టర్లోని ఓ రీటైల్ స్టోర్కు వెళ్లింది. అక్కడ షాపింగ్ చేస్తూ దాదాపు రూ. 2 వేల రూపాయలు విలువ చేసే ఓ బ్లౌజును దొంగతనం చేసింది. అయితే దీన్ని గమనించిన షాపు యాజమాన్యం..ఆమెను పట్టుకొని నిలదీసింది. అయితే ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించింది. దీంతో షాప్ నిర్వాహకులు పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు ఆమెపై కేసు కూడా నమోదు చేశారు. ఈ విషయం అక్కడి మీడియా లో కథనాలు గా వస్తున్నాయి. మరి ఆమెకు ఎలాంటి శిక్ష విధించారు తెలీదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మరోవైపు ఈ సంఘటనపై క్లోయి ప్రతినిధి స్పందించినట్లు కథనాలు వచ్చాయి. అది పొరపాటు వల్ల జరిగిందని, క్లోయికి అలాంటి ఉద్ధేశ్యం లేదని తెలిపారు. షాపు వాళ్లు కావాలనే ఆమెపై నిందలు మొస్తున్నారని వెల్లడించారు.కాగా, సెలెబ్రిటీలు దొంగతనం చేస్తూ పట్టుబడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ చాలా జరిగాయి. వినోనా రైడర్ అనే ప్రముఖ నటి 5 వేల డాలర్ల డిజైనర్ ఐటమ్స్ దొంగిలించి పట్టుబడింది. దీంతో ఆమెపై పోలీస్ కేసు నమోదు చేశారు. అంతేకాదు.. మూడేళ్ల పాటు ఆమె నిషేధానికి కూడా గురైంది. వీటితో పాటు పలు రకాల శిక్షలకు కూడా వేశారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. |
https://www.tupaki.com//entertainment/article/rebel-stars-in-one-picture/333990 | రెబల్ స్టార్ కృష్ణం రాజు- ప్రభాస్ మధ్య అన్యోన్యత గురించి చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు నట వారసత్వం తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ టాలీవుడ్ లో ఎదిగిన వైనం..అక్కడ నుంచి పాన్ ఇండియా స్టార్ గా రీచ్ అయిన విధానం నిజంగా ప్రశంసనీయం. డార్లింగ్ గా..యంగ్ రెబల్ స్టార్ గా ప్రేక్షకాభిమానుల గుండెల్లో చిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.ప్రభాస్ నేడు పాన్ ఇండియా స్టార్ గా నీరాజనాలు అందుకుంటున్నారు అంటే! దాని వెనుక పరోక్ష కారకులు కృష్ణంరాజు. నటుడిగా ఉన్నతంగా ఎదగడంలో కృష్ణం రాజు సూచనలు..సలహాలు డార్లింగ్ ఎప్పుడూ తీసుకుంటారు. కొత్త సినిమా కమిట్ అయిన వెంటనే పెద్దాయన చెవిన విషయం వేయాలి. ఆయన ఆశీర్వచనాలు అందుకోవాలి. ఆ తర్వాతే సెట్స్ కి వెళ్లాలి.ఇలా డార్లింగ్ చేసే ప్రతి పనిలోనూ కృష్ణం రాజు కనిపిస్తారు. ప్రస్తుతం ప్రభాస్ కి పిల్లని చూసే పనిలోనే పెద్దాయన బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. వయసు 40 దాటడంతో ఇక ఆలస్యం మంచిది కాదని...పిల్లని వెతికే సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా కృష్ణంరాజు-ప్రభాస్ ఒకే ప్రేమ్ లో చిక్కిన ఫోటో ఒకటిప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.ఇందులో కృష్ణం రాజు చైర్ లో కూర్చుని ఉండగా..ఆ పక్కనే డార్లింగ్ నుంచుని కనిపిస్తున్నాడు. పెద్దాయన బ్లాక్ కలర్ షర్ట్ లో మెడలో చైన్ ధరించి నవ్వుతూ కనిపిస్తున్నారు. పక్కనే ప్రభాస్ క్యాజువల్స్ లో తలకి స్కాప్ ధరించి బియర్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. కృష్ణం రాజు లో లుక్ పరంగా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అవి వయసు తెచ్చిన మార్పులా? లేక డైట్ పాలో చేస్తున్నారా? అన్నది తెలియాలి. గత లుక్ కంటే కృష్ణంరాజు చాలా మార్పులు గమనించవచ్చు.ఇద్దరు స్టార్లు ఇలా ఒకే ప్రేమ్ లో కనిపించడంతో అభిమానుల అనందానికి అవధుల్లేవ్. ఫోటో పాతదే అయినా అభిమానులకు మాత్రం డబుల్ కిక్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టంట జోరుగా వైరల్ అవుతోంది. ఇక డార్లింగ్-కృష్ణం రాజు కొన్ని సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. |
https://www.tupaki.com//entertainment/article/karan-johar-paints-the-perfect-family-picture-with-mom-hiroo-johar/236633 | బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ సరోగసీ ద్వారా కవ పిల్లలకు తండ్రి అయిన విషయం తెల్సిందే. ఆ పిల్లలే జీవితంగా కరణ్ జోహార్ జీవితంను గడుపుతున్నాడు. తాజాగా ఆ పిల్లలు మూడవ వసంతంలోకి అడుగు పెట్టారు. తన పిల్లల పుట్టిన రోజు సందర్బంగా కరణ్ జోహార్ కాస్త ఎమోషనల్ గా సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. తన తల్లి మరియు పిల్లల వల్ల తాను పొందుతున్న సంతోషం ను ఆ పోస్ట్ లో వివరించడం తో ఆ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.కరణ్ ఆ పోస్ట్ లో.. జనాలు నన్ను సింగిల్ ఫాదర్ అనుకుంటారు.. పిల్లలకు తల్లి లేదని అనుకుంటారు. కాని నా తల్లి నా పిల్లలకు తల్లిగా మారింది. వారికి కావాల్సినవన్నీ కూడా నా తల్లి చూసుకుంటుంది. వారికి తల్లిలేని లోటును నా తల్లి తీర్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ మద్దతు లేకుండా నేను ఏ నిర్ణయం తీసుకోలేనంటూ చెప్పుకొచ్చాడు.ఇక రూహీ ఇంకా యష్ ల రాకతో నా జీవితం పూర్తిగా మారిపోయింది. వారు వచ్చిన తర్వాత ప్రతి రోజు నాలో నూతన శక్తి మొదలవుతుంది. వారితో గడిపిన ప్రతి క్షణం కూడా చాలా సంతోషంగా సాగుతుంది. వారు వచ్చిన తర్వాత మా ఇంట్లో సంతోషం రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం మా కుటుంబం సంపూర్ణం అయ్యిందంటూ కరణ్ కొడుకుల గురించి చెప్పుకొచ్చాడు. రూహీ.. యష్ లకు బాలీవుడ్ ప్రముఖుల నుండే కాకుండా కరణ్ జోహార్ అభిమానుల నుండి పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి. |
https://www.tupaki.com//entertainment/article/mahira-khan-in-raees-movie/147114 | షారూక్ ఖాన్ మూవీ రాయీస్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. రిపబ్లిక్ డే ముందు రోజున అంటే జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కి తగిన ఏర్పాట్లు జరిగాయి. రాయీస్ మూవీలో పాకిస్తానీ బ్యూటీ మహిరా ఖాన్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. అందుకే పలు వివాదాల్లో కూడా ఈ చిత్రం పేరు వినిపించింది. ఇప్పుడు రిలీజ్ కు అడ్డంకులు ఏర్పడకపోవచ్చు.తాజాగా రాయీస్ మూవీ నుంచి మహిరా ఖాన్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పాకిస్తానీ ఫిలి అండ్ టీవీ యాక్ట్రెస్ కావడంతో.. మహిరా ఖాన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసినా.. ఈ మూవీకి సంబంధించిన లుక్ మాత్రం బైట పెట్టలేదు. ఇప్పుడు రాయీస్ రిలీజ్ కి మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండడంతో... ఈ 32 ఏళ్ల బ్యూటీ రూపాన్ని చూపించింది రాయీస్ టీం. షారూక్ -మహిరాఖాన్ లు పక్కపక్కనే ఉన్న ఈ ఫోటోలో.. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమను పోస్టర్ ద్వారానే చూపించే ప్రయత్నం చేసింది యూనిట్.క్రిమినల్ అబ్దుల్ లతీఫ్ స్టోరీనే రాయీస్ అంటూ తీస్తున్నారనే ప్రచారాన్ని నిర్మాతలు ఖండించారు. జనవరి 25న రాయీస్ కి పోటీగా హృతిక్ రోషన్ మూవీ కాబిల్ కూడా రిలీజ్ కానుంది. దీంతో షారూక్-హృతిక్ ల మధ్య పోటీ ఎలా ఉంటుందో అని బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది <|hyperlink|> /Tupakidotcom/ |
https://www.tupaki.com//entertainment/article/nagababu-who-donated-a-range-rover/286193 | మెగా ప్రిన్సెస్ నిహారిక.. ఐజీ కుమారుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన చైతన్యను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లి వేడుకలు మెగా సెలబ్రేషన్స్ కి సంబంధించిన విజువల్స్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. తన కుమార్తె మెచ్చిన వరుడిని వెతికినందుకు నాగబాబు ఎంతో సంతోషంగా ఉన్నారు. నిహారిక-చైతన్య దంపతుల రొమాంటిక్ లవ్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు ఇన్ స్టా వేదికగా వైరల్ అవుతున్న సంగతి తెలిసినదే.ఇక అల్లుడికి ఉగాది కానుక అందింది. అయితే కానుక కాస్త ఆలస్యంగా అందింది. అల్లుడికి ప్రేమపూర్వకంగా నాగబాబు అదిరిపోయే రేంజ్ రోవర్ కార్ ని కానుకగా ఇచ్చారు. తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో నాగబాబు స్వయంగా కారును చైతన్య- నిహారికా జంటకు డెలివరీ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఉగాదికి కానుకివ్వాలనుకున్నాను కానీ ఆలస్యమైంది అని నాగబాబు తెలిపారు. హైదరాబాద్ షేక్ పేటలోని ల్యాండ్ రోవర్ షోరూమ్ కి నాగ బాబు చేరుకున్నట్లు విజువల్స్ చెబుతున్నాయి. కారును తనిఖీ చేసిన తరువాత నాగబాబు అవసరమైన పత్రాలపై సంతకం చేసి కారు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న చైతన్య నివాసానికి పంపించారు. నాగ బాబు అతని భార్య ఇచ్చిన బహుమతిని అందుకుని ఆ కొత్త జంట కొత్త కారులో చిల్ చేస్తారు.తెలుపు రంగు రేంజు రోవర్ ఖరీదు కూడా ఆ రేంజులోనే ఉంది. ఐదు సీట్ల ఎస్.యూ.వీ ఎక్స్షోరూమ్ ధర 64.44 లక్షలు. ఇకపై మెగా ప్రిన్సెస్ ని అల్లుడు ఇదే కార్ లో షికార్ తిప్పుతారన్నమాట. |
