link
stringlengths
41
231
text
stringlengths
29
5k
https://www.telugupost.com/movie-news/saipallavi-not-doing-that-role-162805/
సాయి పల్లవి ఏ సినిమా అయినా తన పాత్రకి ప్రాధాన్యత ఉండడం ఒకటి, కథ లో బలం ఉంటేనే సినిమా ఒప్పుకుంటుంది. తాజాగా సాయి పల్లవి టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది. నాగ చైతన్య తో లవ్ స్టోరీ, వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాట పర్వం సినిమాలు చేస్తుంది. రెండు సినిమాల షూటింగ్స్ చివరి దశలోనే ఉన్నాయి. విరాట పర్వం అయితే కేవలం పది రోజుల షూటింగ్ మాత్రం మిగిలి ఉండగా కరోనా అడ్డం పడింది అయితే ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ గా కనిపిస్తుంది అని.. సాయి పల్లవి విరాట పర్వం ఫస్ట్ లుక్ బయటికి వచ్చాక ఆమె పాత్రపై మరింత క్యూరియాసిటీ, ఊహాగానాలు పెరిగిపోయాయి. అయితే నక్సలైట్ గా సాయి పల్లవి విప్లవ గాయని బెల్లి లలిత పాత్రలో కనిపించనుందనే ప్రచారానికి ఆ సినిమా దర్శకుడు వేణు ఉడుగుల ఫుల్ స్టాప్ పెట్టాడు. సాయి పల్లవి నక్సలైట్, విప్లవ గాయని బెల్లి లలిత పాత్ర చెయ్యడం లేదని.. నేను పుట్టి పెరిగిన వరంగల్‌లో సమాజంలో మార్పు కోసం ఎలాంటి భయం లేకుండా ఉద్యమాలను లేవదీసినవాళ్లను నేను చూశాను. అవన్నీ ఇప్పుడు విరాటపర్వంలో చూపిస్తున్నాను అని చెబుతున్నాడు వేణు ఉడుగుల. బెల్లి లలిత పాత్రను సాయి పల్లవి పోషించడం లేదు. అయితే విరాట పర్వంలో ఆమె పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాకు ఎంతో కీలకం ఆ పాత్ర. అలాంటి రోల్‌లో సాయి పల్లవి అద్భుతంగా ఒదిగిపోయి నటించింది. ఆమె నటన కచ్చితంగా అందరినీ మెప్పిస్తుంది అంటూ విరాట పర్వంలో సాయి పల్లవి రోల్ పై స్పష్టతనిచ్చాడు వేణు ఉడుగుల
https://www.telugupost.com/movie-news/mohan-raja-choice-174565/
చిరంజీవి లూసిఫెర్ రీమేక్స్ రైట్స్ కొన్నప్పటినుండి ఆ రీమేక్ ని పక్కాగా తెరకెక్కించే డైరెక్టర్ కనిపించడం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ముందు సాహో డైరెక్టర్ సుజిత్ ని అనుకుని తర్వాత ఆ రీమేక్ నుండి ఆయన్ని తప్పించి వినాయక్ ని రంగంలోకి దించితే.. వినాయక్ కూడా చిరు ని మెప్పించేలేక చేతులెత్తేశాడు. దానితో తమిళ సూపర్ హిట్ డైరెక్టర్ మోహన్ రాజా ఇప్పడు లూసిఫర్ రీమేక్ దర్శకుల లిస్ట్ లోకి చేరడమే కాదు… లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ పనులను కూడా స్టార్ట్ చేసాడట. లూసిఫర్ స్క్రిప్ట్ తో చిరుని శాటిస్ఫాయ్ చేస్తే మోహన్ రాజన్ లూసిఫర్ దర్శకుడిగా ఫిక్స్ అవుతాడు. మరి చిరు లూసిఫెర్ కన్నా ముందే మోహన్ రాజా టాలీవుడ్ హీరోలైన రామ్ చరణ్, అఖిల్ తో సినిమాలు చేసేందుకు వస్తే చరణ్ ఏమో చిరు కి తగిలించాడు. అయితే మోహన్ రాజాకి అఖిల్ తో సినిమా కూడా కన్ఫర్మ్ అయ్యేలా ఉందట. ఇప్పటికే మోహన్ రాజా అఖిల్ తో కథా చర్చలు జరిపినట్టుగా టాక్ ఉంది. అయితే అఖిల్ తో కూడా మూవీ సెట్ అయితే.. మోహన్ రాజా చిరుతో ఫస్ట్ మొదలు పెడతాడా? లేదంటే అఖిల్ తోనా అనేది క్లారిటీ రావాలి. మరి చిరుకి ఆచార్య ఫినిష్ అవ్వగానే వేదలమ్ రీమేక్ పూర్తి చెయ్యాలి. మరోపక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ ఫినిష్ చేస్తున్న అఖిల్ సురేందర్ రెడ్డితో సినిమా చెయ్యాలి. మరి చిరు – అఖిల్ ఒకేసారి మోహన్ రాజా ఫిలిం కోసం రేడి అయితే మోహన్ రాజా ఎవరితో ముందు సినిమా చేస్తాడనేది ప్రస్తుతం సస్పెన్స్.మోహన్ రాజా ఫస్ట్ చాయిస్ అఖిల్ లేదా చిరు ఇద్దరిలో ఎవరవుతారో..
https://www.telugupost.com/telangana-assembly-elections-2023/decision-taken-by-ysrtp-chief-ys-sharmila-is-right-it-is-also-right-to-support-congress-1502726
అవును వైఎస్ షర్మిల తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఆమె చెబుతున్న కారణాలు ఏవైనా ఇప్పుడు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల పోటీ చేయకపోవడమే మంచింది. ఒకరకంగా తన సోదరుడు జగన్ కు కూడా మేలు చేసినట్లే. ఇప్పుడు తెలంగాణలో స్ట్రయిట్ ఫైట్ మాత్రమే ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోరు ఉంది. మరో పార్టీకి అవకాశం లేదు. బీజేపీ తాము ఉన్నామంటూ ఉన్న కనీస స్థానాలకే పరిమితమవుతుంది. అదే వైఎస్సార్టీపీ అభ్యర్థులు పోటీ చేస్తే గెలుపు కూడా కష్టమే.భిన్నమైన ఎన్నికలు...ఈ ఎన్నికలు కొంత భిన్నంగా కనిపిస్తుంది. అధికార పార్టీపై వచ్చిన వ్యతిరేకత కావచ్చు. తొమ్మిదేళ్ల పాలన చూసి విసుగు చెంది ఉండవచ్చు. ఒకింత కాంగ్రెస్ కు కూడా గెలుపు అవకాశాలున్నాయంటున్నారు. చివరకు కాంగ్రెస్ గెలుస్తుందా? లేదా? అన్నది పక్కన పెడితే బీఆర్ఎస్ కు మాత్రం గట్టి పోటీ ఇస్తుందన్నది మాత్రం వాస్తవం. 119 నియోజకవర్గాల్లో దాదాపు వంద నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు జరుగుతుంది. కాంగ్రెస్ కూడా ఈ సారి సర్వేలు చేయించి మరీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆచితూచి అభ్యర్థులను బరిలోకి దించింది. వైఎస్ షర్మిల కూడా దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసింది. పాలేరులో ముగించాలనుకున్నా కుదరలేదు కానీ, ఆమె ప్రభావం చూపే నేతగానే చూడాలి. నష్టమే తప్ప...ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ పోటీ చేయడం వల్ల ఆ పార్టీకి నష్టమే కాని పెద్దగా ప్రయోజనం ఉండదు. కేవలం షర్మిల పోటీ చేసే స్థానంలో గెలవచ్చు. అదీ వైఎస్ షర్మిల పాలేరులో పోటీ చేస్తే అదీ చెప్పలేని పరిస్థితి. పాలేరు నియోజకవర్గంలో హేమాహేమీలు తలపడుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా కందాల ఉపేందర్ రెడ్డి, మరొక వైపు బలమైన నేతగా కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. వీరిద్దరిని తట్టుకుని గెలవడం అంత ఆషామాషీ కాదు. అందుకే హుందాగా వైఎస్ షర్మిల బరి నుంచి తప్పుకున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.హుందాగా...వైఎస్ అభిమానులతో పాటు రెడ్డి సామాజికవర్గం కూడా ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిల పోటీకి దిగి సాహసం చేయడం తప్ప మరొకటి కాదు. అయితే బేషరతుగా మద్దతిస్తున్నామని ప్రకటించడం కూడా ఒకరకంగా షర్మిలకు హుందాతనాన్ని తెచ్చి పెట్టే విధంగా ఉంది. పదవుల కోసం కాకుండా కేవలం కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ కు మద్దతిస్తున్నానని ప్రకటించి షర్మిల ఎన్నికల బరి నుంచి తప్పుకోవడాన్ని చాలా మంది హర్షిస్తున్నారు. దీంతో పాటు జగన్ కు కూడా కొంత కలసి వచ్చే అంశమే. ఏపీ ఎన్నికలకు ముందు తెలంగాణ షర్మిల ఓటమి పాలయితే అది కొంత ప్రభావం చూపుతుందని కూడా పలువురు భావిస్తున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతివ్వడం కొంత నష్టం చేకూరుస్తుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతుంది. మొత్తం మీద వైఎస్ షర్మిల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని మాత్రం చెప్పాలి.
https://www.telugupost.com/movie-news/bheemla-nayak-effect-on-gani-and-adavallu-miku-joharlu-movies-1355271
పవన్ కల్యాణ్ - రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారయింది. ఫిబ్రవరి 25వ తేదీన థియేటర్లలో విడుదలయ్యేందుకు భీమ్లా నాయక్ రెడీ అవుతున్నాడు. అయితే.. అదే రోజున మరో రెండు సినిమాలు కూడా విడుదల కానున్నాయి. వాటిలో ఒకటి వరుణ్ తేజ్ నటించిన "గని". మరొకటి శర్వానంద్ - రష్మికలు జంటగా వస్తోన్న "ఆడవాళ్లు మీకు జోహార్లు". అయితే.. ఇప్పుడు ఈ రెండు సినిమాలు అదే రోజు విడుదలవుతాయా ? లేదా ? అన్న సందేహం ఉంది అభిమానుల్లో.Also Read : బర్డ్ ఫ్లూ కలకలం.. 25 వేల కోళ్లను చంపేయాలని అధికారుల ఆదేశంమొదట భీమ్లా నాయక్ ను ఫిబ్రవరి 25, లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని చెప్పింది చిత్ర బృందం. దాంతో శర్వానంద్ నటించిన "ఆడవాళ్లు మీకు జోహార్లు" మేకర్స్.. సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు, ప్రమోషన్స్ శరవేగంగా జరిగిపోతున్నాయి. ఆ తర్వాత వరుణ్ తేజ్ "గని" సినిమాను కూడా అదే రోజు విడుదల చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఈ రెండు సినిమాలు ఫిబ్రవరి 25ను లాక్ చేసిన తర్వాత.. భీమ్లా నాయక్ మేకర్స్ ఫిబ్రవరి 25నే సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. Also Read : ఇద్దరూ ఒక కులపోళ్లే.... కలవడం గొప్పేముంది? పవన్ కల్యాణ్ సినిమా అంటే.. ఆయన ఫ్యాన్స్ ఏ రేంజ్ లో హడావిడి చేస్తారో చెప్పనక్కర్లేదు. పవన్ సినిమా కాబట్టి ఆ ఎఫెక్ట్ గని, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలపై పడే అవకాశం ఉంది. దాంతో గని సినిమాను మేకర్స్ మార్చి 4వ తేదీన విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆడవాళ్లు మీకు జోహార్లు టీమ్ కూడా సినిమాను వాయిదా వేయొచ్చన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా పోస్టర్లను ఫిబ్రవరి 25 తేదీతోనే విడుదల చేస్తున్నారు. ఈ రెండు సినిమాల మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే.
https://www.telugupost.com/movie-news/పేలవంగా-వున్న-కాజల్-పాట-13912/
తెలుగులో టాప్ హీరోయిన్స్ జాబితాలో గత దశాబ్ద కాలంగా పోటీలో వుంటూ నెగ్గుకొస్తుంది కాజల్ అగర్వాల్. 2007 లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వంలో వచ్చిన చందమామ చిత్రం నుంచి కాజల్ అగర్వాల్ తార స్థాయికి చేరిపోయింది. తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, తారక్, ప్రభాస్, కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, నితిన్ వంటి యంగ్ స్టార్స్ అందరితో ఇప్పటికే నటించేయగా ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ కమ్ బ్యాక్ చిత్రం ఖైదీ నెం. 150 లో చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తుంది.ఇదంతా కాజల్ అగర్వాల్ హైప్ వైపు భాగం. కానీ హిందీ మరియు తమిళ చిత్ర పరిశ్రమలలో కాజల్ అగ్ర శ్రేణి కథానాయికలకు ధీటుగా పోటీ ఇవ్వలేకపోయింది. తమిళంలో తుపాకీ మినహా భారీ విజయాలు ఏమి అమ్మడి ఖాతాలో లేవు. ప్రస్తుతం చిత్రాల సంఖ్య తగ్గటంతో తమిళంలో ఎప్పటి నుంచో విడుదల వాయిదా పడుతూ వస్తున్న జీవ చిత్రం కావలై వేందాం విడుదల తేదీ ప్రకటన రావటంతో ఆ చిత్రంపై ఆశలు పెంచుకుంది కాజల్. ఆ చిత్ర ప్రచార కార్యక్రమాలకు అధిక సమయమే కేటాయిస్తుంది.ఇటీవల ఆ చిత్రంలో ని ఎం పల్స్ తీతు పూరీయే అనే పాట వీడియో సాంగ్ విడుదల కాగా ఈ పాట సంగీతం కానీ, కాజల్ చూపించిన అందాలు కానీ ప్రేక్షకులను అలరించలేకపోయాయి. జీవా కాజల్ మధ్య కెమిస్ట్రీ కూడా పేలవంగా ఉండటంతో చిత్ర విజయం పై అంచనాలు తగ్గిపోయాయి. ఈ వీడియో సాంగ్ విడుదల చేసి చిత్ర బృందం తప్పు చేసింది అనే సానుభూతి పరులు ఎక్కువ అయ్యారు ఈ చిత్రానికి.
https://www.telugupost.com/movie-news/నాకు-సినిమా-లైఫ్-ఇచ్చిన-హ-16985/
సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరి చూపు సక్సెస్ పైనే ఉంటుంది. సక్సెస్ వస్తేనే పరిశ్రమలో మనుగడ సాధ్యం. అందుకే ఒక సక్సెస్ ఇచ్చిన టీం నుంచి పదే పదే చిత్రాలు వస్తుంటాయి. అదే తొలి ఎటెంప్ట్ లోనే ఒక కాంబినేషన్ ఫెయిల్ అయిందంటే బలమైన కథ నిర్ధేశిస్తే తప్ప మళ్లీ ఆ కాంబినేషన్ మెటీరియలైజ్ అవటం జరగదు. దానితో ఆ వైఫల్యం చెందిన చిత్రం ఆ చిత్ర బృందంలో తగాదాలకు దారి తీసింది అని ప్రచారం జోరుగా సాగిపోతుంటుంది. అయితే ఇటువంటి ప్రచారాలలో నిజాలు అడుగున ఎక్కడో ఉంటాయి అని దాన్ని తోడి పైకి తీసి పరిశీలించే ఓపిక ఎవరికీ ఉండదు అని, అందుకే అందరూ పైకి తేలే కల్పితాలనే నమ్ముతుంటారు అని వాపోతున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.కిక్ 2 చిత్రంతో ఘోర పరాజయాన్ని చూసిన సురేందర్ రెడ్డి, సమయం తీసుకుని రీమేక్ కథకి తనదైన ముద్రతో ధ్రువ చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. ధ్రువ సక్సెస్ ఆస్వాదిస్తూనే కిక్ 2 మిగిల్చిన చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కళ్యాణ్ రామ్ తో విభేదాలు ఏర్పడ్డాయి అనే వార్తలను తీవ్రంగా ఖండించారు. "నాకు దర్శకుడిగా తొలి అవకాశం కలిపించిన నటుడు, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ గారే. మళ్లీ ఆయన నిర్మాణంలో దర్శకత్వం చేసే అవకాశాన్ని ఆయన కిక్ 2 చిత్రం ద్వారా కల్పించారు. అతనొక్కడే విజయం పొందింది. కిక్ 2 వైఫల్యం చెందింది. ఆ రెండు చిత్రాలకి వ్యత్యాసం కేవలం ఫలితం లో మాత్రమే కనపడుతుంది. మేము పడ్డ కష్టం, పెట్టుకున్న ఆశలు, మా మధ్య వున్న అనుబంధం, ఒకరి పనితీరు పై మరొకరికి వుండే విశ్వాసం వీటిల్లో ఏవి కూడా అతనొక్కడే సమయం నుంచి కిక్ 2 వరకు చెదరలేదు. రాబోయే కాలంలో నేను మళ్లీ కళ్యాణ్ రామ్ గారి నిర్మాణంలో పనిచేసినా, లేక ఆయన కథానాయకుడిగా నా దర్శకత్వంలో చిత్రం చేసినా మా అంకితభావంలో మార్పు ఉండదు. విజయాపజయాలు సహజం. వాటి ప్రభావం మానవ సంబంధాల మీద ఉండదు అనేది నా ప్రగాఢ నమ్మకం. పైగా కళ్యాణ్ రామ్ గారి లాంటి నిర్మాతల దగ్గర అటువంటి విభేదాలకు తావే ఉండదు." అని ఆయనను దర్శకుడిగా పరిచయం చేసిన నిర్మాత కళ్యాణ్ రామ్ కు తనకు మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు తలెత్తలేదు అని దుష్ప్రచారాలు వలన తలెత్తే అవకాశం కూడా లేదు అని స్పష్టం చేశారు సురేందర్ రెడ్డి.
https://www.telugupost.com/movie-news/ఆయనికి-కరెక్ట్-మొగుడు-ఈయ-33921/
ఇండస్ట్రీలో ఎన్టీఆర్ - మంచు మనోజ్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఆ ఫ్రెండ్షిప్ లో భాగంగానే మనోజ్ ఈ మధ్యన ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళాడట. అయితే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లగా అక్కడ ఎన్టీఆర్ కొడుకు బుల్లి అభయ్ రామ్, మంచు మనోజ్ కి అతిధి సత్కారాలు చేసి మరీ మంచి నీళ్లు అందించాడంట. మంచి నీళ్లు మనోజ్ కి అందించడమే కాకుండా ఆ నీళ్ళని మనోజ్ తో తాగించిమరీ వదిలిపెట్టాడు. ఇక ఈ పరిణామానికి అబ్బురపడ్డ మనోజ్, తారక్ కి కరెక్ట్ మొగుడు అభయ్ అంటూ... సరదాగా కామెంట్ చెయ్యడమే కాకుండా అభయ్ రామ్ మంచి నీళ్లు మనోజ్ కి తాగిస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మంచి క్యాప్షన్ కూడా పెట్టాడు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎనర్జీ కి కి పెట్టింది పేరు. అలాంటి ఎన్టీఆర్ కడుపున అంతే ఎనర్జీ ఉన్న అభయ రామ్ పుట్టాడంటూ మనోజ్ చమత్కరిస్తున్నాడు. ఎన్టీఆర్ ఎనేర్జి కంటే అభయ్ రామ్ ఎనేర్జి లెవెల్స్ 100 రేట్లు ఎక్కువ అని అంటున్నాడు మనోజ్. మరి అంత ముద్దు ముద్దు పనులు చేసుంటే చూసేవాళ్ళు ఇలానే అంటారు కదా. అలా మనోజ్ కి అభయ్ మంచి నీళ్లు తాగిస్తున్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.మరి సినిమా హీరోలంతా ఇలా స్నేహ సంబంధాలను కొనసాగిస్తుంటే బయట అభిమానులు మాత్రం మా హీరోలు గొప్ప అంటే మా హీరోలు గొప్ప అంటూ తన్నుకు చస్తుంటారు. అభిమానులు కూడా ఇలా స్నేహ భావంతో మెలిగితే దానికన్నా మంచి పరిణామం ఏముంటుంది.
https://www.telugupost.com/politics/jana-sena-prepares-for-elections-after-announcing-his-alliance-with-the-tdp-pawan-picked-up-some-speed-1500082
జనసేన ఎన్నికలకు సిద్ధమవుతుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రకటించిన తర్వాత పవన్ కొంత స్పీడ్ పెంచారు. నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించడమే కాకుండా కమిటీలో కొత్తవారికి చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తాము ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తామన్న దానిపై పవన్ కల్యాణ్‌కు ఒక స్పష్టత ఉందని తెలుస్తోంది. అందులో భాగంగానే అక్కడ ఇన్‌ఛార్జులను నియమిస్తూ పార్టీ బలోపేతానికి పనిచేయాలని నేతలను ఆదేశిస్తున్నట్లు తెలిసింది.సీట్ల పంపకాలపై...చాలా రోజుల తర్వాత మంగళగిరి వచ్చిన పవన్ కల్యాణ్ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో సమావేశమయ్యారు. త్వరలోనే టీడీపీ, జనసేన పొత్తుల మధ్య చర్చ జరగనున్న నేపథ్యంలో సీట్ల పంపకంపై కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. సీట్లు తాము వదిలేసుకున్న నియోజకవర్గాలకు చెందిన నేతలతో ముందుగానే పిలిచి పవన్ మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇస్తామని హామీ ఇస్తున్నారు. నెల్లూరు పట్టణ నియోజకవర్గం టీడీపీకే వదిలేస్తున్నట్లు అక్కడి నేతకు ముందుగానే చెప్పడం అంటే మూడు నెలల ముందే పవన్ పొత్తుపై ఒక స్పష్టత ఉన్నట్లు అర్థమవుతుంది. రెండు నియోజకవర్గాలకు...తాజాగా ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించుకునట్లు స్పష్టమవుతుంది. అందుకే అక్కడ నియోజకవర్గ ఇన్‌ఛార్జులను నియమించారు. పొత్తులో భాగంగా ఈ రెండు స్థానాలను జనసేన దక్కించుకునే అవకాశముంది. ఉంగుటూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి గన్ని వీరాంజనేయులు గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఆయనకు ఈసారి జనసేన నుంచి ముప్పు పొంచి ఉన్నట్లేనని అనుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. ఈసారి ఇక్కడి నుంచి జనసేన పోటీ చేయాలని భావిస్తున్నట్లుంది. ఉంగుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పత్సమట్ల ధర్మరాజును నియమించారు.ఇన్‌ఛార్జులను నియమించి...ఇక అదే జిల్లాలోని మరో నియోజకవర్గంలోని ఉండి పైన కూడా జనసేన కన్నేసినట్లే కనపడుతుంది. ప్రస్తుతం ఉండిలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. మంతెన రామరాజు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉండిలో జనసేనకు పట్టుంది. అందుకే ఈ నియోజకవర్గాన్ని కూడా తాము పొత్తులో భాగంగా తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. ఇక్కడ ఇన్‌ఛార్జిగా జుత్తిగ నాగరాజును పవన్ నియమించారు. జనసేన ఎక్కువగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే పోటీకి ఉత్సాహం చూపుతుంది. అందుకే ముందుగానే ఇన్‌ఛార్జులను నియమిస్తూ పవన్ ఒకింత స్పీడ్ పెంచారంటున్నారు జనసేన పార్టీ నేతలు. మరో వైపు సిట్టింగ్‌లందరికీ టీడీపీ టిక్కెట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరి పొత్తులో ఈ సీట్లను జనసేన ఎలా దక్కించుకుంటుందన్నది చూడాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/pushpa-2-movie-release-date-december-6th-no-change-in-that-1549714
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప-2. ఈ సినిమా మీద ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో పుష్ప-2 సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. పుష్ప-2 లో ఏ క్యారెక్టర్ ఏమవుతుందా అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇక ఇటీవల 'మారుతీనగర్ సుబ్రహ్మణ్యం' సినిమా ప్రమోషన్స్ లో నటుడు రావు రమేష్ కూడా పుష్ప-3 గురించి హింట్స్ అయితే ఇచ్చారు. తాను కాల్షీట్స్ ఇచ్చానని వాటిని పుష్ప, పుష్ప-2 కోసం వాడుకున్నారని, మిగిలినవి తర్వాత కోసం అంటూ పుష్ప-3 గురించి హింట్ ఇచ్చారు. అయితే పుష్ప-2 ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఆగస్టు 15న పుష్ప-2 విడుదల అవ్వాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇక సినిమా వాయిదా పడే అవకాశాలు లేవని.. చెప్పిన డేట్ కు తప్పకుండా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేయబోతోందనే అంచనాలు భారీగా ఉన్నాయి.
https://www.telugupost.com/politics/ravela-kishore-babu-resigned-to-bjp-1369909
ఏపీలో ఈసారి ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టాలని చూస్తున్న బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తన రాజీనామా పత్రాన్ని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు కిశోర్ బాబు తెలిపారు.కాగా.. ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన ఆయన.. 2014 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి.. తొలిప్రయత్నంలోనే విజయం సాధించారు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే కదా అని చంద్రబాబు ఆయనను పక్కన పెట్టలేదు. మంత్రి పదవిని కట్టబెట్టి.. సముచిత స్థానాన్ని కల్పించారు. ఆ తర్వాత పలు కారణాలతో మంత్రివర్గ విస్తరణలో పదవిని కోల్పోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు టిడిపిని వీడి.. జనసేనలో చేరారు. ఆ పార్టీ నుంచి మరోసారి ప్రత్తిపాడు నుంచి పోటీ చేశారు కానీ.. ఓడిపోయారు. ఆ తర్వాత జనసేనకు గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. త్వరలోనే రావెల కిశోర్ మళ్లీ టిడిపిలో చేరుతారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
https://www.telugupost.com/crime/tragedy-took-place-in-gadchiroli-district-six-women-went-missing-after-the-boat-overturned-in-the-wainganga-river-1516754
గడ్చిరోలి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వైనగంగా నదిలో పడవ బోల్తా పడిన సంఘటనలో ఆరుగురు మహిళలు గల్లంతుయినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ప్రమాదం సంభవించిన సమయంలో ఎంత మంది పడవలో ఉన్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు.కారణమేంటి?గల్లంతయిన మహిళల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఎందుకు ప్రమాదం జరిగింది? సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికులు ఎక్కించుకోవడం వల్లనే పడవ బోల్తా కొట్టిందా? మరేదైనా కారణాలు ఉన్నాయా? అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
https://www.telugupost.com/crime/hyderabad-conspiracy-case-cracked-by-task-force-police-jahed-from-musarambagh-was-detained-1441598
హైదరాబాద్ కుట్ర కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. ముసారాంబాగ్ కు చెందిన జాహెద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలపై దాడులకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై జావేద్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఉగ్రవాద కార్యక్రమాల కోసం యువతను రిక్రూట్ మెంట్ చేస్తున్నారన్న ఆరోపణలు జావేద్ పై ఉన్నాయి. ఆరుగురు యువకులను ఇందుకోసం జావేద్ రిక్రూట్ చేశారని పోలీసులు చెబుతున్నారు. గతంలోనూ జావెద్ ను పోలీసులు విచారించి వదిలేశారు.ఎక్కడికి తీసుకెళ్లారో?ఉగ్రవాద సంస్థలతో జావేద్ కు లింకులున్నాయన్నది పోలీసుల అభియోగం. మక్కామసీదు పేలుళ్ల కేసులోనూ జావెద్ పై ఆరోపణలు గతంలో వచ్చాయి. అయితే తమ కుమారుడిని ఈరోజు తెల్లవారుజామున పోలీసులు తీసుకెల్లారని, ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని జావేద్ తల్లి హఫీజున్నీసా కోరుతున్నారు. తమ కుమారుడి ఆచూకి చెప్పాలంటూ ఆమె పోలీసులను కోరుతున్నారు. పోలీసులు తీసుకెళ్లారా? మరెవరైనా కిడ్నాప్ చేశారా? అన్న అనుమానం ఆమె వ్యక్తం చేస్తుంది.