https://www.tupaki.com//entertainment/article/she-is-the-stylish-look-behind-nag-bigg-boss/265912 | బిగ్ బాస్ హోస్ట్ అంటే సూటులో మాత్రమే కనిపించే వారు. కాని నాగార్జున ఆ మార్క్ ను చెరిపేశారు. వారం వారం సరికొత్త క్యాజువల్స్ తో స్టైలిష్ గా కనిపిస్తు వచ్చారు. తెలుగు బిగ్ బాస్ మొదటి రెండు సీజన్ లు కూడా ఎన్టీఆర్ మరియు నాగార్జునలు ఎక్కువగా సూటులో కనిపించారు. కాని నాగార్జున మాత్రం చూద్దాం అన్నా కూడా సూటులో కనిపించకుండా చాలా స్టైలిష్ ఔట్ ఫిట్ లో కనిపిస్తున్నారు. ఆయన ఆరు పదుల వయసు కాకుండా రెండు పదుల వయసు తగ్గి కనిపిస్తున్నారు. అప్పట్లో అమ్మాయిల మన్మధుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున బిగ్ బాస్ స్టైలిష్ లుక్ తో ఈ తరం అమ్మాయిలకు కూడా నచ్చే విధంగా హోస్టింగ్ చేస్తున్నాడు. నాగార్జున ఇంత స్టైలిష్ గా కనిపించడానికి కారణం ఫ్యాషన్ డిజైనర్ మనోజ్ఞ ఆవునూరి. ఈమె ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఈమె చిరంజీవి సైరా సినిమాకు కూడా వర్క్ చేశారు. చిరు కూతురు సుష్మితతో కలిసి ఈమె ఆ సినిమా స్టైలింగ్ వ్యవహారాలు చూసుకున్నారు. అంతకు ముందు ఆ తర్వాత కూడా చాలా సినిమాలకు మరియు షో లకు ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. నిజామాబాద్ కు చెందిన మనోజ్ఞ ముంబయిలోని నిఫ్ట్ లో మాస్టర్స్ ఇన్ డిజైనింగ్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. దసరా రోజు ప్రత్యేక ఎపిసోడ్ కు సమంత హోస్ట్ గా వ్యవహరించింది. ఆ ఎపిసోడ్ లో సమంత కాస్ట్యూమ్స్ కలర్ ఫుల్ గా ఆకట్టుకునే విధంగా ఉన్నాయంటూ కామెంట్స్ వచ్చాయి. ఆ రోజు ఎపిసోడ్ కు కూడా మనోజ్ఞ డిజైనర్ గా వ్యవహరించారు. సమంత మరియు నాగార్జునల కు సరిగ్గా సూట్ అయ్యే కాస్ట్యూమ్స్ ను ఆమె డిజైన్ చేయడంతో ఆమె గురించి మరోసారి చర్చ జరుగుతోంది. |
https://www.tupaki.com//entertainment/article/jhanvi-kapoor-spotted-at-shopping/182878 | ముంబైలో పుట్టి పెరిగిన భామలు అంటే.. కచ్చితంగా ఫ్యాషన్ లవర్స్ అయి తీరాల్సిందే. లేటెస్ట్ ఫ్యాషన్ ఫాలో కావాల్సిందే. కామన్ పీపుల్ కే ఫ్యాషన్ మీద విపరీతమైన గ్రిప్ ఉంటుంది. అలాంటిది శ్రీదేవి కూతురు.. కాబోయే హీరోయిన్.. ఫ్యూచర్ లో స్టార్ అయిపోవడం ఖాయం అనే అంచనాలు.. కోట్లాది మంది ఫ్యాన్స్ ఆసక్తి.. ఇన్ని ఉన్న భామ ఇంకెంత స్టైలింగ్ ను చూపించగలదో.. జాన్వి కపూర్ కళ్లకు కట్టినట్లు చూపించేస్తోంది.షూటింగులు.. ఫోటో షూట్స్ అంటే ఎలాగా స్టైలింగ్ అదిరిపోతూనే ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో కూడా జాన్వి కపూర్ కొత్త ఫ్యాషన్స్ ను ఫాలో అయిపోతూ ఉంటుంది. ఇంతకు ముందు కాసింత కంట్రోల్ లో ఉండేది కానీ.. ఇప్పుడు ఆమె కొత్త సినిమా ధడక్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటూ.. విడుదలకు సిద్ధం అయిపోతుండడంతో.. రెండు విధాలా కలిసొచ్చేలా తన ఫ్యాషన్ ను చూపించేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ చిన్నపాటి షాపింగ్ కు వెళ్లింది. బాడీని బాగా అంటిపెట్టేసుకున్న జంప్ సూట్.. ఓ డెనిమ్ జాకెట్ ధరించి అమ్మడు ఈ షాపింగ్ కు వెళ్లింది.అయితే.. మినీ కంటే మరీ షార్ట్ గా.. మైక్రోస్ కంటే కొంచెం లెంగ్తీగా ఉన్న జంప్ సూట్.. అమ్మడి లోని గ్లామర్ యాంగిల్ ను బోలెడంత చూపించేస్తోంది. ఇంత గ్లామర్ గా ఉన్న ఈ యంగ్ బ్యూటీ.. తన అరంగేట్రానికి మాత్రం.. పిచ్చ డీగ్లామర్ రోల్ ను ఎంచుకోవడం విశేషం. మరాఠీ మూవీ సైరత్ ను హిందీలో రీమేక్ చేస్తుండగా.. అందులో తన ట్యాలెంట్ చూపించనుంది జాన్వి. |
https://www.tupaki.com//entertainment/article/radheshyam-double-dhamaka-darling-fans-are-the-guests/312712 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ''రాధే శ్యామ్''. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ పాన్ ఇండియా మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.సినిమా ప్రమోషన్స్ లో ఇన్నాళ్లూ నిదానమే ప్రదానం అన్నట్లుగా వ్యవహరించిన 'రాధే శ్యామ్' మేకర్స్.. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచారు. వరుస అప్డేట్స్ తో సినిమాపై భారీ హైప్ తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ - టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ట్రైలర్ లాంచ్ చేయడానికి చిత్ర బృందం రెడీ అవుతోంది. దీని కోసం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.'రాధే శ్యామ్' సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో డిసెంబర్ 23వ తేదీన ఘనంగా నిర్వహించడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఈ వేడుకకు పెద్ద ఎత్తున తరలి వచ్చే అభిమానుల చేత ట్రైలర్ లాంఛ్ చేయించాలని చూస్తున్నారట. ఇదే కనుక నిజమేతే ఒకే రోజున డార్లింగ్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. తమ ఫేవరేట్ హీరోని చూడటమే కాకుండా.. ట్రైలర్ ను ఆవిష్కరించే అవకాశం దక్కినట్లే. మరి త్వరలోనే 'రాధే శ్యామ్' ఈవెంట్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.ఇకపోతే 'రాధే శ్యామ్' ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ప్రభాస్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఇతర భాషల్లోనూ ఈ చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేయనున్నారని తెలుస్తోంది. అలానే రిలీజ్ కు 30 రోజులు మాత్రమే ఉండటంతో స్పెషల్ ఇంటర్వ్యూలు - ప్రోగ్రామ్స్ తో అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం.సంక్రాంతి బరిలో ఇప్పటికే పాన్ ఇండియా మూవీ 'ఆర్.ఆర్.ఆర్' - ప్రాంతీయ చిత్రం 'భీమ్లా నాయక్' ఉన్నాయి. వీటికి పూర్తిగా భిన్నమైన జోనల్ లో రూపొందిన ''రాధే శ్యామ్'' కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ - ప్రసీద - భూషణ్ కుమార్ నిర్మాతలు.నాలుగు దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకర్ - హిందీ వెర్సన్ కు మిథున్ సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించారు. ఇందులో భాగ్యశ్రీ - జగపతిబాబు - ప్రియదర్శి - సత్యరాజ్ - కునాల్ రాయ్ కపూర్ - సచిన్ ఖేడ్కర్ - మురళి శర్మ - ఎయిర్ టెల్ శాషా ఛత్రి - రిద్ది కుమార్ - సత్యన్ ఇతర పాత్రలు పోషించారు. 'సాహో' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని వస్తున్న ప్రభాస్.. ''రాధే శ్యామ్'' తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. |
https://www.tupaki.com//entertainment/article/rs-100-crore-tension-what-did-mahesh-say/331818 | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రతి సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద ఏదో ఒక రికార్డు అయితే క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా ఓపెనింగ్స్ విషయంలో అయితే మహేష్ స్థాయి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.అందుకే నిర్మాతలు ఆయన తో సినిమా చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మహేష్ బాబు తో సినిమా చేస్తే విడుదలకు ముందే ఈజీగా నిర్మాతలకు మినిమమ్ 50 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పవచ్చు. ఇక స్టార్ ప్రదర్శకులతో సినిమా ఉంటే మాత్రం వంద కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే కేవలం థియేట్రికల్ గానే కాకుండా మహేష్ బాబు సినిమాలకు ఇప్పుడు నాన్ థియేటరికల్ గా కూడా మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఇక మహేష్ బాబు 100కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఎప్పుడైనా టెన్షన్ కలిగించిందా అనే ప్రశ్న ఎదుర్కొన్నాడు.ఆ విషయంపై మహేష్ బాబు చాలా సున్నితంగా సమాధానమిచ్చాడు. నా సినిమాలు వంద కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నాయి అంటే అందులో పెద్దగా అయితే టెన్షన్ పడను. ఒక ఒక విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. నా స్థాయి ఎంత వరకు పెరిగింది అనే విషయంలో నాకు కూడా ఒక క్లారిటీ ఉంటే సంతోషంగా అనిపిస్తుంది. అంతేకాని వందకోట్ల టెన్షన్ అనేది నా జీవితంలో ఎప్పుడూ పెద్దగా ఉండదు అని మహేష్ తెలియజేశాడు.ఇక కథల విషయంలో అయితే పెద్దగా చర్చలు జరపకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తు ఉంటాను అని కూడా మహేష్ తెలియజేశాడు. ఎవరైనా దర్శకుడు కథ చెబితే అది నచ్చిందా లేదా అనే విషయంపై చాలా తొందరగా నిర్ణయం తీసుకుంటానని పెద్దగా ఎవరితోనూ డిస్కస్ కూడా చేయనని అన్నారు.ఇక మేజర్ సినిమా విషయంలో అడవి శేష్ కథ చెప్పినప్పుడు కూడా అలాగే నిర్ణయం తీసుకున్నాను అంటూ.. హీరోగా నిర్మాతగా కథల విషయంలో ఎప్పుడూ నా నిర్ణయాలు చాలా స్పీడ్ గానే ఉంటాయని మహేష్ వివరణ ఇచ్చాడు. |
https://www.tupaki.com//entertainment/article/bandra-another-gangster-is-entering-the-ring/368159 | కేజీఎఫ్ - కేజీఎఫ్ 2 కన్నడ రంగం నుంచి పాన్ ఇండియాలో సంచలన విజయాల్ని నమోదు చేసాయి. గ్యాంగ్ స్టర్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలు ఉత్తరాదిన కలెక్షన్ల ప్రభంజనం సృష్టించడంతో ఇప్పుడు సౌత్ కన్ను పూర్తిగా ఉత్తరాది మార్కెట్ పైనే ఉంది. పుష్ప 2 - కాంతార 2 - కార్తికేయ 3 ఇలా మునుముందు రానున్న సౌత్ సినిమాలన్నీ హిందీ మార్కెట్ ని టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే మాలీవుడ్ అగ్ర హీరో దిలీప్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెడుతున్నాడు.దీనికోసం అతడు మునుపెన్నడూ చూడని కొత్త అవతార్ లో కనిపించబోతున్నాడు. సూపర్ స్టార్ దిలీప్ నటించిన బాంద్రా మలయాళం (మాలీవుడ్) నుంచి మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. ఇటీవలి కాలంలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన మలయాళ చిత్రంగా చర్చ సాగుతోంది. రామలీల ఫేమ్ అరుణ్ గోపీ దర్శకత్వం వహించగా ఉదయకృష్ణ కథ ఆధారంగా భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని రూపొందిస్తున్నారు. ఈద్ సందర్భంగా మొదటి టీజర్ అంతర్జాలంలో విడుదలై వైరల్ గా మారింది.దిలీప్ ఇందులో 'అలాన్ అక అలెగ్జాండర్ డొమినిక్' పాత్రలో నటించారు. ఈ పాత్ర అభిమానుల్లో చాలా క్యూరియాసిటీని పెంచుతోంది. అతడు ఒక మాబ్ స్టర్ (జనాదరణ కలిగిన పెద్ద మనిషి) అని టీజర్ వెల్లడించింది. దిలీప్ పాత్ర పవర్ ఫుల్ గాను కనిపిస్తోంది. కొన్ని పవర్ ఫుల్ పంచ్ లైన్లతో టీజర్ ఆసక్తిని కలిగించింది. ముఖ్యంగా దిలీప్ మునుపెన్నడూ కనిపించని స్టైలిష్ మ్యాన్ గా అధునాతన అవతార్ లో కనిపిస్తున్నాడు. దిలీప్ పూర్తిగా అల్ట్రా-కూల్ హెయిర్ స్టైల్ తో రొమాంటిక్ గయ్ లా కనిపిస్తున్నాడు. ఇది అతడి గత చిత్రాల లుక్ కి పూర్తి భిన్నంగా ఉంది. అతని గడ్డం కేశాలంకరణ చాలా యూనిక్ స్టైల్ ని ఎలివేట్ చేసాయి.దిలీప్ పై హై-కాంట్రాస్ట్ లైటింగ్ లో చిత్రీకరించిన షాట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే గొప్ప నిర్మాణ విలువలతో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో పాన్ ఇండియా నాయిక తమన్నా ప్రధాన ఆకర్షణ కాగా మమతా మోహన్ దాస్ ఓ కీలక పాత్రలో కనిపిస్తోంది. మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా 'బాంద్రా'తో మలయాళంలో అరంగేట్రం చేస్తోంది. టీజర్ లో తమన్నా ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. దిలీప్ - తమన్నా భాటియా నడుమ రొమాన్స్ ఆకట్టుకుంటోంది.బాంద్రా తారాగణం పూర్తి వైవిధ్యంతో కనిపిస్తోంది. దిలీప్ - తమన్నా భాటియాలతో పాటు మమతా మోహన్ దాస్- డినో మోరియా- లీనా- రాజ్ వీర్ అంకుర్ సింగ్- దారా సింగ్ ఖురానా - అమిత్ తివారీ సహాయక పాత్రల్లో నటించారు. బాంద్రాలో చాలా మంది మలయాళీయేతర నటులు ఉండడంతో ఇది పాన్ ఇండియా అప్పీల్ తో కనిపిస్తోంది. టీజర్ లో కేరళ- రాజస్థాన్ కోటలు- ముంబైలోని బాంద్రా జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కేరళ వెలుపల తెరకెక్కిన ఈసినిమాలో యాక్షన్- పార్ట్ కీలకంగా బాంద్రా జిల్లాలో తెరకెక్కడం హైలైట్. వివేక్ హర్షన్ ఎడిటింగ్ వర్క్ అందిస్తున్నారు. కైతి ఫేమ్ సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం - నేపథ్య సౌండ్ ట్రాక్ ను అందించారు. అజిత్ వినాయక ఫిల్మ్స్ ఈ చిత్రానికి ఫైనాన్స్ చేస్తోంది.దర్శకుడు-నటుల ద్వయం (అరుణ్ గోపీ - దిలీప్) రామలీల లాంటి బ్లాక్ బస్టర్ కి కలిసి పని చేసారు. ఆ తర్వాత దాని కంటే పెద్ద బ్లాక్ బస్టర్ కోసం ప్రయత్నిస్తున్నారు. అరుణ్ గోపీ గతంలో ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ 'బాంద్రా' యాక్షన్ థ్రిల్లర్ అని వెల్లడించారు. ఇందులో తమన్నా పాత్ర మలయాళం- హిందీలో మాట్లాడడం మరో ఆసక్తికరమైన ఎలిమెంట్. ఈ పాత్ర సినిమాకి చాలా కీలకమైనది.దిలీప్ నుంచి వరుస సినిమాలుదిలీప్ ప్రస్తుతం 'ఉడల్' ఫేమ్ రతీష్ రఘునందన్ దర్శకత్వం వహించిన #డి 148 చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించాల్సి ఉంది. ఈ చిత్రంలో అతను నీతా పిళ్లై - కన్నడ నటి ప్రణిత సుభాష్ తో కలిసి నటిస్తున్నారు. కేరళలోని కొట్టాయం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ గత నెలలో పూర్తయింది.వినీత్ కుమార్ దర్శకత్వంలో D149 కి సన్నాహకాలు సాగుతున్నాయి. ఇది ఒక ప్రత్యేకమైన రొమాంటిక్ కామెడీ అని తెలుస్తోంది. ఇందులో దిలీప్ ఐదుగురు కథానాయికల (కొత్త భామల) సరసన కనిపిస్తాడని సమాచారం. దిలీప్ సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ 'పరాక్కుమ్ పప్పన్' చిత్రీకరణను కూడా ప్రారంభిస్తాడు. ఇందులో అతను సూపర్ హీరో పాత్రను పోషించనున్నాడు. ప్రముఖ కథానాయికను వేధించిన కేసులో దిలీప్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అతడు బెయిల్ పై ఇప్పుడు బయటపడి వరుస షూటింగులతో బిజీగా ఉన్నాడు. |
https://www.tupaki.com//entertainment/article/mohan-babu-emotional-speech-at-dasari-short-films-awards-event/212416 | టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా నిలిచి, అందరికి ఆదర్శ ప్రాయుడిగా నిలిచిన దర్శకరత్న దాసరి నారాయణ రావు జయంతి సందర్బంగా దర్శకుల దినోత్సవంను జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో దాసరి పేరు మీద టాలెంట్ అకాడమీని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఫార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరంకు గాను విజేతలకు ప్రసాద్ ల్యాబ్స్ లో బహుమతి ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు - జయసుధ - ఆర్ నారాయణ మూర్తి - సి కళ్యాణ్ ఇంకా తమ్మారెడ్డి భరద్వాజా పాల్గొన్నారు.ఈ సందర్బంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో పలు సార్లు నేను గురువు గారితో మీ నీడలో మేము ఉండాలండి, మీ కంటే ముందు మేము పోవాలండీ అనేవాడిని, ఆ సమయంలోనే ఆయన నేను వెళ్తే అన్ని నువ్వే చూసుకోవాలని అనేవారు. ఆయన మాకు అప్పగించిన పనిని మేము సమర్ధవంతంగా నిర్వర్తించలేక పోయాం. ఆయన వీలునామాలో నా పేరు - మురళి మోహన్ పేర్లను రాశారు. మేమిద్దరం ఆస్తుల పంపకాలు చేయాలనేది గురువుగారి ఆలోచన. ఇద్దరు బిడ్డల్లో ఏ బిడ్డకు కూడా అన్యాయం జరుగకుండా ఆస్తుల పంపకం ఉండాలని ఆయన కోరుకున్నారు. కాని గురువు గారు కోరుకున్నట్లుగా మేము చేయలేక పోయాం. అలా చేయలేక పోవడంకు కారణం మా అసమర్ధతే అని అన్నాడు.దాసరి కుటుంబ సభ్యులకు ఆస్తి పంపకం వియషయంలో మోహన్ బాబు అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇక దాసరి గారి పేరుతో నడుస్తున్న ట్యాలెంట్ అకాడమీ వారు ఎవరినైనా ఒక స్టూడెంట్ ను సూచిస్తే మేము మా విద్యా సంస్థలో ఎల్ కేజీ నుండి ప్లస్ టు వరకు ఉచిత విద్యను అందిస్తాం అని మోహన్ బాబు హామీ ఇచ్చాడు. ఈ సందర్బంగా ఉత్తమ షార్ట్ ఫిల్మ్ లు తీసిన దర్శకులకు అవార్డుల ప్రధానం మరియు క్యాష్ బహుమతి ఇచ్చారు. |
https://www.tupaki.com//photo-story/dimplehayati-1306248 | తెలుగమ్మాయిలు గ్లామర్ రోల్స్ చేయడం చాలా తక్కువ. కొంత మంచి బ్యూటిస్ మాత్రం బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా అందాల ప్రదర్శనతో కుర్రకారుకి సోయగాల విందు అందిస్తూ ఉంటారు. అలాంటి బ్యూటిస్ లో డింపుల్ హయాతి ముందు వరుసలో ఉంటుంది. గల్ఫ్ అనే మూవీతో టాలీవుడ్ లోకి పరిచయం అయిన ఈ చిన్నది ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోవడానికి చాలా కాలం పట్టింది.
గద్దలకొండ గణేష్ సినిమాలు ఐటెం సాంగ్ ద్వారా ఈ అమ్మడు పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత అవకాశాలు పెరిగాయి. తమిళంలో విశాల్ కి జోడీగా ఒక సినిమాలో నటించింది.
అలాగే హిందీలోకి అత్రాంగి రే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఖిలాడీ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజకి జోడీగా నటించింది. ఈ మూవీలో అయితే ఏకంగా టూ పీస్ బికినీ వేసి హద్దులు లేని అందాల ప్రదర్శన చేసింది.
అయితే ఈ మూవీ డింపుల్ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. కానీ గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తీసుకొచ్చింది. తెలుగమ్మాయి అయిన అందాల ప్రదర్శనకి ముందుంటుంది అనే ఇమేజ్ ని సొంతం చేసుకుంది. దీంతో వెంటనే గోపీచంద్ కి జోడీగా రామబాణం సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అయితే దురదృష్టం కొద్ది ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది.
ప్రస్తుతం ఈమె ఖాతాలో సినిమాలు అయితే ఏవీ లేవు. దీంతో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోటోషూట్ లతో డింపుల్ హయాతి తనని తనకు షోకేస్ చేసుకోవడంపై దృష్టి పెట్టింది. తాజాగా మరో హాట్ ఫోటో షూట్ తో ఇన్ స్టాగ్రామ్ లో అందాల ప్రదర్శన చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ షర్ట్ వేసిన ఈ బ్యూటీ పై ఎద అందాలు మాత్రం దాచుకోకుండా నిండుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ అందాలు డింపుల్ లుక్స్ ని మరింత గ్రాండ్ గా రిప్రజెంట్ చేస్తూ ఉండటం విశేషం. వీటికి తగ్గట్లుగా అదిరిపోయే హస్కీ లుక్స్ తో మత్తెక్కిస్తూ కుర్రకారు గుండెలలో తుఫాన్ అలజడి సృష్టిస్తోంది. |
https://www.tupaki.com//entertainment/hardikcommentsonnatasapost-1375302 | క్రికెటర్ హార్దిక్ పాండ్యా నుండి విడిపోయిన తర్వాత నటాషా స్టాంకోవిచ్ తన మొదటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ను షేర్ చేసింది. ఈ పోస్ట్లో జూనియర్ పాండ్యా (కుమారుడు అగస్త్య) సెర్బియాలోని డైనోసార్ థీమ్ పార్క్లో ఆటలు ఆడుకుంటూ ఆనందంగా కనిపించాడు. ఇన్స్టాగ్రామ్ లో ఆ ఫోటోలపై ఇంతటి ఎమోషనల్ మూవ్ మెంట్ లోను హార్దిక్ సాధారణంగా స్పందిస్తున్నారు. అతడు అనవసరమైన ఎమోషనల్ పోస్ట్ లు చేయడం లేదు. దీంతో వారి మధ్య పూర్తిగా చెడలేదని చాలా మంది భావిస్తున్నారు.
సోషల్ మీడియాల్లో అభిమానుల స్పందనలు పరిశీలిస్తే... వీరిలో కొందరు హార్దిక్ -నటాషా స్నేహపూర్వకంగా ఉన్నారని భావిస్తున్నారు. ''వారు స్నేహపూర్వకంగా ఉన్నట్లు అనిపిస్తుంది'' అని ఒక నెటిజన్ రాయగా, ''వారు త్వరలో అన్ని విషయాలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను'' అని మరొకరు వ్యాఖ్యానించారు.
నటాసా పోస్ట్పై హార్దిక్ వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి. తమ కుమారుడి ఫోటోలను నటాషా షేర్ చేయగానే.. హార్దిక్ హార్ట్ ఎమోజీతో క్యాప్షన్ ఇచ్చాడు. బ్యాడ్ ఐ- హార్ట్- ఓకే హ్యాండ్ ఈమోజీలను షేర్ చేసి... పోస్ట్ కింద గుండె ఈమోజీని కూడా షేర్ చేసాడు. హార్దిక్ పోస్ట్ లో నటాషాపై ద్వేషాన్ని చూపకపవడంతో అభిమానులు థ్రిల్ అయ్యారు. కొందరు వారిని మళ్లీ కలిసిపోవాలని కూడా కోరారు. మీరిద్దరూ విడాకులు తీసుకోరు! అని ఒక అభిమాని రాశాడు. బ్రో తిరిగి కలవండి బ్రో అని మరొకరు రాసారు. చాలామంది అతడి పోస్ట్ల క్రింద హార్ట్ బ్రేక్ ఎమోజీలతో కామెంట్ చేశారు.
హార్థిక్ నుంచి విడిపోతున్నట్లు నటాషా ప్రకటించడానికి ముందు నుండి ఆన్లైన్లో ద్వేషాన్ని ఎదుర్కొంటున్న సమయంలో హార్దిక్ తనకు మద్దతుగా నిలిచాడు. వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని ఆన్లైన్లో పుకార్లు వచ్చినప్పుడు నటాషా స్త్రీద్వేషాన్ని, అనవసరమైన ఆగ్రహాలను ఎదుర్కొంది. ప్రజలు తనను రకరకాలుగా కామెంట్లు చేసారు. ఒక అభిమాని నటాషాకు మద్ధతుగా నిలుస్తూ ''ఆమె గురించి ద్వేషాన్ని పెంచడం ఆపండి. హార్దిక్ కూడా ఎలాంటి ద్వేషాన్ని ప్రదర్శించడం లేదు. ఇది వారి వ్యక్తిగత జీవితం. విడిపోవడం వారి వ్యక్తిగత నిర్ణయం. కాబట్టి అందులోకి రావద్దు'' అని రాసారు.