https://www.telugupost.com/movie-news/అల్లు-అర్జున్-రేంజ్-మరి-ఇ-54045/
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - వక్కంతం వంశీ కలయికలో తెరకెక్కుతున్న 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా' సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మొదటిసారి అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక ఆర్మీ అధికారి పాత్ర ని పోషిస్తున్నాడు. లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాని నాగ బాబు సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ , డిజిటల్ రైట్స్ మంచి ధరకు అమ్ముడైనట్లు తెలుస్తుంది.మాములుగా అల్లు అర్జున్ సినిమాలకి శాటిలైట్ మంచి బిజినెస్ జరుగుతుంది. అలాగే సరైనోడు, డీజే సినిమాల్తో అల్లు అర్జున్ రేంజ్ బాగా పెరిగింది. ఇప్పుడు కూడా నా పేరు సూర్య సినిమా విషయంలో కూడా భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌, డిజిటల్ రైట్స్ ఏకంగా 25 కోట్లకి అమ్ముడుపోయాయి అని తెలుస్తుంది. టీవీలో ప్రసారం చేసుకునే హక్కులతో పాటు డిజిటల్ మీడియా ప్రసార హక్కులను కూడా ఒకే సంస్థ ఇంత భారీ అమౌంట్ కి నా పేరు సూర్య హక్కులను కొనేసిందని సమాచారం. సుమారు 25 కోట్లు ఈ రైట్స్ తోనే రావడం తో సినిమా బడ్జెట్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలోనే రికవర్ అయ్యాయని అంటున్నారు.మరి అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యువల్ నటిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ ఇంపాక్ట్ ని జనవరి 1 న్యూ ఇయర్ సందర్బంగా రిలీజ్ చేస్తారని అల్లు అర్జున్ స్వయంగా ప్రకటించాడు.
https://www.telugupost.com/crime/national-investigation-agency-will-continue-to-investigate-the-popular-front-of-india-case-1439564
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగుతుంది. ఎన్ఐఏ ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసింది. బోధన్ కు చెందిన సమీర్, ఆదిలాబాద్ కు చెందిన ఫిరోజ్, జగిత్యాల కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అహ్మద్, నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన ఇలాయాజ్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.వివిధ అల్లర్లకు సంబంధించి...వీరిని ఎన్ఐఏ న్యాయస్థానానికి తరలించారు. ఎన్ఐఏ నోటీసులు తొమ్మిది మంది విచారణకు హాజరయ్యారు. పీఎఫ్ఐ కు సంబంధించిన లావాదేవీలపై కూడా విచారణ జరుపుతుంది. భైంసా కుట్ర అల్లర్లతో పాటు ఇటీవల హైదరాబాద్ పాతబస్తీ లో జరిగిన గొడవలపై కూడా ఎన్ఐఏ ఆరాతీస్తుంది. నిషేధిత సిమి సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న పీఎఫ్ఐ ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలను పరిశీలించింది. కొన్ని ల్యాప్‌ట్యాప్ లను, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు వాటిని లోతుగా పరిశీలిస్తున్నారు.
https://www.telugupost.com/crime/telugu-students-died-in-america-nikesh-from-srikakulam-and-dinesh-from-vanaparthi-district-died-1515346
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. శ్రీకాకుళానికి చెందిన నీకేష్, వనపర్తి జిల్లాకు చెందిన దినేష్ మృతి చెందినట్లు గుర్తించారు. వీరిద్దరి మృతి విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలపడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. వీరిద్దరూ ఇటీవలే ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. న్యూయార్క్ లో ఉంటున్నారు. దినేష్ అమెరికాలోని హార్డ్ ఫోర్డ్ లో చేరారు. నికేష్ మాత్రం అక్కడకు వెళ్లిన తర్వాత దినేష్ రూమ్ లోనే ఉంటున్నాడు.ఒకే రూమ్ లో...అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా వివరాలు తెలియరాలేదు. ఇద్దరూ ఒకే రూములో చనిపోయి ఉండటంతో కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం వారిని ఎవరైనా హతమార్చారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఇక్కడకు తీసుకు వచ్చేందుకు సహకరించాలని కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేసి వారి మరణానికి కారణాలను తెలియజేయాలని కోరుతున్నారు.
https://www.telugupost.com/movie-news/sudigali-sudheer-and-anasuya-are-back-to-etv--1435483
జబర్దస్త్ లో కమెడియన్ గా చేరి.. అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్ ఈ మధ్యకాలంలో బుల్లితెరపై కనిపించట్లేదు. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షో లలో తన యాంకరింగ్, కామెడీతో అభిమానులను సంపాదించుకున్న సుధీర్.. ఉన్నట్లుండి ఆ షో ల నుంచి తప్పుకున్నాడు. ఇందుకు ప్రధాన కారణం సుధీర్ కు పారితోషికాన్ని పెంచకపోవడమే అని అభిమానులు అనుకున్నారు. మళ్లీ ఎప్పటికీ సుధీర్ ఆయా షో లలో కనిపించబోడని అందరూ అనుకున్నారు.తాజాగా ఈటీవీ 27వ వార్షికోత్సవం కొత్త ప్రోమోను విడుదల చేయగా.. అందులో అనసూయ, సుధీర్ సహా పలువురు కమెడియన్లు కూడా రానున్నారు. సుధీర్, చంద్ర, అనసూయ లు గెస్ట్ లుగా వస్తున్న ప్రోమో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. సుధీర్ మళ్లీ ఈటీవీలో ఉండాలని కోరుతూ.. అభిమానులు కామెంట్లు చేస్తున్నారు కానీ.. సుధీర్ కేవలం గెస్ట్ గా మాత్రమే వస్తున్నాడట. ఫుల్ ఎంటర్టైన్ మెంట్ తో నిర్వహించిన ఈటీవీ 27వ వార్షికోత్సవ ఫంక్షన్ ఈ ఆదివారం (ఆగస్టు 29)న టెలీకాస్ట్ కానుంది. ఈటీవీ మల్లెమాల నుంచి వెళ్లిపోయిన వారిలో చాలా మంది ఈ షో లో కనిపించనుండటంతో ఈ ఎపిసోడ్ కు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది.
https://www.telugupost.com/movie-news/పదేళ్లయినా-చేవ-చావలేదంటు-34044/
ఒకప్పుడు ఛమ్మాఛమ్మా అంటూ ఆడి పాడిన భామ.... రంగీలా తో కుర్రకారుకి పిచ్చెక్కించిన ఊర్మిళ గుర్తుందా..? రామ్ గోపాల్ వర్మ సినిమాలతో బాగా పాపులర్ అయిన ఊర్మిళ బాలీవుడ్ లో దాదాపు దశాబ్ద కాలం హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆమె అంద చందాలతో యువతను ఉర్రుతలూగించిన ఊర్మిళ బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. ఇక ఊర్మిళకు బాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాక చాలా కాలం వెండి తెరకు దూరమైంది. అయితే దాదాపు పదేళ్ల క్రితం వెండితెరకు దూరంగా ఉన్న ఊర్మిళ మళ్ళీ ఇన్నాళ్లకు వెండితెరమీద రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే ఏ తల్లిగానో, అక్కగానో ప్రాధాన్యం ఉన్న పాత్ర కాదండోయ్... ఏకంగా ఐటెం సాంగ్ లో నర్తించడానికి ఊర్మిళ రెడీ అవుతుంది. వెండితెరకు బై బై చెప్పి పదేళ్లయినా తనలోని ఊపు ఏ మాత్రం తగ్గలేదని నిరూపించడానికి ఊర్మిళ తయారవుతుంది. ఇప్పటివరకు ఇలా రీఎంట్రీ ఇచ్చిన చాలా మంది భామలు ఏ తల్లి కేరెక్టర్స్ కో లేకపోతె సపోర్టింగ్ కేరెక్టర్స్ కో మాత్రమే తీసుకునేవారు. మరి 10 ఏళ్ళ గ్యాప్ లోనూ ఊర్మిళ ఇలా ఐటెం లో నర్తిస్తుంది అంటే అది మామూలు విషయం కాదు. ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రధారిగా వస్తున్న హిందీ ఫిలింలో ఊర్మిళ తన అందచందాలతో మరోసారి విందు చేయడానికి సిద్ధమైంది.
https://www.telugupost.com/movie-news/mahesh-babu-maharshi-movie-strength-120183/
మహర్షి మీద ఇప్పటివరకు రాని అంచనాలు ఇప్పుడు ట్రైలర్ విడుదలయ్యాక వచ్చాయి. మహర్షి ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో ప్రేమ, స్నేహం, ఎమోషన్, యాక్షన్, పగ అన్నీ కనిపించేసరికి అందరూ మహర్షి మీద హోప్స్ పెట్టుకోవడం మొదలు పెట్టేసారు. నిన్నమొన్నటి వరకు మహర్షి సినిమా మీద ప్రేక్షకుల్లోనే కాదు కనీసం ట్రేడ్ లో కూడా ఓ అన్నంత ఆసక్తి కనిపించలేదు. కానీ మహర్షి ఈవెంట్ తో పాటు ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో మహర్షి మీద అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ మీద మహర్షి టీం గంపెడాశలు పెట్టుకుందని నిర్మాత దిల్ రాజు చెప్పిన దాన్నిబట్టి అర్ధమవుతుంది. ట్రైలర్ తో పెరిగిన అంచనాలు నిన్నమొన్నటివరకు శ్రీమంతుడు సినిమాతో మహర్షికి పోలిక పెడుతూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు దిల్ రాజు చెప్పినదాన్ని బట్టి.. మహర్షి క్లైమాక్స్ కి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కనెక్ట్ అవడం ఖాయంగా కనబడుతుంది. ట్రైలర్ లో స్టోరీని రివీల్ చెయ్యకుండా చాలా జాగ్రత్తగా ట్రైలర్ కట్ చేసిన మహర్షి టీం… ప్రేక్షకుల్లో సస్పెన్స్ నింపింది. ఇక ఈ సినిమా కోసం ఎమోష‌న‌ల్ క్లైమాక్స్ డిజైన్ చేశాడు వంశీ పైడిప‌ల్లి. అది చూస్తే ఎవ్వ‌రికైనా క‌న్నీళ్లు ఆగ‌వ‌ట‌. ఈ విష‌యాన్ని దిల్‌ రాజు స్వయంగా చెప్పాడు. మరి దిల్ రాజు చెప్పినదాన్నిబట్టి మ‌హ‌ర్షి ప్రాణం అంతా ఆ క్లైమాక్స్ దగ్గరే ఉందనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మొదటి నుండి చెప్పినట్టుగా అల్లరి నరేష్ పాత్ర సినిమాకి కీలకమవుతుందని మహర్షి టీం భావిస్తుందట. అందుకే అల్లరి నరేష్ పాత్రని ఎక్కడా రివీల్ చెయ్యకుండా జాగ్రత్త పడుతుంది. ట్రైలర్ మొత్తం మహర్షి చుట్టూనే తిప్పారు కానీ ఎక్కడా అల్లరిని హైప్ చెయ్యలేదు. బలమంతా క్లైమాక్స్ లోనే… అయితే సోషల్ మీడియా టాక్ ప్రకారం అల్లరి నరేష్ ని స్క్రీన్ పై చూసి షాక్ అవ్వాల‌న్న‌ది వాళ్ల ఉద్దేశమట. అలాగే అల్లరి న‌రేష్ పాత్ర‌కు యాంటీ క్లైమాక్స్ డిజైన్ చేశార‌ని, అక్కడే రిషి పాత్ర‌లో మార్పు మొద‌ల‌వుతుందని అంటున్నారు. మరి దీన్నిబట్టి మ‌హ‌ర్షి బ‌లం.. న‌రేష్‌, క్లైమాక్స్ సీన్స్ అని తెలుస్తుంది.
https://www.telugupost.com/telangana-assembly-elections-2023/bjp-central-leadership-has-kept-komatireddy-rajagopal-reddys-ticket-pending-1500886
భారతీయ జనతా పార్టీ తొలి జాబితా విడుదలయింది. తొలి జాబితాలో 52 మంది పేర్లను అధినాయకత్వం ప్రకటించింది. అయితే ముఖ్యనేతలందరి పేర్లను ప్రకటించిన కేంద్ర నాయకత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టిక్కెట్ మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఆయన మీద కొన్ని అనుమానాలు ఉండటమే పెండింగ్‌లో పెట్టడానికి కారణమని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఇటీవల పార్టీలో పెద్దగా యాక్టివ్‌ గా లేరు. దీంతో పాటు ఆయన పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది. అందుకనే ఆయన పేరును తొలి జాబితాలో ప్రకటించలేదు.రాజీనామా చేసి...కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో ఉండి బీజేపీలో చేరిపోయారు. ఆయన 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి శాసనసభ్యుడిగా విజయం సాధించారు. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయనతో విభేదించి పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ కమలం పార్టీలో చేరిపోయారు. దీంతో ఉప ఎన్నికలు వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. వ్యక్తిగతంగా మునుగోడులో ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ బీజేపీలో చేరిక ఆయనకు పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదు.సోదరుడు సిఫార్సుతో...కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఆయన తమ్ముడు పార్టీని వీడినా కాంగ్రెస్ ను వీడకుండా అంటిపెట్టుకునే ఉన్నారు. పార్టీలో కీలకంగా మారారు. అయితే బీజేపీ గ్రాఫ్ పడిపోవడం, కాంగ్రెస్ ఇమేజ్ కొంత పెరగడంతో తిరిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సోదరుడు వెంకటరెడ్డి సహకారం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టాన్ని ఒప్పించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకువస్తారన్న ప్రచారం జరుగుతుంది.ఈసారి ఇక్కడి నుంచే....అయితే ఈసారి ఆయన మునుగోడు నుంచి పోటీ చేయకుండా ఎల్.బి.నగర్ నుంచి బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎల్.బి.నగర్ టిక్కెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఒకపక్క స్థానిక నాయకత్వంతో పాటు మధుయాష్కి గౌడ్ కూడా ఎల్.బి.నగర్ నియోజకవర్గం టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాలో ఎల్.బి.నగర్ నియోజకవర్గం అభ్యర్థి పేరును ప్రకటించలేదు. అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసమే రిజర్వ్ చేశారన్న టాక్ పార్టీలో బలంగా నడుస్తుంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ లో చేరతారంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సిందే.
https://www.telugupost.com/movie-news/varun-tej-comments-on-nagababu-speech-in-operation-valentine-pre-release-event-1522767
Varun in OperationValentine:టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చ్ 1న విడుదల కానుంది. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపధ్యంలో ఈ సినిమా వచ్చింది. ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు మాట్లాడుతూ పొట్టిగా ఉన్న వాళ్లు పోలీసు అధికారులుగా నటిస్తే సెట్ అవ్వదన్నట్లు చెప్పారు. వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం నుంచి రిస్క్ పాత్రలు ఎక్కువగా చేస్తున్నాడని నాగబాబు అన్నారు. వరుణ్ ఎత్తు, బాడీ లాంగ్వేజ్ ఇండియన్ ఆర్మీ, పోలీస్ తరహా పాత్రలకు కచ్చితంగా ఉంటుందన్నాడు. 5.3 అంగుళాల ఎత్తుండే వ్యక్తి కూడా పోలీసు పాత్రలు చేస్తే చూడటానికి బాగుండదన్నాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. టాలీవుడ్‌లోని కొందరు హీరోల్ని నాగబాబు టార్గెట్ చేశారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. 5.3 అంగుళాల ఎత్తంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లోని ఓ అగ్రహీరోను ఉద్దేశించి చేసినవేనని కామెంట్లు పెడుతున్నారు.ఈ వివాదంపై వరుణ్ తేజ్ స్పందించారు. ఆ కామెంట్స్ ను కావాలనే ఒక హీరోకు ఆపాదిస్తున్నారని, దీనివల్ల నెగెటివిటీ పెరిగే అవకాశం ఉందని అన్నారు. తాను 6.3 అడుగుల హైట్ ఉంటానని, కాబట్టి 5.3 అడుగులు ఎత్తు ఉండే వారు పోలీస్ పాత్రలకు సెట్ కారని ఫ్లోలో నాన్న అన్నారని తెలిపాడు. అయినా టాలీవుడ్ లో 5.3 అడుగుల ఎత్తున్న హీరో ఎవరున్నారని తిరిగి ప్రశ్నించారు. నాన్న చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం మార్చి 01న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
https://www.telugupost.com/movie-news/ఈసారి-నటనకే-ఇంపార్టెన్స్-38196/
టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో గ్లామర్ షో చెయ్యకుండా చుడీదార్స్ లోనే కనబడిన రకుల్ ఆ తర్వాత చేసిన సినిమాలన్నిటికి కేవలం గ్లామర్ షోకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అయితే కేవలం అందచందాలతోనే రకుల్ ఇంతవరకు రాగలిగింది కానీ ఆమెకు నటనలో ఏ మాత్రం ప్రావిణ్యం లేదంటున్నారు కొందరు. కానీ రకుల్ మాత్రం టాలీవుడ్ టాప్ హీరోలందరితో జోడి కట్టింది. కేవలం ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో మాత్రమే రకుల్ నటించలేదు. ఇక ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ - పవన్ కాంబోలో రాబోయే చిత్రానికి రకుల్ పేరు గట్టిగా వినబడుతుంది. ఒకవేళ ఫైనల్ అయితే రకుల్ కోరిక తీరిపోతుంది.మరి ఎప్పుడూ గ్లామర్ షో చేసే రకుల్, నాగ చైతన్య తో నటించిన ,రారండోయ్ వేడుక చూద్దాం, లో మాత్రం కాస్త నటనకు ప్రాధాన్యం ఉన్న భ్రమరాంబ పాత్రలో ఇరగదీసింది. అయితే ఇప్పుడు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చెయ్యడానికి సిద్దమయ్యింది. డీ గ్లామర్‌‌గా ఉండే పాత్రని రకుల్ ఎంపిక చేసుకుందట. గ్లామర్ కి ఏమాత్రం స్కోప్ లేని విడో పాత్రలో రకుల్ కనిపించబోతోందట. పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం వుండడంతో విడో క్యారెక్టర్‌కు రకుల్ ఓకే చెప్పిందన్నది ఇన్నర్ టాక్.మరి ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న రకుల్ ఇలా డీ గ్లామర్ రోల్ చెయ్యడానికి ఎలా ఒప్పుకుందో అంటున్నారు. మరోపక్క ఎప్పుడూ గ్లామర్ డాల్ గా మాత్రమే ఏం చేస్తాం.... ఈసారి నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసి తన మీద వస్తున్న వార్తలకు చెక్ పెడదామని రకుల్ భావిస్తుందని అంటున్నారు రకుల్ సన్నిహితులు.
https://www.telugupost.com/movie-news/pawan-kalyan-and-saidharam-tejs-bro-movie-teaser-out-now-1482783
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే.. ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఉత్సాహం ఉంటుంది. మరీ ఇద్దరు మెగా హీరోల కాంబినేషన్లో సినిమా అంటే.. ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మామ-అల్లుడు కలిసి.. చేస్తున్న మెగా మల్టీస్టారర్ సినిమా ‘బ్రో’. తమిళంలో వచ్చిన వినోదయ సిత్తంకు ఇది రీమేక్. ఆ సినిమాను తీసిన సముద్రఖనే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. జులై 28న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా 29 రోజుల సమయమే ఉండటంతో.. మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేసింది. అందులో భాగంగా.. ఇప్పటికే పవన్ అండ్ తేజ్ ల పోస్టర్లను విడుదల చేశారు.తాజాగా.. గురువారం సాయంత్రం ‘బ్రో’ టీజర్ ను విడుదల చేశారు. టీజర్లో మామ-అల్లుడు అదరగొట్టేశారు. ఏంటిది ఇంత చీకటిగా ఉంది.. ఏవండి ఎవరైనా ఉన్నారా..హలో మాస్టారూ.. గురువుగారూ.. తమ్ముడూ.. అన్న కనిపించని పవన్ కల్యాణ్.. బ్రో అనగానే ఎంట్రీ ఇస్తాడు. ‘కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం’, సినిమాలెక్కువ చూస్తావేంట్రా నువ్వు అంటూ పవన్ చెప్పే డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. టీజర్ కు తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఊర్వశి రౌటేలా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుండగా.. ఖజరారే ఖజరారే పాట తరహాలో ఈ పాట ఉంటుందని టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘బ్రో’ జులై 28న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
https://www.telugupost.com/telangana-assembly-elections-2023/telangana-election-polling-is-over-counting-will-be-done-tomorrow-but-all-exit-polls-came-in-favour-of-congress-1507135
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రేపు కౌంటింగ్ జరగనుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగానే వచ్చాయి. ఏవో రెండు మూడు తప్పించి దాదాపు అన్ని సర్వే ఏజెన్సీలు హస్తం పార్టీదే అధికారమని తేల్చాయి. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే... అధికార పార్టీ గుంభనంగా ఉంది. కేటీఆర్ తప్ప ఎవరూ మీడియా ముందుకు రాలేదు. ఆరోజు ఇంకా పోలింగ్ జరుగుతున్న సమయంలోనే మీడియా సమావేశం పెట్టి పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎలా ఎగ్జిట్ పోల్స్ కు అవకాశమిస్తారని కేంద్ర ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. తాము 70 స్థానాలతో అధికారంలోకి వస్తున్నామని చెప్పి వెళ్లిపోయారు. మరుసటి రోజు మాత్రం తాను హ్యాపీగా నిద్రపోయానని, 3వ తేదీన శుభవార్త వింటున్నామని తెలిపారు.కేబినెట్ భేటీ అంటూ...మరోవైపు నాలుగో తేదీన కేసీఆర్ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందరు మంత్రులు గెలుస్తారో? లేదో? నమ్మకం లేనప్పుడు కేబినెట్ సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అయితే తామే అధికారంలోకి వస్తామన్న పూర్తి విశ్వాసంతో కేసీఆర్ మంత్రి వర్గ సమావేశం తేదీని ముందుగానే ప్రకటించారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాదు.. కాదు.. కౌంటింగ్ సమయంలో క్యాడర్ నిరుత్సాహపడకుండా ఉండేందేకే ఈ మంత్రి వర్గ సమావేశాన్ని ముందుకు తెచ్చారని విపక్షాలు అంటున్నాయి. పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే కేబినెట్ సమావేశం ఎలా పెడతారని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.ప్రమాణ స్వీకారం డిసెంబరు 9న...కానీ జనవరి పదహారో తేదీ వరకూ కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారని అధికార పార్టీ చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఫుల్లు కాన్ఫిడెన్స్ తో ఉంది. తాము అధికారంలోకి వచ్చినట్లే భావిస్తుంది. అన్ని ఏజెన్సీలు అనుకూలంగా సర్వేలు చెప్పడంతో పాటు వస్తున్న ఫీడ్ బ్యాక్ కూడా తమదే విజయమని చెబుతుండటంతో విజయోత్సవాలు మినహా దాదాపుగా ప్రభుత్వంలోకి వచ్చినట్లే భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసుల బలగాలను పెంచడం కూడా ఇందుకు నిదర్శనమని అంటున్నారు. రేవంత్ రెడ్డి నుంచి కింది స్థాయి నేత వరకూ మీడియా ముందుకు వచ్చి తమదే అధికారమని పదే పదే ప్రకటిస్తున్నారు. నియంత పాలనకు కాలం చెల్లిందని ప్రకటనలు చేస్తున్నారు. డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా డేట్ ఫిక్స్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు...ఇలా కేబినెట్ డేట్ ఫిక్స్ కావడం..... అటు కాంగ్రెస్ ప్రమాణస్వీకారం ముహూర్తం ఫిక్స్ కావడంతో ఏమీ అర్ధం కానిది ప్రజలకే. ఎగ్జిట్ పోల్స్ ను తప్పుగా అంచనా వేయలేం. అలాగని ఖచ్చితత్వాన్ని కూడా కాదనలేం. ప్రజల మూడ్ ను బట్టి అవి అంచనాలు వేసి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇస్తాయి. ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పవచ్చు. ఒక్కోసారి అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు రావచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ లో ప్రతి నేత ఉత్సాహంతో కనిపిస్తుండగా, బీఆర్ఎస్ నేతల్లో మాత్రం పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదన్నది మాట వాస్తవం. అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 60. ఆ ఫిగర్ దాటేంత వరకూ అందరికీ టెన్షన్ తప్పదు. కానీ కాంగ్రెస్ ఒకలా.. బీఆర్ఎస్ మరొలా..ఎందుకలా?
https://www.telugupost.com/movie-news/senior-actress-jayaprada-mother-neelaveni-passed-away-in-hyderabad-continental-hospital-1352286
ప్రముఖ సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జయప్రదకు మాతృవియోగం కలిగింది. ఆమె తల్లి నీలవేణి తీవ్ర అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కన్నుమూశారు. తల్లి మరణవార్తతో.. ఢిల్లీలో ఉన్న జయప్రద హుటాహుటిన బయల్దేరి హైదరాబాద్ కు చేరుకున్నారు. తల్లి నీలవేణి మరణంతో జయప్రద తీవ్ర విషాదంలో ఉన్నారు. తల్లి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.Also Read : గుడ్ న్యూస్ : వచ్చే నాలుగు వారాల్లో కరోనా ఉద్ధృతి తగ్గుతుంది !జయప్రద తల్లి నీలవేణి మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు.. సంతాపం తెలుపుతున్నారు. కాగా.. తన అందం, అభినయంతో ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జయప్రద.. భూమికోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, బెంగాలి, మ‌రాఠి భాషల్లో మొత్తం 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. అక్కడ కూడా తన సత్తా చాటారు. ప్రస్తుతం ఆమె బీజేపీ లో సభ్యురాలిగా ఉన్నారు.
https://www.telugupost.com/movie-news/ధ్రువ-వరల్డ్-వైడ్-ఫస్ట్-వ-17066/
ప్రాంతం షేర్ (కోట్ల లో)నైజాం 7 .21సీడెడ్ 3 .67వైజాగ్ 2 .82ఈస్ట్ గోదావరి 1 .58వెస్ట్ గోదావరి 1 .55క్రిష్ణ 1 .54గుంటూరు 1 .85నెల్లూరు 0 .73కర్ణాటక 4 .55ఓవర్ సీస్ 4 .55రెస్ట్ ఆఫ్ ఇండియా 0 .80ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 30 .85
https://www.telugupost.com/crime/nimmakayala-chinna-demise-in-yaanam-his-girlfriend-mounika-took-shocking-decision-1490843
ప్రేమించిన వాళ్లు లోకంలో లేకపోతే తాము కూడా ఈ లోకంలో ఉండమని చెప్పి కఠోర నిర్ణయాలు తీసుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఘటనే ఒకటి యానాంలో చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి ప్రాణాలు వదిలాడని ఆ అమ్మాయి కూడా ప్రాణాలు తీసుకున్న ఘటన యానాంలో చోటు చేసుకుంది.మీసాల మౌనిక అనే అమ్మాయి రెండేళ్లుగా కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో ప్రేమలో ఉంది. చిన్నా గంజాయికి బానిసయ్యాడు. రెండు నెలల క్రితం అతడు తన సోదరుడిని గంజాయి కోసం రూ.500 అడగ్గా అతడు నిరాకరించాడు. క్షణికావేశానికి లోనైన చిన్నా ఒంటికి నిప్పంటించుకున్నాడు. కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రియుడు దూరమవడంతో మౌనిక తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. కాలేజీకి వెళ్లడం కూడా మానేసింది. తీవ్ర డిప్రెషన్‌ లోకి వెళ్లిపోయింది. ఆమె అతడి లోకంలో లేనంటూ.. సోమవారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యానాంలోని యూకేవీనగర్‌కు చెందిన మౌనిక తన మేనమామ త్రిమూర్తులు వద్ద ఉంటూ నర్సింగ్ విద్య చదువుకుంటోంది. ఆమె తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. అక్క, చెల్లెళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. ఈమె చిన్నాను పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇంతలో ఇద్దరి జీవితంలో ఇలాంటి దారుణం చోటు చేసుకుంది. త్రిమూర్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపించి బంధువులకు అప్పగించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/ntr-biopic-new-title-91380/
నందమూరి తారక రామారావు అనే పేరు నటనకే ఆణిముత్యం. నట జీవితంలో అనేక రకాల పాత్రలతో మెప్పించిన నందమూరి తారకరామారావు బయోపిక్ ని ఆయన తనయుడు బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. అయితే నట, రాజకీయ జీవితంలో సంచలనాల ఎన్టీఆర్ జీవితాన్ని ఒకే ఒక భాగంలో చూపించడం అనేది అసాధ్యం. అయితే సినిమా మొదలు పెట్టినప్పుడు ఒకే భాగంగా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలకృష్ణ అనుకున్నాడు. కానీ అది అసాధ్యం అని తేలడంతో క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ పూర్తి నట జీవితం ఒక భాగంగా, ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని మరో భాగంగా తీర్చి దిద్దుతున్నారు. గత రెండు రోజులుగా ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రాబోతుందని ప్రచారం జరుగుతుండగా... తాజాగా ఎన్టీఆర్ చిత్ర బృందం నుండి కూడా ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలంటూ అధికారిక ప్రకటన వచ్చేసింది.రెండు పార్ట్ ల మధ్య రెండు వారాలు...ఎన్టీఆర్ నట జీవితాన్ని మొదటి భాగంగా ఎన్టీఆర్ - కథానాయకుడు గా, ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని రెండో భాగంగా ఎన్టీఆర్ - ప్రజానాయకుడు గా విడుదల చెయ్యాలని క్రిష్ తో పాటుగా బాలకృష్ణ కూడా భావించి ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నామని బిగ్ బ్రేకింగ్ న్యూస్ లా ప్రకటించేశారు. మరి నటజీవితంలో కథానాయకుడిగా ఎన్టీఆర్ చేసిన పౌరాణిక పాత్రలు, హీరోయిజాన్ని పండించే పాత్రలు, ఆత్మీయతలు, అనుబంధాలకు అల్లుకుపోయే పాత్రలు ఎన్టీఆర్ కి పెట్టింది పేరు. ఎన్టీఆర్ రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, ఇంకా చాలా రకాల పాత్రలు అలవోకగా వేసి అశేష ప్రేక్షకాదరణ పొందాడు. ఇక ఏఎన్నార్, కృష్ణ, ఎస్వీఆర్, సావిత్రి, శ్రీదేవి, జయప్రద, జయసుధ ఇలా మేటి నటీనటులతో ఎన్టీఆర్ తన నట జీవితంలో జీవించారు. ఎన్టీఆర్ నట జీవితాన్ని అందుకే క్రిష్ కథానాయకుడిగా చూపించబోతున్నాడు. ఇక మిగిలిన ప్రజానాయకుడు గా అంటే ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని కూలంకషంగా చూపించబోతున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ - కథానాయకుడు పార్ట్ ని జనవరి 9 న సంక్రాతి కానుకగా విడుదల చేసేటున్నారని అధికారిక ప్రకటన ఇవ్వగా... ఎన్టీఆర్ - ప్రజానాయకుడు పార్ట్ ని దీనికి రెండు వారాల గ్యాప్ తో జనవరి 26 న విడుదల చేసే ప్లాన్ లో ఎన్టీఆర్ చిత్ర బృందం ఉంది కానీ.. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ కి సంబంధించిన ఎన్టీఆర్ - కథానాయకుడు పోస్టర్ ని విడుదల తేదీతో పాటుగా విడుదల చేశారు.