విడాకుల ప్రకటనకు వారం ముందు అగస్త్యతో ముంబై నుండి సెర్బియాకు బయలుదేరారు నటాషా. అనంతరం సోషల్ మీడియాలో విడాకులను ధృవీకరించారు. నటాషా- హార్దిక్ 31 మే 2020న వివాహం చేసుకున్నారు. వారు ఫిబ్రవరి 2023లో తమ పెళ్లి ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు. జూలై 2024లో విడిపోయారు.
A post shared by @natasastankovic__ |
https://www.tupaki.com//entertainment/article/pspk28-title-was-the-first-look-coming-then/292711 | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ - హరీష్ కాంబోలో రానున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే టైటిల్ - ‘PSPK28’ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.ఉగాది రోజున ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను విడుదల చేయాలనుకున్నామని.. కానీ కరోనా కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశామని మేకర్స్ ప్రకటించారు. దీంతో టైటిల్ ఖరారు చేయడమే కాకుండా.. ఆల్రెడీ ఫస్ట్ లుక్ డిజైన్ కూడా రెడీగా ఉన్నట్లు కన్ఫర్మ్ అయింది. అంతేకాదు అవి ఎలా ఉండబోతున్నాయంటూ ఇంతకముందు కంటే ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి మరింత ఎక్కువైంది. అయితే ఈ అప్డేట్స్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చే సెప్టెంబర్ 2న లేదా స్వాతంత్ర్య దినోత్సవం నాడు రివీల్ చేసే అవకాశం ఉందని చెప్పాలి.‘PSPK28’ కాన్సెప్ట్ పోస్టర్ తో ఈసారి ఎంటర్టైన్మెంట్ తోపాటుగా సోషల్ మెసేజ్ కూడా ఇవ్వబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఇండియా గేట్ బ్యాగ్రౌండ్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ - సుభాష్ చంద్రబోస్ ఫోటోలు చూపిస్తూ.. ఓ బైక్ పై పెద్ద బాలశిక్ష - గులాబీ పువ్వును పెట్టి ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. దీనిని బట్టి పవన్ తరహా దేశ భక్తి షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ లెక్కన పవన్ బర్త్ డే నాడు ఒక అప్డేట్.. ఆగస్ట్ 15న మరో అప్డేట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి పవర్ స్టార్ టీమ్ ఏ ముహార్తాన్ని ఫిక్స్ చేస్తారో చూడాలి. |
https://www.tupaki.com//entertainment/article/anchor-srimukhi-reveals-another-aspect-of-himself/281105 | పాపులర్ టీవీ యాంకర్ శ్రీముఖి.. గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టాలీవుడ్ యాంకర్ లలో మైక్ లేకపోయినా అందరికి వినపడేలా మాట్లాడగలిగే స్టామినా కలిగిన శ్రీముఖి.. ప్రస్తుతం తెలుగు టాప్ యాంకర్లలో ఒకరు. ఎన్నో టీవీ షోలు, రియాలిటీ ప్రోగ్రాంలు చేస్తూ వస్తుంది. అయితే శ్రీముఖి యాక్టింగ్ బాగా చేస్తదని అందరికి తెలుసు. కానీ యాక్టింగ్ తో పాటు శ్రీముఖిలో చాలా టాలెంట్స్ ఉన్నాయని ఒక్కొక్కటిగా బయటకి తీస్తోంది. అలాగే ఈమధ్య తన ప్రేమ వ్యవహారం కూడా బయట పెట్టినట్లు వార్తలొచ్చాయి. సినిమాలు టీవీ షోలతో బిజీగా ఉండే సెలబ్రిటీలు లాక్ డౌన్ ముగియగానే ప్రేమ, పెళ్లి విషయాలను బయటపెడుతూ సర్ప్రైజ్ ఇస్తున్నారు.టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా మెల్లగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. తాజాగా శ్రీముఖి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఈ యాంకరమ్మ ఇటీవలే ఓ టీవీ షోలో ఆల్రెడీ కమిటెడ్ అంటూ చెప్పింది. బుల్లితెర యాంకర్ గా రాణిస్తున్న శ్రీముఖి త్వరలో పెళ్లి భోజనం పెట్టనుందని అంతా సంబరపడిపోతున్నారు. తాజాగా ఆమె మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా ఇవే సందేహాలు వ్యక్తం అవుతాయి. ఇదిలా ఉండగా.. శ్రీముఖి తాజాగా తనలోని ఓ మరో టాలెంట్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. అదేంటంటే శ్రీముఖికి చిత్రలేఖనం కూడా బాగానే వచ్చట. ఆ విషయాన్నీ శివరాత్రి జాగారం సందర్బంగా మహాశివుడి చిత్రాన్ని పేపర్ పై గీసిన ప్రూవ్ చేసింది. ఆ పరమశివుడి చిత్రం ఫోన్ లో చూసి గీసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. |
https://www.tupaki.com//entertainment/article/noel-in-nenu-naa-boyfriend-movie/133265 | కుమారి 21ఎఫ్ మూవీతో.. అనుకున్న దాని కంటే ఎక్కువగానే టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించింది హేభా పటేల్. దీంతో పాటు ఈడో రకం ఆడో రకం సక్సెస్ తర్వాత లక్కీ హ్యాండ్ అనే ట్యాగ్ ను కూడా తగిలించేసుకుంది. ఇప్పుడు అమ్మడి చేతిలో చెప్పుకునే సంఖ్యలోనే ప్రాజెక్టులున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన కూడా ఛాన్స్ దక్కించుకున్న హేభ.. ఓ సినిమాలో లీడ్ కేరక్టర్ చేస్తున్న విషయం తెలిసిందే. 'నేను నా బాయ్ ఫ్రెండ్స్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హేభా పటేల్ పాత్ర చుట్టూనే స్టోరీ తిరగనుంది. ఇందులో ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ పాత్రలను ఫామ్ లో ఉన్న కుర్రాళ్లతో చేయించనున్నారు. అయితే ఈ సినిమాలో నోయల్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడట. హీరోయిన్ హేభా పటేల్ కు, తనకు మధ్య ఓ ఇంట్రెస్టింగ్ ట్రాక్ ఉంటుందని కూడా చెప్పుకొచ్చాడు నోయల్. అయితే.. ఆ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ లో తాను ఒకడినని మాత్రం అనలేదు.బాస్కెట్ బాల్ కోచ్ గా స్టోరీకి కీలకమైన పాత్రలో 'నేను నా బాయ్ ఫ్రెండ్స్' సినిమాలో కనిపించనున్నాడు నోయల్. కుమారి 21ఎఫ్ లో కూడా నోయల్ కు, హేభాకు మధ్య ఓ ట్రాక్ నడిచిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో రేపిస్ట్ గా నటించిన నోయల్.. ఇందులో బాస్కెట్ బాల్ కోచ్ పాత్ర చేస్తున్నాడన్న మాట. మరి ఈ రేపిస్ట్ కోచ్ అంటే ఏమేం ట్రైనింగ్ ఇస్తాడో కదా! |
https://www.tupaki.com//entertainment/article/action-episodes-in-naga-chaitanya-savya-sachi-movie/175966 | హీరోయిన్ సమంతతో పెళ్లికి ముందుగా నాగచైతన్య యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం యుద్ధం శరణం చేశాడు. సినిమాలో యాక్షన్ సీన్లు బాగానే ఉన్నా కథ రొటీన్ అయిపోయేసరికి అదేమో బాక్సాఫీసును ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమా రిలీజ్ అయిన కొద్దిరోజులకే సమంతను పెళ్లి చేసుకుని కాస్త షూటింగులకు గ్యాపిచ్చాడు. కొద్దిరోజుల్లోనే తిరిగొచ్చి ప్రేమమ్ ఫేం చందు మొండేటితో సవ్యసాచి షూటింగ్ మొదలుపెట్టేశాడు. సవ్యసాచి సినిమాను కూడా డైరెక్టర్ చందు మొండేటి యాక్షన్ ఓరియంటెడ్ గానే తీర్చిదిద్దుతున్నాడు. ఇందులో నాగచైతన్య కొన్ని ప్రత్యేక శక్తులున్న వ్యక్తిగా కనిపించబోతున్నాడు. అందుకు తగ్గట్టే అతడిని డేర్ డెవిల్ లా చూపించబోతున్నాడని సవ్యసాచి టీం చెబుతోంది. ఈ సినిమాలో ఆరు మేజర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని.. అవన్నీ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయని.. వాటిని ఓ రేంజిలో తీస్తున్నారని సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. మూవీలో ఈ యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయనే నమ్మకంగా ఉన్నారు. దీనికితోడు ఈ సినిమాలో నెగిటివ్ రోల్ ను మాధవన్ చేస్తున్నాడు. హీరోను ఢీకొట్టే బలమైన విలన్ గా అతడు కూడా మరింత మెప్పిస్తాడని అంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం సినిమా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ భారీ మొత్తమే వెచ్చిస్తోందని తెలుస్తోంది. చైతు కెరీర్ లో యాక్షన్ సన్నివేశాల కోసం ఇంత రేంజిలో వెచ్చించడం ఇదే ప్రథమం. లవ్ స్టోరీలతో గుర్తుంచుకోదగిన హిట్లు కొట్టిన చైతుకు మాస్ ఎంటర్ టెయినర్లలో హిట్ ఇంతవరకు అందని ద్రాక్షగానే ఉంది. చూస్తుంటే సవ్యసాచి అతడి ఆశలు నెరవేర్చేలా ఉన్నాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ. |
https://www.tupaki.com//entertainment/article/anasuya-bharadwaj-fires-on-netizens/262624 | అనసూయ సోషల్ మీడియాలో తనకు నెగటివ్ కామెంట్స్ చేసే వారికి సీరియస్ గా కౌంటర్ ఇస్తూనే ఉంటుంది. తన గురించి తన వ్యక్తిగత విషయాల గురించి తన కుటుంబం గురించి ఎవరైనా తీసి కామెంట్ చేస్తే ఖచ్చితంగా స్పందిస్తుంది. తాజాగా ఈమె భర్త భరద్వాజ్ పుట్టిన రోజు సందర్బంగా గోవాకు హాలీడే వెళ్లింది. అక్కడ ఉన్నప్పటి ఫొటోలను షేర్ చేసింది. షార్ట్ స్కర్ట్ వేసుకుని ఫొటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా అనసూయ ఒక ఫొటోను షేర్ చేసి హిందూ సముద్రం వద్ద అంటూ కామెంట్ పెట్టింది. ఆ ఫొటోకు చాలా మంది గోవాలో హిందూ మహా సముద్రం ఎక్కడిది అమ్మడు అంటూ ప్రశ్నించారు. ఆమాత్రం తెలియకుండా ఎలా ఇంత స్టార్ అయ్యావని మరి కొందరు కామెంట్ చేయడం మొదలు పెట్టారు.తన పోస్ట్ పై వస్తున్న కామెంట్ కు చాలా సీరియస్ అయ్యింది. హాఫ్ మైండ్ ఉన్న వారికి నేను సమాధానం చెప్పను. ఇదే వారికి సమాధానం అంటూ విక్కీ పీడియాలో హిందూ మహా సముద్రంకు సంబంధించిన సమాచారంను స్క్రీన్ షాట్ తీసి పెట్టింది. అరేబియా సముద్రం హిందూ మహా సముద్రంలోని ఒక భాగం అనే విషయం తెలియని మీరు నాకు కామెంట్ పెడుతున్నార అంటూ తీవ్రంగా అసహనం వ్యక్తం చేసింది. అనసూయ సమాధానంకు అంతా ఫిదా అవుతున్నారు. మీరు నాలెడ్జ్ పరంగా కూడా ఇంత సూపర్ అనుకోలేదు మేడం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. |
https://www.tupaki.com//entertainment/article/nag-ashwin-hints-at-something-small/347524 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. మరి కొన్ని గంటల్లో అక్టోబర్ 23న ఆదివారం ప్రభాస్ బర్త్ డే వేడుకలు జరగబోతున్నారు. ఇప్నటికే సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టిన ఫ్యాన్స్ ప్రభాస్ నుంచి క్రేజీ అప్ డేట్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేస్తున్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె వంటి మూడు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న ప్రభాస్ అందులో 'ఆదిపురుష్' షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరికి రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇక మిగతా రెండు ప్రాజెక్ట్ లైన సలార్, ప్రాజెక్ట్ కె చిత్రీకరణ దశలో వున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఓ భారీ హారర్ థ్రిల్లర్ ని చేయబోతున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన టుక్ టెస్ట్ ఫొటో షూట్ జరిగింది. టెస్ట్ షూటింగ్ కూడా మారుతి పూర్తి చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి అనౌన్స్ మెంట్ పోస్టర్ ని ఆదివారం మేకర్స్ విడుదల చేయబోతున్నారు. సలార్ నుంచి ఇప్పటికే ప్రభాస్ లుక్ బయటికి వచ్చిన నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏతైనా సర్ ప్రైజ్ ఇస్తాడేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ తో పాటు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న 'ప్రాజెక్ట్ కె' నుంచి కూడా అప్ డేట్ ని ఆశిస్తున్నారు. ఇటీవల అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా నాగ్ అశ్విన్ ఈ మూవీ నుంచి కేవలం హ్యాండ్ వున్న పిక్ ని మాత్రమే విడుదల చేసి షాకిచ్చాడు.ఈ నేపథ్యంలో బర్త్ డే సందర్భంగా అప్ డేట్ కావాలంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 'హాయ్ అన్నా అసలు గుర్తున్నామా' అని ఫస్ట్ లుక్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నామని వరుస ట్వీట్ లు చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ట్వీట్ లపై ఫైనల్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించాడు. స్మాల్ అప్ డేట్ ని పుట్టిన రోజు సందర్భంగా అందించబోతున్నామంటూ ప్రకటించాడు.దీంతో ఫ్యాన్స్ మళ్లీ కామెంట్ లు చేయడం మొదలు పెట్టారు. స్మాల్ అంటే మళ్లీ ఏ ప్రకటన ఫోటోనో రిలీజ్ చేస్తాడని కొంత మంది అంటుంటే మరి కొంత మంది మాత్రం ఫస్ట్ లుక్ ఇస్తాడా.. లేక హ్యాండిస్తాడా? అని కామెంట్ లు చేస్తున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. |
https://www.tupaki.com//entertainment/article/anil-ravipudi-counter-to-rajmouli/322760 | చిన్న పెద్ద అనే తేడా లేకుండా సౌత్ ఫిల్మ్ మేకర్స్ మరియు స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ హడావుడి చేస్తున్నారు. ప్రతి చిన్న సినిమాను కూడా ఈ మధ్య కాలంలో సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం అంటూ ప్రకటిస్తున్నారు. ఫలితం ఎలా వస్తుంది అనేది పట్టించుకోకుండా విడుదలకు ముందు మాత్రం తెగ హడావుడి చేస్తున్నారు.ఇలా చిన్నా చితకా సినిమాలు ఎన్నో ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రం పరవాలేదనిపించాయి.. కొన్ని సినిమాలు మాత్రం ఇతర భాషల్లో కనీసం కనిపించను కూడా కనిపించలేదు. పలువురు దర్శకులు పాన్ ఇండియా సినిమా లకు కథలను రెడీ చేసుకుంటున్నారు. ఈ సమయంలో అనీల్ రావిపూడి మాత్రం పాన్ ఇండియా ఆసక్తి లేదంటూ వ్యాఖ్యలు చేశాడు.అనిల్ రావిపూడి పాన్ ఇండియా సినిమాలపై ఆసక్తి లేదనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెళ్లడించాడు. ఆయన మాట్లాడుతూ నేనేమీ పాన్ ఇండియా సినిమాలు చేయాలని కోరడం లేదు చేయడం లేదు. కానీ నేను చేసే ప్రతి సినిమా కూడా పైసా వసూల్ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. అందుకోసం నా స్క్రిప్ట్ లను రెడీ చేసుకుంటున్నాను అన్నాడు. అంతే కాకుండా ప్రతి సినిమాను ఎక్కువ రోజులు చేయడం ద్వారా నాకు బోర్ వస్తుంది.అందుకే ప్రతి సినిమాను కూడా తక్కువ రోజుల్లోనే పూర్తి చేయాలని భావిస్తాను. నా ప్రతి సినిమాను నాలుగైదు నెలల్లోనే పూర్తి చేసేలా మొదటనే ప్లాన్ చేసుకుంటాను అన్నాడు. అనీల్ రావిపూడి వ్యాఖ్యలు చూస్తుంటే పాన్ ఇండియా సినిమాలు చేయాలని ప్రాకులాడుతు సంవత్సరాలకు సంవత్సరాలు తీసుకుంటున్న దర్శకులకు కౌంటర్ గా అనిపిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది రాజమౌళికి కౌంటర్ అంటూ కొందరు గుసగుసలాడుతున్నారు. రాజమౌళి వరుసగా భారీ బడ్జెట్ తో ఎక్కువ కాలం సినిమాలు తీస్తూ పాన్ ఇండియా సినిమాలంటూ మూడు నాలుగు సంవత్సరాలకు ఒక్కటి చొప్పున సినిమాను విడుదల చేస్తున్నాడు. అందుకే అనీల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడనేది కొందరి అభిప్రాయం.తన ప్రతి సినిమా తక్కువ టైమ్ లోనే పూర్తి చేయాలనుకున్న అనీల్ కి ఎఫ్ 3 సినిమా విషయంలో మాత్రం ఆయన అంచనాలు తారుమారయ్యాయి. కరోనా కారణంగా ఏకంగా రెండు సంవత్సరాలుగా ఆ సినిమా షూటింగ్ జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి అయిన ఎఫ్ 3 సినిమా ను ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పటి వరకు ప్లాప్ అనేది అనిల్ రావిపూడికి తెలియదు. కనుక ఎఫ్ 3 కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుని.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్.. వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కూడా అదే తరహా విజయాన్ని ఎఫ్ 3 సొంతం చేసుకుంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలోనే ఆయన తదుపరి సినిమా గురించిన చర్చ మొదలైంది. ఆయన తదుపరి సినిమా నందమూరి బాలకృష్ణ హీరోగా చేయబోతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ తో గతంలోనే అనిల్ రావిపూడి సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మొదలవ్వలేదు. ఎట్టకేలకు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఓకే అయ్యింది.అఖండ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్నాడు. ఆ సినిమా ఈ సమ్మర్ చివరికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా ను బాలయ్య మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య మరియు అనీల్ రావిపూడి కాంబో సినిమా ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. |
https://www.tupaki.com//entertainment/article/dubbing-artist-srinivasamurthy-passed-away/358264 | సినామీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కొనసాగుతూనే వున్నాయి. ఇటీవల ప్రముఖ సీనియర్ నటలు మృతి చెందిన వార్తలు మర్చిపోక ముందే శుక్రవారం మరో ఇద్దరు ఇండస్ట్రీ ప్రముఖులు కన్ను మూయడం కలవరానికి గురిచేస్తోంది శుక్రవారం నటి జమున మృతి చెందగా అదే రోజు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి హఠాన్మరణం పలువురిని షాక్ కు గురి చేస్తోంది. ఎంతో మంది తమిళ హీరోలకు, తెలుగులో తన గాత్రాన్ని అందించిన శ్రీనివాసమూర్తి తెలుగు హీరో డా. రాజశేఖర్ కు కూడా డబ్బింగ్ చెప్పారు.డైలాగ్ కింగ్ సాయి కుమార్ డబ్బింగ్ చెప్పడం మానేయడంతో ఆ స్థానంలో హీరో రాజశేఖర్ కు శ్రీనివాసమూర్తి డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు. హీరోలకు డబ్బింగ్ చెప్పడంలో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న ఆయన చెన్నైలో గుండెపోటు కారణంగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో ఏళ్లుగా డబ్బింగ్ కళాకారుడిగా తనదైన ముద్ర వేసుకున్న ఆయన ఎంతో మంది తమిళ హీరోలకు తెలుగులో తన గాత్రం అందిస్తూ వారి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.తెలుగులో సూర్య, అజిత్, మోహన్ లాల్ , జయరామ్, రాజశేఖర్, విక్రమ్ వంటి ఎంతో మంది స్టార్స్ నటించిన సినిమాలకు తన వాయిస్ ని అందించారు. చాలా వరకు సినిమాల్లో నటించినా తనకు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నారు. సూర్య, అజిత్, మోహన్ లాల్ , జయరామ్, రాజశేఖర్, విక్రమ్ వంటి ఎంతో మంది స్టార్స్ నటించిన సినిమాల్లోని వారి పాత్రలకు వాయిస్ అందించిన శ్రీనివాస మూర్తి అకాల మరణంతో వారికి తెలుగులో డబ్బింగ్ ఎవరు చెబుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.చిన్న వయసులోనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న శ్రీనివాస మూర్తి గుండెపోటు కారణంగా అకాల మరణం చెందడం ఆయన అభిమానుల్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా శ్రీనివాస మూర్తి లోటుని భర్తీ చేయలేమని తను ఒక్కడే ఐదారుగురు హీరోల పాత్రలకు తెలుగులో ప్రాణం పోశాడని, ఇప్పుడు ఆ లోటుని ఎవరూ భర్తీ చేయలేరని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 'అపరిచితుడు' తెలుగు వెర్షన్ మూవీ కోసం విక్రమ్ కు ఆయన చెప్పిన డబ్బింగ్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలిచింది. సూర్య సింగం సిరీస్, 24, జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కు, 'అల వైకుంఠ పురములో' మూవీ కోసం జయరామ్ కు ఇలా చాలా వరకు బ్లాక్ బస్టర్ సినిమాలకు శ్రీనివాస మూర్తి పలువురు హీరోలకు తన గాత్రాన్ని అందించారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. |
https://www.tupaki.com//entertainment/article/nandamuri-harikrishna-death-samantha-trolled-by-twitter-followers/192169 | తెలుగుదేశం పార్టీ నేత -సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఈరోజు పొద్దున రోడ్ యాక్సిడెంట్ లో దురదృష్టకరంగా తనువు చాలించడం తెలుగువారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. సాధారణ ప్రజలతో పాటు పలువురు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు - రాజకీయ నాయకులు నందమూరి కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. చాలామంది లాగే హీరోయిన్ సమంతా కూడా ట్విట్టర్ ద్వారా తన సంతాపం తెలిపింది. కానీ నెటిజనుల ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది.సమంతా ఇలా ట్వీట్ చేసింది "# RIP హరికృష్ణ. ఈ వార్తతో షాక్ కు గురయ్యాను. ఎంతో బాధగా ఉంది. ఇలాంటి కష్టకాలంలో అయన కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను." కానీ హరికృష్ణ గారు అని సంబోధించక పోవడంతో ఆగ్రహానికి గురైన నెటిజనులు "అసలు నువ్వు ముందు పెద్దవారిని గౌరవించడం నేర్చుకో" అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నెటిజనుల వద్ద నుండి హీట్ తగలడంతో ఆ ట్వీట్ ను డిలీట్ చేసి మరో ట్వీట్ లో 'రిప్ హరికృష్ణ గారు అంటూ' తన పొరపాటును సరిదిద్దుకుంది.తప్పును దిద్దుకుంది కానీ నెటిజనుల - నందమూరి అభిమానుల ఆగ్రహం వెంటనే చల్లారదు కదా. సమంతా మొదటిసారి పోస్ట్ చేసి డిలీట్ చేసిన ట్వీట్.. రెండో సారి చేసిన ట్వీట్ ల స్క్రీన్ షాట్ లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. |
https://www.tupaki.com//entertainment/maheshbabu-movies-lineup-1384275 | సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB29 మూవీ కోసం రెడీ అవుతున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి జక్కన్న సిద్ధం అవుతున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కబోతోందని తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపొయింది. కానీ ఈ సినిమా అప్డేట్ ఏంటనేది ఎవరికి తెలియదు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది.
మీడియాలో రకరకాల కథనాలు ఈ సినిమా గురించి వినిపిస్తున్నాయి. వేటిలో కూడా స్పష్టత లేదు. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో సినిమా కోసం రాజమౌళి కనీసం 2 నుంచి 3 ఏళ్ళ సమయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఆ తరువాత ఇతర దర్శకులతో మూవీస్ చేసే అవకాశం ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ లైన్ అప్ లో ముగ్గురు స్టార్ దర్శకులు ఉన్నారు. రాజమౌళితో SSMB29 చిత్రాన్ని దుర్గ ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది.