https://www.telugupost.com/movie-news/big-boss-4-insurance-163941/
గత ఏడాది ఈపాటికి బుల్లితెర మీద బిగ్ బాస్ సీజన్ త్రీ సందడి మాములుగా లేదు. కేవలం శని ఆది వారాలే కాదు.. వర్కింగ్ డేస్ లోను బిగ్ బాస్ మంచి రేటింగ్ తో స్టార్ మా కి కిక్కిచ్చింది. నాగార్జున హోస్ట్ గా 100 రోజులకి పైగా బిగ్ బాస్ సీజన్ 3 లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ కాగా.. ఇప్పుడు సీజన 4 కోసం స్టార్ మా బాగా వెయిట్ చేస్తుంది. కానీ కరోనా వలన బిగ్ బాస్ యాజమాన్యానికి చుక్కలు కనబడుతున్నాయి. 100 రోజులు జరగాల్సిన షో కాస్త కేవలం 50 రోజులకే కుదించారని, నాగార్జున కండిషన్స్ కి తలొగ్గడమే కాదు.. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలోనూ బిగ్ బాస్ కి సినిమా కష్టాలు కనబడుతున్నాయట. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే వారు కరోనా టెస్ట్ లే కాకుండా 14 రోజులు బిగ్ బాస్ యాజమాన్యం ఏర్పాటు చేసే క్వారంటైన్ లో ఉండాలి. అలాగే కంటెస్టెంట్స్ కి ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా చేయించాలనే కొత్త రూల్ ఒకటి బిగ్ బాస్ కి తగిలింది. కేవలం కంటెస్టెంట్స్ కి మాత్రమేనా షో కోసం పనిచేసే వారందరికీ అంటే దాదాపు 250 నుండి 275 మందికి ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం ఇన్సూరెన్స్ చేయించాలట. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ పారితోషకాల్లో కోత పెట్టినా…. నాగ్ పారితోషకం, సెట్ ఖర్చు మామూలుగానే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు కంటెస్టెంట్స్ కి టెక్నీకల్ సిబ్బందికి కొత్తగా ఇన్సూరెన్స్ ఒకటి బిగ్ బాస్ యాజమాన్యానికి తలా బొప్పికడుతుందట. గతంలో కన్నా ఖర్చు తగ్గిద్దామని డిసైడ్ అయితే.. ఇప్పడు ఈ ఇన్సూరెన్స్ గోలతో మరో 20 శాతం ఖర్చు ఎక్కువ అవుతుందట. ఏదో టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోదామని, కోట్లు కొల్లగొడదామని చూస్తే ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యానికి కె బిగ్ బాస్ షో చుక్కలు చూపెడుతుంది అని అంటున్నారు.
https://www.telugupost.com/movie-news/monal-bigboss-174721/
బిగ్ బాస్ సీజన్ 4 లో అర్హతలేని కంటెస్టెంట్ ని బిగ్ బాస్ వెనకేసుకొస్తున్నాడు, ఆ కంటెస్టెంట్ ని బిగ్ బాస్ కాపాడుతున్నాడు అంటూ.. మోనాల్ గజ్జర్ విషయంలో సోషల్ మీడియాలో బిగ్ బాస్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. కానీ గత రెండు వారాలుగా మోనాల్ ఆటలో చాలా తేడా.. ఇప్పుడు ఈ రెండు వారాలుగా మోనాల్ స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. అట మొదలైనప్పటినుండి మోనాల్ కోసం అఖిల్, అఖిల్ కోసం మోనాల్ స్టాండ్ తీసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ గత వారం కెప్టెన్సీ టాస్క్ విషయంలో అఖిల్ మోనాల్ ఫై కోపం తెచ్చుకోవడం, మమ్మి చెప్పిందని మోనాల్ తో దూరంగా ఉండడం చేస్తున్నాడు. ఆ విషయంలో మోనాల్ గట్టిగానె హార్ట్ అయ్యింది. అయితే ఈ సోమవారం నామినేషన్స్ లో మోనాల్ అఖిల్ కి మరిచిపోలేని షాకిచ్చింది. ఈ వారం నామినేషన్స్ విషయంలో హౌస్ మేట్స్ తెలీకుండా పెట్టుకున్న ఎర్ర టోపీతో ఎలిమినేషన్స్ లోకి వెళ్లగా.. అందులో అఖిల్, అభిజిత్, అరియనా, అవినాష్ లు ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఆ నలుగురిని మీరు హౌసులో ఎందుకు ఉండాలనుకుంటున్నారో చెప్పి మీరు వేరే వాళ్ళుతో స్వాప్ చేసుకోవచ్చని అనగానే అవినాష్ మోనాల్ ని రిక్వెస్ట్ చెయ్యగా.. మోనాల్ అవినాష్ కి మీరు హౌస్ లో ఉండి గట్టిగా ఆడండి అంటూ గట్టిగానే చెప్పింది. ఇక అఖిల్ కూడా మోనాల్ ని రిక్వెస్ట్ చేసి..అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నావ్ అంటున్నారు.. కానీ ఎక్కడ? అని మోనాల్ ని తనతో స్వాప్ చేసుకోమని అడిగాడు . కానీ మోనాల్ అఖిల్ కాదని అభిజిత్ ని స్వాప్ చేసుకుంది. దానితో అఖిల్ ఫేస్ ఎర్రగా దోశలా మాడిపోయింది.
https://www.telugupost.com/movie-news/మూర్తిగారేమిటండి-రెచ్చి-38642/
ఇప్పుడు టీవీ ఛానల్స్, సోషల్ మీడియా, వెబ్సైట్స్ ఎక్కడ చూసినా ఒకటే రగడ. సినిమా ఇండస్ట్రీనే సిట్ అధికారులు ఎందుకు డ్రగ్స్‌ కేసులో టార్గెట్‌ చేస్తున్నారని అంటున్నారు. మరో వైపు పొలిటికల్ సైడ్ నుండి గాని, స్కూల్స్, కాలేజెస్ సైడ్ నుండి గాని ఎటువంటి కదలికలు లేని డ్రగ్స్ కేసు ముందుగా సినిమా ఇండస్ట్రీ పైనే పడడం కాస్త ఆశ్చర్యంగా వున్నా... మరొకవైపు మాత్రం ఎక్కడినుండో అక్కడినుండి ఈ కేసు ఖచ్చితంగా మొదలయ్యెదనే చెబుతున్నారు. అలాగే మొదట మీరు...మొదట మీరు అని నిందించుకుంటూ కూర్చోంటే అసలు తొలి అడుగు ఎక్కడ పడాలి? ఎవరికి వారు, ముందు రాజకీయ నాయకులని విచారించండి అని సినిమావారు, సినిమావారు బాగా పాపులర్‌ కాబట్టి వారి సంగతి మొదట చూడండి అని, ఎవరికి వారు మరొకరి మీదకు నెడుతూ ఉంటే మొదటి అడుగు ఎక్కడ నుంచి వేయాలి? మరికొందరు మీ అధికారులు, వారి పిల్లలే వాడుతున్నారు. మొదట మీ సంగతి మీరే చేసుకోండి.........అంటున్నారు. కానీ సిట్ అధికారులు మాత్రం ముందుగా స్కూల్స్, కాలేజెస్ ని టార్గెట్ చేసినా కూడా యాక్షన్ తీసుకుంటున్నది మాత్రం సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీస్ నే. అయితే కేవలం ఇండస్ట్రీ మీదే ఎందుకింతగా ఫోకస్ చేశారని మొన్నటికి మొన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీడియా సాక్షిగా వాదించాడు. ఇక ఇప్పుడు తాజాగా సామాన్యంగా ఎవ్వరినీ విమర్శించని ఆర్‌.నారాయణమూర్తి కూడా మా సినిమా వారే కనిపిస్తారా? అని ప్రశ్నించడం ఓ బాధ్యతాయుతమైన ఆర్‌.నారాయణమూర్తి గారికి తగదు. స్కూళ్లకు వెళ్లే టీనేజ్‌ పిల్లలకి కూడా డ్రగ్స్‌ అందుతున్నాయంటే పరిస్థితిని తీవ్ర రూపాన్ని ఇది చూపిస్తోంది. మీకు మీ సినిమా వారి మీద అంత నమ్మకం ఉంటే.. వారందరినీ విచారించకండి....... వారు డ్రగ్స్‌ వాడినట్లు, లేదా సప్లై చేసినట్లు తెలిస్తే వారి తరపున నేను శిక్ష అనుభవించడానికి రెడీ అని ఆర్‌.నారాయణమూర్తి వంటి వారు సినిమా పరిశ్రమ తరపునవకాల్తా పుచ్చుకోవడం కరెక్ట్ కాదనే వాదన వినబడుతుంది.మరి నారాయణ మూర్తి గారు కేవలం సినిమా వాళ్లనే ఇలా సిట్ ఆఫీసర్స్ ఎందుకు టార్గెట్ చేసి ఇండస్ట్రీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారంటూ..... మీడియా, సిట్ అధికారులు కలిసి సినిమాలు తీసే వాళ్లకే సినిమాలు చూపిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ డ్రగ్స్ వ్యవహారంలో సినిమా వాళ్లు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నట్లుగా భ్రమలు కల్పిస్తున్నారని.. పెద్ద పెద్ద కంపెనీలకు చెందిన ఉద్యోగులు.. రాజకీయ నేతలు.. వ్యాపారవేత్తలు కూడా డ్రగ్స్ వాడుతున్నారన్నారు. వాళ్లందరిని వదిలేసి.. సినిమా వాళ్ల మీదనే ఫోకస్ చేయటం సరికాదన్నారు. మరి నారాయణ మూర్తి డ్రగ్స్ వ్యవహారంలో అనవసరంగా స్పందించారేమో అనిపిస్తుంది కదూ.
https://www.telugupost.com/movie-news/naga-shourya-srinivas-avasarala-movie-title-113574/
నాగశౌర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘నర్తనశాల’ డిజాస్టర్ తరువాత ఇప్పుడిప్పుడే నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు శౌర్య. ప్రస్తుతం అతను వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. నందినీరెడ్డితో ‘బేబీ’ అనే సినిమా పూర్తయిపోయింది. మరో రెండు సినిమాలతో పాటు శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కోసం ఓ డిఫరెంట్ టైటిల్ అనుకుంటున్నారు. ఇప్పటికే రెండు హిట్ సినిమాలు ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. అవసరాల తనదైన స్టయిల్ లోనే అందించబోతున్నారని డిసైడ్ కావచ్చు. అవసరాలతో నాగశౌర్య ఇప్పటికే రెండు సినిమాలు చేసిన అనుభవం ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జో అచ్యుతానంద’ రెండు సినిమాలూ డీసెంట్ హిట్స్ అయ్యాయి. ఇక మూడు సినిమా అయిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే అధికారంగా ప్రకటన రానుంది.
https://www.telugupost.com/movie-news/ఇప్పటితరం-హీరోలకు-అసలు-బ-14042/
ఈ మాటన్నది ఎవరో కాదు సీనియర్ నటుడు చంద్రమోహన్. ఇప్పటి తరం హీరోలకు అసలు ఏం తెలియదని అన్నారు. వీరంతా ఎంతో గొప్పనటులమని ఫీలవుతారని కానీ వారికి అస్సలేం తెలియదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేను ఇప్పటివరకు 800 లు పైగా సినిమాల్లో నటించానని... . తన 50 ఏళ్ళ సినీజీవితం తనకు సంతృప్తినిచ్చిందని నిన్నఆదివారం ఏలూరులో జరిగిన వనమోహోత్సవ కార్యక్రమం లో ఆయన మీడియా తో మాట్లాడారు. రంగులరాట్నం, సువర్ణనంది చిత్రాలు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయని అప్పటి తియ్యని జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేనని అన్నారు. ఇక ఆయన ప్రస్తుతం సినిమా పరిశ్రమలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ... ఇప్పుడు సినిమా పరిశ్రమలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని.... ఈ తరం హీరోలు ఎన్టీఆర్‌, అమితాబచ్చన్‌ల మాదిరి తెగ ఫీల్‌ అయిపోతూ తామేదో సాధించేశామనే ధోరణిలో ఉన్నారని అన్నారు. అసలు సీనియర్ నటుల్ని ఏమాత్రం గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఇప్పుడు వస్తున్న సినిమాలు అశ్లీలత, ఫైట్స్, కామెడీ అంటూ రొటీన్ కథలుగానే ఉంటున్నాయని.... కామెడీ కి పెద్దగా చోటు లేకుండా పోయిందన్నారు. అసలు ఈ రోజుల్లో సినిమాలు 100 రోజులు ఆడడమే గగనం అయిపోయాయని.... కనీసం రెండు వారాలు కూడా థియేటర్స్ లో నిలబడలేకపోతున్నాయని అన్నారు. ఇక ఆర్టిస్టుగా క్యారెక్టర్లు కూడా దొరకడం లేదన్నారు. ఇప్పుడొస్తున్న కేరెక్టర్స్ తనకసలు తృప్తినివ్వడం లేదన్నారు. చంద్ర మోహన్ మాదిరిగానే ఆ మధ్యన ప్రస్తుత సినిమా పరిశ్రమ పరిస్థితులపై సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు తన ఆవేదనను వెళ్లగక్కిన విషయం తెలిసిందే
https://www.telugupost.com/movie-news/tollywood-director-kisses-heroine-in-public-video-goes-viral-on-the-internet-1492139
సినిమాను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలంటే చాలానే చేయాలి. అందుకు సంబంధించి హెల్తీ పబ్లిసిటీ దారిలో నడిచే వాళ్లు కొందరు ఉంటారు. ఇంకొందరు సినిమాను చీప్ గా రెచ్చిపోతూ ఉంటారు. ఇలాంటి ప్రమోషన్స్ వల్ల మైలేజీ కంటే డ్యామేజీనే ఎక్కువ ఉంటుంది. అందుకే స్టేజీల మీద, మీడియా సమావేశాల్లో కాస్త పద్దతిగా ప్రవర్తించాలి. అయితే కొందరు మాత్రం అతి చేస్తూ అడ్డంగా దొరికిపోతూ ఉంటారు. హీరోలు, దర్శకులు, టెక్నీషియన్స్ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ AS రవి కుమార్ చౌదరి ఒక పబ్లిక్ ఈవెంట్‌లో నటి మన్నారా చోప్రాను ముద్దుపెట్టుకున్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ‘తిరగబడరా సామి’. సినిమాలో హింసను వ్యతిరేకించే అమాయకపు కుర్రాడి పాత్రలో రాజ్ తరుణ్ కనిపిస్తాడు. కానీ అతను ప్రేమించిన అమ్మాయి హింసను ఇష్టపడుతుంది. మన్నారా చోప్రా కూడా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన మాల్వీ మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్ ముందు మన్నారా భుజంపై చేయివేసి, ఫొటోలకు పోజులిచ్చిన రవి కుమార్ చౌదరి ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. ఆ సమయంలో మన్నారా చోప్రా నవ్వుతూ సైలెంట్ అయిపోయింది. ఈ ముద్దు సమయంలో ఆమె కాస్త అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయిందని మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది. 2013లో రాజ్ తరుణ్ నటించిన ‘ఉయ్యాలా జంపాలా’ విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ ‘సినిమా చూపిస్తా మావా’, ‘కుమారి 21ఎఫ్’ చిత్రాలు వరుస విజయాలను అందుకున్నాయి. కానీ విజయాలను కొనసాగించడంలో విఫలమయ్యాడు. మార్కెట్ కూడా బాగా డౌన్ అయింది. కొన్ని సినిమాలలో రాజ్ తరుణ్ ఎందుకు చేశాడో.. అసలు ఆ సినిమాలో రాజ్ తరుణ్ ఎందుకు ఉన్నాడో కూడా తెలియదు. ఈసారి రాజ్ తరుణ్ ‘తిరగబడరా సామి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.
https://www.telugupost.com/movie-news/allu-aravind-producing-ramayanam-in-telugutamil-and-hindi-127029/
మనకి ‘రామాయణం’ గురించి తెలిసినప్పటికీ దాన్ని సినిమాగా ఇప్పటికి థియేటర్స్ కి వెళ్లే జనాలు ఉన్నారు. ‘రామాయణం’ మీద ఇప్పటికే టాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి వెండితెర పైకి ‘రామాయణం’ రానుంది. కాకపోతే ఈసారి భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ .. మధు మంతెన .. నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ పేరుతో మూడు భాగాలుగా మూడు భాషల్లో నిర్మించనున్నారు. తెలుగు తో పాటు తమిళం, హిందీ భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది. దాదాపు 1500 కోట్లు బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కనుంది. ఇందులో సీత పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్టుగా సమాచారం. సీత పాత్రలో నయన్ గతంలో ‘శ్రీరామరాజ్యం’ లో నటించింది. ఆ పాత్రకు ఆమె జీవం పోసిందనే చెప్పాలి. అందుకే మరోసారి ఈ పెద్ద ప్రాజెక్ట్ లో ఆమెను సీత గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట మేకర్స్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఒకవేళ సీత పాత్ర చేసేందుకు నయన్ ఓకే చెబితే ఆమె పంట పండినట్టే. రాముడు పాత్రలో ఎవరు నటిస్తారు అనేది పెద్ద సస్పెన్స్.
https://www.telugupost.com/movie-news/sai-dharam-tej-rashi-khanna-prati-roju-panduge-collections-143310/
ప్రతి రోజు పండగే సినిమా హిట్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ తో సాయి తేజ్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోయేలా కనబడుతుంది. మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ కళ్లగొట్టిన ప్రతిరోజూ పండగే సినిమా సోమవారం కూడా నిలకడగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. వీక్ డేస్ లో వీకవ్వకుండా ప్రతి రోజు సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. 70 నుండి 80 శాతం ప్రేక్షకులు థియేటర్స్ లో సందడి చేయడంతో.. ప్రతి రోజు కలెక్షన్స్ సోమవారంనాటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.41 కొల్లగొట్టింది. ఏరియా: షేర్ (కోట్లలో) నైజాం 4.46 సీడెడ్ 1.35 నెల్లూరు 0.38 కృష్ణ 0.74 గుంటూరు 0.76 వైజాగ్ 1.30 ఈస్ట్ గోదావరి 0.82 వెస్ట్ గోదావరి 0.60 టోటల్ ఏపీ & టీస్ షేర్: 10.41
https://www.telugupost.com/movie-news/trivikram-srinivas-aravinda-2-91106/
డైరెక్టర్ అనేవాడు సినిమాకి కెప్టెన్ అఫ్ ది షిప్ అంటారు. ఇది ఎవరు ఏమి అనుకున్నా ఒప్పుకుని తీరరాల్సిందే. అన్ని పనులు అతని క‌నుస‌న్న‌ల్లోనే జ‌ర‌గాలి ఎందుకంటే సినిమా ప్లాప్, హిట్ అతని చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. కొంతమంది డైరెక్టర్స్ తన చుట్టుపక్కల వాళ్లు చెప్పే సలహాలు తీసుకుంటారు. స్టార్ హోదాని అనుభవిస్తున్న కొంతమంది స్టార్ డైరెక్టర్స్ మాత్రం ఇందుకు వ్యతిరేకం. ఎవరు ఎన్ని సలహాలు, సూచనలు ఇచ్చినా పటించుకోరు. అందులో త్రివిక్రమ్ కూడా ఒక్కరు.వారి మాట కూడా వింటున్నాడా..?ప్రొమోషన్స్ విషయంలో కూడా త్రివిక్రమ్ ఎవరి మాట వినరు. ‘అజ్ఞాత‌వాసి’ టైంలో ఎవరి మాట వినకపోవడంతో అది డిజాస్టర్ అయిందని అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. అరవింద సమేత విషయంలో ఎన్టీఆర్‌, నిర్మాత రాధాకృష్ణ నిర్ణ‌యాలూ ప‌నిచేస్తున్నాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్, ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్, సినిమా రిలీజ్ లాంటి విషయాల్లో వారి మాటే చెల్లుబాటు అయ్యింద‌ని సమాచారం.ఇద్దరికీ నచ్చిన సీన్లు మాత్రమే...అంతేకాదు త్రివిక్రమ్ ఎన్నడూ లేని విధంగా అరవింద సమేత స్క్రిప్ట్ విషయంలో చాలామంది స‌ల‌హాలు తీసుకున్నాడ‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ నో చెప్పిన ఏ సీన్స్ ఇందులో లేవని..త్రివిక్రమ్ - ఎన్టీఆర్ లకు నచ్చే సీన్స్ మాత్రమే ఇందులో ఉన్నాయని... ఎన్టీఆర్ ఈ స్క్రిప్ట్ విషయంలో చాలానే జోక్యం చేసుకున్నాడని తెలుస్తుంది. ఇదంతా సినిమాకి ప్లస్ అవ్వాలని.. అంతే కానీ వేరే విధంగా కాదని.. చెబుతున్నారు ఎన్టీఆర్ దగ్గర ఫ్రెండ్స్. అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
https://www.telugupost.com/movie-news/filimnagar-talk-is-about-to-give-anusuya-another-good-role-134728/
బుల్లితెర మీద వెలుగుతున్న అనసూయ కి దర్శకుడు సుకుమార్ రంగస్థలం లో రంగమ్మత్త పాత్ర నిచ్చి బాగా హైలెట్ చేశాడు. ఆ రంగమ్మత్త పాత్రలో అనసూయ వెండితెర మీద సెటిల్ అయ్యింది. రంగస్థలం కన్నా ముందు క్షణం, సోగ్గాడే చిన్నినాయనా సినిమాలు చేసిన అనసూయ తర్వాత విన్నర్ లో ఐటెం సాంగ్ తో అదరగొట్టేసింది. హీరోయిన్స్ తో పోటీపడి మరీ హాట్ ఫోటో షూట్స్ చేయించుకునే అనసూయ కి చిరు – కొరటాల సినిమాలోనూ ఓ భారీ అవకాశం వచ్చింది. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతుంది. ఆమె కోసం ఫుల్ లెన్త్ క్యారెక్టర్….. తాజాగా అనసూయ కి సుకుమార్ మరో మంచి పాత్ర ఇవ్వబోతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో అనసూయకి ఓ మంచి పాత్ర ని సుకుమార్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్ దశలోనే క్యారెక్టర్స్‌కు ఆర్టిస్టులను కూడా ఎంపిక చేసుకునే సుకుమార్… అనసూయ కోసం ఓ మంచి ఫుల్ లెన్త్ క్యారెక్టర్‌ను ఫిక్స్ చేశాడని టాక్. ఇప్పటికే వెండితెర మీద అవకాశాల మీద అవకాశాలతో ఉన్న అనసూయ ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం డేట్స్ ని అడ్జెస్ట్ చేసుకునే పనిలో పడిందనే టాక్ వినబడుతుంది.
https://www.telugupost.com/movie-news/aravinda-sameta-veera-raghava-93585/
దసరా కానుకగా రిలీజ్ అయినా 'అరవింద సమేత' మొదటి రోజు టాక్ బట్టి చూస్తే ఇది నాన్ 'బాహుబలి' పై ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేస్తుందని అందరు అనుకున్నారు. అలానే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. వీకెండ్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా అనూహ్య స్థాయిలో వచ్చింది. అయితే ఆ తర్వాత ఈచిత్రం అనుకున్న స్థాయిలో పెర్ ఫామ్ చేయలేకపోయింది. ముఖ్యంగా తొలి వీకెండ్ తర్వాత కలెక్షన్స్ బాగా డల్ అయ్యాయి.తొలి వారం మాత్రం.....తొలివారం ఈచిత్రం 70 కోట్లు దాకా వసూల్ చేసింది. ఇప్పుడున్న పరిస్థితిల్లో ఈసినిమా 100 కోట్లు క్లబ్ లోకి వెళ్ళటం కష్టం అని అంటున్నారు ట్రేడ్ వారు. అసలు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం కూడా కష్టమే అని అంటున్నారు. దానికి తోడు ఈవారం అంటే నిన్న 'హలో గురు ప్రేమ కోసమే' సినిమా విడుదల అయింది. దీనిపై అందరూ అంచనాలు పెట్టుకున్నారు కానీ అనుకున్న స్థాయిలో ఈసినిమా లేదు.వాటికి నెగిటివ్ టాక్ రావడంతో.....ఏదో అలా టైంపాస్ అయిపోయే సినిమానే తప్ప.. అంత ప్రత్యేకమేమీ కాదని అభిప్రాయపడుతున్నారు. ఈసినిమాతో పాటు విశాల్ ‘పందెంకోడి-2’ రిలీజ్ అయింది. ఇది తెలుగులో డిజాస్టర్ టాక్ దక్కించుకుంది. ఇలా ఈరెండు సినిమాలకి నెగటివ్ టాక్ రావడంతో ‘అరవింద సమేత’కు కలిసొచ్చే అవకాశముంది. ఈ వీకెండ్ లో ఈచిత్రాన్ని ఆక్యుపెన్సీ రేట్ బాగానే ఉంటుందని భావిస్తున్నారు ట్రేడ్. దాంతో 100 కోట్లు వసూలు చేయకపోయినా కనీసం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశముందని చెబుతున్నారు.
https://www.telugupost.com/crime/people-beaten-girlfriend-who-came-to-meet-her-bf-1432415
ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ప్రియుడిని కలవడానికి వెళ్లిన ప్రియురాలికి గ్రామస్తులు పట్టుకుని కొట్టారు. తాలిబానీ తరహాలో కట్టేసి చిత్ర హింసలు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ప్రియుడు, ప్రియురాలు ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది. చాలా మంది మహిళలు ఆ మహిళను పట్టుకుని, తాడుతో కట్టేసి కొట్టడం ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.స్థానికులు ఆమెను కర్రలు, రాడ్‌లతో కొట్టడమే కాకుండా తిట్టడం కూడా మొదలుపెట్టారు. యువతిని కొట్టడం చూసి ఆమె ప్రియుడు అక్కడి నుండి పారిపోయాడు. ప్రస్తుతం ఆ ప్రేమికుడి కోసం గ్రామానికి చెందిన కొందరు వెతుకుతున్నట్లు సమాచారం. ప్రియురాలు మరియు ఆమె ప్రియుడు ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వివాహేతర సంబంధంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఇలా శిక్ష విధించారు. షోహ్రత్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధ్వాపూర్‌లోని పురానా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, శిక్షించాలని డిమాండ్‌ వినిపిస్తోంది.
https://www.telugupost.com/top-stories/komatireddy-rajagopal-reddy-will-resign-from-his-mla-post-on-8th-of-this-month-1432355
మునుగోడు ఉప ఎన్నిక దాదాపు ఖారరయింది. ఈ నెల 8వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఆరు నెలల్లో ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే కోమటిరెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఆయనే అభ్యర్థి కానున్నారు. ఉప ఎన్నికల్లో గెలవడం అంత సులువు కాదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రిస్క్ తీసుకున్నారా? అన్న సందేహం కూడా ఆయన సన్నిహితుల్లో వ్యక్తమవుతుంది. రాజకీయాల్లో రిస్క్ సాధారణమే కాని, ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఉన్న పదవిని అనవసరంగా వదులుకుంటారా? అన్న చర్చ జరుగుతుంది.బీజేపీకి ఇక్కడ...మునుగోడు రాజకీయ పరిస్థితులు వేరు. అక్కడ తొలి నుంచి కాంగ్రెస్, కమ్యునిస్టుల బలంగా ఉన్నాయి. బీజేపీకి ఇక్కడ చోటే లేదు. కులాల పరంగా చూసినా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఇబ్బందేనని చెప్పాలి. మునుగోడులో రెడ్డి సామాజిక వర్గం చాలా తక్కువ. మొత్తం ఓటర్లలో కేవలం 3.49 శాతం మంది మాత్రమే రెడ్డి సామాజికవర్గం ఉంది. ఇక్కడ ఎక్కువగా బీసీలు ఉన్నారు. దాదాపు నలభై శాతం మందికి పైగా బీసీలున్నారు. బీసీ సామాజికవర్గం ఏ పార్టీకి మద్దతిస్తే వారిదే గెలుపు అవుతుంది. అయితే బీసీలలో ఐక్యత ఎంత వరకూ సాధ్యమవుతుందన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి.ట్రయాంగల్ ఫైట్...ఇక మునుగోడులో ఈసారి ట్రయాంగల్ ఫైట్ తప్పదు. టీఆర్ఎస్ ఇక్కడ బలంగా ఉందనే చెప్పాలి. కాంగ్రెస్ కు స్పష్టమైన ఓటు బ్యాంకు ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో సాలిడ్ గా ఓటు బ్యాంకు అంతా బీజేపీ వైపు మళ్లుతుందని చెప్పలేం. కొంతమంది నేతలు వెళ్లొచ్చు. నేతలు వెళ్లినంత మాత్రాన ఓటర్లు గంపగుత్తగా వారి వెంట వెళతారన్నది ఖచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంతా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పైనే ఆధారపడి రంగంలోకి దిగుతున్నట్లు కనపడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రిస్క్ లో పడక తప్పదు అన్నది విశ్లేషకుల అంచనా.ఎక్కువ ఓట్లు చీలిస్తే....కాంగ్రెస్ ను కూడా తక్కువగా అంచనా వేయలేం. సరైన అభ్యర్థిని రంగంలోకి దించితే కాంగ్రెస్ గెలవలేక పోయినా మరొకరిరిన ఓడించే స్థాయిలో ఓట్లను చీల్చుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం తాను గెలవలేకపోయినా కోమటిరెడ్డిని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నట్లే కనిపిస్తుంది. అదే జరిగితే టీఆర్ఎస్ కు ఇక్కడ లాభం చేకూరుతుంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న ఓట్లు సయితం కాంగ్రెస్ దక్కించుకునే వీలుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి రిస్క్ తీసుకున్నారని, హుజూరాబాద్ లా ఇది వన్ సైడ్ లా ఉండదని, ఫలితం వెలువడే వరకూ టెన్షన్ తప్పదన్న కామెంట్లు వినపడుతున్నాయి.
https://www.telugupost.com/movie-news/చిరు-మాదిరిగానే-ప్రత్యక్-57135/
మెగా స్టార్ చిరంజీవి స్క్రీన్ ప్రెజన్స్ కి వున్న క్రేజ్ ఏంటో ఎన్ని తరాలు మారినా ప్రతి తరం వారికి పరిచయం చేస్తూనే వున్నాయి ఆయన నటిస్తున్న చిత్రాలు. గ్యాంగ్ లీడర్ వంటి మాస్ సినిమా తోనైనా, రుద్రవీణ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రమైనా, హిట్లర్ వంటి సెంటిమెంట్ సినిమా అయినా, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ వంటి కామెడీ చిత్రమైనా, ఠాగూర్ వంటి సామాజిక సందేశమున్న చిత్రాలైనా ఎలాంటి పాత్రలైనా ప్రేక్షకులకి గుర్తిండిపోయేలా అభినయం ప్రదర్శించకలిగిన నటుడు మెగా స్టార్ చిరంజీవి. ఆయన చరిష్మా ఆయన కుటుంబంలో కూడా మరెవరికి రాలేదు. అయితే వెండితెరపై ఇంత క్రెడిబిలిటీ వున్న హీరో కి సైతం శంకర్ దాదా జిందాబాద్ వంటి ఫెయిల్యూర్ రాజకీయ ప్రవేశం పై ఎఫెక్ట్ కొట్టింది.సినిమా విజయాపజయాలు రాజకీయ పరమైన ఓట్లుగా మారటం అసంభవం అయినప్పటికీ మెగా అభిమానులని ఒక సెంటిమెంట్ బాగా కలవరపెడుతుంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన చిరు ముఖ్య మంత్రి అవుతారని ఆశించిన అభిమానులకి నిరాశ మాత్రమే మిగిలింది. ఇక ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అజ్ఞ్యాతవాసి వంటి ఘోర పరాజయం అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం సెంటిమెంట్ పరంగా కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలి అనుకుంటున్న అభిమానులని భయపెడుతుంది. పైగా ఇప్పట్లో సినిమా ఆలోచనలేవీ లేవని స్పష్టం చేశారు కళ్యాణ్. మరి జనసేన సిద్ధాంతాలతో వారి కుటుంబానికి వున్న బాడ్ సెంటిమెంట్ ని ఎలా తిరగరాస్తారో 2019 ఎన్నికలు తేల్చనున్నాయి
https://www.telugupost.com/movie-news/mahanati-ashwinidutt-72282/
మార్చ్, ఏప్రిల్ లలో రెండు బడా సినిమాలు బాక్సాఫీసుని దున్నేయ్యగా మే లో వచ్చిన పెద్ద సినిమా నా పేరు సూర్యని తలదన్నేలా మీడియం బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి మూవీ మే హిట్ గా నిలిచిపోయింది. మీడియం బడ్జెట్ సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. నిర్మాత అశ్వినీదత్ ని మళ్ళీ నిర్మతగా నిలబెట్టిన ఘనత మహానటికే దక్కుతుంది. సావిత్రి జీవిత కథను మహానటిగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. కేవలం 20 నుండి 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మహానటి మూవీ ఇప్పుడు 35 కోట్ల షేర్ దాటేసింది.అశ్వినీదత్ కోలుకున్నట్లే...ఇంకో 10 కోట్ల షేర్ తేవడం ఖాయమంటున్నారు. అలాగే మహానటి సినిమా శాటిలైట్స్ హక్కులు ఇంకా తెగలేదు. ఇక శాటిలైట్స్ హక్కులు, డిజిటల్, డబ్బింగ్ హక్కులు అన్ని కలిపి మహానటి కి 60 కోట్ల షేర్ తెచ్చే దమ్ముందని ట్రేడ్ ఆర్గాల భావన. మరి పెట్టిన పెట్టుబడికి ఇలా మూడింతల ఆదాయం మహానటి తేవడం అనేది మామూలు మాటలు కాదు. మరి ఈ సినిమాతో అశ్వినీదత్ మళ్ళీకొలుకుని పెద్ద స్టార్స్ తో సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో శక్తి, కంత్రి వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి నిర్మాతగా బాగా చితికి పోయిన అశ్వినీదత్ మహానటి తో మళ్ళీ పైకి లేచాడు.అంచనాలు లేకపోవడమే కలిసొచ్చింది..మహానటి కి విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేక సరిగ్గా బిజినెస్ జరక్కపోవడం అశ్వినీదత్ కి కలిసొచ్చిన అంశమే. అందుకే మహానటి సినిమాని అనేక చోట్ల అశ్వినీదత్ వాళ్ళు ఓన్ గా విడుదల చేసుకోవాల్సి వచ్చింది. కొన్ని ఏరియాల్లో నామమాత్రపు రేటుకు సినిమాను అమ్మారు. ఇప్పుడు చూస్తే ఈ చిత్రం పెద్ద సినిమాల స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది.
https://www.telugupost.com/movie-news/ఒక్కో-చిత్రంతో-ఉనికి-కోల-54645/
ఒక దశాబ్ద కాలంగా విదేశాలలో భారతీయ చిత్రాలు అంటే తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ వంటి భాషా చిత్రాలకి గుర్తింపు దక్కుతుంది కాని అనాదిగా భారతీయ చిత్రాలు అంటే విదేశీయులకి కేవలం బాలీవుడ్ మాత్రమే పరిచయం. అందుకే దక్షిణాది నటులలో ఒక్క సూపర్ స్టార్ రజని కాంత్ కి మినహాయిస్తే మరే ఇతర ప్రముఖ కథానాయకులకు కూడా బాలీవుడ్ కథానాయకులకు వున్న అంత గుర్తింపు ఉండేది కాదు. మరీ ముఖ్యంగా ఖాన్ త్రయం కి విదేశీ మార్కెట్ లో స్వదేశీ మార్కెట్ కి ధీటుగా వసూళ్ల వర్షం కురుస్తుండేది. అయితే ఆ క్రెడిబిలిటీ ని సుస్థిరపరచుకుంటూ ఆమిర్ ఖాన్ వినూత్న ప్రయోగాలతో, సల్మాన్ ఖాన్ వాణిజ్య చిత్రాలతో దూసుకుపోతుంటే మరో వైపు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పరిస్థితి మాత్రం రెంటికి చెడ్డ రేవడిలా మారింది.హ్యాపీ న్యూ ఇయర్, డియర్ జిందగీ, దిల్ వాలే, ఫ్యాన్ వంటి వరుస పరాజయాల నుంచి రాయిస్ చిత్రం కొంత ఊరట కలిపించినప్పటికీ స్వదేశీ, విదేశీ మార్కెట్లలో షారుఖ్ ఖాన్ హిట్ చిత్రాల స్థాయికి సరితూగే వసూల్లని సాధించలేకపోయింది. రాయిస్ తరువాతి చిత్రం జబ హ్యారీ మేట సేజల్ ని విపరీతంగా ప్రమోట్ చేసినప్పటికీ కనీసం మల్టీప్లెక్స్ లలో కూడా పూర్తిగా పాజిటివ్ టాక్ కి నోచుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది ఆ చిత్రం. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లతో పాటు జాలీ ఎల్.ఎల్.బి, టాయిలెట్ ఏ ప్రేమకథ వంటి చిత్రాలతో అక్షయ్ కుమార్, గోల్మాల్ సిరీస్ తో అజయ్ దేవగన్ వంటి సీనియర్ హీరోస్ అంతా భారీ వసూళ్లతో సత్తా చాటుతుంటే బాద్షా షారుఖ్ ఖాన్ మాత్రం అభిమానులని నిరాశపరుస్తూనే వున్నాడు. ఇప్పటికైనా స్టార్ స్టేటస్ మోజులో కథలని ఎంచుకునే ప్రక్రియ మానుకుని తన సమకాలీన హీరోల పంథాలోకి వెళ్లి ప్రయత్నిస్తే షారుఖ్ విజయావకాశాలు మెరుగుపడే అవకాశాలు లేకపోలేదు.
https://www.telugupost.com/movie-news/అవి-నెత్తుటిమరకల-శాంతివచ-4303/
'ఓం శాంతిః' అనే అత్యంత సింపుల్‌ పదాన్ని పలకడం ద్వారా కూడా దాన్ని విన్న వారి దృష్టిలో వెటకారపు భావనను కలిగించగల వెరైటీ తెలివితేటలు ఎవరికి ఉంటాయి. నిస్సందేహంగా అలాంటి తెలివితేటలు రాంగోపాల్‌ వర్మకు మాత్రమే ఉంటాయి. తెలుగు పరిశ్రమ గర్వంగా చెప్పుకోగలిగిన స్థాయి దర్శకుడు అయిన రాంగోపాల్‌ వర్మ.. 'సినిమా' అనే ఫార్మాట్‌ మీద తన ప్యాషన్‌ ను కోల్పోయిన తర్వాత.. చిల్లర సినిమాలు తీసే క్రమంలో మరో సినిమా వంగవీటి అనే పేరుతో ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది.విజయవాడ రాజకీయాలు, రౌడీయిజం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రాంగోపాల్‌ వర్మ చేస్తున్నారు. వంగవీటి రంగా జీవితం, హత్య నేపథ్యంలోనే చిత్రం తయారవుతున్న మాట వాస్తవం. అయితే కేవలం రౌడీయిజం, రక్తపాతపు క్రేజ్‌ మాత్రమే కాకుండా, రామూ.. ఈ చిత్రానికి 'కాపు కాసే శక్తి' అనే ట్యాగ్‌లైన్‌ తగిలించడం ద్వారా.. కులంరంగు కూడా పులిమి క్యాష్‌ చేసుకునే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం కులంగొడవ హాట్‌గా నడుస్తూ ఉన్న నేపథ్యంలో.. కాపు ఉద్యమానికి ఉన్న ఆకర్షణ సినిమాకు ప్లస్‌ అవుతుందని ఆయన భావిస్తున్నారేమో తెలియదు.అయితే వర్మ స్టయిల్‌ ట్విస్టు ఏంటంటే.. శాంతి, అహింస లకు ప్రతీక అయిన మహాత్మాగాంధీ జయంతి రోజున.. ఆయన వంగవీటి సినిమా పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. ట్విటర్‌ లో ఎంచక్కా.. వంగవీటి టీజర్‌ను విడుదల చేసి.. ఓం శాంతిః అంటూ వర్మ ముగించారు. అయినా.. ఆ స్టయిల్‌లో రక్తపు మరకలు పూసిన శాంతి వచనాలను పలకడం ఆయనకు మాత్రమే సాధ్యం అని జనం జోకులేసుకుంటే తప్పేముంది.
https://www.telugupost.com/movie-news/చిరు-ఫస్ట్-పవన్-సెకండ్-మహ-51168/
ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా వస్తుంది అంటే ఆ సినిమాలోని పాటలను డైరెక్ట్ గా మర్కెట్ లోకి వదలడమో... లేకుంటే.. ఆడియో వేడుకని కానిచ్చేసి యూట్యూబ్ లో వదిలేయ్యడమో జరుగుతుంది. కానీ తాజాగా బాహుబలి సినిమా ఆడియో స్థాయి అని చెప్పలేం గాని పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో ఆవస్తున్న అజ్ఞాతవాసి సినిమా పూర్తయ్యి ఆడియో వేడుక దగ్గరపడే సమయానికి మళ్ళీ కొన్ని ప్రముఖ సంస్థలు అజ్ఞాతవాసి ఆడియో రైట్స్ కోసం పోటీపడడం అది కాస్తా రికార్డు స్థాయిలో 2 కోట్లదాకా పలకడం.. అది చూసి సై రా సినిమా మొదలు కాకముందే ఆదిత్య మ్యూజిక్, లహరి మ్యూజిక్ లు నువ్వా నేనా అని పోటీ పడడం ... అందులో లహరి మ్యూజిక్ వెళ్లి చిరంజీవి సై రా నరసింహారెడ్డి ఆడియో హక్కులను దాదాపు 2.9 కోట్లకు దక్కించుకున్నారనడం.. చూస్తుంటే మళ్ళీ ఆడియో హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడలాగే కనబడుతుంది.కేవలం అజ్ఞాతవాసి, సై రా నరసింహారెడ్డి మాత్రమే కాకూండా ఇప్పుడు మహేష్ - కొరటాల శివ కలయికలో వస్తున్న భరత్ అనే నేను సినిమా ఆడియో హక్కులు కూడా మంచి ధర పలికిందనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇక భారత్ అనే నేను సినిమా ఆడియో హక్కులను కూడా ప్రముఖ మ్యూజిక్ సంస్థ లహరి వారే చేజిక్కించుకున్నారని చెబుతున్నారు. అలాగే భరత్ అనే నేను సినిమా ఆడియో హక్కులు 1.9 కోట్లకు అమ్ముడు పోయాయంటున్నారు. మరి అజ్ఞాతవాసి కన్నా ఒక లక్ష తక్కువే అయినప్పటికీ ఆడియో హక్కులకు మంచి ధర రావడం అనేది సామాన్యమైన విషయం కాదు.మరి ఇప్పటికే కొరటాల - మహేష్ - దేవిశ్రీ ప్రసాద్ లు శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్ ను ఇచ్చి ఉండడంతో ఇప్పుడు మరోసారి అదే హిట్ కాంబినేషన్ రిపీట్ అవడంతో భరత్ అనే నేను సినిమా ఆడియో కి కూడా ఈ రేంజ్ లో ఆఫర్ తగిలిందంటున్నారు. ఏదిఏమైనా ఈమధ్య కాలంలో ఆడియో హక్కుల పరంగా చిరు సై రా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే.. పవన్ అజ్ఞాతవాసి సెకండ్ ప్లేస్ లో ఉండగా.. ఇప్పుడు మహేష్ భరత్ అనే నేను మూడో స్థానాన్ని ఆక్రమించింది.
https://www.telugupost.com/movie-news/shraddha-srinath-jersey-movie-119735/
గత శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన గౌతమ్ తిన్నసూరి – నాని జెర్సీ సినిమా అనుకోని బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఆ రేంజ్ హిట్ ని నాని, దర్శకుడు తిన్నసూరి కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. మొదటి షోకే జెర్సీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో నానికి ఎంతగా పేరొచ్చిందో… డైరెక్టర్ గౌతమ్ కి అంతే పేరొచ్చింది. ఇక హీరోయిన్ గా నటించిన శ్రద్ధ శ్రీనాధ్ పేరు కూడా నిన్నమొన్నటి వరకు మీడియాలో మార్మోగడమే కాదు.. అనేకమంది హీరోల కొత్త ప్రోజెక్టులలో శ్రద్ద ని హీరోయిన్ గా పరిశీలిస్తున్నారనే టాక్ నడుస్తుంది. అయితే జెర్సీ సినిమాతో శ్రద్ధ శ్రీనాధ్ సుడి ఆలా తిరగడానికి కారణం.. ముందుగా ఈ సినిమాలో శ్రద్ధ పేరుని దర్శకుడు, హీరో నాని పరిశీలించలేదట. వేరే హిరోయిన్స్ బయటపడ్డాక… జెర్సీ సినిమా కోసం గౌతమ్ తిన్నసూరి మరో హీరోయిన్ ని అనుకున్నాడట. అంతేకాకుండా కాస్త పేరున్న హీరోయిన్స్ అయితే సినిమాకి క్రేజొస్తుందని.. అందుకే ఆ టాప్ హీరోయిన్ ని జెర్సీ కోసం సంప్రదించగా.. వారు జెర్సీలో సారా పాత్ర చెయ్యడానికి భయపడ్డారట. మరి ఒకే ఎమోషన్, ఎక్స్ ప్రెషన్ ని మెయింటైన్ చేస్తుండాలి, అలాగే కాస్త ట్రెడిషనల్ గా నటించాలని వెనకడుగు వేశారో లేదా సినిమా మీద నమ్మకం లేకనో కానీ ఆ హీరోయిన్స్ నో చెప్పారట. అయితే ఆ హీరోయిన్స్ కాదని చెప్పాకే.. దర్శకుడు గౌతమ్ శ్రద్ధ శ్రీనాధ్ ని సంప్రదించాడట. మరి సారా పాత్ర చెయ్యడానికి శ్రద్ధ శ్రీనాధ్ ధైర్యంగా ఒప్పుకుని నటించింది. ఆ ధైర్యానికి తగిన ఫలితం దక్కింది. జెర్సీ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో నానితో పాటు సారా పాత్ర చేసిన శ్రద్ధకి అంతే పేరొచ్చింది. తాజాగా శ్రద్ధ శ్రీనాద్ మరో తెలుగు మూవీని ఓకె చేసిందనే టాక్ ఉంది.
https://www.telugupost.com/movie-news/నారి-నారి-నడుమ-మురారి-199/
తాను చేసిన కొద్ది చిత్రాలతోనే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకొని తనకంటూ ఓ స్టైల్‌ను క్రియేట్‌ చేసుకున్న మెగాహీరో వరుణ్‌తేజ్‌. కాగా ఆయన త్వరలో శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఇద్దరు హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేయని వరుణ్‌ తన తాజా చిత్రంలో ఇద్దరు భామలతో కలిసి నటిస్తున్నాడు. ఈ ఇద్దరు లావణ్యత్రిపాఠి, రెజీనా. మరి ఈ చిత్రంలో రొమాన్స్‌పరంగా వరుణ్‌తేజ్‌ ఎలాంటి ఫీడ్‌ బ్యాక్‌ అందుకుంటాడో చూడాలి...! ఏప్రిల్‌ నుండి అఫీషియల్‌గా లాంఛ్‌ కానున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి 'ఫీల్‌ మై లవ్‌' అనే టైటిల్‌ను అనుకొంటున్నారు. చాలాకాలం తర్వాత శ్రీనువైట్ల చేస్తున్న అచ్చమైన ప్రేమకథా చిత్రం ఇదేనని సమాచారం. కాగా ఈ చిత్రానికి మిక్కీజెమేయర్‌ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటివరకు కమర్షియల్‌గా సక్సెస్‌లేని వరుణ్‌తేజ్‌కు, 'ఆగడు, బ్రూస్‌లీ' వంటి డిజాస్టర్స్‌ తర్వాత చేస్తున్న శ్రీనువైట్లకు ఇరువురికి కీలకంగా మారనుంది.
https://www.telugupost.com/politics/in-the-south-the-bharatiya-janata-party-is-facing-a-difficult-situation-bjp-ready-for-alliance-with-tdp-in-ap-1497558
దక్షిణాదిన భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కర్ణాటకలో వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్నా ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. దక్షిణాదిన మరో కీలక రాష్ట్రమైన తమిళనాడులో అన్నాడీఎంకే కమలం కౌగిలి నుంచి బయటకు వచ్చేసింది. తాము పొత్తు నుంచి తప్పుకుంటున్నట్లు పళనిస్వామి ప్రకటించారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలో జనసేన, కర్ణాటకలో జేడీఎస్ రెండే బీజీపీకి మిత్రపక్షాలుగా ఉన్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిన సీట్ల సంఖ్య మరింత పెంచుకోవాలంటే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు దిగక తప్పని పరిస్థిితి భారతీయ జనతా పార్టీది.అదే కలసి వచ్చేదిగా...అదే ఇప్పుడు ఏపీలో చంద్రబాబుకు కలసి వచ్చేదిగా కనిపిస్తుంది. తెలంగాణలో ముందు ఎన్నికలు జరుగుతున్నా అక్కడ పొత్తు ప్రస్తావన లేకుండానే ఒంటరిగానే బరిలోకి దిగాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తుంది. గెలిచిన తర్వాత మద్దతు కోసం చూసుకోవచ్చులే అన్న ఆలోచన కావచ్చు. కేసీఆర్‌కు కాంగ్రెస్ బద్ధశత్రువు కాబట్టి ఆ పార్టీకి మద్దతు ప్రకటించరన్న విశ్వాసమూ అవ్వొచ్చు. అందుకే ఇక్కడ ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది. గత ఎన్నికలంటే నాలుగైదు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటే చాలని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా పరవాలేదన్న ధోరణిలో ఆ పార్టీ నేతలు కనిపిస్తున్నారు. పైకి మోదీ నుంచి నేతలందరూ బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నా లోపల మాత్రం ఇద్దరికీ మంచి రిలేషన్ ఉందన్న విషయాన్ని విమర్శకులు సయితం అంగీకరిస్తున్నారు.ఏదో ఒక పార్టీతో...ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే అది కాదు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఏపీలో అస్సలు ఓటు బ్యాంకు లేదు. జగన్ తో నేరుగా పొత్తు సాధ్యపడదు. కలసి పోటీ చేయాలంటే అది టీడీపీతోనే సాధ్యం. తమకంటూ కొన్ని స్థానాలు వస్తాయి. పార్లమెంటు ఎన్నికల్లోనూ గెలిచే అవకాశాలుంటాయి. అంతేకాకుండా దక్షిణాదిన పళనిస్వామి హ్యాండ్ ఇవ్వడంతో చంద్రబాబుతో చేయికలపడమే బెటర్ అన్న అభిప్రాయంలో కేంద్ర నాయాకత్వం ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ విషయంలో ఆయన బయటకు వచ్చిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశముందన్నది హస్తిన వర్గాల ద్వారా తెలుస్తోంది.రాష్ట్ర నేతలు కూడా...బీజేపీకి కూడా అంతకంటే వేరే ఆప్షన్ లేదు. తమ వెంట బలమైన మిత్రులున్నారని చెప్పుకోవడం కోసమైనా సైకిల్ ఎక్కక తప్పదన్నది అంచనాలు వినపడుతున్నాయి. అంతేకాదు... సోము వీర్రాజును మార్చి పురంద్రీశ్వరిని పార్టీ అధ్యక్షురాలిగా నియమించడం కూడా ఇందులో భాగమేనంటున్నారు. ఎక్కువ మంది రాష్ట్ర బీజేపీ నేతలు కూడా టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉండటంతో త్వరలోనే హస్తిన నుంచి పొత్తు ప్రకటన విడుదలయ్యే అవకాశముంది. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా త్వరలోనే ఢిల్లీ వెళ్లి పరిస్థితిని వివరిస్తే కమలనాధుల నుంచి సానుకూల స్పందన వస్తుందని చెబుతున్నారు. అయితే దీనికి కొంత సమయం పట్టవచ్చు. కానీ వచ్చే ఎన్నికలలో బీజేపీ, జనసేన, టీడీపీ కలసి పోటీ చేయడం ఖాయమన్న విశ్లేషణలు మాత్రం నిజం కాబోతున్నాయి.
https://www.telugupost.com/movie-news/అభిమానులు-పండగ-చేసుకోండయ-51628/
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.. స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో తమ అభిమాన హీరోను చూడాలని అనుకున్న అభిమానులకు ‘సై-రా నరసింహ రెడ్డి’ అంటూ మెగాస్టార్ చిరంజీవి అలరించబోతున్నాడు. ఈ సంవత్సరం ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో వెండితెరకు రీ-ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని ‘సై-రా నరసింహ రెడ్డి’గా చేస్తున్న సంగతి తెలిసిందే… స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి’ జీవిత కథపై ఈ చిత్రం తెరకెక్కనుంది.చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమై, టాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక ఖర్చుతో రూపొందుతున్న చిత్రం. మెగాస్టార్ సహా నటీనటులు అందరికీ టెస్ట్ షూట్ లు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి.. ఇవాళ ఉదయం తొలి షాట్ పిక్చరైజేషన్ చేసేశారు. ఉదయం 7.30 గంటలకు చిరంజీవి.. కేరక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీలపై తొలి షాట్ చిత్రీకరణ చేపట్టారు. హైద్రాబాద్ పరిసరాల్లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన భారీ సెట్ లో ఈ షాట్ చిత్రీకరణ జరిగింది. తొలి షెడ్యూల్ మొత్తం ఇక్కడే షూట్ జరగనుండగా.. చిత్రంలో పలువురు నటీనటులతో పాటు.. ఇంగ్లీష్ యాక్టర్స్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనున్నారు.ఇప్పటికే ఈ చిత్రం ప్రీ- ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. సెట్లు నిర్మాణం , మాటలు తదితర విభాగాలు పనిచేస్తున్నాయి.. ఈరోజు ఉదయం ఈ చిత్రం చిత్రీకరణ మొదలుకానుండడంతో చిరు అభిమానులకు ఇది శుభవార్తే.. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ , కిచ్చ సుదీప్ , విజయ్ సేతుపతి , నయనతార , జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
https://www.telugupost.com/top-stories/chandrababu-was-the-chief-minister-for-five-years-he-created-a-record-as-the-first-cm-after-the-formation-of-new-state-1431303
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయిన తొలి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. అయితే రెండో దఫా జరిగిన ఎన్నికల్లోనే ఆయన ఓటమి పాలయ్యారు. ఒంటరిగా బరిలోకి దిగి ఆయన చేయి కాల్చుకున్నారు. దారుణ ఓటమిని చవి చూశారు. ఈసారి ఆయన గెలుపు కోసం అన్ని రకాలుగా కసరత్తులు మొదలు పెట్టారు. మరో వైపు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యం ఆయనకు ఉన్నా అది సాధ్యపడటం కష్టమే. అక్కడ పార్టీ పూర్తిగా పడకేసింది.అసెంబ్లీలో ప్రాతినిధ్యం...కానీ ఖమ్మం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు కనీసం అసెంబ్లీలో పార్టీకి ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నట్లుంది. పార్టీకి తెలంగాణలో కొంత గుర్తింపు ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని స్థానాల్లోనైనా గెలవాల్సిన అవసరం ఉంది. అందుకు ఆయన ఖమ్మం జిల్లాను ఎంచుకున్నట్లు కనపడుతుంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆనుకుని ఉండే ఖమ్మం జిల్లాలో అయితేనే కొన్ని సీట్లయినా సాధించవచ్చన్న నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు. ఎక్కువగా అక్కడ ఏపీ నుంచి వలస వెళ్లి సెటిల్ అయిన వారు ఎక్కువ మంది ఉండటం కూడా కలిసి వచ్చే అంశమే.గత ఎన్నికలలోనూ...2018 ఎన్నికల్లోనూ ఖమ్మం జిల్లా నుంచి రెండు స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఆ తర్వాత వారిద్దరూ టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారనుకోండి అది వేరే విషయం. అయినా చంద్రబాబుకు ఆశంతా ఖమ్మం జిల్లాపైనే పెట్టుకున్నారు. ఇక్కడ అయితేనే ఒకటి, రెండు స్థానాల్లో విజయం సాధించవచ్చని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. ఆయన భద్రాచలం పర్యటనకు కూడా కొంత స్పందన రావడంతో చంద్రబాబు డిసైడ్ అయినట్లే కనిపిస్తుంది. అయితే ఖమ్మం జిల్లా సభ వరకే ఆయన పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతకు మించి ఆయన తెలంగాణలో పార్టీకి పెద్ద సమయం కేటాయించే అవకాశం ఉండకపోవచ్చు. పొత్తుల కోసమేనా?సెప్టంబరు నెలలో ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అది సక్సెస్ చేసుకుంటే కొన్ని పార్టీలైనా తమ పార్టీతో పొత్తులకు ముందుకు వచ్చే అవకాశముంది. కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. బీజేపీ తోనే ఆయన కలసి తెలంగాణలో వెళ్లాలని భావిస్తున్నారు. తెలంగాణలో మొదలు పెడితే ఏపీలో కూడా కంటిన్యూ అవుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఖమ్మం సభకు కేవలం తెలంగాణ నుంచి కాకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా జనసమీకరణ చేసి సభను గ్రాండ్ సక్సెస్ చేయించే ఆలోచనలో ఆయన ఉన్నారు. అప్పుడే తెలంగాణలో పార్టీకి ఒక విలువ, గౌరవం లభిస్తుందని భావిస్తున్నారు. మొత్తం మీద ఖమ్మం జిల్లాలో ఆయన అంచనా ఏమేరకు సఫలం అవుతుందో చూడాలి.