ఈ మూవీ కంప్లీట్ అయ్యేలోపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో SSMB30 సినిమాని ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందంట. తరువాత హారికా అండ్ హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB31 సినిమా ఉండొచ్చని అంటున్నారు. అయితే గుంటూరు కారంతో త్రివిక్రమ్ మహేష్ బాబుకి సక్సెస్ ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఆయన సక్సెస్ లపై ఆధారపడి ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబుకి శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. దీంతో కొరటాలతో SSMB32 మూవీ చేయడానికి మహేష్ బాబు ఆసక్తిగానే ఉన్నారంట. అయితే దేవర సిరీస్ సక్సెస్ బట్టి కొరటాలతో ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై మహేష్ బాబు నిర్ణయం ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక వేళ వీరిద్దరి కాంబినేషన్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందంట.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మూవీ ప్లానింగ్ అయితే ఎప్పటి నుంచో ఉంది. అయితే సరిపోయే కథ కోసం ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివలతో మూవీస్ చేయాలంటే నెక్స్ట్ వీరు బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకొని పాన్ ఇండియా లెవల్ లో ప్రూవ్ చేసుకుంటేనే సాధ్యం అవుతుందని చెప్పవచ్చు. |
https://www.tupaki.com//entertainment/uvcreationsbanner-1311750 | సాధారణంగా ఓ సినిమా హిట్ అయితే ఆ చిత్రంలోని కాస్ట్ పై భారీ బడ్జెట్ పెట్టేందుకు కొత్త నిర్మాతలు సిద్ధమవుతుంటారు. వారితో మరింత హై క్వాలిటీ, కంటెంట్ ఉన్న కథలు చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే డిజాస్టర్ టాక్ అందుకుంటే వారితో కలిసి పని చేసేందుకు రిస్క్ గా భావించి కాస్త ఆలోచిస్తుంటారు. అయితే ఇలా అందరి విషయంలో ఎప్పుడూ ఒకేలా జరగదు. స్టార్ ఇమేజ్, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఇలా జరుగుతుంటాయి.
అయితే విషయానికొస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని యంగ్ స్టార్ అఖిల్ విషయంలో యాదృశ్చికమో మరేమో గానీ ఒకేలా జరుగుతోంది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా 'భోళాశంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మెహెర్ రమేశ్ దర్శకత్వంలో తమన్న, కీర్తి సురేశ్ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం చిరు కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింది. అలాగే అక్కినేని యంగ్ స్టార్ అఖిల్ ఏజెంట్ తో ఆడియెన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం అక్కినేని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అఖిల్ తీవ్రంగా మునుపెన్నడు లేని విధంగా కష్టపడినప్పిటకీ.. ఫలితం లేకుండా పోయింది.
ఈ రెండు సినిమాలను ఏకే బ్యానర్స్ ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర నిర్మించారు. అయితే ఈ రెండు చిత్రాలు అనిల్ సుంకరకు భారీ నష్టాన్ని చేకూర్చాయి. ఇప్పుడు చిరంజీవి, అఖిల్.. ఇద్దరూ తమ కొత్త చిత్రాలను సెట్స్ పై తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చిరు.. రెండు సినిమాలను అనౌన్స్ చేశారు. అందులో ఒకటి బింబిసార దర్శకుడు వశిష్ట తెరకెక్కించబోతున్న కొత్త చిత్రం మెగా 157. ఇప్పటికీ పంచభూతాల కాన్సెప్ట్ లో రిలీజైన పోస్టర్ కూడా బాగా ఆకట్టుకుంది. సోషియో ఫాంటసీ గా రానున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనుంది.
ఇక అఖిల్ కూడా తన కొత్త సినిమా 'అఖిల్ 6' కోసం సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడిగా పరిచయం కానున్న అనిల్ కుమార్ తెరకెక్కించనున్నారని తెలిసింది. దీనిని కూడా యూవీ క్రియేషన్స్ బ్యానరే ప్రొడ్యూస్ చేయనుండటం విశేషం. అలాగే ఈ చిత్రం కూడా సోషియో ఫాంటసీగా రాబోతుందట. అలా ఈ రెండు హీరోల గత చిత్రాలను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ రూపొందించి నష్టాలను అందుకోవడం, ఇప్పుడు కొత్త చిత్రాలను ఒకే తరహా సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించబోతుండటం ఆసక్తికరంగా మారింది.
భోళాశంకర్, ఏజెంట్ లాంటి భారీ డిజాస్టర్ల తర్వాత ఒకే కాన్సెప్ట్ తో రానున్న ఈ ఇద్దరు హీరోల చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో? యూవీ క్రియేషన్స్ను ఎలాంటి లాభాలు తెచ్చిపెడతాయో చూడాలి... |
https://www.tupaki.com//entertainment/article/did-charan-give-dates-to-a-successful-director/276522 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్'లో నటిస్తున్నాడు. అలానే మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ రెండు సినిమాల చరణ్ నటించే సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే చెర్రీ నెక్స్ట్ సినిమా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉండబోతోందనే న్యూస్ చాలా రోజులుగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.వెంకీ కుడుముల ఇంతకముందు 'ఛలో' 'భీష్మ' వంటి రెండు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. కానీ 'భీష్మ' సినిమా వచ్చి ఏడాది పూర్తి అవుతున్నా ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మూడో సినిమా మీద ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం వెంకీకి రామ్ చరణ్ డేట్స్ ఇచ్చేసాడని తెలుస్తోంది. గతంలో చరణ్ నటించిన 'తుఫాన్' సినిమాకి రైటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన వెంకీ.. చరణ్ కి ఓ స్క్రిప్ట్ నెరేట్ చేసి ఒప్పించాడట. ఈ నెలాఖరుకు ఈ ప్రాజెక్ట్ ఓ కొలిక్కి రాబోతున్నట్లు తెలుస్తోంది. |
https://www.tupaki.com//entertainment/article/soundarya-rajinikanth-turns-troll-target-with-honeymoon-photos/205563 | బిజినెస్ మేన్ విషగన్ వనంగమూడిని పెళ్లాడిన సౌందర్య రజనీకాంత్ ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఐస్ ల్యాండ్ లో ఈ జంట విహరిస్తున్నారు. స్పాట్ నుంచి సౌందర్య కొన్ని ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలు వీక్షించిన నెటిజనులు తీవ్రమైన కామెంట్లతో ట్రోల్స్ చేయడం చర్చకొచ్చింది. ఓ వైపు పుల్వామాలో 40 మంది పైగా సైనికుల్ని తీవ్రవాదులు దారుణంగా హతమారిస్తే, ఇలాంటి టైమ్ లో ఈ సెలబ్రేషన్స్ ఏంటి? అంటూ ఓ నెటిజన్ సౌందర్య రజనీకాంత్ ని ప్రశ్నించారు. వేరొక నెటిజన్ అయితే వ్యక్తిగతంగా నీచమైన వ్యాఖ్యను చేయడం చర్చకొచ్చింది. ``ప్రతిసారీ ఎవరో ఒకరితో ఇలా హనీమూన్ చేసుకోవడం నీకు అలవాటే కదా!!`` అంటూ అమర్యాదపూర్వకంగా మాట్లాడాడు. అయితే సదరు నెటిజన్ వ్యాఖ్యను అందరూ తప్పు పడుతున్నారు. అది రెండో పెళ్లి అయినంత మాత్రాన మరీ ఇంత దారుణంగా అపరిపక్వతతో తిట్టేయడం సరైన పద్ధతి కాదని చీవాట్లు పెడుతున్నారు. ఒక వ్యక్తి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకోవడం తప్పు ఎలా అవుతుంది? అంటూ సదరు నెటిజనుకి గడ్డి పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలు అజాగ్రత్తగా ఉండడం సరికాదు. అనవసరంగా కొన్ని వ్యక్తిగత విషయాల్ని బహిర్గతం చేయకపోవడమే మేలు అని విశ్లేషిస్తున్నారు. సౌందర్యకు మాత్రమే కాదు గతంలో శ్రుతిహాసన్, దీపిక పదుకొనే, అనుష్క శర్మ అంతటి సెలబ్రిటీలకు ఈ బాధ తప్పలేదు. నెటిజన్ అంటేనే అపరిపక్వంగా ఉంటారన్నది కొన్నిసార్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మరి!! |
https://www.tupaki.com//entertainment/article/ram-gopal-varma-on-nuclear-movie/156755 | రామ్ గోపాల్ వర్మకు అర్ధరాత్రి వేళ అదో లోకంలో ఉంటుంటాడు. అప్పుడు ఆయనకు చాలా ఐడియాలొస్తాయి. ఆ ఐడియాలతో సినిమాలు తీసేయడానికి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడూ కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తుంటాడు. కానీ తర్వాత వాటి గురించి మరిచిపోతుంటాడు. అలా ఆలోచనల దశలోనే ఆగిపోయిన వర్మ సినిమాలు ఎన్నెన్నో. ఐతే ‘న్యూక్లియర్’ ఈ కోవలోకి రాదనే అనుకున్నారంతా. ఎందుకంటే ఈ ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేసింది వర్మ కాదు. ఓ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ. రూ.340 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్రణాళిక వేసుకుందా సంస్థ.వర్మ ట్రాక్ రికార్డు గురించి పట్టించుకోకుండా ఈ మెగా ప్రాజెక్టుకు ఆయన్నే దర్శకుడిగా ఎంచుకుని ఆశ్చర్యపరిచింది ఆ ప్రొడక్షన్ హౌజ్. ఐతే దీని గురించి అనౌన్స్ మెంట్ వచ్చి ఆరు నెలలు దాటుతోంది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు. ఫస్ట్ అనౌన్స్ మెంట్ తర్వాత వర్మ కూడా దీని గురించి ఎప్పుడూ ప్రస్తావించింది లేదు. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసే నాటికి.. ఇప్పటికి వర్మ స్థాయి మరింత పడిపోయింది. ‘వీరప్పన్’ హిందీ వెర్షన్ తో పాటు తెలుగులో ‘వంగవీటి’ కూడా ఫ్లాపయ్యాయి. ఇక ‘సర్కార్-3’ సంగతేంటో తేలాల్సి ఉంది. అది కూడా ఫ్లాపైతే వర్మ మీద ఏ నమ్మకంతో రూ.340 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తారో చూడాలి. అసలింతకీ ‘న్యూక్లియర్’ అనేది సీరియస్ ప్రాజెక్టేనా.. లేక వర్మ చేసిన తమాషానా అన్న సందేహాలు కూడా లేకపోలేదు జనాల్లో. మరి దీని గురించి తర్వాతి అప్ డేట్ ఎప్పుడిస్తారో చూడాలి <|hyperlink|> /Tupakidotcom/ |
https://www.tupaki.com//entertainment/samanthastunningchinafeets-1344669 | గాల్లోకి ఎగిరెగిరి ఫీట్లు చేయడం.. ఒంటి చేత్తో..ఒంటికాలితో బ్యాలెన్స్ చేయడం అన్నది చైనా పీస్ లకే చెల్లింది. వాళ్ల ఫీట్స్ లో ఓ పర్పెక్షన్ ఉంటుంది. తాజాగా సమంత ఒంటి కాలి ఫీట్ చూస్తుంటే అచ్చంగా చైనా పీస్ నే తలపించింది. ఇదిగో ఇక్కడి లా ఒంటి కాలితో బ్యాలెన్న్ చేస్తూ అమ్మడు కాలి లేపిన వైనం ఇంట్రెస్టింగ్. ఉదాయన్నే ఇలా అమ్మడు వర్కౌట్ సెషన్ లో భాగంగా ఇలా ఎక్సరసైజ్ లు మొదలు పెట్టింది.
ఫిట్ నెస్ విషయంలో సమంత కేరింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. డేలో కొతం సమయాన్ని జిమ్ కి కేటాయిస్తుంది. షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా...అక్కడ అనుకూలతలు ఎలా ఉన్నా..ఉన్న వాతావ రణాన్ని తనకి అనుకూలంగా మార్చుకుని వామ్ అప్ చేసేస్తుంది. ఆమెని చేసే రష్మిక మందన్న కూడా నేర్చు కుంది. సమంత ఒంటి కాలి ఫీట్ అందర్నీ ఆకట్టుకుంటుంది. చుట్టూ పచ్చని వాతావరణం.. ఆపక్కనే సముద్రం.. సూర్యుడికి అభిముఖంగా మొదలు పెట్టిన సెషన్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది.
సమంత వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ నుంచే ఈ ఫోటో లీక్ అయింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సమంత ఫీట్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. సమంత చైనా పీస్ లా ఇరగదీస్తుంది? అంటూ ఓ అభిమాని పోస్ట్ పెట్టాడు. సమంత చేస్తోన్న ఈ రకమైన ఎక్సరసైజ్ లు చాలా మందిలో స్పూర్తి ని కలిగిస్తున్నాయి. ఆమెని చూసి మరింత మంది వేకువజామునే రన్నింగ్ ...వాకింగ్ లు షురూ చేస్తున్నారు. నందిని రెడ్డి ఈ పిక్ చూసిన వెంటనే ఇప్పుడే తన వర్కౌట్ సెషన్ పూర్తయిందని గుర్తు చేసుకుంది.