https://www.telugupost.com/crime/there-was-an-incident-where-the-young-woman-was-hit-by-a-car-for-not-loving-her-1431658
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదని యువతిని కారు తో ఢీకొట్టిన సంఘటన జరిగింది. కంబదూరు మండలం బోయలపల్లిలో ఈ ఘటనల చోటు చేసుకుంది. నిందితుడు భాస్కర్ గా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే చికిత్స పొందుతున్న యువతి అసలు విషయం చెప్పడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.కారుతో ఢీకొట్టి...అయితే భాస్కర్ తనకు అన్న వరస కావడంతో ప్రేమకు నిరాకరించింది. అయితే అందుకు ఒప్పుకోని భాస్కర్ కారుతో యువతి వెళుతున్న స్కూటీతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితుడు భాస్కర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/srinu-vaitla-raviteja-72859/
ఒక్కప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఒక్కడిగా ఉండేవాడు శ్రీను వైట్ల. అతనితో సినిమా చేయడానికి చాలా మంది పెద్ద స్టార్స్ తహతహలాడేవాళ్లు. కానీ గత కొన్నేళ్ల నుండి వరసబెట్టి ఒకే ఫార్ములా సినిమాలు తీయడంతో తన కెరీర్‌ను పాడు చేసుకున్నాడు వైట్ల. కేవలం మూడే మూడు సినిమాలు అతని కెరీర్‌ను నాశనం చేసాయి.ఉన్న కష్టాలు చాలవన్నట్లు...'మిస్టర్' సినిమా తర్వాత అతనితో ఏ హీరో చేయడానికి ముందుకు రాలేదు. లాస్ట్ కి అతని స్నేహితుడు రవితేజ కరుణించి సినిమా ఇప్పించాడు. అది కూడా మైత్రి మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ లో. దీంతో ఎలాగైనా ఈసారి కచ్చితంగా హిట్ కొట్టి తను ఏంటో నిరూపించుకోవాలని ట్రై చేస్తుంటే వైట్లకు ఉన్న కష్టాలు చాలవని, ఈ సినిమా మొదలయ్యే ముందు వరకు పర్వాలేదనిపించే స్థితిలో ఉన్న రవితేజ సైతం ఇప్పుడు దారుణమైన ట్రాక్ రికార్డుతో తయారయ్యాడు.ఈసారైనా మారేనా..?రవితేజ గత రెండు చిత్రాలు 'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్టు' సినిమాలు జనాలలో నెగటివ్ మార్క్ పడిపోయింది. రవితేజ ఇప్పుడు చేసే శ్రీను వైట్ల సినిమా కూడా ఇలానే రొటీన్ గా ఉంటె ఇంకా అతని సినిమాలు చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. సో ‘అమర్ ఆంటోనీ అక్బర్’ సినిమాతో ఏమన్నా కొత్తగా చూపిస్తే తప్ప ఆ మార్క్ తొలిగే అవకాశం లేదు. కానీ శ్రీను వైట్ల మీద నమ్మకం లేదు. 'ఆగడు', 'బ్రూస్ లీ' లాంటి పెద్ద డిజాస్టర్లు ఎదురైనప్పటికీ మళ్లీ ‘మిస్టర్’ లాంటి రొటీన్ సినిమానే చేశాడు. చూద్దాం ఏమన్నా మిరాకిల్ జరిగి సినిమా హిట్ అవచ్చేమో?
https://www.telugupost.com/movie-news/అజ్ఞాత‌వాసి-లో-ఇద్ద‌రు-ఊ-54672/
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న అజ్ఞాత‌వాసి సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న రిలీజ్‌కు రెడీ అవుతోంది. సోమ‌వారం న్యూ ఇయ‌ర్ రోజు సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి యూ / ఏ స‌ర్టిఫికేట్ సొంతం చేసుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌న‌వ‌రి 9వ తేదీ రాత్రి నుంచే అజ్ఞాత‌వాసి ప్రీమియ‌ర్లు స్టార్ట్ కానున్నాయి.సెన్సార్ బోర్డు నుంచి సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో ఇక ప‌వ‌న్ ఫ్యాన్స్ సంబ‌రాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. మ‌రో రెండు మూడు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా స్టార్ట్ కానున్నాయి. ఇప్ప‌టికే ప‌వ‌న్ పాడిన కొడ‌కా కోటేశ్వ‌ర‌రావా పాట అయితే యూ ట్యూబ్‌లో దుమ్ము లేపుతోంది. చాలా త‌క్కువ టైంలోనే రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.ఇక ఈ సినిమాలో ఇప్ప‌టికే సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ గెస్ట్ రోల్ చేస్తుండ‌గా మ‌రో సెల‌బ్రిటీ సైతం ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ సెల‌బ్రిటీ ఎవ‌రో కాదు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన అనిరుధ్‌. అనిరుధ్ గ‌తంలో కూడా తాను మ్యూజిక్ ఇచ్చిన కొన్ని త‌మిళ సినిమాల్లో తెర‌పై త‌ళుక్కుమ‌న్నాడు. ఇప్పుడు తాను తెలుగులో మ్యూజిక్ ఇచ్చిన తొలి సినిమాలోనే గెస్ట్ రోల్ చేస్తూ తెర‌పై త‌ళుక్కుమ‌న్నాడు. ఇక ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఈ నెల 5న రిలీజ్ చేయ‌నున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చిన‌బాబు నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేష్‌, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించ‌నున్నారు.
https://www.telugupost.com/movie-news/janvi-kapoor-comments-on-vijay-devarakonda-143464/
బాలీవుడ్ భామలంతా రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టయిల్ ని పొగిడే పనిలో ఉన్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవడ్ భామల మనసులను అలా అలా దోచేశాడు. అలియా భట్, జాన్వీ కపూర్, కియారా అద్వానీల కలల రౌడీగా విజయ్ స్టయిల్ బాలీవుడ్ కి పాకేసింది. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో మొదటిసారిగా తనకి విజయ్ దేవరకొండ ఆంటే ఇష్టమని చెప్పిన జాన్వీ కపూర్.. ప్రస్తుతం రౌడీ పక్కన ఫైటర్ లో ఆఫర్ అందుకుందనే న్యూస్ ఉంది. అయితే జాన్వీ – విజయ్ దేవరకొండ కాంబో అని ఎక్కడా అధికారిక ప్రకటన రాకపోయినా.. విజయ్ సరసన జాన్వీ కపూర్ అంటూ అందరూ ఫిక్స్ అయినా టైం లో మరోసారి విజయ్ దేవరకొండ తనకున్న క్రష్ ని బయటపెట్టింది. మరోసారి చెప్పి…. తాజాగా నేహా దుపియా షోలో జాన్వీ కపూర్ విజయ్ మీదున్న ఇష్టం మరోసారి బయటపెట్టింది. అయితే తన ఇష్టం వన్ సైడ్ మాత్రమే అని.. నేను విజయ్ దేవరకొండ ఇష్టమని చెప్పినా… విజయ్ నుండి నో రియాక్షన్ అంటూ తెగ బాధపడుతుంది. నేనే విజయ్ అంటే ఇష్టమని ఎక్కువ ఫీలైపోయి మాట్లేడుస్తున్నా కానీ విజయ్ నుండి రియాక్షన్ లేదని చెబుతున్న జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ చాలా ఇష్టమని, ఆయన అంటే ఆరాధన అని, కానీ కేవలం ఆయన్ని చూస్తే ముచ్చటేస్తుంది అంటూ విజయ్ దేవరకొండపై ఇష్టాన్ని జాన్వీ కపూర్ మరోసారి బయట పెట్టి… విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్ లో మరింత పెంచేసింది ఈ చిన్నది.
https://www.telugupost.com/crime/17-killed-as-under-construction-railway-bridge-collapses-in-mizoram-1491086
మిజోరంలో బుధ‌వారం నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 17 మంది మరణించారు. శిథిలాల్లో చాలా మంది చిక్కుకున్నారని.. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వంతెన కూలిపోయిన సమయంలో దాదాపు 35 నుంచి 40 మంది నిర్మాణ కార్మికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఐజ్వాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలోని సాయిరాంగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ.. ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి ₹ 2 లక్షలు, గాయపడిన వారికి ₹ 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా తెలిపారు. "ఐజ్వాల్ సమీపంలోని సాయిరాంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ఈరోజు కూలిపోయింది. 17 మంది కార్మికులు మరణించారు: రెస్క్యూ ఆప‌రేష‌న్ జ‌రుగుతుంది. మరణించిన కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రెస్క్యూ ఆపరేషన్‌లలో సహాయం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు.
https://www.telugupost.com/movie-news/gaddala-konda-ganesh-4-days-collections-134652/
వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ నాలుగు రోజల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఏరియా షేర్ (కోట్లలో) నైజాం 5.23 సీడెడ్ 2.35 నెల్లూరు 0.62 కృష్ణ 1.16 గుంటూరు 1.35 వైజాగ్ 1.85 ఈస్ట్ గోదావరి 1.15 వెస్ట్ గోదావరి 1.06 టోటల్ ఏపీ & టీస్ షేర్ 14.77
https://www.telugupost.com/movie-news/biopics-in-tollywood-93002/
బయోపిక్స్ ట్రెండ్ అనేది బాలీవుడ్ వాళ్లే కనిపెట్టారని చెప్పుకుంటున్నారు. కానీ అసలు బయోపిక్ ను మొదట కనిపెట్టింది మాత్రం మణిరత్నం. ఇతని డైరెక్షన్ లో 'ఇద్దరు' అనే సినిమా వచ్చింది. ఇందులో ఎంజీఆర్, కరుణానిధిల జీవితాల్ని చూపించాడు మణి. ఆ తర్వాత ఇటువంటి జోనర్ లో సినిమా ఒక్కటి కూడా రాలేదు. చాలాకాలం తర్వాత మణిరత్నం మళ్లీ 'గురు' అనే సినిమాతో ముందుకు వచ్చాడు. బిజినెస్ టైకూన్ ధీరుబాయి అంబానీ ప్రయాణమే 'గురు' సినిమా. ఇలా ఈ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్ లో వరసపెట్టి సినిమాలు రావడం స్టార్ట్ అయింది.మహానటి సక్సెస్ తో...మణిరత్నం తీసిన 'ఇద్దరు', 'గురు' సినిమాలు తెలుగులో విడుదల అయినప్పటికీ సరైన రుచిని చూపించింది మాత్రం నాగ్ అశ్విన్ కి దక్కుతుంది. అతని దర్శకత్వంలో 'మహానటి' సావిత్రి జీవితకథ వచ్చింది. ఈ సినిమాలో మహానటి జీవితాన్ని ఒక అద్భుతమైన దృశ్యంగా మలచాడు. ఇది సూపర్ హిట్ అవ్వడంతో బయోపిక్స్ తీయొచ్చు అనే నమ్మకం ఏర్పడింది మన డైరెక్టర్స్ కి. దాంతో వరసగా బయోపిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్, లక్ష్మి పార్వతి బయోపిక్, చంద్రబాబు బయోపిక్, ఘంటశాల, కత్తి కాంతారావు, శోబన్ బాబు, కే విశ్వనాద్, పుల్లెల గోపీచంద్ బయోపిక్స్ మన ముందుకు రానున్నాయి.ప్రకటించినవి తీస్తారా..?అయితే ఇందులో ఎన్టీఆర్, వైఎస్ బయోపిక్స్ తప్ప మిగతావన్నీ ప్రకటనలే అని అర్ధం అవుతున్నాయి. ఒకవేళ వచ్చినా అవి సక్సెస్ అవుతాయో లేదో చూడాలి. సక్సెస్ అవ్వకపోతే మాత్రం మిగతావాటికి ఆదరణ దగ్గిపోయే ఛాన్స్ వుంది. ఒకవేళ బయోపిక్స్ హిట్ అయితే మాత్రం జాతీయ స్థాయిలో పేరు వస్తుంది. ఉదాహరణకు దంగల్, ధోని, బాగ్ మీల్కా, డర్టీ పిక్చర్ సినిమాలు. మరి ఎంతవరకు మన బయోపిక్స్ సక్సెస్ అవుతాయో చూడాలి.
https://www.telugupost.com/movie-news/రాజు-గారు-అలా-చెప్పలేదంట-37981/
టాలీవుడ్ లో కొత్త డైరెక్టర్స్ ని పరిచయం చెయ్యాలన్నా, సినిమా కథని నమ్మి సినిమాని నిర్మించాలన్నా, ఎంతో కాలిక్యులేటెడ్ గా సినిమా చెయ్యాలన్నా అది ఒక్క దిల్ రాజుకే చెల్లింది. ఆయన నిర్మాణంలో వచ్చే సినిమాపై ఎంతో నమ్మకంతోనే సినిమాకు పెట్టుబడి పెడుతూ.... ఆ సినిమా విడుదలకు ముందే లాభాలు జేబులో వేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు. అసలు దిల్ రాజు నిర్మాతగా ఏదన్నా సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై భారీ అంచనాలే ఉంటాయి. అది డైరెక్ట్ తెలుగు సినిమా అయ్యుండొచ్చు లేకుంటే ఏదన్న డబ్బింగ్ సినిమానైనా అయ్యుండొచ్చు. ఆయన నిర్మాణంలో సినిమా అంటే ప్రేక్షకులకు అంత నమ్మకం. అలాంటి దిల్ రాజు సునీల్ హీరోగా వచ్చిన కృష్ణాష్టమి విషయంలో బాగా ఇబ్బంది పడ్డాడు.అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా తన నిర్మాణంలో వచ్చిన డీజే విషయంలోనూ మాటలు పడుతున్నాడు. డీజే కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ అంటూ మెగా ఫాన్స్ రచ్చ రచ్చ చేశారు. అయితే ఇపుడు దిల్ రాజు ఫిదా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డీజే కలెక్షన్స్ మీద స్పందించాడు. తన నిర్మాణంలో వచ్చిన ఏ సినిమా విజయం సాధించినా ఖచ్చితంగా వారం రోజుల్లోనే సక్సెస్ మీట్ నిర్వహిస్తాను. నేను కేవలం నిర్మాతగా మాత్రమే ఆలోచించను... నేను డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుండి కూడా ఆలోచిస్తా. ఎందుకంటే నేను ఒక డిస్ట్రిబ్యూటర్ నే గనక. కొన్ని ఏరియాలు నేను డిస్ట్రుబ్యూట్ చేస్తా. అలాగే ఒక సినిమా గురించి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చానంటే అది ఫేక్ స్టేట్మెంట్ అవదు. అలాంటి ఫేక్ స్టేట్మెంట్స్ నేను ఇవ్వను. సినిమా గనక సక్సెస్ అవ్వకపోతే మీడియా ముందుకు వచ్చి ఆ సినిమా సక్సెస్ అయ్యిందని ఎలా చెబుతాను. కొన్ని సినిమాలు హిట్ అంటే అది మార్నింగ్ షో కె తెలుస్తుంది. కొన్ని సినిమాలు హిట్ అవడానికి నాలుగైదు రోజులు పడుతుంది. అలాగే అల్లు అర్జున్ సరైనోడు చిత్రం అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. మరి సరైనోడు కలెక్షన్స్ ని డీజే దాటేసింది అంటే డీజే కూడా హిట్టే కదా.. డీజే కలెక్షన్స్ విషయంలో మీడియాకి తప్పుడు ఫిగర్స్ ఇచ్చామంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత అన్ని ఏరియాల నుండి గ్రాస్.. షేర్ తెప్పించుకుని అన్ని సరిచూసుకుని అందరికి పంపించాం.కలెక్ట్ చేసిన కలెక్షన్స్ కి ఇంకా కొంత యాడ్ చేసి చూపించాల్సిన అవసరం ఏముంటుంది. అసలు అలాంటివి ఇప్పటివరకు నేను చెయ్యలేదు. ఇక ముందు కూడా చెయ్యను. అలా గనక చేస్తే మిమ్మల్ని మోసం చెయ్యడం కాదు... మమ్మల్ని మేమె మోసం చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పాడు. అలాగే రాబోయే పెద్ద మూవీస్ మహేష్ స్పైడర్, ఎన్టీఆర్ జై లవ కుశ, పవన్ న్యూ మూవీ లను మేమె విడుదల చేయబోతున్నాం. ఒక్క హీరోకి ఫేక్ ఫిగర్ చెబితే అది రాబోయే పెద్ద హీరోలమీద ప్రభావం తప్పక ఉంటుంది అంటూ పేద క్లాస్ ఇచ్చాడు. ఇంతకీ ఈ క్లాస్ మీనింగ్ డీజే హిట్ అనేది దిల్ రాజు ప్రత్యక్షంగా చెప్పినట్టే అంటున్నారు.
https://www.telugupost.com/movie-news/యూత్-ఐక‌న్‌-రామ్‌చ‌ర‌ణ్-13844/
రామ్‌చ‌ర‌ణ్‌కి ప్ర‌తిష్ఠాత్మక‌ పుర‌స్కారం లభించింది. హీరోగా మాత్రమే కాకుండా, వ్యాపారవేత్తగా, నిర్మాతగా, సోషల్ రెస్పాన్సిబిలిటీతో స్పందించే వ్యక్తిగా బహుముఖ పాత్రల్లో జీవిస్తున్న మెగా తనయుడు చెర్రీ.. యూత్ ఐకన్ పురస్కారం అందుకున్నారు.సినిమా రంగంలో అసాధార‌ణ విజ‌యాలు సాధించి, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లను అందుకుంటూ.. యంగ్ జనరేషన్ కు స్ఫూర్తినిచ్చే యువ‌త‌రానికి మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ 'ఆసియా విజన్ -2016' పేరిట 'యూత్ ఐక‌న్‌' పుర‌స్కారాన్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి క‌మిటీ టాలీవుడ్ నుంచి మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ని ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారానికి ఎంపిక చేసుకోవ‌డం విశేషం.త‌న‌దైన ఛ‌రిష్మాతో వెండితెరపై వెలుగులు విర‌జిమ్ముతున్న స్టార్‌ హీరో చ‌ర‌ణ్‌కి కోట్లాది ప్రేక్ష‌కాభిమానుల ఫాలోయింగ్ ఉంది. యువ‌త‌రానికి స్ఫూర్తినిచ్చే అసాధార‌ణ విజ‌యాలు ఈ యువ‌హీరో సొంతం. త‌న రెండో సినిమా(మ‌గ‌ధీర‌)కే బాక్సాఫీస్ వ‌ద్ద 70 కోట్లు పైగా వ‌సూళ్లు సునాయాసంగా రాబ‌ట్టిన హీరో చ‌ర‌ణ్‌. అందుకే అత‌డి ప్ర‌తిభ‌కు చ‌క్క‌ని గుర్తింపు ద‌క్కింది. ఇటీవ‌ల‌ షార్జా స్టేడియం(యుఏఈ )లో జరిగిన 'ఆసియా విజన్ -2016' వేడుకల్లో రామ్ చరణ్ కి అత్యున్న‌త 'యూత్ ఐక‌న్‌' పుర‌స్కారం అందించారు. దుబాయ్‌లో ప్ర‌తియేటా నిర్వ‌హించే అతి పెద్ద మ‌ల‌యాళ అవార్డుల కార్య‌క్ర‌మం ఇది. 2006 నుంచి ఈ పురస్కారాల్ని అందిస్తున్నారు. లేటెస్టుగా చ‌ర‌ణ్ న‌టించిన 'ధృవ‌' అతి త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే త‌ను నిర్మిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం 'ఖైదీ నంబ‌ర్ 150' సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.
https://www.telugupost.com/movie-news/కలెక్షన్స్-విషయంలో-చాలా-17022/
రామ్ చరణ్ 'ధ్రువ' సినిమా డిసెంబర్ 9 న రిలీజ్ అయ్యి థియేటర్స్ లో దుమ్ము దులిపేస్తుంది. ఈ సంవత్సరం చివరిలో ఈ సినిమాతో టాలీవుడ్ భారీ హిట్ అందుకుని ఈ ఏడాదిని విజయవంతంగా పూర్తిచేసిందనే చెప్పాలి. ఇక రామ్ చరణ్ కి కూడా 'మగధీర' తరవాత అంతటి హిట్ ఇచ్చింది ఈ 'ధ్రువ చిత్రం'. అయితే కలెక్షన్స్ పరం గా కూడా ఈ చిత్రం బాగానే వసూలు చేసిందని చెబుతున్నారు....... కానీ ఈ విషయాన్నీ ధ్రువ నిర్మాత అయిన అల్లు అరవింద్ ఎక్కడా చెప్పడం లేదు.ఇప్పటి వరకు వరుసగా మూడు రోజులు సెలవలు రావడం తో 'ధ్రువ' కి బాగా కలిసొచ్చి థియేటర్స్ అన్ని ఫుల్ గా నిండిపోతున్నాయి. అయితే కలెక్షన్స్ ని ఓపెన్ గా చెబితే ఎక్కడ ఐటి దాడులు జరుగుతాయో అన్న భయంతోనే చిత్ర యూనిట్ ఎక్కడా కలెక్షన్స్ గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడుతుందనే వార్త ఎప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక బయ్యర్స్ కూడా 'ధ్రువ' కి కలక్షన్స్ సరిగ్గా లేవని కలరింగ్ ఇస్తున్నారట. అయితే కలెక్షన్స్ విషయాన్ని ఎక్కడా నోరు జారొద్దని నిర్మాతే వారికి సూచించినట్లు చెబుతున్నారు. దాని వలనే బయ్యర్స్ 'ధ్రువ' చిత్రానికి పెద్దగా కలెక్షన్స్ లేవని ప్రచారం చేస్తున్నారట.మరి మెగా హీరో సినిమా అందులోను చిరు కొడుకు రామ్ చరణ్ సినిమా అంటే మామూలు విషయం కాదు. అంతేకాకుండా 'ధ్రువ' సినిమా మొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకుని రన్ అవుతుంది. ఇక వెబ్సైట్ కూడా ధ్రువ కి 3 కి తగ్గకుండా రేటింగ్స్ ఇచ్చారు. మరి ఇంత పాసిటివ్ గా వున్న ఈ సినిమా కు కలెక్షన్స్ సరిగ్గా లేవంటే ఎవరన్నా నమ్మే విషయమేనా అది.
https://www.telugupost.com/movie-news/rashi-khanna-upcoming-movies-in-tollywood-126828/
చిన్న సినిమాతో నటిగా పరిచయం అయిన రాశి ఖన్నా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ తో నటించే ఛాన్స్ కొట్టేస్తుంది. మొన్నటివరకు చిన్న సినిమాల కె పరిమితం అయిన రాశి ఖన్నా ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో పెద్ద పెద్ద ఆఫర్స్ దక్కించుకుంటుంది. రీసెంట్ గా ఈమె తమిళంలో విశాల్ తో “అయోగ్య” అనే మూవీ లో నటించింది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో విజయ్ సేతుపతి నటించే అవకాశం కొట్టేసింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తున్న రాశి తలపతి విజయ్ 64వ చిత్రంగా తెరకెక్కనున్న చిత్రంలో కూడా ఒక హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. అలానే తెలుగులో చాలా కాలం తరువాత సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా చేస్తుంది. మారుతీ డైరెక్షన్ లో ఈమె తేజు సరసన “ప్రతిరోజూ పండుగే” లో నటిస్తుంది. దీనితో పాటు బాబీ దర్శకత్వంలో “వెంకీ మామ” లో నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అలా ఫుల్ బిజీగా ఉన్న రాశి ఖన్నా కు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఓ ఫామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈసినిమా తరువాత బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. అయితే ఈచిత్రంలో హీరోయిన్ గా రాశి ఖన్నా ఫైనల్ అయిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సిఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈసినిమా వచ్చే సమ్మర్ లో రిలీజ్ కానుంది. అలా క్షణం కూడా ఖాళీ లేకుండా ఫుల్ బిజీగా ఉంది రాశి.
https://www.telugupost.com/movie-news/రికార్డు-స్థాయిలో-అజ్ఞా-54669/
అందరు న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం ఈ న్యూ ఇయర్ మరింత జోష్ గా జరుపుకుంటున్నారు. మొన్న ఆదివారం సాయంత్రం 'అజ్ఞాత‌వాసి' సినిమా నుండి ప‌వ‌న్ క‌ల్యాణ్ పాడిన 'కొడ‌కా....కోటేశ్వ‌ర్ రావు' పాట ప‌వ‌న్ ఫ్యాన్స్ కు స‌రి'కొత్త' కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ ఒక వైపు.... ఈ సాంగ్ ఒకటి ఒక వైపు అన్నట్టుగ్గ ఫాన్స్ ని ఆకట్టుకుంది. ఈ సాంగ్ తో సినిమాకు మరింత హైప్ వచ్చింది.ప్రపంచ వ్యాప్తంగా 'అజ్ఞాత‌వాసి' ఈ నెల 10 న విడుదల అవుతుంది. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కాబట్టి ఈ సినిమా హ‌క్కుల కోసం గ‌ట్టి పోటీ ఏర్ప‌డింద‌ట‌. ఈ చిత్ర నైజాం హ‌క్కులు రికార్డు స్థాయి ధ‌ర ప‌లికిన‌ట్లు తెలుస్తోంది.ఈ చిత్రం నైజామ్ రైట్స్ దాదాపు 27 కోట్లకు అమ్ముడైనట్టుగా ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా. కేవలం నైజాంలోనే ఈ రేటు ప‌లికితే, ఇక మిగతా ప్రాంతాల్లో హ‌క్కులు, ఓవ‌ర్సీస్, శాటిలైట్, డిజిట‌ల్ రైట్స్ ఏ స్థాయిలో అమ్ముడై ఉంటాయో అని చ‌ర్చించుకుంటున్నార‌ట‌. విడుదలకు ముందు 'అజ్ఞాత‌వాసి' ఇంత హైప్ క్రియెట్ చేస్తే.. విడుదల తర్వాత మ‌రెంత సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో అని ట్రేడ్ వ‌ర్గాల అనుకుంటున్నారు.
https://www.telugupost.com/movie-news/jr-ntr-celebrations-72856/
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా 'అరవింద సమేత - వీర రాఘవ' షూటింగ్ తో బాగా బిజీగా వున్నాడు. గత ఏడాది 'జై లవ కుశ' సినిమా తో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడమే కాదు... బిగ్ బాస్ సీజన్ వన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి క్రేజ్ సంపాదించాడు. డబ్బుకి డబ్బు, క్రేజుకి క్రేజు బిగ్ బాస్ తో ఎన్టీఆర్ సొంతమయ్యాయి. అలాగే ఈ ఏడాది త్రివిక్రమ్ అరవింద సమెతని దసరా కల్లా పూర్తి చేసి విడుదల చేసేసి.. తర్వాత రాజమౌళి తో కలిసి చరణ్ తో పాటుగా భారీ మల్టీస్టారర్ కి రెడీ అవ్వబోతున్నారు ఎన్టీఆర్. మరి జక్కన్నతో సినిమా కోసం తెగ ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ కి ఈ ఏడాది ఆ కోరిక తీరిపోతుండడంతో.. ఫుల్ ఖుషీగా వున్నాడు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోను ఎన్టీఆర్ ఫుల్ హ్యాపీ గా వున్నాడు. ఎందుకంటే ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి సెకండ్ టైం ప్రెగ్నెంట్.ఘ‌నంగా శ్రీమంతం...ఎన్టీఆర్ కి లక్ష్మి ప్రణతితో పెళ్లి జరిగాక.. అభయ్ రామ్ పుట్టాడు. అభయ్ రామ్ తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకి ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయ్యింది. ఇక లక్ష్మి ప్రణతి ప్రెగ్నెంట్ కావడంతో ఎన్టీఆర్ ఫుల్ ఖుషీగా వున్నాడు. మరి చాలా త్వరలోనే లక్ష్మి ప్రణతి డెలివరీ జరిగి ఒక పాపో.. బాబో ఎన్టీఆర్ చేతుల్లోకి వచ్చేస్తారు. ఇక ప్రస్తుతం లక్ష్మి ప్రణతి శ్రీమంతం వేడుకలు ఒక రేంజ్ లో జరిగాయి. కొద్దిమంది అతిథుల సమక్షంలో లక్ష్మి ప్రణతి శ్రీమంతం వేడుకలు ఘనంగా జరిగాయనడానికి సాక్ష్యం సోషల్ మీడియాలో హల్ చ‌ల్‌ చేస్తున్న ప్రణతి శ్రీమంతం వేడుకల ఫొటోస్. మరి ఆ ఫొటోస్ లో ఎన్టీఆర్ ఎక్కడా కనబడలేదుగాని.. తన భార్య ప్రణతి శ్రీమంతం వేడుకల్ని మాత్రం ఎన్టీఆర్ బాగా ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ వేడుకల్లో లక్ష్మి ప్రణతి స్నేహితుల హడావిడి మాములుగా లేదంటే నమ్మాలి. ఇక అతి త్వరలోనే.. బుల్లి బాబు అయినా.. పాప‌నైనా ఎత్తుకోవాలనే ఆరాటంలో ఎన్టీఆర్ ఉన్నాడు.
https://www.telugupost.com/crime/2-nepali-nationals-held-in-delhi-for-duping-woman-on-matrimonial-site-1431648
మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్ ద్వారా మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. ఓ మహిళను మోసం చేసిన కేసులో.. ఒక మహిళతో సహా ఇద్దరు నేపాలీ జాతీయులను ఢిల్లీలో అరెస్టు చేశారు. నిందితులను ద్వారక ప్రాంత నివాసి రేణుకా గుసేన్ అకా మంజు (35), ఉత్తమ్ నగర్‌కు చెందిన అమోస్ గురంగ్ అకా యాదవ్ గురుంగ్ (42)గా గుర్తించారు. వీరు గత ఆరేళ్లుగా ఢిల్లీలో నివసిస్తున్నారు. వీరి నుండి 40 వేల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, చెక్ బుక్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఓ మహిళ సైబర్‌ మోసంపై ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తాను వితంతువునని, జీవన్‌సాథీ.కామ్‌లో ప్రొఫైల్‌ను క్రియేట్ చేశానని తెలిపింది. అందులో భారతదేశం వెలుపల స్థిరపడిన నరేష్ ఆండ్రూస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని ఆమె పేర్కొంది. ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టాక.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆండ్రూస్ తనను పెళ్లి చేసుకునేందుకు ఇండియా వస్తున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత భారత్‌లో దిగిన తర్వాత ముంబై కస్టమ్స్ తన కోసం ఖరీదైన బహుమతులు తీసుకురావడంతో ఆపివేసినట్లు ఆమెతో చెప్పాడు. నిందితుడు బాధితురాలితో మాట్లాడుతూ.. అతని లగేజీకి క్లియరెన్స్ రుసుము, అతను విడుదల చేయడానికి రూ. 35,000, రూ. 1,85,000 ఇలా చెల్లించాలని ఆమె నుండి డబ్బు డిమాండ్ చేశారు. నిజమని నమ్మిన మహిళ ఆ డబ్బులు వారికి పంపింది. అయితే.. డబ్బు పంపాక వారి నుండి ఎటువంటి స్పందన కనిపించలేదు. దీంతో తాను మోసపోయినట్లు ఆమె గుర్తించింది. ఇక తాను మోసపోయానని గ్రహించి.. పోలీసులకు సమాచారం అందించింది.
https://www.telugupost.com/top-stories/tdp-candidate-for-the-vijayawada-parliamentary-seat-has-been-finalised-official-announcement-will-take-some-time-1431154
తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు స్థానానికి అభ్యర్థి దొరికేశాడు. ఆయన రాజకీయాలకు కొత్తేమీ కాకపోయినా ఆ వాసనలు మాత్రం ఉన్నాయి. బలమైన సామాజికవర్గంతో పాటు ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో చంద్రబాబు ఆయన పేరును దాదాపు ఖరారు చేశారంటున్నారు. ప్రస్తుత విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని క్లారిటీ ఇచ్చారు. ఆయన సోదరుడిని ఎంపిక చేసినా రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఖచ్చితంగా గెలిచే స్థానం. అందుకే ఈసారి పోటీకి ఆయనను పార్లమెంటు సభ్యుడిగా దింపాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం.కేశినేని నానితో...కేశినేని నాని రెండు దఫాలు టీడీపీ నుంచి విజయం సాధించారు. వరస విజయాలు వెనక ఆయన కన్నా పార్టీకున్న ఓటు బ్యాంకే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వ్యాపారాలన్నీ మూసివేసుకున్న తర్వాత కేశినేని నాని ఫక్తు రాజకీయ నేతగా మారారు గతంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, గద్దె రామ్మోహన్ లాంటి వంటి వారు ఉన్నా కృష్ణా జిల్లాలో ఎలాంటి రాజకీయ ఇబ్బందులు తలెత్తలేదు. వారు అందరినీ కలుపుకుని పోయేవారు. కానీ కేశినేని నానిని దాదాపు ఎక్కువ మంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన వల్ల అనేక శాసనసభ నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గ్రూపులుగా తయారైంది.నేతలతో పొసగక...దీంతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కేశినేని నానిని తప్పించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే నానిని అసహనానికి గురయ్యేటట్లు చేశారు. పార్టీ నాయకత్వం అందులో సక్సెస్ అయిందనే చెప్పాలి. కేశినేని నాని స్వచ్ఛందంగా తప్పుకుంటే విజయవాడలో పార్లమెంటు అభ్యర్థులకు కొదవ లేదు. టీడీపీకి అనుకూలంగా ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు పోటీ పడతారు. గెలిచే సీటు కావడంతో సహజంగానే ముందుకు వస్తారు. అయితే ఈసారి ఎవరికీ ఇబ్బందిలేని నేతను ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. పెద్దగా పార్లమెంటు నియోజకవర్గాన్ని పట్టించుకోక పోయినా పరవాలేదు కాని, ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టే ఉండకూడదన్నది చంద్రబాబు ఆలోచన.దత్తు పేరు ఖరారు...అందుకే సినీ నిర్మాత చలసాని అశ్వనిదత్ పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలిసింది. 2004లో అశ్వినీదత్ విజయవాడ పార్లమెంటులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్ గా లేకపోయినా టీడీపీకి బలమైన సానుభూతిపరుడు. సామాజికవర్గం కూడా కలసి వస్తుంది. అదే సమయంలో ఆర్థికంగా ఏడు నియోజకవర్గాల అభ్యర్థులను ఆదుకునే సత్తా ఉన్న వ్యక్తి. అందుకే ఇటీవల అశ్వినీదత్ వైసీపీ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారంటున్నారు. సినీ పరిశ్రమలో ఉండి రెండేళ్లకు ముందే అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారంటే దత్తుగారికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. మొత్తం మీద బెజవాడ ఎంపీ అభ్యర్థిగా అశ్వినీదత్ పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
https://www.telugupost.com/politics/cm-kcrs-master-plan-behind-merger-of-rtc-employees-1487587
నాలుగు సంవత్సరాల క్రితం 48,000 మందికి పైగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు రాష్ట్ర రవాణా శాఖలో కార్పొరేషన్‌ను విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 5 నుండి 52 రోజుల పాటు నిరవధిక సమ్మె చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఆర్టీసీ ఉద్యోగులను, కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత ఉద్యోగులపై నిప్పులు చెరిగిన కేసీఆర్ వారిని సర్వీసు నుంచి తొలగించే స్థాయికి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం అసాధ్యమని ఆయన ప్రకటించారు. "ఈ భూమి ఉన్నంత వరకు మేము అలాంటి నిర్ణయం తీసుకోము," అని అతను వారికి గట్టిగా చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని మంత్రివర్గం గట్టిగా నిర్ణయించిందని, ఒకసారి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే ఎవరూ మార్చలేరని కేసీఆర్ అన్నారు. ''ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇతర కార్పొరేషన్ల ఉద్యోగుల నుంచి కూడా ఇదే డిమాండ్ వస్తుంది. ఇలా చిన్నవి, పెద్దవిగా 91 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆర్టీసీని ఉదాహరణగా చూపిస్తూ వారు కూడా ఇదే డిమాండ్‌తో ముందుకు వస్తారు. మేము వాటిని తిరస్కరిస్తే, వారు కోర్టుకు వెళతారు. అదే కోర్టులు తమ తప్పులను ఎత్తి చూపుతాయి. కాబట్టి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు'' అని ఆయన స్పష్టం చేశారు. కానీ అదే ముఖ్యమంత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కలం పోటుతో నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ప్రతిపాదించిన వెంటనే ఎలాంటి చర్చ లేకుండానే కేబినెట్ ఆమోదం తెలిపింది. కేసీఆర్‌పై విరుచుకుపడ్డ అదే ఉద్యోగులు ఇప్పుడు ఆయన చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. అయితే కేసీఆర్ మనసులో హఠాత్తుగా ఈ మార్పు ఎందుకు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి మరో మూడు లేదా నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్ర సమితి చీఫ్ ఆర్టీసీ ఉద్యోగులతో సహా వివిధ వర్గాల ప్రజలను విలాసపరిచే ఏ అవకాశాన్ని వదులుకోకూడదనుకుంటున్నారని, ఒక్క ఓటు కూడా పోగొట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు నగరంలో ఆర్టీసీకి చెందిన ఖరీదైన భూములు, ఇతర ఆస్తులపై బీఆర్‌ఎస్ నేతలు కన్నేసినట్లు కూడా చర్చ జరుగుతోంది. ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నంత కాలం ఇలాంటి ఆస్తులను కేసీఆర్ నేరుగా ఏమీ చేసే అవకాశం ఉండదు. అది ప్రభుత్వంలో విలీనమైతే, రెండో వ్యక్తి (ప్రభుత్వం) ఆస్తులపై హక్కులను పొందుతుంది.
https://www.telugupost.com/movie-news/వెంకటేష్-తో-అనుష్క-నిజమే-51631/
గురు సినిమా విజయంతో భారీ గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు తేజ తో ఆట నాదే వేట నాదే అంటూ కొత్త సినిమాని సైలెంట్ గా మొదలెట్టేసాడు. వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 13 న ఈ సినిమా మొదలవుతుంది అనుకుంటే.. మొన్ననే ఈ సినిమా ని తేజ - వెంకీలు మొదలు పెట్టి సెట్స్ మీదకి తీసుకెళ్ళిపోయి అందరికి షాక్ ఇచ్చారు. ఇప్పటికే సెట్స్ మీదున్న ఈ సినిమాలో ఇప్పటివరకు వెంకటేష్ పక్కన హీరోయిన్ సెట్ అవలేదు.మొన్నటివరకు కాజల్ అగర్వాల్, వెంకటేష్ తో జోడి కడుతుంది అనుకుంటే... కాజల్, వెంకీ కి హ్యాండ్ ఇచ్చిందని..సీనియర్ హీరోతో నటిస్తే కెరీర్ లో ప్రోబ్లెంస్ వస్తాయని భయపడి కాజల్ వెనక్కి తగ్గడంతో... ఆ లిస్ట్ లోకి తమన్నా వచ్చి చేరింది. ఇక తమన్నా కూడా వెంకటేష్ పక్కన నటించేందుకు సిద్దముగా లేకపోవడంతో ఇప్పుడు తాజాగా వెంకీ కి జోడిగా అనుష్క పేరు వినబడుతుంది. వెంకటేష్ పక్కన అనుష్క అయితే బావుంటుందని చిత్ర బృందం ఆలోచించడమే తరువాయి అనుష్క తో సంప్రదింపులు కూడా మొదలెట్టేశారట. ఇకపోతే అనుష్క కూడా భాగమతి సినిమా తర్వాత తన బరువు కారణంగా మరే సినిమా ఒప్పుకోకుండా ఖాళీగా ఉంటుంది. ఇప్పటికే అనుష్క బరువు తగ్గే పనిలో ఉండగా. ఇప్పుడు వెంకటేష్ సరసన జోడి కట్టడానికి అనుష్క కి ఇంకా అభ్యంతరాలేమి ఉంటాయంటున్నారు. ఇప్పటికే అనుష్కతో వెంకటేష్ చింతకాయల రవి వంటి సినిమాలో నటించి ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆటా నాదే వేటా నాదే లో వీరిద్దరూ జోడి కడితే చూడాలనుకుంటున్నారు వెంకీ అభిమానులు. చూద్దాం ఫైనల్ గా వెంకీకి ఏ హీరోయిన్ సెట్ అవుతుందో?
https://www.telugupost.com/movie-news/అఖిల్‌-రెండో-చిత్రం-దర్శ-202/
స్టార్‌ డైరెక్టర్‌ వినాయక్‌ దర్శకత్వంలో అక్కినేని అఖిల్‌ హీరోగా ఎంట్రీ గ్రాండ్‌గానే జరిగింది. ఈ చిత్రానికి విడుదలకు ముందు విపరీతమైన హైప్‌ వచ్చింది. అఖిల్‌ తొలి చిత్రం కావడంతో ఆయన తండ్రి నాగార్జున సైతం ఈ చిత్రం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ అవేమీ సరైన ఫలితాలను అందించలేదు. ఈ చిత్రం విడుదల తర్వాత డిజాస్టర్‌గా నిలవడంతో హైప్‌ మొత్తం గాలికి కొట్టుకుపోయి విమర్శలు మొదలయ్యాయి. ఈ చిత్రం ఘోరంగా డిజాస్టర్‌ కావడానికి కొన్ని అతిపోకడలే కారణమనే నిర్ణయానికి నాగ్‌ వచ్చాడు. అందుకే అఖిల్‌ రెండో చిత్రం విషయంలో ఆయన మొదటి సినిమాలో జరిగిన పొరపాట్లకు తావివ్వకూడదనే నిర్ణయానికి వచ్చాడు. కాగా అఖిల్‌ రెండో చిత్రానికి దర్శకునిగా నాగ్‌ వంశీపైడిపల్లిని ఎంపిక చేశాడని సమాచారం. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో నాగ్‌ 'ఊపిరి' సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్‌ రెండో వారంలో ఈ చిత్రానికి ముహూర్తంగా నిర్ణయించారని సమాచారం. 'ఊపిరి' విషయంలో వంశీపైడిపల్లి వర్క్‌కు ఇంప్రెస్‌ అయిన నాగ్‌ తన రెండో కుమారుడు అఖిల్‌కు మంచి హిట్‌ ఇచ్చి మరలా ఫామ్‌లోకి తెచ్చే సత్తా ఆయనలో ఉందనే నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
https://www.telugupost.com/movie-news/ఫామిలీ-ఫ్రెండ్స్-తో-గ్యా-16996/
ఐదు ఆరు సంవత్సరాల క్రితం వరకు అగ్ర స్థానంలో వున్న హాస్య నటుల స్థానాలు అతలాకుతలం అయ్యాయి. సునీల్ కథానాయకుడిగా స్థిరపడిపోగా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, ఏ.వి.ఎస్ వంటి పలువురు ప్రముఖ హాస్య నటులు అతి తక్కువ కాల వ్యవధిలో కాలం చెందారు. కృష్ణ భగవాన్, రఘు బాబులు సినిమాల సంఖ్య తగ్గించుకోగా బ్రహ్మానందం హాస్యం మొనాటనీ రావటంతో ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా ప్రతి వారి స్థానం దిగువ స్థాయికి చేరిపోవటానికి కారణాలు వున్నాయి కానీ, ప్రముఖ హాస్య నటుడు అమాంతం అదృశ్యమవటానికి కారణం ఎవరికీ తెలీదు.గత కొద్ది కాలంగా వెండితెర కు దూరం అయిన నటుడు వేణు మాధవ్. ఇటీవలి కాలం లో ఆయనకు, ఆయన కుటుంబాన్ని మానసిక క్షోభ పెట్టిన కొన్ని వార్తలు ప్రసారం చేసిన సంస్థల పై, వాటి వెనుక వున్న వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు. తరువాత ఆయన ఒక ఇంటర్వ్యూ లో తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడించారు. "వరుస సినిమాలు చేస్తూ అకస్మాత్తుగా కనుమరుగైన నటుడిగా అందరూ నా మీద సానుభూతి చూపుతుండటం నాకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. నేను ఈ గ్యాప్ ని అప్పటివరకు సినిమాలతో మిస్ ఐన నా కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడుపుతూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఇక ఇప్పుడు మళ్లీ వెండి తెరపై రీఎంట్రీ ఇవ్వనున్నాను. 2017 లో విడుదల దిశగా చిత్రీకరణ జరుపుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాటమరాయుడు చిత్రం నా రీఎంట్రీ చిత్రం కాబోతుంది. ఇక అప్పటి నుంచి వరుసగా సినిమాలలో నటించటానికే ప్రయత్నిస్తాను." అని సెలవిచ్చాడు వేణు మాధవ్.
https://www.telugupost.com/movie-news/akkineni-nagarjuna-bangarraju-may-not-come-to-this-sankranthi-126826/
ప్రతి సంక్రాంతి పోటీ చాలా గట్టిగా ఉంటుందని తెలిసిందే. పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు అన్ని సంక్రాంతికి రిలీజ్ అవుతుంటాయి. ఈ సీజన్ లో రిలీజ్ చేసుకుని ప్రొడ్యూసర్స్ మనీ చేసుకోవాలని వారి ప్రయత్నం. అలానే వచ్చే సంక్రాంతికి కూడా అంటే 2020 సంక్రాంతికి ఈసారి గట్టి పోటీ వుంటుందని అర్ధం అయిపోయింది. ఆల్రెడీ కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా సంక్రాంతి కి రావాలని అనుకుంటున్నారట. అయితే మొదటినుండి అక్కినేని నాగార్జున వచ్చే సంక్రాంతికి రావాలని అనుకున్నాడు కానీ ఇప్పుడు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాడు. నాగార్జున – రమ్య కృష్ణ – నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా సంక్రాంతికి రావడంలేదు. అసలు ఈమూవీ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ప్రస్తుతం నాగ్ మన్మధుడు 2 ని ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ తరువాత వెంటనే బంగార్రాజు సినిమా స్టార్ట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నాడు. సినిమా ఇంకా స్టార్ట్ అవ్వకపోవడంతో సంక్రాంతి నుండి ఆ సినిమా సమ్మర్ కు షిఫ్ట్ అయింది. ఈనెల నుంచి మూడునెలల పాటు నాగార్జున బిగ్ బాస్ 3లో బిజీగా వుంటారు. అందుకే బంగార్రాజు షూటింగ్ లేట్ అవుతుంది.
https://www.telugupost.com/movie-news/నాగ్-తో-ఛాన్స్-కొట్టేసిన-13860/
మొదటి నుంచి కొత్త, యువ దర్శకులను ఎంకరేజ్‌ చేయడంలో నాగార్జున ముందుంటాడు. వర్మనే కాదు.. లారెన్స్‌ నుండి వీరభద్రమ్‌చౌదరి, శ్రీనివాసరెడ్డి, విక్రమ్‌ కె.కుమార్‌, కళ్యాణ్‌కృష్ణ వరకు ఎందరికో ఆయన అవకాశం ఇచ్చారు. అంతేకాదు... అందులో కొన్నిసార్లు దెబ్బలు తగిలినా కూడా ఎక్కువ సార్లు ఆయన నిర్ణయాలు సరైనవే అని నిరూపించుకున్నాయి. ఇక ప్రస్తుతం సీనియర్‌స్టార్‌గా మారడంతో తన వయసుకు తగ్గ వెరైటీ క్యారెక్టర్లను చేస్తున్నాడు. తన కొడుకులిద్దరు నాగచైతన్య, అఖిల్‌లు కూడా హీరోలుగా మారడంతో వారి కెరీర్‌ను చక్కదిద్దేపనిలో కూడా నాగ్‌ బిజీ అయిపోయాడు. వారి కోసం వెతికే న్యూటాలెంట్‌ దర్శకులు తమను తాము నిరూపించుకుంటే తాను కూడా అవకాశం ఇస్తూ, తాను పరిచయం చేసిన, అవకాశం ఇచ్చిన కళ్యాణ్‌కృష్ణ, విక్రమ్‌ కె.కుమార్‌ వంటి వారితో తన కొడుకులకు తగ్గ స్క్రిప్ట్‌లను తయారు చేయిస్తూ నేడు న్యూటాలెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాడు.వీటిలో ఎక్కువ చిత్రాలను తానే నిర్మిస్తున్నాడే తప్ప ఇతర నిర్మాతలను ఇబ్బందిపెట్టడం లేదు. కాగా నాగార్జున పెద్దకుమారుడైన నాగచైతన్యతో ఇటీవల మలయాళ రీమేక్‌ 'ప్రేమమ్‌' వంటి క్లిష్టమైన సబ్జెక్ట్‌ను కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మలిచి, చైతూకు హిట్‌ ఇచ్చిన యువ దర్శకుడు చంద మొండేటి తన అభిమాన హీరో అయిన నాగ్‌ కోసం ఓ వెరైటీ పాత్రను సృష్టించి, దానికి తగ్గ పక్కా స్క్రిప్ట్‌ను రూపొందించే పనిలో బిజీగా ఉన్నాడని, ఇటీవల ఆయన ఆ చిత్రం లైన్‌ను నాగ్‌కు కూడా చెప్పాడని, త్వరలో నాగ్‌ తన సొంతబేనర్‌లోనే ఈ చిత్రాన్ని చేసేందుకు రెడీ అయ్యాడని ప్రచారం జరుగుతోంది.తాను చేసే చిత్రాలలోని క్యారెక్టర్లన్నింటినీ వెరైటీగా ఉండేట్లు చూసుకుంటున్న నాగ్‌ ప్రస్తుతం మరోసారి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరోసారి వేంకటేశ్వరస్వామి ప్రియభక్తుడైన హథీరాంబాబాగా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ బిజీగా జరుగుతూ, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలకు సిద్దమవుతోంది. ఇక ఈ చిత్రం షూటింగ్‌తో పాటు అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌కు రెండో మూవీగా రూపొందనున్న ఓ వెరైటీ ప్రేమకథాచిత్రాన్ని కూడా తానే నిర్మించాలని డిసైడ్‌ అయ్యాడు. జనవరిలో ఈ చిత్రం షూటింగ్‌ సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా నాగ్‌ త్వరలో 'రాజు గారి గది' చిత్రం సీక్వెల్‌లో నటిస్తున్నాడని, ఈ చిత్రం ద్వారా ఆయన కొత్తగా దర్శకునిగా మారిన యాంకర్‌ ఓంకార్‌కు అవకాశం ఇవ్వనున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక చందు మొండేటి విషయానికి వస్తే టాలీవుడ్‌ హీరోలు ఎంతో ఇష్టంగా భావించే పోలీస్‌ స్టోరీని చందు మొండేటి నాగ్‌కు చెప్పాదట. పూరీ దర్శకత్వంలో చేసిన 'శివమణి'లో అద్బుతమైన నటనను కనపర్చిన నాగ్‌ను చందుమొండేటి మరో డిఫరెంట్‌ పోలీస్‌ క్యారెక్టర్‌లో చూపించడానికిి హామీ పొందాడనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇక ఈ చిత్రం విషయాలు త్వరలో అధికారికంగా తెలిసే అవకాశం ఉందంటున్నారు.
https://www.telugupost.com/movie-news/ganesh-anthem-song-released-from-balakrishna-bhagavanth-kesari-1492648
నటసింహ బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తన 108వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari) అనే టైటిల్ ని పెట్టుకున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ (Kajal Aggarwal) హీరోయిన్‌ గా చేస్తుంటే, మరో హీరోయిన్ శ్రీలీల (Sreeleela) బాలకృష్ణకు కూతురిగా కనిపించబోతుందని తెలుస్తుంది.గతంలో ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ఆడియన్స్ లో మంచి అంచనాలే క్రియేట్ చేసింది. ఇక వచ్చే నెల విడుదల ఉండడంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈక్రమంలోనే సినిమాలోని మొదటి సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘గణేష్ యాంతం’ అనే ఈ పాటను గణేష్ ఉత్సవాలు నేపథ్యంతో తెరకెక్కించారు. థమన్ ఈ పాటని కంపోజ్ చేయగా కాసర్ల శ్యామ్ లిరిక్స్, మనీష్ పండ్రంకి అండ్ కరీముల్లా గానం చేశారు.గ్రాండ్ మేకింగ్ తో శేఖర్ మాస్టర్ ఈ పాటకి డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. ఇక ఈ సాంగ్ ని బాలయ్య, శ్రీలీల తమ ఎనర్జీతో ఎక్కడికో తీసుకువెళ్లిపోయారు. సాంగ్ లో వీరిద్దరి ఎనర్జీ చూస్తుంటే ప్రతి ఒక్కరు తీన్మార్ ఆడాల్సిందే. కేవలం లిరికల్ సాంగ్ తోనే ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన బాలయ్య.. థియేటర్ లో ఫుల్ సాంగ్ తో పూనకాలు తెప్పించడం ఖాయం అని తెలుస్తుంది. మరి ఆ సాంగ్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.కాగా ఈ చిత్రాన్ని హరీష్ పెద్ది, సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ పతాకం పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. దసరా పండుగకు అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక అఖండ‌, వీర సింహ‌రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన బాలకృష్ణ.. ఈ చిత్రంతో కూడా ఆ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు.
https://www.telugupost.com/movie-news/ఆ-హీరో-డ్రగ్గిస్టా-37988/
ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా డ్రగ్స్ చుట్టూనే తిరుగుతుంది. టాలీవుడ్ లో మాత్రమే ఈ డ్రగ్ మాఫియా పాతుకుపోలేదు. ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీలోని ఈ డ్రగ్ మాఫియా వెళ్లానుకుని ఉంది. కానీ ఇప్పుడు మాత్రం డ్రగ్ డీలర్ కెల్విన్ అరెస్ట్ తో టాలీవుడ్ మొత్తం అతలాకుతలం అవుతుంది. ఇప్పటికే పలు సెలబ్రిటీస్ పేర్లు బయటికి వచ్చి సంచలనం సృష్టిస్తుంటే మరికొన్ని టాప్ సెలబ్రిటీస్ పేర్లు బయటికి రావాల్సి ఉందంటున్నారు. ఇకపోతే నేను కూడా డ్రగ్గిస్టునే.... డ్రగ్స్ వాడుతానని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఒక టాప్ హీరో.ఆ హీరో మన టాలీవుడ్ హీరో కాదులెండి. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తాను కూడా డ్రగ్స్ వాడుతానని చెబుతున్నాడు. రణబీర్ నటించిన జగ్గా జాసూస్ పబ్లిసిటీలో భాగంగా రణబీర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేసాడు. తన చిన్నతనంలోనే డ్రగ్స్ కి అలవాటు పడ్డానని... కానీ తర్వాతర్వాత డ్రగ్స్ వాడకం మంచిది కాదని తెలుసుకుని ఆ అలవాటుకు మెల్లగా దూరమయ్యానని చెబుతున్నాడు. ఇక పెద్దయ్యాక ఒకసారి కావాలనే డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చిందట. అలా డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చింది కూడా సినిమా కోసమేనట. తాను రాక్ స్టార్ లో నటించేటప్పుడు ఒక సన్నివేశాన్ని రక్తి కట్టించాలంటే డ్రగ్స్ వాడాల్సి ఉండడంతో... చాలా తక్కువగా డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నాడు. తక్కువ మోతాదులో డ్రగ్ తీసుకుని ఆ సీన్ చేసేసరికి ఆ సీన్ స్క్రీన్ మీద అద్భుతంగా వచ్చిందని... చెప్పుకొచ్చాడు. మరి డ్రగ్స్ తీసుకుంటే యాక్టీవ్ అయ్యి అనుకున్న పనులను మరింతబాగా చేయగలరనే విషయాన్నీ ఓపెన్ గా చెప్పేసాడు రణబీర్. మరి దానికోసమే చాలామంది ఇలా డ్రగ్స్ కి బానిసలై జీవితాల్ని కోల్పోతున్నారు.