ఇక సమంత `ఖుషీ` తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలు పాటు విరామం లోనే ఉంది. ఇటీవలే మళ్లీ నెట్టింట యాక్టివ్ అయింది. వచ్చేస్తున్నా సిద్దంగా ఉండండి అంటూ అభిమా నులకు సందేశాన్ని పాస్ చేసింది. అమ్మడు అమెరికా టూర్ కి ముందు కొన్ని ప్రాజెక్ట్ లకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటిని పూర్తి చేయడానికి రెడీ అవుతోంది. |
https://www.tupaki.com//entertainment/article/mahesh-babu-performed-in-360-degrees/225489 | సూపర్ స్టార్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్లను మలచడంలో స్పెషలిస్ట్ అయిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో మహేష్ కు మరో బ్లాక్ బస్టర్అందించడం ఖాయమని అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అనిల్ ఈ సినిమాగురించి ఇంట్రెస్టింగ్ అంశాలు తెలిపారు.ఈమధ్య నటించిన సినిమాల్లో మెసేజ్ ఎక్కువగా ఉంటోందని కామెడీ తగ్గుతోందని ఒక కామెంట్ వినిపిస్తోంది. మరి మీ స్టైల్ సినిమాలో మహేష్ ను చూసి చాలా రోజులయింది.. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతోంది. మహేష్ సినిమాల్లో కామెడీ లోటును తీర్చబోతోందా?" అని ప్రశ్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ సినిమాలో అందరి పాత్రలకు ప్రాధాన్యత ఉంది. విజయశాంతి గారు.. ప్రకాష్ రాజ్ గారు.. మహేష్ అందరూ ఇరగదీశారు. ఈ మధ్యకాలంలో మహేష్ సినిమాలలో ఏది మిస్ అయిందని అనుకుంటున్నారో అది ఈ సినిమాలో ఉంటుంది. ట్రైన్ ఎపిసోడ్ చాలా హిలేరియస్ గా వచ్చింది.. నేను చెప్పడం కంటే మీరు అది తెరపై చూస్తే బాగుంటుంది. ఈ సినిమా ఫుల్ మీల్స్ లాగా ఉండబోతోంది. 360 డిగ్రీస్ లో మహేష్ గారు చించి అవతలేశారు. మహేష్ లాంటి సూపర్ స్టార్ మన సినిమాలో ఉన్నప్పుడు కథ లేకుండా ఊరికే కామెడీ చొప్పిస్తే బాగుండదు. ఈ సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ సరిగ్గా కుదిరాయి. మహేష్ పేకాడేశారు" అంటూ సినిమా గురించి గొప్పగా చెప్పారు అనిల్. కొండారెడ్డి బురుజు అనగానే 'ఒక్కడు' సినిమా గుర్తొస్తుంది మరి ఈ సినిమా లో ఆ ఎపిసోడ్ అలా ఉంటుంది?" అని అడిగితే.. దాదాపు 15 ఏళ్ళు అయినా ఇంకా కొండారెడ్డి బురుజు అనగానే ఒక్కడులో మహేష్ గారి డైలాగ్ గుర్తొస్తుంది. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక ఎలిమెంట్ ను మా కథలో వాడుకున్నాం. కర్నూలు బ్యాక్ డ్రాప్ లో.. ఆ బురుజు దగ్గరే కొంత కథ సాగుతుంది. ఆ ఎపిసోడ్ ఎవరి అంచనాలకు తగ్గకుండా ఉంటుంది. మహేష్ మాస్ యాక్టింగ్ కూడా ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా కుదిరింది" అన్నారు. అనిల్ చెప్తున్న మాటలు చూస్తుంటే 'సరిలేరు నీకెవ్వరు' పై అంచనాలు డబల్ అయ్యేలా ఉన్నాయి. |
https://www.tupaki.com//entertainment/sreeleelanotactinitemsong-1363157 | శ్రీలీల ఎంత గొప్ప డాన్సర్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. నటిగా కంటే అమ్మడు ఎక్కువగా పాపులర్ అయింది డాన్స్ నెంబర్లతోనే. `గుంటూరు కారం`లో కుర్చీ ని ఏ రేంజ్ లో మడత పెట్టిందో తెలిసిందే. ఈ పాట తర్వాత మరింత పాపులర్ అయింది. శ్రీలీల క్రేజ్ అంతకంతకు రెట్టింపు అయింది. కానీ హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడంలో మాత్రం వెనుకబడే ఉంది. మరి శ్రీలీలకి ఏ కారణంగా అవకాశాలు రావడం లేదన్నది అర్దం కాని ప్రశ్న.
`గుంటూరు కారం` తర్వాత ఇంతవరకూ కొత్త సినిమా కమిట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ తో `ఉస్తాద్ భగత్ సింగ్` లో నటిస్తోంది. కానీ అది డిలే అవుతోన్న ప్రాజెక్ట్ . కాబట్టి ప్రస్తుతానికి ఆ సినిమా చర్చ అనవసరమైనదే. అయితే ఇటీవలే అమ్మడు తలపతి విజయ్ హీరోగా నటిస్తోన్న `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` లో ఓ ఐటం నెంబర్కి ఒకే చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. `గుంటూరు కారం`లో అమ్మడి కుర్చీ పెర్పార్మెన్స్ చూసి దర్శకుడు వెంకట్ ప్రభుని అమెని ఐటం గాళ్ల్ గా తమ సినిమాకి కన్విన్స్ చేసినట్లు నెట్టింట ప్రచారం సాగింది.
దీంతో ఐటం నెంబర్ తో శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైంది అంతా భావించారు. కానీ అమ్మడు అందుకు ఒప్పుకోలేదుట. అవకాశం వచ్చిన మాట వాస్తవమే అంటున్నారు కానీ ఐటం పాటతో అక్కడ ఎంట్రీ ఇవ్వడం తనకి ఎంత మాత్రం ఇష్టంలేక ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు తాజాగా జాతీయ మీడియాలో ఓవార్త వైరల్ అవుతోంది. సినిమాలో సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చినా ఒకేగానీ...ఐటం పాటలో మాత్రం నటించని కరాఖండీగా చెప్పేసిందిట.
అయితే ఇంతవరకూ రావడానికి ఓ కారణం కూడా వినిపిస్తుంది. తొలుత హీరోయిన్ అనే చిత్ర వర్గాలు అమెని ఆప్రోచ్ అయ్యాయి అన్న సమాచారంతోనే శ్రీలీల దర్శకుడితో ఫోన్ లో సంప్రదింపులు జరిపిందిట. కానీ చివరి నిమిషంలో హీరోయిన్ కాదు...ఐటం భామ అనే సరికి వెంటనే రిజెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఆ రకంగా అమ్మడు కోలీవుడ్ ఛాన్స్ మిస్ అవ్వాల్సిన పరిస్థితి. |
https://www.tupaki.com//entertainment/article/renu-desai-fires-on-netizens/273304 | రేణు దేశాయ్ కి కరోనా పాజిటివ్ అంటూ కొన్ని వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి. వాటిపై ఆమె చాలా సీరియస్ అయ్యింది. అలాంటి వారిని అన్ పాలో అవ్వాలని.. అలాంటి వెబ్ సైట్లను నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేసింది. తన గురించి గతంలో చాలా పుకార్లు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోని రేణు దేశాయ్ ఈసారి మాత్రం చాలా సీరియస్ అవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఒక్కసారిగా రేణు ఇంతగా ఎందుకు రియాక్ట్ అయ్యారు అనేది ప్రశ్న. సింగర్ సునీత వివాహంకు వెళ్లిన సమయంలో రేణు దేశాయ్ కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కొందరు ఆమెను వింతగా చూడటం మొదలు పెట్టారట. కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వస్తున్నాయి మీరు పెళ్లికి ఎలా వచ్చారంటూ కొందరు ఆమెను కాస్త దూరంగా పెట్టినట్లుగా వ్యవహరించారట. ఆ కోపంతోనే తనపై వచ్చిన వార్తలకు రేణు సీరియస్ అయ్యారట. ఒక కార్యక్రమంకు వెళ్లిన సమయంలో అక్కడ అంతా ఒక రకంగా చూస్తే ఖచ్చితంగా బాధగా ఉంటుంది. కరోనా అనేది చిన్న పుకారు కాదు... సినిమాలకు సంబంధించిన పుకారు అసలే కాదు. ప్రాణాలు పోతున్న కరోనా కు సంబంధించిన పుకారు అవ్వడం వల్ల రేణు దేశాయ్ ఇంతగా స్పందించారు. తాను అంతగా సీరియస్ అవ్వడంపై ఆమె వివరణ ఇచ్చారు. ఇదేమి చిన్న విషయం కాదు చూసి చూడనట్లుగా వదిలేయడానికి.. నేను అలా వదిలేయాలని అనుకోవడం లేదు అంటూ రేణు దేశాయ్ తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. |
https://www.tupaki.com//entertainment/article/rakul-preet-singh-beats-kajal-agarwal-over-item-song-remuneration/185860 | సాధారణంగా స్టార్ హీరోల క్రేజ్ ను ఎలా కొలవాలి అంటే మార్కెట్ కంటే ముందు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ లెవెల్లో ఉంది అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఏ హీరో ఎప్పుడు ఎంత పెద్ద హిట్ కొడతాడో తెలియదు. ఏరియాలను బట్టి కొందరి హీరోలకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఇకపోతే హీరోయిన్స్ విషయానికి వస్తే ఆ లెక్కలు సపరేట్ గా ఉంటాయి. ఎక్కువ ఆదరణ అందుకున్న హీరోయిన్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న భామలే నెంబర్ వన్ అని అర్ధం. స్టార్ హీరోయిన్ అనుష్క జానర్ వేరేది కాబట్టి ఆమెకు ఉండే ప్లేస్ సపరేట్ గా ఉంది. రెగ్యులర్ హీరోయిన్స్ విషయానికి వస్తే వారికి టాప్ రెమ్యునరేష్ రెండు కోట్లు ఎప్పుడు దాట లేదు. చాలా వరకు కోటి దగ్గరే ఆగిపోతారు. ఐటెమ్ సాంగ్ చేస్తే మళ్లీ ఆ లెక్క సపరేటే. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పటివరకు ఓ తెలుగు సినిమాకు అత్యధికంగా కాజల్ అగర్వాల్ 1.5 నుంచి 1.75 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంది. అయితే ఆమె తరువాత ఏ హీరోయిన్ కూడా అంత మొత్తంలో అందుకోలేదు. కానీ రీసెంట్ గా రకుల్ ఆ మార్క్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ నాగ చైతన్యతో చేయబోయే సినిమా కోసం అమ్మడికి కోటి 75 లక్షలు ముట్టజెబుతున్నారట. స్పైడర్ సినిమా డిజాస్టర్ తరువాత అమ్మడికి పెద్దగా ఆఫర్స్ లేవు. కానీ బాలీవుడ్ కోలీవుడ్ లో ఆఫర్స్ అందుతుండడంతో అడిగినంత ఇచ్చి డేట్స్ సెట్ చేసుకుంటున్నారు. పైగా గతంలో చైతు - రకుల్ కాంబో లో వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా హిట్ అవ్వడం కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆ విధంగా రకుల్ కాజల్ అగర్వాల్ తరువాత ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గా రికార్డ్ కొట్టేసింది. |