https://www.telugupost.com/movie-news/aravind-swamy-tragedy-93005/
తమిళ నటుడు అరవింద్ స్వామి అంటే ఇప్పటికి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి ‘రోజా’, ‘బొంబాయి’ లాంటి సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్‌ తో పాటు తమిళ ఆడియన్స్‌ ను కూడా కట్టి పడేశాడు. అయితే తమిళంలో స్టార్ హీరోగా ఎదుగుతున్న టైంలో అరవింద్.. ఉన్నట్లుండి తెరమరుగైపోయాడు. ఆలా అవడానికి పెద్ద విషాదం ఉందని అంటున్నాడు అరవింద్. మణిరత్నంతో రోజా సినిమా చేసిన తర్వాత చదువు కోసం అమెరికాకు వెళ్లిన తాను తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో తిరిగి ఇండియాకు రావాల్సి వచ్చిందని అన్నాడు. ఆమె కోసం ఇక్కడే ఆరు నెలలు ఉండాల్సి వచ్చిందని... కానీ తన తల్లిని కాపాడుకోలేకపోయానని.. తర్వాత కొంతకాలానికే తన తండ్రి చనిపోయాడని తెలిపాడు. అప్పుడు ఆ బాధలో నుండి బయటికి రావటానికి మణిరత్నం నాతో సినిమాలు చేయడం స్టార్ట్ చేసాడని చెప్పాడు.విషాదంతో దూరమైతే జోకులా..?ఆ సమయంలో సఖి సినిమా చేసానని.. ఆ తర్వాత ఇంక వద్దు అనుకుని తన కుటుంబ వ్యాపారాల్ని టేకప్ చేసానని.. అందులో పడి సినిమాలకి పూర్తిగా దూరమయ్యానని చెప్పాడు అరవింద్. ఆ టైంలో తన భార్యతో విడాకులు కావడం.. పిల్లల బాధ్యత తానే చూసుకోవటం జరిగిందని అన్నాడు. ఐతే కొన్నేళ్ల తర్వాత తీవ్రమైన వెన్నునొప్పితో ఆసుపత్రిలో చేరానని.. ఆ సమయంలో తనకు పక్షవాతం కూడా వచ్చిందని కూడా చెప్పాడు. ఆ సమయంలో తను 110 కిలోల బరువు పెరిగానని అన్నాడు. కానీ ఈ విషయాలు ఏమి తెలియక కొంతమంది సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టి కామెడీ చేస్తున్నారని తన బాధను వ్యక్తం చేసాడు. కడలి సినిమా కోసం ఆ బరువు తగ్గానని చెప్పుకొచ్చాడు అరవింద్.
https://www.telugupost.com/movie-news/saira-film-sensor-formalities-has-been-completed-134647/
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సైరా నరసింహరెడ్డి చిత్రం నిన్న సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండా ఈమూవీ U/A సర్టిఫికేట్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా రన్ టైంకి వస్తే 164 నిమిషాలుంటుంది. దీంతో ఈ సినిమా యొక్క టాక్ సెన్సార్ సభ్యులు ద్వారా బయటకు వచ్చేసింది. సెన్సార్ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. సైరా సినిమా ఫస్టాఫ్ కంటే సెకెండాఫ్ చాలా బాగుందట. హీరోయిజం సినిమాలో కావాల్సినంత ఉండదని చెబుతున్నారు. దేశభక్తిని రగిల్చడం కంటే హీరోయిజం ఎక్కువగా ఉందని టాక్. సమయమున్నా… అలా ముందుకు సెకండ్ హాఫ్ మొత్తం చిరు చుట్టూనే తిరుగుతుందని ఇదొక విజువల్ వండర్ అని చెబుతున్నారు. ఇందులో నటించిన అందరూ చాలా బాగా చేసారని చెబుతున్నారు. అమితాబ్ పాత్ర కూడా చాలా బాగుంటదని చెబుతున్నారు. ఓవరాల్ గా సినిమా బాగుందని చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా రిలీజ్ కి ఇంకా వారం పైనే ఉన్నా ఇంత ముందుగా సెన్సార్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈమూవీ 5 భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఎందుకులే ఇబ్బంది అని సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది.
https://www.telugupost.com/movie-news/marriage-in-glammour-heroin-kiara-advani-143413/
ఏంటి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న కియారా కి పెళ్లా.. ? ఆమె ఇంట్లో పెళ్లి భాజాలు అంటూ ప్రచారం మొదలైనప్పటినుండి కియారా ఇంట్లో పెళ్లి ఎవరికబ్బా.. కొంపదీసి ఆమె గాని పెళ్లి చేసుకోవడం లేదు కదా అంటూ ఆమె అభిమనులు తెగ ఇదైపోతున్నారు. ప్రస్తుతం గుడ్ న్యూస్ ప్రమోషన్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న కియారా అద్వానీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగడం అంటే…. కియారా అద్వానీ సిస్టర్ పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయాన్నీ గుడ్ న్యూస్ ప్రమోషన్స్ లో కియారా అద్వానీ స్వయంగా తన సిస్టర్ మ్యారేజ్ అని.. ఆమెకి శుభాకాంక్షలు కూడా తెలిపింది. నా సోదరితో పాటు ఆమెకు కాబోయే భర్త ఇద్దరు ఆనందంగా ఉండాలని కోరకుంటున్నానంది. ఇంట్లో పెళ్లి బాజాలు….. అది విన్న కియారా అద్వానీ హార్డ్ కొర్ అభిమానులు ఊపిరి తీసుకున్నారు. మీడియాలో కియారా ఇంట్లో పెళ్లి భాజాలు అనగానే ఒకింత కంగారు పడిన ఆమె ఫ్యాన్స్ ఇపుడు ఊపిరి పీల్చు కుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా కియారా అద్వానీ కెరీర్ సాగుతుంది. సినిమాల మీద సినిమాలు చేస్తూ హాట్ అండ్ గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్స్ గా మారిన కియారా ఇప్పుడప్పుడే పెళ్లి మాటలు ఎత్తదులే.
https://www.telugupost.com/crime/truck-carrying-soft-drinks-overturns-in-rajasthans-dausa-six-people-dead-1491062
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ట్రక్కు- జీపును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మండవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే మహ్వా-మందావర్ హైవేపై బిర్సానా క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కులో కూల్ డ్రింక్స్ లోడ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహ్వా, మందావర్ పోలీస్ స్టేషన్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులు మాండావర్‌, మహ్వాలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్రిటికల్ గా ఉన్న ముగ్గురిని జైపూర్‌కు తరలించారు.జైపూర్ రూరల్ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ సంఘటనపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు, "దౌసా జిల్లాలోని మందావర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే విచారకరమైన సమాచారం అందింది. దేవుడు మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ ఉన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను." అని ట్వీట్ చేశారు.రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జరిగిన మరో సంఘటనలో.. బైక్‌ను ట్రక్కు ఢీకొనడంతో మహిళ, ఆమె కుమారుడు మరణించినట్లు పోలీసులు సోమవారం నాడు తెలిపారు. జిల్లాలోని తిలక్‌పురి గ్రామ సమీపంల ముగ్గురు వ్యక్తులు ఆసుపత్రి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌హెచ్‌ఓ రామావతార్ మీనా తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి.
https://www.telugupost.com/movie-news/vishal-pandem-kodi2-piracy-93587/
గతంలో కోలీవుడ్ హీరో విశాల్ సినిమాల పైరసీ లేకుండా చేస్తానని ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్ పైరసీ సైట్లు వారు స్వీకరించారు. ఇక నుండి విశాల్ ప్రతి సినిమా పైరసీ చేస్తామని ప్రకటించారు. గత కోనేళ్ళుగా విశాల్ పైరసీను ఆపే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అయినా ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. ఈనేపధ్యంలో 'పందెంకోడి-2 ' కూడా పైరసీ బారిన పడింది.పందెం కోడి కూడా పైరసీ.......నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయినా ఈసినిమా పైరసీ హెచ్ డీ క్వాలిటీతో పెట్టేసారు. దాదాపు 2 జీబీ ఉన్న ఈసినిమా తమిళ వెర్షన్ చాలా త్వరగా ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది.. దాంతో విశాల్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడులో త్రిచూర్, తంజావురు జిల్లాల్లో ఎక్కువగా పైరసీ జరుగుతుందని తెలిసి ఆ ప్రాంతాల్లో 'పందెంకోడి-2 ' ను విశాల్ రిలీజ్ చేయలేదు.పైరసీని అరికట్టాలనుకుంటే.....అలా తన సొంత బిజినెస్ కూడా వదులుకుని పైరసీ ని అరికట్టాలనుకున్నాడు కానీ పైరసీ భూతం ఆగలేదు. గతంలో విశాల్ నటించిన 'డిటెక్టివ్' సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. విశాల్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఈ పైరసీ ని ఆపలేకపోతున్నాడు. ఎన్ని చేద్దాం అనుకున్నా పాపం అన్ని ఎదురు దెబ్బలే.
https://www.telugupost.com/movie-news/chiru-said-congratulations-to-all-the-ganesh-team-134705/
మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఎస్ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ‘గద్దలకొండగణేష్‌’ సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి సూపర్‌హిట్‌ కలెక్షన్స్‌ తో దూసుకెళ్తోంది. ఈ రోజు (సెప్టెంబర్ 24) ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన మెగాస్టార్ చిరంజీవి వరుణ్ పెర్ఫార్మన్స్ చాలా బాగుందని. హరీష్ శంకర్ చాలా బాగా తీశాడు, డైలాగ్స్ చాలా బాగున్నాయని అన్నారు . ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మాతలు ఈ చిత్రాన్నితీశారని. సినిమాలో టీం స్పిరిట్ కనిపిస్తోందని ఆయన ప్రశంసిస్తూ ఈ అద్భుత విజయాన్ని సాధించిన టీం అందరికీ విజయాభినందనలు తెలిపారు.
https://www.telugupost.com/movie-news/parushuram-comments-on-next-films-91108/
విజయ్ దేవరకొండ లాంటి మీడియం రేంజ్ హీరోని పెట్టి పరుశురాం 'గీత గోవిందం' అనే చిన్న సినిమా తీసాడు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీంతో పరుశురాం సుడి కూడా మారిపోయింది. అతనికి వరసగా సినిమాలు రావడం.. సినిమాకి ఇంత అని డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. దీంతో పరుశురాం పారితోషికం రూ.6 కోట్ల వ‌ర‌కూ చేరింది.ఆఫర్లు బాగానే వస్తున్నా...'గీత గోవిందం' సినిమాను నిర్మించిన అల్లు అరవింద్ తోనే పరుశురాం మరో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు పరుశురాంకి అడ్వాన్స్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు నిర్మాతలు కూడా పరుశురాంపై ఇంట్రెస్ట్ చూపుతున్నారని తెలుస్తుంది. ఆఫర్స్ వస్తున్నాయి కదా అని తొందరపడి ఏ సినిమాను ఓకే చెయ్యట్లేదు ఈ డైరెక్టర్.అల్లు అర్జున్ లేదా మహేశ్ తో...తన వద్ద ప్రస్తుతం కొన్ని లైన్స్ మాత్రమే ఉన్నాయని.. అవి పూర్తి అవ్వాలంటే కొంత టైం పడుతుందని అందుకే తొందరపడి ఏ సినిమాను ఒప్పుకోట్లేదని చెబుతున్నాడు. తన వద్ద లైన్స్ కి అల్లు అర్జున్ లేదా మహేష్ సెట్ అవ్వుతారని చెబుతున్నాడు. వీరిద్దరూ త‌న‌కు దొర‌కాలంటే కాస్త టైమ్‌ ప‌డుతుంది. అందుకే.. క‌థ‌, స్క్రిప్టు విష‌యంలో తొంద‌రేం లేదు. కొంత కాలం విశ్రాంతి తీసుకుని తీరిగ్గా స్క్రిప్ట్ విషయం గురించి ఆలోచిస్తానని చెబుతున్నాడు పరుశురాం.
https://www.telugupost.com/movie-news/nandamuri-balakrishna-boyapati-movie-budget-after-ruler-disaster-143305/
బాలకృష కెరీర్ లో భారీ డిజాస్టర్స్ ఉన్నాయి, అలాగే భారీ హిట్స్ ఉన్నాయి. తాజాగా రూలర్ బాలయ్య భారీ డిజాస్టర్స్ పక్కన నిల్చుంది. రూలర్ సినిమాతో బాలకృష్ణ పరువు పోయింది. బాలయ్య బాబు కేక అంటూ భజన చేసే ఫ్యాన్స్ ని కూడా రూలర్ సినిమా అయోమయంలో పడేసింది. ఓ పరమవీర చక్ర,ఓ వీరభద్ర, మహారథి సినిమాల సరసన రూలర్ కూడా చేరింది. రూలర్ సినిమా ఎంత రొటీన్ గా ఉన్నప్పటికీ.. మాస్ కి ఎక్కేసి బిసి సెంటర్స్ లో ఆడేస్తుంది అనుకున్నాడు దర్శకుడు. అసలు బాలకృష్ణ ఈ కథని ఎలా యాక్సెప్ట్ చేసాడో అర్ధం కావడం లేదు. పూరి పైసా వసూల్ ఓ రకంగా మెరుగ్గా ఉంది రూలర్ చూస్తుంటే. మరి రూలర్ సినిమాతో బయ్యర్లుగోల పెట్టేస్తున్నారు. తాజాగా బోయపాటి సినిమాకి బాలకృష్ణ కోసం మిర్యాల రవీందర్ రెడ్డి 70 కోట్ల బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నాడు. మరి రూలర్ దెబ్బకి 70 కోట్లు కుదరదు… ఓ 50 పెట్టగలుగుతానని బోయపాటి కి నిర్మాత చెప్పినట్టుగా ఫిలింనగర్ టాక్. స్క్రిప్ట్ ఆ బడ్జెట్ కి తగ్గట్టుగా కుదించమని చెబుతున్నాడట. రూలర్ సినిమాకి పెట్టిన పెట్టుబడి కూడా దరిదాపుల్లోకి రావడం లేదు రూలర్ కలెక్షన్స్. అందుకే బోయపాటి – బాలయ్య సినిమాకి బడ్జెట్ కటింగ్ చేసే యోచనలో నిర్మాత ఉన్నట్టుగా టాక్.
https://www.telugupost.com/uncategorized/arjun-reddy-fame-shalini-pandey-not-getting-good-offers-127026/
అర్జున్ రెడ్డి సినిమా ట్రెండ్ సెట్టర్ అని అందరికి తెలిసిందే. ఈసినిమా కోసం పని చేసిన అందరిని మంచి అవకాశాలు రావడంతో కెరీర్ పరంగా ఒక స్టేజి కి వెళ్లిపోయారు. కానీ హీరోయిన్ షాలినీ పాండేకి అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాతో షాలినీ పాండేకి యూత్ లో విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఆమె క్రేజ్ దృశ్య ఆమెకు మొన్నటి వరకు అవకాశాలు వచ్చాయి కానీ అవి ఏమి ఆశించిన ఫలితాలు ఇవ్వడంలేదు. పైగా ఆమె ధోరణి కారణంగానే ప్రస్తుతం అవకాశాలు రావడంలేదని చెబుతున్నారు. ఆమె పాత్ర నడవిడి ఎక్కువగా ఉంటేనే సినిమాలను ఒకే చేస్తుందట. లేకపోతే మొహం మీదే నో చెప్పేస్తుంది. అంతే కాదు ఆ పాత్ర తగ్గట్టు ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వాల్సిందేనని అంటోందట. దాంతో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎవరు ఆమె వైపు చూడడంలేదు. అందుకే ఆమెకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి అంటున్నారు.
https://www.telugupost.com/movie-news/మోదీ-చర్యలకు-జై-కొడుతున్-14044/
బాలీవుడ్ లో యవ్వన దశలో తన ఉనికిని కాపాడుకోవటానికి తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొన్న కథానాయిక విద్య బాలన్ మధ్య వయస్కురాలిగా తనకు తగ్గ పాత్రలను పోషిస్తూ బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. ది డర్టీ పిక్చర్, పా, కహాని వంటి వాణిజ్య అంశాలకు దూరంగా వున్న కథలను ఏరి కోరి తీసుకుని తన నటనతో ప్రేక్షకులని అలరించటమే కాకుండా మిడ్ ఏజ్ లో ఎన్నో పురస్కారాలను దక్కించుకుంది విద్య బాలన్.అయితే కొంత కాలంగా మీడియా దృష్టికి దూరంగా ఉంటున్న విద్య బాలన్, ఎందరో సెలబ్రిటీ స్టేటస్ వున్న సినీ ప్రముఖులు స్పందించటానికి సంశయిస్తున్న పెద్ద నోట్ల రద్దు వ్యవహారం గురించి విలేకరులతో తన అభిప్రాయాన్ని ధైర్యంగా పంచుకుంది. బాలన్ భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి పూర్తి మద్దతుని తెలిపారు. ప్రస్తుతం సామాన్య ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు తాత్కాలికమని, అవి ఎదుర్కోక తప్పదు అని మరో ప్రత్యాన్మాయం కోసం ఆర్.బి.ఐ సవరణలు చేసినా చేయకపోయినా వచ్చే నెలలో పరిస్థితులు చక్కబడటం ఖాయం అని విద్య బాలన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
https://www.telugupost.com/movie-news/rrr-movie-intresting-update-113570/
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటిస్తున్న #RRR చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుతుంది. రీసెంట్ గా టీం రామ్ చరణ్ పై కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించింది. ఎపిసోడ్ మొత్తం రఫ్ ఎడిటింగ్ చేసి చూసిన టీం అవుట్ పుట్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తో తీసిన ఈ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి అని చెబుతున్నారు. త్వరలో సినిమా వివరాలు… ఇందులో చరణ్ ఫైట్స్ ప్రత్యేకంగా నిలుస్తాయట. ఇద్దరు స్టార్ హీరోస్ నటిస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. దాదాపు 200 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంఫై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్నికి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రెస్ మీట్ ఈ నెల 14న జరగనుంది.
https://www.telugupost.com/movie-news/సూపర్-స్కెచ్-వేసాడు-38644/
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మొదలు కథలనే నమ్మి సినిమాలు చేస్తున్న హీరో నారా రోహిత్. కథా బలం ఉన్న సినిమాల్లో నటిస్తున్న నారా రోహిత్ కి సినిమా ఫలితంతో పని లేకుండా కెరీర్ ని చక్కబెట్టుకుంటున్నాడు. కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలకు ఓటేసే నారా రోహిత్ చేతిలో ఇప్పుడు బోలెడన్ని సినిమాలున్నాయి. మొన్నటికి మొన్న పెరిగిన గెడ్డం, లుంగీతో రఫ్ లుక్ లో 'కథలో రాజకుమారి' అంటూ షాకిచ్చాడు. ఆ చిత్రంలో నారా రోహిత్ లుక్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చేసింది. అయితే తర్వాత వచ్చిన లుక్ లో రోహిత్ మంచి స్టైలిష్ గానే కనిపించాడు. ఇక ఇపుడు తాజాగా తన కొత్త సినిమా 'బాలకృష్ణుడు' తో మళ్ళీ ఇప్పుడొక షాక్ ఇచ్చాడు. అసలు ఈ పోస్టర్ లో సడన్ గా చూస్తే గనక మనకు నారా రోహిత్ కనబడడు. అంత కొత్తగా, ఆ లుక్ లో రోహిత్ చాలా డిఫ్రెంట్ గా కనిపిస్తున్నాడు మరి. ఇప్పటివరకు రోహిత్ నటించిన సినిమాల్లో రోహిత్ బాగా లావుగా, బొద్దుగా ఒక భీముడి మాదిరి కనిపించేవాడు. కానీ ఇపుడు బాగా వర్కౌట్స్ గట్రా చేసి చాలా స్లిమ్ అవడం... ఈ 'బాలకృష్ణుడు' పోస్టర్ లో బాగా సన్నగా కొత్తగా రోహిత్ లుక్ ఉంది. ఫుల్ గా బాడీని ఎక్సపోజ్ చేస్తూ రంగు రంగుల కలర్స్ తో రోహిత్ మాత్రం సిక్స్ ప్యాక్ బాడీతో భలే కనిపిస్తున్నాడు. కొత్త దర్శకుడు పవన్ మల్లెల డైరెక్షన్ లో తెరకెక్కే ఈ చిత్ర టైటిల్ కూడా బాగానే ఆకట్టుకునే లా కనిపిస్తుంది. ఎందుకంటే నందమూరి బాలకృషకి రోహిత్ రిలేటివ్ కాబట్టి బాలకృష్ణ పేరు మీద తన సినిమా టైటిల్ పెట్టుకోవడంతో నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ ని తన మీదకి తిప్పేసుకున్నాడు రోహిత్. మరి అభిమానం ఉంటె చాలదు టైటిల్ తో కూడా పడగొట్టొచ్చని రోహిత్ మాత్రం సూపర్ స్కెచ్ వేసాడంటున్నారు.
https://www.telugupost.com/movie-news/nani-upcoming-movie-2-119732/
‘జెర్సీ’ సినిమా సక్సెస్ తరువాత నాని ఫుల్ స్వింగ్ లో చేస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజి లో ఉంది. ఇప్పటికే ఈసినిమా కథ బయటకు వచ్చింది. ఇందులో నలుగురు మహిళలు, ఓ విలన్ వుంటారని, నాని రచయితగా నటిస్తున్నారని, ఆ మహిళల తరుపున వారికి న్యాయం చేయడానికి రంగంలోకి దిగుతాడని వినిపిస్తోంది. అయితే నిజానికి ఇది మహేష్ తో చేద్దాం అనుకున్న కథ అంట. అప్పటిలో విక్రమ్ మహేష్ తో ఓ సినిమా చేద్దాం అనుకున్నాడు కదా అది ఇదే అంట. దీన్ని అశ్వనీదత్ నిర్మిద్దాం అనుకున్నాడు. అందులో విలన్ పాత్ర ను చాలా హై రేంజ్ లో తయారుచేసారట. కానీ మహేష్ బాబు ఒప్పుకోలేదు. అందుకే ఇప్పుడు ఆ కథ నే నాని తో చేస్తున్నారు. అందుకోసమే అశ్వనీదత్ కు భారీగా కాంపన్ సేషన్ కూడా ఇచ్చారని టాక్. ఇప్పుడు ఆ విలన్ పాత్ర ను ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ చేస్తున్నాడు. సినిమా స్టార్టింగ్ లోనే నలుగురు మహిళల మర్డర్ ఎపిసోడ్ వుంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈసినిమా ను మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/ఇక్కడ-కూడా-కిర్రాక్-పార్-51189/
యువనటుడు నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ఖరారైంది. ఆ చిత్రమే ‘కిర్రాక్ పార్టీ’ . కన్నడలో విజయవంతమైన ‘కిరిక్ పార్టీ’ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్.. కృష్ణ అనే కాలేజీ కుర్రాడిగా కనిపించనున్నాడు. గత చిత్రం ‘కేశవ’తో రివెంజ్ డ్రామా కథని అందించిన నిఖిల్ ఈ చిత్రాన్ని యూత్ మాస్ ఎంటర్టైనర్ కథను అందిస్తున్నాడు. కన్నడ భామ సంయుక్త హెగ్డే , హిందీ భామ సిమ్రాన్ పరీనా ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ చిత్రం టైటిల్ , ఫస్ట్ లుక్ ను ఈరోజు శనివారం సాయంత్రం ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు కథానాయకుడు నిఖిల్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. శరన్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందించగా.. చందూ మొండేటి మాటలను అందించాడు.
https://www.telugupost.com/movie-news/రష్మీ-గౌతమ్-స్థానంలో-సన్-4313/
జాతీయ పురస్కార గ్రహీత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అడల్ట్ కామెడీ నేపధ్యంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు టాకీస్ ఆర్ధిక లాభాలు తెచ్చిన విషయం విదితమే. సినీ విశ్లేషకులు, విమర్శకులు మాత్రం చందమామ కథలు వంటి జాతీయ పురస్కారం పొందిన చిత్రం చేసిన యువ దర్శకుడి నుంచి ఆశించిన స్థాయి కథ కథనాలు ఏమి లేవు అని, కేవలం బూతు మాటలు, చేష్టలతోనే కథనాన్ని నడిపారు అని పెదవి విరిచారు. విమర్శకుల అభిప్రాయాలు ఎలా ఉన్నా ఇప్పుడు గుంటూరు టాకీస్ చిత్రానికి కొనసాగింపుగా గుంటూరు టాకీస్ 2 తెరకెక్కబోతుంది.గుంటూరు టాకీస్ చిత్రం లో బుల్లి తెర యాంకర్ రష్మీ గౌతమ్ పాత్రకి కథానుసారం ప్రాముఖ్యత లేనప్పటికీ ఆవిడ అందాల ఆరబోత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించటానికి ఉపయోగపడింది. ఆ చిత్ర నిర్మాత రాజ్ కుమార్ రష్మీ గౌతమ్ సినిమా కి ఎంత సహకరించినా ఆవిడ పరిధి తక్కువ అని భావించారో ఏమో, గుంటూరు టాకీస్ 2 చిత్రానికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సన్నీ లియోన్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. సన్నీ లియోన్ తో నటింపచేస్తే ఆ చిత్రానికి హిందీ మార్కెట్ కూడా బాగా దక్కుతుంది అనేది నిర్మాత ఆలోచన.గుంటూరు టాకీస్ మొదటి భాగం లో నటించిన సిద్దు స్థానంలో కూడా హిందీ తెలుగు మార్కెట్లకు దోహదపడే నటుడిని అన్వేషిస్తున్నట్టు సమాచారం. మొదటి భాగం నిర్మించిన రాజ్ కుమార్ ఈ కొనసాగింపు చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టనున్నారు.
https://www.telugupost.com/movie-news/బికినీలో-అందాల-లావ‌ణ్యం-54642/
అందాల రాక్ష‌సి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన లావ‌ణ్య త్రిపాఠికి 2017 పెద్ద‌గా క‌లిసి రాలేదు. ఈ సంవ‌త్స‌రంలో ఆమెకు హిట్ లేదు స‌రిక‌దా...యావ‌రేజ్ సినిమా కూడా లేదు. రామ్‌తో చేసిన ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ సినిమా బిలో యావ‌రేజ్. ఆ సినిమాతో లావ‌ణ్య కంటే అనుప‌మకే ఎక్కువ మార్కులు ప‌డ్డాయి. ఇక నాగ‌చైత‌న్య‌తో చేసిన యుద్ధం శ‌ర‌ణం అయితే ఘోర‌మైన డిజాస్ట‌ర్.కుర్ర హీరోయిన్లు అయిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కీర్తి సురేష్‌, అనూ ఎమ్మాన్యుయేల్‌, సాయి ప‌ల్ల‌వి లాంటి వారి నుంచి తీవ్ర‌మైన పోటీ ఉండ‌డంతో ఆమె మంచి ఛాన్సులు అందుకోవ‌డంలో కూడా వెన‌క‌ప‌డిపోతోంది. ఇలా అయితే లాభం లేద‌నుకుందో ఏమోగాని ఆమె గ్లామ‌ర్ డోస్ పెంచేసింది. అందాల ఆర‌బోత‌కు గేట్లు ఎత్తేసింది. తాజాగా హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న లావ‌ణ్య బికినీ స్టిల్ ఒక‌టి ఇచ్చిన దానిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంది.లావ‌ణ్య బికినీ స్టిల్ అంటే మ‌న కుర్రోళ్లు ఊరుకుంటారా ? దానిని ప‌దే ప‌దే షేర్లు చేస్తూ ప‌దే ప‌దే చూసి ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఆమె అందాల లావ‌ణ్య రాశి అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదుగా..! అయితే ఆ బికినీ స్టిల్‌లో ఆమె చిన్న ట్విస్ట్ ఇచ్చింది. ఆ ఫొటో వెన‌క నుంచి తీసింది. ఆమె బీచ్ ఒడ్డున కూర్చుని స‌ముద్రంలో ఉద‌యిస్తున్నట్టు ఉన్న సూర్యుడిని చూస్తూ ఉంది.ఆమె అందం బ్యాక్‌లెస్‌లో చూస్తూనే త‌నివితీర‌డం లేదు..ఇక ఫ్రంట్ నుంచి చూస్తే మైమ‌ర‌చి పోవాల్సిందే అని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవ‌ల సందీప్‌కిష‌న్‌తో ఆమె న‌టించిన కోలీవుడ్ మూవీ మాయావ‌న్ తెలుగులో ప్రొజెక్ట్ జ‌డ్ పేరుతో రిలీజ్ కావాల్సి ఉన్నా అనివార్య కార‌ణాల వ‌ల్ల రిలీజ్ కాలేదు. మ‌ళ్లీ తెలుగులో ఛాన్సులు ఒడిసి ప‌ట్టాల‌ని చూస్తోన్న లావ‌ణ్య‌కు ఆమె అందాల ఆర‌బోత ఎన్ని ఛాన్సులు తెస్తుందో ? చూడాలి.
https://www.telugupost.com/movie-news/nelaticket-ammamma-72277/
రవితేజ - కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేలటిక్కెట్టు సినిమాకి ఓవరాల్ గా ప్రేక్షకుల నుండి, క్రిటిక్స్ నుండి ఫెయిల్ మార్కులే పడ్డాయి. నేలటిక్కెట్టు టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా చౌకబారుగా ఉందని.. కళ్యాణ్ కృష్ణ ఇలాంటి కంటెంట్ తో ఎలా నేలటిక్కెట్టుని తెరకెక్కించాడని.. అలాగే రవితేజ పెరఫార్మెన్స్ బావున్నప్పటికీ.. కేరెక్టరైజేషన్ అస్సలు బాగోలేదని విమర్శలొస్తున్నాయి. అలాగే రవితేజ పక్కన హీరోయిన్ మాళవిక అస్సలు సూట్ కాలేదని, మ్యూజిక్ సినిమాకే అతి పెద్ద మైనస్ అని ఇలా అనేక రకాల మైనస్ పాయింట్స్ తో నేలటిక్కెట్టు సినిమాకి ప్లాప్ టాక్ వచ్చేసింది. ఇక నేలటిక్కెట్టు కోసం దర్శకుడు, హీరో రవితేజ, హీరోయిన్ మాళవికలు తమ శక్తిమేర పబ్లిసిటీ చేశారు. గత వారం రోజులుగా నేలటిక్కెట్టు ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు అంటూ తెగ హడావిడి చేశారు.పబ్లిసిటీ లేకపోయినా...అయితే నేలటిక్కెట్టుకి పోటీగా నిన్ననే ఏ మాత్రం అంచనాలు, పబ్లిసిటీ లేకుండా సైలెంట్ గా థియేటర్స్ లోకి దిగిన నాగ శౌర్య అమ్మగారిల్లు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఓయ్ హీరోయిన్ షాలిని హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా అందరిని ఆకట్టుకునేలా ఉందని... నాగ సౌర్య సెటిల్డ్ పెరఫార్మెన్స్ తో పాటుగా షాలిని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని. అంటున్నారు. అలాగే ఈ సినిమాకి పట్టుకొమ్మ లాంటి నటనతో రావు రమేష్ ఆకట్టుకున్నాడని, ఇంకా సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకులకు బాగా చేరుతుందని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగా ఆకట్టుకునే ఉంటుందని ప్రశంసలొస్తున్నాయి. అలాగే సినిమాలోని డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. మరి ఈ సినిమాకి మాంచి పబ్లిసిటీ ఉన్నట్లయితే ఇంకా మంచి హిట్ అయ్యేదని.. కేవలం పబ్లిసిటీ లేకపోవడం సినిమాకి అతి పెద్ద మైనస్ అన్నట్లుగా చెబుతున్నారు.ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న నాగశౌర్య..ఏది ఏమైనా పబ్లిసిటి లేకపోతేనేమి అమ్మగారిల్లు నేలటిక్కెట్టు సినిమాని అందులో ఉన్న డైలాగ్ వలే నేల నాకించెయ్యడం ఖాయమంటున్నారు. అమ్మగారిల్లుకి నేలటిక్కెట్టు సినిమాకి చాలా డిఫ్రెన్సెస్ ఉన్నాయని.. నేల టిక్కెట్టు మాస్ ని టార్గెట్ చేస్తే... అమ్మగారిల్లు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చెయ్యడం వల్లనే హిట్ అయ్యిందని.. ఈ రకంగా రవితేజ మీద నాగ శౌర్య పై చెయ్యి సాధించాడంటున్నారు.
https://www.telugupost.com/top-stories/this-time-chandrababus-visit-to-delhi-is-going-to-be-crucial-there-are-no-chances-of-many-political-changes-taking-place-1432178
చంద్రబాబు ఢిల్లీ పయనమయి వెళ్లారు. చంద్రబాబుకు ఢిల్లీలో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సారి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కీలకంగా మారబోతుందంటున్నారు. రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన ప్రసంగాలు చప్పగా ఉన్నా, వ్యూహాలు మాత్రం రచించడంలో ఆయనకు ఆయనే సాటి.గత ఎన్నికలకు ముందు...అయితే గత కొన్నాళ్లుగా ఆయన వ్యూహాలు కూడా వర్క్ అవుట్ కావడం లేదు. కాలం చెల్లిన నిర్ణయాలు, గతంలో చేసిన తప్పిదాలు పార్టీకి పెద్దగా ఉపయోగపడటం లేదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు వ్యూహం ఫలించలేదు. బీజేపీపై వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందని భావించారే తప్ప, రాష్ట్రంలో తనపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకునే ప్రయత్నం చేయలేదు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం వస్తుందని అంచనా వేశారు. కాంగ్రెస్ తో చేతులు కూడా కలిపారు. బీజేపీతో కయ్యానికి కాలు దువ్వుడంతో అన్ని కలసి పార్టీ పూర్తిగా పడకేయడానికి కారణాలుగా మారాయని చెప్పాలి.పునరాలోచన...అయితే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. కేంద్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావించిన చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలపై ఆయన చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఆయనను దరి చేరనివ్వకుండా అడ్డుకుంటున్నాయి. బీజేపీకి కూడా ఇప్పుడు ఏపీలో కొన్ని సీట్లను సాధించడం అవసరమని చంద్రబాబు అంచనా. టీడీపీతో కలసి పోటీ చేసిన ప్రతిసారీ ఎంపీ స్థానాలను కమలనాధులను కైవసం చేసుకోవడాన్ని గుర్తు చేస్తున్నారు.ఢిల్లీ పర్యటనలో...రాజధానిగా అమరావతిని కొనసాగించాలని టీడీపీ తొలి నుంచి డిమాండ్ చేస్తుంది. ఇప్పడు రాష్ట్ర బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తుంది. పాదయాత్ర కూడా చేస్తుంది. కొంత రెండు పార్టీల మధ్య రాష్ట్ర స్థాయిలో అవగాహన వచ్చినట్లేనని అంటున్నారు. అయితే జాతీయ స్థాయిలో నేతల ఆలోచన ఎలా ఉందో తెలియడం కష్టంగా మారింది. అందుకోసం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉపయోగపడుతుందంటున్నారు. మోదీ, అమిత్ షాలను కలిసే అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఆజాదీ కా అమృత్ ఉత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళుతున్నారు. ఈ సందర్భంగా వారిరువురిని కలవాలని ఆశిస్తున్నారు. వారిని కలిస్తే మాత్రం రాష్ట్రంలో ఈ రెండు పార్టీల కలయిక ఈజీ అవుతుందని రాష్ట్ర టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే జగన్ ను కాదని చంద్రబాబును తిరిగి తమ భుజాలపైకి ఎక్కించుకునేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఇష్టపడుతుందా? లేదా? అన్నది ఆసక్తికరమైన విషయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
https://www.telugupost.com/crime/man-takes-help-from-internet-to-kill-wife-gets-her-insured-to-claim-money-1432410
అప్పటికే చాలా అప్పులు చేసేశాడు.. ఆ అప్పులు తీర్చాలంటే ఏమి చేయాలా అని అనుకునే సమయంలో భార్యను అంతమొందించి.. ఆమె ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవాలని అనుకున్నాడు. అందులో భాగంగా ఆమెను కాల్చేశాడు సదరు వ్యక్తి.. కానీ పోలీసుల విచారణలో ఇదంతా భర్త ప్లాన్ అని గుర్తించారు.మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్నెట్‌లో వీడియోలు చూసి తన అప్పులు తీర్చడానికి భార్యను కాల్చి చంపాడు ఓ వ్యక్తి. నిందితుడైన భర్త బద్రీప్రసాద్ మీనాను అరెస్టు చేశారు. హత్య ప్లాన్ ను అమలు చేసేందుకు నిందితులు ఇంటర్నెట్ సాయం తీసుకున్నారు. తన అప్పులు తీర్చడానికి ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ఇంటర్నెట్‌లో అనేక వీడియోలను చూశాడు. కొన్ని వీడియోలు చూసిన తర్వాత, అతను మొదట తన భార్యకు బీమా చేయించాడు. బీమా డబ్బు కోసం ఆమెను చంపాడు.జూలై 26న రాత్రి 9 గంటల ప్రాంతంలో భోపాల్ రోడ్డులోని మన జోడ్ సమీపంలో భార్య పూజపై భర్త కాల్పులు జరిపాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. భర్త మొదట పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. కానీ విషయం నిశితంగా విచారించగా ఎట్టకేలకు పట్టుబడ్డాడు. భార్యను హత్య అనంతరం నిందితుడు తన భార్యను హత్య చేసినందుకు నలుగురు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాడు. హత్య జరిగిన సమయంలో ఆ నలుగురు వ్యక్తులు నేరస్థలంలో లేరని దర్యాప్తులో తేలింది. పోలీసులు బద్రీప్రసాద్ మీనాను అతని సహచరులలో ఒకరిని అరెస్టు చేశారు. అతని ఇద్దరు సహచరులు ఇంకా పరారీలో ఉన్నారు. నిందితుడిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
https://www.telugupost.com/movie-news/నాచురల్-స్టార్-ధైర్యానిక-57132/
సంక్రాంతి పండుగ సందర్భముగా వచ్చిన చిత్రాల ఫలితాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసినదే. అయితే బహిరంగంగా వీటి పై మాట్లాడటానికి ఎవరూ ముందుకి రారు. ముఖ్యం సినిమా పరిశ్రమకి చెందిన సెలబ్రిటీస్ ఒక చిత్ర విజయానికి అభినందనలు తెలపటానికి ముందు వుంటారు తప్పితే పరాజయం పొందిన చిత్రం పై అనవసర కామెంట్స్ చెయ్యరు. అజ్ఞ్యాతవాసి డిసాస్టర్ కావటంతో గ్యాంగ్, జై సింహ లు మోస్తరు ఫలితాన్ని అందుకుని యావరేజ్ చిత్రాలుగా నిలిచాయి. పోటీ వాతావరణం భావించిన హీరో అభిమానులు మాత్రం 2018 తొలి హిట్ అంటూ జై సింహ ని ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఇంకా బ్రేక్ ఈవెన్ కాని ఈ చిత్రం ఓవర్ ఆల్ థియేట్రికల్ రైట్స్ పరిగణిస్తే మాత్రం హిట్ అనే చెప్పాలి.భాగమతి ప్రీ రిలీజ్ వేడుకకి అతిధిగా హాజరైన నాచురల్ స్టార్ నాని సంక్రాంతి పండుగకి వచ్చిన చిత్రాలలో హిట్ చిత్రమేది లేదని సూచన ప్రాయంగా చెప్పటం విశేషం. 2018 తొలి సాలిడ్ హిట్ ని భాగమతి ద్వారా స్వీటీ (అనుష్క) ఇస్తుందని తాను నమ్ముతున్నట్టు వేదికపై చెప్పాడు నాని. బాల కృష్ణ వంటి అగ్ర హీరోల చిత్ర ఫలితంపై ప్రభావం చూపే ఇలాంటి పరోక్ష వ్యాఖ్య చేయటానికైనా సినిమా పరిశ్రమ వ్యక్తులకి చాలా ధైర్యం ఉండాలి. కానీ వాస్తవం ఏంటో అందరికి తెలుసు కాబట్టి నాని తాను అనుకున్నదే స్పష్టంగా భాగమతి ప్రీ రిలీజ్ వేదికపై నుంచి తెలియజేశాడు. 2018 కి నిజమైన తొలి సాలిడ్ హిట్ భాగమతి అవుతుంది అన్న నాని మాటలు నిజమవుతాయో లేదో చూడాలి.
https://www.telugupost.com/movie-news/mahesh-differences-with-directors-120160/
మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాతో తన 25 వ చిత్రాన్ని పూర్తి చేసుకున్నాడు. మహేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.. డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. అయితే తన 25వ చిత్రం మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ తనతో పనిచేసి తనకు హిట్స్ ఇచ్చిన, ఫ్లాప్స్ ఇచ్చిన దర్శకుల గురించి చాలా గొప్పగా మాట్లాడాడు కానీ కొంతమంది దర్శకుల గురించి మాట్లాడలేదు. మర్చిపోయాడో లేదా కావాలనే చేసాడో కానీ తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఒక దర్శకుడి గురించి ఆ వేడుకలో చెప్పలేదు. అలాగే మరొక డైరెక్టర్ మీద ఇండైరెక్ట్ గా సెటైరికల్ డైలాగ్ వేసాడు. పూరినే మర్చిపోతాడా..? మరి ఇదంతా చూస్తుంటే మహేష్ మనసులో ఏదో పెట్టుకునే ఇలా చేశాడా? అనే డౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రైజ్ అయ్యింది. మహేష్ కి మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పూరి జగన్నాధ్ ని మహేష్ మరిచాడు. పోకిరి లాంటి హిట్ ఇచ్చిన పూరిని మహేష్ మరవడం మాత్రం కాస్త ఆశ్చర్యమే. బిజినెస్ మ్యాన్ ద్వారా కూడా మహేష్ కి హిట్ ఇచ్చిన పూరీని మహర్షి ఈవెంట్ లో కనీసం తలవకపోవడం అనేది ఆలోచించాల్సిందే. మరి వీరి కాంబోలో మూడో మూవీగా జనగణమన తెరకెక్కాల్సి ఉంది. కానీ పూరి చెప్పిన కథకు మహేష్ కనెక్ట్ కాకపోవడంతో మహేష్ పూరిని లైట్ తీసుకున్నాడు. ఇక పూరి కూడా మహేష్ తోనే జనగణమన తీస్తానని పట్టుబట్టుకుని కూర్చుకున్నాడు. సుకుమార్ కు కౌంటర్..? ఇక తాజాగా రంగస్థలం హిట్ దర్శకుడు సుకుమార్ కి మహేష్ హ్యాండ్ ఇచ్చాడు. మహేష్ తో సినిమా కోసం ఏడాది వెయిట్ చేసిన సుకుమార్ ని కూడా మహేష్ పక్కన పెట్టేసాడు. మహర్షి ఈవెంట్ లో సుకుమార్ పై కూడా మహేష్ ఇండైరెక్ట్ గా ‘‘ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ దగ్గరయినా కథ ఉంటే ఒక రెండు నెలలు ఆలస్యమైతే చాలు.. వేరే హీరోల దగ్గరకు వెళ్లిపోతారు. కానీ అలా కాకుండా నా కోసం రెండేళ్లు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ వంశీ.’’ అని చెప్పాడు. నిజానికి వంశీ రెండేళ్లు కాదు.. మూడేళ్లు వెయిట్ చేశాడు.. అంటూ సుకుమార్ కి పంచ్ వేస్తూ వంశీ పైడిపల్లిని మహేష్ పొగిడేసాడు. మరి మహేష్ కి సుకుమార్, పూరీ అంటే కోపమా.. అందుకే అలా ఆ ఈవెంట్ లో మాట్లాడాడు అంటూ సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వస్తున్నాయి.
https://www.telugupost.com/movie-news/బాహుబలి-రికార్డులను-కొట్-34041/
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ 'రోబో 2.0 ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రజిని కి జోడిగా అమీ జాక్సన్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించనున్న ఈ చిత్రాన్ని 450 కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తామని 'రోబో 2.0 ' మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. రోబో 2.0 ని ఏడువేల థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనగా చెబుతున్నారు.అత్యాధునిక వీఎఫ్ఎక్స్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీ తీస్తున్నారని, 'బాహుబలి-2' రికార్డును అధిగమించేలా ఉండాలని రోబో టీమ్ భావిస్తోందట. మరి 'బాహుబలి' చిత్రం ఇండియాలో 6000 థియేటర్స్ కి పైగా విడుదలై సంచలనాలు సృష్టించింది. ఇక ఇప్పుడు 'రోబో 2.0 ' కూడా ఇండియా మొత్తంలో 7000 థియేటర్స్లో విడుదలై బాహుబలి రికార్డులను కొట్టెయ్యడానికి తహతహ లాడుతుంది. చూద్దాం వచ్చే జనవరిలో 'బాహుబలి' రికార్డులను 'రోబో 2.0 ' ఎంతవరకు తుడిచేస్తుందో వెయిట్ అండ్ సి.
https://www.telugupost.com/movie-review/vijay-devarakonda-liger-movie-original-review-1435474
తారాగణం: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, ఆలి, గెటప్ శీను, మైక్ టైసన్ తదితరులుకెమెరా: విష్ణు శర్మఎడిటింగ్: జునైద్ సిద్దికిసంగీతం (బ్యాక్ గ్రౌండ్): సునీల్ కాశ్యప్నిర్మాతలు: కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మిదర్శకత్వం: పూరి జగన్నాథ్విడుదల తేదీ: 25 ఆగస్టు 2022ఎప్పటి నుండో ఎదురుచూసిన విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన లైగర్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియన్ చిత్రం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథతో రూపొందింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లైగర్‌ సినిమా విడుదలైంది. ధర్మ ప్రొడక్షన్స్-పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించాయి. కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్, రిలీజ్ చాలా ఆలస్యమైంది. ఇందులో మైక్ టైసన్, రమ్య కృష్ణన్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈరోజు విడుదలైన సినిమా మూవీ లవర్స్ ను మెప్పించిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.సినిమా కథ:కరీంనగర్‌కు చెందిన బాలమణి (రమ్యకృష్ణ) తన కొడుకు లైగర్‌ (విజయ్ దేవరకొండ)ను మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఛాంపియన్ చేయాలనుకొంటుంది. అందుకోసమే ముంబైకు వస్తుంది. ఈ క్రమంలో ముంబైలోని మార్షల్ ఆర్ట్స్ కోచ్‌ (రోనిత్ రాయ్) వద్ద లైగర్‌ను చేర్పిస్తుంది. గొడవ లైగర్‌ను మొదటి చూపులోనే తానియా (అనన్య పాండే) ప్రేమిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల లైగర్‌ ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. ఈ బ్రేకప్ లైగర్ పై ఎలాంటి ప్రభావం చూపించింది.. అమ్మ కోరిక మేరకు లైగర్ గొప్ప ఎంఎంఏ ఛాంపియన్ అయ్యాడా లేదా అనేది సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది.నటీ నటులు:విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీకి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది.. కానీ ఈ సినిమాలో హీరోకు నత్తి ఉన్నట్లు చూపించడం వలన డైలాగ్స్ లేకుండా పోయాయి. యాక్టింగ్ పరంగా విజయ్ దేవరకొండ చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక సినిమాకు ప్లస్ అవుతుందన్న రమ్య కృష్ణ.. కొన్ని సీన్లలో మైనస్ గా కనిపించింది. హీరోయిన్ అనన్య పాండే కూడా నెగటివ్ అనే చెప్పుకోవచ్చు. ఇక మొదటి సారి ఒక ఇండియన్ సినిమాలో మైక్ టైసన్ నటిస్తూ ఉన్నాడంటే ఒక రేంజి బిల్డప్ ఉంటుంది. హైప్ కు తగ్గట్టుగా మ్యాచ్ అచ్చే సీన్స్ తో పూరీ వస్తాడని అనుకున్నారు. కానీ కామెడీ చేయించేశాడు. ఇక అలీ కామెడీ కూడా సినిమాకు పెద్దగా ప్లస్ అవ్వలేదు. మిగిలిన వాళ్లు.. అందుకు తగ్గట్టుగా తమ పని కానిచ్చేసి వెళ్లిపోయారు.మిగిలినవి:కెమెరా పని తనం చాలా బాగుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని కొన్ని సందర్భాల్లో బాగున్నా.. మిగిలిన చోట్ల తేలిపోయింది. ఫైట్ సీన్స్ ను చాలా బాగా కంపోజ్ చేశారు. ఎంతో సాదా కథతో పూరీ ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడని ఎవరూ అనుకోలేదు. ఫైటింగ్ బేస్డ్ సినిమా అంటే క్లైమాక్స్ లో ఒక టోర్నమెంట్ ను హీరో గెలుస్తాడనే విషయం ఎవరికైనా తెలిసిందే..! అందుకు భిన్నంగా ఈ సినిమా క్లైమాక్స్ ను కంపోజ్ చేసినప్పటికీ ప్రేక్షకులకు ఎక్కడం కష్టమే..! ఇక ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్ లో సాగే సమయంలో కనీసం కింద తెలుగు సబ్ టైటిల్స్ కూడా వేయలేదు. మైక్ టైసన్ మీద పెట్టుకున్న అంచనాలు తేలిపోయాయి. ఒకప్పుడు మైక్ టైసన్ తన మ్యాచ్ లో ప్రత్యర్థి చెవి కొరుకుతాడు.. ఈ సినిమాలో హీరో మైక్ టైసన్ చెవిని కొరుకుతాడు.. ఒకప్పుడు మైక్ టైసన్ చేసిన ఈ పని గురించి తెలిసిన వాళ్లకు మాత్రమే క్లైమాక్స్ లో వచ్చే సీన్ విలువ తెలుస్తుంది. అలా చాలా విషయాల్లో తెలుగు ఆడియన్స్ ను మరచిపోయి పాన్ ఇండియా సినిమా తీసేసినట్లు అనిపిస్తుంది.ఫైనల్ గా.. 'తెలుగోళ్లని మరచిపోయి సినిమా తీశాడా పూరీ' అని అనిపించకమానదు.
https://www.telugupost.com/movie-news/చైతు-కి-ఈగోనా-54041/
నాగ చైతన్య ప్రస్తుతం ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు. అయితే నాగ చైతన్య కి ఈ ఏడాది శుభమే జరిగింది. కోరుకున్న అమ్మాయితో పెళ్లి... రారండోయ్ వేడుక చూద్దాం అంటూ ఒక హిట్ ని అలాగే యుద్ధం శరణం అంటూ ఒక ఫ్లాప్ ని తన ఖాతా లో వేసుకున్నాడు నాగ చైతన్య. అయితే ఈ రెండు సినిమాల తరువాత సమంతా ని పెళ్లి చేసుకున్న నాగ చైతన్య.... చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచితో పాటే... మారుతీ దర్శకత్వంలో మరో సినిమా ని ఓకే చేసాడు. చందు దర్శకత్వంలో సవ్యసాచి షూటింగ్ తోపాటు... మారుతీ దర్శకత్వంలోని సినిమాని కూడా నాగ చైతన్య ఒకేసారి పూర్తి చేయాలనుకుంటున్నాడు.మారుతీ - నాగ చైతన్య సినిమా తాజాగా పూజ కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమా లో చైతు సరసన అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా లో నాగ చైతన్య ఫుల్ ఇగో ఉండే వ్యక్తిగా నటించబోతున్నాడు అని తెలుస్తుంది. మరి నాగ చైతన్య ఇంతకూ ముందు 100 % లో కూడా కాస్త ఈగో ఉన్న వ్యక్తిగా నటించి మెప్పించాడు. మరి ఇప్పుడు మారుతి దర్శకత్వంలో నటించి మెప్పించడానికి సన్నద్ధమై వున్నాడు.ఇకపోతే మారుతీ - నాగ చైతన్య కలయికలో వస్తున్నా ఈ సినిమాకి శైలజ రెడ్డి అల్లుడు అనే టైటిల్ రిజిస్టర్ చేసారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ని సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో పాటే.. చందు సవ్యసాచి... తో నాగ చైతన్య వచ్చే ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే సందడి చేస్తాడు అనిపిస్తుంది.
https://www.telugupost.com/crime/two-buses-collided-in-srikakulam-district-killing-one-and-injuring-twenty-others-1515220
శ్రీకాకుళం జిల్లాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించగడా ఇరవై మందికి గాయాలయ్యాయి. సంక్రాంతి పండగ రోజు ఈ విషాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ నుంచి రామేశ్శరం వెళుతున్న బస్సు శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద మరో బస్సు ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ప్రయాణికులందరూ భయపడి ఆందోళనకు గురయ్యారు.పొగ మంచుకారణంగానే...అయితే ఈ ప్రమాదంలో ఇరవై మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పలాస ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పొగమంచు కారణంగానే రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించారు.
https://www.telugupost.com/crime/5-years-old-baby-died-after-drinks-pesticide-as-like-cool-drink-1439504
ముక్కుపచ్చలారని ఓ చిన్నారి కూల్ డ్రింక్ అనుకుని పురుగులమందు తాగి కన్నుమూసింది. ఈ ఘటన తెలంగాణలోని కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం భీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. భీంపూర్ కు చెందిన రాజేష్ - లావణ్య దంపతులకు ఐదేళ్ల కూతురు శాన్వి ఉంది. ఆ చిన్నారి స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. ఇంటి వెనుకనున్న పెద్దనాన్న ఇంటివద్ద ఆడుకుంటున్న శాన్వికి ఓ కూల్ డ్రింక్ బాటిల్ కనిపించింది. కానీ అందులో ఉన్నది కూల్ డ్రింక్ కాదు.ఆ బాటిల్ లో ఉన్న ద్రవాన్ని శాన్వి తాగేసింది. కొద్దిసేపటికి వాంతులు చేసుకుంటూ ఇంటికి వెళ్లగా.. పురుగులమందు రావడం గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన కాగజ్ నగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందడంతో.. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. కాగా.. పొలానికి పిచికారి చేయగా మిగిలిన పురుగుల మందును కూల్ డ్రింక్ సీసాలో ఉంచారు. దానినే శాన్వి తాగి కన్నుమూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/sarkaru-shooting-postponed-174723/
మహేష్ బాబు – పరశురామ్ కాంబోలో తెరకెక్కనున్న సర్కారు వారి పాటని పరశురామ్ పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టాడు. అయితే ముందు నుండి దర్శకుడు సర్కారు వారి పాట షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ అమెరికా పరిసర ప్రాంతాల్లో జరాపాలనే యోచనలో ముందుగా అమెరికా షెడ్యూ ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. కానీ చిత్ర బృందానికి వీసా ప్రోబ్లెంస్ తో ఒకసారి అమెరికా షెడ్యూల్ వాయిదా పడింది. మహేష్ ఈ మధ్యలో దుబాయ్ కి ఫ్యామిలీ ట్రిప్ వేసుకున్నాడు. ఇక పూజ కార్యక్రమాలు ముందుగానే ఫినిష అయినా మహేష్ – పరశురామ్ లు జనవరి ఫస్ట్ వీక్ నుండే సర్కారు వారి పాటని పట్టాలెక్కించబోతున్నారు. అయితే డిసెంబర్ నెలాఖరున చిత్ర బృందం మొత్తం అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే మహేష్ సర్కారు వారి పాట అమెరికా షెడ్యూల్ మరోసారి వాయిదా పడినట్లుగా టాక్. మధ్యలో కరోనా వచ్చి ఒక్కసారిగా ప్లాన్ చేంజ్ చెయ్యగా… ఇప్పుడు మరోసారి సర్కారు వారి పాట షెడ్యూల్ లో మార్పులు జరుగుతున్నాయని సమాచారం. సర్కారు వారి విషయంలో చిత్ర యూనిట్ మరోసారి మార్పులు చేయక తప్పడం లేదు. అమెరికా షెడ్యూల్ ని పోస్ట్ పోన్ చేసుకుని ముందుగా ఇక్కడ హైద్రాబాద్ లోనే సర్కారు వారి పాట షూట్ ప్లాన్ చేసుకున్నాడట. ఇక్కడ హైదరాబాద్ లోనే సర్కారు వారి పాట కోసం పరశురామ్ అనుకున్న సెట్స్ లో షూటింగ్ మొదలు పెట్టి.. తర్వాత అక్కడ అమెరికాలో పరిస్థితులు అనుకూలించాక అక్కడి షెడ్యూల్ చేసుకోవచ్చని డిసైడ్ అయ్యాడట. అమెరికా లో సెకండ్ వెవ్ మొదలు కావడంతో చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుననట్టుగా తెలుస్తుంది.