https://www.tupaki.com//entertainment/article/reema-sen-latest-pics-goes-viral/293130 | ఎంట్రీతోనే అదరగొట్టే హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉంటారు. అందులోకి మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో అలజడి రేపి.. ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకోవటం అందరికి సాధ్యమయ్యే పని కాదు. తొలి ‘చిత్రం’ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న ఆ నటి ఎవరో కాదు రీమాసేన్. దాదాపు నలభై సినిమాల్లో నటించిన ఆమె.. మిగిలిన హీరోయిన్లకు భిన్నమైనదన్న ముద్రను వేసుకున్నారు.చిత్రంతో మొదలైన ఆమె ప్రయాణం ‘మనసంతా నువ్వే’ మూవీలో చక్కిలిగింత పెట్టేసింది. అగ్ర నటీమణిగా పేరున్నప్పటికి స్టార్ హీరోలతో ఆమె చేసిన సినిమాలు తక్కువే. అయినప్పటికి ఆమెకు యూత్ లో ప్రత్యేక స్థానం ఉంది. నటించింది నలభై సినిమాలే అయినా.. మూడు ఫిలంఫేర్ అవార్డుల్ని సొంతం చేసుకుంది. తెలుగుతో సరిపెట్టుకోకుండా తమిళం.. హిందీ మూవీలతో బిజీగా ఉన్న వేళలో అనూహ్యంగా సినిమాల నుంచి తప్పుకొని పెళ్లి పీటల మీదకు ఎక్కి అందరిని ఆశ్చర్యపరిచింది.2012లో బిజినెస్ మ్యాన్ శివకరణ్ తో పెళ్లైన ఆమె.. తర్వాత నుంచి సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేసింది. వివాహమైన ఏడాదికే ఆమె తల్లయ్యారు. కొడుకు పేరు రుద్రవీర్. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె.. ఇప్పుడు గ్లామర్ ఇండస్ట్రీకి దూరంగా బతికేస్తోంది. మరి..ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారు? ఆమె ఫ్యామిలీ ఎలా ఉన్నారన్న దానికి ఈ ఫోటోనే నిదర్శం. పూర్తిగా ఇంటికే పరిమితమైనప్పటికి.. తన గ్లామర్ ను ఇసుమంత మిస్ కాకుండా మొయిటైంన్ చేయటం ఆమె ప్రత్యేకతగా చెప్పాలి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తమ ఫోటోల్ని పోస్టు చేస్తూ ఉంటుంది. |
https://www.tupaki.com//entertainment/article/yash-in-villain-xtreme-foam-face-wash-ad/367412 | లార్జర్ దేన్ లైఫ్ పాత్రలను వెండితెరపైనే కాదు బుల్లితెర కమర్షియల్స్ లోను చూడొచ్చు. అతిశయోక్తి అనుకోకుండా వాటిని ప్రజలు అంగీకరించాలి. బూస్ట్ తాగితే డబుల్ ఎనర్జీ వచ్చేస్తుందని.. రెడ్ బుల్ తాగితే పదింతలు స్పాట్ ఎనర్జీ పెరుగుతుందని కోలాలు తాగితేనే దప్పిక తీరి రిలాక్స్ డ్ గా ఉండగలరని ప్రకటన క్రియేటర్లు చాలా క్రియేటివిటీ చూపించారు.. అదంతా అటుంచితే ఇప్పుడు కేజీఎఫ్ రాఖీభాయ్ యష్ పై చిత్రీకరించిన ఓ ప్రకటన హాస్యాస్పదంగా ఉందంటూ నెటిజనుల్లో పంచ్ లు పడిపోతున్నాయి. తనపైకి దూసుకొచ్చిన బుల్లెట్ ని రెండు వేళ్ల నడుమ లాక్ చేసి చాక్లెట్ లా కరకరా నమిలేస్తున్నాడు.ఇలాంటి క్రియేటివిటీ సంగతి అటుంచితే.. రాఖీభాయ్ గా కేజీఎఫ్ స్టార్ యష్ కి ఉన్న ఇమేజ్ కి తగ్గ రేంజు బ్రాండ్ ని ఛేజిక్కించుకోవడంలో విఫలమవుతున్నాని ఒక సెక్షన్ మీడియాలో కథనాలొస్తున్నాయి. కేజీఎఫ్ 2 చిత్రంతో అతడు 1000 కోట్ల క్లబ్ హీరో అయ్యాడు. కానీ ఆ తర్వాత భారీ పాన్ ఇండియా డైరెక్టర్ తో ప్రకటన అతడి నుంచి అభిమానులు ఆశించారు. కానీ అది జరగలేదు. అలాగే వాణిజ్య ప్రకటనలు కూడా చెప్పుకోదగ్గ బ్రాండ్స్ అతడి ఖాతాలో పడకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.సూపర్ స్టార్ మహేష్- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి వారు జయాపజయాలతో సంబంధం లేకుండా వాణిజ్య ప్రకటనల్లోను నటిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. కానీ యష్ ఇంకా ఆ స్థాయిని ఎందుకని అందుకోలేకపోతున్నాడు? అంటూ నెటిజనుల్లో చర్చ సాగుతోంది. కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో అనూహ్యంగా పెరిగిన క్రేజ్ ను ఎన్ క్యాష్ చేసుకోవడంలో అతడు వెనకబడ్డాడని పీఆర్ బలం పెంచుకోలేదని కూడా విశ్లేషిస్తున్నారు.అదంతా అటుంచితే KGF చాప్టర్ 2 సూపర్ సక్సెస్ తర్వాత యష్ నటించే తదుపరి సినిమా ఎవరితో? అంటూ ఇటీవల అంతా ఆసక్తిగా వేచి చూసారు. రాఖీ భాయ్ తదుపరి ఎత్తుగడ పై రకరకాల ఊహాగానాలు సాగాయి. అతడు రామాయణం -బ్రహ్మాస్త్ర 2 వంటి పెద్ద ప్రాజెక్ట్ లలో నటించే అవకాశం ఉందని కథనాలొచ్చాయి. KGF చాప్టర్ 3తోనే అతడు ముందుకు వచ్చే అవకాశం ఉందని కూడా మీడియాలో ప్రచారమైంది. కానీ ఇవేవీ నిజాలు కాలేదు. ఇంకా రాఖీభాయ్ స్థబ్ధుగానే ఉన్నాడు. ఏదీ ప్రకటించలేదు.ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా గ్రాస్ ను సంపాదించే సత్తా ఉన్న రాఖీ భాయ్ ఇప్పుడు ఓ మహిళా దర్శకురాలికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నది సంచలనంగా మారింది. యష్ - గీతు మోహన్ దాస్ గత ఏడాది కాలంగా ఓ స్క్రిప్టు విషయమై చర్చిస్తున్నారు. గీతు తన వద్దకు వచ్చిన కాన్సెప్ట్ తో యష్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. యష్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లతో పని చేస్తాడని భావిస్తున్న సమయంలో ఇలాంటి నిర్ణయం అభిమానులకు నిజంగా షాకిచ్చింది. అయితే మంచి స్క్రిప్ట్ ను ఎంచుకోవడం కోసం అతడు ఎంతదాకా అయినా వెళతాడని అర్థం చేసుకోవచ్చు. హైప్ తో సంబంధం లేకుండా పెద్ద దర్శకులే కావాలని అనుకోకుండా అతడు గీతు మోహన్ దాస్ సినిమకి ఓకే చెప్పాడని కథనాలొస్తున్నాయి. మరో 30 రోజుల్లో దీనిని ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.దర్శకురాలు గీతూ మోహన్ నేపథ్యం ఆసక్తికరం. గీతూ మోహన్ ఇప్పటికే జాతీయ అవార్డ్ లు కొల్లగొట్టిన సినిమా లయర్స్ డైస్ తో దేశవ్యాప్తంగా పాపులరయ్యారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ కథానాయకుడిగా .. గీతూ మోహన్ దాస్ రూపొందించిన హిందీ చిత్రం రెండు జాతీయ అవార్డులతో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. అలాంటి ప్రతిభావనికి రాఖీభాయ్ అవకాశం ఇవ్వాలనుకోవడం ప్రశంసించదగినది. |
https://www.tupaki.com//entertainment/article/rajamouli-prabhas-combo-setting-by-mythri/303010 | టాలీవుడ్ లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ల కాంబినేషన్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'ఛత్రపతి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వీరిద్దరూ.. 'బాహుబలి: ది బిగినింగ్' 'బాహుబలి: ది కన్ క్లూజన్' చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తెలుగు మూవీ సత్తా ఏంటో వరల్డ్ సినిమాకి చూపించారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన 'బాహుబలి 2'.. ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. అందుకే ఈ కాంబోలో మరో సినిమా చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి - ప్రభాస్ కలయికలో మరో సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. డార్లింగ్ ప్రభాస్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ వీరికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. సరైన దర్శకుడి కోసం చాన్నాళ్లుగా వెతుకుతున్న మైత్రీ టీమ్.. గత వారం రాజమౌళి ని కలిసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మైత్రీ బ్యానర్ లో జక్కన్న - ప్రభాస్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాజమౌళి ఓ లైన్ అనుకొని ప్రభాస్ కి చెప్పేశాడని టాక్. అయితే ఈ ప్రాజెక్ట్ 'బాహుబలి' అంత గ్రాండియర్ మూవీ కాదని అనుకుంటున్నారు.'బాహుబలి' రెండు భాగాల కోసం ఐదేళ్లు కేటాయించిన రాజమౌళి - ప్రభాస్.. ఈ కొత్త ప్రాజెక్ట్ ని కేవలం 200 రోజుల్లో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రాథమిక చర్చలు మాత్రమే నడిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' నిర్మాణానంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేస్తానని దర్శకుడు ఇది వరకే క్లారిటీ ఇచ్చాడు. దీని కోసం ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ కథను రెడీ చేస్తున్నట్లు రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. మహేష్ తో సినిమా అయిపోయిన తర్వాత జక్కన్న - ప్రభాస్ సినిమా ఉండే అవకాశం ఉంది. ఆలోపు ప్రభాస్ ఇప్పటికే కమిటైన ఇతర ప్రాజెక్ట్స్ ని పూర్తి చేస్తారు. మరి త్వరలోనే ఈ క్రేజీ కాంబోలో సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. |
https://www.tupaki.com//entertainment/article/vaishnav-tej-comments/342125 | అయితే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్లు .. సాంగ్స్ ను రిలీజ్ చేసినప్పుడు అందులో పవన్ కల్యాణ్ మేనరిజమ్స్ ను వైష్ణవ్ ఫాలో కావడం కనిపించింది. అలాగే చిరంజీవి స్టైల్ ను కూడా అనుకరించినట్టుగా అనిపించింది. సినిమా చూస్తే నిజంగానే మెగా ఫ్యాన్స్ లో హుషారెత్తించే ఇలాంటి ప్రయత్నాలు వైష్ణవ్ చేశాడు. కుర్రాడు ఒడ్డూ పొడుగూ ఉన్నాడు .. మేనమామల స్టైల్ ను అదరగొట్టేస్తున్నాడు అనే టాక్ వచ్చింది. దాంతో ఈ కుర్రాడు చిరంజీవి సినిమాలనుగానీ .. పవన్ కల్యాణ్ సినిమాలనుగాని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడా? అనే డౌట్ మెగా అభిమానులకే వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో వైష్ణవ్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే అలాంటి ఆలోచన తనకి ఎంతమాత్రం లేదని వైష్ణవ్ తేల్చేశాడు. ఆయన మాట్లాడుతూ .. " చిన్నప్పటి నుంచి కూడా నేను పెద్ద మామయ్య .. చిన్న మామయ్య సినిమాలను చూస్తూ పెరిగాను. అందువలన వాళ్లను సరదాగా అనుకరించే ప్రయత్నం చిన్నప్పటి నుంచి చేస్తూ వచ్చాను. అనుకోకుండా ఆ ఇద్దరినీ మేనరిజమ్స్ ను ఈ సినిమాలో వర్కౌట్ చేయడానికి అవకాశం కుదిరింది. అందువలన అలా చేయడం జరిగింది. ఇక వాళ్ల సినిమాలను రీమేక్ చేసే ఆలోచన ఎంతమాత్రం లేదు. పెద్ద మామయ్య .. చిన్న మామయ్య సినిమాలలో కొన్ని వారు మాత్రమే చేయగలరు. ఆ పాత్రలు వాళ్ల బాడీ లాంగ్వేజ్ కి మాత్రమే సెట్ అవుతాయి. అలాంటి సినిమాల రీమేకుల జోలికి నేను వెళ్లాలనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా మేకర్స్ వచ్చి ఫలానా రీమేకులో మీరు చేయవలసిందే అని పట్టుబడితే మాత్రం, ఆ సినిమా 'బద్రీ' అయ్యుండాలని కోరుకుంటాను. ఆ సినిమా అంటే నాకు అంత ఇష్టం. కాకపోతే అలాంటి ఒక అవకాశం వస్తుందో లేదో చెప్పలేం. 'రంగ రంగ వైభవంగా' చూసినవారిలో కొందరు, 'నిన్నే పెళ్లాడుతా' .. 'ఖుషి' తరహాలో ఉందని అంటున్నారు. కానీ అలా అనుకుని చేసిన సినిమా కాదు ఇది. ఈ సినిమా తరువాత సితార బ్యానర్లో శ్రీకాంత్ రెడ్డి అనే ఒక కొత్త దర్శకుడి సినిమాను ఒప్పుకున్నాను. అంతకు మించి కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయలేదు" అంటూ చెప్పుకొచ్చాడు. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు. |